ys vijayamma
-
కుటుంబంతో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్ (ఫొటోలు)
-
విజయమ్మ కారు ప్రమాదం వార్తలపై జగన్ కౌంటర్
-
అలాగైతే రాధాకృష్ణ, లోకేష్లను జైల్లో పెట్టాలి: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: టీడీపీ అధికారిక వెబ్సైట్లో చేసేవన్నీ ఫేక్ పోస్టులేనని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో ప్రస్తావించారు. తల్లిని చంపడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడని టీడీపీ అధికారిక వెబ్ సైట్లో ఓ పోస్ట్ చేశారు. దానికి కారు టైర్ పేలిన పాత కథనం ఒకటి జత చేశారు. స్వయంగా విజయమ్మే ఇది ఫేక్ న్యూస్ అని లేఖ ఇచ్చారు. కానీ, ఆ లేఖ కూడా ఫేక్ అని ప్రచారం చేశారు. చివరకు.. అదంతా అబద్ధమని విజయమ్మ టీవీ ముందుకు వచ్చి చెప్పుకోవాల్సి వచ్చింది. ఇదంతా టీడీపీ అధికారిక వెబ్సైట్లోనే జరిగింది. మరి నారా లోకేష్ను ఎందుకు అరెస్టు చేయలేదు?. ఇంతకుమించి దిగజారిపోయి.. దారుణంగా వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. నా భార్య(వైఎస్ భారతి) కడప పోలీస్ అధికారితో ఫోన్లో మాట్లాడిందని ఆంధ్రజ్యోతిలో ఓ కథనం ఇచ్చింది. అది ఫేక్ కథనం. అలాంటప్పుడు రాధాకృష్ణను జైల్లో పెడతారా?. ఎల్లో మీడియా అలానే ఉంది.. సోషల్ మీడియా అలానే ఉంది అని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. -
ప్రజల దృష్టిని మళ్లించేందుకే బాబు కుట్రలు
నెల్లూరు(బారకాసు)/ఒంగోలు సిటీ/ప్రొద్దుటూరు: ‘దుష్ప్రచారం, డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబుకు రెండు కళ్లు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అయినా సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమయ్యారు. అందువల్లే వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నిత్యం బురదచల్లుతూ తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలని కుట్రలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే విజయమ్మ కారుకు ప్రమాదం.. అంటూ కొత్త నాటకానికి తెరతీశారు.రెండేళ్ల క్రితం విజయమ్మ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైతే, టీడీపీ సోషల్ మీడియాలో ఇప్పుడు దు్రష్పచారం చేయడం సిగ్గుచేటు’ అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్బాబు, రాచమల్లు శివప్రసాద్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. వివిధ ప్రాంతాల్లో వారు శనివారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, కుట్రలను ఎండగట్టారు. మేం మాట్లాడితే తట్టుకోలేరు: కాకాణి రాష్ట్రంలో 1.47 కోట్ల రేషన్ కార్డులు ఉంటే వాటిలో 50లక్షల మందికి మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వకుండా మొండిచేయి చూపుతున్నారని వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి చెప్పారు. ‘మా పార్టీ అధినేత వైఎస్ జగన్, ఆయన కుటుంబ వ్యవహారాలపై కొందరు పిచి్చపిచ్చి విమర్శలు చేస్తున్నారు. మేం కూడా అదేవిధంగా మాట్లాడితే తట్టుకోలేరు. ఎనీ్టఆర్ ఎవరి వల్ల చనిపోయారు? ఆయన స్థాపించిన పారీ్టని ఎలా చేజిక్కించుకున్నారనే ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?’ అని ప్రశ్నించారు. ‘ఇసుక, మద్యం మాఫియాలో మీ ఎమ్మెల్యేలు ఏయే ఘోరాలు చేస్తున్నారో తెలుసుకుని వారిని తొక్కిపెట్టి నార తీయండి. హామీలు అమలుచేయని చంద్రబాబు, లోకేశ్ను తొక్కి పెట్టి నార తీయాలి.’ అని పవన్కళ్యాణ్కు కాకాణి సూచించారు. హామీల అమలుపై ప్రజలు ప్రశ్నిస్తారనే: టీజేఆర్ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి ప్రజలకు ఆశలు కల్పించిన చంద్రబాబు ఎప్పటిలాగే మళ్లీ వమ్ము చేశారని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ ముగిసిందని, హామీల అమలుపై ప్రజలు ఇక ప్రశ్నిస్తారని పేర్కొన్నారు. అందువల్లే ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైఎస్ జగన్ కుటుంబ వ్యవహారాలను తెరపైకి తెచ్చి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.‘దేశంలో అనేక రాజకీయ కుటుంబాల్లో విభేదాలు ఉన్నాయి. చంద్రబాబుకు గతంలో హరికృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరితో విబేధాలు లేవా? తమ్ముడు రామ్మూర్తినాయుడుతోపాటు అనేక మంది కుటుంబ సభ్యులతో గొడవలు లేవా? హెరిటేజ్లో చంద్రబాబు తన తమ్ముడు, చెల్లెళ్లకు వాటాలు పంచారా?’ అని ఆయన నిలదీశారు. ‘కూటమి అధికారంలోకి వచి్చన నాలుగు నెలల్లోనే 77మంది మహిళలు మాయమైపోయారని వారి రక్షణ సంగతి చూడండి..’ అని పవన్కళ్యాణ్కు హితవుపలికారు. తన కుటుంబంలో జరిగిన ఘటనలను కూడా పవన్ గుర్తుచేసుకోవాలని సూచించారు. అవన్నీ కుట్రలేనా బాబూ?: రాచమల్లు వైఎస్ విజయమ్మ కారు ప్రమాదంపై తప్పుడు ప్రచారాలు, కథనాలను ఆపాలని టీడీపీ శ్రేణులను మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి హెచ్చరించారు. ‘హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడం, జూనియర్ ఎనీ్టఆర్ కారు రోడ్డు ప్రమాదానికి గురికావడం, చంద్రబాబు ఇంట్లో మహిళ ఆత్మహత్య, బాలకృష్ణ ఇంట్లో హత్యాయత్నం, సెక్యూరిటీ గార్డు అనుమానాస్పద మృతి.. ఇవన్నీ కుట్రలేనా’ అని రాచమల్లు సూటిగా ప్రశ్నించారు. వాటన్నింటికి తాము లింక్ పెట్టి రాస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలని చంద్రబాబును హెచ్చరించారు. -
వైఎస్ విజయమ్మ వాస్తవాలు చూడలేని స్థితిలో ఉన్నారా?
మహా భారతం గాథలో ధృతరాష్ట్రుడు పుట్టు గుడ్డి. ఆయన అంధత్వాన్ని గౌరవిస్తూ భార్య గాంధారి కూడా ఆజన్మాంతం కళ్లకు గంతలు కట్టుకునే జీవిస్తుంది. కళ్లుండి కూడా ప్రపంచాన్ని చూడలేకపోయిందన్నమాట. గాంధారి, ధృతరాష్ట్రులకు పెద్దకొడుకు దుర్యోధనుడంటే విపరీతమైన ప్రేమ. ఈ అతి గారబం కారణంగా దుర్యోధనుడు అహంకారిగా, దుష్ట లక్షణాలు కలిగిన వ్యక్తిగా మారతాడు. తత్ఫలితంగా యుద్దానికి కాలుదువ్వి ఘోర పరాజయం చెందడం, కురు వంశ నాశనం జరిగాయని మహాభారతం చెబుతోంది. ఇది పురాణమో! లేక ఇతిహాసమో! మరేదైనా కానీ ఇందులో నేర్చుకోగలిగినవారికి నేర్చుకున్నంత జ్ఞానం ఉంది.ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో, సోదరి షర్మిల మధ్య కొంతకాలంగా నడుస్తున్న ఆస్తి తగాదా చూస్తుంటే, తల్లి విజయమ్మ తాజాగా విడుదల చేసిన బహిరంగ లేఖ చూసిన తరువాత ఎవరికైనా మహాభారతం గుర్తుకు రాకమానదు. తల్లిదండ్రులకు పిల్లలంటే ప్రేమ ఉంటుంది. అది అందరిపై సమానంగానే ఉండాలి. కానీ ఎందువల్లో కొన్నిసార్లు కొందరు అనూహ్యంగా ఒకరిపైనే ప్రేమ చూపుతుంటారు. ఇప్పుడు విజయమ్మ కూడా అచ్చం అలాగే వ్యవహరించినట్లు అనిపిస్తుంది. షర్మిలపై గుడ్డి ప్రేమో, లేక బెదిరించడం వల్ల అలా ప్రకటన చేశారో తెలియదు కాని, వైఎస్ఆర్ కుటుంబానికి ఇంతకాలం ఉన్న ప్రతిష్ట దెబ్బతినడానికి ఆమె కూడా కారణం అవడం విషాదమే. కుమారుడు, కుమార్తె మధ్య వివాదం వస్తే ఇద్దరిని కూర్చోబెట్టి సర్దుబాటు చేయాల్సిన ఆమె ఏకపక్షంగా షర్మిలకు అనుకూలంగా ప్రకటన చేయడం పద్దతి అనిపించుకోదు. తన ప్రకటన మొదటి భాగంలో ఇద్దరూ పరిష్కరించుకుంటారు అని చెప్పినప్పుడు, అంతటితో ముగించి ఉంటే బాగుండేది. అలాకాకుండా ఎంపీలు విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డిలు చేసిన ప్రకటనలను ఖండిస్తూ అంతా ఉమ్మడి కుటుంబ ఆస్తి అని, ఇతర అంశాలు ప్రస్తావించడం ద్వారా ఆమె తప్పు చేశారనిపిస్తుంది.విజయ సాయి కుటుంబ ఆడిటర్ అయితే, విజయమ్మ చెల్లిలి భర్త వైవి సుబ్బారెడ్డి. విజయ సాయిరెడ్డి తన ప్రకటనలో షర్మిలకు వైఎస్ ఏ ఏ ఆస్తులు ఇచ్చింది సవివరంగా చెప్పడంతో వాస్తవాలు బయటకు వచ్చాయి. అంతవరకు నిజంగానే షర్మిలకు తండ్రి ఆస్తి నుంచి ఏ వాటా దక్కలేదేమో అని భావించిన వారికి పరిస్థితి అర్థమైంది. అంతేకాకుండా షర్మిలకు గత పదేళ్లలో జగన్ నుంచి రూ.200 కోట్లు అందితే కూడా ఆ కృతజ్ఞత చూపకుండా నోటికొచ్చినట్టు మాట్లాడడాన్ని విజయమ్మ తప్పు పట్టకపోవడం ఘోరంగా ఉంది. కొడుకుని విషనాగు అని, జైలుకెళ్లినా ఫర్వాలేదు అని, చివరకు మరణం గురించి కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తే తన ప్రకటనలో విజయమ్మ మాట మాత్రం తప్పుపట్టకపోవడం ఆశ్చర్యంగా ఉంది. అసలు ఈ లేఖ ఆమె రాశారా? లేదా? అనే సందేహం కలుగుతోంది. గతంలో జగన్ పై ఆమె చూపిన ప్రేమ ఆప్యాయతలన్నీ ఏమైపోయాయన్న సందేహం కలుగుతోంది.జగన్ పేరుతో ఉన్న ఆస్తుల్లో ఏవి వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రిగా ఇచ్చినవి, జగన్ సొంతంగా సంపాదించుకున్నవి ఏమిటీ అనేదానిపై విజయమ్మకు క్లారిటీ లేకుండా ఉంటుందా? 1996 నుంచే పవర్ ప్రాజెక్టులు, రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారాల్లో జగన్ ఉన్న సంగతి ఆమెకు తెలుసు కదా! తన పవర్ ప్రాజెక్ట్ అమ్మి 2004 ఎన్నికల్లో తండ్రికి నిధులు సమకూర్చిన మాట అవాస్తవమా? అదే సమయంలో షర్మిల గానీ, ఆమె భర్త అనిల్ గానీ ఏ వ్యాపారాలు చేశారు? ఎంత సంపాదించారు? నిజంగా షర్మిలకు సొంత ఆస్తులు ఉంటే సోదరుడు ఇచ్చిన డబ్బులు ఎందుకు తీసుకునేవారు? జగన్ ఆస్తులపై ఎందుకు ఆశపడేవారు? ఎందుకు ఇంత రచ్చ చేసేవారు? జగన్ ప్రేమతో ఎంఓయు చేస్తే ఆయనకు తెలియకుండానే సరస్వతి పవర్ షేర్లను బదలాయించుకోవడాన్ని విజయమ్మ ఎలా సమర్థించుకుంటారు?అందుకే ఆ విషయాలేవీ చెప్పకుండా షర్మిలకు విజయమ్మ ఏకపక్షంగా మద్దతు ఇచ్చి వైఎస్ అభిమానులకు ఆవేదన కలిగించారు. జగన్ ఎప్పుడు తన చెల్లి గురించి ఒక్క మాట అనకపోయినా షర్మిల మాత్రం అన్నను దూషిస్తున్నా, రాజకీయ ప్రత్యర్థులతో మిలాఖత్ అయినా, విజయమ్మ ఎందుకు ఆమెను మందలించలేదో అర్థం కావడం లేదు. ఏ కాంగ్రెస్ అయితే జగన్ ను జైలు పాలు చేసిందో ఆ కాంగ్రెస్ కే ఇప్పుడు షర్మిల అధ్యక్షురాలు అవ్వడం, ఆ పార్టీ పక్షాన కడప నుంచి పోటీ చేయడం విజయమ్మ ఎలా జీర్ణించుకోగలిగారు?పైగా కడపలో ఆమెను గెలిపించాలని ప్రజలకు ఎలా విజ్ఞప్తి చేశారు? అయినా షర్మిలకు డిపాజిట్ రాలేదు. దీన్నిబట్టి ఏం అర్థమవుతోంది? అటు వ్యాపారపరంగానైనా, ఇటు రాజకీయంగానైనా జగన్ చేసిన కృషి వల్లనే ఆయన పైకి వచ్చారు. ముఖ్యమంత్రి అయ్యారు. అలా అని 2019 ఎన్నికల్లో అంతకు ముందు జగన్ కు వీళ్లిద్దరూ సాయపడలేదని ఎవరూ అనరు. అంతవరకూ ఉన్న ప్రేమ అభిమానాల కారణంగానే జగన్ కూడా షర్మిల కుటుంబాన్ని ఆదరిస్తూ వచ్చారు. కానీ షర్మిల రాజకీయంగా పెడదారిపట్టి చివరకు తనకే చికాకుగా మారితే ఆ విషయం విజయమ్మ అర్థం చేసుకోకపోవడం దురదృష్టకరం.ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. షర్మిల, విజయమ్మల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి సడన్ గా ప్రేమ నటిస్తుండడంలో ఆంతర్యాన్ని విజయమ్మ పసిగట్టలేకపోవడం బాధాకరం. చంద్రబాబుతో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటివారితో షర్మిల చేతులు కలపడాన్ని విజయమ్మ ఎలా సహిస్తున్నారోగానీ వైఎస్సార్ అభిమానులు ఎవ్వరూ భరించలేకపోతున్నారు! ఒకప్పుడు విజయమ్మ చేతిలో బైబిల్ ఉంటేనే ఫోటోలు వేసి మరీ నానారకాలుగా ప్రజల్లో అప్రతిష్టపాలు చేయడానికి కథనాలు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇప్పుడు అమ్మ.. ఆవేదన అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నాయి. ఏది ఏమైనా ఒకటి మాత్రం వాస్తవం షర్మిల చేస్తున్న పిచ్చి పనులను విజయమ్మ నియంత్రించలేక చివరకు గుడ్డి ప్రేమ వల్లనో, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కారణమో గానీ షర్మిలకు మద్దతిచ్చే దయనీయ పరిస్థుతుల్లో పడ్డారు. ఒకవైపు షర్మిల, విజయమ్మలకు అనుకూలంగా రాస్తున్నట్టు డ్రామా ఆడుతూనే, ఇంకోవైపు షర్మిల కోరుతున్న ఆస్తులన్నీ అక్రమాస్తులనీ ప్రచారం చేస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా శకుని పాత్రను వీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. చివరగా ఒక మాట! జరగకూడనివి అన్నీ తన కళ్ల ముందే జరుగుతున్నాయని విజయమ్మ ఆవేదన చెందారు. నిజమే! కళ్లముందు జరుగుతున్నవాటిలో వాస్తవం ఏదో, అవాస్తవం ఏదో తెలుసుకోకుండా కళ్లకు గంతలు కట్టుకున్నట్టుగా గాంధారి పాత్ర పోషిస్తే ఎవరు సానుభూతి చూపుతారు? -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
జగనన్ను జైలుకు పంపే కుట్ర?.. వైఎస్ విజయమ్మ లేఖకు స్ట్రాంగ్ కౌంటర్
-
KSR Live Show: విజయమ్మ లేఖ చెల్లుతుందా?.. అడ్వకేట్ చెప్పిన కీలక విషయాలు
-
విజయమ్మ లేఖపై వైఎస్ఆర్ సీపీ బహిరంగ లేఖ
-
బెయిల్ రద్దుకే కుట్ర.. బాధితుడు జగనే
సాక్షి, అమరావతి: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి న్యాయపరమైన ఇబ్బందులు కలిగించి ఆయన బెయిల్ రద్దుకు జరుగుతున్న కుట్రపూరిత వ్యవహారాలను వైఎస్ విజయమ్మ తన లేఖలో ఎందుకు ప్రస్తావించలేదని వైఎస్సార్సీపీ ప్రశ్నించింది. షర్మిల భావోద్వేగాలు, ఒత్తిళ్లకు లొంగి సరస్వతి కంపెనీ షేర్ల సర్టిఫికెట్లు పోయాయంటూ.. జగన్ సంతకాలు లేకుండానే షేర్లు బదిలీ చేయడం మోసపూరితం కాదా? అని నిలదీసింది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ఎఫ్ఐఆర్లో నమోదు చేయడమే కాకుండా ఆయన కుమారుడు వైఎస్ జగన్ను అక్రమంగా 16 నెలలు జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటూ ఎన్నికలకు కొద్ది గంటల ముందు విజయమ్మ వీడియో రికార్డింగ్ను విడుదల చేసినప్పుడు వైఎస్సార్ అభిమానులు తీవ్రంగా కలతచెందారని తెలిపింది. వైఎస్ విజయమ్మ రాసిన లేఖపై స్పందిస్తూ ఈమేరకు వైఎస్సార్సీపీ ఆమెను ఉద్దేశించి ఓ లేఖను విడుదల చేసింది. షర్మిల ఎన్నో రకాలుగా తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా జగన్ ఒక్కరోజు కూడా తన చెల్లెలిని ఒక్క మాట కూడా అనలేదనే విషయాన్ని గుర్తు చేసింది. చెల్లెలుపై ప్రేమాభిమానాలతోనే జగన్ తన స్వార్జిత ఆస్తుల్లో షర్మిలకు వాటా ఇచ్చేందుకు ఎంవోయూ చేశారని... అవి కుటుంబ ఆస్తులే అయితే ఎంవోయూ చేయాల్సిన అవసరం ఉండదు..చట్టా రీత్యా హక్కు వస్తుంది కదా? అని పేర్కొంది. అసలైన బాధితుడైన జగన్కు బాసటగా ఉండటం విజయమ్మ ధర్మమని స్పష్టం చేసింది. వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణిగా, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాతృమూర్తిగా విజయమ్మను అమితంగా గౌరవిస్తామని పేర్కొంది. వాస్తవాలను ఆమెకు, ప్రజల ముందు ఉంచేందుకు వైఎస్సార్సీపీ విడుదల చేసిన లేఖ పూర్తి పాఠం ఇదీ... కాంగ్రెస్కు ఓటేయమని విజయమ్మ ఎలా అంటారు? ఆనాడే వైఎస్సార్ అభిమానులు తీవ్ర కలత చెందారు 2024 ఎన్నికల్లో జగన్ ఒక్కరే ఒకవైపున ఉంటే... అటువైపు చంద్రబాబు నేతృత్వంలో రాజకీయ ప్రత్యర్థులు అంతా జట్టు కట్టారు. మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తుందనగా.. వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ఎఫ్ఐఆర్లో పెట్టిన కాంగ్రెస్ పార్టికి, తన కుమారుడు జగన్ను అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టికి ఓటేయమని కోరుతూ విజయమ్మ వీడియో విడుదల చేశారు. వైఎస్సార్సీపీని ఇబ్బంది పెడుతూ.. తాను షర్మిలవైపు ఉన్నాననే విషయాన్ని తద్వారా చాలా స్పష్టంగా చెప్పారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ ప్రత్యర్థులకు, వైఎస్ కుటుంబంపై నిరంతరం కుట్రలు పన్నే చంద్రబాబుకు రాజకీయంగా మేలుచేసేలా ఇలా వ్యవహరించడం ధర్మమేనా..! రాజకీయాలు పక్కనపెడితే ఒక తల్లిగా ఆరోజు విజయమ్మ మద్దతు సంగతి దేవుడెరుగు...కనీసం తటస్థ వైఖరిని మరిచిపోయి పక్షపాతం వహించిన వైనం చూసి వైఎస్సార్ అభిమానులు తీవ్ర కలత చెందారు. బాధపడ్డారు. సర్టిఫికెట్లు పోయాయని.. మోసపూరితంగా షేర్ల బదలాయింపు సరస్వతీ కంపెనీ వ్యవహారంలో షర్మిల భావోద్వేగాలు, ఒత్తిళ్ల ప్రభావంతో షేర్ల సర్టిఫికెట్లు పోయాయని విజయమ్మ చెప్పారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు లేకుండానే, జగన్ సంతకాలు లేకుండానే ఎవరికీ తెలియకుండా మోసపూరితంగా షేర్లు బదిలీ చేశారు. తన కుమారుడికి న్యాయపరంగా ఇబ్బందులు వస్తాయని, అది బెయిల్ రద్దు కుట్రకు దారితీస్తుందని తెలిసినా అలా చేశారు. తద్వారా తాను షర్మిలతోనే ఉన్నానని మరోసారి స్పష్టంగా చెప్పారు. షర్మిలను ఏనాడూ ఒక్క మాట అనని జగన్.. వైఎస్ జగన్కు షర్మిల వ్యక్తిగతంగా రాసిన లేఖ టీడీపీ సోషల్ మీడియా ఖాతాలో ప్రత్యక్షమైంది. విజయమ్మ కూడా సంతకం చేసిన ఆ లేఖను టీడీపీ విడుదల చేయడం ఏమిటి...? ఇంత జరిగినా జగన్ ఏనాడూ తన చెల్లెలను ఉద్దేశించి ఒక్కమాట కూడా మాట్లాడ లేదు. కానీ షర్మిల ఎన్నోసార్లు వైఎస్ జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో విజయవాడలో జగన్పై దాడి జరిగితే హేళనగా మాట్లాడారు. షర్మిలను సరిదిద్దాలని విజయమ్మ ఏనాడూ ప్రయత్నించకపోవడం ఆమె వైఖరిని ప్రశ్నిస్తున్నాయి. బాధితుడు జగనే... కోర్టు కేసులపై ప్రతికూల ప్రభావితం పడేలా షర్మిల ప్రవర్తన, చర్యలు ఉంటున్నాయి. ఓ వైపు ఆస్తులపై హక్కులు కోరుతూ మరోవైపు అందుకు విరుద్ధంగా ఆమె వ్యవహరిస్తున్నారు. అక్రమ కేసులపై వైఎస్ జగన్ పోరాటం చేస్తుంటే... వాటి ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై తనకు ఎలాంటి ఆందోళనలేనట్టు ఆమె ప్రవర్తిస్తున్నారు. జగన్ను రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బతీసేందుకు అనుగుణంగానే ఆమె వ్యవహరిస్తున్నారు. షర్మిల వేసే ప్రతి అడుగూ ప్రత్యర్థులకు లబ్ధి చేకూర్చేలా ఉంటోంది. మూడు నాలుగేళ్లుగా ఇంత జరుగుతున్నా జగన్ ఓపికతో, సహనంతో, మౌనంగా ఆ బాధను భరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు బాధితులు ఎవరు...? ఒక తల్లిగా విజయమ్మ ఎవరికి బాసటగా ఉండాలనే బలమైన ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. రచ్చ కెక్కిందీ... పరువు తీసిందీ షర్మిలే రాజకీయాల పేరిట తెలంగాణలో అడుగుపెట్టిన దగ్గరనుంచి అవకాశం వచ్చిన ప్రతిసారి జగన్ను షర్మిల ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అక్కడ నుంచి ఒక్కసారిగా మాయమై వైఎస్ రాజశేఖర్రెడ్డిని ఎఫ్ఐఆర్లో పెట్టిన పార్టికి... అన్నను 16 నెలలు జైల్లో అక్రమంగా నిర్బంధించిన పార్టికి ఈ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలిగా వచ్చారు. రాజకీయాలు ఇంతే అనుకున్నా ప్రజాస్వామ్య విమర్శల పరిధిని దాటి ఆజన్మ శత్రువు మాదిరిగా జగన్ను షర్మిల అనరాని మాటలు అంటున్నారు. ఎన్నికల సమయంలో జగన్పై దాడి జరిగితే ఎగతాళి చేసి అమానవీయంగా మాట్లాడింది షర్మిల కాదా..? వీటన్నింటినీ జగన్ ఓపికతో భరించారు. మరి రచ్చకెక్కింది ఎవరు... పరువుతీసింది ఎవరు... నిజమైన బాధితుడు ఎవరు... జగనే కదా..!! విచక్షణ విస్మరించిన విజయమ్మ కుమార్తె ప్రభావం, ఒత్తిళ్లతో విజయమ్మ విచక్షణ విస్మరించారు. కుమార్తెను వెనకేసుకువచ్చే ధోరణితో సరస్వతీ కంపెనీ విషయంలో తనవంతు పాత్ర పోషిస్తూ చట్టవ్యతిరేక పనులకు తోడ్పడ్డారు. తన కుమారుడు ఎదుర్కోబోయే చట్టపరమైన సంక్షిష్ట పరిస్థితులేంటో తెలిసి కూడా విజయమ్మ దాన్ని విస్మరించారు. ప్రస్తుత పరిస్థితులకు ప్రధాన కారణం ఇదే. ఉమ్మడి ఆస్తులే అయితే ఒకరి కంపెనీల్లో ఒకరికి ఎందుకు వాటాలు లేవు? వైఎస్సార్ ఆ ఆస్తులను షర్మిలకు ఎందుకు పంచలేదు? వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నపుడే జగన్ కంపెనీలు నడిపారు. అలాగే షర్మిల తన కంపెనీలను తాను నడిపారు. ఉమ్మడి ఆస్తులు అయితే మరి ఒకరి కంపెనీల్లో ఒకరికి వాటాలు ఎందుకు లేవు? వైఎస్సార్ మనోభావాలు, ఆజ్ఞ వేరేలా ఉంటే ఇలా ఎందుకు జరిగింది ? తన కుమార్తెకు వైఎస్సార్ పూరీ్వకుల ఆస్తులతో పాటు తాను సంపాదించిన ఆస్తులను ఇచ్చారు. జగన్ ఆస్తులు తనవి కాదు కాబట్టే ఇవ్వలేదు. ఎందుకంటే అవన్నీ జగన్ స్వార్జితం కాబట్టి. తన స్వార్జిత ఆస్తులను షర్మిలకు ఇచ్చిన జగన్ షర్మిలకు వివాహమైన 20 ఏళ్ల తర్వాత జగన్ తన స్వార్జిత ఆస్తుల్లో కొన్నింటిని చెల్లెలిపై ప్రేమానురాగాలకొద్దీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కోర్టు కేసుల నేపథ్యంలో 2019లో ఆమెకు మంచి చేస్తూ ఒక ఎంఓయూ రాసి ఇచ్చారు. అంతేకాకుండా గడచిన పదేళ్లలో దాదాపు రూ.200 కోట్లు పైచిలుకు జగన్ ద్వారా షర్మిల పొందినా ఆమె తన సోదరుడిపట్ల ఏమాత్రం కృతజ్ఞత చూపలేదు. షర్మిల ఒక్క రూపాయి అయినా పెట్టుబడి పెట్టారా ? ఇంత యాగీ చేస్తున్న షర్మిల ఈ సంస్థల్లో ఒక్క రూపాయి అయినా పెట్టుబడి పెట్టారా? ఒక్కరోజైనా కంపెనీ కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారా? కంపెనీలకున్న రూ.1400 కోట్ల అప్పుల్లో తన వాటా కింద వ్యక్తిగత పూచీకత్తు ఇస్తూ సంతకం పెట్టారా? రూ.500 కోట్ల నష్టాల్లో అయినా ఆమె పాత్ర పోషించారా? ఈ కంపెనీలకు సంబంధించిన కష్టాల్లో, చిక్కుల్లో, కోర్టు కేసుల్లో ఏరోజైనా తానుగా బాధ్యత తీసుకున్నారా? వాటాలు ఉంటే ఇలా నష్టం చేస్తారా? ఈ కంపెనీల మీద, జగన్ మీద ఎవరైతే కేసులు పెట్టారో వారికి రాజకీయ ప్రయోజనం కల్పించేలా షర్మిల వారిని బలపరుస్తున్నారు. కంపెనీలను బలహీనపరుస్తున్నారు. ఆమె నడవడిక, వైఖరి చూస్తే ఈ కంపెనీల్లో వాటాలు ఉన్నాయని ఎవరికైనా అనిపిస్తుందా? నిజంగా వాటాలు ఉంటే ఇలా చేస్తారా? ఇలా జగన్ను, ఆయన కంపెనీలను ఇబ్బందులు పాలు చేస్తారా? కోర్టులే నిర్ణయిస్తాయి ఇప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ వ్యవహారం కోర్టులో ఉంది. ఇరువురి వాదనలు ప్రజలముందు ఉన్నాయి. ఎవరు చేసింది సరైనదో, ఎవరివైపు న్యాయం ఉందో కోర్టులే నిర్ణయిస్తాయి.ఉమ్మడి ఆస్తులే అయితే ఎంవోయూ ఎందుకు? తన స్వార్జిత ఆస్తులను ప్రేమానురాగాలతో షర్మిలకు ఇస్తున్నట్లు జగన్ ఎంఓయూ రాస్తే... దానిపై విజయమ్మ, షర్మిల ఇద్దరూ సంతకాలు చేశారు. అంటే దీని అర్థం జగన్ స్వార్జిత ఆస్తుల్లో హక్కులేదని, ఆరోజు వారు మనస్ఫూర్తిగా అంగీకరించినట్టేగా? మరి ఇప్పుడు ఉమ్మడి ఆస్తులు అంటూ లేఖలో పేర్కొనడం ప్రజలను తప్పుదోవ పట్టించడానికే కదా. నిజంగా ఉమ్మడి ఆస్తులే అయితే వాటిని పంచుకునే పద్ధతి ఇలా ఎంఓయూల రూపంలో ఉండదు... చట్టరీత్యా హక్కుగా వస్తుందని ప్రతి కుటుంబానికి తెలుసు. జగన్ స్వార్జిత ఆస్తి కోసం షర్మిల యాగీ ఏమిటి? జగన్ స్వార్జితమైన ఆస్తిలో ఎలాంటి హక్కులేకపోయినా, ఆ ఆస్తిలో తనకు భాగం కావాలని షర్మిల ఇంత రాద్ధాంతం చేయడం ఏంటి? ఇంత యాగీ చేయడం ఏంటి? ఇన్ని లేఖలు రాయడం ఏంటి? ఆ లేఖను టీడీపీ విడుదల చేయడం ఏంటి? ఆమె పద్ధతి, ప్రవర్తన మారి తన ప్రేమానురాగాలను చూరగొంటే, కోర్టు కేసులు పరిష్కారం అయిన తర్వాత ఆమెకు ఏమేరకు మంచి చేయాలో, ఎంత చేయాలో, ఏం చేయాలో ఆరోజు నిర్ణయం తీసుకుంటానని జగన్ ఇదివరకే స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కుటుంబ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్లో ఇంకెంతమాత్రం మునిగిపోకూడదని, ప్రజాసమస్యలపై దృష్టిసారిస్తామని ఇదివరకే మా పార్టీ స్పష్టం చేసింది. బెయిల్ రద్దు కుట్రను విజయమ్మ ఎందుకు ప్రస్తావించ లేదు?ప్రజలను పక్కదోవ పట్టించడమే వైఎస్ జగన్మోహన్రెడ్డిని న్యాయపరంగా ఇబ్బంది పెట్టేందుకు... తద్వారా బెయిల్ రద్దుకు పన్నిన కుట్ర వ్యవహారాన్ని విజయమ్మ తన లేఖలో కనీసం ప్రస్తావించ లేదు. అది ప్రజలను పక్కదోవ పట్టించడమే. సరస్వతీ కంపెనీ విషయంలో ఈడీ అటాచ్మెంట్ ఉంది. తెలంగాణ హైకోర్టు స్టేటస్కో ఆదేశాలు ఉన్నాయి. యాజమాన్య బదిలీ జరిగేలా క్రయవిక్రయాలు చేయకూడదని అటాచ్మెంట్లో ఉందనే విషయం అందరికీ తెలుసు. సరస్వతీ కంపెనీ విషయంలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయవద్దని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీలతో సహా పలువురి న్యాయసలహాలు ఉన్నాయి. అయినప్పటికీ తప్పని తెలిసినప్పటికీ.. మోసపూరితంగా, కుట్రపూరితంగా షేర్లు బదిలీ చేసిన మాట వాస్తవమే కదా...! షర్మిల భావోద్వేగాలకు, ఒత్తిళ్లకు గురై వైఎస్ జగన్మోహన్రెడ్డికి న్యాయపరంగా, చట్టపరంగా చిక్కులు తెచ్చే ఈ పనికి తెలిసి కూడా విజయమ్మ ఆమోదించి సంతకం పెట్టడం నిజమేకదా...! విజయమ్మ తన లేఖలో ఆ అంశాన్ని పూర్తిగా విస్మరించడం ప్రజలను, వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులను పక్కదోవ పట్టించడమే. -
వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం
సాక్షి కడప/వేంపల్లె: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 15వ వర్థంతిని పురస్కరించుకుని వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్వద్ద ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులరి్పంచారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతీరెడ్డితోపాటు ఇతర కుటుంబ సభ్యులు సోమవారం ఉదయాన్నే ఘాట్ వద్ద పూలమాలలు వేసి ఘన నివాళి అరి్పంచారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆయన అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు ఇడుపులపాయకు కదిలివచ్చారు. ముందుగా వైఎస్ జగన్ కుటుంబమంతా ఘాట్ ప్రాంగణంలో దివంగత నేతను స్మరించుకున్నారు. వైఎస్ జగన్తోపాటు తల్లి విజయమ్మ నివాళులరి్పంచే క్షణంలో భావోద్వేగానికి గురయ్యారు. ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు.. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద మాజీ సీఎం వైఎస్ జగన్తోపాటు కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చి పాస్టర్లు దేవుని వాక్యంతోపాటు వైఎస్సార్ హయాంలో జరిగిన మంచి పనులను వివరించారు. వైఎస్సార్ సువర్ణ పాలనలో ప్రజలంతా సంక్షేమంలో మునిగిపోయారని కొనియాడారు.అంతేకాక.. 108, ఆరోగ్యశ్రీ, 104, ఫీజు రీయింబర్స్మెంట్, రైతుల కోసం రుణమాఫీ అమలుచేసి ప్రజల కష్టాల నుంచి మహానేత రక్షించారని స్మరించుకున్నారు. మహానేత సేవలు చిరస్మరణీయమన్నారు. వైఎస్సార్ అడుగుజాడల్లోనే వైఎస్ జగన్ ధైర్యంగా ముందుకెళ్తున్నారని పాస్టర్లు కొనియాడారు. కష్టకాలంలో దేవునితోపాటు నాన్న ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయనకు ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరూ వైఎస్ జగన్కు తోడుగా నిలబడాలని వారు ఆకాంక్షించారు. ఇక ప్రత్యేక ప్రార్థనల్లో చిన్నాన్న వైఎస్ సు«దీకర్రెడ్డి, అత్తమ్మ ఈసీ సుగుణమ్మ, సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినా‹Ùరెడ్డి, మేనమామ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, అన్నమయ్య జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, కడప నగర మేయర్ కె. సురేష్బాబు, ఎమ్మెల్యేలు డాక్టర్ సుధ, టి. చంద్రశేఖర్, విరూపాక్షి, ఎమ్మెల్సీలు పి. రామసుబ్బారెడ్డి, రమేష్ యాదవ్, గోవిందరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్బాషా, వైఎస్సార్సీపీ రాష్ట్ర నేతలు ఎస్వీ సతీష్కుమార్రెడ్డి, ఆర్. రమే‹Ùకుమార్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచి్చన వైఎస్సార్ అభిమానులు, పార్టీ శ్రేణులు, నేతలు అందరికీ వైఎస్ జగన్ అభివాదం చేశారు. ఒక్కొక్కరిని పేరుపేరునా పలకరిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. -
వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ జగన్ నివాళులు
వైఎస్సార్, సాక్షి: సంక్షేమ ప్రదాత.. అభివృద్ధి విధాత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి 15వ వర్ధంతి నేడు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. వైఎస్సార్ సతీమణి విజయమ్మ, తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని మహానేతను స్మరించుకున్నారు.ఈ ప్రార్థనా కార్యక్రమంలో ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, గురుమూర్తి, జిల్లా పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, దాసరి సుధ, మాజీ డిప్యూటీ సిఎం ఆంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు కోరుముట్ల శ్రీనివాస్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ విజయమ్మ పేరుతో టీడీపీ తప్పుడు లేఖ
విశాఖపట్నం: ఎన్నికల్లో ఓడిపోతున్నామనే నిస్పృహతో టీడీపీ నీచపు పనులకు పాల్పడుతోందని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మండిపడ్డారు. వైఎస్ విజయమ్మ రాసినట్టుగా టీడీపీ ఒక లేఖను సృష్టించి.. దాన్ని అడ్డుపెట్టుకుని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసి బురదజల్లుతోందని తెలిపారు.ఆ లేఖలో ఉపయోగించిన భాషను చూస్తే అది ఫేక్ అన్న సంగతి అందరికీ అర్థం అవుతోందని తెలిపారు. ఓడిపోతున్నామనే ఉక్రోషంతో టీడీపీ ఇలాంటి తప్పుడు పనులు చేస్తోందని విమర్శించారు. టీడీపీ ఫేక్ ప్రచారాలను ప్రజలు తిప్పికొడుతున్నారని తెలిపారు. విజయమ్మ పేరిట లేఖను సృష్టించి సర్క్యులేట్ చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరతామని ఆయన తెలిపారు. -
#MemanthaSiddham : జైత్రయాత్ర ఆరంభం
మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: మండుటెండనూ లెక్క చేయకుండా కి.మీ. కొద్దీ రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన జనం.. నిప్పులు చిమ్ముతున్న సూరీడుతో పోటీపడుతూ చంటిబిడ్డలను చంకనేసుకుని బస్సు వెనుక పరుగులు తీసిన ఆడబిడ్డలు.. రోడ్డుకు ఇరువైపులా గ్రామాల్లో టెంట్లు వేసి వంటలు వండుకుని, సామూహికంగా భోజనాలు చేసి గంటల తరబడి నిరీక్షించిన ప్రజానీకం..! వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ ఇడుపులపాయ నుంచి ప్రారంభించిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో తొలిరోజు కనిపించిన దృశ్యాలు ఇవి. సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో బలంగా నాటుకుపోయిన నమ్మకానికి ఈ దృశ్యాలు ప్రతీకగా నిలిచాయి. వైఎస్సార్ జిల్లాలోని ఇడుపులపాయ నుంచి వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచార భేరిని సీఎం జగన్ బుధవారం మోగించారు. తాడేపల్లి నివాసం నుంచి ఉదయం 11.50 గంటలకు బయలుదేరిన సీఎం జగన్ ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్దకు మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకున్నారు. తన మాతృమూర్తి వైఎస్ విజయమ్మతో కలిసి వైఎస్సార్కు నివాళులు అర్పించారు. అనంతరం తల్లి విజయమ్మ ఆశీస్సులు తీసుకున్నారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించి భారీ ఎత్తున తరలివచ్చిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల నినాదాల నడుమ బస్సు యాత్రను సీఎం జగన్ ప్రారంభించారు. ఇడుపులపాయ నుంచి కుమారునిపల్లి వద్దకు బస్సు యాత్ర చేరుకునే సరికి రోడ్డుకు ఇరువైపులా భారీ ఎత్తున జనం బారులు తీరారు. భారీ క్రేన్తో గజమాల వేసి సీఎం జగన్కు ఆత్మీయ స్వాగతం పలికారు. జనసంద్రమైన వేంపల్లి.. ప్రజలు భారీ ఎత్తున తరలిరావడంతో వేంపల్లి జనసంద్రంగా మారింది. వేంపల్లి అడ్డ రోడ్డు నుంచి హనుమాన్ సర్కిల్ వరకూ సీఎం జగన్ రోడ్ షో నిర్వహించారు. సీఎం జగన్ను చూడగానే అవ్వాతాతల నుంచి చిన్న పిల్లల వరకూ హర్షద్వానాలతో ఘనస్వాగతం పలికారు. హనుమాన్ సర్కిల్ వరకూ కి.మీ. కొద్దీ ఇసుకేస్తే రాలనంత స్థాయిలో రోడ్డుపై కిక్కిరిసిన జనం సీఎం జగన్ బస్సు యాత్రకు నీరాజనాలు పలికారు. మండటెండను కూడా లెక్క చేయకుండా చంటిబిడ్డలను ఎత్తుకుని బస్సు వెంట నడుస్తూ సీఎం జగన్ను చూసేందుకు పోటీపడ్డారు. బస్సు యాత్ర సాగుతున్న రహదారికి ఇరువైపులా మారుమూల గ్రామాల ప్రజలు భారీ ఎత్తున రోడ్డుపైకి తరలివచ్చి టెంట్లు వేసుకుని, వంటలు వండుకుని, సామూహికంగా భోజనాలు చేస్తూ సీఎం జగన్ రాక కోసం గంటల కొద్దీ నిరీక్షించారు. బస్సు యాత్ర తమ వద్దకు చేరుకోగానే సీఎం జగన్పై బంతిపూల వర్షం కురిపిస్తూ అడుగడుగునా నీరాజనాలు పలకడంతో యాత్ర ఆలస్యంగా ముందుకు సాగింది. అమ్మ భావోద్వేగం... పులివెందుల: ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభం సందర్భంగా వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రార్థన నిర్వహించిన వైఎస్ విజయమ్మ భావోద్వేగానికి గురయ్యారు. ‘నా బిడ్డను నీకే అప్పజెబుతున్నా దేవుడా..! నా బిడ్డ కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా ఉన్నావు..! ప్రతి బాధలోనూ తోడుగా ఉన్నావు..! నా బిడ్డ తలపెట్టిన కార్యక్రమాలను జయప్రదం చేయాలి..! నా బిడ్డను మళ్లీ సీఎంగా చేయాలని కోరుకుంటున్నా..!’ అంటూ ప్రార్థన చేసిన అనంతరం సీఎం జగన్ను ఆప్యాయంగా ముద్దాడగా.. ఆయన భావోద్వేగంతో తన తల్లిని ఆలింగనం చేసుకున్నారు. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన వారిలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, మేడా రఘునాథరెడ్డి, ఎంపీలు వైఎస్ అవినాష్రెడ్డి, మిథున్రెడ్డి, చింతా అనూరాధ, ఎమ్మెల్యేలు రవీంద్రనాథరెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, శ్రీకాంత్రెడ్డి, సుధాకర్బాబు, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఎమ్మెల్సీలు రమేష్యాదవ్, రామచంద్రారెడ్డి, ప్రభాకర్, తలశిల రఘురాం, జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు, జడ్పీ ఛైర్మన్ అమర్నాథరెడ్డి, చల్లా మధుసూదన్రెడ్డి, దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్రెడ్డి, వైఎస్ కొండారెడ్డి, సీఎం కార్యాలయ కోఆర్డినేటర్ జనార్దన్రెడ్డి, ఎన్ఆర్ఐ రత్నాకర్ తదితరులున్నారు. జిల్లా చరిత్రలో అతి పెద్ద ప్రజాసభ.. ప్రొద్దుటూరులో బహిరంగ సభ షెడ్యూలు ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కావాలి. కానీ.. రహదారి పొడవునా జనం బారులు తీరి స్వాగతం పలకడంతో బైపాస్ రోడ్డు సమీపంలోని సభా ప్రాంగణానికి సాయంత్రం 6.30 గంటలకు సీఎం చేరుకున్నారు. అప్పటికే 30 ఎకరాల్లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. సీఎం జగన్ వేదికపైకి చేరుకుని ర్యాంప్ వాక్ చేస్తూ అభివాదం చేస్తున్నంత సేపు ప్రాంగణం ప్రజల హర్షధ్వానాలతో మారుమోగిపోయింది. గత 58 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో చేసిన మంచిని వివరిస్తూ.. టీడీపీ– జనసేన–బీజేపీ కూటమి సర్కార్ 2014–19 మధ్య చేసిన మోసాలను ఎండగడుతూ సీఎం జగన్ చేసిన ప్రసంగానికి విశేష స్పందన లభించింది. ప్రొద్దుటూరులో సీఎం జగన్ నిర్వహించిన సభ వైఎస్సార్ కడప జిల్లా చరిత్రలో అతి పెద్ద ప్రజాసభగా నిలిచింది. ప్రచండ భానుడితో పోటీపడుతూ.. నిప్పులు గక్కుతున్న సూరీడుతో పోటీపడుతూ సీఎం జగన్ కోసం రహదారిపై భారీ ఎత్తున జనం గంటల కొద్దీ నిలబడ్డారు. కమలాపురం నియోజకవర్గంలో వీరపునాయునిపల్లె, గంగిరెడ్డిపల్లి, సంగాలపల్లిలో బస్సు యాత్రకు నీరాజనాలు పలికారు. మండల కేంద్రమైన వీరపునాయునిపల్లిలో సీఎం జగన్ నిర్వహించిన రోడ్ షోకు విశేష స్పందన లభించింది. జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్లలోని మెయిన్ రోడ్డు జనసంద్రంగా మారింది. ఎర్రగుంట్లలో సీఎం జగన్ నిర్వహించిన రోడ్ షో సూపర్ హిట్ అయ్యింది. రాత్రి పూట జన నీరాజనం.. ప్రొద్దుటూరు సభ రాత్రి 8 గంటలకు ముగిసింది. అనంతరం బస్సు యాత్ర మైదుకూరు నియోజకవర్గం దువ్వూరుకు చేరుకునే సమయంలో దారిలో రాత్రి పూట కూడా జనం భారీ ఎత్తున రహదారిపై గంటల తరబడి నిరీక్షించారు. సీఎం జగన్పై బంతి పూలవర్షం కురిపించి అభిమానాన్ని చాటుకున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో బస్సు యాత్ర ముగిసి బుధవారం రాత్రి 9.20 గంటలకు నంద్యాల జిల్లా చాగలమర్రిలో ప్రవేశించింది. చాగలమర్రిలో జనం సీఎం జగన్కు నీరాజనాలు పలికారు. దారి పొడవునా ఘనస్వాగతాల నడుమ ఆళ్లగడ్డ క్రాస్లో బస చేసేందుకు ఏర్పాటు చేసిన శిబిరానికి రాత్రి 10 గంటలకు చేరుకున్నారు. బస్సు యాత్ర తొలి రోజు గ్రాండ్ సక్సెస్ కావడంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నయా జోష్ నెలకొంది. నేడు నంద్యాలలో సీఎం జగన్ సభ ఆళ్లగడ్డ నుంచి రెండో రోజు మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభం సాక్షి, అమరావతి: మేమంతా సిద్ధం బస్సు యాత్ర రెండో రోజైన గురువారం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సీఎం జగన్మోహన్రెడ్డి నైట్ హాల్ట్ ప్రాంతం నుంచి ప్రారంభంకానుంది. యాత్ర గురు వారం షెడ్యూల్ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం.. ఉదయం 9 గంటలకు ఆళ్లగడ్డ నుంచి బయలుదేరి నల్లగట్ల, బత్తలూరు, ఎర్రగుంట్ల చేరుకొని గ్రామ స్థులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. అనంతరం గోవిందపల్లి మీదుగా ప్రయాణించి చాబోలు శివారులో భోజన విరామం తీసుకుంటారు. తర్వాత నూనేపల్లి మీదుగా నంద్యాల చేరుకుని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం పాణ్యం, సుగాలిమిట్ట, హుస్సేనాపురం, ఓర్వకల్, నన్నూర్, పెద్దటేకూరు, చిన్నకొట్టాల, కె.మార్కాపురం క్రాస్, నాగలాపురంలో ప్రజలతో మమేకమవుతూ పెంచికలపాడులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. -
సీఎం జగనన్ను ఆశీర్వదించిన విజయమ్మ
-
పులివెందులలో సీఎం క్రిస్మస్ వేడుకలు
పులివెందుల: క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం వైఎస్సార్ జిల్లా పులివెందులలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైఎస్సార్ జిల్లాలో మూడ్రోజుల పర్యటనలో భాగంగా మూడో రోజైన సోమవారం ఉదయం సీఎం ఇడుపులపాయ ఎస్టేట్ నుంచి హెలికాప్టర్ ద్వారా భాకరాపురం హెలిప్యాడ్, అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా పులివెందుల పట్టణానికి చేరుకున్నారు. ఉ.9.30 గంటలకు సీఎస్ఐ చర్చి ప్రాంగణానికి చేరుకుని అక్కడ హాజరైన వారిని ఆప్యాయంగా, చిరునవ్వుతో పలకరించారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం తన బంధువర్గానికి, స్నేహితులు, ఆప్తులు, అభిమానులకు క్రిస్మస్.. ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏటా క్రిస్మస్ రోజున తన సొంత గడ్డపై కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందాన్నిస్తుందన్నారు. అందరి అభిమానం, ఆశీస్సులు, దేవుని చల్లని దీవెనలు తనకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నానని ఆయన ప్రార్థించారు. రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకునేందుకు ముఖ్యమంత్రిగా ప్రజాసేవలో తరిస్తున్నానని.. ఎప్పటికీ మీ హృదయాల్లో ప్రియమైన నాయకుడిగా సుస్థిర స్థానాన్ని పొందుతానన్నారు. అనంతరం.. ముఖ్యమంత్రి జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. 2024 నూతన సంవత్సర చర్చి క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఆ తర్వాత చర్చి నుంచి రోడ్డు మార్గాన సీఎం బయల్దేరి వైఎస్సార్సీపీ నేత నల్లచెరువుపల్లె రవి ఇంటికెళ్లి నూతన దంపతులు మంజ్రేకర్రెడ్డి, రేణుకారెడ్డిలను ఆశీర్వదించారు. ఇక ఉ.11.07 గంటలకు సీఎం జగన్ అక్కడ నుంచి బయల్దేరి 11.15 గంటలకు భాకరాపురం హెలిప్యాడ్ వద్దకు చేరుకుని అక్కడ స్థానిక నాయకులతో మాట్లాడారు. ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. మ.12.19 గంటలకు హెలికాప్టర్లో బయల్దేరి మైదుకూరులోని జిల్లా వక్ఫ్బోర్డు చైర్మన్ దస్తగిరి నివాసంలో ఆయన కుమారుడు, ఇద్దరు కుమార్తెల వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకల్లో కుటుంబ సభ్యులు.. ఇక క్రిస్మస్ వేడుకల్లో సీఎం జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతీరెడ్డి, కుటుంబ సభ్యులు వైఎస్ ప్రకాష్రెడ్డి, వైఎస్ ప్రతాప్రెడ్డి, వైఎస్ మధురెడ్డి, వైఎస్ మనోహర్రెడ్డి, ఆత్మీయులు, మిత్రులు, పుర ప్రజలు పాల్గొన్నారు. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజాద్ బాషా, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఎమ్మెల్యే డాక్టర్ డి. సుధ, జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్, పాడా ఓఎస్డీ అనిల్కుమార్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, ఆర్డీఓ వెంకటేశులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు ప్రజలపై ఉండాలి సీఎం వైఎస్ జగన్ సాక్షి,అమరావతి: నిస్సహాయులపై కరుణ, సాటివారిపై ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని సీఎం జగన్ పేర్కొన్నారు. ఎల్లప్పుడూ ఆ కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు ప్రజలపై ఉండాలని కోరుకుంటూ క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అని సోమవారం ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. -
కుటుంబ సభ్యులతో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ (ఫొటోలు)
-
7 రంగాల్లో విశిష్ట సేవలందించిన 27 మంది వ్యక్తులు, సంస్థలకు పురస్కారాలు
-
మార్మోగిన జగన్ నినాదం
ఒంగోలు: జై జగన్ అంటూ విద్యార్థినులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ఒంగోలులోని పవిత్ర కాలేజీ క్యాంపస్ మార్మోగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాతృమూర్తి వైఎస్ విజయమ్మ ప్రైవేటు కార్యక్రమంలో భాగంగా ఒంగోలు వచ్చారు. స్థానిక పవిత్ర క్యాంపస్ (శ్రీహర్షిణీ డిగ్రీ కాలేజీ బాలికల క్యాంపస్) ఎదురుగా ఉన్న ఒక ప్రముఖ వ్యక్తితో మాట్లాడి బయటకు వస్తుండగా క్యాంపస్లో ఉన్న విద్యార్థినులు ఒక్కసారిగా బయటకు వచ్చారు. సిబ్బంది అదుపు చేస్తున్నా విద్యార్థినులు ససేమిరా అన్నారు. ఒక్కసారిగా వారందరినీ తోసుకుంటూ ముందుకు వచ్చారు. వారి ఉత్సాహాన్ని చూసిన విజయమ్మ విద్యార్థినులను దగ్గరకు తీసుకున్నారు. దీంతో వారి ఆనందానికి అవధులు లేవు. జై జగన్ అంటూ విద్యార్థినులు నినదిస్తూ ఆమెను కలిసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ఆమెకు షేక్ హ్యాండ్స్ ఇస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. -
మహానేత వైఎస్సార్కు వైఎస్ విజయమ్మ, షర్మిల నివాళులు
-
నన్ను ఆశీర్వదించిన నాన్నకు పక్కనే ఉన్న అమ్మకు పాదాభి వందనం చేస్తున్నా..
-
పుత్రోత్సాహంతో జగన్ ని హత్తుకుని కన్నీరు పెట్టుకున్న విజయమ్మ
-
ఎల్లో మీడియా ఓవరాక్షన్
సాక్షి ప్రతినిధి, కర్నూలు: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయబోతున్నారంటూ సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎల్లో మీడియా ఓవరాక్షన్ చేసింది. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న తల్లి శ్రీలక్ష్మి బాగోగులు చూసుకుంటున్న అవినాశ్ పట్ల కనీస మానవత్వాన్ని కూడా మరిచి ఎల్లో మీడియా అమానుష ధోరణిని బయటపెట్టుకుంది. సీబీఐ అధికారులు సోమవారం కర్నూలుకు రావడంతో అదే అదనుగా రెచ్చిపోయింది. అవినాశ్ను ఎలాగైనా అరెస్టు చేయించాలన్న విపరీత ధోరణి, కర్నూలు నగరంలో ఉద్రిక్తతలు సృష్టించాలన్న వ్యూహంతో క్షణక్షణం అసత్య ప్రచారంతో హోరెత్తించింది. గంట గంటకు ఎల్లో మీడియా పిచ్చి ముదిరి, మధ్యాహ్నానికి పీక్స్కు చేరుకొంది. స్థానిక పోలీసులు సహకరించడంలేదని, మధ్యాహ్నానికి కర్నూలుకు కేంద్ర బలగాలు వస్తున్నాయని, ఆ వెంటనే సీబీఐ అధికారులు అవినాశ్ను అరెస్టు చేస్తారంటూ తప్పుడు ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఎల్లో మీడియా విపరీత ధోరణిని రాష్ట్రవ్యాప్తంగా పలువురు తప్పుపట్టారు. తల్లి ఆరోగ్యం బాగోలేక బాధలో ఉన్న వ్యక్తిపట్ల అమానవీయంగా వ్యవహరించడాన్ని వైఎస్సార్సీపీ శ్రేణులు, సభ్య సమాజం ఖండించాయి. ఒక ఎంపీకి ఉండే హక్కులు, ఆయన ప్రైవసీని భంగపరిచే విధంగా పచ్చ పైత్యాన్ని వెళ్లగక్కుతున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురదజల్లే కుట్రలో భాగంగానే వైఎస్ అవినాశ్రెడ్డి లక్ష్యంగా ఎల్లోమీడియా ఈ దుర్నీతికి పాల్పడుతోందని స్పష్టమవుతోంది. అందులో భాగంగానే అర్ధరాత్రి వేళ ఆస్పత్రిలోకి చొరబడుతున్నారని, ఎంపీ తల్లికి అందిస్తున్న చికిత్సపై వైద్యులు సమాచారం అందిస్తున్నా, అసత్యాలను ప్రచారం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవినాశ్ సోమవారం సీబీఐ విచారణకు హాజరు కావల్సి ఉంది. అయితే, ఆయన తల్లి తీవ్ర అనారోగ్యంతో ఈనెల 20వ తేదీ నుంచి కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య బృందం ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తోంది. అవినాశ్ దగ్గరుండి ఆమె బాగోగులు చూసుకుంటున్నారు. తన తల్లి ఆరోగ్యం బాగోలేనందున విచారణకు హాజరు కాలేనని, ఈ నెల 27 తర్వాత హాజరవుతానని అవినాశ్ సీబీఐ అధికారులకు లేఖ పంపారు. అయినప్పటికీ, సీబీఐ అధికారులు సోమవారం ఉదయం కర్నూలు వచ్చారు. స్టేట్ గెస్ట్హౌస్లో బస చేశారు. దీనినే అవకాశంగా తీసుకున్న ఎల్లో మీడి యా వెంటనే తప్పుడు కథనాలు ప్రచారం చేయడం ప్రారంభించింది. అవినాశ్ను అరెస్టు చేయడానికే సీబీఐ అధికారులు వచ్చారంటూ అసత్య ప్రచారం మొదలెట్టింది. వారు పోలీసు అధికారులను కలిసినట్లు, అవినాశ్ను ఏ క్షణంలోనైనా అరెస్టు చేస్తారంటూ స్క్రోలింగ్లు, చర్చలు ప్రారంభించింది. అవినాశ్ను అరెస్టు చేయకపోవడంతో నిరాశ చెందిన ఈ మీడియా.. కొత్త వ్యూహా న్ని రచించింది. సీబీఐ అధికారులు పోలీసు అధికారులను సంప్రదిస్తున్నారని, ఎప్పుడైనా అరెస్టు జరగవచ్చని మరో ప్రచారం మొదలెట్టింది. ముఖ్యంగా టీవీ–5, ఏబీఎన్ తప్పుడు కథనాలు, చర్చలతో హోరెత్తించాయి. విశ్వభారతి హాస్పిటల్ వద్ద పోలీసు బందోబస్తు సీబీఐని కూడా ప్రభావితం చేస్తారా? సీబీఐ బృందం కర్నూలుకు రాగానే ఎల్లో మీడియా దుష్ప్రచారం మొదలైంది. సీబీఐ అధికారులు ఆస్పత్రికి కూడా వెళ్లలేదు. నేరుగా స్టేట్ గెస్ట్హౌస్కు వెళ్లి అక్కడే బస చేశారు. అయినా, పచ్చ మీడియా సీబీఐ వెంటనే అవినాశ్ను అరెస్టు చేసేస్తోందంటూ ప్రచారం మొదలెట్టింది. టీవీ చర్చల్లో తమకు అను కూలురను కూర్చోబెట్టి, అధికారులను ప్రభావితం చేసేలా చర్చలు సాగించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. మీడియా ట్రయల్ పేరిట వాస్తవాలను వక్రీకరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాన్ని చూసి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఉద యం నుంచే కర్నూలుకు తరలివచ్చారు. డిప్యుటీ సీఎం అంజాద్బాష,వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్రెడ్డి, హఫీజ్ఖాన్, సుధాకర్, శ్రీదేవి, ఆర్థర్, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి ఉదయాన్నే ఆస్పత్రికి చేరుకున్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, కడప మేయర్ సురేశ్బాబు, శాప్చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆస్పత్రికి వచ్చారు. కర్నూలుతోపాటు పులివెందుల, కడప, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల నుంచి కూడా వైఎస్సార్సీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఒక్కసారిగా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తరలిరావడంతో ఆస్పత్రి పరిసరాలు జనంతో కిక్కిరిశాయి. డీఎస్పీ విజయశేఖర్ ఆధ్వర్యంలో ఆస్పత్రి వద్ద ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రానికి కార్యకర్తల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో మరిన్ని బలగాలు సోమవారం రాత్రికి కర్నూలుకు చేరుకున్నాయి. ఆస్పత్రి ముందు కార్యకర్తల నిరసన ఎల్లో మీడియా అబద్ధపు ప్రచారాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆస్పత్రి ముందు బైఠాయించారు. ‘తండ్రిని అకారణంగా జైలుకు పంపారు. తల్లి అనారోగ్యంతో ఉంటే బాగోగులు చూసుకుంటున్న అవినాశ్ను వెంటాడి, వేధించడం ఏంటని’ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వేళ ఆస్పత్రిలోకి చొరబాటు వందలాది రోగులు, వారి సహాయకులు ఉండే ఆస్పత్రిలోకి మీడియా పదే పదే జొరబడటంపై సీనియర్ విలేకరులే మండిపడుతున్నారు. కేవలం చంద్రబాబుకు ఏదో మేలు చేయాలన్న తపనతోనే ఎల్లో మీడియా పత్రికా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తోందని విమర్శిస్తున్నారు. ఇదే ఉద్దేశంతో ఆస్పత్రి పరిసరాల్లో ఆదివారం అర్ధరాత్రి, ఎల్లో మీడియా హంగామా చేసింది. రాత్రి 11గంటల తర్వాత ఎల్లో మీడియా ప్రతినిధి ఒకరు తాను పనిచేస్తున్న సంస్థ పేరు కాకుండా మరో పేరు చెప్పి ఆస్పత్రిలోకి వెళ్లారు. శ్రీలక్ష్మి ఉన్న ఐసీయూ సమీపంలో ఓ కానిస్టేబుల్ అతన్ని నిలువరించారు. తప్పుడు పేరు చెప్పి రావాల్సిన అవసరం ఏముందని అక్కడున్న వారు కూడా గట్టిగా నిలదీశారు. దీంతో మీడియా ప్రతినిధి ఆస్పత్రి గేటు వద్దకు వచ్చి అవినాశ్ అనుచరులపై దుందుడుకుగా వ్యవహరించారు. ఇదంతా మిగతా ఎల్లో మీడియా ప్రతినిధులు వీడియో తీయబోయారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. శ్రీలక్ష్మిని పరామర్శించిన వైఎస్ విజయమ్మ వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ సోమవారం సాయంత్రం విశ్వభారతి ఆస్పత్రికి వచ్చి ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీలక్ష్మి ని పరామర్శించారు. శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అవినాశ్ను ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని, అంతా మంచే జరుగుతుందని కాంక్షించారు. ఆందోళనకరంగానే శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితి అవినాశ్ తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై విశ్వభారతి ఆస్పత్రి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. ఆమెకు నాన్ ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫారేక్షన్ (గుండె పోటు) ఉందని పేర్కొంది. యాంజియోగ్రామ్ చేశామని, రెండు రక్తనాళాల్లో బ్లాక్లు గుర్తించామన్నా రు. క్రిటికల్ కేర్ యూనిట్లో వైద్యుల బృందం పర్యవేక్షిస్తోందని తెలిపారు. ఆమెకు రక్తపోటు ఇప్పటికీ తక్కువగా ఉండటంతో అయానోట్రోపిక్ సపోర్ట్తో ఉన్నారని తెలిపారు. ఆది, సోమవారాల్లో ఆమె వాంతులు చేసుకున్నారని, అల్ట్రాసౌండ్ చేయాల్సి ఉందని తెలిపారు. మరికొద్దిరోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని వెల్లడించారు. -
ప్రశ్నించే గొంతులను నొక్కేస్తారా : విజయమ్మ
-
‘హ్యాపీ బర్త్డే అమ్మ’
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మాతృమూర్తి వైఎస్ విజయమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇవాళ (ఏప్రిల్ 19వ తేదీ) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంలో తన ట్విటర్ ద్వారా ఆయన హ్యాపీ బర్త్ డే అమ్మ అంటూ ఓ ట్వీట్ చేశారు. తల్లిని ఆప్యాయంగా హత్తుకున్న ఫొటోను సీఎం జగన్ పోస్ట్ చేశారు. Happy Birthday Amma! pic.twitter.com/4VYU6vwDxB — YS Jagan Mohan Reddy (@ysjagan) April 19, 2023 -
YSR Congress Party: ఆత్మగౌరవానికి ప్రతీక.. సవాళ్లే సోపానాలుగా..
రాజకీయంగా వైరిపక్షాలైన కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై మొగ్గలోనే వైఎస్సార్సీపీని తుంచేసేందుకు కుట్రలు చేశాయి. ప్రపంచ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ ఎదుర్కోనన్ని సవాళ్లు.. దాడులను ఎదుర్కొంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి వాటినే సోపానాలుగా మలుచుకుంటూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటం చేశారు. 45 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు.. విప్లవాత్మక సంస్కరణలతో సుపరిపాలన అందిస్తూ వైఎస్సార్సీపీని బలీయమైన శక్తిగా తీర్చిదిద్దారు. సాక్షి, అమరావతి: కాంగ్రెస్ పార్టీకి రెండుసార్లు ఒంటి చేత్తో అధికారాన్ని అందించిన వైఎస్ రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబరు 2న హెలికాప్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందారు. ఆ విషాద వార్తను తాళలేక వందలాది మంది మరణించడం.. వైఎస్ జగన్ను, ఆయన కుటుంబీకులను కలిచి వేసింది. అలా మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడానికి ఓదార్పు యాత్ర చేపడతానని కర్నూలు జిల్లా నల్లకాలువ వద్ద 2009 సెప్టెంబరు 25న నిర్వహించిన వైఎస్సార్ సంస్మరణ సభలో వైఎస్ జగన్ ప్రకటించారు. 2010 ఏప్రిల్ 9న పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఓదార్పు యాత్ర ప్రారంభించారు. ఆ యాత్రను ఆపేయాలని కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ జగన్ను ఆదేశించింది. ఇది రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేదని.. తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిలతో కలిసి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాందీకి వైఎస్ జగన్ వివరించినా లాభం లేకపోయింది. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి... వైఎస్ జగన్ ఓదార్పు యాత్రను కొనసాగించారు. దీంతో కాంగ్రెస్లోని కొన్ని శక్తులు, టీడీపీతో కుమ్మక్కై కుట్రలకు తెరతీశాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్కు, పులివెందుల శాసనసభ, కడప లోక్సభ స్థానాలకు వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ రాజీనామా చేశారు. జనం పక్షాన పోరుబాట ప్రజా సమస్యలపై వైఎస్ జగన్ పోరుబాట పట్టారు. ఈ నేపథ్యంలో జగతి పబ్లికేషన్స్కు ఆదాయపు పన్ను శాఖతో నోటీసులు జారీ చేయించడం ద్వారా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వేధింపుల పర్వాన్ని ప్రారంభించారు. అయినా వాటిని లెక్క చేయని వైఎస్ జగన్.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనే లక్ష్యంగా, రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా 2011 మార్చి 11న వైఎస్సార్సీపీ పేరును ప్రకటించారు. ఆ మరుసటి రోజే వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో వైఎస్ సమాధి వద్ద పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. 2011 ఏప్రిల్ 12న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. కడప లోక్సభ స్థానం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వైఎస్ జగన్, పులివెందుల శాసనసభ స్థానం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వైఎస్ విజయమ్మ పోటీ చేసి, రికార్డు మెజార్టీతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలతో 2011 ఆగస్టు 10న వైఎస్ జగన్ ఆస్తులపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది. నైతిక విలువలే పునాది నైతిక విలువలతో రాజకీయాలు చేయాలన్నది వైఎస్ జగన్ సిద్ధాంతం. వైఎస్సార్సీపీలో ఎవరైనా చేరాలంటే.. వారు ఆ పార్టీకి, ఆపార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు రాజీనామా చేసి రావాలని షరతు విధించారు. దానికి కట్టుబడిన 19 మంది ఎమ్మెల్యేలు, ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు రాజీనామా చేసి, వైఎస్సార్సీపీలో చేరారు. వారిని తిరిగి గెలిపించుకునేందుకు వైఎస్ జగన్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అదే సమయంలో వైఎస్ జగన్ను విచారణ పేరుతో పిలిచిన సీబీఐ 2012, మే 27న అరెస్టు చేసింది. దీన్ని ప్రజలు నిరసిస్తూ ఉప ఎన్నికల్లో 17 శాసనసభ, నెల్లూరు లోక్సభ స్థానంలో వైఎస్సార్సీపీని గెలిపించారు. 2013 సెప్టెంబరు 24న వైఎస్ జగన్కు కోర్టు బెయిల్ ఇచ్చింది. 16 నెలలపాటు అక్రమంగా నిర్బంధించడం వల్ల ప్రజల్లో ఆదరణ మరింత పెరిగింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఒంటరిగా బరిలోకి దింగింది. టీడీపీ–బీజేపీ–జనసేనతో జట్టుకట్టి బరిలోకి దిగింది. మోదీ ప్రభంజనంలో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారానికి దూరమైంది. 67 శాసనసభ స్థానాలు గెలుచుకుని బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. చంద్రబాబు కుట్రతో వైఎస్ జగన్ రెక్కలకష్టంతో గెలిచిన∙23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించారు. వారిపై అనర్హత వేటు వేయాలని జగన్ పోరాటం చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా రాజకీయాల్లో నైతిక విలువకు నాటి సీఎం చంద్రబాబు సమాధి కట్టారు. దీన్ని నిరసిస్తూ.. ప్రజల్లోనే తేల్చుకుంటానని ప్రకటిస్తూ 2017 అక్టోబర్ 26న శాసనసభ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు. చరిత్రాత్మకం.. ప్రజా సంకల్పం తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి 2017 నవంబర్ 6న ప్రజా సంకల్ప పాదయాత్రను వైఎస్ జగన్ ప్రారంభించారు. 14 నెలలుపాటు 3,648 కి.మీ.ల దూరం ఈ యాత్ర సాగింది. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ప్రజలు అఖండ విజయాన్ని అందించారు. దేశ చరిత్రలో 50 శాతానికిపైగా ఓట్లతో 151 శాసనసభ (87 శాతం), 22 లోక్సభ (88 శాతం) స్థానాలను వైఎస్సార్సీపీ దక్కించుకుంది. 2019 మే 30న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తొలి మంత్రివర్గంలో 56 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చి.. ఐదు డిప్యూటీ సీఎం పదవుల్లో నాలుగు ఆ వర్గాలకే ఇచ్చి.. హోంశాఖ మంత్రిగా తొలిసారిగా ఎస్సీ మహిళను నియమించి సామాజిక విప్లవానికి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. 2022 ఏప్రిల్ 11న పునర్ వ్యవస్థీకరణ ద్వారా మంత్రివర్గంలో ఏకంగా 70 శాతం పదవులు ఆ వర్గాల వారికి ఇచ్చి, సామాజిక సాధికారత సాధనలో దేశానికే రోల్ మోడల్గా నిలిచారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు.. మహిళలకు రిజర్వు చేసేలా చట్టం తెచ్చి మరీ పదవులు ఇచ్చారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ, స్థానిక సంస్థల పదవుల్లోనూ ఆ వర్గాలకే పెద్దపీట వేశారు. అధికారంలోకి వచ్చిన 45 నెలల్లోనే 98 శాతానికిపైగా హామీలను అమలు చేశారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు వెన్నుదన్నుగా నిలిచారు. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజల గుమ్మం వద్దకే ప్రభుత్వాన్ని తీసుకెళ్లారు. 13 జిల్లాలను పునర్ వ్యవస్థీకరించి.. 26 జిల్లాలను ఏర్పాటు చేశారు. ఎన్నో పథకాల ద్వారా పేద, దిగువ మధ్యతరగతి వర్గాలకు అండగా నిలిచారు. జనరంజక పాలన అందిస్తుండటంతో ప్రజలు పంచాయతీ, మున్సిపాలిటీ, జిల్లా పరిషత్, ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు, అభ్యర్థులను గెలిపించారు. వైఎస్సార్సీపీ ప్రస్థానంలో కీలక ఘట్టాలు -
రేపటి ప్రభుత్వానికి పాలేరు సింహద్వారం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘షర్మిలమ్మ అడ్రస్ ఈరోజు పాలేరు అయింది. తెలంగాణకు ప్రధాన గుమ్మం ఖమ్మం అయితే.. రేపటి ప్రభుత్వానికి పాలేరు సింహద్వారం అవుతుంది. ఎవరికి ఏ కష్టం వచ్చినా.. బాధ వచ్చినా చెప్పుకునే అడ్రస్ అవుతుంది ఈ కార్యాలయం’అని వైఎస్ విజయమ్మ అన్నారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం సాయిగణేశ్నగర్లో పాలేరు నియోజకవర్గ వైఎస్సార్ తెలంగాణ పార్టీ క్యాంపు కార్యాలయాన్ని గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ‘నేను మీ బిడ్డను, మీతో ఉంటాను అని.. పాలేరు ప్రజలకు ఇక్కడి మట్టి సాక్షిగా ప్రమాణం చేసిన షర్మిలమ్మను ఆశీర్వదించాలి’అని కోరారు. షర్మిల తెలంగాణ బిడ్డ కాదనే వారికి ఆమె ప్రేమ.. తెలంగాణలో షర్మిలమ్మ ఉనికి పోయిందనే వారికి ఆమె మానవత్వమే జవాబు చెబుతుందని పేర్కొన్నారు. వైఎస్ది జగమంత కుటుంబం పాలేరు నియోజకవర్గం వేదికగా నిర్మిస్తున్న పార్టీ కొత్త కార్యాలయం వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మదినమైన జూలై 8న ప్రారంభించనున్నట్లు విజయమ్మ తెలిపారు. వైఎస్ తన కుటుంబాన్ని ప్రేమించిన దానికంటే ఎక్కువగా ప్రజలను ప్రేమించారని ఆమె చెప్పారు. ఆయనది జగమంత కుటుంబమని, రాజశేఖరరెడ్డి కుటుంబం అంటేనే ప్రజల కుటుంబమని చెప్పారు. రాజశేఖరరెడ్డి ఆశయాల సాధన కోసం షర్మిల ప్రయత్నం చేస్తోందని అన్నారు. షర్మిలమ్మ పాలేరులో పోటీకి నిర్ణయించుకోవడం యాదృచ్ఛికం కాదని, అది దైవేచ్ఛగా భావిస్తున్నామని తెలిపారు. తమకు పులివెందుల ఎలాగో.. షర్మిలకు పాలేరు కూడా అలాగేనని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు, రాష్ట్ర కోఆర్డినేటర్ వాడుక రాజగోపాల్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గడిపల్లి కవిత, పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్బాబు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్టీపీ పాలేరు నియోజకవర్గ కార్యాలయం ప్రారంభం
-
ఎమ్మెల్సీ తలశిల రఘురాంను పరామర్శించిన వైఎస్ విజయమ్మ
-
ధర్మారెడ్డికి వైఎస్ విజయమ్మ పరామర్శ
సాక్షి, నంద్యాల(జూపాడుబంగ్లా): పుత్రశోకంతో బాధపడుతున్న టీటీడీ ఈఓ ధర్మారెడ్డి దంపతులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాతృమూర్తి వైఎస్ విజయమ్మ పరామర్శించారు. మంగళవారం ఆమె ధర్మారెడ్డి స్వగ్రామమైన పారుమంచాలకు చేరుకొన్నారు. ముందుగా ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి చిత్రపటం వద్ద పూలువేసి నివాళులర్పించారు. అనంతరం ధర్మారెడ్డి దంపతులతో ప్రత్యేకంగా మాట్లాడి ఓదార్చారు. అధైర్యపడవద్దని, అండగా ఉంటామని తెలిపారు. వైఎస్ విజయమ్మ పారుమంచాలకు వస్తున్నారనే విషయం తెలిసి గ్రామస్తులు తండోపతండాలుగా ధర్మారెడ్డి ఇంటివద్దకు చేరుకొన్నారు. ఇంటి నుంచి బయటకు రాగానే గ్రామస్తులు ఆనందంతో కేకలువేస్తూ అభివాదం చేశారు. చదవండి: (టీటీడీ ఈవో ధర్మారెడ్డికి సీఎం జగన్ పరామర్శ) -
నూతన వధూవరులకు సీఎం జగన్ ఆశీర్వాదం
సాక్షి, రాప్తాడురూరల్: అనంతపురం రూరల్ మండలం పూలకుంట సర్పంచ్ కాటప్పగారి కృష్ణారెడ్డి కుమారుడు కాటప్పగారి అజయ్ విక్రాంత్రెడ్డి దంపతులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి ఆశీర్వదించారు. అజయ్ విక్రాంత్రెడ్డికి 10 రోజుల క్రితం పులివెందులకు చెందిన దీప్తితో వివాహమైంది. నవ దంపతులు శనివారం రాత్రి ఇడుపులపాయలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతిని కలిసి ఆశీర్వాదం అందుకున్నారు. చదవండి: (భారీ వరదకూ చెక్కుచెదరకుండా పింఛా ప్రాజెక్టు పునరుద్ధరణ) -
ఖమ్మం: వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి భూమి పూజ
-
‘గొప్ప సంకల్పంతో షర్మిల మీ ముందుకు వచ్చింది’
ఖమ్మం: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పాలేరు ప్రజలు ఆశీర్వదించాలని వైఎస్ విజయయ్మ విన్నవించారు. ఈరోజు(శుక్రవారం) వైఎస్సార్టీపీ కార్యాలయానికి భూమి పూజ కార్యక్రమంలో భాగంగా షర్మిల, విజయమ్మలు జిల్లాకు వచ్చారు. దీనిలో భాగంగా వైఎస్సార్టీపీ కార్యాలయానికి షర్మిల, విజయమ్మలు భూమి పూజ చేశారు. అనంతరం విజయమ్మ మాట్లాడుతూ.. తన బిడ్డను ఆశీర్వదించాలని పాలేరు ప్రజలను కోరారు. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరని, గొప్ప సంకల్పంతో షర్మిల మీ ముందుకు వచ్చిందని ఈ సందర్భంగా విజయమ్మ పేర్కొన్నారు. కాగా, పాలేరు నుంచి పోటీ చేస్తున్నట్లు వైఎస్ షర్మిల ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. -
నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ విజయమ్మ
పులివెందుల(వైఎస్సార్ జిల్లా): సీఎం వైఎస్ జగన్ వ్యక్తిగత కార్యదర్శి దిద్దేకుంట రవిశేఖర్ యాదవ్ కుమార్తె హేమలత వివాహం గంగాధరతో ఈనెల 3వ తేదీన పులివెందులలో జరిగింది. బుధవారం నూతన వధూవరులను భాకరాపురంలోని ముఖ్యమంత్రి స్వగృహంలో మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ ఆశీర్వదించారు. కార్యక్రమంలో సీఎం వ్యక్తిగత కార్యదర్శి రవిశేఖర్ యాదవ్, కుమారుడు రామలింగేశ్వర, తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఆహా ఏమి రుచి.. తిన్నారు మైమరచి -
కుమార్తె ను చూడడానికి వెళ్తుంటే అడ్డుకుంటారా : వైఎస్ విజయమ్మ
-
నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది : బ్రదర్ అనిల్ కుమార్
-
షర్మిల పోరుతో తెలంగాణ సర్కారులో అలజడి
నర్సంపేట: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల చేపట్టిన పాదయాత్రతో తెలంగాణ ప్రభుత్వంలో అలజడి మొదలైందని దివంగత నేత వైఎస్సార్ సతీమణి వై.ఎస్.విజయమ్మ అన్నారు. షర్మిల చేపట్టిన పాదయాత్ర ఆదివారం వరంగల్ జిల్లా నర్సంపేటకు చేరుకుంది. యాత్ర 3,500 కిలోమీటర్లకు చేరుకున్న సందర్భంగా షర్మిలతో కలసి విజయమ్మ వైఎస్సార్ పైలాన్ను ఆవిష్కరించారు. అనంతరం విజయమ్మ మాట్లాడుతూ గొప్ప ఆశయం, సంకల్పంతో యాత్ర సాగుతోందన్నారు. పాదయాత్రకు ప్రజలనుంచి మంచి ఆదరణ వస్తోందని చెప్పారు. ‘ఒక మహిళ పదేళ్ల కిందట 3,200 కిలోమీటర్లు నడిచింది, ఆ మహిళే ఇప్పుడు మళ్లీ 3,500 కిలోమీటర్లు నడిచింది’అని షర్మిలను ఉద్దేశించి అన్నారు. దేశ చరిత్రలో ఇదొక రికార్డు అని పేర్కొన్నారు. ఇది తల్లిగా తనకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. షరి్మల వైఎస్సార్కు గారాలపట్టి అని చెప్పారు. వైఎస్ తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి లేదని, షర్మిల ఎక్కడికి వెళ్లినా వైఎస్సార్ను గుర్తు చేస్తున్నారని పేర్కొన్నారు. జలయజ్ఞంలో భాగంగా వైఎస్సార్ రూ.1.40 లక్షల కోట్లతో 86 ప్రాజెక్టులు చేపట్టారన్నారు. దీంతో ప్రజల గుండెల్లో వైఎస్సార్ గుడి కట్టుకున్నారన్నారు. తెలంగాణలో సంక్షేమం, సమన్యాయం లేవని, అందుకే వైఎస్సార్ తెలంగాణ పార్టీ మీ ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు మౌనంగా ఉన్నాయని, అందుకే షర్మిల ప్రశ్నించే నాయకురాలిగా మీ ముందుకు వచ్చారని చెప్పారు. షర్మిల ఆందోళనలు చేస్తుంటే మంగళవారం వ్రతాలు అని హేళన చేస్తున్నారని, కానీ తెలంగాణలో ఆమె ఒక ప్రభంజనంలా మారబోతోందని, దమ్ముంటే షర్మిలతో ఒక రోజు పాదయాత్రకు రావాలని సవాల్ విసిరారు. రాబోయే యుద్ధానికి ప్రజలు సమరశంఖం పూరించాలని పిలుపునిచ్చారు. షర్మిలతో నిలబడి సరికొత్త ప్రభుతాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఇదీ చదవండి: కేసీఆర్కు పాలించే అర్హత పోయింది -
వైఎస్సార్ మన మధ్య లేకున్నా అందరి గుండెల్లో ఉన్నారు : వైఎస్ విజయమ్మ
-
రాజశేఖర్ రెడ్డి బిడ్డను ఆశీర్వదించిన మీ అందరికి ధన్యవాదాలు : వైఎస్ షర్మిల
-
మీ అందరి దీవెనలే షర్మిలను నడిపిస్తున్నాయి : వైఎస్ విజయమ్మ
-
మరో మైలురాయి దాటిన షర్మిల పాదయాత్ర
సాక్షి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. ఈ క్రమంలో పాదయాత్ర 3వేల కిలోమీటర్లు మైలురాయి దాటిన సందర్భంగా హజీపూర్ వద్ద వైఎస్ఆర్ పైలాన్ను వైఎస్ విజయమ్మ, షర్మిల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ.. ‘మీ అందరి దీవెనలే షర్మిలను నడిపిస్తున్నాయి. 3వేల కిలోమీటర్లు నడవటం సాధారణ విషయం కాదు. షర్మిల పాదయాత్ర మనుషులతో మమేకమయ్యే యాత్ర. పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను షర్మిల తెలుసుకుంటోంది. పాదయాత్ర అంటే గుర్తుకొచ్చే పేరు వైఎస్ఆర్. వైఎస్ఆర్ ఆశయాలతోనే షర్మిల పాదయాత్ర చేస్తోంది. ఇది ఓట్ల కోసం చేస్తున్న యాత్ర కాదు. సమస్యలకు ముగింపు పలకాలని చేస్తున్న యాత్ర అని స్పష్టం చేశారు. అనంతరం, వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. ‘మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి బిడ్డను ఆశీర్వదించిన మీ అందరికీ ధన్యవాదాలు. మహానేతకు మరణం లేదని మరోసారి నిరూపించారు. నడిచింది నేనైనా.. నడిపించింది మీరే. వైఎస్ఆర్ పేదల కోసం ఎన్నో పథకాలు అమలు చేశారు’ అని తెలిపారు. -
వైఎస్ఆర్ రైతు పక్షపాతిగా నిలిచారు: గవర్నర్ బిశ్వభుషణ్ హరిచందన్
-
అసామాన్య సేవలు అందిస్తున్న మానవత మూర్తులకు వందనం: సీఎం జగన్
-
రాష్ట్రాభివృద్ధికి వైఎస్సార్ విశేషమైన కృషి చేశారు: గవర్నర్
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ తన మార్క్ పాలనతో జాతీయస్థాయిలో గుర్తింపు పొందారని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. అలాంటి మహానేత పేరుతో అవార్డులు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వరుసగా రెండో ఏడాది 'వైఎస్సార్ జీవిత సాఫల్య, వైఎస్సార్ సాఫల్య-2022' పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, విశిష్ట అతిథిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆత్మీయ అతిథిగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ.. 'ఆంధ్రప్రదేశ్ గొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగింది. బహుళ ప్రతిభలు కలగలిసిన రాష్ట్రం మనది. కళలు, చేతివృత్తులు, కూచిపూడి నృత్యం ఇక్కడ ప్రసిద్ధి చెందాయి. వెయ్యేళ్లు పైబడ్డ తెలుగు భాష చరిత్ర కలిగి ఉంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, గొప్ప వ్యక్తులు కలిగిన నేల ఆంధ్రప్రదేశ్. దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి రాష్ట్రాభివృద్ధికి విశేష కృషి చేశారు. 4 సార్లు ఎంపీ, 5 సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. దేశ చరిత్రలోనే వైఎస్సార్ అరుదైన నాయకుడిగా నిలిచారు. ప్రజల సమస్యలను పాదయాత్ర ద్వారా తెలుసుకున్న గొప్ప నాయకుడు వైఎస్సార్. సీఎం అవ్వగానే సంక్షేమ కార్యక్రమాలతో పేదలకు మేలు చేశారు. ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, 108, పావలా వడ్డీ, గృహ నిర్మాణం, ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేశారు. గ్రామీణ పేదరికం నిర్మూలనకు కృషి చేశారు. జలయజ్ఞం ద్వారా లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందించారు. రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేలా కృషి చేశారని' గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. చదవండి: (అవార్డులు అందుకుంటున్న ప్రతి ఒక్కరికీ అభినందలు: సీఎం జగన్) -
అవార్డులు అందుకుంటున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘వైఎస్సార్ జీవిత సాఫల్య, వైఎస్సార్ సాఫల్య–2022’ పురస్కారాలను మంగళవారం ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వరుసగా రెండో ఏడాది ఈ అవార్డులు అందించారు. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్లో అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, విశిష్ట అతిథిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆత్మీయ అతిథిగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. 'మహనీయుల సేవలకు వందనం. సామాన్యుల్లో ఉన్న అసామాన్యులకు.. అసామాన్య సేవలు అందిస్తున్న మానవతా మూర్తులకు వందనం. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో అవార్డులు ఇస్తున్నాం. సంస్కృతి, సంప్రదాయాలకు వారధులుగా ఉన్నవారికి అవార్డులు అందజేస్తున్నాం. వెనకబాటు, అణచివేత, పెత్తందారీ పోకడలపై దండయాత్ర చేస్తున్న సామాజిక ఉద్యమకారులు, కళలు, పాత్రికేయులు, పారిశ్రామిక దిగ్గజాలకు అవార్డులు అందిస్తున్నాం. ఈ రోజు అవార్డులు అందుకుంటున్న ప్రతి ఒక్కరికీ అభినందలు' అని సీఎం జగన్ పేర్కొన్నారు. వ్యవసాయం, కళలు–సంస్కృతి, సాహిత్యం, మహిళా, శిశు సాధికారత, విద్య, జర్నలిజం, వైద్యం, పరిశ్రమ రంగాల్లో విశేషకృషి చేసిన 35 మంది వ్యక్తులు, సంస్థలకు 30 అవార్డులను అందజేయనున్నారు. ఇందులో 20 వైఎస్సార్ జీవిత సాఫల్య, 10 వైఎస్సార్ సాఫల్య పురస్కారాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారాల తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘వైఎస్సార్’ అవార్డులను అందజేస్తోంది. వ్యవసాయంలో 5, కళలు–సంస్కృతిలో 5, సాహిత్యంలో 3, మహిళా, శిశు సాధికారతలో 3, విద్యలో 4, జర్నలిజంలో 4, వైద్యంలో 5 అవార్డులు, పరిశ్రమల విభాగంలో ఒక అవార్డును ప్రదానం చేయనున్నారు. ఆయా రంగాల్లో సామాజిక అభ్యున్నతి కోసం అసామాన్య కృషిచేసి, విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలకు అవార్డుల్లో రాష్ట్ర హైపవర్ స్క్రీనింగ్ కమిటీ పెద్దపీట వేసింది. వైఎస్సార్ జీవిత సాఫల్య అవార్డు కింద రూ.10 లక్షల నగదుతో పాటు వైఎస్సార్ కాంస్య విగ్రహం, జ్ఞాపిక, ప్రశంసాపత్రం, వైఎస్సార్ సాఫల్య అవార్డుకు రూ.5 లక్షల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం బహూకరించనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఒంగోలు: వైవీ సుబ్బారెడ్డి ఇంటికి వైఎస్ విజయమ్మ
సాక్షి, ఒంగోలు: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తల్లిని వైఎస్ విజయమ్మ పరామర్శించారు. ఒంగోలులో వైవీ సుబ్బారెడ్డి ఇంటికి చేరకున్న విజయమ్మ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పిచ్చమ్మ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విజయమ్మతో పాటు వైవీ సుబ్బారెడ్డి సోదరుడు వైవీ భద్రారెడ్డి, వైవీ చెల్లెలు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి సతీమణి సత్యదేవి కూడా ఉన్నారు. చదవండి: (ప్రభుత్వానికి 26 జిల్లాలు సమానమే: మంత్రి బొత్స) -
వైవీ సుబ్బారెడ్డి తల్లిని పరామర్శించిన వైఎస్ విజయమ్మ
-
కృష్ణంరాజు భార్యకు వైఎస్ విజయమ్మ పరామర్శ
బంజారాహిల్స్ (హైదరాబాద్): మాజీ కేంద్రమంత్రి, విలక్షణ నటుడు కృష్ణంరాజు మృతి పట్ల వైఎస్ విజయమ్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశా రు. సోమవారం జూబ్లీ హిల్స్లో కృష్ణంరాజు సతీమణి శ్యామలతో పా టు కుటుంబ సభ్యులను విజయమ్మ పరామర్శించారు. కృష్ణంరాజుతో తన భర్త వైఎస్సార్కు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. వైఎస్సార్ తరచూ కృష్ణంరాజు గొప్పతనం గురించి చెబుతుండేవారని గుర్తుచేసుకున్నారు. -
‘వైఎస్సార్లా తెలంగాణ కూడా స్వచ్ఛమైనది’
సాక్షి, వనపర్తి: మహానేత వైఎస్సార్ కుటుంబాన్ని ప్రేమించే ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలని పేర్కొన్నారు వైఎస్ విజయమ్మ. తెలంగాణలో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర 2వేల కిలోమీటర్ల మైలురాయి పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం జిల్లాలోని కొత్తకోట బస్టాండ్ వద్ద పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వైఎస్ విజయమ్మ పాల్గొని ప్రసంగించారు. ‘‘వైఎస్సార్ కుటుంబాన్ని ప్రేమించే ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతం వైఎస్సార్. వైఎస్సార్లా తెలంగాణ కూడా స్వచ్ఛమైంది. మీ ప్రేమ, ఆప్యాయతలతోనే షర్మిల 2వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేయగలిగింది. నడిచింది షర్మిలే అయినా.. నడిపించింది మీరే అంటూ అక్కడి కార్యక్రమానికి హాజరైన ప్రజలను, వైఎస్సార్టీపీ నేతలు.. కార్యకర్తలను ఉద్దేశించి వైఎస్ విజయమ్మ ధన్యవాదాలు తెలియజేశారు. బంగారు తెలంగాణ కోసమే షర్మిల అడుగులు వేస్తోందని, అందుకు తెలంగాణ ప్రజానీకం ఆశీర్వాదం కావాలని ఆకాక్షించారు వైఎస్ విజయమ్మ. ఇదిలా ఉంటే.. 148 రోజుల్లో 2వేల కిలోమీటర్ల ప్రజాప్రస్థానం పూర్తి చేసుకున్నారు వైఎస్ షర్మిల. వనపర్తి జిల్లాలో షర్మిల పాదయాత్ర మైలురాయి దాటగా.. కొత్తకోట వద్ద పైలాన్ ఆవిష్కరించారు. ఇదీ చదవండి: తెలంగాణలో వెస్ట్ బెంగాల్ వ్యూహమా? -
నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ విజయమ్మ
సాక్షి, అనంతపురం: నగరంలోని కేటీఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వివాహ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ హాజరయ్యారు. శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్ మధుసూదన్రెడ్డి, జానపద, సృజనాత్మక కార్పొరేషన్ డైరెక్టర్ శైలశ్రీ కుమార్తె హేమశ్రీ, వెంకట సందీప్రెడ్డి వివాహం గురువారం స్థానిక కేటీఆర్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈసందర్భంగా నూతన వధూవరులను వైఎస్ విజయమ్మ ఆశీర్వదించారు. చదవండి: (నూతన దంపతులను ఆశీర్వదించిన వైఎస్ విజయమ్మ) -
వైఎస్ విజయమ్మకు త్రుటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, కర్నూలు: వైఎస్సార్సీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు గురువారం త్రుటిలో ప్రమాదం తప్పింది. అనంతపురంలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని హైదరాబాద్ వెళుతుండగా కర్నూలు శివారులో ఆర్టీసీ కాలనీ వద్ద ఆమె ప్రయాణిస్తున్న వాహనం ఎడమ వైపు రెండు టైర్లు పేలాయి. డ్రైవర్ అప్రమత్తమై వేగాన్ని తగ్గించి ఆపడంతో ప్రమాదం తప్పింది. అనంతరం కర్నూలు బీక్యాంప్లో నివాసం ఉంటున్న దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి స్నేహితుడు అయ్యపురెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుసుకుని ఆమె మరో వాహనంలో అక్కడికి చేరుకున్నారు. అయ్యపురెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ఏపీఎస్పీ రెండో పటాలంలోని అతిథి గృహానికి చేరుకున్నారు. అక్కడ భోజనం చేసి, విశ్రాంతి తీసుకున్నారు. ఈలోగా పేలిపోయిన టైర్లను మార్చి వాహనాన్ని సిద్ధం చేసుకుని డ్రైవరు అక్కడికి చేరుకున్నారు. మధ్యాహ్నం 3.20 గంటలకు విజయమ్మ కర్నూలు నుంచి హైదరాబాద్కు బయలుదేరి వెళ్లారు. విజయమ్మ వెంట ఇద్దరు కుటుంబసభ్యులున్నారు. చదవండి: (నూతన దంపతులను ఆశీర్వదించిన వైఎస్ విజయమ్మ) -
నూతన దంపతులను ఆశీర్వదించిన వైఎస్ విజయమ్మ
సాక్షి, సత్యసాయి జిల్లా: కదిరికి చెందిన ఏపీపీఎస్సీ సభ్యులు జీవీ సుధాకర్రెడ్డి కుమార్తె లక్ష్మి సైనా, వైఎస్సార్ జిల్లాకు చెందిన వీర ప్రతాప్రెడ్డి కుమారుడు వీర శివారెడ్డి వివాహ రిసెప్షన్ మంగళవారం హైదరాబాద్లో జరిగింది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాతృమూర్తి వైఎస్ విజయమ్మ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, పలువురు ప్రముఖులు రిసెప్షన్కు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. చదవండి: (ఘనంగా ఎమ్మెల్యే కుమారుడి వివాహ రిసెప్షన్) -
విజయమ్మ ఎపిసోడ్: టీడీపీకి, ఆ వర్గం మీడియాకు నిరాశే మిగిల్చిందా!
ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏమి చేసినా విన్నూత్నంగా , పారదర్శకంగా ఉండేలా చేస్తుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్లీనరీ సందర్భంగా ఆయన అనుసరించిన విదానం అలాగే కనిపిస్తుంది. ముఖ్యమంత్రి మాతృమూర్తి, పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పార్టీ నుంచి తప్పుకుంటున్న ప్రకటించిన వైనం సంచలనంగా ఉంది. ఈ ఉదంతం దేశంలోనే అరుదైన ఘట్టంగా చెప్పాలి. ఒక కుటుంబం అందులోను రాజకీయ కుటుంబంలో భిన్నాభిప్రాయాలు వచ్చాయన్న ప్రచారం జరిగినప్పుడు ,వాటిని వివాదాస్పదం చేయాలని ప్రత్యర్ధి వర్గాలు ప్రయత్నిస్తున్నప్పుడు ఒక రాజకీయ నేత ఇంత బహిరంగంగా తేల్చేస్తారని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. తల్లి,కుమారుల మధ్య ఏదో జరిగిందని విస్తారంగా చెప్పడం ద్వారా వైసీపీకి నష్టం చేయాలని అటు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా ప్రయత్నిస్తున్నప్పుడు జగన్ వ్యూహాత్మకంగా ఈ వైఖరి అనుసరించడం ఆసక్తికరమైన విషయమే. బహుశా దేశ చరిత్రలో ఎక్కడా ఒక పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు అదే పార్టీ ప్లీనరీలో ప్రకటించడం జరిగి ఉండదు. ఒకవేళ అలా జరిగితే పెద్ద గొడవగా మారుతుంది. కానీ అందుకు భిన్నంగా విజయమ్మ వ్యవహరించిన శైలి, జగన్ ఆమెను గౌరవించిన తీరు కచ్చితంగా అభినందనీయం. వైఎస్ కుటుంబంలో ఏది పెద్ద రహస్యం కాదని, చెప్పేదేదో ఫెయిర్ గా చెబుతామని వారు స్పష్టం చేసినట్లుగా ఉంది. అంతకుముందు జగన్ సోదరి షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన తర్వాత స్పందించిన తీరు కూడా అందరిని ఆకట్టుకుంది. షర్మిల పార్టీ పెట్టడం తమకు ఆమోదయోగ్యం కాదని, అయినా ఆమె తన అభీష్టం ప్రకారం పెట్టుకున్నారని , ఆమెకు ఆల్ ద బెస్ట్ చెబుతామని ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా ప్రకటింపచేశారు. దాంతో ఆ వ్యవహారం అక్కడితో ముగిసింది. షర్మిల కూడా అంతే హుందాగా వ్యవహరించి తనకు సోదరుడితో విభేదాలు లేవని తెలిపారు. ఒక మీడియా ఆమెను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆ విషయంలో చాలా సమయస్పూర్తిగా సమాధానాలు ఇచ్చారు. ఈ విషయాలపై చిలవలు,పలవలుగా కధనాలు వండి వార్చడానికి కొన్ని మీడియా సంస్థలు సహజంగానే ప్రయత్నిస్తుంటాయి. వార్త ఇవ్వడం వరకు ఎవరూ ఆక్షేపించారు. కాని ఉన్నవి,లేనివి చెప్పి వక్రీకరించడమే దారుణంగా ఉంటుంది. అమ్మ అవుట్ అని, బలవంతంగా రాజీనామా చేయించారని , ఇక మరో టార్గెట్ ఫలానా అని తమకు తోచిన కథనాలు రాశారు. వీటన్నిటికి చెక్ పెడుతూ విజయమ్మ చేసిన ప్రసంగం అందరిని ఆకట్టుకుంది. ఆమె ఎక్కడా తొణకలేదు. బెణకలేదు. వ్యతిరేకార్దం వచ్చేలా మాట్లాడలేదు. ప్లీనరీలో మెదటి రోజు పాల్గొన్న సుమారు రెండు లక్షలమందికే కాక, టీవీల ద్వారా చూసే లక్షలాది ప్రజలకు అర్దం అయ్యేలా తన ఉపన్యాసం చేశారు.తన మధ్దతు ఎల్లవేళలా జగన్ కు ఉంటుందని, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణలో షర్మిల పార్టీకి అండగా నిలవాలని అనుకున్నప్పుడు అనవసర వివాదాలు తలెత్తకుండా ఉండడానికే తాను ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకుంటున్నానని విస్పష్టంగా వివరించారు. విజయమ్మ పార్టీకి అదే హోదాలో ఉండాలని ఎక్కువ మంది కార్యకర్తలు కోరుకుని ఉండవచ్చు. కాని ఆమె తన కారణాలను తెలియచేశారు. కాగా విజయమ్మ ప్రసంగం ఆద్యంతం జగన్ తో సహా సభికులంతా ఆసక్తిగా విన్నారు. ఆ తర్వాత ఆమె తన సీటు వద్దకు వెళ్లినప్పుడు జగన్ ఆమెను సాదరంగా రిసీవ్ చేసుకుని కూర్చోబెట్టారు. అంటే దీని అర్ధం ఏమిటి? తమ మధ్య విబేధాలు లేవని, ప్రేమాభిమానాలు తగ్గలేదని వారు రుజువు చేసుకున్నారు. సాధారణంగా ఒక పార్టీ నుంచి తప్పుకున్నానని చెప్పిన తర్వాత వారు అక్కడ నుంచి వెళ్లిపోతారు. కానీ విజయమ్మ అలా చేయకుండా తన కుమారుడి పక్కనే సాయంత్రం వరకు కూర్చోవడం గమనించదగ్గ అంశం. అక్కడితో ఆగలేదు. మరుసటి రోజు కూడా ప్లీనరీలో పాల్గొని ఒక వర్గం మీడియాకు సమాధానం చెప్పారు. విజయమ్మ ఉపన్యాసంలోని కొన్ని అంశాలను చూద్దాం. ‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి వారసులుగా జగన్, షర్మిల.. ఇద్దరూ ఆయన భావాలను పుణికి పుచ్చుకున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు నా కుమారుడికి తోడుగా ఉన్నా. ఇక్కడ సంతోషంగా ఉన్న సమయంలో తెలంగాణలో వైఎస్సార్ ఆశయ సాధన కోసం షర్మిల పోరాడుతోంది. ఇప్పడు ఆమెకు తోడుగా ఉండమని నా మనస్సాక్షి చెబుతోంది. రెండు రాష్ట్రాల్లో రాజకీయ వివాదాలకు తావులేకుండా వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలిగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నా’’ అని ఆమె ప్రకటించారు. ఇక్కడ ఎక్కడా ఆమె ఇద్దరు పిల్లల మధ్య తేడా చూపించాలని అనుకోలేదు. జగన్ ఇప్పటికే ముఖ్యమంత్రిగా ఎన్నికై ప్రజల మద్దతు పొందుతున్నందున ఆమె షర్మిలకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు భిన్నంగా షర్మిల గురించి ఎక్కువగా మాట్లాడి ఉంటే అది చర్చనీయాంశం అయి ఉండేది. అలాంటి అవకాశం ఆమె ఇవ్వలేదు. ఈ సందర్భంగా ఎల్లో మీడియా ద్వేషపూరిత ప్రచారం చేస్తోందని ఆమె కుండబద్దలు కొట్టారు. తెలంగాణలో ముందుగా ఎన్నికలు వస్తాయి. అక్కడ షర్మిల ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆమె తెలంగాణ ప్రయోజనాలపై మాట్లాడుతోంది. ఇక్కడ జగన్ ఏపీ ప్రజల కోసం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో సీఎంగా జగన్కు ఒక స్టాండ్ ఉంటుంది. అదే సమయంలో ఇద్దరికీ వేర్వేరు విధానాలు తప్పవు. ఇద్దరూ వేర్వేరు రాష్ట్రాల ప్రతినిధులుగా ఉండే పరిస్థితులు వస్తాయని ఊహించలేదు. ఇది ప్రజాహితం కోసం దేవుడు జరిపిస్తున్నాడని నమ్ముతున్నా.జగన్ తనను తాను నిరూపించుకుంటూ మంచి సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నారు. మీ అందరి దయతో, తిరుగులేని మెజార్టీతో రెండోసారీ సీఎం అవుతారనే నమ్మకం, విశ్వాసం నాకు ఉంది. ఈ రోజు ప్రజలందరి ప్రేమ, అభిమానాన్ని సంపాదించిన నా బిడ్డ జగన్ను చూసి చాలా గర్వపడుతున్నా. మనసుతో చేసే ప్రజా పరిపాలనను కళ్లారా చూస్తున్నాఅని అన్నారు. ఇంత క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా విజయమ్మ ఏదో జగన్ కు వ్యతిరకంగా ఉన్నారనో, లేక జగన్ తన తల్లిని విస్మరించారనో ప్రచారం చేస్తే ఎవరైనా నమ్ముతారా? ఒక్కసారి గత చరిత్రను చూద్దాం. విజయమ్మ తన రాజకీయ సరళి మార్చుకుంటూ చేసిన ప్రసంగంలో జగన్ పై ప్రశంసల జల్లు కురిపిస్తే, తెలుగుదేశం వ్యవస్థాపకుడు , మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు తన అల్లుడు చంద్రబాబును ఉద్దేశించి ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేసింది గుర్తుకు తెచ్చుకుంటే వీరి మద్య ఉన్న వ్యత్యాసం తేలికగా అర్ధం అవుతుంది. తన మామ ఎన్.టి.ఆర్.ను పదవీచ్యుతుడిని చేసే క్రమంలో వైస్రాయి హోటల్ వద్ద ఆయనపై చెప్పలు వేయడం మొదలు , తాను మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని కోరుతూ ఎన్.టి.ఆర్.నిస్సహాయంగా నిండు శాసనసభలో నిలబడిన వరకు జరిగిన ఘటనలు చూస్తే ఎవరు ఎలా వ్యవహరించారో విదితమవుతుంది. ఆనాటి స్పీకర్ గా ఉన్న యనమల రామకృష్ణుడు పదే,పదే మైక్ కట్ చేసి ఎన్ టి.ఆర్.ను పరాభవిస్తుంటే, చంద్రబాబు నిశ్శబ్ద ప్రేక్షకుడిగా ఉండిపోయారేకాని వారించలేదు. ఆ తర్వాత ఎన్.టి.ఆర్.ను పార్టీ నుంచి తొలగించి, అధ్యక్ష పదవిని కూడా చంద్రబాబు కైవసం చేసుకున్నారు మరో వైపు విజయమ్మ పార్టీ ప్లీనరీలో మాట్లాడి పూర్తి గౌరవం పొందారు.ముఖ్యమంత్రి పక్కన కూర్చుని సభను ఆలకించారు. అయినా చంద్రబాబు మాత్రం వైఎస్ కుటుంబంలో ఏదో జరిగిపోయిందని ప్రచారం చేస్తున్నారు. ఆయనకు మద్దతు ఇచ్చే మీడియా అయితే శరభ,శరభ అంటూ పూనకం వచ్చినట్లుగా వ్యవహరిస్తోంది. ఇక్కడ మరో విషయం చెప్పాలి. టిడిపిని తన అధీనంలోకి తీసుకున్న తర్వాత చంద్రబాబు తో ఆయన బావమరుదులు జయకృష్ణ, హరికృష్ణ, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, స్వయంగా తన తమ్ముడు రామ్మూర్తి నాయుడు వంటివారికి ఆయా సందర్భాలలో ఏర్పడిన విబేధాల సంగతి ఇప్పటి తరం వారికి తెలియకపోవచ్చు. దగ్గుబాటి పుస్తకంలో ఏమి రాశారో చూస్తే పలు విషయాలు తెలుస్తాయి. రాజకీయాలలో ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతుంటాయి. పలు రాష్ట్రాలలో ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. కాని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్లీనరీలో మాత్రం ఎలాంటి గొడవలు,గందరగోళాలు లేకుండా ఈ ఉదంతం ముగియడం విశేషమే. టిడిపికి, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియాకు మాత్రం అది తీవ్ర నిరుత్సాహం కలిగించే విషయమే. -కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
విజయమ్మ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు: సజ్జల
సాక్షి, గుంటూరు: టీడీపీ, ఎల్లోమీడియాపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సజ్జల శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, ఎల్లోమీడియా దిగజారుడు రాజకీయం చేస్తున్నాయి. వైఎస్ విజయమ్మ ప్రసంగాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. వారికి విమర్శించడానికి ఏమీలేక విజయమ్మ అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. విజయమ్మ వ్యాఖ్యలపై పెడార్థాలు తీస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: వైఎస్సార్సీపీ నుంచి తప్పుకోవాలనుకుంటున్నా -
విజయమ్మ ప్రసంగం వక్రీకరణ.. ఎల్లో మీడియాపై సజ్జల ఆగ్రహం
-
యువతకు జగన్ రోల్ మోడల్: వైఎస్ విజయమ్మ
-
YS Vijayamma Speech: వైఎస్సార్సీపీ నుంచి తప్పుకోవాలనుకుంటున్నా
-
ప్రాణమున్నంత వరకు మీ అప్యాయతను మరిచిపోం: వైఎస్ విజయమ్మ
-
జగన్ను మీ చేతుల్లో పెడుతున్నా..ఇక షర్మిలకు అండగా
వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి: ‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి వారసులుగా జగన్, షర్మిల.. ఇద్దరూ ఆయన భావాలను పుణికి పుచ్చుకున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు నా కుమారుడికి తోడుగా ఉన్నా. ఇక్కడ సంతోషంగా ఉన్న సమయంలో తెలంగాణలో వైఎస్సార్ ఆశయ సాధన కోసం షర్మిల పోరాడుతోంది. ఇప్పడు ఆమెకు తోడుగా ఉండమని నా మనస్సాక్షి చెబుతోంది. రెండు రాష్ట్రాల్లో రాజకీయ వివాదాలకు తావులేకుండా వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలిగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నా’’ అని ప్లీనరీ వేదికగా వైఎస్ విజయమ్మ ప్రకటించారు. వైఎస్సార్సీపీ ప్లీనరీ తొలిరోజైన శుక్రవారం ఆమె ఉద్వేగభరితంగా మాట్లాడారు. ప్రసంగం వివరాలు ఆమె మాటల్లోనే.. మా అనుబంధాలు గొప్పవి.. మాది చాలా అభిమానం కలిగిన కుటుంబం. మా అనుబంధాలు, సంస్కారాలు గొప్పవే. తన అన్నకు ఇక్కడ ఏ ఇబ్బందీ కలుగకుండా ఉండాలనే తెలంగాణ కోడలిగా షర్మిల అక్కడ వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసుకుంది. వాళ్ల నాన్న ఆశయాలను నెరవేర్చాలని, వాళ్ల నాన్న ప్రేమించిన ప్రజలకు నిజాయితీగా సేవ చేయాలని, తన జన్మకు సార్థకత ఉండాలని గట్టిగా పోరాడుతోంది. రాజశేఖరరెడ్డి భార్యగా, ఓ తల్లిగా ఆ బిడ్డకు అండగా ఉండాల్సిన బాధ్యత నాపై ఉంది. ఇక్కడ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ సీపీకి, అక్కడ షర్మిల వైఎస్సార్టీపీకి ఒకే సమయంలో మద్దతు పలకడంపై రెండు పార్టీల్లో సభ్యత్వం ఉండవచ్చా? అన్న దానిపై చాలా ఆత్రుతగా, ఏదో జరిగిపోతోందన్నట్లుగా, ఉన్నవీ లేనివీ కల్పించి ఎల్లో మీడియాలో గొప్పగా రాశారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఓ తల్లిగా ఇద్దరి భవిష్యత్తూ బాగుండాలని కోరుకున్నా. ఇంత వరకు జరిగింది ఒక ఎత్తు.. ఇకపై జరగబోయేది ఒక ఎత్తు. రాజకీయ ఎన్నికల యుద్ధం రాబోతోంది. తెలంగాణలో ముందుగా ఎన్నికలు వస్తాయి. అక్కడ షర్మిల ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆమె తెలంగాణ ప్రయోజనాలపై మాట్లాడుతోంది. ఇక్కడ జగన్ ఏపీ ప్రజల కోసం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో సీఎంగా జగన్కు ఒక స్టాండ్ ఉంటుంది. అదే సమయంలో ఇద్దరికీ వేర్వేరు విధానాలు తప్పవు. ఇద్దరూ వేర్వేరు రాష్ట్రాల ప్రతినిధులుగా ఉండే పరిస్థితులు వస్తాయని ఊహించలేదు. ఇది ప్రజాహితం కోసం దేవుడు జరిపిస్తున్నాడని నమ్ముతున్నా. రెండోసారి తిరుగులేని మెజార్టీతో.. రెండు రాష్ట్రాల మధ్య ప్రయోజనాల విషయంలో కొన్ని అంశాల్లోనైనా వక్రీకరణలకు, బురదజల్లే రాజకీయాలకు తావివ్వకుండా ఉండాలంటే పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవిలో కొనసాగడం మంచిది కాదని నిర్ణయించుకున్నా. నా రాజకీయ జీవితంలో మీరంతా భాగమయ్యారు. నేను ఏదైనా జవాబు చెప్పాల్సి వస్తే మీకు (ప్రజలకు) మాత్రమే చెప్పాలి. అందుకే ఉన్నది ఉన్నట్లు చెప్పాలని నిర్ణయించుకున్నా. జగన్ తనను తాను నిరూపించుకుంటూ మంచి సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నారు. మీ అందరి దయతో, తిరుగులేని మెజార్టీతో రెండోసారీ సీఎం అవుతారనే నమ్మకం, విశ్వాసం నాకు ఉంది. ఈ పరిస్థితుల్లో నేను రెండు రాష్ట్రాల్లో తల్లిగా ఇద్దరికీ అండగా ఉన్నా.. ఇద్దరిపై విమర్శలు చేసే వారు ఉంటారు. ఎక్కడికి వెళ్లినా తెలుగు రాష్ట్రాల ప్రజలు నన్ను రాజశేఖరరెడ్డి భార్యగా ఆదరిస్తారు. దిగజారుడుతనం తగదు.. నేను రాయని లేఖతో, చేయని సంతకంతో సోషల్ మీడియాలో నా రాజీనామా పేరుతో జగన్కు వ్యతిరేకంగా లేఖ విడుదల చేశారు. ఇటువంటి వాటిల్లో వారి దిగజారుడుతనం కనిపిస్తోంది. పిచ్చిరాతలు, జుగుప్సాకర రాతలతో కుట్రలు బయపడుతున్నాయి. ఇటువంటి నాయకులకు, ఇలాంటి రాతలు రాసేవారికి ఎవరి కుటుంబంపైనా గౌరవం ఉండనిపిస్తుంది. దుష్ప్రచారాలు, వెన్నుపోట్లు.. రాజకీయం కాదు. రాజశేఖరరెడ్డి మాదిరిగా ప్రజలకు చివరి నిమిషం వరకు సేవ చేసి చనిపోయే నాయకులు కావాలి. నాకు రాజశేఖరరెడ్డి లేని లోటు తీరనిది. తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో జగన్, తెలంగాణలో షర్మిలమ్మ వైఎస్సార్ లేని లోటును తీరుస్తారు. మీరు బలం అయితే వారే మీకు బలం, అండ అవుతారు. వేరే రాష్ట్రంలో రాజకీయంగా షర్మిలకు అండగా ఉన్నా.. తల్లిగా జగన్కు, రాష్ట్ర ప్రజలకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటా. మాట కోసం పుట్టిన పార్టీ రాజకీయ పార్టీలు అధికారం కోసం పుడితే.. వైఎస్సార్ సీపీ మాత్రం నల్లకాలువలో జగన్ ఇచ్చిన మాట నుంచి పురుడు పోసుకుంది. దేశంలోని శక్తివంతమైన వ్యవస్థలన్నీ కలసి దాడి చేసినా.. తాను చేసేది న్యాయం, ధర్మం, మంచి అని నమ్మిన జగన్ ఎన్ని కష్టాలు వచ్చినా లెక్కచేయకుండా ప్రజల కోసం నిలబడ్డాడు. అప్పుడు నా బిడ్డ జగన్ను మీ చేతుల్లో పెట్టా. మిమ్మల్ని నడిపించమంటే.. వెన్నంటే ఉండి ముఖ్యమంత్రిని చేశారు. మళ్లీ మీకే అప్పగిస్తున్నా.. మీరే అతనికి బలం కావాలి. మీ బిడ్డల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుతాడని మాటిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ పొమ్మనక పొగపెడితే 2011లో మానవత్వపు విలువలతో వైఎస్సార్సీపీ పురుడు పోసుకుంది. అరెస్టులతో భయపెట్టినా.. కష్టాల బాట ముందు ఉందని తెలిసినా వెరవకుండా నిలబడింది. జగన్ మీద అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేశారు. ప్రతిపక్షాలకు ఇదే నా సమాధానం.. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోకుండా తనను గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలనే వ్యక్తిత్వంతో జగన్ పని చేస్తున్నాడు. అందుకే ఏడాదిన్నరలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 95 శాతం అమలు చేసిన ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీ అని గర్వంగా చెబుతున్నా. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.1.60 లక్షల కోట్లను డీబీటీ విధానంలో లంచాలు లేకుండా నేరుగా ప్రజలకు అందించాం. అభివృద్ధి ఎక్కడ జరుగుతుందని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలకు ఇదే నా సమాధానం. సంక్షేమ పథకాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే నిజమైన అభివృద్ధి. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఎవరికీ ఏ ఒక్క పథకం కూడా గుర్తు రాదు. నాన్న బాటలోనే నడుస్తా...! ‘‘జగన్ అప్పుడు చాలా చిన్నవాడు. పదో తరగతి చదువుతున్నాడు. వైఎస్సార్ ఎక్కువగా ప్రజలతోనే ఉండేవారు. మాతో వారానికి ఒక్క పూటైనా గడిపిన సందర్భాలు చాలా తక్కువ. ఆ సమయంలో జగన్తో.. నాన్నా నీకు రాజకీయాలు వద్దు. నాలుగు పరిశ్రమలు పెట్టుకుని దర్జాగా కాలిపై కాలేసుకుని పది మందికి పని కల్పించే జీవితాన్ని ఎంచుకోమన్నా. కానీ 15 ఏళ్లు కూడా లేని జగన్.. అటువంటి జీవితం నాకొద్దమ్మ. నాన్న ఏ విధంగా నడుస్తున్నారో ఆ జీవితాన్నే నేను కోరుకుంటా అని చెప్పాడు. ఈ రోజు ప్రజలందరి ప్రేమ, అభిమానాన్ని సంపాదించిన నా బిడ్డ జగన్ను చూసి చాలా గర్వపడుతున్నా. మనసుతో చేసే ప్రజా పరిపాలనను కళ్లారా చూస్తున్నా’’ –వైఎస్ విజయమ్మ చదవండి: ఉద్దండ నాయకులకే గొంతు ఎండిపోయేలా చేశారు: వైఎస్ విజయమ్మ -
ఉద్దండ నాయకులకే గొంతు ఎండిపోయేలా చేశారు: వైఎస్ విజయమ్మ
సాక్షి, తాడేపల్లి: దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రస్థానమంతా జనంతో ముడిపడి ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. మహానేత వైఎస్సార్ 73వ జయంతిని పురస్కరించుకుని శుక్ర, శనివారాల్లో వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్నారు. ప్లీనరీ సమావేశాలకు హాజరైన వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ.. రాజశేఖరరెడ్డి అందరివాడు. మీ అందరి హృదయాల్లో వైఎస్సార్గారు సజీవంగా ఉన్నారని అన్నారు. ఉద్దండ నాయకులకే గొంతు ఎండిపోయేలా చేశారు ఆనాడు అధికార శక్తులన్నీజగన్పై విరుచుకుపడ్డా బెదరలేదు. అన్యాయంగా కేసులు పెట్టి వేధించారు. 2011లో కాంగ్రెస్ పొమ్మనలేక పొగపెట్టింది. జగన్ ఓర్పు, సహనంతో ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఉద్దండ నాయకులకే వైఎస్ జగన్ గొంతు ఎండిపోయేలా చేశారు. ఈ రోజు సగర్వంగా ప్లీనరీ జరుపుకుంటున్నాం. మీ అందర్నీ ఆశీర్వదించడానికి, అభినందించడానికి నేను వచ్చాను. ప్రజల అభిమానం, ఇచ్చిన మాట నుంచి వైఎస్సార్సీపీ పుట్టింది. ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, జగనన్న అమ్మ ఒడి, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పాలనలో విప్లవాన్ని తెచ్చారు. జగన్ చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చేశారు. యువతకు రోల్మోడల్ వైఎస్ జగన్ వైఎస్ జగన మాస్ లీడర్. జగన్ యువతకు రోల్మోడల్. మీ అందరి ప్రేమ సంపాదించిన జగన్ను చూసి గర్వపడుతున్నా. నా బిడ్డను నడిపించుకోమని మీకే అప్పజెప్పా. నా బిడ్డను నడిపించిన మీ అందరిపైనా నా అణువణువునా కృతజ్ఞత ఉంది. మీ బిడ్డల్ని జగన్ చేతుల్లో పెట్టండి, వారికి ఉజ్వల భవిష్యత్ అందిస్తారు. మీతో నా అనుబంధం ఈనాటిది కాదు, 45 ఏళ్ల అనుబంధం ఉంది. ఇకపైనా ఈ అనుబంధం కొనసాగాలి అంటూ వైఎస్ విజయమ్మ భావోద్వేగానికి గురయ్యారు. షర్మిలకు అండగా ఉండాలనుకుంటున్నా వైఎస్సార్ బిడ్డగా షర్మిల వైఎస్సార్టీపీ పెట్టుకుంది. తండ్రి ఆశయాల మేరకు ప్రజాసేవ చేయాలనే నిర్ణయించుకుంది. వైఎస్సార్ భార్యగా, బిడ్డకు తల్లిగా షర్మిలకు అండగా ఉండాలనుకుంటున్నా. ఏపీ ప్రయోజనాల కోసం వైఎస్ జగన్ ఇక్కడ అవసరం. తెలంగాణ కోడలిగా షర్మిల అక్కడ ప్రజాసేవలో ఉండాలనుకుంది. తెలంగాణలో ఏపీ కంటే ముందుగానే ఎన్నికలు వస్తున్నాయి. వైఎస్సార్ బిడ్డలే అయినా ఇద్దరు వేర్వేరు పార్టీలకు ప్రతినిధులు. దేవుడి అండతో, ప్రజల మద్దతుతో మళ్లీ సీఎంగా జగన్ గెలుస్తారు అని వైఎస్ విజయమ్మ అన్నారు. తల్లిగా జగన్కు ఎప్పుడూ నా మద్దతు ఉంటుంది వైఎస్సార్సీపీ నుంచి తప్పుకోవాలనుకుంటున్నా. తెలంగాణలో షర్మిలకు ప్రస్తుతం నా అవసరం ఉంది. నా ఉనికి ఎవరికీ వివాదాస్పదం కాకుండా ఉండాలనే ఈనిర్ణయం తీసుకుంటున్నాం. ప్రజలకు నా ఇద్దరు బిడ్డలు అండగా ఉంటారు, మీ మద్దతు వారికి కావాలి. తల్లిగా జగన్కు ఎప్పుడూ నా మద్దతు ఉంటుంది అని వైఎస్ విజయమ్మ తెలిపారు. చదవండి: (CM YS Jagan Speech: మన పార్టీ సంఘర్షణ 13ఏళ్ల కింద మొదలైంది) -
వైఎస్సార్కు నివాళులర్పించిన సీఎం జగన్, కుటుంబ సభ్యులు (ఫోటోలు)
-
వైఎస్సార్కు నివాళులర్పించిన సీఎం జగన్, కుటుంబ సభ్యులు
సాక్షి, కడప జిల్లా: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 73వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ సమాధి వద్ద కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇదిలా ఉంటే, మహానేత వైఎస్సార్ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తున్నారు. -
YSR Kadapa: వైఎస్ విజయమ్మ, షర్మిలకు ఘన స్వాగతం
సాక్షి, కడప: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని గురువారం కడప ఎయిర్పోర్టుకు చేరుకున్న వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, షర్మిలకు ఘన స్వాగతం లభించింది. శుక్రవారం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించడంతోపాటు ప్రత్యేక ప్రార్థనల్లో వీరు పాల్గొంటారు. వీరికి జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, కడప నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి సాదర స్వాగతం పలికారు. కొంత మంది అభిమానులు వారితో సెల్ఫీలు దిగారు. అనంతరం గజమాలతో సత్కరించారు. తరువాత వారు రోడ్డు మార్గాన ఇడుపులపాయకు బయలుదేరి వెళ్లారు. ఇడుపులపాయకు చేరుకున్న వైఎస్ జగన్, కుటుంబ సభ్యులు వేంపల్లె : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తల్లి వైఎస్ విజయమ్మ, చెల్లెలు షర్మిల సాయంత్రం ఇడుపులపాయకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఇడుపులపాయ ఎస్టేట్ ఆవరణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చదవండి: (వైఎస్సార్సీపీ శ్రేణులకు సీఎం జగన్ ఆప్యాయ పలకరింపు) -
చవ్వా అంకిత్కు వైఎస్ విజయమ్మ ఆశీర్వాదం
సాక్షి, అనంతపురం: వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు చవ్వా రాజశేఖరరెడ్డి కుమారుడి వివాహ వేడుకలకు వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శుక్రవారం హాజరయ్యారు. ఈసందర్భంగా కలశ పూజలో పాల్గొని వరుడు అంకిత్రెడ్డిని దీవించారు. అనంతరం పార్టీ శ్రేణులు, అభిమానులకు అభివాదం చేసి ఆమె వెనుదిరిగారు. అంతకముందు అనంతకు చేరుకున్న వైఎస్ విజయమ్మకు శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఎస్వీవీయూ పాలక మండలి సభ్యురాలు తోపుదుర్తి నయనతారెడ్డి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో రాష్ట్ర నాటక అకాడమీ చైర్పర్సన్ రాగే హరిత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ఎల్ఎం ఉమ, వైఎస్సార్సీపీ నాయకులు తోపుదుర్తి చంద్రశేఖరరెడ్డి, గౌస్బేగ్, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, శ్రీదేవి, విద్యాసాగర్రెడ్డి, అనిల్కుమార్ గౌడ్, కొర్రపాడు హుస్సేన్పీరా పాల్గొన్నారు. చదవండి: (అధికారం దక్కదనేగా ఈ దాష్టీకాలు?) -
వైఎస్ విజయమ్మను కలిసిన గురునాథ్రెడ్డి
కొడంగల్: వికారాబాద్ జిల్లా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్రెడ్డి శనివారం వైఎస్సార్ టీపీ గౌరవ అధ్యక్షు రాలు వైఎస్ విజయమ్మను మర్యాదపూర్వ కంగా కలిశారు. పార్టీ జిల్లా అధ్య క్షుడు తమ్మళి బాల్రాజ్తో కలిసి లోటస్ పాండ్లోని పార్టీ కార్యాలయానికి వెళ్లారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తో తనకు మంచి సాన్నిహిత్యం ఉండేదని గురునాథ్రెడ్డి గుర్తుచేసుకున్నారు. -
Hyderabad: ఘనంగా కావలి ఎమ్మెల్యే కుమారుడి వివాహం
కావలి: కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి – ఆదిలక్ష్మి దంపతుల కుమారుడు బాలసాకేత్రెడ్డి – మహిమల వివాహం గురువారం హైదరాబాద్లోని ఫిల్మ్నగర్లో ఉన్న జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకలో వైఎస్ విజయమ్మ, సజ్జల రామకృష్ణారెడ్డి, డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు, మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్రావు, ఎంపీలు బీద మస్తాన్రావు, ఆదాల ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు ఆనం రామానారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఏపీ, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలకు చెందిన నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. కావలి నియోజకవర్గం నుంచి ఏఎంసీ చైర్మెన్ మన్నెమాల సుకుమార్రెడ్డి, కేతిరెడ్డి శివకుమార్రెడ్డి, పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీ నాయకులు వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. వధూవరులను ఆశీర్వదిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి దంపతులు చదవండి: (భారీ పరిశ్రమలకు కేంద్ర బిందువుగా శ్రీసత్యసాయి జిల్లా) -
'ప్రజల ఆకాంక్షను పూర్తి చేసే వరకు ప్రజా ప్రస్థానం ఆగదు'
సాక్షి, ఖమ్మం: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపడుతున్న మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర సత్తుపల్లి మండలం తాళ్ళమడ వద్ద 1000 కిలోమీటర్లు చేరుకుంది. ఈ సందర్భంగా నిర్మించిన వైఎస్సార్ పైలాన్ను వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం సత్తుపల్లి బస్టాండ్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ.. షర్మిలమ్మ పాదయాత్రకు మద్దతుగా వచ్చిన అందరికీ నమస్కారాలు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను పూర్తి చేసే వరకు ప్రజా ప్రస్థానం ఆగదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ పాదయాత్ర సరికొత్త చరిత్ర సృష్టించింది. మాట తప్పని మడమ తిప్పని నేత రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల. అందరి సంక్షేమం కోసమే షర్మిల పాదయాత్ర. రాజశేఖర్రెడ్డి ముద్దు బిడ్డ షర్మిలమ్మ. సంక్షేమంలో తెలంగాణకు వైఎస్సార్ పెద్దపీట వేశారు. రాజశేఖర్రెడ్డి లేని లోటు ఎవరూ తీర్చలేనిది. వైఎస్సార్ చనిపోయాక ఆయన పేరును ఎఫ్ఐఆర్లో పెట్టి ఆ కుటుంబాన్ని వేధించారు. జగన్ను అక్రమంగా నిర్భందించినపుడు 3012 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర చేపట్టింది. పాదయాత్ర మరలా చేయాల్సి వస్తుందని ఏనాడు అనుకోలేదు. బంగారు తెలంగాణ కోసం, గొప్ప సంకల్పంతో పాదయాత్రతో షర్మిల మీ ముందుకు వచ్చింది ఆశీర్వదించండి' అని వైఎస్ విజయమ్మ కోరారు. చదవండి: (పాలమూరుపై టీఆర్ఎస్ కక్ష కట్టింది: బండి సంజయ్) -
వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ విజయమ్మ
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రవి కన్వెన్షన్ హాల్లో శనివారం జరిగిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్టా రాంరెడ్డి సమీప బంధువు, గుంపుల తిరుమలగిరి ఉప సర్పంచ్ నల్లబోలు రాఘవరెడ్డి కుమార్తె వివాహ మహోత్సవానికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు సోనియారెడ్డి, నవకిరణ్రెడ్డిని ఆశీర్వదించారు. ఆమె వెంట పిట్టా రాంరెడ్డి తదితరులు ఉన్నారు. చదవండి: (రేవంత్ రెడ్డికి మంత్రి పువ్వాడ సవాల్.. ‘నిరూపిస్తే కాలేజీని సరెండర్ చేస్తా’) -
అభిమానుల మధ్య వైఎస్ విజయమ్మ జన్మదిన వేడుకలు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అభిమానుల మధ్య వైఎస్ విజయమ్మ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వైఎస్ విజయమ్మకు వైఎస్ షర్మిల తినిపించారు. లక్ష్మీదేవిపల్లిలో వైఎస్ షర్మిల పాదయాత్ర క్యాంపు వద్ద వైఎస్ విజయమ్మ జన్మదిన వేడుకలు నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రజాప్రస్థానం పాదయాత్ర సాగుతోంది. లక్ష్మీదేవిపల్లి మండలం రేగుళ్లలో నిరుద్యోగ నిరాహార దీక్షలో వైఎస్ షర్మిల పాల్గొన్నారు. చదవండి: సమస్యలు లేవంటే ముక్కు నేలకు రాస్తా -
ధన్య మాత వైఎస్ విజయమ్మకు జన్మదిన శుభాకాంక్షలు
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జన్మదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా విజయమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి జన్మనిచ్చిన ధన్య మాత వైఎస్ విజయమ్మ అని అన్నారు. ‘వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ విజయమ్మ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మహానేతకు ఆదర్శ సతీమణిగా నిలిచారు. జననేతకు జన్మనిచ్చి ధన్య మాత అయ్యారు. ఈ సందర్భంగా మీకు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్షు ప్రసాదించాలని దేవున్ని ప్రార్థిస్తున్నా’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ విజయమ్మ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మహానేతకు ఆదర్శ సతీమణిగా నిలిచారు. జననేతకు జన్మనిచ్చి ధన్య మాత అయ్యారు. ఈ సందర్భంగా మీకు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్షు ప్రసాదించాలని దేవున్ని ప్రార్థిస్తున్నా. pic.twitter.com/Iy64wWb5vc — Vijayasai Reddy V (@VSReddy_MP) April 19, 2022 -
వైఎస్ఆర్ పాలన ఒక స్వర్ణయుగం: వైఎస్ విజయమ్మ
-
గౌతమ్ రెడ్డి భార్యను ఓదారుస్తున్న వైఎస్ విజయమ్మ
-
అపోలో హాస్పిటల్కు చేరుకున్న వైఎస్ విజయమ్మ
-
వైఎస్సార్సీపీ నేత మురళీధరరెడ్డి కుమార్తె వివాహానికి హాజరైన వైఎస్ విజయమ్మ
-
వైఎస్ మాతృమూర్తి జయమ్మకు నివాళి
పులివెందుల: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి మాతృమూర్తి వైఎస్ జయమ్మ జీవితం అందరికీ ఆదర్శమని వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. వైఎస్ జయమ్మ 16వ వర్ధంతిని వైఎస్సార్ జిల్లా పులివెందులలో మంగళవారం నిర్వహించారు. లయోలా డిగ్రీ కళాశాల రోడ్డులో ఉన్న వైఎస్ జయమ్మ, వైఎస్ రాజారెడ్డి ఘాట్లకు వెళ్లిన విజయమ్మ వారి సమాధుల వద్ద పూలమాలలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడే ఉన్న జార్జిరెడ్డి, వివేకానందరెడ్డి, డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ఘాట్లతోపాటు ఇతర కుటుంబ సభ్యుల సమాధులను సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు పాస్టర్లు ఆనంద్, నరేష్కుమార్, మృత్యుంజయులు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వైఎస్ విజయమ్మ, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, వైఎస్ వివేకా సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మ, వైఎస్సార్ సోదరుడు వైఎస్ సుధీకర్రెడ్డి, వైఎస్ మనోహర్రెడ్డి, మునిసిపల్ చైర్మన్ వరప్రసాద్, కమిషనర్ నరసింహారెడ్డి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ జయమ్మ పార్కుకు చేరుకుని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ వైఎస్ జయమ్మకు తమ కుటుంబంలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. పులివెందుల ప్రాంతంలో ఎవరికి కష్టమొచ్చినా తన బిడ్డలకు కష్టం వచ్చినట్లుగా ఆమె భావించేవారన్నారు. వైఎస్సార్ను మాట తప్పని.. మడమ తిప్పని నేతగా తీర్చిదిద్దడంలో, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టడం వెనుక వైఎస్ జయమ్మ పాత్ర ఎంతో ఉందన్నారు. ఆమె జీవితాన్ని అంతా ఆదర్శంగా తీసుకోవాలన్నారు. -
బాబాజీరావుకు వైఎస్ విజయమ్మ పరామర్శ
సాక్షి, దేవరపల్లి/కొవ్వూరు: గోపాలపురం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నాయకుడు, రాష్ట్ర మంత్రి తానేటి వనిత తండ్రి జొన్నకూటి బాబాజీరావును వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హైదరాబాద్లోని సీటీ న్యూరో ఆసుపత్రిలో బుధవారం పరామర్శించారు. బాబాజీరావు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా బాబాజీరావు యోగక్షేమాలను ఆమె అడిగి తెలుసుకుని, ఆరోగ్యం త్వరగా మెరుగుపడి కోలుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర స్త్రీ, శిశుసంక్షేమ మంత్రి తానేటి వనిత, కుటుంబ సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం బాబాజీరావు ఆరోగ్యం మెరుగుపడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. -
CM YS Jagan Mohan Reddy Birthday: అభిమానం.. అపు'రూపం'
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం సందర్భంగా తమ అభిమానాన్ని పలువురు వినూత్నంగా చాటుకున్నారు. వెండి నాణెంపై, రావి ఆకుపై, కోడి గుడ్డుపై, విభిన్న పూలతో సీఎం జగన్ రూపాన్ని చిత్రీకరించి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో నైపుణ్యంతో రూపొందించిన ఆయా చిత్రాలు ఆకర్షిస్తున్నాయి. – రాజాం సిటీ/ జగ్గయ్యపేట అర్బన్/కడియం/శ్రీకాకుళం (పీఎన్కాలనీ) వెండి నాణెంపై.. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఆయన తల్లి, వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆప్యాయంగా అభినందించిన చిత్రాన్ని వెండి నాణెంపై చెక్కి ఔరా అనిపించారు శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన స్వర్ణకారుడు, మైక్రో ఆర్టిస్ట్ ముగడ జగదీశ్వరరావు. 3 గ్రాముల వెండిపై 60 నిమిషాల్లో దీన్ని చెక్కినట్టు ఆయన తెలిపారు. పుష్పాభిషేకం తూర్పుగోదావరి జిల్లా కడియానికి చెందిన పల్ల వెంకన్న నర్సరీ యాజమాన్యం వివిధ రకాల పూలతో సీఎం వైఎస్ జగన్ రూపాన్ని తీర్చిదిద్దింది. చిట్టిబంతి, చామంతి, గులాబీలను వినియోగించినట్టు సత్యనారాయణ మూర్తి, సుబ్రహ్మణ్యం, గణపతి చెప్పారు. రావి ఆకుపై.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన చిత్రకారుడు అల్లి చంద్రశేఖర్.. పెన్సిల్ షేడ్స్తో, బియ్యం గింజలు, రాగులతో రావి ఆకుపై సీఎం జగన్ రూపాన్ని చిత్రీకరించారు. నవరత్నాలు వెరీ‘గుడ్’ నవరత్నాలను అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్కు తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు శ్రీకాకుళానికి చెందిన పొట్నూరి శ్రీనివాస్. కోడి గుడ్లపై నవరత్నాలతో పాటు, సీఎం జగన్ రూపాన్ని చిత్రీకరించి తన అభిమానాన్ని చాటుకున్నారు. -
రేపటి నుంచి షర్మిల ప్రజాప్రస్థానం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణలో సుదీర్ఘ పాదయాత్రకు రేపు శ్రీకారం చుడుతున్నారు. సోమవారం లోటస్పాండ్లోని పార్టీ కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి తూడి దేవేందర్రెడ్డి పాదయాత్ర వివరాలను మీడియాకు వెల్లడించారు. షర్మిల పాదయాత్ర దాదాపు 400 రోజులు.. 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 వేల కిలోమీటర్ల మేర సాగుతుందన్నారు. 14 పార్లమెంట్ నియోజక వర్గాల పరిధిలో కొనసాగుతుందని చెప్పారు. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3.00 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు పాదయాత్ర సాగుతుందన్నారు. 9 ప్రాంతాల్లో బహిరంగ సభలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. రోజూ సాయంత్రం పలు సమస్యల పరిష్కారంపై షర్మిల స్థానిక నాయకులు, ప్రజలతో భేటీ అవుతారని చెప్పారు. రచ్చబండ తరహాలో ప్రజలతో మాటముచ్చట కార్యక్రమం సాగుతుందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో మూడు మండలాలను కలుపుకొనిపోయేలా రూట్ మ్యాప్ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడమే లక్ష్యంగా షర్మిల పా దయాత్ర సాగుతుందన్నారు. ప్రతి మంగళవారం పాదయాత్ర ఎక్కడ జరుగుతుంటే అక్కడే నిరుద్యోగ నిరాహార దీక్ష జరుగుతుందని వెల్లడించారు. నేడు తల్లి విజయమ్మతో ఇడుపులపాయకు.. తన తల్లి విజయమ్మతో కలసి షర్మిల మంగళవారం ఉదయం ఇడుపులపాయ వెళ్తారు. అక్కడ వైఎస్సార్ సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. కాగా, ఇడుపులపాయకు వెళ్తున్న నేపథ్యంలో నేడు జరగాల్సిన నిరుద్యోగ నిరాహార దీక్షను వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. షర్మిలను ఆదరించండి.. రాజన్న అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి కోసం.. మీ కోసం మీ రాజన్న బిడ్డ షర్మిల చేపడుతున్న ప్రజాప్రస్థానం పాదయాత్రను ఆదరించాలని వైఎస్ విజయమ్మ ప్రజలకు పిలుపునిచ్చారు. షర్మిల పాదయాత్ర చేపడుతున్న నేపథ్యంలో ఆమె సోమవారం ఓ సందేశాన్ని విడుదల చేశారు. చేవెళ్ల నుంచి ప్రారంభించనున్న షర్మిల పాదయాత్రను జయప్రదం చేయాలని కోరారు. షర్మిల అడుగులో అడుగు వేసి ఓ ప్రభంజనాన్ని సృష్టించాలన్నారు. -
పేదల మనసు గెలిచిన డాక్టర్
సాక్షి, కడప: డాక్టర్ ఈసీ గంగిరెడ్డి తన సేవలతో ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించి చిరస్మరణీయులుగా నిలిచిపోయారని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల భాకరాపురంలోని వైఎస్సార్ ఆడిటోరియంలో ఆదివారం ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సంస్మరణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఎంత కాలం బతికామన్నది కాదు.. ఎలా బతికామన్నది ముఖ్యమని ఎప్పుడూ వైఎస్సార్ చెప్పేవారన్నారు. అలాంటి వారు సమాజంలో ఒక గుర్తింపు కలిగి ఉంటారని, వారు ఈ లోకంలో లేకపోయినా వారు చేసిన పనులు, ప్రజలతో మెలిగిన తీరును కలకాలం ప్రజలు కీర్తిస్తూనే ఉంటారని వివరించారు. గంగిరెడ్డి అన్నలో తనకు.. క్రెడిబులిటీ, కమిట్మెంట్, కరేజ్, కేర్, కన్సర్న్ లక్షణాలు ప్రధానంగా కనిపించాయని, ఆయనలో ఇంకా అనేక మంచి గుణాలు ఉన్నాయని చెప్పారు. అందరికీ వారధి అన్న గంగిరెడ్డి, సుగుణమ్మ దంపతులిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని వైఎస్ విజయమ్మ చెప్పారు. బంధాలకు, అనుబంధాలకు విలువ ఇస్తారన్నారు. ‘ఎలాంటి మనస్పర్థలు వచ్చినా వారధిలా వ్యవహరించి అందరినీ ఒకతాటిపైకి తెచ్చి నడిపించడంలో ఆయనకు ఆయనే సాటి. ప్రతిఫలం ఆశించకుండా పని చేసుకుంటూ వెళ్లే వారు. డబ్బు గురించి ఆయన ఏనాడూ ఆలోచించలేదు. ఇది నా మాట కాదు.. జనం మాట. హస్తవాసి మంచిదని నాలుగు జిల్లాల నుంచి ప్రజలు వైద్యం కోసం వచ్చే వారు. వారణాసిలో తనకు అత్యంత ముఖ్య స్నేహితుడైన దినేష్ను మరచిపోకూడదని తన కుమారుడికి అదే పేరు పెట్టుకున్న గొప్ప వ్యక్తిత్వం ఆయనది. దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్, డాక్టర్ ఈసీ గంగిరెడ్డిల మధ్య చాలా మంచి అనుబంధం ఉండేది’ అని వివరించారు. -
ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభలో సీఎం జగన్
-
మరపురాని జ్ఞాపకం డాక్టర్ ఈసీ గంగిరెడ్డి
సాక్షి, పులివెందుల: దివంగత డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ప్రథమ వర్ధంతి ఆదివారం పులివెందులలో నిర్వహించారు. డిగ్రీ కళాశాల రోడ్డులో గల వైఎస్సార్ సమాధుల తోటలో ఉన్న డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ఘాట్ వద్ద ఆదివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, సతీమణి వైఎస్ భారతిరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, ఇతర వైఎస్ కుటుంబీకులు నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భాకరాపురంలోని వైఎస్సార్ ఆడిటోరియంలో ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. సంస్మరణ సభ అనంతరం మరపురాని జ్ఞాపకం డాక్టర్ ఈసీ గంగిరెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సభకు వైఎస్ కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు. సంస్మరణ సభలో వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ.. డాక్టర్ ఈసీ గంగిరెడ్డి క్రెడిబులిటీ ఉన్న వ్యక్తి అని అన్నారు. పేదలకు ఉచితంగా వైద్యం అందించారు. పేదల మనసు గెలుచుకున్న వ్యక్తి' అంటూ కొనియాడారు. పేదల డాక్టర్గా గుర్తింపు దివంగత డాక్టర్ ఈసీ గంగిరెడ్డి పేదల డాక్టర్గా పులివెందుల ప్రాంతంలో గుర్తింపు పొందారు. ఆయన హస్తవాసి తగిలితే ఎంతటి రోగమైనా ఇట్టే నయమవుతుందని ఈ ప్రాంత వాసుల నమ్మకం. ఈయన చిన్నపిల్లల డాక్టర్గా ప్రాచుర్యం పొందారు. 1949 ఏప్రిల్ 20వ తేదీన ఇసీ సిద్ధారెడ్డి, తులశమ్మ దంపతులకు రెండో సంతానంగా వేముల మండలం గొల్లలగూడూరులో ఇ.సి. గంగిరెడ్డి జన్మించారు. 1 నుంచి 5వ తరగతి వరకు గొల్లలగూడూరు ఆర్సీఎం స్కూలు, 6 నుంచి 8వ తరగతి వరకు పులివెందులలోని జెడ్పీ హైస్కూలులో, 9 నుంచి 11వ తరగతి వరకు వేముల జెడ్పీ హైస్కూలులో, ఎంబీబీఎస్ వారణాసిలోని బెనారస్ యూనివర్శిటీలో విద్యనభ్యసించారు. బెనారస్ యూనివర్శిటీలో ఆయన పీడీ కూడా పూర్తి చేశారు. అనంతరం పులివెందులలోని వైఎస్ రాజారెడ్డి ఆసుపత్రిలో వైద్య సేవలు ప్రారంభించారు. తర్వాత పులివెందులలోని శ్రీనివాసహాలు వీధిలో గంగిరెడ్డి ఆసుపత్రి స్థాపించి వైద్య సేవలు అందించేవారు. పులివెందులలోని గంగిరెడ్డి ఆసుపత్రి అంటే ఎంతో ప్రాచుర్యం పొందింది. పులివెందుల ప్రాంతంలో పేదల వైద్యునిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. వైద్యం చేయడమే ప్రధాన ఆశయంగా ప్రతిఫలం ఆశించని డాక్టర్గా ఇక్కడ గు ర్తింపు పొందారు. ఎలాంటి రోగమైనా ఆయ న దగ్గరకు వెళ్లి ఆయన చేయి పడితే నయమవుతుందని పులివెందుల ప్రాంత ప్రజల నమ్మకం. పులివెందుల ప్రాంత ప్రజలేకాకుండా జిల్లాలో నలుమూలల నుంచే కాకుండా అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల నుంచి కూడా ఆయన వద్దకు రోగులు వచ్చి వైద్య సేవలు పొందేవారు. వైద్య సేవలలో మారుతున్న కాలాన్ని బట్టి ఆయన భాకరాపురంలో అత్యాధునిక వైద్య పరికరాలతో దినేష్ నర్సింగ్ హోం(గంగిరెడ్డి ఆసుపత్రి)ను స్థాపించి వైద్య సేవలు అందించేవారు. తన వద్దకు వచ్చే రోగులపట్ల ఆయన ఎంతో ప్రేమ, ఆప్యాయతలను కనబరిచేవారు. అలాంటి వ్యక్తి తమ మధ్య లేరన్న విషయాన్ని పులివెందుల ప్రాంత ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయ ప్రస్థానం : డాక్టర్ ఇ.సి. గంగిరెడ్డి 2001 నుంచి 2005 వ రకు పులివెందుల మండల ప్రెసిడెంట్గా ప్ర జలకు సేవలు అందించారు. వైఎస్ కుటుంబం పోటీ చేసే ప్రతి ఎన్నికలోనూ ఆయన తనవంతు పాత్ర పోషించేవారు. ఎన్నికల సమయంలో వైఎస్ కుటుంబానికి మద్దతుగా నియోజకవర్గంలోని ఆయన ప్రచారం నిర్వహించేవారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రజాప్రతినిధుల కోర్టులో వైఎస్ విజయమ్మ, షర్మిలకు ఊరట
సాక్షి, హైదరాబాద్: ప్రజాప్రతినిధుల కోర్టులో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, విజయమ్మకు ఊరట లభించింది. అనుమతులు లేకుండా పరకాలలో సభ నిర్వహించి.. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని 2012లో విజయమ్మ, షర్మిలపై కేసు నమోదయ్యింది. ఈ క్రమంలో గురువారం ప్రజాప్రతినిధుల కోర్టు షర్మిల, విజయమ్మపై నమోదైన కేసును కొట్టేసింది. (చదవండి: వైఎస్ విజయమ్మ సైకత శిల్పం) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2012లో జరిగిన ఉప ఎన్నికల సమయంలో పరకాలలో ముందస్తు అనుమతి లేకుండా రోడ్డుపై ఎన్నికల కార్యక్రమం నిర్వహించారని విజయమ్మ, షర్మిలపై కేసు నమోదయ్యింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని 2012లోనే పరకాల పోలీస్ స్టేషన్లో వీరిపై కేసు నమోదు చేశారు. తాజాగా ప్రజాప్రతినిధుల కోర్టు ఈ కేసును కొట్టేసింది. చదవండి: నా బిడ్డలిద్దర్నీ ఆశీర్వదించండి -
కేసీఆర్ స్పందించే వరకు నిరాహార దీక్ష
సాక్షి, సైదాబాద్ (హైదరాబాద్): ఆరేళ్ల గిరిజన బాలిక హత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించే వరకు నిరాహారదీక్ష చేస్తానని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. వెంటనే నిందితుడిని అరెస్ట్ చేయాలని, బాధిత కుటుంబానికి భద్రత కల్పించాలని, వారికి ఏం నష్టపరిహారం చెల్లిస్తారో సీఎం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని వారి ఇంటి వద్దే దీక్షకు దిగారు. బుధవారం సింగరేణి కాలనీకి చేరుకున్న షర్మిల బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ తన ఇంట్లో కుక్కకు ఇచ్చే విలువ మనుషులకు ఇవ్వటం లేదని అన్నారు. గిరిజనుల ప్రాణాలంటే లెక్కలేదా అని సీఎంను ప్రశ్నించారు. ఫామ్హౌస్లో ఉండి పాలన చేసే సీఎం, ఉపఎన్నికలు వస్తేనే బయటకు వస్తారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రికి రాష్ట్రంలో మహిళల రక్షణ విషయంలో పట్టింపు లేదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తెలంగాణలో మహిళలపై లైంగిక వేధింపుల కేసులు మూడురెట్లు పెరిగాయన్నారు. రాష్ట్రాన్ని అప్పులు, ఆత్మహత్యలు, బీరుల తెలంగాణగా మార్చారని దుయ్యబట్టారు. చిన్నారిని చిదిమేసిన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా త్వరగా కఠిన శిక్ష వేయించాలని అన్నారు. బాధిత కుటుంబానికి రూ.10 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దత్తత కాలనీపై పట్టింపేది కేటీఆర్..! మున్సిపల్ ఎన్నికల సమయంలో సింగరేణి కాలనీని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని ప్రకటించిన మంత్రి కేటీఆర్, తర్వాత ఎందుకు పట్టించుకోవడంలేదని షర్మిల ప్రశ్నించారు. ఈ కాలనీలో బాలికపై దుర్మార్గపు చర్య చోటుచేసుకున్నా కేటీఆర్ ఎందుకు బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదని నిలదీశారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలి బాలిక ఘటనపై ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేది కాదని షర్మిల అన్నారు. నిందితుడిపై బాధిత కుటుంబం అనుమానం వ్యక్తం చేసినా పట్టించుకోలేదన్నారు. బాధ్యత లేకుండా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. కాగా, అర్థరాత్రి దాటాక కూడా షర్మిల దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు. షర్మిలకు మద్దతుగా విజయమ్మ బాలిక హత్యాచార ఘటనపై వైఎస్ షర్మిల చేపట్టిన దీక్షకు ఆమె తల్లి విజయమ్మ మద్దతు ప్రకటించారు. బుధవారం సాయంత్రం సింగరేణి కాలనీకి చేరుకున్న విజయమ్మ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వారికి మద్దతుగా దీక్ష చేస్తున్న షర్మిలను కలిశారు. దీక్షా శిబిరంలో కూర్చొని సంఘీభావం తెలిపారు. -
హైదరాబాద్లో మహానేత వైఎస్సార్ సంస్మరణ సభ
-
నా బిడ్డలిద్దర్నీ ఆశీర్వదించండి
సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధనకు తన బిడ్డలిద్దరినీ ఆశీర్వదించాలని ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ విజ్ఞప్తి చేశారు. పదేళ్ల పాటు పడ్డ కష్టంతో ఆంధ్రప్రదేశ్లో సీఎం అయిన తన కుమారుడు వైఎస్ జగన్ రాజన్న పాలన తెచ్చే ప్రయత్నంలో ముందుకెళుతున్నారని తెలిపారు. తెలంగాణను సస్యశ్యామలం చేసి అన్నపూర్ణగా మార్చాలని వైఎస్ కన్న కలలు, ఆశయాల సాధనకు.. ఇక్కడ రాజన్న రాజ్యం తేవడానికి షర్మిలమ్మకు సహకరించాలని కోరారు. తమ ముద్దుబిడ్డ షర్మిలను వైఎస్ ఎంతో ప్రేమగా చూసేవారని, అలాంటి అమ్మాయి తెలంగాణలో ఆయన కలలు నెరవేర్చడానికి ముందుకు వస్తున్నందున ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. గురువారం వైఎస్ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా హెచ్ఐసీసీలో సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమం ముగింపులో మాట్లాడుతూ విజయమ్మ భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్న విజయమ్మను చూసి వేదికపైకి వచ్చిన షర్మిల ఆమెను ఓదార్చారు. సభ ప్రారంభంలో కూడా వైఎస్ను స్మరించుకుని విజయమ్మ కంటతడి పెట్టారు. ఇది రాజకీయపార్టీ సమావేశం కాదని వైఎస్ ప్రేమ, అభిమానాన్ని గుర్తుచేసుకునే సమ్మేళనమని స్పష్టం చేశారు. అంతకుముందు వైఎస్ చిత్రపటం వద్ద విజయమ్మ, షర్మిల ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణలో వైఎస్ పాలనే అసలైన నివాళి వైఎస్ బాటలోనే తాను నడుస్తానని, తెలంగాణ విషయంలో ఆయన కన్న కలలను నిజం చేసేందుకు తన జీవితం అంకితం చేస్తానని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. తెలంగాణలో మళ్లీ రాజశేఖరరెడ్డి పాలన తీసుకు వస్తానని, అదే తాను నాన్నకు ఇచ్చే అసలైన నివాళి అని పేర్కొన్నారు. ‘నియంత పాలన పోవాలి. ప్రజల రాజ్యం రావాలి. రాజన్న రాజ్యం, సంక్షేమ పాలన మళ్లీ రావాలి’ అని అన్నారు. ‘వైఎస్ ప్రేమించిన తెలంగాణ ప్రజలకు పవిత్రమైన వైఎస్సార్ పుష్కరం రోజున మాట ఇస్తున్నాను.నాన్న ప్రేమించిన ఈ ప్రాంత ప్రజల కోసం నేను నిలబడతా, నేను కొట్లాడతా. వాళ్ల మేలు కోరుకుంటూ వారిని ప్రేమిస్తా, వారికి సేవచేస్తా’ అని ప్రకటించారు. ఈ సందర్భంగా వైఎస్తో తనకున్న అనుబంధాన్ని ఆయన సన్నిహిత మిత్రుడు, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు గుర్తు చేస్తుకున్నారు. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి ఎన్,రఘువీరారెడ్డి, మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్కుమార్, జితేందర్రెడ్డి, గిరీష్సంఘీ, శాంతాబయోటెక్ ఎండీ డాక్టర్ వర ప్రసాద్రెడ్డి, సన్షైన్ ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ గురవారెడ్డి, కిమ్స్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ భాస్కరరావు, డాక్టర్ కాసు ప్రసాద్రెడ్డి (మాక్స్విజన్), సీనియర్ జర్నలిస్టులు ఏబీకే ప్రసాద్, కె.శ్రీనివాసరెడ్డి, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, న్యాయ నిపుణుడు జంధ్యాలరవిశంకర్ ప్రసంగించారు. -
వైఎస్ఆర్ అన్నింటికీ అతీతంగా అందరినీ అక్కున చేర్చుకున్నారు : వైఎస్ విజయమ్మ
-
నేడు వైఎస్సార్ సంస్మరణ సభ
సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సంస్మరణసభ గురువారం హైదరాబాద్లోని హైటెక్స్లో జరగనుంది. వైఎస్ 12వ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సభకు రావాలంటూ 300 మందికిపైగా ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. ఇందులో వైఎస్కు సన్నిహితులుగా మెలిగిన పలువురు రాజకీయ నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రిటైర్డ్ న్యాయమూర్తులు, జర్నలిస్టులు, సినీప్రముఖులు ఉన్నా రు. వీరిలో కొందరికి విజయమ్మ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. ఆహ్వానితుల్లో పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ డి.శ్రీనివాస్, మాజీ ఎంపీలు కేవీపీ రామచందర్రావు, ఉండవల్లి అరుణ్కుమార్లతోపాటు మంత్రి సబితాఇంద్రారెడ్డి, పలు పార్టీల సీనియర్ నేతలు జానారెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి బ్రదర్స్, గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, దానం నాగేందర్, శ్రీధర్బాబు, ఎంఏ ఖాన్, సురేశ్షెట్కార్, డి.కె.అరుణ, జితేందర్రెడ్డి, అసదుద్దీన్ ఒవైసీ తదితరులున్నారని నిర్వాహకులు వెల్లడించారు. వీరితోపాటు మాజీ ఐఏఎస్ అధికారులు రమాకాంత్రెడ్డి, బీపీ ఆచార్య, మోహన్కందా, సినీప్రముఖులు చిరంజీవి, నాగార్జున, కృష్ణ, దిల్రాజు, పలువురు రిటైర్డ్ జడ్జీలు, జర్నలిస్టులున్నారని తెలిపారు. ఆహ్వానితుల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులే ఎక్కువగా ఉన్నారని సమాచారం. ఈ సభ ఏర్పాట్లను మాజీ ఐఏఎస్ అధికారి ప్రభాకర్రెడ్డి, వైఎస్ వ్యక్తిగత కార్యదర్శిగా వ్యవహరించిన భాస్కరశర్మ పర్యవేక్షిస్తున్నారు. -
వైఎస్ విజయమ్మ చేతుల మీదుగా ‘లీడర్ టు లీడర్’ డైరీ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితంలోని ముఖ్యఘట్టాలతో పాటుగా, ఆయన తనయుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి వ్యక్తిత్వ విశేషాలతో నవలా రచయిత వేంపల్లి నిరంజన్రెడ్డి రూపొందించిన ‘లీడర్ టు లీడర్’డైరీని గురువారం హైదరాబాద్లో వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ అంటే తమకు ఎనలేని అభిమానమని, 2010లో తొలి సారిగా వెలువరించిన డైరీకి విశేష స్పందన లభించిందని, ఆ స్ఫూర్తితోనే 11 ఏళ్లుగా డైరీలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. డైరీలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితంలోని ముఖ్య ఘట్టాల తో పాటు, జగన్మోహన్రెడ్డి ఓదార్పుయాత్ర, ప్రజా సంకల్పయాత్ర, రైతు భరోసా విశేషాలను ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించామని వెల్లడించారు. -
వైఎస్సార్ పాలనే లక్ష్యం
తెలంగాణలో మళ్లీ వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకురావాలన్నదే తమ పార్టీ లక్ష్యమని వైఎస్ షర్మిల ప్రకటించారు. తమ వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఎజెండాలో సంక్షేమం, స్వయం సమృద్ధి, సమానత్వం ముఖ్యమైన అంశాలని స్పష్టం చేశారు. వైఎస్సార్ సంక్షేమ పథకాలను మళ్లీ ప్రారంభించడం ద్వారా పేదలను స్వయం సమృద్ధులను చేసి రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపడమే ధ్యేయమని చెప్పారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి 72వ జయంతి సందర్భంగా గురువారం సాయంత్రం హైదరాబాద్ రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల కేరింతలు, చప్పట్ల మధ్య ‘వైఎస్సార్ తెలంగాణ పార్టీ’ఆవిర్భావ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పేరును, ఎజెండాను షర్మిల అధికారికంగా ప్రకటించారు. వైఎస్సార్టీపీ జెండాను తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జెండాలోని ముఖ్యాంశాలు వివరించేలా సాగిన లేజర్ షో ఆకట్టుకుంది. సభా ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే వేదిక పక్కన ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహానికి షర్మిల పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వేదిక వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా షర్మిల ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే..వైఎస్సార్ స్ఫూర్తితో సమానావకాశాలు ‘రుణమాఫీ, ఉచిత విద్యుత్, పావలావడ్డీ, ఆరోగ్యశ్రీ, కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనే దార్శనికత వైఎస్సార్ది. 2004–09 మధ్యలో లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడంతో పాటు 11 లక్షలకు పైగా ప్రైవేట్ ఉద్యోగాల కల్పించిన మహానేత వైఎస్సార్. కుల, మతాలకు అతీతంగా, ఆడ..మగ తేడా లేకుండా వైఎస్సార్ ప్రజలందరినీ సమానంగా చూశారు. మేము కూడా అదే స్ఫూర్తితో అందరికీ సమాన అవకా శాలు కల్పించేలా కృషి చేస్తాం. అసెంబ్లీ సహా ఎంపీ స్థానాల్లో మహిళలకు 50% సీట్లు కేటాయిస్తాం. చట్టసభల్లో 50% మహిళలను కూర్చోబెట్టాలనేది మా పార్టీ లక్ష్యం. రాష్ట్ర జనాభాలో 52 శాతమున్న బీసీలకు వారి జనాభా ప్రాతిపదికన పాలనలో సరైన భాగస్వామ్యం కల్పిస్తాం. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు మినహాయించి మిగతా సీట్లలో జనాభా ప్రాతిపదికన బీసీలకు సీట్లు కేటాయిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మెనారిటీలకు రక్షణ కవచంగా నిలిచి ఆయా వర్గాల అభివృద్ధికి కృషిచేస్తాం. ఈ రోజు నుంచి వంద రోజుల్లోగా తెలంగాణలో పాదయాత్ర చేపడతా. కేసీఆర్ ఏం జవాబు చెబుతారు? సంక్షేమంలో నంబర్ 1 అని చెప్పుకునే కేసీఆర్ కరోనాతో అప్పుల పాలైన పేదల కుటుంబాలకు ఏమని సమాధానం చెబుతారు? ఆరేళ్లలో 6 వేల మంది రైతుల ఆత్మహత్యలకు ఏం జవాబిస్తారు? కేసీఆర్ సంక్షేమం అంటే గారడీ మాటలు, గొప్పలు, చేతికి చిప్పలే. ఉపాధి లేక, ఉద్యోగాలు లేక వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే దున్నపోతు మీద వాన పడ్డట్టుగా, తమ కుటుంబానికి నాలుగు ఉద్యోగాలు వచ్చాయి చాలంటూ.. ఇంటికో ఉద్యోగం హామీని కేసీఆర్ మరిచిపోయారు. రాష్ట్రం ఏర్పడ్డాక రూ.4 లక్షల కోట్ల అప్పులు చేశారు. ప్రాజెక్టులపై ఇప్పుడు నిద్ర లేచారా? కృష్ణా నదిపై రెండేళ్ల నుంచి ప్రాజెక్టులు కడుతుంటే సీఎం కేసీఆర్ ఇప్పుడే నిద్రలేచారా? ఇద్దరూ కలిసి ఉమ్మడి శత్రువును ఓడించుకున్నారు కదా. రెండు నిమిషాలు నీటి పంచాయతీపై మాట్లాడుకోలేరా? రెండు రాష్ట్రాల సీఎం లతో చర్చించి పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై లేదా? తెలంగాణకు సంబంధించిన ఒక్క చుక్క నీటి బొట్టును కూడా వదులుకోం. పక్క రాష్ట్రానికి కూడా నష్టం జరగనివ్వం. తెలంగాణలో ఇంకా కాంగ్రెస్ నిలబడి ఉందంటే దానికి కారణం వైఎస్సారే. అలాంటి వైఎస్సార్ను టీఆర్ఎస్ నాయకులు దూషిస్తుంటే కాంగ్రెస్ నేతలు చేతులు ముడుచుకుని చేతగాని వాళ్లలా కూర్చున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై ఆధారాలున్నాయంటున్న బీజేపీ అధ్యక్షుడు, ఎందుకు బయటపెట్టడం లేదు? కేసులెందుకు పెట్టడం లేదు? టీఆర్ఎస్, బీజేపీ తోడు దొంగలే..’ అని షర్మిల విమర్శించారు. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు వైఎస్సార్ జయంతి సందర్భంగా వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద షర్మిల ఘనంగా నివాళులర్పించారు. తండ్రి సమాధిపై పార్టీ జెండాను ఉంచి ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ, బ్రదర్ అనిల్కుమార్, కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలి పాల్గొన్నారు. నాయకుడంటే వైఎస్సారే : విజయమ్మ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ దివంగత నేత వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ భావోద్వేగానికి గురయ్యారు. నాయకుడు అంటే దానికి నిలువెత్తు నిదర్శనం వైఎస్సార్ అని పేర్కొన్నారు. వైఎస్సార్ను చూసి నేర్చుకోవాలని, ఆయనది నిండైన వ్యక్తిత్వమని చెప్పారు. నాయకుడంటే నమ్మకం, భరోసా, ఆప్యాయత, ఆత్మీయతకు చిహ్నమని అన్నారు. తెలుగువారి గుండెచప్పుడు వైఎస్ అని, ఆయనను ఇక్కడి ప్రజలు అమితంగా ప్రేమించారని గుర్తుచేశారు. తెలం గాణను స్వర్ణమయం, సస్యశ్యామలం చేయాలన్నది వైఎస్ కల అని తెలిపారు. ఇది దైవ నిర్ణయం వైఎస్ విశ్వసనీయతను, ఆత్మీయత, హావభావాలను జగన్, షర్మిల పుణికి పుచ్చుకున్నారని విజయమ్మ చెప్పారు. వైఎస్ చిత్తశుద్ధికి, పట్టుదలకు వారు వారసులు అని అన్నారు. వారిప్పుడు వేర్వేరు రాష్ట్రాల ప్రయోజనాలకు ప్రతినిధులని పేర్కొన్నారు. ఇది దైవ నిర్ణయమని, ప్రజాహితం కోసం జరి గిన నిర్ణయమని అన్నారు. ‘వైఎస్సార్ బిడ్డలు దొంగలు, గజదొంగలు కాదు. మాటకు ప్రాణమిచ్చే వారు. దాచుకోవడం, దోచుకోవడం తెలియదు. పంచడం మాత్రమే తెలుసు..’అని చెప్పారు. షర్మిలను తెలంగాణ ప్రజలు అక్కున చేర్చుకుని ఆశీర్వదించాలని విజయమ్మ కోరా రు. ఈ సభలో పార్టీ నాయకులు కొండా రాఘవరెడ్డి, ఇందిరా శోభన్ ప్రసంగించారు. బ్రదర్ అనిల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. షర్మిల పార్టీకి ఆల్ ద బెస్ట్: కోమటిరెడ్డి జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వద్ద నుంచి వెళ్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అక్కడ ఆగి వైఎస్సార్ అభిమానులతో ముచ్చటించారు. వైఎస్ గొప్ప నేత అని కొనియాడారు. అలాంటి నేత ఇంతకుముందు లేడు, ఇక రాడు అని అన్నారు. షర్మిల పార్టీకి ఆల్ ద బెస్ట్ చెప్పారు. కాగా, వైఎస్ షర్మిల పార్టీకి స్వాగతం చెబుతున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా ఆవిష్కరణ
-
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ(వైఎస్సార్టీపీ)ఆవిర్భవించింది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఆయన జయంతి రోజున గురువారం ప్రారంభించారు. దీనిలో భాగంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ.. నాయకుడంటే ప్రజలతో మమేకమై నడవాలని, తెలుగు ప్రజల గుండె చప్పుడు వైఎస్ఆర్ అని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్కు ఎవరిపైనా వివక్ష లేదన్నారు. తన బిడ్డ షర్మిలను ఆశీర్వదించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ బిడ్డల బంగారు భవిష్యత్ కోసమే షర్మిల వస్తోందని భరోసా ఇచ్చారు. వైఎస్ఆర్ ఆశయ సాధనకే షర్మిల పార్టీ పని చేస్తుందని, ఈ క్రమంలో షర్మిల చేయికి.. ప్రజల చేయి ఊతం కావాలని తాను కోరుకుంటున్నట్లు విజయమ్మ విజ్ఞప్తి చేశారు. పార్టీ జెండా అవిష్కరణ అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. వైఎస్ఆర్ నాయకత్వాన్ని నిలబెడతానని, తెలంగాణలో వైఎస్ఆర్ పాలన తీసుకొస్తానన్నారు. నాన్న మాట ఇస్తే.. బంగారు మూట ఇచ్చినట్టేనని వ్యాఖ్యానించారు. శత్రువులు సైతం ప్రశంసించిన నేత మన వైఎస్ఆర్ అని కొనియాడారు. ఐదేళ్ల వైఎస్ఆర్ పాలనలో లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించారు.. నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించారన్నారు. సీఎం కేసీఆర్ అధికారం ఉండగానే ఫాంహౌస్ను చక్కబెట్టుకుంటున్నారని, మాటల గారడీతో పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ఉంటే పేదలకు భరోసా కలిగేది.. తరాలు మారుతున్నాయి.. కానీ ప్రజల తలరాతలు మారడం లేదని’ ఆవేదన వ్యక్తం చేశారు. సంపద సృష్టించడం అంటే ఉపాధి కల్పించడమని, ఉద్యోగాల కోసం లక్షల మంది ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఉపఎన్నికలొచ్చినప్పుడే ఉద్యోగాల భర్తీని తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. స్వయం సమృద్ధి గ్రామాలను తయారు చేయడమే మా లక్ష్యమన్నారు. వైఎస్ఆర్ టీపీలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుపుతూ.. చట్టసభల్లో సగం సీట్లు మహిళలకే కేటాయిస్తామని చెప్పారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు సీట్లు కేటాయిస్తామని హామి ఇచ్చారు. దళితులకు, ఎస్టీలకు భూమి ఇస్తానన్న కేసీఆర్ హామీ ఏమైందిని సూటిగా ప్రశ్నించారు. -
వైఎస్సార్కు నివాళులర్పించిన వైఎస్ విజయమ్మ, షర్మిల
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఇడుపులపాయలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్సార్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల నివాళర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. తెలంగాణలో మరో రాజకీయ పార్టీ అధికారికంగా ఆవిర్భవిస్తోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఆయన జయంతి రోజున గురువారం ప్రారంభిస్తున్నారు. పార్టీ ఆవిర్భావ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. జూబ్లీహిల్స్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం 5 గంటలకు వేలాది మంది వైఎస్సార్ అభిమానుల సమక్షంలో వైఎస్ షర్మిల పార్టీ జెండాను ఆవిష్కరించడంతోపాటు ఎజెండాను, తెలంగాణలో ఏ కారణాలతో పార్టీ ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్న అంశాన్ని ఈ సందర్భంగా వెల్లడించనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వైఎస్ రాజారెడ్డి ఆదర్శప్రాయుడు
పులివెందుల: దివంగత వైఎస్ రాజారెడ్డి ఆదర్శప్రాయుడని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. ఆదివారం వైఎస్ రాజారెడ్డి 23వ వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్ కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక డిగ్రీ కళాశాల రోడ్డులో గల వైఎస్సార్ సమాధుల తోటలో వైఎస్ రాజారెడ్డి, వైఎస్ జయమ్మల సమాధుల వద్ద వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, దివంగత జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, వైఎస్సార్ సోదరుడు వైఎస్ సుదీకర్రెడ్డి, వైఎస్సార్సీపీ సింహాద్రిపురం, లింగాల మండలాల ఇన్ఛార్జి ఎన్.శివప్రకాష్రెడ్డి, వైఎస్సార్ సమీప బంధువు క్రిష్టఫర్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడే ఉన్న వైఎస్ జార్జిరెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి, డాక్టర్ ఇసీ గంగిరెడ్డిల సమాధులతోపాటు ఇతర బంధువుల సమాధుల వద్ద పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ చిన్నప్ప, వైఎస్సార్సీపీ నాయకులు రసూల్, జగదీశ్వరరెడ్డి, పార్నపల్లె నాయుడు, కృష్ణమ నాయుడు, తదితరులు పాల్గొన్నారు. నివాళులర్పించిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే స్థానిక వైఎస్సార్ సమాధుల తోటలోని వైఎస్ రాజారెడ్డి సమాధి వద్ద ఆదివారం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి, రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజారెడ్డి పేద ప్రజలపట్ల ఎంతో ప్రేమతో మెలిగేవారన్నారు. ప్రతి ఒక్కరు పేద ప్రజలకు సేవ చేయాలని ఆయన చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. చదవండి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్రెడ్డి అరెస్ట్ ‘పచ్చ’పేకలో ఖాకీ: ఎస్పీ జోక్యంతో బట్టబయలు -
క్షీణిస్తున్న వైఎస్ షర్మిల ఆరోగ్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ దీక్ష చేస్తున్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయురాలు వైఎస్ షర్మిల ఆరోగ్యం క్షీణిస్తోంది. లోటస్పాండ్లో దీక్షను కొనసాగిస్తున్న షర్మిలను వైద్యులు పరీక్షించారు. షుగర్ లెవల్స్ 88 నుంచి 62కు తగ్గాయని, బరువు 2 కిలోలు తగ్గినట్లు ఆమెను పరీక్షించిన డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి వెల్లడించారు. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేయాలంటూ 72 గంటల దీక్ష చేస్తానని ప్రకటించిన షర్మిల.. గురువారం ఇందిరా పార్కు ధర్నాచౌక్ వద్ద దీక్ష చేపట్టారు. పోలీసులు సాయంత్రం వరకే అనుమతివ్వడం, ఆ తర్వాత ఆమె పాదయాత్రగా లోటస్పాండ్కు బయల్దేరడం.. మధ్యలోనే పోలీసులు ఆమెను అడ్డుకుని ఆమె ఇంటివద్ద వదిలేయడంతో అక్కడే దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. మంచినీరు మాత్రమే తాగుతూ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దు.. మీ కోసం తోడబుట్టిన అక్కగా నేను పోరాటం చేస్తా. ప్రభుత్వ రంగంలోనే కాదు.. ప్రైవేట్రంగం లో కూడా 11 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత వైఎస్సార్ది’అని అన్నారు. షర్మిలకు వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి మద్దతు తెలిపారు. ఆటో యూనియన్ నేత అమానుల్లాఖాన్ ఆటోలతో భారీ ర్యాలీగా వచ్చి షర్మిలకు మద్దతు తెలిపారు. చదవండి: కాంగ్రెస్ వడివడిగా.. -
బరాబర్.. తెలంగాణలో నిలబడతా.. ప్రజల కోసం కొట్లాడుతా
-
వైఎస్సార్ పాలన ఒక స్వర్ణయుగం: వైఎస్ విజయమ్మ
-
వైఎస్సార్ జయంతి రోజున కొత్త పార్టీ: వైఎస్ షర్మిల
సాక్షి, ఖమ్మం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి రోజైన జూలై 8న కొత్త పార్టీని ఆవిష్కరిస్తున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటించారు. అదే రోజున పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటిస్తామని తెలిపారు. ప్రజా సమస్యలపై అధికార పక్షాన్ని నిలదీయడంలో ప్రతిపక్ష పార్టీలన్నీ విఫలమయ్యాయని విమర్శించారు. ఇకపై అధికారపక్షాన్ని నిలదీసేందుకు, ప్రశ్నించేందుకే కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాజన్న తరహా సంక్షేమ పాలన కోసం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే దిశగా తమ పార్టీ ముందుకుసాగుతుందని స్పష్టం చేశారు. ఖమ్మం పట్టణంలోని పెవిలియన్ మైదానంలో శుక్రవారం రాత్రి జరిగిన ‘రాజన్న సంక్షేమ పాలన కోసం సంకల్ప సభ’కు తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి వచ్చిన వైఎస్ షర్మిల తొలుత సభా ప్రాంగణంలో వైఎస్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. అభివృద్ధి ఫలాలన్నీ ఆ కుటుంబానికే.. తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ను తిరిగి ప్రతిష్టించేందుకు పార్టీ పెడుతున్నానని షర్మిల తెలిపారు. ఎన్నో ఆశలతో సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలేవీ నెరవేరడం లేదన్నారు. విద్యార్థులకు కేజీ టూ పీజీ ఉచిత విద్య ఏమైందని ప్రశ్నించారు. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు లేవని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వడం లేదని, కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు లేవని విమర్శించారు. నీళ్లు, నిధులు, ని యామకాలు లక్ష్యంగా సాధించుకున్న తెలంగాణ లో అభివృధ్ధి ఫలాలన్నీ ఒక్క కేసీఆర్ కుటుంబానికే పరిమితం అయ్యాయని, వారి కుటుంబమే లబ్ధి పొందుతోందని ఆరోపించారు. పదవులన్నీ బంధు వర్గానికి, భజన బ్యాచుకే కట్టబెడుతున్నారన్నారు. శుక్రవారం రాత్రి ఖమ్మంలో నిర్వహించిన సంకల్ప సభకు హాజరైన జనం బంగారు తెలంగాణ ఎక్కడుంది? ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్న బంగారు తెలంగాణ ఎక్కడుందని షర్మిల ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవం అంతా కేసీఆర్ దొరగారి ఎడమ కాలిచెప్పు కింద పడి నలిగిపోతోందని విమర్శించారు. దేశంలో సచివాలయానికి రాని ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు తల, తోక తీసేసి రీ డిజైన్ పేరుతో అంచనాలు పెంచేసి అవినీతికి పాల్పడ్డారని, దీన్ని ప్రశ్నించేందుకు ఒక పార్టీ అవసరం లేదా? అని ప్రశ్నించారు. ‘నువ్వు కొట్టినట్లు చెయ్..నేను ఏడ్చినట్లు చేస్తా’అన్న చందంగా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ‘టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు గురిపెట్టిన ప్రజా బాణమై కొత్త పార్టీతో వస్తున్నా..’అని అన్నారు. దారి పొడవునా ఘనస్వాగతం షర్మిలకు హైదరాబాద్ నుంచి ఖమ్మం పట్టణం వరకు దారిపొడవునా ఘన స్వాగతం లభించింది. లోటస్ పాండ్ నుంచే షర్మిల వాహనం వెంబడి వందలాది వాహనాలు అనుసరించాయి. పలుచోట్ల నేతలు, అభిమానులు పూలు, హారతులు, బోనాలతో షర్మిలకు స్వాగతం పలికారు. 15 నుంచి హైదరాబాద్లో నిరాహార దీక్ష రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉన్నా ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని, దీంతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని, ప్రతి ఉద్యోగాన్నీ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ నెల 15 నుంచి హైదరాబాద్లో మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. నాలుగో రోజు నుంచి తమ పార్టీ నేతలు, కార్యకర్తలు జిల్లాల్లో రిలేదీక్షలు చేస్తారని తెలిపారు. నా బిడ్డను ఆశీర్వదించండి: వైఎస్ విజయమ్మ వైఎస్సార్ ప్రజా ప్రస్థానం మొదలు పెట్టిన రోజునే షర్మిల తన రాజకీయ అడుగులు మొదలు పెడుతున్నారని వైఎస్ విజయమ్మ తెలిపారు. దీనికి తెలంగాణ ప్రజల ఆశీస్సులు కావాలంటూ, ఆమెను ఆశీర్వదించాల్సిందిగా కోరారు. షర్మిల స్వభావం పూర్తిగా వైఎస్ రక్తం నుంచే వచ్చిందని, వైఎస్ మాదిరే షర్మిల సైతం మంచి పాలన అందిస్తుందని భరోసా ఇచ్చారు. షర్మిల గతంలో తెలంగాణలో చేసిన ప్రతి యాత్రలో ప్రజలు ఆదరించి అక్కున చేర్చుకున్నారని గుర్తు చేశారు. తన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ కుటుంబం తెలంగాణ ప్రజలకు రుణ పడి ఉంటుందని అన్నారు. వైఎస్ను గతంలో తెలంగాణ ప్రజలు ఆదరించారని, ఆ రుణం ఇప్పుడు తీర్చుకుంటామని తెలిపారు. వైఎస్ భార్యగా, షర్మిలకు అమ్మగా ఆమెను ఆశీర్వదించడానికి ఇక్కడకు వచ్చానని విజయమ్మ పేర్కొన్నారు. -
రాజకీయ పార్టీ పెట్టబోతున్నా: వైఎస్ షర్మిల ప్రకటన
ఖమ్మం: రాజకీయ పార్టీని పెట్టబోతున్నా అని వైఎస్ షర్మిల ఖమ్మం సంకల్ప సభ వేదికగా ప్రకటించారు. వైఎస్సార్ మొదలుపెట్టిన పాదయాత్ర రోజున కొత్త సంకల్పం తీసుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణ నేలతో ఉన్న అనుబంధంతో వచ్చానని చెప్పారు. రాజశేఖర్ రెడ్డి పాలన స్వర్ణయుగం అని తెలిపారు. ప్రశ్నించడానికి.. నిలదీయడానికి పార్టీ పెడుతున్నా అని తెలిపారు. రాజన్న రాజ్యం అందించడానికే కొత్త పార్టీ అని పేర్కొన్నారు. ఉద్యమాల గుమ్మం ఖమ్మం అని ప్రసంగం మొదలుపెట్టారు. ఖమ్మం పెవిలియన్ మైదానంలో శుక్రవారం నిర్వహించిన సంకల్ప సభలో తన తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి షర్మిల పాల్గొన్నారు. అంతకుముందు వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్ విజయమ్మ ప్రసంగం అనంతరం షర్మిల మాట్లాడారు. పల్లె పల్లె నుంచి వచ్చిన ప్రతి వైఎస్ఆర్ అభిమానికి నమస్కరిస్తున్నా అని తెలిపారు. రాజన్న బాటలో నడిచేందుకు రాజకీయాల్లో తాను తొలి అడుగు వేస్తున్నట్లు చెప్పారు. రాజన్న సంక్షేమ పాలన తిరిగి రావాలని సంకల్పిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. 18 ఏళ్ల కిందట మహానేత వైఎస్ఆర్ ప్రజాప్రస్థానం పేరిట ఏప్రిల్ 9న చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించారని గుర్తు చేశారు. అందుకనే ప్రజా ప్రస్థానం మొదలైన ఏప్రిల్ 9 న పార్టీ ఏర్పాటు ప్రకటన చేస్తున్నానని షర్మిల చెప్పారు. ప్రశ్నించడానికి, పాలకవర్గాన్ని నిలదీయడానికి పార్టీ అవసరమని ఆమె ఉద్ఘాటించారు. ప్రతి రైతు రాజు కావాలని కోరుకున్న నాయకుడు వైఎస్ఆర్ అని షర్మిల తెలిపారు. ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న ఆలోచన చేసింది వైఎస్ఆర్ అని గుర్తుచేశారు. కోటి ఎకరాలకు నీరు ఇవ్వాలని జలయజ్ఞానికి వైఎస్ఆర్ శ్రీకారం చుట్టారని, వ్యవసాయాన్ని పండగ చేయాలని వైఎస్ఆర్ కోరుకున్నారని గుర్తుచేశారు. మహిళలు లక్షాధికారులు కావాలని ఆయన కలలు కన్నారు అని షర్మిల తెలిపారు. -
నా బిడ్డ షర్మిలను ఆశీర్వదించండి: వైఎస్ విజయమ్మ
ఖమ్మం: ప్రియతమ నేత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలోనే ఖమ్మం నుంచి ప్రజలతో కలిసి నడిచేందుకు షర్మిల వచ్చిందని వైఎస్ విజయమ్మ అన్నారు. షర్మిలకు మద్దతు తెలిపేందుకు వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలతో తమకున్న అనుబంధం చెరిగిపోనిదని గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ని నాయకుడిగా నిలబెట్టిన ప్రజలకు తమ కుటుంబం రుణపడి ఉంది అని పేర్కొన్నారు. వైఎస్సార్ లేరన్న వార్తతో అనేక గుండెలు ఆగిపోయాయని గుర్తుచేశారు. ఖమ్మం పట్టణంలో శుక్రవారం నిర్వహించిన సంకల్ప సభలో వైఎస్ విజయమ్మ పాల్గొని మాట్లాడారు. ‘‘ వైఎస్సార్ మనిషిని మనిషిగానే ప్రేమించారు. కుల, మత, పార్టీ, ప్రాంతాలకు అతీతంగా అందరినీ సమానంగా చూశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ వైఎస్సార్ సంక్షేమ ఫలాలు అందించారు. కోటి ఎకరాలకు నీరందించేందుకు జలయజ్ఞం ప్రారంభించిన దమ్మున్న నాయకుడు వైఎస్సార్. వైఎస్సార్ పాలన ఒక స్వర్ణయుగం. కరెంటు బిల్లు అయినా, ఆర్టీసీ ఛార్జీలైనా ఏవీ పెంచలేదు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లక్షల మంది ఆరోగ్యానికి మేలు చేశారు. ఎయిర్పోర్టు, పీవీ ఎక్స్ప్రెస్ వే అయినా వైఎస్ఆర్ చలవే. నా బిడ్డ షర్మిలను మీ చేతుల్లో పెడుతున్నా.. ఆశీర్వదించండి’’ అని వైఎస్ విజయమ్మ విజ్ఞప్తి చేశారు. చదవండి: డ్రగ్స్ ఎమ్మెల్యేలు, వసూల్ మంత్రిని తొలగించండి చదవండి: లాక్డౌన్పై రేపు ముఖ్యమంత్రి ప్రకటన -
నోటికొచ్చినట్లు మాట్లాడటం మానుకోండి: కొడాలి నాని
కృష్ణాజిల్లా: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై ప్రతిపక్షాలు నోటికొచ్చినట్టు మాట్లాడటంపై మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. వివేక హత్య జరిగిన కాలంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారనే విషయం తెలుసుకోవాన్నారు. వివేక కుమార్తై విజ్జప్తి మేరకు దీన్ని సీబీఐ విచారణ జరుపుతుందని అన్నారు. వివేక హత్యకేసు విషయంలో విజయమ్మ ఇప్పటికే బహిరంగ లేఖను రాసిన విషయాన్ని కొడాలి నాని గుర్తుచేశారు. దీనిపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. అదే విధంగా, ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడిలో కూడా టీడీపీ వ్యక్తుల ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి. దీన్ని ఎన్ఐఏ దర్యాప్తు చేయడం అందరికీ తెలిసిందేనని అన్నారు. ఈ రెండు కేసులను కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలే చూస్తున్నాయన్నారు. అయినా ప్రతిపక్షాలు కోడిగుడ్డుపై ఈకలు పీకే మాదిరి వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ఏనుగు లాంటివారని ప్రతిపక్షాలు కుక్కల మాదిరిగా మొరిగితే పట్టించుకోరని అన్నారు. కాగా, దోషులను పట్టుకోవడంలో కేంద్ర దర్యాప్తు సంస్థలకు రాష్ట ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని నాని స్పష్టం చేశారు,. -
వైఎస్ కుటుంబంపై పచ్చ కుట్ర
సోదరుడే ముఖ్యమంత్రిగా ఉన్నా.. తనకు న్యాయం జరగడం లేదని సునీతమ్మ కుంగిపోతోందట. షర్మిలమ్మ కూడా సునీతకు మద్దతుగా నిలబడ్డారట. మా బంధువర్గం కూడా రెండుగా చీలిపోయిందట. జరుగుతున్న పరిణామాలు చూసి నేను మానసికంగా కుమిలిపోతున్నానట. ఏమి రాతలివి? అసలు జగన్.. వివేకానందరెడ్డి మీద చెయ్యి చేసుకున్నాడని రాయడమేంటి? వయసులో పెద్దయితే.. ఇంట్లో ఉన్న తోటమాలిని కూడా ‘అన్న’ అని సంభోదించే మనస్తత్వం జగన్ది. – వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సాక్షి, అమరావతి: ఎల్లో మీడియా గాలినంతా పోగేసి, తమ కుటుంబంపై దుర్మార్గపు రాతలు రాస్తోందని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు, ఏపీ సీఎం మాతృమూర్తి వైఎస్ విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై దాడి చేసిన విధంగానే.. ఇప్పుడు తన ఇద్దరు పిల్లలపై చిలువలు పలువలుగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తన కుటుంబంలో కలహాలున్నాయనడం అవాస్తవమని ఆమె స్పష్టం చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో దోషులెవరో నిగ్గు తేల్చాలని తమ కుటుంబంలో ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. జనంలో జగన్కు పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఎల్లో మీడియా విషం చిమ్ముతోందన్నారు. వైఎస్ కుటుంబంపై జరుగుతున్న విష ప్రచారాన్ని తిప్పికొడుతూ ఆదివారం ఆమె బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలోని వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లో మీడియా వెకిలి రాతలు... ఎల్లో మీడియా మూడు రోజులుగా మా కుటుంబం గురించి చేస్తున్న రాజకీయ వ్యాఖ్యలు, విమర్శలను గమనించిన తర్వాత, వైఎస్ రాజశేఖరరెడ్డి భార్యగా ప్రజలకు సమాధానం చెప్పుకునేందుకు ఈ ఉత్తరం రాస్తున్నాను. డాక్టర్ వైఎస్సార్ 2009 సెప్టెంబర్ 2న మరణించిన నాటి నుంచి మా కుటుంబం ఎవరెవ రికి ఏయే కారణాల వల్ల లక్ష్యంగా మారిందో రాష్ట్రంలో రాజకీయాల మీద ప్రాథమిక అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. ప్రజల్లో చంద్రబాబు బలాన్ని పెంచలేమనే నిర్ణయానికి వచ్చినప్పు డల్లా.. మమ్మల్ని వ్యతిరేకిస్తున్న టీడీపీ, ఆ పార్టీకి మద్దతిచ్చే ఈనాడు– ఈటీవీ, ఆంధ్రజ్యోతి– ఏబీఎన్, టీవీ 5 వంటి మీడియా సంస్థలు మాకు వ్యతిరేకంగా వార్తలు, చర్చలు ప్రసారం చేస్తు న్నాయన్నది జగమెరిగిన సత్యం. ఏడేళ్లుగా పవన్ కల్యాణ్ కూడా ఆ బాటలోనే మా కుటుంబాన్ని టార్గెట్ చేయటం అందరికీ తెలిసిన విషయమే. ఈ ఎల్లో మీడియా ఎవరికోసం పనిచేస్తోందో అందరికీ తెలుసు ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన పంచాయతీ, మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీకి ప్రజలు చరిత్రలో కనీవినీ ఎరుగని మెజారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సాక్షాత్తు చంద్రబాబు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. ఇది ఎల్లో మీడియాకు కనిపించదు. ఈ ఎల్లో మీడియా రాజకీయంగా ఎవరి కోసం ఈ పని చేస్తోందో అందరికీ తెలుసు. చిన్న గీతను పెద్దది చేయలేం కాబట్టి, పెద్ద గీతను చెరిపి చిన్నది చేసేందుకు పైన చెప్పిన పార్టీలు, వ్యక్తులు ఒకే మాట, ఒకే బాటగా అబద్ధాలు చెప్పటం ప్రారంభించారు. వారి అసత్యాలను ప్రజలు ఏనాడూ పరిగణనలోకి తీసు కోలేదు కాబట్టే, ఆనాడు మహానేతకు, ఇప్పుడు జగన్కు బ్రహ్మరథం పడుతున్నారు. టీడీపీకి అనుకూలంగా ప్రజలను ఒప్పించడం సాధ్యం కావటం లేదు కాబట్టి, మా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని మమ్మల్ని తగ్గించాలని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చూస్తున్నాడు. వివేకా హత్య దర్యాప్తు ఎవరి చేతుల్లో ఉంది? వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు చేయాల్సింది సీబీఐ, ఎన్ఐఏ. ఈ రెండూ కూడా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కావు. ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థలు. దర్యాప్తు వేగం పెంచాలని, వైఎస్ జగన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. నిజాలు ఇలా ఉంటే రాధాకృష్ణ ఏం రాశారు? డాక్టర్ సునీత ప్రశ్నలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలంటా డు! వివేకానంద మీద జగన్ చేయి చేసుకున్నాడని అప్పట్లో వార్తలొచ్చాయంటాడు. సోదరుడే ముఖ్యమంత్రిగా ఉన్నా.. తనకు న్యాయం జరగడం లేదని సునీతమ్మ కుంగిపోతోందని రాశాడు. అదే సమయంలో షర్మిలమ్మ కూడా సునీతకు మద్దతుగా నిలబడ్డారని రాశాడు. మా బంధువర్గం కూడా రెండుగా చీలిపోయిందని, జరుగుతున్న పరిణామాలు చూసి నేను మానసికంగా కుమిలిపోతున్నట్టు రాశాడు. అసలు జగన్.. వివేకానందరెడ్డి మీద చెయ్యి చేసుకోవడమేంటి? వయసులో పెద్దయితే.. ఇంట్లో ఉన్న తోటమాలిని కూడా ‘అన్న’ అని సంబోధించే మనస్తత్వం జగన్ది. జగన్ మనస్తత్వం జనానికి తెలియదా? సంవత్సరాల తరబడి జరిగిన ప్రజా సంకల్ప పాదయాత్ర, ఓదార్పు యాత్రలో జగన్ స్వభావం, మనస్తత్వం ఎలాంటివో రాష్ట్ర ప్రజలంతా చూశారు. ఈ విషయాలు అందరికీ తెలుసు. ఇంత తీవ్రమైన అసత్య ఆరోపణలను రాధాకృష్ణ ఏ నోటితో చేయగలుగుతున్నాడు. వివేకానంద రెడ్డి వర్ధంతికి నివాళులు అర్పించకుండా ఎవరో అడ్డుకున్నారని రాశాడు. నిజానికి ఆ సందర్భంలో నన్ను హాజరుకమ్మని జగనే నాకు చెప్పాడు. ఇలాంటి సందర్భాల్లో వెళ్లవద్దనే కుసంస్కారం మా ఇంటావంటా లేవు. షర్మిల తెలంగాణలో ఉండాలనుకుంది ముఖ్యమంత్రిగా ఉన్న జగన్, తనకు పొరుగున ఉన్న ఏ రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా, అక్కడి ప్రభుత్వంతోనైనా తన రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా సత్సంబంధాలు ముఖ్యమని భావించినందువల్లే వైఎస్సార్సీపీని తెలంగాణలో నడిపించడం కుదరదని స్పష్టం చేశారు. అందువల్లే ఈ ప్రాంత కోడలిగా ప్రజల్లో, ప్రజా సేవలో ఉండాలని షర్మిలమ్మ నిర్ణయించుకుంది. ఇది వేరెవరో అభిప్రాయాలే తప్ప, వారిద్దరి మధ్య విభేదాలు మాత్రం కావు. అయినా ఓ వీక్లీ సీరియల్గా అసత్యాలతో కథలు రాశారు. ఇక సునీత విషయానికొద్దాం. వివేకానంద రెడ్డిని హత్య చేసింది ఎంతటివారైనా చట్టం ముందు నిలబెట్టి, శిక్షించాలనేదే సునీత డిమాండ్. అదే మా కుటుంబంలో ప్రతి ఒక్కరి అభిప్రాయం. ఈ విషయంలో మా అందరి మద్దతు ఆమెకు ఉంది. మహిళల పట్ల జగన్కున్న అత్యంత గౌరవం, అభిమానం ఆయన పాలనలో, అనేక పథకాల్లో కన్పిస్తున్నాయి. సన్యాసం చేసిన బాబుకు బాకా ఎందుకు? నేను ముందుగానే చెప్పినట్టు.. వీరు తమ మీడియాలో ఎంతగా చంద్రబాబు భజన చేస్తున్నా దాని వల్ల ప్రయోజనం లేదు. చంద్రబాబే రాజకీయ సన్యాసం చేస్తున్నాడు. కాబట్టి వీరికి ఇక మిగిలిన దారేంటి? అసత్యాలు, కట్టుకథలతో వైఎస్సార్ కుటుంబం మీద పడాలన్న నిర్ణయంతోనే గడచిన ఏడాదిగా ఇలాంటి రాతలు మరీ ఎక్కువయ్యాయి. వైఎస్ జగన్, రాష్ట్రపతి ఏం మాట్లాడుతున్నారు? ప్రధాని, జగన్ ఏం మాట్లాడుకున్నారు?.. వారి మధ్య వీళ్లే ఉన్నట్టుగా, పరస్పర సంభాషణలను కూడా ఊహించుకుని, దాన్ని ప్రచారం చేసే పత్రికలతో, అలాంటి వార్తలను పట్టుకుని ప్రెస్మీట్లు పెట్టే పార్టీలతో మా కుటుంబం గత నాలుగున్నర దశాబ్దాలుగా పోరాడుతూనే ఉంది. అసత్యాలను ఇంతగా నమ్ముకుని పత్రికలను, పార్టీలను నడుపుకునేకంటే, వీళ్లంతా వేరే పని చేసుకుంటే బాగుంటుంది. వివేకా హత్య జరిగినప్పుడు చంద్రబాబే సీఎం మా మరిది, వైఎస్ వివేకానందరెడ్డిని 2019 మార్చిలో ఎవరు హత్య చేశారన్నది కచ్చితంగా నిగ్గు తేలాల్సిందే. నాది.. జగన్ది.. షర్మిలమ్మది ఇదే మాట. మా కుటుంబంలో ఎప్పటికీ రెండు మాటల్లేవు. వివేకా హత్య జరిగింది 2019 మార్చి లో. అప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబే. ఆ హత్య తర్వాత కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ హత్యకు సంబంధించిన విషయం లో.. చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేసి, ఆ తర్వాత పార్టీ ఫిరాయించిన ఆదినారాయణరెడ్డి పాత్రపై అనేక అనుమానాలున్నాయి. ఆయన ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఆయనను పవన్ కల్యాణ్ తిరుపతిలో స్టేజీ మీద పెట్టుకున్నారు. దర్యాప్తు సీబీఐ చేతిలో.. అంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందని తెలిసీ, జగన్ మీద విమర్శలు చేశారు. ఇక జగన్ మీద హత్యాయత్నం 2018 అక్టోబర్లో జరిగితే.. 2019 మే వరకూ చంద్రబాబు సీఎంగా ఉన్నారు. దర్యాప్తునకు సంబంధించిన కీలక సమయంలో చంద్రబాబే కేసులను డీల్ చేశారన్న నిజాన్ని మరచిపోయి, ఇప్పుడా దర్యాపు కేంద్రం చేస్తోందని తెలిíసీ.. ఈ రోజు ఏదిపడితే అది మాట్లాడుతున్నాడు. మా సంస్కారం ఎల్లో మీడియాకేం తెలుసు? ఒక రాష్ట్రానికి సీఎంగా ఉన్న జగన్ స్వయంగా తనకు సంబం«ధించిన కేసే అయినా, లేక తన బాబాయి హత్య కేసయినా కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్నప్పుడు తాను చేసేది మాత్రం ఏముంటుంది? ఇవన్నీ అందరికీ అర్థమవుతున్న నిజాలు. అంతెందుకు.. వైఎస్సార్ది ప్రమాద మరణమా? లేక హత్యా? అన్న అను మానం ఆ రోజు అందరిలో ఉంది. మాకూ ఆ అనుమానం ఉంది. కానీ అప్పుడైనా మేం ఏం చేయగలిగాం? మా సంస్కారాన్ని తెలుగుదేశం నేతలు, వాళ్ల అనుకూల మీడియా అధిపతులు గౌరవించకపోయినా ఫర్వాలేదు. కానీ కుటిలమైన రాతలేంటి? బురద పూయడం వాటి పని. శుభ్రం చేసుకోవడం మా పని అన్నట్టుగా రాస్తున్నాయి. చంద్రబాబుకు అధికారం పోయిందన్న కడుపు మంటను ఈ రాతలే స్పష్టం చేస్తున్నాయి. నా పిల్లల్ని చూసి గర్వపడుతుంటే... నా పిల్లలను చూసి, వైఎస్సార్ భార్యగా, వారి తల్లిగా ఎప్పుడూ గర్వపడ్డానే తప్ప.. నేనెప్పుడూ కుంగిపోలేదు. నా పిల్లలు ఇద్దరు ప్రజాసేవలో ఉన్నారని, పట్టుదలతో అడుగులు ముందుకేస్తున్నారని, ఎలాంటి ఎదురు గాలినైనా తట్టుకుని జగన్ నిలబడ్డాడని, పాలనలో కూడా తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నాడని, మహానేతకు భార్యగా, ఏపీ ముఖ్యమంత్రి తల్లిగా ఉన్న నేను.. గర్వపడతానా? లేక కుంగిపోతానా? షర్మిలమ్మ రాజకీయ భవిష్యత్ తెలంగాణలో ఉందని నమ్మింది. ఓదార్పు యాత్ర కావచ్చు.. పాదయాత్ర కావచ్చు.. తెలంగాణలో అవకా శాన్ని దేవుడు తనకే ఇచ్చాడంటే.. దాని అర్థం తెలంగాణ ప్రజలతో తనకు అనుబం«ధాన్ని దేవుడు ఆనాడే రాశాడని షర్మిలమ్మ నమ్ముతోంది. కాబట్టే ఆమె తెలంగాణలో ముందడుగు వేస్తోంది. ఎల్లో మీడియా పిచ్చి రాతలతో నా బిడ్డల మధ్య విభేదాలు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఏనాటికీ జరగదు. -
సజ్జల సోదరుడు దివాకర్రెడ్డి కన్నుమూత
సాక్షి, అమరావతి/బంజారాహిల్స్/కడప కార్పొరేషన్: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుడు, పారిశ్రామికవేత్త సజ్జల దివాకర్రెడ్డి(66) కన్నుమూశారు. దివాకర్రెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతు న్న ఆయన మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. భౌతిక కాయాన్ని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 ఎమ్మెల్యే కాలనీలోని స్వగృహానికి తరలించారు. వైఎస్సార్ జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే శివరామిరెడ్డికి అల్లుడైన దివాకర్రెడ్డి.. ప్రతిపక్షనేత చంద్రబాబుకు సహ విద్యార్థి కూడా. ఈయనకు సతీమణి భగీరథమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సోదరుని మరణవార్త తెలిసిన వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి హైదరాబాద్కు హుటాహుటిన చేరుకున్నారు. దివాకర్రెడ్డి పార్థివ దేహానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతి నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. ఏపీ లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ్రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఇంకా దేవులపల్లి అమర్, ఏకే.ఖాన్, మాజీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డి, ఎస్వీ మోహన్రెడ్డి తదితరులు నివాళి అర్పించారు. సాయంత్రం 5 గంటలకు అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర ఎమ్మెల్యే కాలనీలోని ఆయన ఇంటినుంచి ప్రారంభమైంది.మహాప్రస్థానంలో అంత్యక్రియలు ముగిశాయి. -
వైఎస్ విజయమ్మ సైకత శిల్పం
చిల్లకూరు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి, నవ్యాంధ్రకు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రులుగా చేయడంలో వైఎస్ విజయమ్మ కీలకంగా వ్యవహరించారని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఏరూరుకు చెందిన సైకత శిల్పి మంచాల సనత్కుమార్ ప్రశంసించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె సైకత శిల్పాన్ని రూపొందించానని ఆయన చెప్పారు. -
బోస్ను పరామర్శించిన విజయమ్మ
సాక్షి, తూర్పుగోదావరి : మాజీ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ను వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, షర్మిళ, బ్రదర్ అనిల్ ఫోన్లో పరామర్శించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ను ఫోన్లో పరామర్శించారు. ఇటీవల పిల్లి సతీమణి సత్యనారాయణమ్మ హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా సత్యనారాయణమ్మ బ్రెయిన్ స్ట్రోక్కు గురికావడంతో ఆమె చనిపోయినట్టు నిర్థారించారు. (ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ ఇంట తీవ్ర విషాదం) -
డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ఇక లేరు
సాక్షి ప్రతినిధి కడప/ అమరావతి/ హైదరాబాద్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మామ, పిల్లల దేవుడుగా గుర్తింపు పొందిన ప్రముఖ వైద్యుడు, పులివెందుల మాజీ ఎంపీపీ డాక్టర్ ఎద్దుల చెంగల్రెడ్డి గారి గంగిరెడ్డి (ఈసీ గంగిరెడ్డి) శనివారం తెల్లవారుజామున హైదరాబాద్లో కన్ను మూశారు. వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన్ను రెండు వారాల క్రితం హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం తెల్లవారు జామున ఆయన మృతి చెందినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈసీ గంగిరెడ్డికి భార్య, ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. ఆయన సతీమణి ఈసీ సుగుణమ్మ, కుమారుడు దినేశ్ రెడ్డి కూడా వైద్యులే. ఆయన కుమార్తె వైఎస్ భారతి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి. ఈసీ గంగిరెడ్డి భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి పులివెందులకు తీసుకువచ్చారు. విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులతో సహా శనివారం మధ్యాహ్నం పులివెందుల చేరుకుని ఈసీ గంగిరెడ్డి భౌతికకాయం వద్ద నివాళులు అర్పించారు. సీఎం సతీమణి వైఎస్ భారతి, వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పెద్ద సంఖ్యలో అభిమానులు ఆయనకు నివాళులు అర్పించారు. ప్రముఖుల నివాళి ► ఈసీ గంగిరెడ్డి భౌతికకాయాన్ని పులివెందులలోని ఆయన స్వగృహానికి తీసుకువస్తున్నారన్న విషయం తెలుసుకుని అప్పటికే రాయలసీమతో పాటు ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ► నేరుగా ఈసీ గంగిరెడ్డి నివాసానికి చేరుకున్న సీఎం జగన్.. మామ భౌతిక కాయాన్ని చూసి చలించిపోయారు. బాధాతప్త హృదయంతో కొద్దిసేపు మౌనంగా నిలుచుండిపోయారు. కన్నీటి పర్యంతమైన సతీమణి వైఎస్ భారతిని ఊరడించారు. ఆయనతో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గంగిరెడ్డి కుమారుడు దినేశ్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అక్కడ జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ► వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గంగిరెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గంటన్నరపాటు అక్కడే ఉండి అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు పెద్ద సంఖ్యలో అభిమానులు గంగిరెడ్డికి నివాళులు అర్పించారు. పలువురు అభిమానులు, స్థానికులు కొందరు బోరున విలపించారు. అశ్రు నయనాల మధ్య అంతిమ యాత్ర ► ఈసీ గంగిరెడ్డి అంతిమ యాత్ర శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన నివాసం వద్ద ప్రారంభమైంది. ఆ సమయంలో కుమార్తె భారతి కన్నీటి పర్యంతమయ్యారు. కిలోమీటరుకుపైగా దూరంలోని సమాధుల తోట వరకు అంతిమ యాత్ర సాగింది. ► సీఎం వైఎస్ జగన్, కుటుంబ సభ్యులు, బంధువులు, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు, పెద్ద సంఖ్యలో అభిమానులు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ► సమాధుల తోటలో సాయంత్రం 4 గంటలకు జగన్తోపాటు ఇతర ప్రముఖులు నివాళులు అర్పించారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. ► ఈసీ గంగిరెడ్డికి నివాళులర్పించిన వారిలో ఉప ముఖ్యమంత్రి అంజద్ బాష, మంత్రులు ఆదిమూలపు సురేశ్, శంకర్ నారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి, విప్ కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథ్రెడ్డి, ఎస్.రఘురామిరెడ్డి, డాక్టర్ సుధీర్రెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, సిద్దారెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ► అంత్యక్రియలు ముగిసిన అనంతరం సీఎం వైఎస్ జగన్ తిరుగు ప్రయాణమై సాయంత్రం 6.15 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకున్నారు. పిల్లల దేవుడు ► పులివెందులలో 44 ఏళ్ల పాటు వైద్యుడిగా గంగిరెడ్డి విస్తృతంగా వైద్య సేవలు అందించారు. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించిన ఆయన పిల్లల దేవుడిగా పేరు పొందారు. వేముల మండలం గొల్లెల గూడూరుకు చెందిన ఈసీ సిద్దారెడ్డి, తులసమ్మ దంపతులకు 1949, ఏప్రిల్ 20న ఈసీ గంగిరెడ్డి జన్మించారు. ► 1 నుంచి 5వ తరగతి వరకు గొల్లెలగూడూరులోని ఆర్సీఎం స్కూలులో.. 6, 7, 8 తరగతులు పులివెందుల జిల్లా పరిషత్ హైస్కూలులో చదివారు. 9, 10, 11 తరగతులు వేముల జెడ్పీ పాఠశాలలో, పీయూసీ తిరుపతి ఆర్ట్స్ కళాశాలలో చదివారు. ► బెనారస్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆయన పిల్లల వైద్యంలో స్పెషలైజేషన్ చేశారు. తొలుత వైఎస్ రాజారెడ్డి ఆస్పత్రిలో వైద్యుడిగా పని చేశారు. ఆ తర్వాత సొంతంగా పులివెందులలో ఆస్పత్రిని ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తూ వచ్చారు. ► పిల్లల వైద్యుడిగా ఆయన చేయి పట్టుకుంటే చాలు.. ఎంతటి వ్యాధి అయినా నయమవుతుందన్న పేరు గడించారు. పేద వారికి ఉచిత వైద్య సేవలు అందించారు. దీంతో పులివెందుల నియోజకవర్గంతోపాటు రాయలసీమ వ్యాప్తంగా ఆయనకు పిల్లల దేవుడిగా పేరొచ్చింది. రాజకీయ ప్రస్థానం.. ► ఈసీ గంగిరెడ్డి రాజకీయాల్లో కూడా రాణించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేశారు. 2001లో పులివెందులలో ఎంపీటీసీ–1 స్థానం నుండి ఏకగ్రీవంగా ఎన్నికైన గంగిరెడ్డి పులివెందుల మండల పరిషత్ అధ్యక్షుడిగా చేశారు. పులివెందుల రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. ► 2003 రబీలో ప్రభుత్వం తమకు విత్తనాలు ఇవ్వడం లేదంటూ రైతులు గంగిరెడ్డికి వెళ్లి ఫిర్యాదు చేయడంతో ఆయన వేలాది మంది రైతులతో కలిసి పులివెందుల నుంచి కడప కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేశారు. కలెక్టర్ హామీతో ఆ తర్వాత ఆందోళన విరమించారు. -
మహానేతకు కుటుంబసభ్యుల నివాళులు
-
మహానేతకు నివాళులు
-
మహానేతకు కుటుంబసభ్యుల నివాళులు
సాక్షి, వైఎస్సార్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతిని పురష్కరించుకుని బుధవారం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి ఇతర కుటుంబసభ్యులతో పాటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, రవీంద్రనాథ్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. -
వైఎస్సార్ వ్యక్తి కాదు ఓ శక్తి
ఇచ్చోడ(బోథ్): విజయమ్మ రాసిన ‘నాలో నాతో వైఎస్సార్’ పుస్తకం గొప్ప అనుభూతినిచ్చింది. పుస్తకం చదువుతున్నంత సేపు రాజశేఖర్రెడ్డితో మాట్లాడిన మాటలు, ఆయనతో గడిపిన క్షణాలు కళ్లముందు కదలాడినట్లు అనిపించింది. పుసక్తం చేతిలో పట్టుకుంటే చాలు వైఎస్సార్తో పెనవేసుకున్న మధుర జ్ఞాపకాలు కళ్లలో మెదలుతున్నాయని వైఎస్సార్ అభిమాని, బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు. ‘నాలో నాతో వైఎస్సార్’ పుస్తకం చదివిన ఆయన వైఎస్సార్తో తనకున్న అనుభవాలను మంగళవారం ‘సాక్షి’తో పంచుకున్నారు. వైఎస్సార్ ఓ శక్తి.. వైఎస్సార్తో 1994లో పరిచయం ఏర్పడింది. ఆయన చనిపోయే వారం ముందు ఆయనతో మాట్లాడిన మాటలు ఇంకా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. రాజశేఖర్రెడ్డితో నాకు ఎంతో సానిహిత్యం ఉండేది. ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కార మార్గం చూపేవారు. ఆయన వ్యక్తి కాదు ఓ శక్తి. మిస్టర్ శ్రీనివాస్ అనే వారు.. ఎన్నిసార్లు కలిసినా చెరగని చిరునవ్వుతో మిస్టర్ శ్రీనివాస్ అంటూ ప్రేమగా పొట్టపై చిన్నగా కొట్టేవారు. జిల్లా సమస్యలు విని వాటికి వెంటనే పరిష్కార మార్గం చూపేవారు. ఆదిలాబాద్ జిల్లా అంటే ఆయనకు ప్రత్యేకమైన ప్రేమ ఉండేది. ఆయన స్ఫూర్తితోనే నేను ఈరోజు ఉన్నంతలో కొంత పేదల కోసం ఖర్చు చేస్తూ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. మరిచిపోలేని అనుబంధం 2001లో పాదయాత్రలో పాల్గొన్నాను. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొంది, వైఎస్సార్ సీఎం అయ్యాక ఆయనతో అనుబంధం మరింత పెరిగింది. 2007లో జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు సోనాలలో మా ఇంటికి కూడా వచ్చారు. ఆయన వైద్య వృత్తిలో చేసిన సేవల మాదిరిగానే నా కుమారిడితో ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తాను. -
వైయస్ విజయమ్మతో స్పెషల్ ఇంటర్వ్యూ
-
నేడు వైయస్ విజయమ్మతో స్పెషల్ ఇంటర్వ్యూ రాత్రి 7 గంటలకు
-
ఇలా ఉన్నానంటే వైఎస్సారే కారణం..
సాక్షి, హైదరాబాద్ : ఈరోజు తాను ఇలా ఉన్నానంటే దానికి కారణం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డినే అని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వైఎస్సార్ తనను సొంత సోదరిలా చూసుకున్నారని గుర్తుచేసుకున్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ రాసిన ‘‘నాలో... నాతో... వైఎస్సార్’’ పుస్తకంపై సబితా ఇంద్రారెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం సాక్షితో ఆమె మాట్లాడారు. వైఎస్సార్ ప్రజలందరిపై చెరగని ముద్ర వేసారని అన్నారు. ఆయనతో 37ఏళ్ళ అనుబంధాన్ని విజయమ్మ పుస్తకం ద్వారా చక్కగా అభివర్ణించారని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల పట్ల ఆయన మెలిగిన తీరును వైఎస్ విజయమ్మ చాలా చక్కగా పుస్తకంలో రాశారని అభినందించారు. సహాయం కోసం ఎవరు వచ్చినా నీకు నేనున్నానంటూ భరోసానిచ్చిన నేత వైఎస్సార్ అని చెప్పారు. (ఆత్మనివేదనలో అంతరంగం) ‘కుటుంబ సభ్యులకు ఆత్మీయత, అనురాగాలను పంచిన తీరు విజయమ్మ చాలా చక్కగా పుస్తకంలో రాసారు. ఈ పుస్తకంలో నాకంటూ ఒక పేజీ ఉందని ఎంతో సంతోషిస్తున్నా. వైఎస్సార్ ప్రతీ ఒక్కరినీ చిరునవ్వుతో పలకరించేవారు. కుటుంబానికి న్యాయం చేస్తూనే.. రాష్ట్రాన్ని ఎలా లీడ్ చేయవచ్చు అనే అంశాల ద్వారా వైఎస్సార్ అందరికీ ఆదర్శప్రాయులు. సొంత చెల్లిలా అన్న నన్ను ఆదరించారు. అపశకునం అని ఎంతమంది చెప్పినా వినకుండా పాదయాత్ర నా వద్దనుండే ప్రారంభించారు. రచ్చబండ కూడా నావద్ద నుండి ప్రారంభించి ఉంటే ఆయన బ్రతికేవారేమో. ఈరోజు నేనిలా ఉన్నానంటే అందుకు అన్నే కారణం. పాదయాత్రలో షర్మిల కొడుకు రాజాబాబు కలిసిన సందర్భంలో ప్రత్యక్షంగా నేను అక్కడే ఉన్నాను. ఎత్తుకుంటాం అని చెప్పినా నేను తాతతో నాడుస్తానని రాజాబాబు నడిచాడు’ అని అన్నారు. (‘నాలో.. నాతో.. వైఎస్సార్’కు విశేష పాఠకాదరణ) కాగా వైఎస్సార్’’పుస్తకాన్ని, మహానేత 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్ విజయమ్మ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. వైఎస్ సహధర్మచారిణిగా విజయమ్మ 37 ఏళ్ల జీవితసారం ఈ పుస్తకం. 2009 సెప్టెంబరు 2న అనూహ్యంగా వైఎస్ మరణించిన నాటి నుంచి కలిగిన భావోద్వేగాల సమాహారం ఈ పుస్తకం. కొడుకుగా, తండ్రిగా, అన్నగా, తమ్ముడిగా, భర్తగా, అల్లుడిగా, మామగా, స్నేహితుడిగా, నాయకుడిగా... నిజ జీవితంలో వైఎస్సార్ ఈ వేర్వేరు పాత్రల్లో ఎలా ఉండే వారో, ప్రతి ఒక్కరితో ఎంత ఆత్మీయంగా మెలిగేవారో విజయమ్మ వివరించారు. -
నాలో..నాతో..YSR
-
ఆత్మనివేదనలో అంతరంగం
పోగొట్టుకున్నది ఒక మనిషిని కాదు, ఒక ముఖ్యమంత్రిని కాదు, ఒక బంధువుని కాదు. మనం పోగొట్టుకున్నది ఒక జీవన ఆశయాన్ని, జీవింపజేసే ఆశను. ఒక వేళ నా ప్రేమ అందరి ప్రేమ కంటే గొప్పదై ఉంటే మరి నేనెందుకు జీవించి ఉన్నాను. ఆయన కోసం మరణించిన వారిలో నేనెందుకు లేను అన్న సందేహానికి ఎవ రెన్ని సమాధానాలిచ్చినా నాకు మాత్రం ప్రతి శ్వాస ఒక పరీక్షగానే మారింది. – వైఎస్ సతీమణి విజయమ్మ తలపోతలు బాధాతప్తహృదయ భారంతో విజయమ్మ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి, ఆత్మీయ భర్త వైఎస్ రాజశేఖరరెడ్డి దివంగతు లైన తర్వాత రాసుకున్న జీవన ఘట్టాల సమాహారం ‘నాలో.. నాతో వైఎస్’ అన్న గ్రంథం. దీన్ని చదువుతున్నప్పుడు, ముఖ్యంగా విజ యమ్మ తలపోతలను చూస్తున్నప్పుడు, కస్తూర్బా గాంధీ తన భర్త గాంధీతో వివాహబంధం గురించి ప్రస్తావిస్తూ, తన ఆఖరి ఘడియ లలో ఆమె గాంధీపట్ల తన హృదయావేదన గురించి అన్న మాటలు జ్ఞప్తికి వస్తున్నాయి: ‘మీరు నాకు లభించడం గతంలో నేను చేసుకున్న మంచి పనుల ఫలితం. కాబట్టే మీరు నాకు భర్తకాగలిగారు. మీరు నా ఆత్మీయ స్నేహితులు, నాకు అనుపమాన గురువులు. నా ఆఖరి శ్వాస వరకు మీ సేవలోనే ఉంటా. మీకన్నా వయస్సులో కొద్ది మాసాలే పెద్దదాన్ని అయినా నా జీవిత భాగస్వామి, గురువైన మిమ్మల్ని దేవుడు పిలవకముందే మృత్యువు నన్ను తన ఒడిలో చేర్చుకొనుగాక‘ విజయమ్మకు సమాధానం ఇచ్చేవారు లేకనే ఆమెకు తన ప్రతి శ్వాసా పరీక్షా ఘట్టంగా మారవలసివచ్చింది. క్రమశిక్షణకు కర్మసాక్షిగా ఎదిగి వచ్చిన సమర్థుడైన కుమారుడు జగన్మోహన్రెడ్డి అఖండ పాద యాత్ర ద్వారా ఎన్నికలలో కనీవినీ ఎరుగని మెజారిటీతో తన పార్టీని ప్రజల ఆశీర్వాదాలతో గెలిపించుకుని ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేయడంతో ఆమె ఉచ్ఛ్వాసనిశ్వాసలకు ఊరట కలిగి ఉంటుంది. ఆమె తన గతాన్ని తల్చుకుని బిడ్డ ముఖ్యమంత్రి పదవిని అలంకరించబోతున్న సమయంలో ప్రేక్షకుల గుండెలు అవిసిపోయే టట్టు గత సన్నివేశాలు ఒక్కసారిగా ఆమె సజల నేత్రాలను కమ్మి వేయడాన్ని అశేష ప్రజానీకం గమనించింది. తండ్రి స్థానంలో తల్లే రెండు పాత్రలనూ తానే పోషించి జగన్ జీవితాదర్శాన్ని, తండ్రి లక్ష్యా లను మరింత సునిశితం చేయడానికి దోహదం చేసింది. తెలుగు ప్రజల, రాష్ట్ర సౌభాగ్యం కోసం, సంక్షేమం కోసం అంతకుముందు ఎవరూ ఎరుగని వినూత్న పథకాలను వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారం భించగా, ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీల పేరిటనే ఆ పథకాలకు నామ కరణం చేసి విజయపథంలో సాగిస్తున్న తరుణంలో ప్రచారంలో లబ్ధి పొందింది కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వమే. కానీ కృష్ణ–గోదావరి బేసిన్లోని, విలువైన ఇంధన వనర్లను గుజరాత్ వ్యాపారులు కొందరు రాష్టానికి దక్కనివ్వకుండా గుజరాత్కు తరలిస్తుండగా మోకాలొడ్డిన ఏకైక రాష్ట్రనాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆంధ్రప్రదేశ్లో పెద్ద స్థాయిలో పాదయాత్రలకు అంకురార్పణ జరిగిన కాలం 1935–36. ఆనాడు ఉత్తరాంధ్రలోని ఇచ్ఛాపురం నుంచి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం వరకు రైతాంగ సమస్యలపై అసెంబ్లీకి మహజర్లు సమర్పించడానికి వామపక్ష నేతలు బొమ్మారెడ్డి సత్యనారాయణ, చలసాని వాసుదేవ రావు నాయకత్వాన సాగిన యాత్ర చరిత్రకెక్కింది. ఆ తర్వాత వైఎస్సార్ నాయకత్వాన రాయలసీమ రైతాంగ సమస్యలపై, ప్రజా సమస్యలపై 1986 జనవరి 3 నుంచి అశేష ప్రజా నీకంతో లేపాక్షి నుంచి సాగిన పాదయాత్ర. సీమ ప్రజల వాస్తవ పరిస్థితులను, కరువు సమస్యలను తెలుసుకుంటూ వివరిస్తూ, ప్రజల్లో చైతన్యం కలిగించారాయన. ఆరోజుల్లో తొలి అనుభవాన్ని ప్రజలు తల్చుకుంటూ, ‘నడిచింది వైఎస్ కాదు, నడిచింది రాయలసీమ. నడి పించింది వైఎస్ రాజశేఖరరెడ్డి’ అని వర్ణించుకున్నారు! 2003లో జరిగిన పాదయాత్రకు 18 ఏళ్ల ముందే ప్రారంభమైన వైఎస్సార్ ఆ తొలి యాత్ర 500 కిలోమీటర్లలో 60 గ్రామాలు, ఆరు పట్టణాల మీదుగా సాగింది. అలా నేర్చుకున్న ఈ తొలిపాఠం.. ‘నాయకులు ఆఫీసుల్లో కూర్చోకుండా ప్రజల మధ్య ఉంటే ప్రజలకెంతో మేలు జరుగుతుంది, చిన్న చిన్న అవసరాలకు కూడా ప్రజలు ఎంత మధనపడుతుంటారో తెలిసొస్తుంది. నాయక త్వంలో ఉండాల్సిన గొప్ప గుణమల్లా నాయ కులు ప్రజలకు అందు బాటులో ఉండటమేన’న్నది వైఎస్సార్ విస్పష్ట ప్రకటన. అలా లేపాక్షి నుంచి ప్రారంభమైన సీమ యాత్ర.. తర్వాత పాదయాత్రకు వేసిన జాంబవంతుని అంగ. ఆయన తొలిసారి ముఖ్య మంత్రి పదవికి రావడానికి ముందు, 2003లో చేవెళ్ల నుంచి ప్రారంభ మైన పాదయాత్ర–జనయాత్ర శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకు సాగి రాష్ట్రవ్యాపిత సంచలనానికి కారణమయింది. ఆ సంద ర్భంగా ఆంధ్ర ప్రభ సంపాదకుడిగా నాదొక అనుభవం చెప్పాలి. ఇప్ప టిలాగానే ఆనాటి కొన్ని ‘ఉంపుడు పత్రికలు’ కూడా ఎన్నికల్లో వైఎస్, కాంగ్రెస్ ఓడిపోబోతోందని సర్వేల పేరిట ప్రచారం చేస్తున్న సమ యంలో ఒక్క ‘ఆంధ్రప్రభ’ మాత్రమే భారీ ఎత్తున తొలిసారిగా 10 వేల శాంపుల్స్తో జిల్లాల్లో నిర్వహించిన సర్వే ‘వైఎస్ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ కాంగ్రెస్ విజయం’ గురించి పతాక శీర్షిక పెట్టింది. వైఎస్ సారథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం ఖాయం అయింది. పాదయాత్ర నుంచి తిరిగొచ్చిన తర్వాత వైఎస్ మరుసటి రోజున నాకు ఫోన్ చేసి ‘ఏబీకే మీరు రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్కు రండ’ని కోరారు. అలాగే వెళ్లాను. డైనింగ్ హాల్లో ముగ్గురమే ఉన్నాం– వైఎస్, నేను, విజయమ్మ. ఆమెదే వడ్డన, ఆమె ఒద్దిక, ఆప్యాయత, అచ్చం తెలు గింటి ఆడపడుచుదే. నేనూ, వైఎస్ పిచ్చాపాటీ మాట్లాడు కున్నాం. ‘ప్రభ సర్వే’ ఎలా దాదాపు ఫలితాలకు చేరువగా వచ్చిందంటే, మొదటిసారిగా శాంపుల్స్ సంఖ్యను పెద్ద మోతాదులో తీసుకున్నందు ననే ఎన్నికల ఫలితాలు వాస్తవానికి దగ్గరగా వచ్చాయని వివరించాను. విజయమ్మ అప్పటికే కేవలం గృహిణి కాదు, వైఎస్ సాహ చర్యంలో తన చదువుకు, జ్ఞాన కాంక్షకు మరింత మెరుగులు దిద్దు కుంది. అందుకే ఆమె తన పుస్తకంలో ఎన్నో జ్ఞాపకాలను, పరిచయా లను, అనుభూతులను అలవోకగా గుదిగుచ్చి ఒక ఉత్తమ గ్రంథంలో గుదిగుచ్చి మనకు అందించగలిగారు. పుట్టింటివారి, అత్తింటివారి మధ్య ఆప్యాయతలు, తెలుగు వాకిళ్లలో సంసారపక్షంగా సాగే కుటుం బాలు, కష్టసుఖాలు, బాదరబందీలు, పరస్పర అనుబంధాలు, అను రాగాలు, అలకలు, పొల అలకలు, పోటీ అలకలు, ఆగడాలు, ఆత్మీయ తలు, ఆడపిల్లల పెంపకాలు, పెళ్లిళ్లప్పుడు అంపకాలు, బావా మర దళ్ల మధ్య చిలిపితనాలు, పండగల సరదాలు, పేరంటాలు, పరస్పరం ఎత్తిపొడుపులు, బాధించని ఎకసెక్కాలు– ఇలా ఒకటేమిటి, తెలుగు లోగిళ్లలోని కుటుంబ బాంధవ్యాలలోని వెలుగునీడల సయ్యాటల ఆవిష్కరణే విజయమ్మ ‘నాలో–నాతో వైఎస్’ గ్రంథం. పరిపాలనలో, ఆచరణలో ప్రభుత్వాల వైఫల్యాలను శాస్త్రీయంగా బేరీజు వేసుకుని ప్రజా సంక్షేమం కోసం నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలన్నది వైఎస్ ఆదర్శం. అనంతపురం జిల్లా చీమలవారిపల్లికి, కడప జిల్లా పులివెందులకు మధ్య ఏర్పడిన వియ్యంకుల బంధం, పులివెందుల లోనే పాగా వేసింది. అన్నింటికన్నా విశేషం– వైఎస్ తండ్రి రాజారెడ్డికి, విజయమ్మ తండ్రి రామానుజుల రెడ్డికి అదేమి అనుబంధమోగానీ, ఇరువురూ దానకర్ణులుగా పేరు మోయడం ఫ్యాక్షనిస్టు గొడవల్లో బతికే వారికి తప్ప సీమ రాజకీయాల్లో తలపండిన పెద్దలందరికీ తెలిసిందే. రాజారెడ్డి వామపక్ష రాజకీయాలలో, ప్రజానాట్యమండలి శాఖలతో అంతో ఇంతో సంబంధాలున్నవారు, సాంస్కృతిక కార్యకలాపాలకు ధన సహాయం చేసినవారూ. ఆ భావాలు వారసత్వంగానే కాంగ్రెస్లో ఉన్నా అంతో ఇంతో ‘రాజా’ (వైఎస్)కు కూడా కొంతమేరకు అబ్బ బట్టే, వెలిగొండ ప్రాజెక్టుకు సుప్రసిద్ధ వామపక్ష నాయకుడు పూల సుబ్బయ్య పేరు పెట్టడమూ, రాష్ట్ర రైతాంగ సమస్యలపైన, రుణాల పైన సమీక్షించి సమగ్ర నివేదికను అందించేందుకు సుప్రసిద్ధ ఆర్థిక వేత్త, వామపక్ష మేధావి అయిన జయతీ ఘోష్కు పురమాయించారు. అలాగే ఈనాటి యువతకు ఎన్నో పాఠాలు నేర్పగల అద్వితీయ అనుభవ సారమే విజయమ్మ ఆత్మనివేదనలోని అంతరంగ ఆవిష్క రణ– ఈ గ్రంథం. ఎందుకంటే తన కష్టసుఖాల కథావిష్కరణలో విజ యమ్మ నుంచి వెలువడిన ఎన్నో ఆణిముత్యాలలో ఒకటి: ‘స్వార్థం పెరిగే వయసులో స్నేహం పెంచిన సంస్కారం వైఎస్ది. ప్రతి యువ తిని తన తోబుట్టువుగా కాపాడిన ఉడుకు నెత్తురు ఆయనిది. స్నేహితు లకు అంత ప్రేమను వైఎస్ పంచేవారు’. అందుకే ఆమె మెట్టినింటిని తనకు మెచ్చినిల్లుగా తీర్చిదిద్దుకున్న మహిళ. వైఎస్ పాదయాత్రల స్ఫూర్తితోనే విజయమ్మ వైఎస్ గారాలపట్టి షర్మిల, ప్రేమాంకురబీజం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్క పూలదండగా.. వరసవారీ సుదీర్ఘ పాద యాత్రలు జరిపి, దళిత బహుజన వర్గాల సముద్ధరణకు పెట్టుబడి దారీ–భూస్వామ్య వ్యవస్థ సృష్టించిన ఆటంకాలను చేతనైన మేరకు ఛేదించుకుంటూ విజయాలను సాధించుకుంటూ వస్తున్నారు. కనుకనే తండ్రి వైఎస్ పేదల కోసం ఒకడుగు ముందుకు వేస్తే, జగన్ రెండడుగులు ముందుకు వేస్తున్నాడు. పేద ప్రజల ఆరోగ్య భాగ్యరక్షణకు వైఎస్సార్, వైఎస్ జగన్ ఇద్దరూ పోటాపోటీలమీద జల సంక్షేమ, ప్రజా సంక్షేమ పథకాల మీదనే ఒకరికి మించి మరొకరు కేంద్రీకరించారు. అదీ– వారసత్వంగా, అప్పనంగా వచ్చిన పదవి కాదు జగన్ది. వేదనల గరళాన్ని ఆరగించుకుని, ఆవేదనతో ముందుకు సాగు తున్న జగన్ది. ఈ వేళ రెండడుగులు కాదు, రేపు మూడడుగులకు పెరి గినా, అంతకుమించినా ఆశ్చర్యపోనక్కర లేదు. బహుశా అందుకే నేమో విజయమ్మ ఒక బైబిల్ సామెతను ఉదహరిం చారు: ‘డేవిడ్ ఒక దేవాలయం నిర్మించాలనుకున్నప్పుడు దేవుడు అతనితో– అది నువ్వు కాదు, నీ కొడుకు చేస్తాడు’ అని చెప్పాలన్నదే ఆ సామెత సారాంశం!(ఈ విశిష్ట గ్రంథాన్ని ప్రచురించిన ఎమెస్కో ప్రచురణకర్తలకు, కళాజ్యోతి ముద్రాపకులకు ప్రత్యేక కృతజ్ఞతలు) వ్యాసకర్త: ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఎమెస్కో ప్రచురించిందే అసలైన పుస్తకం
