Yatra Movie
-
సోషల్ మీడియాలో యాత్ర 2 టీజర్ కు సూపర్ రెస్పాన్స్..!
-
Yatra 2: గుర్తుపెట్టుకోండి..నేను వై.ఎస్ రాజశేఖరరెడ్డి కొడుకుని..
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్ మూవీ ‘యాత్ర’. వైఎస్సార్ప్రజా ప్రస్థానం యాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ నాలుగేళ్ల క్రితం(2019) విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లోనే ఈ చిత్రానికి సీక్వెల్ ఉటుందని ప్రకటించాడు దర్శకుడు మహి వి.రాఘవ్. ఈ సీక్వెల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర నుంచి మొదలై ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకూ ఉంటుందని ఇటీవల రివీల్ చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ని జులై 8న వైఎస్సార్ జయంతి సందర్భంగా ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ వారం ముందే ‘యాత్ర-2’ రిలీజ్ డేట్ని ప్రకటిస్తూ ఓ పోస్టర్ని విడుదల చేసి సర్ప్రైజ్ చేశాడు మహి. ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానున్నట్లు ప్రకటించారు. (చదవండి: సినీ తారల ‘వ్యాపారం’.. సైడ్ బిజినెస్తో కోట్లు గడిస్తున్న స్టార్స్ వీరే!) తాజాగా రిలీజైన పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసింది. ఈ పోస్టర్పై ‘నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. నేను వై.ఎస్ రాజశేఖరరెడ్డి కొడుకుని’అనే లైన్స్ ‘యాత్ర 2’ కథేంటో తెలియజేస్తుంది. వైఎస్సార్ మరణానంతరం వైఎస్ జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర మొదలు.. సీఎం పీఠం ఎక్కే వరకు ఆయనకు ఎదురైన పరిస్థితుల నేపథ్యంలో యాత్ర 2 కథ సాగుతుందని పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. సీఎం జగన్ చేపట్టిన పాదయాత్రను హైలెట్ చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. సీఎం జగన్ పాత్ర పోషించేదెవరనేది ఇంతవరకు ప్రకటించలేదు కానీ తమిళ హీరో జీవా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. Step into the shoes of a torchbearer as we bring his extraordinary journey to life! #Yatra2 in cinemas from Feb 2024 👣#LegacyLivesOn @ShivaMeka @MahiVraghav @vcelluloidsoffl @Music_Santhosh @madhie1 #SelvaKumar @3alproduction pic.twitter.com/biCaoXraBh — Three Autumn Leaves (@3alproduction) July 1, 2023 -
‘యాత్ర’.. ఓ మహానాయకుడి వ్యక్తిత్వానికి వెండితెర రూపం
కొన్ని కథలు ప్రేక్షకులను అలరిస్తాయి.. ఆలోచింపజేస్తాయి. మరికొన్ని కథలు హృదయాలను హత్తుకుంటాయి. కన్నీళ్లను తెప్పిస్తాయి. అలా మనసుల్ని హత్తుకునే కథలు అప్పుడప్పుడు మాత్రమే వస్తాయి. అలాంటి వాటిలో ‘యాత్ర’ ఒకటి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్ మూవీ ఇది. వైఎస్సార్లో రాజకీయపరంగానే కాక వ్యక్తిత్వ పరంగా కూడా ఎన్నో మార్పులు తీసుకువచ్చిన ప్రజా ప్రస్థానం యాత్ర నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. నాడు ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్సార్.. పాదయాత్ర ద్వారా జనంలోకి ఎలా వెళ్లగలిగారు? సమస్యలు ఎలా తెలుసుకున్నారు? కష్టాలకు పట్టించుకోకుండా.. మండుటెండల్లో ఎలా ముందడుగు వేశారు.. మండుటెండల్లో ఎలా ముందడుగు వేశారు? ఆయన పాదయాత్రకు దారి తీసిన పరిస్థితులేంటి? పాదయాత్ర రాజశేఖర్రెడ్డి వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పులు తీసుకు వచ్చింది? యాత్రలో ఆయనకు ఎదురైన అనుభవాలేంటి ? పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయి కష్టాల్లో ఉన్న పార్టీని వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన పట్టుదలతో ఎలా విజయతీరాలకు చేర్చారు? అన్నదే ఈ సినిమా కథ. ఒక సినిమాకు కథతో పాటు క్యారెక్టర్ సెలక్షన్ కూడా చాలా ముఖ్యం. ఇదే సినిమా సక్సెస్ని నిర్ణయిస్తుంది. వైఎస్సార్ పాత్రకు మలయాళ నటదిగ్గజం మమ్ముట్టిని ఎంపిక చేయడంతోనే ఈ సినిమా సగం విజయం సాధించింది. ‘యాత్ర’ సినిమా అనేది ఓ ఎమోషనల్ జర్నీ. ఇందులో పెద్దగా కథ కంటే పాత్రలే ముఖ్యం. వైఎస్సార్ పాత్రకు మమ్ముట్టి ప్రాణం పెట్టి నటించాడు. ఫస్ట్ సీన్ నుంచి చివరి వరకు తెర మీద రాజన్ననే చూస్తున్నామన్నంతగా ప్రేక్షకుడిని కథలో లీనం చేశాడు మమ్ముట్టి. రాజశేఖరరెడ్డి రాజసం, హుందాతనం, రాజకీయం, నమ్మిన వారికోసం ఎంతకైన తెగించే వ్యక్తిత్వం లాంటి విషయాలను తెర మీద అద్భుతంగా పలికించాడు. సినిమా అంతా ఒక ఎత్తైయితే క్లైమాక్స్లో వచ్చే వైఎస్ రాజశేఖర్రెడ్డి సీన్స్ మరో ఎత్తు. అప్పటి వరకు వైఎస్సార్ గొప్పతనాన్ని తెలుసుకొని ఉప్పొంగిపోయిన ప్రేక్షకులను చివర్లో చూపించే రియల్ ఫుటేజ్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. అన్ని బయోపిక్ మూవీస్లా కేవలం కథను మాత్రమే చెప్పే ప్రయత్నం చేయలేదు దర్శకుడు మహి వీ రాఘవ. సినిమా తొలి సన్నివేశం నుంచే ప్రేక్షకుడిని కథలో లీనం చేసి రాజన్నతో ప్రయాణం చేసేలా చేశాడు. అందుకే విమర్శకులు సైతం రాఘవపై ప్రశంసలు కురిపించారు. సూటిగా సుత్తి లేకుండా, చెప్పాల్సిన విషయాన్ని ఎమోషనల్గా.. ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా.. కంటతడి పెట్టించేలా ‘యాత్ర’ను తీర్చి దిద్దారు. (యాత్ర సినిమా విడుదలై నేటికి(ఫిబ్రవరి 8) నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా..) -
Actor Shritej Latest Interview: నటుడు శ్రీతేజ్ ఫుల్ ఇంటర్వ్యూ
-
నటుడు శ్రీతేజ్ ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రోమో
-
మా గుండెల్లో గుడిసెల్లో... కొలువుంటావు రాజన్నా!
పెంచలదాసు (రచయిత, గాయకుడు): రాజశేఖరరెడ్దిగారంటే నాకు చాలా ఇష్టం. నేను కూడా కడప జిల్లావాడిని కనుక మరింత ఇష్టం ఉండి ఉండొచ్చు. ఆయన మహాభినిష్క్రమణ విధానం చూస్తే ఎవరికైనా కంట నీరు ఆగదు. అటువంటి స్థితి ఎవ్వరికీ రాకూడదు. నాకు గుండెల నిండా దుఃఖం వచ్చింది. ఆయన గురించి చాలామంది కవితలు రాశారు, పాటలు రాసి పాడారు, నాకు మాత్రం ‘యాత్ర’ చిత్రంలో ‘మరుగైనావా రాజన్నా... కనుమరుగైనావా రాజన్నా/మా ఇంటి దేవుడవే మా కంటి వెలుగువే/ఒరిగినావా రాజన్నా ఒరిగినావా రాజన్నా’ పాట రూపంలో ఘనమైన నివాళి ఇచ్చే అదృష్టం కలిగింది. వైయస్సార్ అంటే ఇష్టపడని వారు ఉండరు కదా. వైయస్సార్ మీద ‘యాత్ర’ సినిమా తీస్తున్న సందర్భంగా ఆ చిత్ర దర్శకులు మహి రాఘవ నన్ను పిలిచి, ఒక పాటకు ఫోక్ స్టయిల్లో డ్యాన్స్ చేయాలన్నారు. నేను డ్యాన్సర్ని కాదు కనుక మిన్నకుండిపోయాను. యాత్ర సినిమా మొదలైనప్పటి నుంచి నా మనసంతా అటువైపే ఉంది. ఈలోగా ‘అరవింద సమేత’ చిత్రంలో పాత్రలకు మాండలికం నేర్పడానికి శబ్దాలయా స్టూడియోకి వచ్చాను. అక్కడే ఉన్న మహి రాఘవ గారిని పలకరించాను. ‘నన్ను డ్యాన్సుకి పిలిచారు కదా, నేను డ్యాన్సర్ని కాదు, అందుకే రాలేదు’ అన్నాను. వాస్తవానికి ఆయన నన్ను పాట రాయడానికి పిలిచారట. ఆ చిత్రంలో మొత్తం ఐదు పాటలు సిరివెన్నెలగారితో రాయించారు. సినిమా విడుదలకు ఐదు రోజుల ముందు రాఘవగారు ఫోన్ చేసి, ‘వైయస్సార్ ఆఖరి రోజుకు సంబంధించిన పాట మీరు రాస్తే బావుంటుందనుకుంటున్నాం. పెద్దాయనది మీ జిల్లా కదా, మీ జిల్లా మాండలికంలో, యాసలో పాట రాయండి’ అని స్వేచ్ఛనిచ్చారు. సంగీతం గానం కూడా నన్నే చేయమన్నారు. నాలుగు రోజుల్లో సమాధానం చెప్పమని ఫోన్ చేశారు. నాకు మంచి పని పడింది కదా అని ఒక పక్క సంతోషం, ఎలా రాస్తానా అని మరో పక్క భయం రెండూ కలిశాయి. నేను రాసే ఈ పాట పదికాలాల పాటు నిలిచిపోవాలనుకున్నాను. వైయస్సార్ నిర్యాణం బాధాకరం. ఆయన నిర్యాణం తరవాత ఎంతోమంది ప్రాణాలు వదిలారు. అంతటి మహోన్నత వ్యక్తి గురించి ఎలా రాయాలా... అని నడుస్తున్నా, పడుకున్నా నిరంతరం అదే ఆలోచన. అద్భుతమైన మాటలతో ప్రారంభించాలనుకున్నాను. అవధూతలు నిర్యాణం చెందినప్పుడు ‘చనిపోయారు’ అని కాకుండా, ‘మరుగైనారు’ అంటారు. వైయస్సార్ కూడా అవధూతలాంటి వారు. మనుషులను ప్రేమించేవారు. మహా నాయకుడు. అందుకే ‘మరుగైనావా రాజన్నా’ అని పాట ప్రారంభించాను. పాటను తన్మయంతో పాడాలి. నాకు నాటకాలలో పద్యాలు, పాటలు పాడిన అనుభవం ఉన్న కారణంగా బాగానే పాడగలిగాను. మా అన్న చిన్నయదాసు (ఇప్పుడు ఆయన లేరు) గొప్ప జానపద గాయకుడు. మా అన్నయ్యను వైయస్సార్గారు ‘ఏం చిన్నయదాసు’ అని ఆప్యాయంగా పిలిచేవారు. అంత గొప్పనాయకుడు మనల్ని అంత గుర్తు పెట్టుకుని పలకరించడం చాలా సంతోషంగా వుండేదని మా అన్న తరచూ చెబుతూ వుండేవారు. మా అన్నయ్య తరం వారు ఆలి, ఆకలి తెలియకుండా తిరిగే జానపద కళాకారులు. ఆయన పాడిన జానపద గీతాల్లో ‘‘ఏమన్నాడు హనుమన్నా? ఏమన్నాడు రామయ్యా? ఏమన్నాడు రామయ్యా? ఎట్లున్నాడు లక్ష్మయ్య’ అని ఒక గీతం పాడేవారు. మా అన్నయ్యకు దండం పెట్టుకుని నేను రాసుకున్న ‘మరుగైనావా రాజన్నా’ పాటను అదే ట్యూన్లో పాడాను. మా పల్లెల్లో ఎవరైనా గొప్పవాళ్లు, మహనీయులు మరణిస్తే – వాళ్లని చనిపోయారు అనే మాటకు బదులు ‘కొండంత మనిషి వొరిగిపోయాడురా!’ అంటారు. అందువల్ల ఆ పదాన్ని పల్లవిలో ఉపయోగించాను. ‘‘అద్దుమానం అడవిలోనా/ ఏలకాని ఏల కాడ/పైన పోయే పచ్చులారా/ ఏడమ్మా మన రాజన్నా/ నువ్వొచ్చే దావల్లో... పున్నాగా పూలు జల్లి/నీ కోసం వేచుంటే... చేజారీపోతివా’ అని ఒక చరణం రాశాను. అధ్వానం అనే పదాన్ని అద్దుమానం అంటారు మా మాండలికంలో. ఆకాశంలో పక్షులు తిరుగుతుంటాయి. ఆ పైన నుంచి వాటికి రాజన్న కనిపించాడేమోనని ‘మీరైనా చూడలేదా’ అని ప్రశ్నించాను ఈ చరణంలో. పాట పాడుతున్నంతసేపూ నాకు ఏడుపు ఆగలేదు. వైయస్సార్గారి వేషధారణ, నడక, నవ్వు... మనిషిని అధీనం చేసుకుంటాయి. ఆయన నడుస్తుంటే తెల్ల కలువలా ఉంటాడు. ఆయన స్వచ్ఛమైన నవ్వుని, తెల్లని బట్టలను దృష్టిలో ఉంచుకుని, ‘చల్లానీ నీ నవ్వూ... చక్కానీ నీ నడక/రచ్చబండా చేరకనే... నేల రాలిపోతీవా/మాట తప్పని రాజన్నా... మడమ తిప్పని మనిషివయా/మరువజాలము నీ రూపం... నీకు సాటి ఎవరయ్యా’ అని రాశాను. ఈ పాటను మొత్తం 40 వాక్యాలు రాశాను. సినిమాకి అనుగుణంగా తగ్గించారు. సహజంగా రాయలసీమ గ్రామాల్లో సాయంకాలం సమయంలో మట్టి ప్రమిదలో ఒత్తి పెట్టి, ఆవు పేడ పిడను ఉంచి, దీపం వెలిగించి, దానికి దండం పెడతారు. ఆ సందర్భాన్ని ఇక్కడ రాజన్నకు కలిసేలా ‘‘మా గుండెల్లో గుడిసెల్లో... కొలువుంటావు రాజన్నా/సాయం సంధ్యా దీపంలో... నిన్నే తలుచూకుంటాము/నిన్నే తలుచుకుంటాము...’’ అని రాశాను. నా జీవితంలో నాకు ఇష్టమైన పాట, నా మనసుకి నచ్చిన పాట. ఈ పాట రాయడం పూర్తయ్యాక దర్శకనిర్మాతలకు వినిపించాను. అందరూ బాగుందని మెచ్చుకున్నారు. డైరెక్టరు గారైతే పాట వింటూ మౌనంగా ఉండిపోయారు. అలా ఆ పాట పూర్తయ్యింది. ఏదో ఒక పాట పాడి భ్రష్టుపట్టడం నాకు ఇష్టం లేదు. నచ్చినవి మాత్రమే పాడతాను. నా వరకు ఇది పెద్దాయనకు నేను నా హృదయమంతటితో ఆత్మతృప్తిగా ఇచ్చిన ఘనమైన అక్షర నివాళి. నేను డ్రాయింగ్ వేస్తుంటాను. వ్యాసాలు రాస్తుంటాను. బాటిక్ పెయింటింగ్లో రాష్ట్రస్థాయి అవార్డు పొందాను. ఈ పాటకు నాకు డబ్బులు బాగానే ఇచ్చారు. ‘‘పెద్దాయనా! ఆర్థికంగా కూడా నన్ను ఆదుకున్నావు’’ అనుకున్నాను. – సంభాషణ: వైజయంతి పురాణపండ -
‘యాత్ర’ దర్శకుడి కొత్త సినిమా!
పాఠశాల సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన మహి వీ రాఘవ్ ఆనందో బ్రహ్మ సినిమాతో తొలి కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు. తరువాత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కించిన యాత్ర సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి వసూళ్లను కూడా సాధించింది. యాత్ర తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న మహి, తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. మంగళవారం తన పుట్టిన రోజు సందర్భంగా తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించాడు మహి. ‘ఓ దర్శకుడు కథ చెప్పటం కన్నా, ఏ కథ చెప్పాలి అని నిర్ణయించుకోవటమే కష్టమైన పని. బాక్సాఫీస్ ట్రెండ్స్, బడ్జెట్, నటీనటులు ఇవేవి కథ ఎంపికకు సాయపడవు. నిశ్శబ్ధంలో వచ్చే ఓ ఆలోచన.. ఇదే నువ్వు చెప్పాల్సిన కథ అని నాకు తెలియజేస్తుంది. నా తదుపరి చిత్రం ఓ యాక్షన్ డ్రామా. టైటిల్ ‘సిండికేట్’. త్వరలోనే ఈ కథ, పూర్తి స్థాయి స్క్రిప్ట్గా, ఆ స్క్రిప్ట్ సినిమాగా వస్తుందని ఆశిస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు. ‘SYNDICATE’ pic.twitter.com/6DAyGGqjFf — Mahi Vraghav (@MahiVraghav) July 30, 2019 -
అన్నిటికీ మూలం.. ఆయనే
సాక్షి, అమరావతి : సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన జనరంజకులైన పాలకుల్ని, ప్రజల హృదయాలపై చెరగని ముద్ర వేసిన మహానుభావుల్ని వారు మరణించాక కూడా ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారు. భౌతికంగా ప్రజల మధ్య లేకపోయినా వారి గొప్పతనాన్ని స్మరించుకుంటూ పుస్తకాలు, సినిమాలు, షార్ట్ఫిల్మ్లు రావడం కొత్తేమీ కాదు. ఈ నేపథ్యంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకాలు తెలుగు ప్రజల జీవితాలతో ఎంతలా పెనవేసుకుపోయాయో, వాటితో ఎంతమంది జీవితాలు బాగుపడ్డాయో చెప్పనలవి కాదు. అందుకే కన్నుమూశాక కూడా ఆయన కీర్తిప్రతిష్టలు తెలుగు రాష్ట్రాల్లో మరే ఇతర నాయకుడికి లేనంతగా ఇనుమడించాయి. ‘యాత్ర’ అపూర్వం..: ప్రతిపక్ష నేతగా వైఎస్సార్ 1467 కిలోమీటర్ల మేర చేసిన పాదయాత్ర (ప్రజాప్రస్థానం) ఇతివృత్తంగా ప్రముఖ నటుడు మమ్ముట్టి కథానాయకుడిగా రూపొందిన ‘యాత్ర’ చిత్రం సంచలన విజయం సాధించింది. దేశ, విదేశాల్లో తెలుగు ప్రేక్షకుల నుంచి అపూర్వ ఆదరణ దక్కించుకుంది. వైఎస్సార్ మాటతప్పని, మడమ తిప్పని వ్యవహార శైలి, ప్రజల చిన్నచిన్న సమస్యలకే కరిగిపోయే ఆయన దయార్ద హృదయం, ఆయన గుణగణాలను ప్రతిబింబించేలా తీసిన ‘యాత్ర’ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మాండంగా ఆదరించారు. ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ ఆ చిత్రంలో వైఎస్సార్ పాత్రలో జీవించిన మమ్ముట్టి పలికిన డైలాగ్ తెలుగునాట జనాల్లోకి చొచ్చుకుపోయింది. పాదయాత్ర చేపట్టడానికి దారితీసిన పరిస్థితులు, పాదయాత్ర వల్ల వైఎస్సార్లో వచ్చిన మార్పు, ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్మెంట్, రైతులకు మేలు చేసే పథకాలు ప్రవేశపెట్టడానికి కారణాలను ఈ సినిమా చక్కగా ప్రజల ముందు ఆవిష్కరించింది. 2019 సాధారణ ఎన్నికలకు ముందు విడుదలైన ఈ చిత్రం విజయదుందుభి మోగించింది. వైఎస్కు అత్యంత సన్నిహితంగా మెలిగిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ రాసిన ‘వైఎస్సార్తో ఉండవల్లి అరుణ్కుమార్’ అనే పుస్తకం ద్వారా ఆ మహానేత వ్యక్తిత్వాన్ని సామాన్య ప్రజలు మరింత ఎక్కువగా తెలుసుకునే అవకాశం కలిగింది. వైఎస్సార్ కన్నుమూశాక ఆయన గురించి పత్రికల్లో వివిధ ప్రముఖులు రాసిన వ్యాసాలను, ఆయనతో వారి అనుభవాలను సంకలనం చేసి వెలువడ్డ తొలి పుస్తకం.. ‘జననేత’. మాజీ జర్నలిస్టు ఎల్.విజయకృష్ణారెడ్డి (ఎల్వీకే) ఆధ్వర్యంలో వచ్చిన ఈ పుస్తకాన్ని నాడు ఎంపీగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. వైఎస్సార్కు సన్నిహితుడైన షేక్ ఇమాం (కదలిక పత్రిక సంపాదకుడు) ‘జనం చెక్కిన శిల్పం’ పేరుతో రూపొందించిన వ్యాసాల సంపుటి పుస్తకం వైఎస్ వ్యక్తిత్వాన్ని మరింత లోతుగా ఆవిష్కరించింది. పేద, బడుగు వర్గాల సమస్యల పట్ల మహానేత వైఖరి, సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయంపై ఆయన ఆసక్తి, అన్నిటి కంటే మించి.. పేదలకు విద్య వంటి అంశాలపై వైఎస్ ఆలోచనలు ఎలా ఉండేవో ఈ పుస్తకంలో ఇమాం చక్కగా వివరించారు. ‘వైఎస్సార్.. ది మ్యాన్ ఆఫ్ ది పీపుల్ (ప్రజల మనిషి.. వైఎస్సార్)’ పేరుతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రాణస్నేహితుడు, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు 150 ఫొటోలతో ఆకర్షణీయంగా ఒక పుస్తకాన్ని రూపొందించారు. 2011లో అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ సోషియాలజీ విభాగం వైఎస్ పాలన, సంక్షేమంపై నిర్వహించిన సెమినార్కు దేశవ్యాప్తంగా ఎందరో విద్యావేత్తలు హాజరయ్యారు. రామగంగిరెడ్డి అనే అసిస్టెంట్ ప్రొఫెసర్ వైఎస్సార్ పాదయాత్రపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందడం గమనార్హం. 70 రోజులు వెంటిలేటర్పైనే.. గుంటూరు జిల్లా కొత్తపేటకు చెందిన ఈశ్వరరెడ్డి, రమాదేవి దంపతులది నిరుపేద కుటుంబం. ఈశ్వరరెడ్డి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గుమస్తాగా పనిచేస్తున్నారు. పెళ్లయ్యాక చాలాకాలంపాటు వీరికి పిల్లలు లేరు. 2008లో ఈశ్వరరెడ్డి భార్య గర్భం దాల్చింది. దీంతో ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేవు. అయితే.. ఈ ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. రమాదేవికి 7వ నెలలోనే ప్రసవమై ఇద్దరు కవల ఆడ పిల్లలు పుట్టారు. ఒక్కో పాప కేవలం 900 గ్రాములు మాత్రమే బరువు ఉంది. ఆ చిన్నారుల బరువు చూసి వైద్యులు ఆశలు వదులుకోవాల్సిందేనన్నారు. వైద్యుల మాటలతో లేకలేక పుట్టిన చిన్నారులను చూసి తల్లిదండ్రులు ఆవేదనకు గురయ్యారు. అదే సమయంలో ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది.ఆ చిన్నారులను ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించుకోండని వైద్యులు చెప్పారు. దీంతో ఆ చిన్నపిల్లలిద్దరినీ వెంటిలేటర్పై గుంటూరులోని శ్రీరామచంద్ర చిన్నపిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో ఆ ఇద్దరినీ ఆస్పత్రిలో చేర్చుకున్నారు. పిల్లలిద్దరికీ 70 రోజులపాటు వెంటిలేటర్పైనే వైద్యమందించారు. సాధారణంగా వెంటిలేటర్పైన ఉంటే రోజుకు వేలల్లోనే ఖర్చవుతుంది. ఈ పరిస్థితుల్లో చిన్నారులిద్దరికీ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా నయాపైసా తీసుకోకుండా 70 రోజుల పాటు వైద్యమందించి వారి ప్రాణాలు కాపాడారు. ఆ చిన్నారులు మోహనదీప్తి, మోహనరూప ఇప్పుడు 5వ తరగతి చదువుతున్నారు. వైఎస్సార్ పుణ్యమాని ఇప్పుడు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. వైఎస్సార్ తమ కుటుంబంలో సంతోషం నింపారని దంపతులిద్దరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు పుట్టినప్పుడు వైద్యం చేయించడానికి డబ్బులు లేవని, ఆస్తులమ్ముకుని బతికించుకుందామన్నా ఆస్తులు లేవని నాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో పిల్లలిద్దరినీ చూసినప్పుడు బాధ, భయమూ వెంటాడాయని వివరించారు. ఆ దేవుడే ఆరోగ్యశ్రీ రూపంలో తన పిల్లలకు ప్రాణభిక్ష పెట్టారని చెబుతున్నారు. 70 రోజులు ఆస్పత్రిలో ఉన్నా ఒక్క నయాపైసా అడగలేదని, మందుల నుంచి ఇంజక్షన్ల వరకూ అన్నింటికీ ఆరోగ్యశ్రీ వర్తించిందని, తమకు నిజమైన దైవం వైఎస్సారే అంటున్నారు.. ఆ దంపతులు. దేవుడు ఎక్కడో లేడు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూపంలో దేవుడు ఉన్నారంటున్నారు.. విజయవాడకు చెందిన యార్లగడ్డ ఉదయశ్రీ. ఆమె తండ్రి శ్రీనివాసరావు వ్యవసాయం చేస్తుండేవారు. ఉదయశ్రీతోపాటు ఆమె అన్న చలపతి కుమార్ 2008లో ఒకేసారి బీటెక్లో చేరారు. దీంతో ఇద్దరికీ ఫీజులు చెల్లించడం శ్రీనివాసరావుకి కష్టమైంది. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్సార్ ఫీజురీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టడంతో తాను, తన అన్న ఎలాంటి ఇబ్బంది లేకుండా చదువు పూర్తిచేసుకోగలిగామని, లేదంటే చాలా కష్టాలు పడేవాళ్లమని నాటి విషయాన్ని గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ దయతో తాను ప్రస్తుతం బెంగళూరులోని ఇన్ఫోసిస్లో అసోసియేట్ కన్సల్టెంట్గా ఉద్యోగం చేస్తూ ఏడాదికి రూ.9 లక్షల వేతనం తీసుకుంటున్నానని సంతోషం వ్యక్తం చేశారు. తన అన్న కూడా మైసూరులో మంచి ఉద్యోగం చేస్తున్నాడని చెప్పారు. -
రెండో యాత్రకు శ్రీకారం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితంలోని పాదయాత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘యాత్ర’. వైఎస్సార్ పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి నటించారు. మహీ వి. రాఘవ్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి నిర్మించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 8న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీంతో ‘యాత్ర’ సీక్వెల్కు శ్రీకారం చూట్టారు మహీ వి. రాఘవ్. ‘‘వై.ఎస్. రాజారెడ్డి (వైఎస్సార్ తండ్రి), వై.ఎస్. జగన్ పాత్రలు లేకుండా వైఎస్సార్గారి కథ సంపూర్ణంగా అనిపించదు. ‘యాత్ర’ సినిమా వై.ఎస్. జగన్గారి విజువల్స్తో ముగుస్తుంది. ‘యాత్ర 2’ను అక్కడి నుంచి స్టార్ట్ చేయాలనే ఆలోచనతోనే అలా చేశాం’’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మహి.వి. రాఘవ్. -
‘యాత్ర 2’ కథ అక్కడ మొదలవుతుంది!
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’ చిత్రాన్ని తెరకెక్కించిన మహి వీ రాఘవ, వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ ప్రయాణం నేపథ్యంలో యాత్ర 2 సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన సందర్భంగా వైఎస్ జగన్కు శుభాకాంక్షలు తెలుపుతూ యాత్ర 2కు సంబంధించిన హింట్ ఇచ్చారు దర్శకుడు మహి. తాజాగా యాత్ర 2 సినిమాకు సంబంధించి మరింత క్లారిటీ ఇచ్చారు. ‘వైఎస్ రాజా రెడ్డి, వైఎస్ జగన్ ల గురించి చెప్పకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కథ పూర్తి కాదు. యాత్ర 2 ఆయన కథను పరిపూర్ణం చేస్తుంది. రాజశేఖర్ రెడ్డి యాత్ర తన తండ్రి సమాధి దగ్గర నుండి ప్రారంభమైంది. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాత్ర కూడా ప్రారంభమైంది’ అంటూ ట్వీట్ చేశారు మహి వీ రాఘవ. పావురాల గుట్ట దగ్గర వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తన తండ్రి మరణం తట్టుకోలేక చనిపోయిన వారిని స్వయంగా వచ్చి కలుస్తానని ప్రజలకు ఇచ్చిన మాట, ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో ఆయనకు ఎదురైన ఇబ్బందులు. ఎన్ని కష్టాలు ఎదురైన మాట నిలబెట్టుకునేందుకు వైఎస్ జగన్ ముందడుగు వేయటం, 9 ఏళ్ల పోరాటం తరువాత అఖండ విజయం సాధించటం లాంటి అంశాల నేపథ్యంలో సీక్వెల్ సాగుతుందని అంచనా వేస్తున్నారు. YSR’S story is incomplete without Y.S. Raja reddy & Y.S.Jagan. Yatra 2 will complete their story. The reason why Yatra ended on Y.S. Jagan is we could take it off from where we left. YSR’s Yatra started from his father grave and Jagan’s Yatra from his father’s #yatra2 @ShivaMeka — Mahi Vraghav (@MahiVraghav) 29 May 2019 -
వైఎస్ జగన్ ఘనవిజయం.. ‘యాత్ర 2’
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సునామీలో ప్రత్యర్థి పార్టీలన్ని కొట్టుకుపోయాయి. వైఎస్ జగన్ విజయం ఖాయమైపోవటంతో ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా వైఎస్ జగన్కు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. సుధీర్ బాబు, రవితేజ లాంటి సినీ హీరోలు కూడా వైఎస్ జగన్కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. ఇక దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథ ఆధారంగా యాత్ర చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు మహీ వీ రాఘవ కూడా వైఎస్ఆర్సీపీ సునామీపై స్పందించారు. వైఎస్ జగన్కు శుభాకాంక్షలు తెలిపిన ఆయన ‘మీరు భవిష్యత్ తరాలకు చెప్పాల్సినంత గొప్ప విజయాన్ని అందించారు’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్తో పాటు యాత్ర 2 (#Yatra2) అనే ట్యాగ్ను కూడా జోడించారు. Congratulations to @ysjagan @YSRCParty Anna a truly deserving victory. As promised Hope you deliver more than Y S Rajasekhar Reddy Garu. You have a written and made story worth telling.. :) #yatra2 @ShivaMeka pic.twitter.com/1BI6ArOMFh — Mahi Vraghav (@MahiVraghav) 23 May 2019 Congratulations to the youngest CM of AP @ysjagan garu. Looking forward for good Governance...wishing you all the good luck🙏 — Ravi Teja (@RaviTeja_offl) 23 May 2019 Congratulations @ysjagan garu. The people of Andhra Pradesh have given you both, the victory and the responsibility. Sending my best wishes. Let's all work together for a greater AP. #APElectionResults2019 — Sudheer Babu (@isudheerbabu) 23 May 2019 -
మాలో యాత్ర
ప్రజా సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని, ఎనలేని జనాదరణను సొంతం చేసుకున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన పాదయాత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘యాత్ర’. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహి వి. రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి నిర్మించారు. వైఎస్ పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి నటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 8న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి అద్భుతంగా నటించారని ప్రేక్షకులు ప్రశంసించారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయంబర్స్మెంట్ వంటి పథకాలకు పాదయాత్రలో ఎలా అంకురార్పణ జరిగిందనే విశేషాలను చాలా అర్థవంతంగా మహి చూపించారని కూడా వీక్షకులు అన్నారు. ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది ప్రేక్షకులు మరోసారి ఆ మహానేతను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఈ సినిమా ఇప్పుడు బుల్లితెరపై ప్రదర్శితం కానుంది. ‘యాత్ర’ చిత్రం ఈ రోజు (ఆదివారం) మధ్యాహ్నం 12 గంటలకు ‘స్టార్మా’ చానెల్లో ప్రదర్శితం కానుంది. -
‘యాత్ర’కు ఈసీ గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: టీవీలో ప్రసారం కానున్న ‘యాత్ర’ చిత్రాన్ని అడ్డుకోవడానికి టీడీపీ నాయకులు చేసిన ప్రయత్నం విఫలమైంది. టీవీలో ప్రసారం కానున్న యాత్ర సినిమా ఏరకంగానూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో టీవీలో ఈ చిత్ర ప్రసారానికి అడ్డంకులు తొలగిపోయాయి. వివరాల్లోకి వెళితే.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే యాత్ర శాటిలైట్ రైట్స్ను సొంతం చేసుకున్న స్టార్ మా చానల్.. ఈ చిత్రాన్ని ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం చేయనున్నట్టు ప్రకటించింది. అయితే దీనిపై టీడీపీ అభ్యంతరం వ్యకం చేసింది. యాత్ర చిత్రాన్ని టీవీలో ప్రసారం చేయకుండా చూడాలని టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. టీడీపీ నేతల ఫిర్యాదుపై స్పందించిన ఈసీ.. టీడీపీకి సమాధానంగా మరో లేఖ రాసింది. యాత్ర చిత్ర ప్రదర్శనలో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని ఈసీ ఆ లేఖలో తెలిపింది. టీవీ లేదా సినిమా థియేటర్లలో ప్రదర్శించే సినిమాలు తమ పరిధిలోకి రావని స్పష్టం చేసింది. టీడీపీ నేతల ఫిర్యాదును తమ మీడియా సర్టిఫికేషన్ కమిటీ పరిశీలించిందనీ, అందులో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే అంశాలేవీ లేదని తేల్చిచెప్పింది. దీంతో రేపు మధ్యాహ్నం యాత్ర చిత్రం స్టార్ మాలో ప్రసారం కానుంది. #Yatra World Television Premiere..This Sunday at 12 PM on @StarMaa#YatraOnMaa pic.twitter.com/wOLIyda7Vx — STAR MAA (@StarMaa) April 4, 2019 -
జగన్ అనే నేను; అప్నా టైమ్ ఆయేగా...
-
జగన్ అనే నేను; అప్నా టైమ్ ఆయేగా...
అధికారం కోసం పరితపించే వాడు రాజకీయ నాయకుడు మాత్రమే అనిపించుకుంటాడు.. అదే ఆశయసాధన కోసం కష్టాల్ని సైతం లెక్కచేయని మనస్తతత్వం ఉన్నవాడు ప్రజానాయకుడిగా ఎదుగుతాడు.. ప్రజల గుండెల్లో శాశ్వతంగా కొలువు ఉంటాడు. ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇందుకు నిలువెత్తు నిదర్శనం. అందుకే ప్రజా సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచిన రాజన్న ‘ఆశయ’ వారసత్వాన్ని కొనసాగించేందుకు అనేక కష్టనష్టాలకోర్చి 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగించి ప్రజా సమస్యల గురించి స్వయంగా తెలుసుకున్నారు. ఆ క్రమంలో హత్యాయత్నం వంటి ఘటనలు చోటుచేసుకున్నా మడమ తిప్పక ప్రజాక్షేత్రంలోనే గడిపారు. ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రత్యర్థులు తన చిన్నాన్నను హత్య చేసి కుట్ర రాజకీయాలకు తెరతీసినా బాధను దిగమింగి.. సంయమనం పాటిస్తూ ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ‘జగన్ అనే నేను’ అంటూ ఆయన పలికే మాటల కోసం వైఎస్ జగన్ అభిమానులే కాదు సామాన్య ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈ నేపథ్యంలో రాజన్న పాదయాత్ర ఘట్టాన్ని ‘ యాత్ర’గా తెరకెక్కించిన సినిమా దర్శకుడు మహి వి రాఘవ్ ప్రస్తుతం ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. వైఎస్ జగన్ అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న దృశ్యాలకు.. ‘జైబోలో ఆజాదీ’ అంటూ ఫుల్జోష్గా సాగే బీజీని జతచేశారు. ‘అప్నా టైమ్ ఆయేగా’ అనే క్యాప్షన్తో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. -
‘యాత్ర’పై ఏపీ పోలీసుల జులుం..!
సాక్షి, తిరుపతి : దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితం ఆధారంగా మహి వి.రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన యాత్ర సినిమాపై ఏపీ పోలీసులు జులుం ప్రదర్శించారు. తిరుపతిలోని పలని థియేటర్ వద్ద మంగళవారం ఓవర్ యాక్షన్ చేశారు. ఈ సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులను థియేటర్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. టీడీపీ నేతల ఒత్తిడికి తలొగ్గిన పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ప్రేక్షకులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 8న రిలీజైన ‘యాత్ర’కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. విడుదలైన అన్ని కేంద్రాల్లో భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా పలు చోట్ల ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. వైఎస్సార్ పాత్రలో మళయాల మెగాస్టార్ మమ్ముట్టి ఆకట్టుకున్నారు. -
మరో తెలుగు సినిమాలో దుల్కర్
మళయాల యువ కథనాయుకు దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఓకె బంగారం సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ ఆడియన్స్ను పలకరించిన దుల్కర్, మహానటితో స్ట్రయిట్ తెలుగులో సినిమా నటించాడు. ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో దుల్కర్ను టాలీవుడ్ నుంచి ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే సినిమాల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్న ఈ యువ నటుడు మరో తెలుగు సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మళయాల మెగాస్టార్ దుల్కర్ తండ్రి అయిన మమ్ముట్టి ప్రధాన పాత్రలో యాత్ర సినిమాను తెరకెక్కించిన మహి వీ రాఘవ దర్శకత్వంలో దుల్కర్, తెలుగు సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే మహి చెప్పిన లైన్కు ఓకె చెప్పిన ఈ యంగ్ హీరో పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయమన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. -
యాత్ర పాటతో ఆకట్టుకుంటున్న చిన్నారి
-
యాత్ర పాటతో ఆకట్టుకుంటున్న చిన్నారి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ అప్రతిహతంగా దూసుకుపోతోంది. కలెక్షన్ల జోరుతోపాటు విమర్శకుల ప్రశంసలను సైతం చేసుకుంటోంది. ప్రేక్షకుల ఆదరణ విషయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులనే కాదు.. చిన్నా పెద్దా అందరినీ ఆకట్టుకుంటూ తన పత్ర్యేకతను నిలబెట్టుకుంటోంది. తాజాగా ఈ సినిమాలోని హిట్ సాంగ్ సమర శంఖం పాటను అలవోకగా ఆలపించడం పలువురిని ఆకర్షిస్తోంది. కఠినమైన పదాలు కలిగిన పాటను కూడా చాలా ఈజీగా పాడుతోందనీ, యాత్ర సినిమాను ప్రజలు ఎలా గుండెల్లో పెట్టుకున్నారో చూడండి అంటూ సినిమా దర్శకుడు మాహి వి రాఘవ్ దీన్ని ట్వీట్ చేశారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా వి రాఘవ్ దర్శకత్వంలో వైఎస్ఆర్ పాత్రను ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి పోషించిన సంగతి తెలిసిందే. ‘సమర శంఖం’ పాటను ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించగా, కీరవాణి తనయుడు కాల భైరవ ఆలపించారు -
యాత్ర సినిమా చూశా: వెంకయ్య నాయుడు
సాక్షి, నెల్లూరు : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ చిత్రాన్ని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసించారు. శనివారం ఆయన నెల్లూరులో స్వర్ణభారతి ట్రస్ట్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఈ మధ్యకాలంలో ‘యాత్ర’ సినిమా చూశా.. చాలా బాగుంది. రైతులు, సంస్కృతి, సంప్రదయాలన్నా నాకు ప్రాణం. మనం చేసే మంచి పనులే మన తరువాత మనలను గుర్తుపెట్టుకునేలా చేస్తాయి.’ అని వెంకయ్య అన్నారు. ఏ హోదాలో ఉన్నా సొంత గ్రామాన్ని మరచిపోనని, ఎవరి పని వారు చేయడమే దేశభక్తి అని ఆయన పేర్కొన్నారు. ప్రజా జీవనంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని అనేది తన భావన అని, కానీ తన పదవి, భద్రత, హోదాకు భంగం కలగకుండా ప్రవర్తిస్తున్నట్లు వెంకయ్య తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలతో కలిసి మెలిసి ఉండే తత్వం తనదని చెప్పారు. మాతృభాష పరిరక్షణకు అన్ని రాజకీయ పార్టీలు కృషి చేయాలన్నారు. భాషా ప్రగతికి తీసుకోవాల్సిన చర్యలను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలలో పర్యటిస్తూ విద్యార్థులకు మార్గదర్శకాలు చెపుతున్నట్లు వెంకయ్య పేర్కొన్నారు. ఉత్తర భారతదేశం వాళ్లు దక్షిణ, దక్షిణాది వాళ్లు ఉత్తరదేశ భాషలు నేర్చుకుంటే దేశ సమైక్యత బలపడుతుందని ఉప రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. -
ఎన్టీఆర్ బయోపిక్కు వెన్నుపోటు
సాక్షి, హైదరాబాద్ : కథానాయకుడు బోల్తా కొట్టడంతో... మహానాయకుడుపై మేకర్స్ ప్రత్యేక దృష్టి సారించి ఉంటారని అందరూ అనుకున్నారు. అయితే.. అందరి ఊహాగానాలకు భిన్నంగా సాగిన ఈ సినిమా అభిమానులను ఆశ్చర్యంలో ముంచింది. బయోపిక్ అంటే కత్తిమీద సాము లాంటిది. ఉన్నది ఉన్నట్లు చూపిస్తే.. కొందరికి రుచించకపోవచ్చు. కొన్ని వాస్తవాలను దాచిపెట్టినా... అసలు ఏమాత్రం పొంతనలేని, జరగని సంఘటనలు జరిగినట్టు చూపించడమే కాకుండా ఈ సినిమాలో కథకు మూలమైన నాయకుడి పాత్రను తగ్గించి మరోపాత్రకు ప్రాధాన్యత కల్పించడంతో అసలు బయోపిక్ అర్థాన్నే మార్చడం గమనార్హం. బాలీవుడ్లో వచ్చిన ‘సంజు’ గమనిస్తే అందులో సంజయ్ దత్ కావాలని ఎలాంటి తప్పు చేయలేదనీ, పరిస్థితులే అతన్ని అలా మార్చేశాయనీ, తప్పంతా మీడియాదేనని, సంజు మంచి బాలుడు అంటూ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే సంజు పాత్రలో రణ్బీర్ అద్భుత నటనకు ప్రశంసలైతే వచ్చాయి. కానీ, సినిమా కథ, కథనాలపై ఘాటు విమర్శలు వెల్లువెత్తాయి. ఇక తెలుగులో బయోపిక్ ట్రెండ్ రావడానికి కారణం మహానటి. అలనాటి మహానటి సావిత్రి జీవితం గురించి, ఆమె చివరి రోజుల్లో మద్యానికి బానిసవ్వడం, ఆమె మరణానికి దారితీసిన కారణాలు అందరికీ తెలిసిందే. అయితే ‘మహానటి’లో సావిత్రిలోని మంచి గురించి, చెడు గురించి చెప్పారు కాబట్టే.. ఆ చిత్రాన్ని ఆదరించి పట్టం కట్టారు. అయితే ఆమెలోని చెడును కూడా ప్రేక్షకులు ఒప్పుకునేట్టు చేసి.. ఆ పరిస్థితిలో ఎవరైనా అలాగే చేస్తారులే.. అని ప్రేక్షకుల చేతే అనిపించేలా చేయగలగడం దర్శకుడి గొప్పదనం. అందుకే మహానటి అంతటి విజయాన్ని సొంతంచేసుకుని.. ఆ మహానటికి నిజమైన నివాళిగా ‘మహానటి’ చరిత్రలో నిలిచిపోయింది. అంతేకాకుండా కథను ప్రేక్షకులు కన్విన్స్ అయ్యేలా చెప్పడమే కాకుండా ఆ పాత్రను వేస్తున్న నటీనటులు అందులో పరకాయ ప్రవేశం చేయాలి. అప్పుడే ప్రేక్షకులు ఆ పాత్రను నమ్ముతారు. పాత్రతో పాటే లీనమవుతారు. ఇలా మహానటికి అన్నీ కుదరడంతో తెలుగు తెరపై బయోపిక్లకు మార్గదర్శకంగా నిలిచింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ది స్వర్ణ యుగమని అందరికీ తెలిసిందే. తిరుగులేని కథానాయకుడిగా ప్రజల్లో దేవుడిగా ఉన్న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి ప్రభంజనాలు సృష్టించారు. అయితే ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఆయనకు ఎదురైన అనుభవాలు, లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి ప్రవేశించడం.. చంద్రబాబు వెన్నుపోటు పొడవడం, చివరగా ఆయన మరణం... ఇదంతా వెండితెరపైన చూపిస్తే ఎన్టీఆర్ బయోపిక్ సక్సెస్ అయ్యేదేమో. అలా కాకుండా వారు మెచ్చిన వాటిని ఎంపిక చేసుకుని నచ్చినట్టుగా తెరకెక్కిస్తే సహజంగానే ప్రేక్షకుల ఆదరణ లభించదన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల విడుదలైన యాత్ర సినిమా కూడా ప్రేక్షకులను కదిలించిందంటే.. కథ, కథనంలో ఉన్నఆ పట్టు.. ఆ పాత్రను అంతగా పోషించిన కథానాయకుడు పాత్రలో జీవించారు. సినిమాలో భావోద్వేగాలు పండటంతోనే సినిమా అందరిని ఆకట్టుకుంది. సినిమా పక్క దారి పట్టకుండా వారు ఏం చెప్పదలుచుకున్నారో అదే చెప్పారు. అయితే ఎన్టీఆర్ బయోపిక్గా చెప్పుకుంటున్న కథానాయకుడు, మహానాయకుడులో అవి లోపించాయి. కథను తమకు నచ్చినట్టుగా మార్చడంతో అసలు విషయాలను కావాలనే దాచిపెట్టినట్టు ప్రేక్షకుల ముందు ఇట్టే తేలిపోయింది. తెరపై ఎన్టీఆర్ పాత్రను పండించడం పక్కన పెడితే, ప్రేక్షకులను సినిమాలో లీనం చేయడంలో విఫలమయ్యారన్న విమర్శలు ఎదుర్కోవలసివచ్చింది. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహానాయకుడు పూర్తిగా గాడి తప్పడం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఇది ఎన్టీఆర్ గురించి తీసిన సినిమా? లేక చంద్రబాబును పైకెత్తడానికి తీసిన సినిమా? అన్న అనుమానం సగటు ప్రేక్షకుడికి వస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విడుదల చేసిన ఈ సినిమాలో ఎన్టీఆర్ జీవితంలో అత్యంత దుర్భరమైన వెన్నుపోటు ఘటనను చూపించకపోవడం కావాలనే పక్కన పెట్టినా... విలన్ పాత్రలో ఉండాల్సిన వ్యక్తిని హీరో పాత్రలో చూపించడం ప్రేక్షకులకు ఏమాత్రం మింగుడుపడటం లేదు. ఎన్టీఆర్ జీవిత చరిత్రలో ప్రధాన ఘట్టంగా నిలిచిన వెన్నుపోటు ఘటనలో ముద్దాయిని చూపించకపోయినప్పటికీ ఎన్టీఆర్, ఆయన స్థాపించిన రాజకీయ పార్టీ ఒక మునిగిపోతున్న నావగా చిత్రీకరించడమే కాకుండా ఆ నావను ఒడ్డుకుచేర్చి కాపాడిన మహోన్నత వ్యక్తిగా బాబును చిత్రీకరించారు. ఈ వక్రీకరణలు మింగుడుపడని అభిమానులు సోషల్మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకుడికి బాబు మహానాయకుడా..లేక ఎన్టీఆర్ మహానాయకుడా అన్న సందేహం వస్తుంది. కథను కథనాన్ని గమనిస్తే బాబుకోసం ఈబయోపిక్ ను బలిపెట్టారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దాంతో సహజంగానే అందరి దృష్టి ఇప్పుడు వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్పై పడింది. సినిమాను ప్రకటించినప్పటి నుంచి సాధారణ ప్రేక్షకుడు సైతం.. వర్మ తీస్తున్న సినిమాపైనే ఆసక్తి చూపించాడన్న సంగతి తెలిసిందే. మహానాయకుడు ఎక్కడ ముగిసిందో.. ఎన్టీఆర్ జీవితంలో అసలు కథ ఎప్పుడు మొదలైందో.. అక్కడి నుంచే వర్మ తన సినిమాను ప్రారంభించడమే అందరి దృష్టిలో పడటానికి కారణం. మహానాయకుడులో ఆకాశానికెత్తేసిన చంద్రబాబు.. అసలు రంగు వర్మ తీసిన సినిమాల్లో బయటపడుతుందని సోషల్ మీడియాలో నెటిజన్లు చలోక్తులు విసురుకుంటున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ బయోపిక్ అంటూ హడావిడి సృష్టించిన బాలయ్య.. తన బావకు ఏదో మేలు చేద్దామని చేసిన ప్రయత్నం వృథా అయిందని ఆయన అభిమానులే పెదవి విరుస్తున్నారు. చదవండి : ‘యన్టిఆర్ మహానాయకుడు’ రివ్యూ ‘యన్.టి.ఆర్ కథానాయకుడు’ మూవీ రివ్యూ -
‘యాత్ర’ను తిలకించిన ఏయూ ప్రొఫెసర్లు
సాక్షి, విశాఖపట్నం: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’సినిమాను ఆదివారం ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్లు తిలకించారు. ద్వారకానగర్లోని సంగం థియేటర్లో డాక్టర్ డి.వి.రామకోటిరెడ్డి, డాక్టర్ బి.సాంబరెడ్డి, డాక్టర్ ప్రేమానందం, డాక్టర్ నాయుడు ఆధ్వర్యంలో 100 మందికి పైగా ఏయూ ఉద్యోగులు ఈ సినిమాను తిలకించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. 1975 నుంచి 2003 వరకు సాధారణ నాయకుడిగా జీవించిన వైఎస్ రాజశేఖరరెడ్డి.. పాదయాత్ర అనంతరం మహానేత అయ్యారన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారని కొనియాడారు. ఏయూలో ప్రస్తుతం 360 మంది ప్రొఫెసర్లు ఉన్నారని.. అందులో 240 మంది ఆయన హయాంలో నియమితులయ్యారని చెప్పారు. ఆయన వల్లే ఇప్పుడు ఏయూ ప్రపంచంలో అత్యుత్తమ ర్యాంక్ గల యూనివర్సిటీల్లో ఒకటిగా ఉందన్నారు. ప్రస్తుతం తామంత ఉద్యోగాలు చేస్తున్నామంటే ఆ మహానేత పుణ్యమేనని భావోద్వేగానికి లోనయ్యారు. అలాంటి నాయకుడి కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. పేదవాడి కళ్లల్లో ఆనందం చూడాలని, ప్రభుత్వ పాలన ప్రతి ఒక్కరికీ అందాలనే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖరరెడ్డి వేసిన ప్రతి అడుగు నవ శకానికి నాంది పలికిందన్నారు. ఈ విషయం నేటి తరానికి అర్థమయ్యే విధంగా ‘యాత్ర’ సినిమా అద్భుతంగా సాగిందన్నారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ భావోద్వేగాలకు లోనయ్యారన్నారు. వైఎస్సార్ పాత్రకు మమ్ముట్టి ప్రాణం పోశారని.. ఆయన చెప్పిన ‘మాట ఇచ్చే ముందు ఆలోచిస్తాను..ఇచ్చాక ఏముంది.. ముందుకు వెళ్లాల్సిందే’అనే డైలాగ్ చాలా బాగుందన్నారు. నేటి యువతరానికి ‘యాత్ర’ లాంటి మంచి సినిమాను అందించిన డైరెక్టర్ మహి వి.రాఘవకు ధన్యవాదాలు తెలిపారు. -
యాత్ర ఒక బాట.. ఒక మాట
మాట తప్పని, మడమ తిప్పని నాయకుడిప్రతి పథమూ ఒక గొప్ప యాత్ర. నడక భరోసా ఇవ్వాలి.నడత స్ఫూర్తిని కలిగించాలి. ఇది జనం నచ్చిన యాత్ర.. జగం మెచ్చిన యాత్ర. ‘‘మాట ఇచ్చే ముందు ఆలోచిస్తాను.. ఇచ్చాక ఆలోచించేదేముంది.. ముందుకెళ్లాల్సిందే.’’‘‘జనాలకు ఏం కావాలో తెలుసుకోవాలని ఉంది. వినాలనీ ఉంది. కడప దాటి ప్రతి గడపలోకి వెళ్లాలని ఉంది.’’‘‘నేను విన్నాను.. నేను ఉన్నాను..’’‘యాత్ర’ చిత్రంలోని ఈ సంభాషణలు వింటే చాలు.. మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి వ్యక్తిత్వం, పట్టుదల తెలియడానికి. ప్రజలకు మేలు చెయ్యాలన్న నాయకుడని చెప్పడానికి! మండుటెండలో నాయకుడు నడుస్తుంటే.. మనమెందుకు ఆ ఎండలోకి వెళ్లాలని ప్రజలు అనుకోకుండా.. ఆయన్ని కలిసేందుకు.. తమ బాధల్ని చెప్పుకునేందుకు అడుగులో అడుగేశారు. ‘‘అలాంటి వ్యక్తినిరాజకీయ నాయకుడని అనరు. ప్రజా నేత అని పిలుస్తారు’’ అని చెబుతున్నారు.. మమ్ముట్టి. ‘యాత్ర’ సినిమాతో తెలుగుతెరపై రీ ఎంట్రీ ఇచ్చిన మమ్ముట్టి.. జనం గుండెచప్పుడని చెప్పే రాజన్న రాజసాన్ని మరోసారి ప్రజలకు పరిచయం చేశారు. వైఎస్సార్ అంతరంగాన్ని ఆకళింపు చేసుకొని మరీ నటించి.. నడుస్తున్న చరిత్రగా రాజన్న ప్రజాప్రస్థానాన్ని ప్రజలకు అందించిన మలయాళ మెగాస్టార్ మమ్ముట్టితో సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ. ► ‘యాత్ర’ సినిమా ఘనవిజయం సాధించినందుకు ముందుగా కంగ్రాచ్యులేషన్స్. ►మమ్ముట్టి: థ్యాంక్యూ. ఇది ‘యాత్ర’ యూనిట్ విజయం. అంతకుమించి ప్రజలది. అన్నింటికన్నా.. వైఎస్ రాజశేఖర్రెడ్డి వ్యక్తిత్వానిదీ విజయం. ► సుమారు నాలుగు దశాబ్దాల సినిమా కెరీర్లో ఎన్నో సక్సెస్లు చూశారు. ఈ సినిమా సక్సెస్ ఎలాంటి అనుభూతిని ఇస్తోంది? ►ఇది నాకు స్పెషల్ సినిమా. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడి జీవితంలోని ఓ భాగాన్ని కథగా రూపొందించి మలచిన చిత్రమిది. దీన్ని బయోపిక్ అనలేం. వైఎస్సార్ లైఫ్లోని ఓ ఈవెంట్ బేస్డ్ స్టోరీ అని కూడా అనుకోలేం. ఎందుకంటే ఆయన ప్రజా ప్రస్థాన యాత్ర ఓ నడుస్తున్న చరిత్ర. అందుకే.. అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ►350 సినిమాల కెరీర్లో మీకు కాంప్లిమెంట్స్ కొత్త కాదు. ఈ సినిమాకు మాత్రం సామాన్యుల నుంచి సినీ దిగ్గజాల వరకూ ప్రతి ఒక్కరూ మీ నటనను ప్రశంసిస్తున్నారు. మమ్ముట్టి తప్ప మరెవర్నీ ఈ క్యారెక్టర్లో ఊహించుకోలేక పోతున్నామంటున్నారు. మీరెలా ఫీలవుతున్నారు.? ►ఎవరి నటనతో వారు మెప్పించగలరు. నాకు అవకాశం వచ్చింది. నేను నటించాను. అందరి నుంచి ప్రశంసలు పొందుతున్నాను. హ్యాపీగా ఉన్నాను. అయితే సక్సెస్కు పొంగిపోవడం నాకు రాదు. చాలా రోజుల తర్వాత తెలుగులో నటించాను. ఈ చిత్రకథ, డైరెక్టర్ మహి కథ చెప్పిన విధానం నన్ను ఇంప్రెస్ చేసింది. నటించేందుకు ఎక్కువ స్కోప్ ఉన్న సినిమా కావడంతో వెంటనే ఓకే చెప్పాను. ►డైరెక్టర్ మహి కథ చెప్పక ముందు వైఎస్సార్ గురించి మీకు ఏం తెలుసు.? ►ఒక పౌరుడిగా సమకాలీన రాజకీయాల గురించి తెలుసుకుంటూ ఉంటాను. ఆ సందర్భంలోనే వైఎస్సార్ రాజకీయ ప్రస్థానం గురించి చాలాసార్లు విన్నాను. న్యూస్లోనూ, పత్రికల్లోనూ ఆయన అద్భుతమైన పాలన గురించి చూశాను, చదివాను. ఆయన వ్యక్తిత్వం గురించి కూడా తెలుసుకున్నాను. ►వైఎస్సార్ను ప్రత్యక్షంగా ఒక్కసారి కూడా మీరు చూడలేదు. కానీ ఆయన రాజసం, మాటల్లో గాంభీర్యం, నడకలో తెగువ, చేయి ఊపడం.. అన్నీ ఎలా పండించగలిగారు? ►వైఎస్సార్ను ఇమిటేట్ చెయ్యాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆయనలా నడవాలని, ఆయనలా మాట్లాడాలని ప్రతి సీన్కు ముందు అనుకోలేదు. నా సినీ అనుభవంతో నేను వైఎస్సార్ అనే పాత్రలో నటిస్తున్నాను కాబట్టి.. ఆ క్యారెక్టర్ ఇలా ఉంటుందని ఊహించుకొని నటించాను. అయితే ఆ సీన్లన్నీ చరిత్రలో ఏం జరిగాయో, ఆయన హావభావాలు ఎలా ఉన్నాయో.. అచ్చం అలా వచ్చేశాయి. యాదృచ్ఛికంగా వైఎస్సార్ బాడీ లాంగ్వేజ్, నేను నటించిన విధానం ఒకేలా రావడం ఆశ్చర్యం. ►‘యాత్ర’ సినిమా కథ వినక ముందు వైఎస్సార్పై మీ అభిప్రాయం, కథ విన్న తర్వాత, సినిమా చేసిన తర్వాత ఆయన పై మీ అభిప్రాయం ఎలా ఉంది.? ►చూడండి.. నేను ఒక సామాన్య పౌరుడిగా దేశ రాజకీయాల గురించి తెలుసుకుంటూ ఉంటాను. అయితే ఏపీ రాజకీయాల గురించి అంతగా అవగాహన లేదు. కానీ రాజశేఖర్రెడ్డి లీడర్షిప్ గురించి మాత్రం కొంత తెలుసు. ‘యాత్ర’ కథ విన్నాక పూర్తిస్థాయి అవగాహన వచ్చింది. వైఎస్సార్ క్యారెక్టర్ నచ్చింది కాబట్టే ‘యాత్ర’ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాను. ►ఈ సినిమాలో ప్రతి సన్నివేశంలోనూ ఎమోషన్ ఉంది. మీకు హార్ట్ టచింగ్ అనిపించిన ఎమోషనల్ సీన్ ఏది? ►ప్రజల మధ్యలో ఉంటూ, ప్రజల కోసం జీవిస్తూ, వారి ఎమోషన్లను పంచుకునే ప్రతి నాయకుడూ సక్సెస్ అవుతాడు. రాజశేఖర్రెడ్డి ఈ కోవకు చెందిన వారే. తెలుగు ప్రజలందరిలోనూ వైఎస్సార్తో ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు. రాజన్న మనకోసం ఉన్నాడు, మనకు ఉపకారం చేసేందుకు వచ్చాడు, మన బాధలు తీర్చే నాయకుడని విశ్వసించారు. అందుకే సినిమాలో నటించేటప్పుడు నేను ఆ ఎమోషన్ను చూపించాలని అనుకున్నాను. సక్సెస్ అయ్యాను. సినిమా చూసినంతసేపూ ప్రేక్షకులు ‘అతను మన రాజశేఖర్రెడ్డి.. మన జీవితాల్ని బాగుచేసింది ఈయనే’ అన్న ఉద్వేగానికి గురయ్యారు. అందుకే ప్రతి సన్నివేశం ప్రజల హృదయాల్ని హత్తుకునేలా ఉంది. అదే ఫీలింగ్ నాలోనూ ఉండిపోయింది. ఒక సన్నివేశం అని కాదు.. సినిమా మొత్తం నాకు నచ్చింది. నేను విన్నాను.. నేను ఉన్నాను.. అని ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇచ్చిన నాయకుడు వైఎస్ రాజశేఖర్రెడ్డి. ►ఒక రాజకీయ నాయకుడి గురించి సినిమా అంటే.. ఆయన అభిమానులు, పార్టీకి సంబంధించిన వారికే నచ్చుతుందని భావిస్తారు. కానీ.. ‘యాత్ర’ మాత్రం అన్ని వర్గాల వారి హృదయాల్ని కదిలించింది. కన్నీళ్లు పెట్టించింది. ఇంతటి ఘన విజయం ఊహించారా? ►వైఎస్సార్ జీవిత చరిత్ర మొత్తం చెప్పిన కథ కాదు. ప్రజలకు భరోసా ఇచ్చేందుకు ఓ రాజకీయ నాయకుడు ప్రజల్లోకి వెళ్తూ చేసిన పాదయాత్ర అనే భాగం. పాదయాత్రకు మునుపు పరిస్థితులు ఎలా ఉన్నాయి? అసలు పాదయాత్ర ఎందుకు చెయ్యాల్సి వచ్చింది, సుదీర్ఘ పాదయాత్ర ఎలా చేశారు? ఆయన పాదయాత్ర చేసిన నాటికి ప్రజలు ఎదుర్కొంటున్న బాధలు, ఆయన వాటిని వింటూ, భరోసా ఇచ్చిన విధానం గురించి ప్రజలకు వివరించిన చిత్రమిది. పార్టీ గురించి కాకుండా ప్రజల గురించి చేసిన పాదయాత్ర కావడం.. ఆ విశేషాలను చక్కని స్క్రీన్ప్లేతో కళ్లకు కట్టినట్లు చూపించడం వల్లే ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తున్నారు. ►50 ఏళ్లు దాటాక సుదీర్ఘ పాదయాత్ర చెయ్యడం, అదీ ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం.. ఏ రాజకీయ నాయకుడికైనా సాధ్యమని మీరు భావిస్తారా.? ►పాదయాత్ర అంటే కేవలం అలా నడుచుకుంటూ వెళ్లిపోవడం కాదు. వెయ్యి, రెండు వేల కిలోమీటర్లు నడిచి వెళ్లిపోవడం కాదు. ఆ యాత్రలో ఏం జరిగింది? ప్రజలను ఎలా కలుసుకున్నారు? వారి బాధలు ఎలా తెలుసుకున్నారు? నడిచి వస్తున్న నాయకుడ్ని ప్రజలు ఎలా ఆదరించారన్నది ముఖ్యం. ఏదో నడిచాం.. మాట్లాడాం అన్నది కాదు. వారి బాధల్ని మర్చిపోయేలా భరోసా ఇవ్వడం. వారికోసం ఏం చేస్తామో కుండబద్దలుకొట్టినట్లు వైఎస్సార్ చెప్పారు. అందుకే యాత్ర తర్వాత ముఖ్యమంత్రిగా ప్రజలు పట్టం కట్టారు. ప్రజలు నమ్మారు. ఆ వయసులో తమ కోసం నడిచి వచ్చి.. తమ బాధలు వినేందుకు రావడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రజల కోసం నిజాయితీగా పనిచేసే నాయకుడు వచ్చాడని ఆనందపడ్డారు. ►రాజకీయాలకు అతీతంగా సాగుతున్న ‘యాత్ర’ సినిమా విజయం గురించి ఒక్కమాటలో చెప్పండి.? ►ఇది రాజకీయ నాయకుడి సినిమా కాదు. ప్రజా నాయకుడి చిత్రం. అందుకే అందరూ ఆదరిస్తున్నారు. ►మలయాళం, తమిళ ప్రజలు కూడా యాత్రను ఆదరిస్తున్నారు కదా.. ►అవును. తెలుగులో విజయం సాధించిందంటే.. రాజశేఖర్రెడ్డి గురించి తెలుసు అనుకోవచ్చు. కానీ.. తమిళం, మలయాళంలోనూ ప్రజలు ‘యాత్ర’ సినిమాను ఆదరిస్తున్నారు. ఎందుకంటే వైఎస్సార్ అనే ఓ ప్రజానేత గురించి చెప్పిన చిత్రమిది. ఒక పొలిటికల్ లీడర్... పీపుల్స్ లీడర్గా ఎలా మారాడన్నది తెలుసుకున్న ప్రజలు సినిమాను బ్రహ్మరథం పడుతున్నారు. ►కొత్త జనరేషన్కు వైఎస్సార్ వ్యక్తిత్వాన్ని చూపించారు. రాజశేఖర్రెడ్డి గురించి తెలియని యువతకు ‘యాత్ర’ సినిమా చూపిస్తూ ఇలా ఉండేవారు అని చెబుతున్నారు ►నిజమే. నేనూ విన్నాను.. కొత్త జనరేషన్ వైఎస్సార్ పేరు, ఆయన ఏం చేశారు అనేవి మాత్రమే విని ఉంటారు. యాత్రలో చూపించిన ప్రతి సన్నివేశం యువతను ఆకట్టుకుంటోందని ప్రజలు చెబుతున్నారు. ► సినిమాలోని డైలాగ్స్ ప్రేక్షకులకు కన్నీరు తెప్పించాయి. ఆ సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు మీరు ఎలాంటి ఉద్వేగానికి లోనయ్యారు? ►రైతుల కోసం ఓ డైలాగ్ ఉంటుంది. ఈ యాత్రలో కన్నీళ్లు పెట్టుకున్న రైతుల్ని చూశాను.. వాళ్ల కన్నీళ్లతో కూడా తడవని నేలని చూశాను. జీవంలేని ఆ భూముల్ని చూసి ప్రాణం వదిలిన ఎంతో మంది రైతుల్ని చూశాను. నేను విన్నాను.. నేను ఉన్నాను.. ఇది చాలా ఉద్వేగమైన సంభాషణ. నిజమే కదా.. నాయకుడంటే ప్రజలు తయారు చేసినవాడే. ఎండలో పనిచేసే ప్రతి పేదవాడికీ భరోసా ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందని భావించిన రాజశేఖర్రెడ్డి యాత్ర చేశారు. ►మీరు నటించిన సినిమాల్లో పంచెకట్టు ఉంటుంది. వైఎస్సార్ పంచెకట్టు ఎలా అనిపించింది? ►పంచెకట్టు నేను నటించిన చాలా సినిమాల్లో ఉంది. అయితే ‘యాత్ర’ లో పంచెకట్టు ప్రత్యేకంగా ఉంది. అది కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. ►సినిమాలో మీ క్యారెక్టర్ కాకుండా.. ఇంకా ఏ క్యారెక్టర్ మీకు బాగా నచ్చింది.? ►అన్ని పాత్రలూ సమానమే. ప్రతి పాత్ర నిజ జీవితంలో జరిగిందే కదా. అందుకే ఎవరి పరిధిలో వారు అద్భుతంగా నటించారు. ముఖ్యంగా సినిమాలో చెప్పుకోవాల్సింది స్నేహానికి వైఎస్సార్ ఎంత విలువ ఇచ్చారన్న పాయింట్ గురించి. ఆయన స్నేహితుడు కేవీపీ పాత్రలో రావురమేష్ అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఇప్పుడు నేను, రావు రమేష్ మంచి స్నేహితులుగా మారిపోయాం కూడా. సినిమాలో నన్ను చాలా సపోర్ట్ చేశారు. ►తెలుగులో చాలా గ్యాప్ తర్వాత కనిపించారు. మళ్లీ ఎప్పుడు తెలుగు తెరపై మిమ్మల్ని చూడవచ్చు? ►తెలుగులో నటించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఏం జరుగుతుందో చూద్దాం. ►మలయాళీ మెగాస్టార్గా కాకుండా.. సామాజిక కార్యకర్తగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ సేవా కార్యక్రమాలు కేరళకు మాత్రమే పరిమితం చేశారు. మిగిలిన రాష్ట్రాలకు విస్తరిస్తారా? ►అదేం లేదు. దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ అవసరం ఉన్నా సేవలందిస్తున్నాం. బాల కార్మికులకు విద్యనందించేందుకు స్ట్రీట్ ఇండియా మూమెంట్, పేదలకు ఉచిత క్యాన్సర్ చికిత్స అందించేందుకు పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ సొసైటీ పేరుతో కార్యక్రమాలు, ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. క్యాన్సర్ ట్రీట్మెంట్ సేవా సంస్థ ఏపీలోనూ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ► 350 సినిమాలు, 3 నేషనల్ అవార్డులు, 7 కేరళ ఫిల్మ్ అవార్డులు, 13 ఫిల్మ్ఫేర్ అవార్డులు, డాక్టరేట్లు, పద్మశ్రీ.. ఇలా మీ ప్రస్థానం సాగుతోంది. మీరెలా ఫీలవుతున్నారు.? ►చాలా సంతోషంగా ఉంది. ఇది కొనసాగిస్తాను. నావరకూ నేను సేవా కార్యక్రమాలు పూర్తి స్థాయిలో చెయ్యాలని అనుకుంటున్నాను. ► ‘యాత్ర’ సినిమా చూసిన వారు మమ్ముట్టి రాజ కీయాల్లోకి వస్తారని ఊహాగానాలు చేస్తున్నారు. ఇందులో నిజమెంత ఉంది? ►సినిమాల్లో ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు. వారిని ఆనందపరిచేందుకు నేను సినిమాల్లో నటిస్తూనే ఉంటాను. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదు. ‘యాత్ర’ సినిమాపై కొంతమంది ప్రేక్షకుల స్పందన నడుస్తున్న చరిత్ర కథ మంచి ఎమోషనల్ టచింగ్గా ఉంది. ప్రజల నాయకుడైన ఒక గొప్ప రాజకీయ నాయకుడి కథ ఇది. మా ముందుకు మళ్లీ వైఎస్ఆర్ను తీసుకొచ్చారు. ఓ వైపు కన్నీళ్లు వస్తున్నాయ్.. మరోవైపు చప్పట్లు కొడుతూ ఉండిపోయాం. నాలుగైదు సార్లు కళ్లు చెమర్చినా, అరె సినిమా అప్పుడే అయిపోయిందే! అనిపించింది. చరిత్ర సృష్టించిన ‘ఆరోగ్యశ్రీ’, రికార్డుకెక్కిన ‘ఫీజ్ రీయింబర్స్మెంట్’, నేటికీ నిలిచిన ‘ఉచిత విద్యుత్’, ప్రాంతాల గతి మార్చిన ‘జలయజ్ఞం’... ఇలా అయిదున్నరేళ్ల అభివృద్ధి – సంక్షేమం జోడు గుర్రాల స్వారీతో పాలన పరుగులెత్తించిన అన్ని పథకాలూ.. ‘పాదయాత్ర’లో ఎలా పురుడు పోసుకున్నాయో ఒడుపుగా తెరకెక్కించారు. అది ముగిసిన యాత్ర కాదు.. ‘నడుస్తున్న’ చరిత్ర. అందుకే తడుస్తున్న కళ్లతో ఆ చిత్రాన్ని చూస్తున్నాం. – రామకృష్ణారెడ్డి, కాంతమ్మ దంపతులు, బెంగళూరు వైఎస్సార్ వ్యక్తిత్వం తెలిసింది రాజశేఖర రెడ్డి వలన అనేకమంది లబ్ది పొందారు. ఆయన్ను మరచిపోలేము. మహోన్నత నాయకుడు. ఆయన పాత్రలో మలయాళ నటుడు ముమ్ముట్టి ఒదిగిపోయారు. రాజశేఖర రెడ్డి అంటే మంచి పరిపాలకుడు, సంక్షేమ పథకాలకు ఆద్యుడు అని మాత్రమే మాకు తెలుసు. ‘యాత్ర’ సినిమా చూశాక ఆయన వ్యక్తిత్వం మాకు మరింత తెలిసింది. కష్టాలలో ఉన్నవారికి ధైర్యం ఇవ్వడం, వారికి అండగా ఉండడం, అధిష్టానాన్ని తనదైన శైలిలో ఎదిరించడం, మాట ఇచ్చాక దానికి కట్టుబడి ఉండడం ఒక ఎత్తు అయితే ‘యాత్ర’లో ముమ్ముట్టిని చూశాక రాజశేఖర రెడ్డిని మరోసారి చూసినట్లు అయ్యింది. ఆయన పదవిలోకి వచ్చాక ఆయన చేపట్టిన కార్యక్రమాలు మరింతగా చూపించాల్సింది. ఏది ఏమైనా ‘యాత్ర’ సినిమా రాజశేఖర రెడ్డిలోని అన్ని కోణాలను కళ్లకు కట్టినట్లు చూపారు. సినిమా సూపర్బ్. – జుత్తాడ అరుణకుమారి, బొబ్బిలి క్లైమాక్స్ కన్నీళ్లు తెప్పించింది నేను, నా భర్త ‘యాత్ర’ సినిమా చూస్తున్న కొద్దీ తర్వాత ఏం జరుగుతుందోనన్న ఒక ఫీలింగ్ కలిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మమ్ముట్టి చాలా అద్భుతంగా నటించారు. వైఎస్సార్ చేసిన నిజజీవితపు పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రభుత్వం రాగానే వాటిని అమలు చేస్తామన్న వాగ్దానాలు ‘యాత్ర’ సినిమాలో బాగా ఆకట్టుకున్నాయి. సినిమా చివరిలో వైఎస్ రాజశేఖరరెడ్డి రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరిన హెలికాప్టర్ సన్నివేశాలను చూపిస్తూ కన్నీళ్ళు తెప్పించారు. – ధర్మాన సుశ్రీ, శ్రీకాకుళం అద్భుతంగా చూపించారు ‘యాత్ర’ సినిమాలో రాజశేఖర్రెడ్డి ప్రజా ప్రస్థాన యాత్రలో ఎదురైన అనుభవాలను చక్కగా చూపించారు. వాస్తవాలను తెరపైకి తీసుకొచ్చారు. డైర్క్షన్ అదుర్స్. స్క్రీన్ప్లే అద్భుతం. ఈ గడప దాటి ప్రతి గడపలోకి వెళ్లాలని ఉంది డైలాగ్ సూపర్. సినిమా ప్రతి వర్గాన్ని ఆకట్టుకునేలా ఉంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కంట తడితో బయటికి వస్తున్నారు. ‘యాత్ర’ సినిమాతో రాజశేఖర రెడ్డిని గుర్తు చేశారు. అలాంటి నాయకుడు మళ్లీ రావాలని దేవుని కోరుకుంటున్నాం. – సాత్విక, చిత్తూరు ఆ తర్వాత మళ్లీ ‘యాత్ర’కే క్షీరాభిషేకాలు 20 సంవత్సరాలుగా సినిమా రిప్రజెంటేటివ్గా వ్యవహరిస్తున్నాను. మాతృదేవోభవ, అమ్మోరు చిత్రాల అనంతరం థియేటర్ల వద్ద మళ్లీ క్షీరాభిషేకాలు చూడటం జరిగింది. ‘మాతృదేవోభవ’లో ఆద్యంతం హృదయాన్ని పిండే సన్నివేశాలు చూసి, చెమర్చిన కళ్లతో ప్రేక్షకులు హాలు నుంచి బయటకు వచ్చేవారు. ఇప్పుడు మళ్లీ ‘యాత్ర’ సినిమా చూసి వందలాది మంది చెమర్చిన కళ్లతో సినిమా హాలు నుంచి బయటకు వచ్చి మహానేతను మననం చేసుకోవడం కనిపించింది. – సోమరౌతు అప్పారావు, థియేటర్ రిప్రజెంటేటివ్, కొయ్యలగూడెం హృదయాన్ని కదిలించే సినిమా జన హృదయాలలోని సంఘర్షణలకు ప్రత్యక్ష రూపమిచ్చిన ‘యాత్ర’ సినిమా చూస్తున్నంత సేపూ వైఎస్సార్ నిజ జీవితంలో తిరుగాడినట్లుంది. వైఎస్సార్ పాత్రలో ముమ్ముట్టి జీవించిన వైనం అందరినీ ఆకట్టుకుంది. హృదయాన్ని కదిలించే ఈ చిత్రంలోని సన్నివేశాలు చూస్తుంటే అడుగడుగునా మాకు జగన్మోహన్రెడ్డి ప్రసంగాలు విన్నట్టే అనిపించాయి. మా ఇంట్లో వారు పట్టుబట్టి చిత్రం చూశారు. మొత్తం మీద జీవితం లాంటి సినిమాను చూశామన్న తృప్తి అందరికి కల్గుతుంది. – కె.నరసింహారెడ్డి, ప్రయివేటు ఉద్యోగి, పుట్టపర్తి అందరూ ఫిదా రాజన్న నడకలోని రాజసం, మాటలోని గాంభీర్యం.. మనసులోని మర్మం.. సెల్యులాయిడ్పై నిలువెల్లా వ్యాపించింది. ‘యాత్ర’ చూశాను. ఇదొక ఎమోషనల్ జర్నీ. చాలా సందర్భాల్లో ఎమోషనల్ అయ్యాను. రాజన్నే స్వయంగా తెరపైకి వచ్చాడేమో అనేంతలా మమ్ముట్టి అద్భుతంగా నటించారు. ‘యాత్ర’ నిజాయితీతో కూడిన భావోద్వేగాలతో సాగే చిత్రం. హృదయాన్ని హత్తుకునే క్లైమాక్స్ ఉంది. సినిమా చూసిన తర్వాత రాత్రంతా ఆ మహానేత ఆలోచనలే. ‘యాత్ర’లో భాగంగా వచ్చే ప్రతి సీన్ మనసును కదిలించేలా ఉంది. ఓ రైతు పండించిన టమాటాలు అమ్ముకోలేకపోవడం.. కనీసం చార్జీలు ఇవ్వలేని పరిస్థితి, వైద్యం అందక ఓ అమ్మాయి చనిపోయే సీన్స్ చూస్తే చాలా సిగ్గేసింది. ఇన్ని కష్టాలను చూసి ఆ మహానేత వారికి భరోసా కల్పించి.. వారికిచ్చిన హామీలను నెరవేర్చడం చాలా గొప్ప విషయం. – సానికొమ్ము సుప్రియ, బెంగళూరు జన్మ చరితార్థమైంది ‘యాత్ర’ సినిమా ఉచిత షోలను ప్రదర్శించడం అదృష్టంగా భావిస్తున్నాను. మహానేతపై ఉన్న అభిమానంతో సినిమా హక్కులు కొనుగోలు చేయడమే కాక పేద మధ్య తరగతి ప్రజలు సైతం సినిమా చూడాలనే ఉద్దేశ్యంతో షోలను ఉచితంగా ప్రదర్శించి. జన్మను చరితార్థం చేసుకోగలిగాను. చిత్రాన్ని చూసిన ప్రతీ మహిళ, వృద్ధులు చెమర్చిన కళ్లతో మంచి చిత్రాన్ని చూపించి మాకు మళ్లీ మహానేతను మా ముందుంచావు అంటూ పేర్కొనడం గర్వకారణంగా భావిస్తున్నా. – గంజిమాల దేవి, వైఎస్సార్ అభిమాని, కొయ్యలగూడెం, ప.గో.జిల్లా, పాదయాత్రలో పాల్గొన్నట్లుగా ఉంది ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో తుగ్లక్ పాలన తలపించడంతో అన్ని వర్గాలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న మహానేత వైఎస్ఆర్ ప్రజల సమస్యలను క్షేత్ర స్థాయిలో తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా ప్రస్థాన ‘యాత్ర’ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దిశానిర్దేశాన్ని మార్చేసేందుకు దోహదం చేసింది. ఆం్ర«ధప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన ప్రజాప్రస్థాన పాదయాత్రను ‘యాత్ర’ సినిమాలో కళ్లకు కట్టినట్లుగా చూశాం. ఈ సినిమా చూస్తుంటే మహానేత వైఎస్ఆర్ చేపట్టిన పాదయాత్రలో మొత్తం పాల్గొన్నట్లుగా ఉంది. సినిమా అద్భుతం. మలయాళ ప్రముఖ సినీ హీరో మమ్ముట్టి యాక్టింగ్ అచ్చం వైఎస్ఆర్ తరహాలోనే ఉంది. ‘యాత్ర ’సినిమాలో ఆయన ప్రతిపక్ష నేత హోదాలో కాంగ్రెస్ హైకమాండ్తో ఎలా నడుచుకున్నది, రైతుల సమస్యలు ఎలా తెలుసుకున్నది, విద్యార్థుల సమస్యలను.. ఇలా చెప్పుకుంటే పోతే రాష్ట్రంలో అన్ని వర్గాలు ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్రలో వైఎస్ఆర్ పడిన కష్టాలను మమ్ముట్టి ‘యాత్ర’ సినిమాలో చూశాం. నిజంగా ఇది యాత్ర సినిమా కాదు. మహానేత వైఎస్ఆర్ పాదయాత్రను, ఆయన వ్యవహారశైలిని దగ్గరగా చూసే అదృష్టం కల్పించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. – శ్రీనివాసరెడ్డి పాల్వాయ్, ఆర్.కే.ఆస్పత్రి, బళ్లారి, కర్ణాటక. ప్రతి సీన్ బాగుంది మాట ఇచ్చేముందు ఆలోచిస్తాను.. ఇచ్చాక ఏముంది...ముందుకు వెళ్లాల్సిందే అంటూ హైకమాండ్ను ధిక్కరించి చెప్పిన డైలాగ్ చాలా బాగుంది. అన్నింటికన్నా పెద్ద జబ్బు క్యాన్సరో...గుండె జబ్బో కాదయ్యా...పేదరికం అంటూ ఆయన చెప్పిన డైలాగ్స్ ఒకటేంటి.. ప్రతీ సన్నివేశాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి నిజజీవిత పాత్రలో మమ్ముట్టి జీవించేశారు. – తాన్న సునీల్కుమార్ (శ్రీకాకుళం–ఎచ్చెర్ల) ప్రతి సీన్ బాగుంది మాట ఇచ్చేముందు ఆలోచిస్తాను.. ఇచ్చాక ఏముంది...ముందుకు వెళ్లాల్సిందే అంటూ హైకమాండ్ను ధిక్కరించి చెప్పిన డైలాగ్ చాలా బాగుంది. అన్నింటికన్నా పెద్ద జబ్బు క్యాన్సరో...గుండె జబ్బో కాదయ్యా...పేదరికం అంటూ ఆయన చెప్పిన డైలాగ్స్ ఒకటేంటి.. ప్రతీ సన్నివేశాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి నిజజీవిత పాత్రలో మమ్ముట్టి జీవించేశారు. – తాన్న సునీల్కుమార్ (శ్రీకాకుళం–ఎచ్చెర్ల) కళ్లకు కట్టినట్లు తీశారు ‘యాత్ర’ సినిమాలో రాజశేఖర రెడ్డిగారి పాద యాత్రను కళ్లకు కట్టినట్లు తీశారు. ఆయన నిజజీవితంలో జరిగిన ఎన్నో వాస్తవ సంఘటనలను యధావిదిగా చూపారు. రాజశేఖర రెడ్డి హావభావాలను అచ్చంగా అలానే ముమ్ముట్టి ప్రదర్శించారు. ఆయన నటన చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. ‘యాత్ర’లో స్క్రీన్ప్లే బాగుంది. పాటలు ఇంకా ఉత్తేజంగా ఉంటే బాగుండేవి. రాజశేఖర రెడ్డి గొప్ప దార్శనికులు.ఆయన ఎందరి జీవితాలలోనో వెలుగులు నింపారు. కానీ ఆయన కుటుంబం అనేక కష్టాలలో ఉంది. ‘యాత్ర’ సినిమా జగన్కు మేలు చేయాలని కోరుకుంటున్నాం. – బిట్రా శ్రీనివాసరావు, బొబ్బిలి రాజన్న పాత్రలో మమ్ముటి జీవించారు ‘యాత్ర’ చిత్రాన్ని సినిమా యూనిట్ అత్యద్భుతంగా తెరకెక్కించింది. వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మమ్ముటి జీవించారు. అధిష్టానాన్ని ఎదిరించే సన్నివేశం అద్భుతంగా ఉంది. నటీనటులు వారి వారి పాత్రకు న్యాయం చేశారు. ప్రతి సీన్ అభిమానులను కంట తడి పెట్టిస్తోంది. ఆయన ప్రవేశ పెట్టిన పథకాలు, వాటి గల కారణాలను సూటిగా చూపించారు. – రాజు, చిత్తూరు మమ్ముట్టిని చూస్తున్న కొద్ది వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తుకొచ్చారు ‘యాత్ర’ సినిమా చూస్తున్న కొద్దీ మొదటి నుంచి చివరి వరకూ వైఎస్ రాజశేఖరరెడ్డినే చూసినట్లు అనిపించింది. రాజన్న రాజసం తెరమీద చూపించేందుకు డైరక్టర్ చేసిన ప్రయత్నం చాలా బాగుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ను తెరమీద చూస్తున్న కొద్దీ చాలా ఆనందంగా అనిపించింది. రాజశేఖర రెడ్డి నిజజీవితంలో ఎలా ఉండేవారు? అనేది ‘యాత్ర’ సినిమాను డైరక్టర్ ప్రేక్షకులకు అద్భుతంగా చూపించారు. – అక్కేన నరేష్. శ్రీకాకుళం – కరుకోల గోపీకిశోర్రాజా, సాక్షి, విశాఖ -
బాధ్యతారాహిత్యంపై దండ‘యాత్ర’
