పులివెందులలో టీడీపీ నేతల సవాల్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రతి సవాల్ విసిరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధిని నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. ఎప్పుడు ఏ సెంటర్లో చర్చకు రావాలో చెప్పాలని వైఎస్ అవినాష్ రెడ్డి సూచించారు. చేసింది చెప్పే దమ్ము తమకు ఉందని ఆయన అన్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి గురువారమిక్కడ మాట్లాడుతూ... వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగిస్తున్న టీడీపీ ప్రభుత్వం సవాల్ విసరడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు వైఎస్ఆర్ చలవేనని అన్నారు.
టీడీపీ నేతలకు వైఎస్ అవినాష్రెడ్డి ప్రతి సవాల్
Published Thu, Mar 1 2018 5:51 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement