దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ చిత్ర యూనిట్ను వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ అభినందించారు. ఈ చిత్రాన్ని తిలకించిన అనంతరం ఆమె సోమవారమిక్కడ మాట్లాడుతూ... యాత్ర సినిమాను చాలా బాగా తీశారు. కోట్లాది హృదయాంతరాల్లో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకాలను ’యాత్ర’ ద్వారా దర్శక, నిర్మాతలు తట్టిలేపారు.