కళకీ కులాలుంటాయి. సినిమాలకీ రాజకీయాలుంటాయి. మనోళ్ల కళ హాయిగా కళ కళ లాడుతూ ఉంటుంది. మనోళ్లకి నష్టం తెచ్చే పరాయి వారి కళ ఎంతబాగున్నా వెల వెలబోతుంది. అసలామాటకొస్తే మనోడి సినిమా బాగాలేకపోయినా.. అద్భుతంగా ఉందని చెప్పడానికి మనకి భయమే ఉండదు. మనోడి సినిమాకన్నా అవతలోడి సినిమా నిజంగానే అద్భుతంగా ఉన్నా...మన మాటల వల్ల కూడా ఆ సినిమాకి ప్రచారం జరిగిపోతే కొంపలంటుకుపోతాయి కాబట్టి దాని గురించి మాట్లాడనే మాట్లాడం. ఇపుడు టాలీవుడ్ లో మెజారిటీ ప్రముఖులకు ఓ సినిమా అంటరానిదైపోయింది. దాని గురించి మాట్లాడ్డమే నేరమన్నట్లు అంతా మౌనవ్రతం పట్టేశారు. ఆ సినిమాయే యాత్ర. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి జీవితంలో ఓ చిన్న అధ్యాయం పాదయాత్ర. ఆ చిన్నపాటి ఘట్టాన్నే ఇతివృత్తంగా తీసుకున్న నిర్మాత...ఓ వర్ధమాన దర్శకుడు కలిసి ఈ సినిమాని తెరకెక్కించారు. ఎలాంటి హడావిళ్లూ..ప్రచార ఆర్భాటాలూ లేకుండా యాత్ర సినిమాని విడుదల చేశారు. సినిమా పెద్ద హిట్ అయ్యింది. చిత్రంగా టాలీవుడ్ లో ఏ సినీ ప్రముఖుడూ కూడా ఈ సినిమా గురించి ఒక్క మాట మాట్లాడలేదు. సినిమా బాగుందనో.. బాగాలేదనో చెప్పలేదు. దీనికి కొద్ది రోజుల ముందు నందమూరి బాలకృష్ణ నటించిన కథానాయకుడు సినిమా అత్యంత ఆర్భాటంగా విడుదలైంది. సినిమా విడుదలకు మూడు నెలల ముందు నుంచే అన్ని చానెళ్లూ..పత్రికలూ కథానాయకుడి గురించి లెక్కకు మించిన కథనాలు రాసి ప్రమోట్ చేశాయి. అంత హడావిడీ చేసి విడుదల చేసిన సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. సినిమా ఫ్లాప్ అయినా కూడా చిత్ర పరిశ్రమలోని ప్రముఖులంతా సినిమా గురించి ఆహా ఓహో అని పొగిడారు. ట్విట్టర్ లో పోస్టింగులు పెట్టి తమ బాధ్యత నెరవేర్చుకున్నారు. ఈ పెద్దలంతా యాత్ర సినిమా విషయం వచ్చేసరికి నోళ్లు కట్టేసుకున్నారు. కలాలు పక్కన పెట్టేశారు. మౌస్ లు కదలకుండా పట్టేసుకున్నారు. ఇదంతా ఏదో యాదృచ్ఛికంగా జరిగిపోయింది కాదు. కావాలనే..ఒక పథకం ప్రకారమే.. యాత్ర గురించి మాట్లాడకుండా అందరూ మౌనంగా ఉండిపోయారు. ఎందువల్ల చేత? యాత్ర సినిమాని పొరపాటున బాగుందంటే...ఏపీలో ఒక రాజకీయ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ప్రయోజనం చేకూరుతుందేమనని కంగారు పడ్డారేమోనని అనిపించగానే ఆందోళన కలిగింది. అక్కడ ఒకానొక మన రాజకీయ పార్టీకి నష్టం చేకూరుస్తుందేమో...మన పార్టీ పెద్దలకు మనపై కోపం వస్తుందేమో అని భయపడ్డారేమో అనిపించగానే జాలేసింది. సినీ రంగంలో ఉన్న చాలా మంది మేథావులు..సినీ క్రిటిక్స్ సైతం యాత్ర సినిమా విషయంలో స్ట్రైక్ చేసినట్లు స్పందించకపోవిడం చూసి మనసు చివుక్కుమంది. టాలీవుడ్ లో భిన్న వైరుధ్యాలు..శత్రుత్వాలూ ఉన్న గ్రూపులన్నీ కూడా యాత్రను ప్రమోట్ చేయకూడదన్న ఒకే ఒక్క అంశంలో ఒక్కతాటిపైకి రావడం చూసి భయమేసింది. ఏ చిన్న సినిమాయో అనాథలా విడుదలై హిట్ అయితే..స్పందించకపోతే బాగుండదేమోనని బాగుందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే సినీ జీనియస్ లు సైతం యాత్ర ను వెలివేయడం చూసి బాధేసింది. సామాజిక వర్గం ఆధారంగా ఓ సినిమాని ఇలా వెలివేసేసే పెద్దలున్న కాలంలోనే నేనూ బతుకుతున్నందుకు సిగ్గేసింది. ఈ పెద్దలంతా కూడా... కథానాయకుడి విషయంలో ఇందుకు భిన్నంగా స్పందించడం చూసి ఆశ్చర్యమేసింది. కథానాయకుడు సినిమా ఫ్లాప్ అని తేలిపోయిన తర్వాత కూడా.. అన్ని చానెళ్లూ..అందరు సినీ ప్రముఖులూ కూడా ఒకటే భజన. కథానాయకుడి సినిమా చాలా బాగున్నప్పటికీ..బాలకృష్ణ నటన అద్భుతంగా ఉన్నప్పటికీ...సినిమా అనుకున్నట్లు ఆడలేదట. అంటే..మనోడి సినిమాని మెచ్చుకోకపోతే..మొత్తం ప్రేక్షకులందరినీ బోనులో నిలబెట్టి..ఇంత మంచి సినిమా ఎందుకు చూడలేదని కాలర్ పట్టుకుని నిలేస్తారన్నమాట. అదే అవతలోడి యాత్ర ఎవరూ ప్రమోట్ చేయకపోయినా..మీడియా ఏ పాటి ప్రాధాన్యత ఇవ్వకపోయినా..విడుదలై జనం అద్భుతంగా ఉందని మెచ్చుకుంటే... ఆ విషయం ఎవరికీ తెలీకుండా ఉండేందుకు మొత్తం యాత్ర సినిమానే బోనులో పెట్టేస్తారన్నమాట. యాత్రపై కోపానికి చాలా కారణాలే ఉండచ్చు. ఎందుకంటే..చాలా సినిమాల్లా యాత్ర సినిమా ఆర్భాటంగా ముందుకు రాలేదు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి భారీ సెట్టింగులు వేసి..సినీ పరిశ్రమలోని అతిరథమహారథులను పిలిచి తారల తళుక్కుల మధ్య నిర్వహించలేదు. సినిమాలో సుమోలు గాల్లోకి లేచి కిందపడలేదు. అమ్మాయిల అంగాంగ ప్రదర్శనలతో యువతకు గేలం వేయలేదు. భారీ సెట్టింగులూ లేవు..ఘోరమైన ఫైటింగులూ లేవు. ఓ ఊరి నుంచి మరో ఊరికి ఎడ్లబండిపై వెళ్లినట్లు సినిమాని ముందుకు నడిపించారు దర్శకుడు మహి. సినిమాకి సంబంధించిన రూల్స్ ని పక్కన పెట్టి.. సినీ పరిశ్రమలోని సంప్రదాయాలను పట్టించుకోకుండా.. అత్యంత సింపుల్ గా సినిమా విడుదల చేసేసి..హిట్ కొట్టేసి.. కాలరెగరేస్తే ఎలాగ? అనుకున్నారో ఏమో కానీ చిత్ర పరిశ్రమ అంతా ఒకేలా సహాయనిరాకరణ ప్రదర్శించింది. సమకాలీన అంశాలపై తమ తమ యూట్యూబ్ ఛానెళ్లలో అద్భుతంగా స్పందించే సినీ మేథావులు తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి బ్రదర్స్, నాగబాబులతో పాటు..సోషల్ మీడియాలో భిన్న అంశాలపై బాధ్యతాయుతంగా తమ అభిప్రాయాలను వెల్లడించే..సాహితీ ప్రియులు...విమర్శకులు సైతం యాత్ర మనది కాదులేనని వదిలేయడం అన్యాయం అనిపించింది. సక్సెస్ హేజ్ మెనీ ఫాదర్స్, ఫెయిల్యూర్ ఈజ్ ఎన్ ఆర్ఫాన్- అన్న సామెత కూడా అన్ని వేళలా..అన్ని కాలాల్లోనూ నిజం కాదనిపించింది. ఎందుకంటే కథానాయకుడు ఫెయిల్ అయినా..మేథావులు..సినీ ప్రముఖులూ.. జర్నలిస్టులూ అంతా కూడా సినిమా బాగుంది కానీ..ఎక్కువ మంది చూడలేదని కితాబునిచ్చారు. అంటే మనోళ్ల ఫెయిల్యూర్ కి కూడా చాలా మంది ఫాదర్సూ,బాబాయిలూ..మావయ్యలూ దూరపు చుట్టాలూ అండగా నిలిచారు. సినిమా బాగుంటే జనం ఎందుకు చూడరు? జనం చూడకపోవడం వల్లనే కదా సినిమా ఫ్లాప్ అయ్యింది. చూడలేదంటే ఆ సినిమా జనానికి నచ్చలేదనే కదా. అదే యాత్ర చాలా బాగుందని జనం మెచ్చుకున్నా..సినిమా హిట్ అయినా ఒక్కరంటే ఒక్కరు కూడా ఒక్క మంచి మాట అనలేకపోవడం దేనికి సంకేతం? అన్నింటినీ మించిన దారుణం ఏంటంటే..యాత్ర సినిమా ఘన విజయం సాధించాక..చిత్ర యూనిట్ విశాఖ పట్టణంలో సక్సెస్ మీట్ పెట్టారు. దానికి చిత్ర కథానాయకుడు..మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కూడా వచ్చారు. చిన్న చిన్న సినిమాల సక్సెస్ మీట్ లు జరిగినా మీడియాలో వార్తలు వస్తారు. కానీ యాత్ర సక్సెస్ మీట్ వార్తలు మాత్రం ప్రధాన పత్రికలు పక్కన పెట్టేశాయి. యాత్రను మీడియా కూడా వెలి వేసిందన్నమాట. యాత్ర సక్సెస్ అయినా ..అనాథగా వదిలేసి వెళ్లిపోవాలని మెజారిటీ పెద్దలు అనుకున్నారు. అయితే యాత్ర అనాథ కాలేదు. 5కోట్ల మంది ప్రజలు యాత్రను దత్తత తీసుకుని తమ గుండెల్లో పెట్టుకుని పెంచుకుంటున్నారు. జన హృదయాల్లోంచి యాత్ర సంతకాన్ని ఎవరూ చెరపలేరు. మనం మెచ్చిందే కళ...మనం చెప్పిందే వేదం అన్న ఆలోచన ఎంత ప్రమాదకరం? కళ మనకో మనోళ్లకో...మనోళ్ల పార్టీలకో మేలు చేసేదై ఉండాలనుకోవడం ఎంత బాధ్యతారాహిత్యం? ఎంత దారుణం? - సి.ఎన్.ఎస్.యాజులు -
వైఎస్గారి పాత్ర చేయడం నా అదృష్టం
‘‘యాత్ర’ సినిమాకి ముందు తెలుగులో చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ ఆసక్తికరంగా అనిపించకపోవడంతో చేయలేదు. అయితే ‘యాత్ర’ సినిమాను కాదనలేకపోయాను. కథ బాగుంది.. మంచి ఎమోషనల్ టచ్ కూడా ఉంది. ప్రజల నాయకుడైన ఒక గొప్ప రాజకీయ నాయకుడి కథ ఇది. ప్రజలను అర్థం చేసుకోకపోతే రాజకీయ నాయకుడు.. ప్రజానాయకుడు కావడం కష్టం. మన దేశంలో ప్రజాస్వామ్యం ఉంది. ప్రజలు మెచ్చిన నాయకుడే రూలర్ అవుతారు’’ అని హీరో మమ్ముట్టి అన్నారు. మహి వి. రాఘవ్ దర్శకత్వంలో మమ్ముట్టి లీడ్ రోల్లో తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సందర్భంగా శుక్రవారం వైజాగ్లో నిర్వహించిన ‘బ్లాక్ట్బస్టర్ మీట్’లో మమ్ముట్టి మాట్లాడుతూ– ‘‘అందరికీ నమస్కారం. నాకు తెలుగు రాదు.. నన్ను క్షమించండి. తెలుగు స్పష్టంగా మాట్లాడటం ఇంకా రాలేదు. నా డైలాగ్స్కు జాగ్రత్తగా డబ్బింగ్ చెప్పుకున్నాను. ఉగ్రవాద దాడిలో అమరులైన వీరజవాన్లకు సెల్యూట్ చేస్తున్నాను. తెలుగులో ప్రత్యక్షంగా ‘యాత్ర’ నా మూడో చిత్రం. కె.విశ్వనాథ్గారితో ఒక సినిమా, ఉమా మహేశ్వరరావుగారితో మరో తెలుగు సినిమా చేశాను. ‘యాత్ర’ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ సాంగ్ షూట్ చేశాం. ఆ తర్వాత ఓ సీన్ను చిత్రీకరించాం. కాస్త భయం వేసింది.. నెర్వస్గా ఫీలయ్యాను. లక్కీగా ఆ సీన్ సినిమాలో లేదు. ఆ తర్వాత మ్యానేజ్ చేశాను. దర్శక–నిర్మాతలు నాకు మ్యాగ్జిమమ్ కంఫర్ట్ లెవల్స్ ఇచ్చారు. నా నుంచి కొత్తవిషయాలు నేర్చుకున్నానని మహి చెప్పారు. కానీ, నేర్చుకున్నది నేను. పాత్ర కోసం కొత్త భాష నేర్చుకున్నాను. సెట్లో ప్రతి రోజూ నాకు కొత్త రోజే. డైలాగ్స్ పలకడానికి సహకరించిన అసోసియేట్ డైరెక్టర్స్తో పాటు టీమ్ అందరికీ ధన్యవాదాలు. సినిమాల్లో నాకు అనుభవం ఎక్కువగా ఉండొచ్చు. కానీ తెలుగులో తక్కువ. సినిమా సక్సెస్ అయ్యింది. ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ‘యాత్ర’లో హీరో లేడు.. హీరోయిన్ లేదు.. ఫైట్స్ లేవు.. పాటలు, కామెడీ సీన్స్ లేవు.. అయినా ప్రేక్షకులు ఆదరించారు. సినిమాలను చూడటంలో వారి అభిరుచి మారింది. తెలుగులో మరిన్ని మంచి సినిమాలు రావాలి. విభిన్నమైన సినిమాలను ఆదరించే ప్రేక్షకులు ఆల్రెడీ పెరిగారు. వైఎస్ఆర్గారిలా నన్ను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఆయన పాత్రలో నటించడం నా అదృష్టం’’ అన్నారు. నిర్మాత విజయ్ చిల్లా మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్లో మూడో సినిమా ‘యాత్ర’. మొదటి సినిమా ‘భలే మంచి రోజు’ చేసినప్పుడు బాగా పేరొచ్చింది కానీ డబ్బులు రాలేదు. రెండో సినిమా మహితో ‘ఆనందో బ్రహ్మ’ చిత్రం చేసినప్పుడు బాగా డబ్బులు వచ్చాయి కానీ పెద్దగా పేరు రాలేదు. ‘యాత్ర’ మా మూడో సినిమా. ఈ చిత్రానికి మాకు ఎంత డబ్బు వచ్చిందో అంతకు మించి రెట్టింపు పేరొచ్చింది. సినిమా రిలీజ్ అయ్యాక కొన్ని వేల ఫోన్కాల్స్ వచ్చాయి. అందరూ ఒక్కటే మాట చెప్పారు. ‘మేం జీవితాంతం మీ రుణం తీర్చుకోలేం.. మా ముందుకు మళ్లీ వైఎస్ఆర్గారిని తీసుకొచ్చారు’ అనడంతో మేం పడ్డ ఏడాదిన్నర కష్టం మరచిపోయాం. ఈ సినిమాని చూసి విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు. డిస్ట్రిబ్యూటర్లు కూడా కాల్ చేసి సంతోషం వ్యక్తం చేయడం వెరీ హ్యాపీ. ఈ సినిమా కేవలం డబ్బు కోసం తీయలేదు. వైఎస్గారి అభిమానుల నమ్మకాన్ని నిలబెట్టినందుకు చాలా గర్వపడుతున్నాం. థ్యాంక్స్ టు మమ్ముట్టిసార్.. వైఎస్గారిని మళ్లీ తీసుకొచ్చారు. సినిమా రిలీజ్ అయ్యాక నేను, మహి వెళ్లి జగన్ అన్నని కలిశాం.. ‘యాత్ర’ ప్రొడ్యూసర్.. రండి అని అన్న అనడంతో చాలా సంతోషం వేసింది’’ అన్నారు. దర్శకుడు మహి వి.రాఘవ్ మాట్లాడుతూ– ‘‘మమ్ముట్టిగారు నమ్మకపోతే ఈ సినిమా చేయడం అసాధ్యం. వైఎస్గారిపై అభిమానం వేరే, కృతజ్ఞత వేరే అని ఈ సినిమా ద్వారా తెలుసుకున్నా. వైఎస్గారిపై అభిమానం, ప్రేమకు మించిన ఒక భావం కానీ, ఏదైనా ఒక ఫీలింగ్ ఉందంటే అది కృతజ్ఞత. ఆయన్ను ప్రేమించేవారికి ఓ కృతజ్ఞత ఉంది. అది క్రీడాకారులకో, సినిమా వాళ్లకో రాదు.. అది అసాధ్యం. నేను ఇంకా పెద్ద సినిమాలు చేయొచ్చు.. ఎక్కువ డబ్బులు రావొచ్చేమో కానీ, నా జీవితంలో నాకు తెలిసి ఇంత కృతజ్ఞత కానీ, ప్రేమ కానీ రాదని కచ్చితంగా చెప్పగలను. ప్రేక్షకుల స్పందన చాలా బాగుంది. ఒకతను నాకు ఫోన్ చేసి, ‘ఓ వైపు కన్నీళ్లు వస్తున్నాయ్.. మరోవైపు చప్పట్లు కొడుతూ ఉండిపోయాను’ అన్నాడు. ఓ మహిళ ఫోన్ చేసి, ‘ఇకపై రైతు మార్కెట్లో టమోటాని ధర కన్నా రెండు రూపాయలకు తక్కువ ఇమ్మని రైతులను అడగను’ అని చెప్పింది. ఓ కథ ఇంత ప్రభావం చూపిస్తుందని, ఎమోషనల్గా కనెక్ట్ చేస్తుందని నేను అనుకోలేదు. జగనన్నకి కూడా థ్యాంక్స్. ఎన్నికలు ఉన్న ఏడాదిలో నేను ఎవర్నో కూడా తెలియకుండా నన్ను గుడ్డిగా నమ్మి ‘మీ నాయకుని కథ మీరు చెప్పుకోండి’ అన్నారు. ఆ మాట అనాలంటే నిజంగా ధైర్యం ఉండాలి. అందుకు అన్నకి థ్యాంక్స్ చెబుతున్నా. సినిమాల్లో చాలామంది కడప కథలు చెప్పారు. తొలిసారి ఓ కడప బిడ్డ కథ చూపించాం. వైఎస్గారు కడపలో పుట్టినా ప్రతి గడపలోకి వచ్చారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని మారుమూల గ్రామాల్లో కూడా ఆయన్ని ప్రేమించారు. రాఘవేంద్రరావుగారు, రామ్గోపాల్వర్మగారు... ఇలా చాలామంది సినిమా బావుందని అభినందించారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటీనటులు అశ్రిత, ఉమ, ‘దిల్’ రమేశ్, దయానంద్, మొయినుద్దీన్, బాలనటి సహస్ర, శ్రీమిత్ర చౌదరి తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘ఆ పేరు తెలుగునాట ఒక బ్రాండ్’
‘యాత్ర’ YSR బయోపిక్ కాదు, అది తీయడానికి రెండున్నర గంటల సినిమా నిడివి సరిపోదు. కేవలం ‘పాదయాత్ర’ అంటే, అంతసేపు ప్రేక్షకుడ్ని థియేటర్లో కూర్చోబెట్టడానికి సరుకు చాలదు. మరేంటి? ఈ ఉత్సుకతతోనే సినిమాకెళ్ళా! ఓపెన్ మైండ్తో, నిర్మల మనసుతో సాంతం చూశా. ఇంటర్మిషన్, ది ఎండ్ త్వరగా వచ్చాయి. నడుమ నాలుగయిదు మార్లు కళ్ళు చేమర్చినా, అరె! సినిమా అప్పుడే అయిపోయిందే! అనిపించింది. హాట్సాఫ్ టు ది డైరెక్టర్. చిత్రీకరణ నైపుణ్యమే కాదు సినిమా అంతటా నిజాయితీ ఉంది. అందుకే ఆ నిండుతనం. జనమాధ్యమాల (mass communication) లో సెల్యులాయిడ్, సినిమా ఎంత పవర్ఫుల్లో మరోమారు అర్థమైంది. ‘వైఎస్సార్’ అని పొట్టిగా పిలిచినా, ‘రాజశేఖరరెడ్డి’ అంటూ రాజసం చిలికినా, ‘డా.వైఎస్సార్’ని ఒడలు పులకించేలా పొడుగ్గా పలికినా... నాలుగు దశాబ్దాలు ఆ పేరు తెలుగునాట ఒక బ్రాండ్! ఎందుకు? ఎందువల్ల? ఏ కారణంగా? క్రమంగా వికసించిన ఆయన వ్యక్తిత్వం, తనవారితో మమేకమయ్యే జీవనశైలి, ద్విదృవ మొండి/హుందాతనం, ఊపిరై సహవాసం చేసిన మానవత, జనం కోసం ఏమైనా చేయగల తెగువ... ఇవే, దర్శకుడికి ముడిసరుకయ్యాయి. అందుకే, సంఘటనలు, సన్నివేశాల వరుస మార్చినా, అక్కడక్కడ నిజాలకు సినీమాటిక్ ట్రిక్కులద్దినా... ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. చరిత్ర సృష్టించిన ‘ఆరోగ్యశ్రీ’, రికార్డుకెక్కిన ‘ఫీ రిఇంబర్స్మెంట్’, నేటికీ నిలిచిన ‘ఉచిత విద్యుత్’, సాచురేషన్ వరకిచ్చిన ‘పెన్షన్లు’, ప్రాంతాల గతి మార్చిన ‘జలయజ్ణం’ ఇలా, అయిదున్నరేళ్ళు అభివృద్ధి - సంక్షేమం జోడు గుర్రాల స్వారీతో పాలన పరుగులెత్తించిన దాదాపు అన్ని పథకాలూ.... ‘పాదయాత్ర’లో ఎలా పురుడు పోసుకున్నాయో ఒడుపుగా తెరకెక్కించాడు దర్శకుడు మహి వి రాఘవ్ దట్సాల్! కుళ్ళు రాజకీయాల్ని జొప్పించలేదు, ఒకటీ అరా ఆహ్లాదపరిచే సెటైర్లు తప్ప! ‘నటన’ కళ అయితే, అది తప్పక భాషాతీతమని మమ్ముట్టి తన నిండైన రూపం, చాతుర్యం, మ్యానరిజం, కడకు వాచకం (తనదే డబ్బింగ్)తో నిరూపించాడు. చివరికి, గ్రేట్.... కనబడీ కనబడనీకుండా కంటతడి తుడిచేసుకుంటారు గనుక, ‘రాజకీయాల్లో ఉంటే వైఎస్సార్ లా ఉండాలి, ‘అధికారం’ అబ్బితే ఆయనలా నడవాలి, మనిషై మాటిస్తే రాజన్నలా కట్టుబడాలి, స్నేహమంటూ చేస్తే అతనిలా విశ్వసించాలి, ఇవేవీ చేయలేకపోయినా.... మనకెప్పటికీ YSR లాంటి పాలకుడుండాలి’ అనుకుంటూ, ప్రేక్షకులంతా బరువెక్కిన గుండెలతో థియేటర్ బయటకు నడుస్తారు. -దిలీప్ రెడ్డి. -
అంతరంగ ‘యాత్ర’