సాక్షి, అమరావతి: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ తన భర్తపై రాసిన ‘నాలో.. నాతో.. వైఎస్సార్’ పుస్తకానికి, అదే పేరుతో సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతున్న పీడీఎఫ్ ఫైలుకు ఏమాత్రం సంబంధం లేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎమెస్కో పబ్లిషర్స్ సంస్థ ప్రచురించిందే అసలైన పుస్తకమని ఆయన స్పష్టం చేశారు. ఈ పుస్తకంలోని అంశాలు, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న పీడీఎఫ్ ఫైలులోని అంశాలు వేర్వేరుగా ఉన్నాయన్నారు. ఆ ఫైల్ను దురుద్దేశంతో సర్క్యులేట్ చేస్తుండటంపై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశామని, అభిమానులు దీన్ని గమనించాలని తెలిపారు. -
దురుద్దేశంతోనే నకిలీ పీడీఎఫ్: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, అమరావతి: ‘‘నాలో..నాతో..వైఎస్సార్’’ పుస్తకం పేరుతో పీడీఎఫ్ ఫైల్ను సామాజిక మాధ్యమాల్లో సర్క్యూలేట్ చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని, వైఎస్ విజయమ్మ రాసిన పుస్తకానికి, దీనికి సంబంధం లేదని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఎమెస్కో పబ్లిషర్స్ అచ్చువేసిన పుస్తకమే అసలైన పుస్తకమని ఆయన స్పష్టం చేశారు. ‘‘సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతున్న పీడీఎఫ్ ఫైల్లోని అంశాలు వేర్వేరుగా ఉన్నాయి. దురుద్దేశంతో ఈ పీడీఎఫ్ఫైల్ను సర్క్యులేట్చేస్తున్నారు. దీనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశామని, వైఎస్సార్ అభిమానులు కూడా ఈ అంశాన్ని గమనించాలని వైవీ సుబ్బారెడ్డి కోరారు. -
సోల్డవుట్
-
‘నాలో.. నాతో.. వైఎస్సార్’కు విశేష పాఠకాదరణ
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గురించి ఆయన సతీమణి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రాసిన ‘నాలో.. నాతో.. వైఎస్సార్’ పుస్తకం తెలుగు పుస్తకాల విక్రయాల్లో కొత్త చరిత్ర సృష్టిస్తోంది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పట్ల తెలుగు వారిలో వెల్లువెత్తుతున్న విశేష జనాదరణకు నిదర్శనంగా నిలుస్తోంది. ఆ మహానేత గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే.. ఇంకా తెలుసుకోవాలన్న ఉత్సుకత సర్వత్రా వ్యక్తమవుతోందనడానికి అశేష పాఠకాదరణే నిదర్శనం. అందులోనూ వైఎస్ రాజశేఖరరెడ్డి గురించి ఆయన సతీమణి విజయమ్మ రాయడంతో పాఠకులకు మరింత ఆసక్తి కలిగిస్తోంది. అందుకే ఎమెస్కో పబ్లిషర్స్ ప్రచురించి ఆన్లైన్ పోర్టల్ అమెజాన్ ఇండియా సంస్థ ద్వారా ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చిన ఈ పుస్తకం అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తోంది. మొదటి ఎడిషన్ ప్రతులన్నీ తొలిరోజే విక్రయం ► ‘నాలో నాతో వైఎస్సార్’ పుస్తకాన్ని ఆ మహానేత జయంతి సందర్భంగా ఈ నెల 8న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ప్రచురించిన ఎమెస్కో పబ్లికేషన్స్ ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేవలం ఆన్లైన్ ద్వారానే విక్రయించాలని నిర్ణయించింది. ► మొదటి ఎడిషన్ కింద ముద్రించిన 5 వేల కాపీలన్నీ తొలిరోజే అమ్ముడైపోయాయి. ఆన్లైన్లో విక్రయాలు ప్రారంభించిన కాసేపటికే అమ్మకాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. 24 గంటలు తిరగకముందే అన్నీ కాపీలు అమ్ముడైపోయాయి. ఆన్లైన్ ద్వారా విక్రయాల్లో ఓ తెలుగు పుస్తకం మొదటి ఎడిషన్ కాపీలన్నీ తొలి రోజే అమ్ముడవ్వడం ఇదే తొలిసారని ఎమెస్కో పబ్లికేషన్స్ ప్రకటించింది. పాఠకుల కితాబు ► ‘నాలో నాతో వైఎస్సార్’ పుస్తకం అమ్మకాల్లో బెస్ట్ సెల్లర్గా నిలిచింది. ఈ పుస్తకాన్ని కొనుగోలు చేసి, చదివిన పాఠకులు.. ‘పుస్తకం చాలా బావుంది.. అద్భుతం’ అంటూ ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చారు. దీంతో తమకు ప్రతులు కావాలని పాఠకుల నుంచి విపరీతమైన డిమాండ్ వ్యక్తమవుతోంది. ► దాంతో ఎమెస్కోపబ్లికేషన్స్ ఈ పుస్తకం రెండో ఎడిషన్ ముద్రణ చేపట్టింది. సోమవారం నాటికి రెండో ఎడిషన్ పుస్తకాలు అందుబాటులోకి వస్తాయి. ► ఈ పుస్తకాన్ని ఇంగ్లిష్ పాఠకులకు అందుబాటులోకి తేవడానికి పెంగ్విన్ పబ్లికేషన్స్ ముందుకు వచ్చింది. -
మదిలో మహానేత
-
వైఎస్సార్కు ఘన నివాళి
47 ఏళ్లుగా వైఎస్సార్తో, వైఎస్సార్ కుటుంబంతో పెనవేసుకున్న అనుబంధం ఉన్న వారందరికీ ఈ పుస్తకాన్ని అందిస్తాను. సహృదయంతో అందరూ చదవాలి. వైఎస్సార్ నాకు స్ఫూర్తి. ఆయన మాటలు మీ అందరిలోనూ స్ఫూర్తి నింపుతాయని నమ్ముతున్నాను. రాజశేఖరరెడ్డి నావాడే కాదు. అందరి వాడని గర్వంగా చెబుతున్నా. ఈ అనుబంధం కలకాలం నిలవాలని, మీ ప్రేమ, మీ ఆశీర్వాదాలు నా బిడ్డలకు సదా ఉండాలని కోరుకుంటున్నాను. – వైఎస్ విజయమ్మ వైఎస్సార్ ప్రతి మాట, ప్రతి అడుగు గురించి చాలా మంది తెలుసుకుని ఆచరణలో పెట్టాలి. నాతోనే కాకుండా, రాష్ట్ర ప్రజలందరితోనూ ఆయనకు చెరగని బంధం ఉంది. ఆయన సహచర్యం ఒక మార్గదర్శకం. ఆయన పిలుపు ఓ భరోసా. ఆయన మాట విశ్వసనీయతకు మారుపేరు. వైఎస్సార్ నాయకత్వం, దార్శనికత, విలువలు మన జీవితాలను నడిపిస్తాయి. –వైఎస్ విజయమ్మ నాలో.. నాతో.. వైఎస్సార్’ అని అమ్మ.. నాన్నలో ఉన్న ఒక తండ్రి, ఒక భర్త, ఒక మంచి వ్యక్తి గురించి రాసింది. నాన్న జయంతిని పురస్కరించుకుని అమ్మ రాసిన ఈ పుస్తకాన్ని ఈ రోజు ఆవిష్కరించా. నాన్న బయట ప్రపంచానికి ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా పరిచయమయ్యారు. నాన్నతోపాటు ప్రయాణం చేసిన సుదీర్ఘ ప్రయాణంలో ఆమె తెలుసుకున్న, చూసిన దానిని ఈ పుస్తకంలో రాశారు. – భావోద్వేగంతో సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, కడప: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం రాత్రి ఇడుపులపాయ గెస్ట్హౌస్లో బస చేసిన ముఖ్యమంత్రి, కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం 8.50 గంటల ప్రాంతంలో వైఎస్సార్ ఘాట్కు చేరుకున్నారు. పూలమాలలు వేసి దివంగత వైఎస్కు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వైఎస్ విజయమ్మ రాసిన ‘నాలో.. నాతో.. వైఎస్సార్’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తకం గురించి వైఎస్ జగన్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి. సీఎం భావోద్వేగాన్ని గమనించిన కుటుంబ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అక్కడున్న వారందరూ చలించిపోయారు. అందరి కళ్లలోనూ నీళ్లు తిరిగాయి. అనంతరం 9.30 గంటలకు సీఎం సమీపంలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ ప్రాంగణానికి చేరుకున్నారు. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న సీఎం వైఎస్ జగన్, వైఎస్ భారతమ్మ, షర్మిల. జగన్ను ముద్దాడుతున్న వైఎస్ విజయమ్మ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ► గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు సాంకేతిక విద్యనందించేందుకు ఇడుపులపాయ ఆర్కే వ్యాలీలోని ట్రిపుల్ ఐటీలో రూ.139.83 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా నిర్మించిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తరగతి భవనాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ► రూ.10.10 కోట్ల అంచనాతో నిర్మించనున్న కంప్యూటర్ సెంటర్కు, రూ.40 కోట్ల అంచనాతో అంతర్జాతీయ స్థాయిలో నిర్మించనున్న డాక్టర్ వైఎస్సార్ ఆడిటోరియంకు సీఎం శంకుస్థాపన చేశారు. ఆరు ఎకరాల్లో రెండస్తుల్లో ప్రపంచ స్థాయి ఆడిటోరియం నిర్మిస్తున్నారు. ► 3 మెగా వాట్ల సామర్థ్యంతో నిర్మించిన సోలార్ పవర్ ప్లాంట్ను సీఎం ప్రారంభించారు. దీని ద్వారా విద్యుత్ బిల్లులు మరింత తగ్గి సంవత్సరానికి విశ్వవిద్యాలయానికి రూ.1.51 కోట్ల విద్యుత్ ఖర్చు ఆదా కానుంది. అనంతరం ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దివంగత డాక్టర్ వైఎస్సార్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ► తిరిగి 10 గంటలకు ఇడుపులపాయ హెలిప్యాడ్కు చేరుకున్న సీఎం.. 10.15 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ, ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్ భారతమ్మ, షర్మిల, వైవీ సుబ్బారెడ్డి, ఇతర కుటుంబ సభ్యులతోపాటు జిల్లా ఇన్చార్జ్ మంత్రి సురేష్, చీఫ్ విప్ గడికోట, విప్ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వైఎస్సార్ జీవితం అందరికీ ఆదర్శం : వైఎస్ విజయమ్మ వైఎస్సార్ జీవితం అందరికీ ఆదర్శనీయమని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. ‘నాలో.. నాతో.. వైఎస్సార్’ పుస్తకం ఆవిష్కరణ అనంతరం ఆమె ప్రసంగించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ► నేను ఆయనలో చూసింది.. ఆయన మాటల్లో విన్నది.. నా 37 ఏళ్ల సహచర్యంలో ఆయన గురించి రాయాలనిపించింది. ఆయన మాటకిచ్చే విలువ గురించి రాయాలనిపించింది. ఎంతో మంది మా జీవితాల్లోకి వచ్చారు. ఎంతో మంది జీవితాలకు విలువనిచ్చారు ఆయన. ఆ విలువ నేను చూశాను. నేను విన్నాను. ఎంతో మంది మా జీవితాలకు వేసిన బాటలు అనుకుంటాను. ► ప్రతి ఒక్కరూ ఆయన జీవితం తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. ఆయన ప్రతి మాట, ప్రతి అడుగు చాలా మంది తెలుసుకుని దాన్ని ఆచరణలో పెట్టారు. ఆయనతో చెరగని బంధం నాకే కాదు... చాలా చాలా మందికి కూడా. ► చెరగని చిరునవ్వు, స్వచ్ఛతకు మారుపేరు ఆయన చిరునవ్వు. వైఎస్సార్ స్థైర్యం, దక్షత సాటిలేనివి. అందుకే ఆయన అందరిలో యుగయుగాలుగా నిలిచి ఉంటాడు. రాజశేఖరరెడ్డి గారి నుంచి నేను, నా పిల్లలు చాలా చాలా నేర్చుకున్నాము. ► ఈ రోజుకు నా పిల్లలు.. కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు ప్రతి సమయంలో ప్రతి పరిస్థితిలో మన నాన్న ఏం చేసేవాడు.. మా మామయ్య ఏం చేసేవాడు.. అని ఆలోచించి ముందుకు వెళతారు. మీకు ఏదైనా సందేహం వచ్చినా, సంశయం వచ్చినా, ఏదై నా కష్టం వచ్చినా మీలో బాధ తొలిచి వేస్తున్నప్పుడు ఒక్కసారి ఈ పుస్తకం చదవమని మిమ్మల్ని కోరుతున్నా.. తప్పకుండా మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అలాంటిది ఆయన జీవితం. ► ‘తనకు మాత్రమే సొంతమైన కోణం నుంచి నాన్నను లోకానికి అమ్మ కొత్తగా పరిచయం చేసింది. పుస్తకం చదువుతున్నంత సేపు అమ్మతో, నాన్నతో కలసి ప్రయాణిస్తున్నట్లే అనిపించింది. నిజం చెప్పడం సులభం కాదు. అయినా అమ్మ ధైర్యంగా నిజం చెప్పింది. అందుకే ఈ బయోగ్రఫీ అందరం చదవాలి. ఈ పుస్తకాన్ని ప్రచురించిన ఎమెస్కో పబ్లిషర్ విజయ్కుమార్కు ధన్యవాదాలు’ అని షర్మిల పేర్కొన్నారు. -
నాలో..నాతో..YSR
-
‘అమ్మ నాన్నను చూసిన విధానమే ఈ పుస్తకం’
సాక్షి, ఇడుపులపాయ: దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజమమ్మ రాసిన "నాలో.. నాతో వైఎస్సార్" పుస్తకాన్ని ముఖ్యమంత్రి జగన్ బుధవారం ఆవిష్కరించారు. అంతకుముందు వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. పుస్తకావిష్కరణ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘నాన్న జయంతిని పురస్కరించుకుని అమ్మ.. నాన్నను చూసిన విధంగా.."నాలో.. నాతో వైఎస్ఆర్'' రచన చేశారు. గొప్ప రాజకీయ నేతగా అందరికీ పరిచయం అయిన వ్యక్తి వైఎస్సార్. ఆయనలో ఉన్న గొప్పతనాన్ని అమ్మ ఆవిష్కరించారు. ఇది ఒక మంచి పుస్తకం’అని పేర్కొన్నారు. (చదవండి: ఎన్నటికీ మరువం రాజన్న!) వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ.. ‘నాకు వైఎస్సార్లో ఉన్న మానవత్వం రాయాలనిపించింది. ఆయన మాటకు ఇచ్చే విలువ రాయాలనిపించింది. ఎంతో మంది జీవితాలకు వైఎస్సార్ వెలుగు ఇచ్చారు. ఆ వెలుగును నేను చూశాను. ఆయన ప్రతి అడుగు ఒక ఆలోచన. వైఎస్సార్ పిలుపు ఒక భరోసా, ఆయన మాట విశ్వసనీయతకు మారు పేరు. ఆయన మాట, సంతకం ఎన్నో జీవితాలను నిలబెట్టింది. వైఎస్సార్ జీవితం నుంచి నేను, నాపిల్లలు చాలా నేర్చుకున్నాం. ప్రతి ఒక్కరు వైఎస్సార్ జీవితాన్ని తెలుసుకోవాలనుకుంటున్నా. ఆయన స్ఫూర్తిని అందరు పాటించాలని కోరుతున్నా’ అని విజయమ్మ పేర్కొన్నారు. వైఎస్సార్ అందరికీ ఒక స్ఫూర్తి అని వైఎస్ షర్మిల అన్నారు. "నాలో.. నాతో వైఎస్సార్'' పుస్తకాన్ని అందరూ చదవాలని కోరారు. (స్నేహ పరిమళాలకు చిహ్నం) -
నాలో... నాతో.. వైఎస్సార్
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ రాసిన ‘‘నాలో... నాతో... వైఎస్సార్’’పుస్తకాన్ని, మహానేత 71వ జయంతి సందర్భంగా బుధవారం ఇడుపులపాయలో ఆవిష్కరించనున్నారు. తన మాతృమూర్తి రాసిన ఈ పుస్తకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఇడుపులపాయలో ఆవిష్కరిస్తారని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. వైఎస్ సహధర్మచారిణిగా విజయమ్మ 37 ఏళ్ల జీవితసారం ఈ పుస్తకం. 2009 సెప్టెంబరు 2న అనూహ్యంగా వైఎస్ మరణించిన నాటి నుంచి కలిగిన భావోద్వేగాల సమాహారం ఈ పుస్తకం. ‘మహానేత గురించి లోకం ఏమనుకుంటున్నదీ తాను ప్రజల నుంచి తెలుసుకున్నానని, ఆయన గురించి ప్రజలకు తెలియని కొన్ని విషయాలు తెలిపేందుకే ఈ పుస్తకాన్ని తీసుకువచ్చాను’అని విజయమ్మ తన తొలి పలుకుల్లో చెప్పారు. వైఎస్ ఒక తండ్రిగా, భర్తగా, ఎలా ఉండేవారో ఈ పుస్తకం ఆవిష్కరించింది. కొడుకుగా, తండ్రిగా, అన్నగా, తమ్ముడిగా, భర్తగా, అల్లుడిగా, మామగా, స్నేహితుడిగా, నాయకుడిగా... నిజ జీవితంలో వైఎస్సార్ ఈ వేర్వేరు పాత్రల్లో ఎలా ఉండే వారో, ప్రతి ఒక్కరితో ఎంత ఆత్మీయంగా మెలిగేవారో విజయమ్మ వివరించారు. ఆమె ఇంకా ఏం పేర్కొన్నారంటే... ► మహానేత వేసిన ప్రతి అడుగు వెనకా ఉన్న ఆలోచనను, అనుభవాల నుంచి ఆయన నేర్చుకున్న పాఠాలను ఈ పుస్తకంలో విశ్లేషించారు. ► ఆయన, ఇంట గెలిచి రచ్చ గెలిచిన తీరును; ఇంట్లో వారి అవసరాలను అర్థం చేసుకున్నట్టే ప్రజలనూ కుటుంబ సభ్యులుగా భావించి వారి అవసరాలను అర్థం చేసుకున్న విధానాన్ని వివరించారు. ► కుటుంబ సభ్యుల ప్రగతిని కోరినట్టే రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ప్రగతినీ కోరుకుని, ఇంటింటా అందరికీ మేలు చేయబట్టే తమ కుటుంబ సభ్యుల మాదిరిగానే రాష్ట్ర ప్రజలంతా ఆయనను ఇప్పటికీ ఆరాధిస్తున్నారు. ► వైఎస్ తన జీవితమంతా పంచిన మంచితనమనే సంపద తన పిల్లలూ మనవలకే కాకుండా..ఇంటింటా పెరగాలనే సంకల్పంతోనే ఈ పుస్తకాన్ని సవినయంగా సమాజం ముందుంచుతున్నా. ► ఆయన్ను ప్రేమించిన తెలుగు ప్రజలందరికీ ఈ పుస్త కాన్ని అంకితం చేస్తున్నానని విజయమ్మ అన్నారు. ► తమ వివాహం, ఆ నాటి పరిస్థితులు, పేదల వైద్యుడిగా వైఎస్సార్, రాజకీయాల్లో ఆయన రంగ ప్రవేశం, చిన్ననాటి నుంచి ఆయన నాయకత్వ లక్షణాలు, పేదల పట్ల కరుణ, రాజకీయాల్లో ఆటుపోట్లు, కుటుంబంలో ఆత్మీయతలు, పిల్లల చదువులు, వివాహాలు, దైవం పట్ల భక్తి శ్రద్ధలు, పీసీసీ అధ్యక్షుడిగా మొదలు ముఖ్యమంత్రి వరకు ఎదురైన ఒత్తిడులు, ప్రజా ప్రస్థానం, వైఎస్ జగన్; షర్మిలలతో.. వారి కుటుంబాలతో మహానేత అనుబంధాలు; మహానేత మరణంతో ఎదురైన పెను సవాళ్లు, వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణం చేసేవరకు పరిణామాలు.. ఇవన్నీ ఈ పుస్తకంలో రేఖామాత్రంగా కొన్ని, వివరంగా మరికొన్నింటిని వివరించారు. ► తాను మరణించినా తన పథకాల్లో ఎప్పటికీ జీవించి ఉన్న, ప్రజలంతా తన కుటుంబమే అనుకున్న మహానేత గురించి రాబోయే తరాలకు కూడా స్ఫూర్తి ఇవ్వాల న్న సత్సంకల్పంతో ఈ పుస్తకాన్ని ప్రజలముందుంచుతున్నానని అన్నారు. ఆయన జీవితమే తెరిచిన పుస్తకమని, ప్రజాప్రస్థానంలో ప్రతి అడుగూ ప్రజల జీవితంతోనే ముడిపడి ఉందని విజయమ్మ వివరించారు. -
రేపు ‘నాలో.. నాతో.. వైఎస్సార్’ పుస్తకావిష్కరణ
-
రేపు ‘నాలో.. నాతో.. వైఎస్సార్’ పుస్తకావిష్కరణ
సాక్షి, అమరావతి: దివంగత మహానేత వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ రాసిన ‘‘నాలో... నాతో... వైఎస్సార్’’ పుస్తకాన్ని మహానేత 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో ఆవిష్కరించనున్నారు. తన మాతృమూర్తి రాసిన ఈ పుస్తకాన్ని మహానేత తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(బుధవారం) ఇడుపులపాయలో ఆవిష్కరించనున్నారు. డాక్టర్ వైఎస్సార్ సహధర్మచారిణిగా వైఎస్ విజయమ్మ 37 ఏళ్ళ జీవితసారం ఈ పుస్తకం. 2009 సెప్టెంబరు 2న అనూహ్యంగా వైఎస్సార్ మరణించిన నాటి నుంచి కలిగిన భావోద్వేగాల సమాహారం ఈ పుస్తకం.(ఏపీని అగ్రస్థానంలో నిలిపారు) మహానేత గురించి లోకం ఏమనుకుంటున్నదీ తాను ప్రజలనుంచి తెలుసుకున్నానని; ఆయన గురించి ప్రజలకు తెలియని కొన్ని విషయాలు తెలిపేందుకే ఈ పుస్తకాన్ని తీసుకువచ్చానని వైఎస్ విజయమ్మ తన తొలి పలుకులో తెలిపారు. వైఎస్సార్ ఒక తండ్రిగా, భర్తగా, ఎలా ఉండేవారో ఈ పుస్తకం ఆవిష్కరించింది. కొడుకుగా, తండ్రిగా, అన్నగా, తమ్ముడిగా, భర్తగా, అల్లుడిగా, మామగా, స్నేహితుడిగా, నాయకుడిగా... నిజ జీవితంలో వైఎస్సార్ ఈ వేర్వేరు పాత్రల్లో ఎలా ఉండేవారో, ప్రతి ఒక్కరితో ఎంత ఆత్మీయంగా మెలిగేవారో... ఉన్నది ఉన్నట్టుగా విజయమ్మ వివరించారు. (ప్రతిదినం-ప్రజాహితం పుస్తకాన్ని ఆవిష్కరించిన విజయమ్మ) మహానేత వేసిన ప్రతి అడుగు వెనకా ఉన్న ఆలోచనను, అనుభవాల నుంచి ఆయన నేర్చుకున్న పాఠాలను ఈ పుస్తకంలో విశ్లేషించారు. ఆయన, ఇంట గెలిచి రచ్చ గెలిచిన తీరును, ఇంట్లోవారి అవసరాలను అర్థం చేసుకున్నట్టే ప్రజలను కూడా కుటుంబ సభ్యులుగా భావించి వారి అవసరాలను కూడా అర్థం చేసుకున్న విధానాన్ని వివరించారు. కుటుంబ సభ్యుల ప్రగతిని కోరినట్టే రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ప్రగతినీ కోరుకుని, అన్ని ప్రాంతాల్లో ఇంటింటా అందరికీ మేలు చేయబట్టే తమ కుటుంబ సభ్యుల మాదిరిగానే రాష్ట్ర ప్రజలంతా వైఎస్సార్ను ఇప్పటికీ ఆరాధిస్తున్నారని పుస్తకం ముందుమాటలో ఆమె వివరించారు. వైఎస్సార్ తన జీవితమంతా పెంచి, పంచిన మంచితనమనే సంపద తన పిల్లలూ మనవలకే కాకుండా...ఇంటింటా పెరగాలనే సంకల్పంతోనే ఈ పుస్తకాన్ని సవినయంగా సమాజం ముందుంచుతున్నానని విజయమ్మ పేర్కొన్నారు. ఆయన్ను ప్రేమించిన తెలుగు ప్రజలందరికీ ఈ పుస్తకాన్ని అంకితం చేస్తున్నానని విజయమ్మ అన్నారు. తమ వివాహం, ఆ నాటి పరిస్థితులు, పేదల డాక్టర్గా వైఎస్సార్, రాజకీయాల్లో ఆయన రంగ ప్రవేశం, చిన్ననాటి నుంచి వైఎస్సార్ నాయకత్వ లక్షణాలు, పేదల పట్ల కరుణ, రాజకీయాల్లో ఆటుపోట్లు, కుటుంబంలో ఆత్మీయతలు, పిల్లల చదువులు, వివాహాలు, దైవం పట్ల భక్తి శ్రద్ధలు, అందరివాడిగా గడిపిన జీవితం, పీసీసీ అధ్యక్షుడిగా మొదలు ముఖ్యమంత్రి వరకు ఎదురైన ఒత్తిడులు, చారిత్రక ప్రజా ప్రస్థానం, వైఎస్ జగన్, షర్మిలలతో.. వారి కుటుంబాలతో మహానేత అనుబంధాలు.. మహానేత మరణంతో ఎదురైన పెను సవాళ్ళు, వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే వరకు పరిణామాలు... ఇవన్నీ ఈ పుస్తకంలో రేఖామాత్రంగా కొన్ని, వివరంగా మరి కొన్ని తెలిపారు. ఉన్నది ఉన్నట్టుగా తెలియజేశారు. మరణం లేని మహానేత గురించి, తాను మరణించినా తన పథకాల్లో ఎప్పటికీ జీవించి ఉన్న మరణం లేని మహానేత గురించి, తెలుగువారంతా తమ కుటుంబమే అనుకున్న మహానేత గురించి రాబోయే తరాలకు కూడా స్ఫూర్తి ఇవ్వాలన్న సత్సంకల్పంతో ఈ పుస్తకాన్ని ప్రజలముందుంచుతున్నానని విజయమ్మ అన్నారు. ఆయన జీవితమే తెరిచిన పుస్తకమని.. ఆయన ప్రజాప్రస్థానంలో ప్రతి అడుగూ ప్రజల జీవితంతోనే ముడిపడి ఉందని విజయమ్మ వివరించారు. -
ఏపీని అగ్రస్థానంలో నిలిపారు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీని అన్నింటా అగ్రస్థానంలో నిలిపారని, 90 శాతం హామీలను ఏడాదిలోనే అమలు చేశారని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. 2019 మే నుంచి 2020 మే 31 వరకు సీఎం వైఎస్ జగన్ రోజువారీ అధికారిక కార్యక్రమాలతో సమాచార పౌర సంబంధాల శాఖ డివిజనల్ పీఆర్వో పాలెపు రాజశేఖర్ ‘ప్రతిదినం.. ప్రజాహితం’ పుస్తకాన్ని రూపొందించగా.. ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా, అంతర్ రాష్ట్ర వ్యవహారాల సలహాదారు కార్యాలయం ప్రచురించింది. ఆ పుస్తకాన్ని హైదరాబాద్ లోటస్పాండ్లో వైఎస్ విజయమ్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇచ్చిన హామీ మేరకు జూలై 8న ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారని తెలిపారు. రాష్ట్రంలో 6 లక్షల మందికి కరోనా పరీక్షలు చేసి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచామని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి ప్రాజెక్ట్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని పేర్కొన్నారు. సీఎం చేపట్టే ప్రజా సంక్షేమ పథకాలు, శాఖల వారీగా చేసిన సమీక్షలు, సమావేశాలు, పర్యటనలు తదితర అంశాలను విషయ సూచికలా తెలియజేసే తొలి సంవత్సర నివేదికగా ఈ పుస్తకాన్ని ముద్రించామని జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ తెలిపారు. పుస్తక రచయిత పాలెపు రాజశేఖర్ను వైఎస్ విజయమ్మ, దేవులపల్లి అమర్ అభినందించారు. -
ఏపీని అగ్రస్థానంలో నిలిపారు: వైఎస్ విజయమ్మ
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ నేషనల్ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ నేతృత్వంలో రచించిన ‘ప్రతి దినం ప్రజాహితం' పుస్తకాన్ని వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆవిష్కరించారు. ఏడాదికాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన అనేక కార్యక్రమాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఏడాది కాలంలోనే వైఎస్ జగన్ 90శాతం హామీలను అమలు చేశారని అభినందించారు. ఇచ్చిన హామీ మేరకు జూలై 8న ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారని తెలిపారు. రాష్ట్రంలో 6 లక్షల మందికి కరోనా పరీక్షలు చేసి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచామని గుర్తుచేశారు. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి ప్రాజెక్ట్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. హైదరాబాద్లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో అమర్, విజయమ్మతో పాటు మరికొంత మంది ప్రముఖులు పాల్గొన్నారు. -
వైఎస్ రాజారెడ్డికి ఘన నివాళి
పులివెందుల: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి దివంగత వైఎస్ రాజారెడ్డి 22వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. శనివారం ఉదయం పులివెందులలోని వైఎస్ సమాధుల తోటలో ఉన్న వైఎస్ జయమ్మ, వైఎస్ రాజారెడ్డిల ఘాట్ వద్ద వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, దివంగత వైఎస్ వివేకా సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మ, వైఎస్ వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి, పులివెందుల వైఎస్సార్సీపీ నేత వైఎస్ మనోహర్రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి తదితరులు నివాళులర్పించారు. రాజారెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అక్కడే ఉన్న వైఎస్ వివేకా సమాధి వద్ద, ఇతర కుటుంబీకుల సమాధులకు వైఎస్ విజయమ్మ పూలమాలలు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. కాగా, కర్నూలు జిల్లా పత్తికొండలో వైఎస్సార్సీపీ నేత పోచిమిరెడ్డి మురళీధర్రెడ్డి ఆధ్వర్యంలో దివంగత వైఎస్ రాజారెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. -
వైఎస్ రాజారెడ్డికి కుటుంబసభ్యుల నివాళి
-
వైఎస్ రాజారెడ్డికి ఘన నివాళి
సాక్షి, పులివెందుల: వైఎస్ రాజారెడ్డి 22వ వర్ధంతి సందర్భంగా ఆయనకు కుటుంబసభ్యులు శనివారం ఘనంగా నివాళులు అర్పించారు. పులివెందుల రాజారెడ్డి ఘాట్లోని వైఎస్ జయమ్మ, రాజారెడ్డి సమాధుల వద్ద వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో పాటు కుటుంబసభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాజారెడ్డి మెమోరియల్ పార్కులోని ఆయన విగ్రహం వద్ద అంజలి ఘటించారు. జీసెస్ చారిటీస్లోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ సౌభాగ్యమ్మ, వైఎస్ మనోహర్ రెడ్డి, దివంగత వివేకానందరెడ్డి కుమార్తె సునీత,అల్లుడు రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పేద పురోహితులకు నిత్యావసరాల పంపిణీ
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ)/సాక్షి, అమరావతి: విజయవాడ కృష్ణానది దుర్గాఘాట్లో పితృకర్మలు నిర్వహించే పేద పురోహితులకు బియ్యం, నిత్యావసర సరుకులను దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం ఉచితంగా పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ కరోనా ప్రభావంతో ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పురోహితులకు తక్షణమే ఆదుకోవాలని వైఎస్సార్సీపీ గౌరవధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సూచన మేరకు వారికి బియ్యం, నిత్యావసర వస్తువులు, కూరగాయలను పంపిణీ చేసినట్లు తెలిపారు. కరోనా ప్రభావంతో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుంటే హైదరాబాద్ వాసి చంద్రబాబు, అజ్ఞాతవాసి పవన్కల్యాణ్ విమర్శలు చేయడం సరికాదన్నారు. మోడల్ గెస్ట్హౌస్, కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద పితృకర్మలు నిర్వహించే పురోహితులకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. విజయమ్మకు ధన్యవాదాలు పితృకర్మలు నిర్వహించే పేద బ్రాహ్మణుల సమస్యపై వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ స్పందించడంపై అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. పేద బ్రాహ్మణుల సమస్యపై శుక్రవారం విజయమ్మ స్పందించి మంత్రి వెలంపల్లికి సూచించడంతో శనివారం నిత్యావసరాలు పంపిణీ చేశారని, బ్రాహ్మణ సంఘాల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. -
పురోహితులను ఆదుకోండి
భవానీపురం (విజయవాడ పశ్చిమ): పితృకర్మలు నిర్వహించే పురోహితులు లాక్డౌన్ కారణంగా ఉపాధిలేక అవస్థలు పడుతుండడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ స్పందించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దిగువనున్న దుర్గాఘాట్ పక్కనే ఉన్న పిండప్రదాన కార్యక్రమాల రేవులో దాదాపు వంద మందికి పైగా పురోహితులు అపరకర్మలు చేయిస్తూ జీవనం సాగిస్తున్నారు. కానీ, లాక్డౌన్ ప్రకటించిన నాటి నుంచి వీరంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అపరకర్మలు చేయించుకునేందుకు ఎవరూ రాకపోతుండడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. చివరికి ఇల్లు గడవటమే కష్టంగా ఉంది. ఈ విషయం వైఎస్ విజయమ్మ దృష్టికి వెళ్లింది. మానవత్వంతో స్పందించిన ఆమె.. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుతో మాట్లాడి పురోహితులను ఆదుకోవాలని సూచించారు. దీంతో.. ఆమె సూచన మేరకు మంత్రి వెలంపల్లి శనివారం ఉదయం పిండ ప్రదాన రేవు పక్కనే ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రాంగణంలో పురోహితులకు నిత్యావసర సరుకులను అందజేయనున్నారు. -
వైఎస్ వివేకా నిరాడంబరుడు
వైఎస్ఆర్ జిల్లా, పులివెందుల/రూరల్ : మాజీ మంత్రి, దివంగత నాయకుడు వైఎస్ వివేకానందరెడ్డి ప్రథమ వర్దంతిని పులివెందులలో ఆదివారం నిర్వహించారు. పట్టణంలోని డిగ్రీ కళాశాల రోడ్డులో గల వైఎస్ ఫ్యామిలీ సమాధుల తోటలో గల వైఎస్ వివేకా ఘాట్ వద్ద ఆదివారం ఉదయం వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలమ్మ, వైఎస్ వివేకా సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మ, వివేకా సోదరి విమలమ్మ, కుమార్తె సునీత, దివంగత జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, వైఎస్ సుధీకర్రెడ్డి సతీమణి జయమ్మ, అల్లుడు రాజశేఖరరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్సార్ సోదరుడు రవీంద్రనాథరెడ్డి, వైఎస్ మనోహర్రెడ్డి, వైఎస్ ప్రతాప్రెడ్డి, ఎన్.శివప్రకాష్రెడ్డి, వైఎస్ కొండారెడ్డి, మైఖేల్ విజయ్కుమార్, థామస్రెడ్డి, క్రిష్టఫర్లు వివేకా సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఫాస్టర్లు నరేష్కుమార్, మృత్యుంజయల ఆధ్వర్యంలో వైఎస్ వివేకా పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, లింగాల మాజీ ఎంపీపీ సుబ్బారెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ చిన్నప్ప, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వరప్రసాద్, ఓ.రసూల్, ఇతర పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం వైఎస్ వివేకా అని పేర్కొన్నారు. స్థానిక సీఎస్ఐ చర్చిలో ఏర్పాటు చేసిన ప్రార్థన కూటమిలో వైఎస్ వివేకా సోదరి వైఎస్ విమలమ్మ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డిలకు కుటుంబ సభ్యులంటే ఎనలేని ప్రేమ ఉండేదన్నారు. ముఖ్యంగా సోదరిగా తనపట్ల మరింత ఎక్కువగా ప్రేమగా ఉండేవారన్నారు. కుటుంబ సభ్యులలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరిని ఆప్యాయంగా పలకరించే వ్యక్తి వైఎస్ వివేకా అన్నారు. ఇటువంటి వ్యక్తి మనమందరి మధ్య లేకపోవడం చాలా బాధాకరమన్నారు. రాష్ట్రంలోని రాజకీయ చరిత్రలో రాజకీయ శత్రువులు లేని అజాతశత్రువు లాంటి వారు వైఎస్ వివేకా అని ఇతర వక్తలు కొనియాడారు. వైఎస్ వివేకా కుమార్తె సునీత రాష్ట్ర నలుమూలల నుంచి.. : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి వర్దంతిని పురస్కరించుకుని రాష్ట్ర నలుమూలలనుంచి అనేకమంది నాయకులు, అభిమానులు పులివెందులకు చేరుకుని ఆయన ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు తమకు వైఎస్ వివేకానందరెడ్డితో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తుకు తెచ్చుకుని కన్నీటి పర్యంతమయ్యారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి వర్దంతి సందర్భంగా వారం రోజులపాటు ఆయన జ్ఞాపకార్థం వైఎస్ వివేకా స్మారక క్రికెట్, కబడ్డీ, షటిల్, బాల్ బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు వైఎస్ వివేకా సోదరి విమలమ్మ, వైఎస్ షర్మిలమ్మ, పారిశ్రామికవేత్త వైఎస్ ప్రకాష్రెడ్డిలు బహుమతులను ప్రదానం చేశారు. -
వైఎస్ వివేకాకు కుటుంబ సభ్యుల నివాళి
సాక్షి, వైఎస్సార్ జిల్లా : మాజీ మంత్రి , దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి ప్రథమ వర్థంతి ఆదివారం ఆయన కుటుంబ సభ్యులు పులివెందులలో నిర్వహించారు. స్థానిక డిగ్రీ కళాశాల రోడ్డులో గల వైఎస్సార్ సమాధుల తోటలోని వైఎస్ వివేకా సమాధి వద్ద వైఎస్ విజయమ్మ, ఎంపీ అవినాష్ రెడ్డి, సౌభాగ్యమ్మ, సునీత, రాజశేఖర్, వివేకా సోదరి విమలమ్మ నివాళులర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
వైఎస్ జగన్ వెనక ఉన్న ఆ స్త్రీ మూర్తులు వీరే!
-
వైఎస్ జగన్ విజయం వెనుక.. ఆ ముగ్గురు!