డైరెక్టర్ మహి ఇది బయోపిక్ కాదన్నాడు. నిజమే... జననంతో మొదలై మరణంతో అంతమయ్యే డాక్యుమెంటరీలా లేదు. ఈవెంట్ బేస్డ్ స్టోరీ అన్నాడు. అది మాత్రం నిజం కాదనుకుంటా... ఎందుకంటే.. వైఎస్ పాదయాత్ర కేవలం ఓ క్రతువు కాదు. వసివాడిన పేదల జీవితాల్లో వికసించిన వసంత రుతువు. అది ముగిసిన యాత్ర కాదు.. ‘‘నడుస్తున్న’’ చరిత్ర. అందుకే తడుస్తున్న కళ్లతో ప్రేక్షకులు ఆ చిత్రాన్ని చూస్తున్నారు. బరువెక్కిన హృదయాలతో బయటికి వస్తున్నారు. ఈ దర్శకుడు నిజంగానే ‘మహి’మాన్వితుడు. లేకపోతే.. ఎక్కడో విదేశాల్లో ఉండి ఆంధ్రదేశంలో సాగిన పాదపాత్రని.. ఎలా చూడగలిగాడు..! కంట తడిపెట్టించే సంభాషణల సాగు ఎలా చేశాడు..! హృదయాన్ని కదిలించే కడగళ్ల కథని ఎలా రాశాడు..! పాదయాత్ర సాక్షిగా రాజన్న జనం గుండె చప్పుడు వింటుంటే.. ఈ దర్శకుడు అదృశ్యంగా ఉండి.. పెద్దాయన అంతరంగాన్నే ఆలకించినట్టున్నాడు. యాత్ర చూస్తున్నంత సేపూ.. మహికి మహిమలేమన్నా వచ్చా.. అన్న సందేహం రావొచ్చు. అంతలా కనికట్టు చేశాడు. కట్టిపడేశాడు. కష్టాలకి తలవంచని తత్వం, మాట తప్పని వ్యక్తిత్వం, అనుకున్నది సాధించే మొండితనం, శత్రువునైనా ప్రేమించే మంచితనం.. వైఎస్ సొంతం. సినిమా ఆసాంతం అదే కనిపించింది. మమ్ముట్టి ఆ పాత్రని ఆకళింపు చేసుకొని నటించలేదు. వైఎస్ అంతరంగాన్ని ఆవాహనం చేసుకున్నాడు. రాజన్న నడకలోని రాజసం, మాటలోని గాంభీర్యం.. మనసులోని మర్మం.. సెల్యులాయిడ్పై నిలువెల్లా వ్యాపించింది. అక్కడున్న గాలిలో సైతం వైఎస్ ఆత్మ సంలీనమై సంచరించింది. ఇది కంచికి చేరే కథలా లేదు. ఇంటికి వచ్చాక కూడా కంటికి కనిపించే దృశ్యాలు. ఎంత దూరం వెళ్లినా వెంటాడే దుఃఖ మేఘాలు. నిజానికి మహి కథ రాయలేదు. నడిచీ నడిచీ బొబ్బలు కట్టిన రాజన్న పాదాలకు ఆత్మీయ లేపనం రాశాడు. అసలు మహి సినిమా తియ్యలేదు. ఆ చెమట చుక్కల్ని, చెమ్మగిల్లిన కళ్లనీ.. తుడుచుకో రాజన్నా అంటూ.. ఓ తుండు గుడ్డని అందివ్వాలని చూశాడు. తన గుండెలోంచి పొంగే కన్నీళ్లను మాత్రం దాచుకోలేకపోయాడు. వెండితెరపై నిండిన ఆ ఆశ్రుధారే.. యాత్ర. - రాశ్రీ -
‘యాత్ర’పై వర్మ ప్రశంసలు
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన సినిమా యాత్ర. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ‘యాత్ర ఒక అద్భుతమైన చిత్రం. వైఎస్సార్ గొప్ప నాయకుడు. వైఎస్సార్లోని నిజమైన కోణాన్ని ఈ చిత్రం అవిష్కరించింది. మహి వీ రాఘవ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో జీవించి.. పాత్రకు ప్రాణం పోశార’ని ట్విటర్లో పేర్కొన్నారు. మమ్ముట్టి, రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించిన యాత్ర సినిమాకు మహి వీ రాఘవ దర్శకుడు. 70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై విజయ్ చిల్లా, దేవిరెడ్డి శశి, శివ మేకలు నిర్మించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతోంది. Yatra is an awesome film ..A truly great insight into YSR,a truly great leader ..Kudos to @MahiVraghav who made him come alive and kudos to @mammukka for immortalising him forever 🙏🙏🙏 — Ram Gopal Varma (@RGVzoomin) February 12, 2019 -
సింగపూర్లో వైఎస్సార్కు కన్నీటి నివాళి
-
సింగపూర్లో వైఎస్సార్కు కన్నీటి నివాళి
సింగపూర్ వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ వింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహానేత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా తొలి షోను 700 మందికి పైగా వీక్షించారు. సింగపూర్లోని రెక్స్ సినిమా గోల్డెన్ మైల్ టవర్ థియేటర్ జోహార్ వైఎస్సార్ నినాదాలతో మారెమోగిపోయింది. యాత్ర చిత్రాన్ని సింగపూర్లో తెలుగు ప్రజలతో వీక్షించేందుకు విచ్చేసిన వైఎస్సార్సీపీ నేత మార్గాని భరత్కి సింగపూర్ వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ వింగ్ కృతజ్ఞతలు తెలిపింది. సినిమా అద్భుతంగా ఉందని, పెద్దాయన వైఎస్సార్ జీవితాన్ని ప్రత్యక్షంగా చూసినట్టుందని, సినిమా హాలు నుండి బయటకు వస్తూ వీక్షకులు ప్రజానేత రాజన్నను తలుచుకుంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. పెద్దాయన రాజశేఖర రెడ్డి మరణించి ఏళ్లు గడుస్తున్నా ఇంకా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నాడనడానికి ప్రేక్షకుల కన్నీటి నివాళే ఉదాహరణ అని సింగపూర్ వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ వింగ్ సభ్యులు తెలిపారు. సినిమా చూస్తున్నంతసేపు జోహార్ వైఎస్సార్ నినాదాలతో థియేటర్ హోరెత్తింది. సింగపూరులో ఉండే వైఎస్సార్ అభిమానులతో పాటు అసంఖ్యాక తెలుగు కుటుంబాలు చిత్ర ప్రదర్శనకు మెదటి రోజు మొదటి షోకి రావడం తెలుగు చలన చిత్ర చరిత్రలో మొట్ట మొదటి సారి అని తెలిపారు. పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా రాజన్నని జనం ఎంతగా ప్రేమిస్తున్నారో యాత్ర చిత్రానికి వస్తున్న ఆధరణ చూస్తుంటే అర్థమవుతుందన్నారు. యాత్ర తెలుగు సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబోతున్న ఒక అద్భుత చిత్రం అని కొనియాడారు. సింగపూర్లో ఉండే తెలుగు కుటుంబాలు వైఎస్సార్ జీవితాన్ని తమ పిల్లలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజన్నజీవితం ఈ తరానికే కాదు, రాబోయే తరాలకు ఆదర్శప్రాయం అనివైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ వింగ్ సభ్యులు పేర్కొన్నారు. తాను కూడా వైఎస్సార్ సింగపూర్ కుటుంబసభ్యులతో యాత్ర చిత్రాన్ని థియేటర్లో చూడడం ఆనందంగా ఉందని మార్గాని భరత్ అన్నారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఎంత ఆవశ్యకమో వివరించారు. సింగపూర్లో వైఎస్సార్సీపీ పిలుపు మేరకు చేస్తున్న కార్యక్రమాలను మార్గని భరత్ అభినందించారు. -
టెక్సాస్లో ‘యాత్ర’ను వీక్షించిన అభిమానులు
టెక్సాస్ : దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. యాత్ర సినిమా విడుదలని ప్రపంచ వ్యాప్తంగావైఎస్సార్ అభిమానులు పండుగ వాతావరణంలో జరుపుకొంటున్నారు. యాత్రను చూసిన అభిమానులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. పాదయాత్రలో భాగంగా నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజలతో తన అనుబంధాన్ని ఎలా ఏర్పర్చుకున్నారనే విషయాన్ని.. దర్శకుడు చాలా ఎమోషనల్గా తెరకెక్కించారని చెప్పారు. మహి వి రాఘవ దర్శకత్వ ప్రతిభను మెచ్చుకున్నారు. ఒక మంచి భావోద్వేగ కథను చక్కగా చూపించారని అభిప్రాయపడ్డారు. ఈ సినిమా వైఎస్ అభిమానులకే కాకుండా అందరికీ నచ్చుతుందని, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే విధంగా తీశారని చెప్పారు. ఇక మమ్ముట్టి, వైఎస్సార్ పాత్రలో ఒదిగిపోయారని, వైఎస్సార్ ని మళ్ళీ చూసిన అనుభూతి కలిగిందని అభిమానులు హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. టెక్సాస్ రాష్ట్రం సాన్ఆంటోనియో నగరంలోని వైఎస్సార్ అభిమానులు వేణుగోపాల్ రెడ్డి కొత్తపల్లి, ఆదినారాయణ రెడ్డి లక్కు, సునీల్ కుమార్ రెడ్డి మేడ, రెడ్డి భాస్కర్ రెడ్డి బండ్లపల్లి, రాజశేఖర్ రెడ్డి , నవీన్ చిల్లా, సాయి ప్రసాద్ , శరణ్య అరికట్ల, వెంకట రామాంజనేయ రెడ్డి, జయరాం రెడ్డి, భార్గవ్ రెడ్డి బూడిదేటి, శివ , నియంత్, అశోక్ రెడ్డి అన్నపురెడ్డి , కిషోర్ రెడ్డి అన్నపురెడ్డి తదితరులు యాత్ర సినిమాను వీక్షించారు. -
వైఎస్సార్గారు ప్రజలను తండ్రిలా ఆదరించారు – వైఎస్ విజయమ్మ
‘‘వైఎస్ రాజశేఖర రెడ్డిగారి పాదయాత్ర ఆధారంగా చేసుకుని ‘యాత్ర’ సినిమాని నిర్మించి, విజయవంతంగా నడిపించిన డైరెక్టర్ మహి, నిర్మాతలు విజయ్, శశి, శివగార్లకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు అభినందిస్తున్నా’’ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో మమ్ముట్టి లీడ్ రోల్లో మహి వి. రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాని సోమవారం హైదరాబాద్లో ప్రత్యేకంగా వీక్షించిన అనంతరం వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ– ‘‘కొన్ని కోట్లమంది హృదయ అంచుల్లో, అంతరాల్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డిగారిని, ఆయన వ్యక్తిత్వాన్ని, వ్యవహార శైలిని, ప్రజల పట్ల ఆయనకున్న ఆరాటం, తపన, ఆయన ఆశయాలు, సంక్షేమ పథకాలను మరోసారి ప్రజల గుండె లోతుల్లో నుంచి తట్టి లేపారు. అందుకే నేను ‘యాత్ర’ యూనిట్ని అభినందించడంతో పాటు కృతజ్ఞతలు తెలుపుతున్నా. రాజశేఖర రెడ్డిగారిని ప్రజలు ఏ విధంగా నాయకునిగా నిలబెట్టుకున్నారో.. ఆయన కూడా ఓ తండ్రిగా మిమ్మల్ని (ప్రజలు) ఆదరించి మీకు ఏం కావాలో అవన్నీ చేశారు. ఆయన వెళ్లిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డిగారి కుటుంబాన్ని వదిలి పెట్టకుండా అక్కున చేర్చుకున్న ప్రజలందరికీ, రాజశేఖర రెడ్డిగారి నేపథ్యంలో వచ్చిన ‘యాత్ర’ సినిమాని ఆదరించిన, ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అన్నారు. ఈ చిత్రంలో వైఎస్ విజయమ్మ పాత్రలో నటించిన అశ్రిత మాట్లాడుతూ– ‘‘యాత్ర’ విడుదల తర్వాత ఎంతోమంది ఫోన్లు చేసి వైఎస్ విజయమ్మగారిలానే ఉన్నానని అభినందిస్తుంటే సంతోషంగా అనిపించింది. విజయమ్మగారితో కలిసి ‘యాత్ర’ సినిమా చూసే అవకాశం రావడం హ్యాపీ. ఈ సినిమా చూసి విజయమ్మగారు సంతోషపడ్డారు. ఎప్పటినుంచో ఆమెను కలవాలనే నా కోరిక ఇప్పుడు తీరింది’’ అన్నారు. ‘‘దేశానికి అన్నం పెట్టే రైతులను ప్రేమించే ప్రతి ఒక్క వ్యక్తి చూడాల్సిన సినిమా ‘యాత్ర’. ఎటువంటి భేషజాలకు పోకుండా సినీ అభిమానులందరూ ‘యాత్ర’ లాంటి మంచి సినిమాని చూసి, ఆదరిస్తేనే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి. ఈ సినిమాలో చాలా బరువైన పాత్ర చేశా. అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు, ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని నటుడు ‘దిల్’ రమేశ్ అన్నారు. విజయ్ చిల్లా, మహి వి. రాఘవ్ పాల్గొన్నారు. -
‘యాత్ర’పై స్పందించిన వైఎస్ విజయమ్మ
-
‘యాత్ర’పై స్పందించిన వైఎస్ విజయమ్మ
సాక్షి, హైదరాబాద్ : దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ చిత్ర యూనిట్ను వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ అభినందించారు. ఈ చిత్రాన్ని తిలకించిన అనంతరం ఆమె సోమవారమిక్కడ మాట్లాడుతూ... యాత్ర సినిమాను చాలా బాగా తీశారు. కోట్లాది హృదయాంతరాల్లో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకాలను ’యాత్ర’ ద్వారా దర్శక, నిర్మాతలు తట్టిలేపారు. వైఎస్సార్ సజీవంగా మనముందు లేకపోయినా... యాత్ర చిత్రం ద్వారా ఆయనను మరోసారి మనముందుకు తీసుకువచ్చారని విజయమ్మ అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఇచ్చిన మాట కోసం వైఎస్సార్ కట్టుబడేవారని ఆమె తెలిపారు. ఈ చిత్రానికి పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తడమే కాకుండా మరోవైపు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు రాబడుతోంది. కాగా అంతకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా యాత్ర టీమ్కు అభినందనలు తెలిపారు. చిత్ర దర్శకుడు మహి వి.రాఘవ, నిర్మాతలు దేవిరెడ్డి శశి, విజయ్ చిల్లా, శివ మేకా, వైఎస్సార్ పాత్రధారి హీరో మమ్ముట్టి, ఇతర చిత్ర బృందాన్ని అభినందిస్తూ ట్వీట్ చేశారు. -
‘రాజన్నే స్వయంగా స్క్రీన్ మీద ఉన్నారు’
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. రాజన్న పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి జీవించిన తీరుకు అందరూ ఫిదా అయ్యారు. పాజిటివ్ రివ్యూలతో, మంచి టాక్తో అందరి మన్నలను అందుకున్న ఈ చిత్రం సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమా వీక్షించి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘ యాత్ర చూశాను. ఇదొక ఎమోషనల్ జర్నీ. చాలా సందర్భాల్లో ఎమోషనల్ అయ్యాను. రాజన్నే స్వయంగా తెరపైకి వచ్చాడేమో అనేంతలా.. మమ్ముట్టి గారు అద్భుతంగా నటించారు. చిత్రానికి పనిచేసిన నటీనటులు, చిత్రయూనిట్ సభ్యులందరికీ శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు. సురేందర్ రెడ్డి ప్రస్తుతం ‘సైరా’ షూటింగ్తో బిజీగా ఉన్నాడు. Watched Yatra! It was such a sincere emotional journey. Felt emotional on many occasions.Aided by a honest and brilliant performance by @mammukka gaaru, I felt rajanna himself was on the screen. Congratulations to the entire cast n crew for wonderful and respectful job...🙏🏻🙏🏻 pic.twitter.com/ypz3rChIEj — SurenderReddy (@DirSurender) February 11, 2019 -
టెక్సాస్లో ‘యాత్ర’ సంబరాలు
టెక్సాస్ : దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. యాత్ర సినిమా విడుదలని ప్రపంచ వ్యాప్తంగా వైఎస్సార్ అభిమానులు పండుగ వాతావరణంలో జరుపుకొంటున్నారు. సినిమాను వీక్షించిన అభిమానులు సినిమాపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. పాదయాత్రలో భాగంగా నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజలతో తన అనుబంధాన్ని ఎలా ఏర్పర్చుకున్నారనే విషయాన్ని.. దర్శకుడు చాలా ఎమోషనల్గా తెరకెక్కించారని చెప్పారు. మహి వి రాఘవ దర్శకత్వ ప్రతిభను మెచ్చుకున్నారు. ఒక మంచి భావోద్వేగ కథను చక్కగా చూపించారని అభిప్రాయపడ్డారు. ఈ సినిమా వైఎస్ అభిమానులకే కాకుండా అందరికీ నచ్చుతుందని, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే విధంగా తీశారని చెప్పారు. ఇక మమ్ముట్టి, వైఎస్సార్ పాత్రలో ఒదిగిపోయారని, వైఎస్సార్ ని మళ్ళీ చూసిన అనుభూతి కలిగిందని అభిమానులు హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. ఆస్టిన్లోని వైఎస్సార్ అభిమానులు సుబ్బా రెడ్డి చింతగుంట, పుల్లా రెడ్డి యెదురు, పరమేశ్వర రెడ్డి నంగి, మల్లికార్జున రెడ్డి ఆవుల, నారాయణ రెడ్డి గండ్ర, రవి బల్లాడ, కుమార్ అశ్వపతి, ప్రవర్ధన్ రెడ్డి చిమ్ముల, వంశి, వెంకట శివ నామాల, కొండా రెడ్డి ద్వారసాల, అశోక్ గూడూరు, స్వాదీప్ రెడ్డి, బ్రమేంద్ర రెడ్డి లక్కు, మురళీధర్ రెడ్డి బండ్లపల్లి, ప్రదీప్ రెడ్డి లక్కీరెడ్డి , రామ కోటి రెడ్డి , వెంకట గౌతమ్ , హనుమంత రెడ్డి , దేవేందర్ రెడ్డి, శివ రెడ్డి ఎర్రగుడి, వెంకట రెడ్డి కొండా, యస్వంత్ రెడ్డి గట్టికుప్పల, గురు చంద్రహాస్ రెడ్డి , శ్రీకాంత్ రెడ్డి, వెంకట్ కొట్టే, రవి, రఘు, శ్రీను చింత, కళ్యాణ్ రెడ్డి , ప్రసాద్ రెడ్డి, చెన్నా రెడ్డి, విట్టల్ రెడ్డి, చెన్న కేశవ రెడ్డి తదితరులు యాత్ర సినిమాను చూసారు. అనంతరం యాత్ర సినిమా విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
మమ్ముట్టిపై సూర్య ప్రశంసలు!
మమ్ముట్టి ఏ పాత్ర చేసినా.. అందులో ఒదిగి పోతారన్న సంగతి తెలిసిందే. పైగా ఏ భాషలో నటించినా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటారు. మమ్ముట్టి తాజాగా పెరంబు, యాత్ర చిత్రాలతో ప్రేక్షకులను పలకరించారు. ఈ రెండు సినిమాలపై సూర్య ప్రశంసలు కురిపించారు. మలయాళ, తమిళ భాషల్లో పెరంబు తెరకెక్కగా.. తెలుగు, మలయాళ, తమిళ, భాషల్లో యాత్ర తెరకెక్కింది. కూతురు, తండ్రికి మధ్య ఉండే ప్రేమానురాగాల నేపథ్యంలో పెరంబులో అద్భుతంగా నటించారని విమర్శకులు ప్రశంసించారు. యాత్ర సినిమాలో వైఎస్ రాజశేఖర్రెడ్డి పాత్రలో జీవించి.. పాత్రకు ప్రాణం పోశారు. ఇక ఈ చిత్రాలను వీక్షించిన హీరో సూర్య.. పెరంబు, యాత్ర సినిమాలను ఎంచుకున్న విధానం, వస్తున్న ఫీడ్బ్యాక్, స్వచ్చమైన సినిమాలను చేస్తూ.. మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తున్నందుకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశాడు. సూర్య ప్రస్తుతం ఎన్జీకే చిత్రంతో బిజీగా ఉన్నాడు. Recently #Peranbu n now #Yatra so many feedbacks and what a varied choice @mammukka .. Thank you team for inspiring us with this truth and purity of cinema! All respects 🙏🙏🙏 pic.twitter.com/qeNndXMRC5 — Suriya Sivakumar (@Suriya_offl) February 10, 2019 -
‘యాత్ర’ బృందానికి వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, హైదరాబాద్: యాత్ర సినిమాను విజయవంతంగా నిర్మించి విడుదల చేసిన మహి వి.రాఘవ, దేవిరెడ్డి శశి, విజయ్ చిల్లా, శివ మేకా, వైఎస్సార్ పాత్రధారి హీరో మమ్ముట్టిలకు, ఇతర చిత్ర బృందానికి ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ‘యాత్ర సినిమా తీయడంలోనూ.. ఆ మహానేత జీవితంలోని వాస్తవాలను, వ్యక్తిత్వాన్ని, ఆయన వ్యవహారశైలిని సినిమా రూపంలో ప్రతిబింబింపజేయడంలోనూ మీరు ప్రదర్శించిన అభిరుచి, అంకిత భావాలకు నేను మనఃపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని జగన్ ఆదివారం ట్విట్టర్లో పేర్కొన్నారు. Congratulations @MahiVraghav @devireddyshashi @VijayChilla @ShivaMeka @mammukka & entire crew on the successful release of #Yatra.I wholeheartedly thank you & appreciate your passion & dedication in wanting to depict cinematically,the character & essence of the great leader,YSR. — YS Jagan Mohan Reddy (@ysjagan) February 10, 2019 -
మేకింగ్ ఆఫ్ మూవీ యాత్ర
-
‘సుచరితా రెడ్డి’పై స్పందించిన అనసూయ
రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్రలో అనసూయ నటనను మరువక ముందే.. ‘యాత్ర’లో సుచరితా రెడ్డిగా మరోసారి ప్రేక్షకులను కట్టిపడేశారు. యాత్రలో కనిపించింది కొన్ని క్షణాలే అయినా.. తన నటనతో మంచి మార్కులు కొట్టేశారు ఆమె. యాత్ర చిత్రంలో తన పాత్రపై అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో.. అనసూయ తన ఆనందాన్ని అభిమానులతో పంచకున్నారు. ‘సుచరితరెడ్డి పాత్రను పోషించడం నాకు సంతోషంగా ఉంది. నాపై చూపిస్తున్న అభిమానానికి ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఆ పాత్రను నేను పోషించగలనని నాపై నమ్మకం ఉంచిన డైరెక్టర్ మహి వి రాఘవ, 70ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్కు ధన్యవాదాలు’ అంటూ అనసూయ భరద్వాజ్ ట్వీట్ చేశారు. మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ‘యాత్ర’ విజయవంతంగా దూసుకుపోతోంది. Playing #SucharitaReddy was an experience I will cherish always.. Thank you my audience for all the good things you are saying.. Thank you @MahiVraghav Sir and @70mmEntertains for having faith in me that I can pull this off 🙏🏻#YatraTheMovie #YatraRoars pic.twitter.com/miywLKlVqo — Anasuya Bharadwaj (@anusuyakhasba) 10 February 2019 -
మెల్బోర్న్లో వైఎస్సార్ అభిమానుల కోలాహలం
మెల్బోర్న్ : దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన యాత్ర సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్హిట్టాక్తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా దేశ విదేశాల్లోని థియేటర్లు వైఎస్సార్ అభిమానులతో కోలాహలంగా మారాయి. వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా కమిటీ ఆధ్వర్యంలో మెల్బోర్న్లోని బాక్లాట్ స్టూడియోస్, 64 హెగ్ స్ట్రీట్లో యాత్ర చిత్రాన్ని ప్రదర్శించారు. వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ కౌశిక్ మామిడి, రమణారెడ్డి, లోకేశ్ కాసు, అజయ్ ముప్పలనేని, రమేష్ బొల్ల, రమ్య యార్లగడ్డలతోపాటూ వైఎస్సార్ అభిమానులు చిత్రాన్ని వీక్షించారు. మహానేత వైఎస్సార్ను ప్రతిబింబించేలా చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని కొనియాడారు. -
భావోద్వేగాలతో సాగే చిత్రం యాత్ర : మారుతి
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘యాత్ర’. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత ప్రముఖ డైరెక్టర్ మారుతి తన అభిప్రాయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. యాత్ర నిజాయితీతో కూడిన భావోద్వేగాలతో సాగే చిత్రమని, హృదయాన్ని హత్తుకునే క్లైమాక్స్ ఉందని పేర్కొన్నారు. దివంగత మహానాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డిలా మమ్ముట్టి నటించిన తీరు, మహి వీ రాఘవ పనితీరు అద్భుతమని కొనియాడారు. మిగతా నటులు, చిత్రానికి పని చేసిన సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. మమ్ముట్టి, రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించిన యాత్ర సినిమాకు మహి వీ రాఘవ దర్శకుడు. 70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై విజయ్ చిల్లా, దేవిరెడ్డి శశి, శివ మేకలు నిర్మించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతోంది. -
‘యాత్ర’ యూనిట్కు జగన్ శుభాకాంక్షలు
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన సినిమా యాత్ర. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా ఘనవిజయం సాధించిన సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రయూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. ‘మహానేత రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వాన్ని సినిమాగా తెరకెక్కించటంలో మీరు చూపించిన అభిరుచి, అంకిత భావానికి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు’ అంటూ చిత్ర దర్శక నిర్మాతలు, నటీనటులను అభినందించారు. మమ్ముట్టి, రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించిన యాత్ర సినిమాకు మహి వీ రాఘవ దర్శకుడు. 70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై విజయ్ చిల్లా, దేవిరెడ్డి శశి, శివ మేకలు నిర్మించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్ రావటంతో చిత్రయూనిట్ హర్షం వ్యక్తం చేశారు. Congratulations @MahiVraghav @devireddyshashi @VijayChilla @ShivaMeka @mammukka & entire crew on the successful release of #Yatra.I wholeheartedly thank you & appreciate your passion & dedication in wanting to depict cinematically,the character & essence of the great leader,YSR. — YS Jagan Mohan Reddy (@ysjagan) 10 February 2019 -
గుండెల్లో నిలిచిపోయే ‘యాత్ర’
ఎటుచూసినా కరువు కాటకాలు, దుర్భరంగా ప్రజల బతుకులు. చేయడానికి పని లేదు, తినడానికి తిండి లేదు. జేబులో చిల్లిగవ్వ కరువాయె. ఇటువంటి పరిస్థితుల్లో నేనున్నానంటూ ప్రజలకు భరోసానివ్వడానికి మహానేత వైఎస్ఆర్ చేపట్టినదే ప్రజా ప్రస్థాన పాదయాత్ర. ఆ మహాఘట్టం వెండితెరపై యాత్రగా పునరావిష్కృతమై ప్రేక్షకుల నుంచి జేజేలు అందుకుంటోంది. వైఎస్ఆర్గా మలయాళ సూపర్స్టార్ మమ్ముట్టి పాత్రకు ప్రాణం పోశారని మన్ననలు పొందారు. కన్నడనాట ఈ చిత్రం బహుళ ప్రజాదరణ పొందుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం నయవంచక పరిపాలనతో విసిగిపోయిన ప్రజానీకంలో 2004 అసెంబ్లీ ఎన్నికల ముందు మహానేత దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అప్పట్లో చేపట్టిన ప్రజాప్రస్థాన యాత్ర కొత్త ఆశలు చిగురింపజేసింది. ఏపీని కొత్త అడుగులు వేయించిన ప్రజాప్రస్థాన యాత్ర, మహానేత వైఎస్ఆర్ క్షేత్ర స్థాయి నుంచి సమస్యలు తెలుసుకున్న దృశ్యాలు కళ్లకు కట్టినట్లు మలయాళ ప్రముఖ సినీ హీరో మమ్ముట్టి నటించిన ‘యాత్ర’ కన్నడనాట ప్రభంజనం సృష్టిస్తోంది. యాత్ర సినిమా బళ్లారి నగరంలోని గంగ థియేటర్లో ప్రదర్శిస్తున్నారు. సినిమా విడుదలైన శుక్రవారం మొదటి ప్రదర్శన నుంచే ప్రేక్షకులు, అభిమానులతో కిక్కిరిసింది. కదిలిన మనసులు, చెమర్చిన కళ్లు వైఎస్ఆర్ జ్ఞాపకాలను నెమరవేసుకుని ప్రేక్షకుల కళ్లు చెమర్చాయి. ప్రజాప్రస్థాన యాత్రలో ఆస్పత్రిలో గుండెజబ్బు చిన్నారి కష్టాలను వైఎస్ఆర్ చూసి వారికి చేయూత ఇచ్చేందుకు ప్రయత్నించిన దృశ్యం, అనంతరం ఆ బాలిక కన్నుమూయడం సన్నివేశం ప్రేక్షకులను కలచివేసింది. ఎన్నికల్లో ఘన విజయంతో వైఎస్ఆర్ సీఎం అయిన తర్వాత ఆరోగ్యశ్రీ నాంది పలకడానికి ఆ ఘటనే కారణమని భావిస్తారు. ప్రజాప్రస్థాన యాత్రలో వైఎస్ఆర్ కళ్లారా చూసిన సమస్యలకు సీఎం అయిన తర్వాత పరిష్కార మార్గం చూపారని ప్రేక్షకులు పేర్కొన్నారు. రెండు రోజులుగా యాత్ర సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లతో సాగుతోందని థియేటర్ యజమాని సాక్షికి తెలిపారు. యాత్ర సినిమా చూసిన ప్రేక్షకులు ఏమన్నారంటే... అందరి సమస్యలను తీర్చారు యాత్ర సినిమా కొత్త అనుభూతిని ఇచ్చింది. వైఎస్ఆర్ సుదీర్ఘ పాదయాత్రను యాత్ర సినిమాలో చూసేందుకు అవకాశం ఏర్పడింది. పాదయాత్రలో పేదల కష్టాలు తెలుసుకున్న మహానేత దివంగత ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ఆర్ ప్రతి ఒక్కరి సమస్యలను పరిష్కరించారు. ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధిని ఆయన చేసి చూపించారు. – రమేష్, బళ్లారి అద్భుతంగా ఉంది యాత్ర సినిమా అద్భుతంగా ఉంది. మహానేత దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సుదీర్ఘ ప్రజాప్రస్థాన పాదయాత్రను ఈ సినిమా ద్వారా చూసే భాగ్యం కలిగింది. అనేక సన్నివేశాలను మనసును కదిలించాయి. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సీఎం అయిన తర్వాత అమలు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనంలో చిరస్థాయిగా నిలిపోయారు. – బేసేజ్రెడ్డి, కొర్లగొంది ఆనందం, బాధ కలిగాయి వైఎస్ఆర్ ప్రజా ప్రస్థాన యాత్రను చిత్రంలో చూసిన తరువాత ఆనందంతో పాటు ఎంతో బాధ కలిగింది. కాళ్లకు బొబ్బలు వచ్చినా, సుస్తీ కలిగినా ఆపకుండా పాదయాత్ర చేయడం వల్ల ఒక్క ఆంధ్రప్రదేశ్కే కాకుండా యావత్ దేశానికి మంచి జరిగింది. వైఎస్ఆర్ సీఎం అయిన తర్వాత అమలు చేసిన పథకాలు నేడు దేశవ్యాప్తంగా అమలు అవుతున్నాయంటే అది మహానేత చలువే. – శ్రీకాంత్రెడ్డి, కొళగల్లు దేశానికే ఆదర్శం వైఎస్ఆర్ పథకాలు ప్రజాప్రస్థాన యాత్ర సినిమా ఎంతో మంచి అనుభూతిని కలిగించింది. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, విద్యార్థులకు ఫీజ్ రిఇంబర్స్ మెంట్, జలయజ్ఞం ఇలా చెప్పుకుంటే పోతే వైఎస్ఆర్ పథకాలు దేశానికి వరంగా మారిపోయాయి. అలాంటి మహానేత చేసిన ప్రజాప్రస్థాన యాత్రను మేం మళ్లీ చూసేందుకు యాత్ర సినిమా దోహదపడింది. మమ్ముట్టి ఎంతో బాగా నటించారు. యాత్ర సినిమా మళ్లీ మళ్లీ చూడాలని ఉంది. రాజకీయ నాయకుడు ఎలా ఉండాలన్నది చేసి చూపించింది ఒక్క వైఎస్సార్ మాత్రమే. – హేమారెడ్డి, కొళగల్లు వైఎస్ఆర్ అంటేనే సమ్మోహకశక్తి వైఎస్ఆర్ నిర్వహించిన ప్రజాప్రస్థాన పాదయాత్ర మేం కుటుంబం మొత్తం చూసి తరించాం. వైఎస్ఆర్ అనే మూడు అక్షరాలు సమ్మోహనశక్తి లాంటివి. వృద్ధులు పడుతున్న బాధలను తెలుసుకుని, వృద్ధాప్య పెన్షన్ను భారీగా పెంచారు. విద్యుత్ కొరతతో అల్లాడిపోతున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు ఉచిత విద్యుత్, విద్యుత్ బకాయిల రద్దు చరిత్రాత్మకం. ఇదంతా ప్రజాప్రస్థాన యాత్ర ద్వారానే సాధ్యమైంది. మహానేత పాదయాత్ర యావత్ దేశానికే మార్గదర్శకంగా మారింది. – లలితమ్మ, బళ్లారి -
‘యాత్ర’ చేసినందుకు గర్వంగా ఉంది
‘‘70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ముఖ్యోద్దేశం ప్రేక్షకులను డిఫరెంట్గా ఎంటర్టైన్ చేయడమే. ‘భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ’ ఇప్పుడు ‘యాత్ర’. ఇది పొలిటికల్ సినిమా అయినప్పటికీ పాలిటిక్స్ ఉండవు. కేవలం వైయస్సార్గారి సోల్, స్పిరిట్ను ఈ సినిమాలో చూపించాం’’ అని విజయ్ చిల్లా అన్నారు. మహీ వి. రాఘవ్ దర్శకత్వంలో వైఎస్సార్గా మమ్ముట్టి నటించిన చిత్రం ‘యాత్ర’. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు. శుక్రవారం ఈ చిత్రం రిలీజైంది. శనివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత విజయ్ చిల్లా మాట్లాడుతూ – ‘‘మహీ వి. రాఘవ్ నాకు ఈ ఐడియా చెప్పినప్పుడు కాంట్రవర్శీ ఎందుకు? అన్నాను. కానీ తను చెప్పిన సన్నివేశాలు విన్నాక సినిమా మొత్తం ఇదే ఎమోషన్తో ఉంటే చేద్దాం అనుకున్నాను. మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. చాలామంది ఫోన్ చేసి ‘పెద్దాయన్ని గుర్తు చేశారు, బరువైన హృదయంతో, చెమర్చిన కళ్లతో ప్రేక్షకులు బయటకు వస్తున్నారు’ అని అంటున్నారు. ఈ సినిమాను నిర్మించినందుకు గర్వంగా ఉంది. మా బడ్జెట్కు మంచి ఓపెనింగ్ లభించింది’’ అన్నారు. ‘‘అభిమానానికి, కళకి వెల కట్టలేము. ‘రుణం తీర్చుకోలేము స్వామి’ అని ప్రేక్షకులు అంటున్నారు. మేం కేవలం ఒక నాయకుడి కథ అనుకొని కథ చెప్పాం. ఇలాంటివి వింటుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మహా అయితే ఇంకో 4–5 సినిమాలు తీస్తానేమో కానీ ఇంత అభిమానం రాకపోవచ్చు. కలెక్షన్స్, సినిమా రేటింగ్స్ కాదు చిన్న చిన్న సన్నివేశాలు కూడా గుర్తుపెట్టుకుని అభినందిస్తుండటం సంతోషంగా ఉంది. మనం అన్నింటినీ అంకెల్లో చూడటానికి అలవాటు పడ్డాం. ఈ అంకెల్లో కొలవడం మనం ఆపేయాలి. వరంగల్, నల్గొండ ప్రాంతాల నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. ఒక నాయకుడిని ఇంత అభిమానిస్తున్నారా? అనుకున్నాను. భయమేసింది. ఇది తెలిసి ఉంటే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేవాణ్ని కాదేమో. ‘మాతృదేవోభవ’ సినిమా చూసి ఏడ్చాం. మళ్లీ ‘పితృదేవోభవ’ సినిమా చూపించి ఏడిపిస్తున్నారండీ అని అంటున్నారు. 2–3 సన్నివేశాల తర్వాత మమ్ముట్టిగారు ప్రేక్షకుడిని కచ్చితంగా సినిమాలోకి తీసుకెళ్తారని నమ్మాం. రెస్పాన్స్ అలానే ఉంది’’ అని మహీ వి. రాఘవ్ అన్నారు. ‘‘యాత్ర’లో కేవీపిగారి పాత్ర పోషించాను. ‘విలేజ్లో వినాయకుడు’కు మహీ నిర్మాతగా చేశారు. అప్పుడు తెలియలేదు కానీ అతని డైరెక్షన్ అద్భుతంగా ఉంది. సినిమా చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. గొప్ప నాయకుడి కథ చెప్పేటప్పుడు కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ చెప్పడం కుదరదు. పాదయాత్రే ఉంది. రాజకీయాల గురించి చెడుగా చెబుతారు. కానీ సినిమా చూస్తుంటే ఎంతో గౌరవంగా ఉంది. ఇంటిని సెట్ చేసుకోవడానికే చాలా సమయం పడుతుంది. ఇంతమందికి సహాయపడాలంటే నాయకులకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు. వైయస్గారి పాత్ర తాలూకు బరువు మోయాలంటే కష్టం. కానీ మమ్ముట్టిగారు దాన్ని భూజాన మోసిన విధానం గ్రేట్. ఆలోచింపజేసేంత గొప్ప సినిమా ఇది. స్క్రీన్ మీద మమ్ముట్టిగారు, నాకూ మధ్య ఉన్న కెమిస్ట్రీ చూస్తే ముచ్చటేసింది’’ అన్నారు రావు రమేశ్. -
‘యాత్ర’ ప్రేక్షకాదరణ పట్ల జగనన్న సంతోషం వ్యక్తం చేశారు
-
యాత్ర ప్రతి ఒక్కరిని కదిలించే చిత్రం : రావు రమేశ్
సాక్షి, హైదరాబాద్ : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి హిట్టాక్తో దూసుకుపోతుంది. ఈ చిత్రంలో మహానేత వైఎస్సార్ పాత్రకు మమ్ముట్టి ప్రాణం పోస్తే కేవీపీ పాత్రలో రావురమేశ్ ఒదిగిపోయారు. ఈ సినిమాకు వస్తున్న ప్రేక్షకాదరణపై రావు రమేశ్ స్పందించారు. సినిమా చూసిన తర్వాత రాత్రంతా ఆ మహానేత ఆలోచనలేనని తన సంతోషాన్ని పంచుకున్నారు. ‘ఈ చిత్రాన్ని ఇంత అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు మహి రాఘవకు అభినందనలు. ఓ మహా నాయకుడు సినిమా.. ఎలాంటి సున్నితమైన అంశాల జోలికి పోకుండా చిత్రాన్ని అద్భుతంగా తీశాడు. సినిమా చూసి రాత్రంతా ఆ మహానేత గురించే ఆలోచించాను. సినిమాలోని ప్రతీ సీన్ను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రతి ఒక్కరి అంతరాత్మను తాకే సినిమా ఇది. ముఖ్యంగా యాత్రలో భాగంగా వచ్చే ప్రతి సీన్ మనస్సును కదిలించేలా ఉంది. ఓ రైతు పండించిన టమాటాలు అమ్ముకోలేకపోవడం.. కనీసం చార్జీలు ఇవ్వలేని పరిస్థితి, వైద్యం అందక ఓ అమ్మాయి చనిపోయే సీన్స్ చూస్తే చాలా సిగ్గేసింది. ఇన్ని కష్టాలను చూసి ఆ మహానేత వారికి భరోసా కల్పించి.. వారికిచ్చిన హామీలను నెరవేర్చడం చాలా గొప్ప విషయం. మహానాయకుడి పాత్రలో మమ్ముట్టిగారు ఒదిగిపోయారు. ప్రతి సీన్ను ఆయన మోసిన విధానం అద్భుతం. మహీ తీసిన విధానం, మ్యూజిక్, సిరివెన్నల సీతారమశాస్త్రి ‘పల్లెల్లో కళ ఉంది.. పంటల్లో కలిముంది’ అనే లిరిక్స్ కదిలించాయి. రోజు పేపర్లో రైతుల ఆత్మహత్యలు చూసి మొండిగా తయారయ్యాం. ఎలాంటి సమాజంలో బతుకుతున్నామా? అని ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే మంచి సినిమా. ఈ అనుభూతిని వర్ణించలేను. ఈ సినిమాలో కేవీపీ పాత్ర చేయడం చాలా ఆనందంగా ఉంది. తెల్లబట్టలేసుకుని ఏదో చేశా అనుకున్నా కానీ.. నిన్న చూసిన తర్వాత నా ప్రాతను చూసి ఆస్వాదించాను. చాలా తృప్తినిచ్చిన పాత్ర. ఈ పాత్ర ఇచ్చినందుకు డైరక్టర్, నిర్మాతలకు ధన్యవాదాలు’ అని తన అనుభూతి పంచుకున్నారు. -
సినిమా చూసిన తర్వాత ఆ మహానేత ఆలోచనలే
-
వైఎస్ జగన్ను కలిసిన ‘యాత్ర’ టీమ్
-
వైఎస్ జగన్ను కలిసిన ‘యాత్ర’ టీమ్
సాక్షి, హైదరాబాద్ : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తొలి షో నుంచే సినిమాకు విశేష ప్రేక్షకాదరణ లభించడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో యాత్ర టీమ్ శనివారం ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసింది. చిత్ర దర్శకుడు మహి వి రాఘవ, నిర్మాత విజయ్ చల్లాలు వైఎస్ జగన్ను కలిసారు. ఈ భేటీ అనంతరం దర్శకుడు రాఘవ మీడియాతో మాట్లాడారు. సినిమాకు వచ్చిన హిట్ టాక్ గురించి వైఎస్ జగన్ అడిగి తెలుసుకున్నారని, చిత్రంపై వస్తున్న ప్రేక్షకాదరణ పట్ల సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. జనాలు ఫోన్ చేసి చిత్రంపై ఫీడ్బ్యాక్ ఇస్తుంటే తనకు మాటలు రావడం లేదని ఆనందం వ్యక్తం చేశారు. (గర్వంగా ఉంది : ‘యాత్ర’ దర్శకుడు) ఇక సినిమా చూసిన ప్రతి ఒక్కరూ రాజన్నను గుర్తుకు తెచ్చుకుని.. నాటి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయామని..‘యాత్ర’ సినిమా కాదు.. మహానాయకుడి జీవితం.. రాజన్న వ్యక్తిత్వానికి నిలువుటద్దం.. ఇచ్చిన మాటకు కట్టుబడేందుకు ఎంత దూరమైన వెళ్లేందుకు సిద్దమయ్యే రాజన్న తెగువ, ధైర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించారని, సినిమా చూస్తున్నంత సేపు రాజన్నను చూస్తున్నట్టే ఉందని రాజన్నకు యాత్ర ఘన నివాళి అంటూ సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు. (చదవండి: ‘యాత్ర’ మూవీ రివ్యూ) -