సాక్షి, అమరావతి: ‘ప్రతి పురుషుడి విజయం వెనుకా ఓ స్త్రీ ఉంటుందంటారు.. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెనుక ఉన్న ఆ ముగ్గురు స్త్రీ మూర్తులు వీరే’.. అన్న వీడియో మహిళా దినోత్సవం సందర్భంగా వైరల్ అవుతోంది. ఆదివారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సాక్షి టీవీ రూపొందించిన ఈ వీడియోను వైఎస్సార్సీపీ తన అధికారిక ట్విట్టర్లో పోస్టు చేసింది. సోషల్ మీడియా విభాగం ఈ వీడియోను విస్తృతంగా వివిధ గ్రూప్లలో పోస్టు చేసింది. రాష్ట్ర ప్రజలను ఈ వీడియో విశేషంగా ఆకట్టుకుంటోంది. రాజకీయంగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇబ్బందులకు గురిచేశారని, ఆ సమయంలో ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, భార్య వైఎస్ భారతి, సోదరి షర్మిల ఆయనకు అండగా నిలిచారని అందులో పేర్కొన్నారు. వైఎస్ జగన్ జైల్లో ఉన్నప్పుడు ‘నేను మీ రాజన్న బిడ్డను.. జగనన్న వదిలిన బాణాన్ని’ అంటూ వైఎస్ షర్మిల చేసిన ప్రచారాన్ని గుర్తుచేశారు. ఓ మంచి ముఖ్యమంత్రిని రాష్ట్రానికి అందించిన వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, షర్మిలకు కృతజ్ఞతలు అంటూ వీడియోను ముగించారు. -
వధూవరులకు సీఎం వైఎస్ జగన్ దంపతుల ఆశీర్వాదం
సాక్షి,అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి కుటుంబసభ్యుడు, దివంగత వైఎస్ పాల్ జగన్మోహన్రెడ్డి కుమార్తె పద్మ – కసిరెడ్డి శ్రీవత్స్ల వివాహం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో గురువారం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ భారతి, వైఎస్ విజయమ్మ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
క్రిస్మస్ వేడుకల్లో సీఎం
పులివెందుల/సాక్షి,అమరావతి: సీఎం వైఎస్ జగన్ బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్ జిల్లా పులివెందుల సీఎస్ఐ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. పాస్టర్ బెనహర్బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్నారు. సీఎస్ఐ చర్చికి సంబంధించిన క్యాలెండర్ను ఆవిష్కరించారు. వైఎస్ విజయమ్మ క్రిస్మస్ సందేశాన్ని వినిపించారు. వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మలతోపాటు ఇతర కుటుంబ సభ్యులు క్రిస్మస్ కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, జార్జిరెడ్డి కుమారులు అనిల్రెడ్డి, సునీల్రెడ్డి.. వైఎస్ ప్రకాష్రెడ్డి, వైఎస్ భాస్కర్రెడ్డి, వైఎస్ ప్రతాప్రెడ్డి, వైఎస్ మనోహర్రెడ్డి, వైఎస్ జోసఫ్రెడ్డి, వైఎస్ మధురెడ్డి, డాక్టర్ ఈసీ గంగిరెడ్డి, ఎన్.శివప్రకాష్రెడ్డి, మంత్రులు సురేష్, అవంతి, అంజాద్ బాషా, ఆళ్ల నాని, కడప, రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షులు సురేష్బాబు, అమరనాథ్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లి చేరుకున్న సీఎం వైఎస్ జగన్..: సీఎం వైఎస్ జగన్ మూడు రోజుల వైఎస్సార్ జిల్లా పర్యటన ముగించుకుని బుధవారం సాయంత్రం తాడేపల్లి చేరుకున్నారు. ఈ నెల 23వ తేదీ ఉదయం ఆయన తాడేపల్లి నుంచి వైఎస్సార్ జిల్లా పర్యటనకు బయలుదేరిన విషయం తెలిసిందే. అదే రోజు ఆయన జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో ఏపీ హైగ్రేడ్ స్టీల్స్కు, కడపలో పలు అభివృద్ధి పనులకు.. 24న రాయచోటి, 25న పులివెందుల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. -
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్
-
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్
సాక్షి, వైఎస్సార్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. కుటుంబసభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్.. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి కూడా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్, విజయమ్మ, వైఎస్ భారతి ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా సీఎం వైఎస్ జగన్, విజయమ్మ కేక్ కట్ చేశారు. నూతన సంవత్సర క్యాలెండర్ను విడుదల చేశారు. ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు ఆదిమూలపు సరేష్, అవంతి శ్రీనివాస్, వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్రెడ్డి పాల్గొన్నారు. -
మహానేత వైఎస్సార్కు ఘన నివాళులు
పులివెందుల/వేంపల్లె: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా రెండోరోజు మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. వారు ఉదయం 9.30 గంటలకు వైఎస్సార్ ఘాట్కు చేరుకున్నారు. ముందుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వైఎస్సార్ ఘాట్ వద్ద మౌనం పాటించి వైఎస్ రాజశేఖరరెడ్డిని గుర్తు చేసుకున్నారు. అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి వఎస్సార్ ఘాట్ వద్ద పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన వెంట కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మంత్రులు అంజాద్ బాషా, నారాయణస్వామి, ఆదిమూలపు సురేష్, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ గంగుల ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి, వైఎస్సార్సీపీ రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, కడప పార్లమెంటరీ అధ్యక్షుడు సురేష్బాబు, జిల్లా కలెక్టర్ హరికిరణ్, జాయింట్ కలెక్టర్ గౌతమి తదితరులు ఉన్నారు. వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి, కుమార్తెలు హర్ష, వర్ష, చెల్లెలు షర్మిలమ్మ, ఆమె కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలి, ఇతర కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు వైఎస్సార్ ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వైఎస్ కుటుంబ సభ్యులు ఇడుపులపాయ చర్చిలో ముందస్తు క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యారు. -
వైఎస్సార్పై అభిమానంతోనే ట్రస్టు ఏర్పాటు
తణుకు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై ఉన్న అభిమానంతోనే వైఎస్ విజయమ్మ చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేశానని తణుకు పట్టణానికి చెందిన అంబడిపూడి వీరభద్రావతి తెలిపారు. 2012లో విజయమ్మ పేరుతో ట్రస్టు ప్రారంభించినప్పటి నుంచి తాను ట్రస్టీగా వ్యవహరిస్తున్నానని ఆమె చెప్పారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా గతేడాది 2018 జనవరిలో ట్రస్టు కార్యకలాపాలను నిలిపేశానన్నారు. ట్రస్టు ఆధ్వర్యంలో కుట్టుమిషన్ నేర్పించడంతోపాటు ఉచిత వైద్యశిబిరాల నిర్వహణ, దుస్తులు తదితరాలు పంపిణీ చేశామని చెప్పారు. సొంత ఖర్చులతోనే సేవా కార్యక్రమాలు చేశామని వివరించారు. వైఎస్సార్ కుటుంబం నుంచి గానీ, ఇతరత్రా వేరే విధంగా గానీ ఎలాంటి నిధులూ రాలేదని వీరభద్రావతి స్పష్టం చేశారు. వైఎస్సార్ కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. 2018 జనవరిలోనే ట్రస్టు మూసివేస్తున్నట్లు లిఖితపూర్వకంగా సంబంధిత అధికారులకు తెలియజేశామన్నారు. -
అదే స్ఫూర్తి.. అదే లక్ష్యం
సాక్షి, అమరావతి: రాజకీయాలంటే సినిమా కాదని, వంద రోజుల్లో పాలనపై తీర్పు ఇవ్వడం ప్రతిపక్షం తొందరపాటని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాతృమూర్తి వైఎస్ విజయమ్మ అన్నారు. ప్రజలకు మంచి చేసే విషయంలో దివంగత మహానేత ఒకడుగు ముందుకు వేస్తే జగన్ రెండడుగులు ముందుకు వేస్తానంటున్నాడని చెప్పారు. జగన్లో ధైర్యం పాళ్లు ఎక్కువని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మేనిఫెస్టోలో చెప్పిన విషయాలను ఆచరించి చూపుతారని ఆత్మవిశ్వాసంతో పేర్కొన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ 10వ వర్ధంతిని పురస్కరించుకుని ‘సాక్షి’ టీవీ ప్రతినిధి కొమ్మినేని శ్రీనివాసరావుకు ఆదివారం ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలపై మాట్లాడారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి అఖండ విజయంతో సీఎం పదవిని అధిష్టించిన వైఎస్ జగన్.. తండ్రి వైఎస్సార్ అడుగుజాడల్లో నడుస్తూ ఏడాదిలోగా మంచి ముఖ్యమంత్రి అని నిరూపించుకుంటారని ఆకాంక్షించారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే.. ఆ కమిట్మెంట్ నాకు చాలా నచ్చింది జగన్ అధికారంలోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది. 100 రోజుల పాలనను పెద్దగా పరిగణనలోకి తీసుకోలేం. ఇది సినిమా కాదు. ప్రతి రోజు.. ప్రతి నిమిషం ప్రజల కోసం పని చేయాలి. నాన్న ఒకడుగు ముందుకేస్తే తాను రెండడుగులు వేస్తానంటున్నాడు జగన్. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వలంటీర్లకు మేనిఫెస్టోను ముందు పెట్టుకోవాలని చెప్పారు. ఆ కమిట్మెంట్ నాకు చాలా నచ్చింది. మళ్లీ ఎన్నికల నాటికి ఈ మేనిఫెస్టోలోని అంశాలు అమలు చేశాకే ఓట్లడుగుతానంటున్నాడు. మద్యపాన నిషేధంలో భాగంగా బెల్ట్షాపుల తొలగింపు మొదలుపెట్టారు. జగన్ సీఎం అవుతాడని ఊహించే కష్టపెట్టారు వైఎస్సార్ అన్ని కష్టాలు అనుభవించారు. చాలా పోరాటం చేశారు. ప్రతిపక్షంతోనూ, స్వపక్షంతోనూ పోరాడారు. ఆయన సీఎం కావడానికి 25 ఏళ్లు పట్టింది. ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయాక జగన్ను చాలా వేధించారు. జగన్ సీఎం అవుతారని ఊహించే ఇలా కష్టపెట్టారు. ఓదార్పు యాత్రలో ప్రజా స్పందన, ప్రజల అభిమానం చూశారు. రాజశేఖరరెడ్డికి మంచి పేరు రావడం, ఆయన కోసం జగన్ ఓదార్పు యాత్ర చేయడం హైకమాండ్కు నచ్చలేదు. అందుకే తొక్కిపెట్టాలని నిర్ణయించుకున్నారు. వారికి చంద్రబాబు తోడయ్యారు. 2014లో ఓటమి మమ్మల్ని మరింత బలోపేతం చేసింది. మేమెక్కడా కుంగిపోలేదు. 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తీసుకున్నా జగన్ భయపడలేదు. ఏం జరుగుతోంది నాయనా అంటే ‘నీవు దేవుడిని నమ్ముతావు కదమ్మా.. దేవుడు మంచి చేస్తాడు’ అన్నాడు. వెళ్లే వాళ్లు వెళ్లినా భయపడలేదు. నల్లకాలువ సభలో ఇచ్చిన మాట కోసం జగన్ కష్టపడుతున్నాడని ప్రజలు భావించారు. వైఎస్ చేసిన మంచి పనులన్నీ ప్రజలు గుర్తు పెట్టుకుంటారని ఓదార్పు యాత్రలో గమనించాం. జగన్ జైలులో ఉండగా, మేము బయటకు వెళ్లినప్పుడు ప్రజలు మా వెంట నిలవడం, 18 మందిని గెలిపించుకోవడం, పార్టీ కోసం వెళ్లినప్పుడు కూడా జనం మమ్మల్ని అక్కున చేర్చుకోవడం.. పాదయాత్ర అయిపోయే నాటికి గెలుపుపై మాకు పూర్తి విశ్వాసం కలిగింది. ఎక్కడ వైఎస్, జగన్ పేరు ప్రస్తావించినా మంచి స్పందన ఉండేది. వైఎస్సార్ చేసిన పనులు, చంద్రబాబు చేయని పనులు జనమే చెప్పేవారు. అసెంబ్లీలో చరిత్రాత్మక బిల్లులు ఆమోదించారు చంద్రబాబు చివరి మూడు నెలల్లో అన్నీ చేశానని చెప్పారు. పెన్షన్ రూ.2 వేలు చేశానన్నారు.. 3 వేలు చేస్తానని చెప్పారు.. డ్వాక్రా మహిళలకు పసుపు–కుంకుమ ఇస్తానన్నారు.. అమ్మ ఒడి అమలు చేస్తానని, యువతకు మేలు చేస్తానన్నారు. పింఛన్ను జగన్ రూ.2 వేలకు పెంచుతానని చెప్పకపోతే బాబు చెప్పేవాడా? జగన్ హామీలను చూసి బాబు కాపీ కొట్టలేదా? రైతులకు ఏటా రూ.12,500 జగన్ ఇస్తానన్నాకే కదా బాబు కూడా ఇస్తానంది? వైఎస్ చెప్పినవన్నీ చేసి చూపించారు. ఆయన రక్తం పంచుకుపుట్టిన జగన్ కూడా చేస్తాడు. ఒక అవకాశం ఇవ్వండని కోరాను. ప్రజలు అవకాశం ఇచ్చారు. తొలిరోజే మేనిఫెస్టో గురించి మాట్లాడాడు. ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టిన స్పందన కార్యక్రమం బాగుంది. ఎన్నిరోజుల్లో సమస్య పరిష్కరిస్తామో చెప్పాలన్నారు. అసెంబ్లీలో చరిత్రాత్మక బిల్లులు ఆమోదించారు. ఐదేళ్లలో ఏమీ చేయలేని వారు అప్పుడే విమర్శలా? జగన్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కూడా కాలేదు. ఐదేళ్లలో ఏమీ చేయలేని వారు విమర్శలు మొదలు పెట్టారు. వాళ్లు తప్పులు మాట్లాడుతున్నారు. బిల్డింగులు, రోడ్లు.. ప్రతి చోటా అవినీతే. వచ్చిన డబ్బులేం చేశారో తెలీదు. రాజధాని పేరుతో అంతా అవినీతే. జలయజ్ఞం కోసం రూ.65 వేల కోట్లు ఖర్చు పెట్టామంటున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి బాబు పాలనకు ముందు వరకు రూ.96 వేల కోట్ల అప్పులుంటే.. బాబు రూ.2.60 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఈ డబ్బులతో ఏం చేశారంటే జవాబు లేదు. పవన్ కల్యాణ్ టార్గెట్ ఎప్పుడూ జగనే. ఎన్నికలప్పుడు జగన్ను విమర్శించారు. ఇప్పుడూ విమర్శిస్తున్నారు. రాజధాని మార్పు నిజం కాదనుకుంటా. రాజధాని పేరుతో బాబు ప్రభుత్వం సాగించిన అవినీతి వ్యవహారం గురించి సీఆర్డీఏ మీటింగ్లో మాట్లాడుకున్నారు. బాబు పర్మినెంట్గా ఒక ఇటుక పెట్టింది లేదు. అవన్నీ బయటకు వస్తాయని చెప్పి ఇలా బురద వేస్తున్నారు. నాకు ఏదైనా చెప్పాలనిపిస్తే జగన్కు చెబుతుంటాను. బయట అలా అనుకుంటున్నారని, ఇలా అనుకుంటున్నారని వివరిస్తాను. చంద్రబాబు నోట అన్నీ అబద్ధాలే తను ఎందుకు ఓడిపోయారో అర్థం కావడం లేదని చంద్రబాబు మాట్లాడుతుండటం ప్రజల చెవిలో పూలు పెట్టాలనే. తునిలో తనే రైలు తగలబెట్టించి కడప నుంచి రౌడీలు వచ్చారన్నారు. నీళ్లను ఆపగలిగే శక్తి ఎవరికి ఉంటుంది? అలా చేసి ఉంటే నిజంగా ఆయన ఇల్లు మునిగిపోయేది. ఏం చేశారని బాబుకు ప్రజలు ఓటేస్తారు? ఈ విషయం ఆయనకు ఎందుకు అర్థం కాదు? 1978లో వైఎస్సార్, చంద్రబాబు, కేఈ కృష్ణమూర్తి కలిసి వెళ్లే వారు. తర్వాత బాబు దారి బాబుది. వైఎస్సార్ బెస్ట్ ఫ్రెండ్ అని చెబుతున్నారు. బెస్ట్ ఫ్రెండ్ కాదు.. శత్రువుగా చూశారు. బాబు హయాంలో ఇసుక పేరుతో దోచుకున్నారు. పోలవరంలో పనులు చేయకుండానే కోట్లు కోట్లు డబ్బులిచ్చేశారు. ఇవాళ జగన్ అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలకు బాబు సమాధానం చెప్పలేకపోతున్నారు. జగన్ అన్ని పథకాలను వాళ్ల కంటే దర్జాగా అమలు చేస్తారు. ఇసుక విక్రయంలో పారదర్శకత తీసుకొస్తున్నారు. పోలవరం వైఎస్సార్ కల. ప్రాజెక్టులంటే జగన్కు ఆసక్తి, ఇష్టం. పోలవరం ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేస్తారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు కనిపిస్తున్నాయంటే వైఎస్సార్ నిర్ణయాలే కారణం. కనీసం జగన్ పాలనను ఏడాది చూడాలి. బాబు అడ్డగోలుగా దోచుకున్నారు. అలాంటి పాలనను దారికి తేవాలంటే సమయం పడుతుంది. జగన్ గొప్ప పనులు చేస్తారు. ఎంత మంది చెప్పినా ప్రభుత్వాన్ని పడగొట్టలేదు వైఎస్సార్ ప్రభుత్వం తొలి రోజుల్లో జీతాలిచ్చే పరిస్థితి లేదు. మంచి మనసు ఉంటే ప్రకృతి, దేవుడు సహకరిస్తారు. జగన్ ఎంపీ అయ్యాక 2009లో వైఎస్ మన మధ్యనుంచి వెళ్లిపోయారు. ఒకసారి ఎంపీలందరినీ పిలుచుకుని సోనియా, రాహుల్కు పరిచయం చేశారు. తర్వాత ప్రతి నెలా అపాయింట్మెంట్ అడిగారు. కానీ అవకాశం ఇవ్వలేదు. అప్పుడు మొదలైన పోరాటం మొన్నటి దాకా సాగింది. తనకెన్ని కష్టాలున్నా పక్కనపెట్టాడు. ప్రజలకు ఎప్పుడూ తన కష్టం చెప్పలేదు. జగన్ ఎప్పుడూ పెద్దలను గౌరవించేవాడు. సోనియాను ఓదార్పునకు అనుమతి కోసం వెళ్లినప్పుడు.. తనకు సీఎం పదవి కావాలని కోరలేదు. ‘నాన్న చెప్పినట్లు 41 స్థానాలు మీకు అప్పగిస్తాను.. నాకు మంత్రి పదవి వద్దు.. రాష్ట్రంలో తిరగడానికి అనుమతిస్తే చాలు’ అని కోరాడు. చాలా మంది సలహా ఇచ్చినా ప్రభుత్వాన్ని పడగొట్టలేదు. చంద్రబాబు అవకాశవాది జగన్ను ఎప్పుడూ విమర్శించడమే వాళ్ల పని. వారి బాగోతాలు బయట పడుతుంటే ఓర్చుకోలేక ఇలా మాట్లాడుతున్నారు. కేటీఆర్తో జగన్ బావుంటే నష్టం ఏమిటి? రకరకాల గొడవలతో నీవు దూరమయ్యావు. మళ్లీ వారితో పొత్తు కోసం హరికృష్ణ మృతదేహం సాక్షిగా మాట్లాడావు. కేంద్రంతో, మోదీ.. అమిత్ షాలతో, పక్క రాష్ట్రాలతో మంచి సంబంధాలు అవసరం. ప్రజలకు మంచి చేయడానికి వీలవుతుంది. చంద్రబాబు అవకాశవాది. ఈరోజు మోదీని, కేసీఆర్ను తిట్టడం లేదు. ఈ రోజు తన పార్టీ వాళ్లను బీజేపీలోకి పంపిస్తున్నారు. జగన్ తో మోదీ, అమిత్షాలు బాగానే ఉన్నారు. వాళ్ల పార్టీ వేరు. మా పార్టీ వేరు. అయినా కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉండాల్సిన సంబంధాలున్నాయి. రాష్ట్రంలో సాగిన స్కాంలపై విచారణ జరుగుతుంది’’అని వైఎస్ విజయమ్మ అన్నారు. సమస్య తెలుసుకుని పరిష్కరించే వారు వైఎస్ అధికారంలోకి రావడానికి 25 ఏళ్లు పట్టింది. ప్రతి ఊరు, ప్రతి అవసరం తెలుసు. ప్రతి జిల్లాకు ఎన్నో మార్లు వెళ్లారు. లక్షల మందిని గుర్తు పట్టి పేరుతో పిలిచేవారు. కష్టాల్లో ఉన్న వారికి భరోసా ఇచ్చేవారు. ఆయనే సమస్య తెలుసుకుని పరిష్కారం చూపేంత మంచి మనసు. సీఎం రిలీఫ్ ఫండ్ సరిపోవడం లేదనే ఆరోగ్య శ్రీ తీసుకొచ్చారు. రైతులకు నీళ్లుంటే తప్ప పండించుకునే పరిస్థితి లేదని ప్రాజెక్టులు మొదలు పెట్టారు. నిజాయితీ, వ్యక్తిత్వం ఉంది కాబట్టి ఎవరికీ భయపడలేదు. ఆ రోజూ స్వపక్షంలోనే కార్నర్ చేసేవాళ్లు. ఇదే మీడియా.. ఇదే చంద్రబాబు.. దేనికీ వెరవ లేదు. ఆయనకు ఆయనే సీబీఐ ఎంక్వైరీ వేశారు. పరిటాల రవి హత్య, అవుటర్ రింగ్ రోడ్డుపై ఎంక్వైరీ వేశారు. జలయజ్ఞంపై ప్రతిపక్ష పార్టీలతో చర్చించడానికి సిద్ధమని చెప్పేవారు. ప్రజలకు ఏది అవసరమో అది తెలుసుకుని ఎవరూ అడగకపోయినా స్వయంగా చేశారు. ఈ రోజు జగన్ కూడా అంతే. అదే కోవలోనే మేనిఫెస్టో తయారైంది. వైఎస్ నాడు అలా చేశారు కాబట్టే ఈ రోజు కోట్లాది మంది హృదయాల్లో నిలిచిపోయారు. ప్రతి ఇంట్లో వర్ధంతి జరుపుకునే వారున్నారు. జగన్ మంచి సీఎంగా నిలబడతారు అక్టోబర్ నుంచి నాలుగైదు లక్షల మంది కొత్తగా పనుల్లోకి వస్తున్నారు. గ్రామ సెక్రటేరియట్ నుంచే పాలన సాగించాలనుకుంటున్నారు. అన్ని కార్యక్రమాలకు వైఎస్ స్ఫూర్తి. అందుకే ఆయన పేరు పెడుతున్నారనుకుంటా. డేట్లు ఇచ్చి ఒక్కో పని చేపడుతున్నారు. జనంలో ఎక్కడా వ్యతిరేకత లేదు. వచ్చి మూడు నెలలు కూడా కాలేదు. సమయం ఇవ్వాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఆ నేతల మాటలను మీడియా పది సార్లు వేస్తుంది కాబట్టి వారలా చెప్పుకుంటారు. అప్పుడు, ఇప్పుడు నా మాట ఒక్కటే. నాకు రాజకీయాల్లో తిరగాలని ఇంట్రస్ట్ లేదు. వైఎస్ భార్యగా, జగన్ తల్లిగా ప్రజలకు మంచి జరగాలన్నది నా ఆకాంక్ష. నా కొడుకు మీద నమ్మకంతో 175కు 151 అసెంబ్లీ, 25కు 22 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు. చరిత్రలో నిలబడతాడని ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నా. మంచి ముఖ్యమంత్రిగా జగన్ నిలబడతారు. ఆ రోజు వైఎస్ వల్లే కాంగ్రెస్ వచ్చింది. ఈ రోజు రాష్ట్రంలో వాళ్ల పరిస్థితి ఏమిటి? ఆరోజు ఒక్కసారిగా కష్టాలన్నీ కళ్లెదుట రీల్ తిరిగాయి. అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టడం, మీడియాను అడ్డుపెట్టుకుని అవాస్తవాలు ప్రచారం చేయడం, అసెంబ్లీలో వాళ్లు వ్యవహరించిన తీరు అన్నీ ఒక్కసారిగా.. సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం రోజున గుర్తుకొచ్చాయి. కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. వాళ్లు ఎంత అణిచినా నేల కేసి కొట్టిన బంతిలా జగన్ ముందడుగే వేశారు. సోనియా ఓదార్పు యాత్ర చేయొద్దని చెప్పిందని, వాళ్ల మాట కాదంటే ఇబ్బందులొస్తాయని చెప్పాను. అయినా జగన్ చేయాల్సిందేనన్నారు. ఇబ్బంది పెడతారని తెలిసి నాకు భయం వేయలేదు కానీ బాధేసింది. పదేళ్లలో చాలా మంది అక్కచెల్లెమ్మలు జగన్తో వారి బాధ చెప్పారు. మద్యానికి బానిసైన వారి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. పాదయాత్రలో వారి బాధలు స్వయంగా విన్నారు.. చూశారు. అందుకే ‘ఓ వైపు ఆదాయం తగ్గినా మద్య నిషేధం అమలు చేయాలమ్మా..’ అని చెబుతున్నాడు. ఇది కష్టసాధ్యమైనా చేస్తాడనుకుంటున్నా. వైఎస్ గారు నిజంగా గొప్ప మానవతావాది. చరిత్రను ప్రభావితం చేసే నాయకుడు. ఆయన పెట్టిన పథకాలు ఈ రోజు ఎవరూ తీసేయలేనివి. మన మధ్య నుంచి ఆయన వెళ్లిపోయి ఇవాళ్టికి 10 సంవత్సరాలైంది. అందరిలో ఆ బాధ ఉంది. సెప్టెంబర్ 2ను తలచుకుంటే చాలా చాలా బాధనిపిస్తుంది. పదేళ్ల క్రితం ఆ రోజు 10 కోట్ల మంది హృదయాలు తల్లడిల్లిపోయాయి. ఆయన తిరిగి రావాలని, క్షేమంగా ఉండాలని కుల, మతాలకు అతీతంగా ప్రజలు పూజలు చేశారు. ఏ నాయకుడికీ ప్రజల్లో ఇంతటి స్థానముండదు. ఏ నాయకుడి కోసం 700 మంది చనిపోవడం ఉండదు. అదే అభిమానాన్ని ఈ రోజు జనం ఆయన కొడుకు జగన్పై చూపారు. వారి నమ్మకాన్ని జగన్ తప్పకుండా నిలబెడతారు. వివేకానందరెడ్డి హత్య ఊహించనిది. మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే చేశారు. మనుషులను చంపే వరకు ఎందుకు పోతారో నాకు అర్థం కావడం లేదు. ఆరోజు వైఎస్ను ఇబ్బంది పెట్టేందుకే మా మామ గారిని చంపారు. ఆ రోజు దోషులను అధికారంలో ఉన్న వారు అన్ని విధాలా సహకరించి కాపాడారు. ఈ రోజు జగన్ను ఇబ్బంది పెట్టడం కోసం వాళ్ల చిన్నాన్నను ఇలా చేశారు. -
జ్ఞాపకం
-
దుట్టాకు వైఎస్సార్ ఫ్యామిలీ అరుదైన గిఫ్ట్
సాక్షి, హనుమాన్జంక్షన్: కృష్ణా జిల్లాలోని హనుమాన్ జంక్షన్కు చెందిన వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు డాక్టర్ దుట్టా రామచంద్రరావును వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని ఆయన కుటుంబం అరుదైన కానుకతో గౌరవించింది. 1976 నుంచి వైఎస్సార్తో దుట్టాకు ఉన్న సాన్నిహిత్యాన్ని మరోమారు గుర్తు చేసుకుంటూ మహానేత సతీమణి వైఎస్ విజయమ్మ బహుమతిని పంపించారు. వైఎస్సార్ జ్ఞాపకంగా ఆయన ధరించిన దుస్తులను డాక్టర్ దుట్టాకు బహుమతిగా అందజేశారు. వైఎస్సార్ 70వ జయంతి సందర్భంగా ప్రాణమిత్రుడు వేసుకున్న వస్త్రాలను తన చేతితో తడుముతూ దుట్టా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వైఎస్సార్ ఉన్నంతకాలం తమ స్నేహానికి ఎంతో విలువ ఇచ్చారని, ఆయన మరణానంతరం కూడా ఆ కుటుంబం తనకు ఎంతో గౌరవాన్ని ఇస్తోందని దుట్టా గుర్తు చేసుకున్నారు. -
కొడుకు ముఖ్యమంత్రి అయిన వేళ తల్లి భాగోద్వేగం
-
విజయంలో ఆ ముగ్గురు
-
ఉద్వేగానికి లోనైన వైఎస్ విజయమ్మ
-
అమ్మ భావోద్వేగం
సాక్షి, అమరావతి : వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ఆయన ప్రసంగం తరువాత తల్లి వైఎస్ విజయమ్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పదేళ్ల పాటు అలుపెరుగని పోరు సాగించి, కష్టనష్టాలు భరించి అశేషాంధ్రుల మనసు చూరగొని వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. గురువారం విజయవాడ నగర నడిబొడ్డున అశేష జనవాహిని, పార్టీ శ్రేణుల నడుమ సాగిన ఆయన ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రతీ క్షణాన్ని వైఎస్ విజయమ్మ ఆసక్తిగా గమనిస్తూ వచ్చారు. వైఎస్ జగన్ ప్రసంగిస్తూ.. కీలక నిర్ణయాలు వెలువరిస్తున్నప్పుడు కరతాళ ధ్వనులు చేస్తూ ప్రతిస్పందించారు. ప్రసంగం ముగింపులో ‘ఆశీర్వదించిన దేవుడికి, పైనున్న నాన్న గారికి, నా పక్కనే ఉన్న నా తల్లికి పాదాభివందనం చేస్తున్నా.. మీ అందరి చల్లని దీవెనలకు మరొక్కసారి కృతజ్ఞతలు’ అని వైఎస్ జగన్ అనగానే ఆమె ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు.జగన్ను తదేకంగా చూస్తూ తన్మయత్వం చెందుతూ లేచి నిలుచున్నారు. ఆమె కంట ఒక్కసారిగా నీరు ఉబికి వచ్చింది. ప్రసంగం ముగించి వస్తున్న జగన్.. ఆ దృశ్యాన్ని గమనించి తల్లి దగ్గరకు వెళ్లారు. ఇద్దరూ పర్పరం ఒక్కసారిగా ఆత్మీయంగా రెండు చేతులతో గుండెలకు హత్తుకున్నారు. తన్నుకొచ్చే ఆనంద భాష్పాల మధ్య ఆ సమయంలో ఆమె నోటి వెంట మాట రాలేదు. చెమ్మగిల్లిన తల్లి కళ్లు తుడిచి జగన్ ఓదార్చారు. మాతృ మూర్తి ప్రేమలో ముగ్ధుడవుతూ వీపుపై చేతులతో తడుతూ ‘అమ్మా..’ అని పలకరించే ప్రయత్నం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. ఆయన అకాల మరణంతో ఒక్కడిగా రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ జగన్కు అమ్మ విజయమ్మే అండగా నిలిచింది. పదేళ్లుగా కొడుకు పడిన కష్టాలు, కన్నీళ్లు చూస్తూ తల్లడిల్లిపోయింది. ఎప్పటికప్పుడు ధైర్యం చెబుతూ ప్రజల్లోకి పంపించింది. తండ్రి ఆశయ సాధనలో అలుపెరగని పోరాటం చేసి.. ప్రజల ఆశీస్సులతో ఆఖండ విజయం సొంతం చేసుకున్న కొడుకును చూసి విజయమ్మ తల్లిగానే స్పందించారు. కొద్ది క్షణాల పాటు ఆ దృశ్యాన్ని ప్రత్యక్షంగా, టీవీల్లో వీక్షించిన ప్రజలు సైతం భావోద్వేగానికి లోనయ్యారు. ‘ఢిల్లీకి రాజైనా ఆ అమ్మకు కొడుకే కదా..’ అన్న నానుడిని గుర్తుకు తెచ్చుకున్నారు. -
రాష్ట్రాన్ని చుట్టి.. ప్రజల మనసు తట్టి
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ మాతృమూర్తి విజయమ్మ, సోదరి షర్మిల నిర్వహించిన ఎన్నికల ప్రచారం వైఎస్సార్సీపీ ఘనవిజయానికి అదనపు ఇంధనంగా పనిచేసింది. రాజన్న రాజ్య స్థాపన కోసం వారిద్దరూ పార్టీ ఎన్నికల ప్రచార వ్యూహంలో క్రియాశీలపాత్ర పోషించారు. వైఎస్ జగన్ పర్యటించలేని నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిసారించి ప్రచారాన్ని హోరెత్తించారు. విజయమ్మ ప్రచారం ప్రజల మనసులను సున్నితంగా తాకుతూ ఆలోచింపచేయగా.. షర్మిల ప్రచారం జంఝామారుతంలా ఓటర్లను ఉర్రూతలూగించింది. కేవలం 20రోజుల్లో విజయమ్మ 9 జిల్లాల్లో 27 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక 6 జిల్లాల్లో 39 నియోజకవర్గాల్లో షర్మిల నిర్వహించిన ఎన్నికల ప్రచారం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. విజయమ్మ, షర్మిల తమదైన ప్రసంగాలతో ఓటర్లను ఆలోచింపజేశారు. కేసులకు భయపడి వైఎస్ జగన్ కేంద్రంతో రాజీపడ్డారన్న టీడీపీ దుష్ప్రచారాన్ని విజయమ్మ సమర్థంగా తిప్పికొట్టారు. ‘నా బిడ్డ ఆనాడు సోనియాగాంధీకే భయపడలేదు. ఇక మోదీకి భయపడతారా’అని నేరుగా ప్రశ్నించడం అందర్నీ ఆకట్టుకుంది. తండ్రిని చూసి పెరిగిన తన తనయుడు అదే విధంగా సంక్షేమ రాజ్యం అందిస్తారని ఆమె ప్రజలకు భరోసా ఇచ్చారు. ఆమె ప్రసంగాలు వైఎస్సార్సీపీ పట్ల ప్రజల్లో మరింత సానుకూలతను పెంచాయి. ఇక షర్మిల ప్రచార హోరుతో రాష్ట్రాన్ని ఉర్రూతలూగించారు. వైఎస్సార్సీపీ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోదని చెబుతూ ‘సింహం సింగిల్గానీ వస్తుంది.. జగనన్న సింగిల్గానే వస్తాడు’ అన్న ఆమె ప్రసంగం జనంలోకి బాగా చొచ్చుకువెళ్లింది. చంద్రబాబు, లోకేశ్లతోపాటు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల మీద ఆమె సూటిగా, ధాటిగా చేసిన విమర్శలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ‘బాబు వస్తే జాబు వస్తుందో రాదో తెలీదుగానీ కరువు మాత్రం వస్తుంది’, ‘బాబు వస్తే ఎవరికీ జాబులు రాలేదు కానీ పప్పుకు మాత్రం జాబ్ వచ్చింది’అంటూ ఆమె చలోక్తులకు ప్రజలు కేరింతలు కొట్టారు. షర్మిల తన ప్రసంగం చివర్లో ‘బాయ్ బాయ్ బాబు..’అంటూ చెబుతూ చివర్లో ‘బాయ్ బాయ్ పప్పు’ అంటూ వేసిన పంచ్ డైలాగులు బాగా పాపులర్ అయ్యాయి. సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్గా మారి హల్చల్ చేశాయి. ఈ విధంగా విజయమ్మ, షర్మిల తమదైన శైలిలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేశారు. ఓటర్ల మనసు గెలుచుకున్నారు. పార్టీ ఘన విజయంలో తమ వంతు కీలక పాత్ర పోషించారు. -
విలువలు, విశ్వసనీయత..బైబై బాబు!
సాక్షి, హైదరాబాద్ : ‘విలువలకు, విశ్వసనీయతకు పట్టం కట్టండి’ అంటూ వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఇచ్చిన పిలుపును ఆంధ్రప్రదేశ్ ప్రజలు అక్షరాలా నిజం చేసి చూపించారు. మహానేత వైఎస్సార్ను కోల్పోయినప్పటికీ... తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన జీవితాన్ని ప్రజా సేవకే అంకితం చేస్తానని చెప్పినా ఆ మాతృమూర్తి ఎన్నడూ అడ్డు చెప్పలేదు. భర్తను కోల్పోయినప్పటికీ... రాజకీయ ప్రత్యర్థులు కుమారుడిని నెలల పాటు జైళ్లో ఉంచినప్పటికీ మొక్కవోని ధైర్యంతో కుటుంబాన్ని, పార్టీ శ్రేణులను ముందుకు నడిపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అతి తక్కువ ఓట్ల తేడాతో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఓటమి పాలైనప్పటికీ జననేత జగన్తో పాటు ఆమె కూడా వారికి అండగా నిలిచారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రజారంజక పాలన అందించేందుకు వైఎస్సార్ సీపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా కృషి చేసిన తనయుడికి మద్దతుగా..ఎండల్ని సైతం లెక్కచేయక సుడిగాలి ప్రచారం నిర్వహించారు. 27 సభల్లో తనదైన శైలిలో ప్రచారం సాగించి చంద్రబాబు పాలనను ఎండగట్టారు. అదే దరహాసం.. తరగని విశ్వాసం ఓ పక్క హామీలను గాలొకొదిలేసి ప్రజలను వంచించిన అధికార పార్టీని విమర్శిస్తూనే.. మరోపక్క తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎటువంటి పాలన అందిస్తారోనన్న విషయాన్ని ప్రజలకు స్పష్టంగా వివరించారు. వైఎస్సార్ పాలనను గుర్తు చేస్తూ.. రాజన్న తనయుడికి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ఉద్వేగపూరితంగా ఆమె చేసిన ప్రసంగాలు ప్రజలను కదిలించాయి. ప్రజలకిచ్చిన మాటకోసమే జగన్.. సోనియాను ఎదిరించి మరీ ఓదార్పు యాత్ర చేశారని, ఈ నేపథ్యంలో ప్రజల్లో జగన్ పట్ల ఆదరణ పెరిగిపోవడంతో తట్టుకోలేని కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై అక్రమ కేసులు బనాయించాయని, సీబీఐ, ఈడీలతో దాడులు చేయించి.. ఆస్తులు అటాచ్ చేశారని, చివరకు విచారణ పేరుతో పిలిచి జైల్లో పెట్టారంటూ జరిగిన సంఘటనలను సవివరంగా తెలియజేస్తూ, తను ఎందుకు బయటకు రావాల్సి వచ్చినదీ వివరించడం ప్రతీ ఒక్కరినీ కదిలించింది. ఆనాడు తమ కుటుంబం వెంట నిలిచిన ప్రజలకోసం తాను, షర్మిల బయటకు వచ్చామని, ఈరోజు కూడా ప్రజలంతా తమ కుటుంబమనుకునే బయటకు వచ్చామన్న ఆమె మాటలు జనం గుండెలను తాకాయి. ఈ విధంగా వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడంలో తన వంతు పాత్ర పోషించారు. ఆలోచింపజేసిన విజయమ్మ మాటలు - రాజశేఖరరెడ్డి గారిలా జగన్ మాట ఇస్తే తప్పడు. వాళ్ల నాన్న మాదిరి పరిపాలన అందిస్తాడు. - జగన్కు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. - ఈరోజు ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతోంది.. విలువలకు, విశ్వసనీయతకు పట్టం కట్టండి. - జగన్ సోనియా గాంధీనే ఎదిరించి నిలిచినవాడు.. ఈరోజు కేసులకు భయపడతాడా? ఓటమి భయంతో చంద్రబాబు ఇష్టానురీతిన దుష్ప్రచారం చేస్తున్నారు. అన్న బాణం.. దూసుకెళ్లిన షర్మిల.. వైఎస్సార్ తనయ, జగన్ సోదరి షర్మిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అన్న జైలులో ఉన్న సమయంలో ఓదార్పు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లిన ఆమె.. ప్రస్తుత ఎన్నికల్లో 39 సభల్లో పాల్గొని ప్రచారంలోనూ ప్రజలను ఉర్రూతలూగించారు. ‘మాకు ఎవ్వరితోనూ పొత్తుల్లేవు. సింహం సింగిల్గానే వస్తుంది.. నక్కలే గుంపులుగా వస్తాయి’ అంటూ ప్రచారం సాగించిన షర్మిల తన ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకున్నారు. ఎన్నికల ముంగిట పసుపు- కుంకుమ పేరిట ఇస్తున్న డబ్బులు డ్వాక్రా రుణాల వడ్డీలకు కూడా సరిపోవని వివరించిన తీరు మహిళలను ఆలోచింపజేశాయి. చంద్రబాబు ఏవిధంగా అబద్ధాలు చెబుతున్నారో, ప్రజల్ని ఏ విధంగా మోసగించారో ఆమె సూటిగా వివరిస్తూ.. విమర్శనాస్త్రాలు సంధించారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ విషయంలో రైతులు, డ్వాక్రా మహిళలను చంద్రబాబు వంచించిన తీరును కళ్లకు కట్టారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు చేసిన మోసాన్ని ఆమె ప్రజల ముందుంచారు. సీఎం చంద్రబాబుతోపాటు ఆయన కుమారుడు లోకేశ్ వ్యవహార శైలిని ఆమె తూర్పార పట్టిన తీరు ప్రజలను బాగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నిరుద్యోగ యువతలో ఒక్కరికైనా ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అంటూ ప్రశ్నిస్తూ జనం నుంచే లేదంటూ చెప్పించారు. వైఎస్ జగన్పై చంద్రబాబు చేస్తున్న అవాస్తవ పొత్తుల ఆరోపణలను షర్మిల తిప్పికొట్టారు. హరికృష్ణ శవాన్ని ముందు పెట్టుకుని తెలంగాణ సీఎం కేసీఆర్తో పొత్తుల కోసం బేరాలాడిన నువ్వా పౌరుషం గురించి మాట్లాడేది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలకు జనం నుంచి భారీ స్పందన వచ్చింది. చివరగా ప్రజా తీర్పు బై బై బాబు కావాలంటూ షర్మిల చెప్పగా ఆయా సభలకు హాజరైన ప్రజానీకం ఆమెతో గొంతు కలపడం విశేషం. ఇక మొత్తంగా వైఎస్ విజయమ్మ, షర్మిల కలిసి 66 సభల్లో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. మొత్తం 20 రోజుల పర్యటనలో వైఎస్ విజయమ్మ 27, షర్మిల 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన సభల్లో పాల్గొని ప్రసంగించారు. విజయమ్మ 9 జిల్లాల పరిధిలోనూ, షర్మిల 6 జిల్లాల పరిధిలోనూ పర్యటించి జననేత విజయంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ప్రజలను ఆకట్టుకున్న షర్మిలమ్మ మాటలు - బాబు వస్తే జాబు రాలేదు కానీ కరువు వచ్చింది. - రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు లేవు కానీ ఎటువంటి అనుభవం లేని సీఎం తనయుడు లోకేశ్కు మాత్రం ఉద్యోగం వచ్చింది. ఏకంగా మూడు ఉద్యోగాలు (మంత్రి పదవులు) దక్కాయి. - ప్రజా తీర్పు.. బై బై బాబు