చెన్నైలోనూ ‘యాత్ర’కు బ్రహ్మారథం
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆదారంగా తెరకెక్కిన యాత్ర సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తెలుగుతో పాటు తమిళ, మళయాల భాషల్లోనూ ఒకేసారి విడుదలైంది. ఈ సందర్భంగా చెన్నైలోని వైఎస్ఆర్ అభిమానులు థియేటర్లలో సంబరాలు చేసుకున్నారు. చెన్నైలోని 13 థియేటర్లలో యాత్ర రిలీజ్ కాగా ప్రతీ థియేటర్లోనూ పండుగ వాతావరణం కనిపించింది. (‘సినిమా చూస్తున్నంతసేపు గుండె బరువెక్కింది’) ఈ చిత్రం తమ మహానేత ఇంకా మా గుండెల్లో కొలువై ఉన్నాడని నిరూపించిందని అభిమానులు కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు. వైఎస్ఆర్ పాదయాత్ర ద్వారా దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించి తనదైన బాణిలో బడుగు బలహీర వర్గాలకు దేవుడిగా నిలిచిన తీరు సినిమాలో కళ్లకుకట్టినట్టుందన్నారు. చెన్నైలోని మాయాజాల్, ఏజీఎస్, పాలాజ్జో మల్టీప్లెక్స్ లతోపాటు వివిధ ప్రాంతాల్లో థియేటర్లలో యాత్ర తెలుగు వెర్షన్ విడుదలైంది. (చదవండి : ‘యాత్ర’ మూవీ రివ్యూ) దీంతో ఆయా థియేటర్ల ముందు అభిమానులు బారులు తీరీ జోహార్ వైఎస్ఆర్ అంటూ తమ మహానేత తలుచుకుంటున్నారు. పార్టీలకు అతీతంగా ప్రేక్షకులు సినిమా చూసి వైఎస్ఆర్ గొప్ప హృదయాన్ని ప్రశంసిస్తున్నారు. ఇక వివిధ కళాశాలలు, సత్యభామ, ఎస్ఆర్ఎం విద్యావిద్యాలయాలా విద్యార్ధులు జయహో వైఎస్సార్ అంటూ యాత్ర సినిమా కోసం చేస్తున్న సందడి చెన్నై నగరంలోని తెలుగు వారిలో వైఎస్ఆర్ పట్ల ఉన్న అభిమానాన్ని గుర్తు చేస్తోంది. -
యాత్ర సినిమా టికెట్లు పంపిణీ చేసిన అభిమాని
చిల్పూరు: యాత్ర సినిమా విడుదల సందర్భంగా స్టేషన్ఘన్పూర్ మండల కేంద్రానికి చెందిన వైఎస్ఆర్ అభిమాని కల్లూరి శరత్ శుక్రవారం 150 టికెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత మహానేత వైఎస్ఆర్ అంటే అభిమానమని తెలిపారు. యాత్ర సినిమా విడుదల సందర్భంగా తన శక్తి మేరకు ఉచితంగా సినిమా టికెట్లను పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సినిమాను తిలకించి ఆదరించాలన్నారు. -
జైత్ర యాత్ర
-
లాస్ ఏంజిల్స్లో వైఎస్సార్ అభిమానుల సందడి
లాస్ ఏంజిల్స్ : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర కథాంశంగా నిర్మించిన ‘యాత్ర’ సినిమా రిలీజ్ వేడుకలు శుక్రవారం విదేశాల్లో ఘనంగా జరిగాయి. ఏంజిల్స్లో జరిగిన సినిమా వేడుకల్లో పెద్ద ఎత్తున వైఎస్సార్, మమ్ముట్టీ అభిమానులు పాల్గొన్నారు. ఏంజిల్స్లోని సినిమార్క్ సెంచరీ థియేటర్స్లో యాత్ర ప్రీమియర్ ఫ్యాన్ షోకు తెల్ల షర్టులు, పంచకట్టుతో అభిమానులు సినిమాకు వచ్చి వైఎస్సార్ని గుర్తు చేసుకున్నారు. డ్రమ్స్, డ్యాన్సులతో థియేటర్ వద్ద సంబరాలు చేసుకున్నారు. థియేటర్లో భారీ కటౌట్ను పెట్టారు. సినిమాను చూసి సీఎంగా వైఎస్సార్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. -
గర్వంగా ఉంది : ‘యాత్ర’ దర్శకుడు
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథా ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచి సినిమాకు సూపర్ హిట్ టాక్ రావటంతో చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యాత్ర దర్శకుడు మహి వీ రాఘవ్ సినిమాకు ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, వైఎస్ఆర్ అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.(చదవండి : ‘యాత్ర’ మూవీ రివ్యూ) ‘ఈ కథ, రాజశేఖర్ రెడ్డిగారు, ఆయన అభిమానులు, ఫాలోవర్స్ పట్ల నాకు ఎంతో కృతజ్ఞత ఉంది. నా దృష్టిలో ఒక వ్యక్తికి ఇచ్చే అత్యుత్తమ గౌరవం కృతజ్ఞత చూపించటమే. నా మీద ఇంత ప్రేమ చూపిస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులు, వైఎస్ఆర్ అభిమానులకు నా నమస్కారాలు. ఇంత గొప్ప కథ చెప్పే అవకాశం కలిగించిన సినిమారంగానికి నా ధన్యవాదాలు. విమర్శలను కూడా నేను గౌరవిస్తాను. కానీ నేను నమ్మి చేసిన కథ విషయంలో ఎవరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదని భావిస్తున్నా. యాత్ర లాంటి సినిమా చేయటం ఎప్పటికీ గౌరవంగానే భావిస్తా. వైఎస్ఆర్ కథ చెప్పాల్సిన అవసరం ఉందని నేను భావించాను. అందుకే ఈ సినిమా చేశా. ఇది వైఎస్ఆర్గారికి నేనిచ్చిన నివాళి. ఎంతో దాతృత్వం, వినయం, కరుణ, ధైర్యం, విశ్వసనీయత ఉన్న ఆయన్ను కేవలం మా నాయకుడు అని చెప్పటం చాలా చిన్న మాట’ అంటూ తన ఆనందాన్ని కృతజ్ఞతను అభిమానులతో పంచుకున్నారు. -
హ్యూస్టన్లో 'యాత్ర' సంబరాలు
-
హ్యూస్టన్లో 'యాత్ర' సంబరాలు
హ్యూస్టన్ : మమ్ముట్టి లీడ్ రోల్లో మహి వి. రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’.. శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర చుట్టూ సాగే ఈ ‘యాత్ర’ ఆయన అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. యాత్ర చిత్ర విడుదల సందర్భంగా హ్యూస్టన్లో 200 కార్లతో వైఎస్సార్ అభిమానులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున పాల్గొని కేటీలోని సినేమార్క్ థియేటర్లో యాత్ర చ్రిత విడుదలను సంబరంగా జరుపుకున్నారు. సినిమా అయిపోయిన తరువాత అందరు ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఈ సందర్బంగా వారు చిత్ర దర్శకునికి, నిర్మాతలకు, చిత్రానికి పని చేసిన సాంకేతిక నిపుణులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. యాత్ర చిత్రాన్ని రాజకీయాలతో ముడిపెట్టకూడదని, ఒక మనిషి మాట ఇచ్చిన తర్వాత ఎంత వరకైనా వెళ్లగలను అనడానికి వైఎస్సార్ ఒక గొప్ప ఉదాహరణ అని కొనియాడారు. ఈ వేడుకల్లో సుమారు 300 మంది వైఎస్సార్ అభిమానులు పాల్గొని యాత్ర కేక్ కట్ చేశారు. జోహార్ వైఎస్సార్, జై జగన్ నినాదాలతో థియేటర్ మొత్తాన్ని హోరెతించారు. సినిమా విజయవంతం అయినందుకు అభిమానులు సంబరాలు చేసుకున్నారు. సినిమాకి వచ్చిన అందరికి డిస్ట్రిబ్యూటర్ రఘువీర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు . -
యాత్ర ఫలించింది
నేను విన్నాను.. నేను ఉన్నాను.మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాలేజ్ యాజమాన్యాన్ని కలవమను.. రాకుంటే నన్ను కలవమను.దేశ భద్రత ముఖ్యమే.. కానీ ఆహార భద్రతా అంతే ముఖ్యం.కడప దాటి ప్రతి గడపకూ వెళ్లాలనుంది. ప్రజల గుండె చప్పుడు వినాలనుంది.మంచిమనసున్న మనుషులున్నప్పుడు ముహూర్తాలతో పని ఏముంది.నా సహనాన్ని అసమర్థత అనుకోకండి.. నేను పార్టీకి విధేయుణ్ని మాత్రమే... బానిసను కాదు.ఒక కార్డు ఇస్తాను.. ఆ కార్డుతో ఎంత పెద్ద ఆస్పత్రిలో అయినా రూపాయి కూడా చెల్లించకుండా వైద్యం పొందొచ్చు.ఇవాళ రైతు పరిస్థితి ఎలా ఉందంటే ఆర్నెల్లు కష్టపడి సోనా మసూరి బియ్యం పండించినా రేషన్ బియ్యం తింటున్నారు.మన గడప తొక్కి సాయం అడిగిన ఆడబిడ్డతో రాజకీయం ఏందిరా... వంటి అర్థవంతమైన, ఎమోషనల్ డైలాగ్స్తో సాగే ‘యాత్ర’ సూటిగా జనాల హృదయాలను తాకే విధంగా ఉంది. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జనం గురించి ఎంతలా ఆలోచించారో చెప్పే ఈ సంభాషణలు ఆయన వ్యక్తిత్వానికి అద్దం పట్టాయి. మమ్ముట్టి లీడ్ రోల్లో మహి వి. రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. వైఎస్ చేసిన పాదయాత్ర చుట్టూ సాగే ఈ ‘యాత్ర’ ఎలా ఉందో తెలుసుకుందాం. కథ ఏంటంటే... మనం ఇన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్నా ఎందుకు అధికారం చేపట్టలేకపోతున్నాం అంటే.. నాయకుడిగా మనకు ఏం కావాలో తెలుసుకున్నాం కానీ, ప్రజలకు ఏం కావాలో తెలుసుకోలేకపోయాం అంటూ స్వీయ ఆత్మ పరిశీలన నుంచి సినిమాలో వైఎస్సార్ పాదయాత్ర మొదలవుతుంది. ఈ యాత్రలో పంటలకు గిట్టుబాటు ధర దొరక్క ఓ రైతు చేసే ఆత్మహత్యాయత్నం, పేదరికంతో వైద్యం చేయించలేక ఓ కన్నతల్లి తన బిడ్డను కోల్పోవడం, పై చదువులు చదవాలని ఉన్నా ఆర్థిక ఇబ్బందులతో అల్లాడే ఓ విద్యార్థి వేదన.. వంటివి వైఎస్ మనసుని కలచివేస్తాయి. ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ వైఎస్ ఇచ్చే భరోసా ప్రజల్లో ఓ నమ్మకాన్ని కలిగిస్తుంది. అదే వైఎస్ గెలుపునకు కారణం అవుతుంది. ప్రజల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయి కష్టాల్లో ఉన్న పార్టీని వైఎస్ తన పట్టుదలతో విజయ తీరాలకు చేర్చుతారు. ‘మాట ఇచ్చేటప్పుడు ఆలోచించాలి.. ఇచ్చాక ఇక ఆలోచించేదేముంది.. ముందుకెళ్లాల్సిందే’ అని అన్నట్టుగానే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాక రైతులకు ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం పెడతారు. నిజ జీవితంలో మాట ఇస్తే వెనక్కి తగ్గని వైఎస్ వ్యక్తిత్వాన్ని కళ్లకు కట్టినట్టుగా వెండితెరపై ఆవిష్కరించిన చిత్రం ‘యాత్ర’. వైస్సార్ పాత్రకు మమ్ముట్టి తప్ప వేరే ఎవరూ సూట్ కారు అనేలా ఆయన అద్భుతంగా నటించారు. ఆయన బాడీ లాంగ్వేజ్ వైఎస్సార్ని తలపించింది. చివరికి డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్గా చెప్పారు. సినిమా అంతా ఒక ఎత్తయితే క్లైమాక్స్లో వచ్చే వైఎస్సార్ రియల్ ఫుటేజ్ మరో ఎత్తు. బరువెక్కిన హృదయంతో ఆ మహానేతను మరోమారు తలచుకుంటూ ప్రేక్షకులు థియేటర్స్ నుంచి బయటికి రావడం కనిపిస్తుంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుండటంతో ఏడాదిన్నరగా యూనిట్ పడ్డ కష్టం ఫలించింది. వైఎస్ రాజశేఖర రెడ్డిని, ఆయన ఇమేజ్ని క్యాప్చర్ చేయడం అంత సులువైన విషయం కాదు. ఎన్నో కోణాలు ఉన్న నాయకుడు. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ఆహార్యం, ఆయనలో ఉండే ఎనర్జీ, ఆయన్ని చూడగానే ఆకర్షితులయ్యే గుణం... ఇవన్నీ ఓ వైపు ఉన్నా, ఆయన హృదయం ఎలాంటిదో, ఆయన సిద్ధాంతాలు ఎలాంటివో అవే పెద్దకథ చెప్పాయి. రాజశేఖర రెడ్డిని ప్రేమించని వాళ్లు, ఆయన గురించి తెలియని వాళ్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో లేరనే చెప్పాలి. ఆయన జీవితకాలంలో చేసిన మంచి పనుల్లో ఎంతోమంది లాభపడ్డారు. అంతటి మహానుభావుణ్ని, మహానేతను 2 గంటల నిడివిలో చూపించడం చాలా కష్టం. అందుకనే ‘మరో ప్రస్థానం’ పేరుతో సాగిన ఆయన పాదయాత్రని మహి వి.రాఘవ్ తీసుకోవడం వల్ల ఆయన జీవితంలోని కొన్ని కోణాలను ఆవిష్కృతం చేసుకునే అవకాశం దొరికింది. అదే కాకుండా నిజమైన సంఘటనల్లోనే అందమైన కథలు దొరికాయి. కథలు రాసుకొని బయోపిక్ని ప్రెజెంట్ చేయడం వేరు.. బయోపిక్ని చూసి దాంట్లో కథని వెతుక్కుంటూ సన్నివేశాలు రాసుకోవడం మరో ఎత్తు. అది కూడా ఒక మహానుభావుని యాత్ర.. ఒకటి మనకు స్ఫూర్తిని కలిగించాలి.. రెండు ఇతర నాయకులకు ఒక దిశానిర్దేశం కావాలి. యాత్ర ఒక మనిషిది కాదు.. ఒక మహానుభావుడిది మాత్రమే కాదు.. యాత్ర ఒక సమాజానిది. ఇప్పుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేసుకుని ఎంతో ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. సమాజం మళ్లీ ఒక్కసారి వైఎస్ స్మృతులను నెమరు వేసుకోవడం చాలా అందమైన అనుభవం. సహజత్వానికి దూరం పోకుండా నిజాయతీగా తీసిన సినిమా ‘యాత్ర’. తక్కువ పదాల్లో ఎక్కువ చెప్పిన మహీ ప్రయోగం బాగుంది. ఎంత ఖర్చయినా పర్వాలేదు ఓ మహా యోధుడిని సమాజానికి చూపించాలనే ఆకాంక్ష నిర్మాతలు విజయ్, శశిలది. బయోపిక్స్ అధ్యాయం నడుస్తున్న సమయంలో రెపరెపలాడే జెండా ఈ ‘యాత్ర’. -
‘తన కథను చెప్పమని.. ఆయనే నన్ను ఎంచుకున్నాడు’
వెండితెరపై బయోపిక్లు అన్నివేళలా విజయాన్ని చేకూర్చలేవు. ఈ సంగతి అందరికీ తెలిసిందే. కథలో అందర్నీ ఆకర్షించగలిగే అంశాలు, మనసుల్ని కట్టిపడేసే కథనం ఉండాలి.. అంతేకానీ ఆర్భాటాలకు పోయి సినిమాను తెరకెక్కిస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందో కూడా చూశాం. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ప్రేక్షకుల గుండెను బరువెక్కేలా, కన్నీటిని కార్చేలా చేసిన ‘యాత్ర’ సినిమా పాజిటివ్ టాక్తో సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తున్న సందర్భంగా.. చిత్ర దర్శకుడు మహి వి రాఘవ్, నిర్మాత విజయ్ చిల్లా ‘సాక్షి’తో పంచుకున్న విషయాలు.. తాను యాత్రకు సంబంధించిన రిపోర్ట్ను ఉదయం నాలుగు గంటలకు యూఎస్ నుంచి విన్నానని.. ఓ అభిమాని ఫోన్చేసి చాలా బాగుందని చెప్పాడని తెలిపాడు. ఆనందో బ్రహ్మ సమయంలో.. ఈ మధ్య కాలంలో ఇలా ఓ సినిమా చూసి ఇంత సేపు నవ్వేలా చేశారని ప్రేక్షకులు తనతో అన్నారని.. మళ్లీ ‘యాత్ర’కు వచ్చేసరికి చాలా ఏడిపించారని చెబుతున్నారని అన్నారు. చప్పట్లు కొట్టించే సన్నివేశాల కన్నా.. కన్నీళ్లు తెప్పించే సీన్సే ఎక్కువగా గుర్తుంటాయని, అవే ప్రేక్షకులు ఇంటికి తీసుకెళ్తారని, హాస్పిటల్లో చిన్నపాప సీన్, రైతు సీన్ అందరికీ నచ్చుతుందని అన్నారు. ఈ చిత్రాన్ని పోస్ట్ప్రొడక్షన్లో చాలా సార్లు చూశానని.. థియేటర్లో ప్రేక్షకుల మధ్య కూర్చొని చూస్తే తాను నోటీస్ చేయని సన్నివేశాలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పుకొచ్చారు. తాను రాసిన మాటలకు కూడా మంచి స్పందన వచ్చిందని తెలిపారు. తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఎప్పుడూ కలవలేదని, ఆయనే తన కథను చెప్పమని తనను ఎంచుకున్నాడేమోనని అన్నారు. ప్రతీ వ్యక్తికి వైఎస్సార్తో అనుబంధం ఉంటుందని.. భారతదేశంలో రాజకీయ నాయకులను నమ్మడమనేది అరుదుగా చూస్తామని.. ఆ వ్యక్తి గురించి మంచిగా మాట్లాడటం..చనిపోయి ఇంతకాలమైనా..ఆ వ్యక్తిని ఇంకా గుర్తు పెట్టుకున్నారంటే.. ఏదో కథ ఉందని ఓ దర్శకుడిగా తనకు అనిపించిందని చెప్పుకొచ్చారు. -
విజయ యాత్ర
-
‘సినిమా చూస్తున్నంతసేపు గుండె బరువెక్కింది’
సాక్షి, అమరావతి: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరెడ్డి జీవితంలో మహోజ్వల ఘట్టంగా నిలిచిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా ప్రజల హృదయాలను హత్తుకునేలా ఉందని వైఎస్సార్ సీపీ నాయకుడు పేర్ని నాని అన్నారు. సినిమా చూస్తున్నంతసేపు గుండె బరువెక్కిందని, భావోద్వేగానికి లోనయ్యానని చెప్పారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని సిరి వెంకట్ ధియేటర్లో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఆయన సినిమా చూశారు. ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి.. తిరువూరు వెంకట్రామ ధియేటర్లో యాత్ర సినిమా వీక్షించారు. కన్నీరు పెట్టుకున్న ద్వారంపూడి వైఎస్సార్ సీపీ కాకినాడ నగర సమన్వయకర్త ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సమేతంగా యాత్ర సినిమాను చూశారు. ఈ చిత్రం తనను కదిలించిందని ఈ సందర్భంగా చెప్పారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డిని తలచుకుని మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు. (‘యాత్ర’ మూవీ రివ్యూ) రాజన్నను కళ్లకు కట్టారు వైఎస్ రాజశేఖరెడ్డి పాత్రను కళ్లకు కట్టినట్టుగా చూపించారని వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ కన్వీనర్ తానేటి వనిత వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు అనన్య థియేటర్లో కార్యకర్తలతో కలిసి యాత్ర సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాజన్న రాజసం చక్కగా సినిమాలో చూపించారని ప్రశంసించారు. బైక్ ర్యాలీల జోరు యాత్ర సినిమా విడుదల సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లాలో పలుచోట్ల వైఎస్సార్ సీపీ నాయకులు బైక్ ర్యాలీలు నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గ సమన్వయకర్త పీవీఎల్ నరసింహరాజు, తణుకు నియోజకవర్గ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు బైక్ ర్యాలీలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలో కేక్ కట్ చేసి నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో మండవల్లి సోంబాబు, బీవీఆర్ చౌదరి, పీపీఎన్ చందర్రావు, పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. అనకాపల్లిలో... విశాఖ జిల్లా అనకాపల్లి షిర్డీసాయి ధియేటర్లో యాత్ర సినిమాను వైఎస్సార్ సీపీ నాయకులు వీక్షించారు. కేక్ కట్ చేసి అభిమానులు సందడి చేశారు. మళ్ల బుల్లిబాబు, జానకిరామరాజు, జాజుల రమేష్, కొణతాల మురళి కృష్ణ, శ్రీధర్ రాజు, గొల్లవిల్లి శ్రీనివాసరావు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
రాజన్నను గుర్తు చేసిన మమ్ముట్టి!
సాక్షి, నెల్లూరు : కావలిలోని లత థియేటర్ లో యాత్ర సినిమా విడుదల సందర్భంగా కేక్ కట్ చేసిన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, కేతిరెడ్డి రామకోటా రెడ్డి, జగదీష్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. యాత్రకు ప్రజల నుంచి విశేషమైన స్పందన రావడం ఆనందంగా ఉందని ఎంపీ మేకపాటి అన్నారు. ఆయన మీడియా మాట్లాడుతూ.. వై.ఎస్.ఆర్ పాలనతో ప్రజలను మెప్పించారని.. వైఎస్సార్పై సినిమా అంటేనే ప్రజలంతా ఆసక్తిని కనబరిచారని, ఆయన తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. పాదయాత్రతో ప్రజా సమస్యలను తెలుసుకుని చరిత్ర సృష్టించారని కొనియాడారు. యాత్ర సినిమాలో మమ్ముట్టి బాగా నటించారని అన్నారు. నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి సందడి చేశారు. యాత్ర పాజిటివ్ టాక్తో దూసుకుపోతూ ఉండటంతో.. వైఎస్సార్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. -
ట్రెండింగ్ : ‘యాత్ర’ బ్లాక్ బస్టర్ హిట్
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఘట్టాన్ని వెండితెరపై యాత్ర పేరుతో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. సాంగ్స్, టీజర్స్, పోస్టర్స్తో ఈ మూవీ అంచనాలను మించిపోయింది. నేడు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా పాజిటివ్ టాక్తో దూసుకుపోతూ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. ఇక ఈ సినిమాపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. చూసిన ప్రతి ఒక్కరూ రాజన్నను గుర్తుకు తెచ్చుకుని.. నాటి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయామని..‘యాత్ర’ సినిమా కాదు.. మహానాయకుడి జీవితం.. రాజన్న వ్యక్తిత్వానికి నిలువుటద్దం.. ఇచ్చిన మాటకు కట్టుబడేందుకు ఎంత దూరమైన వెళ్లేందుకు సిద్దమయ్యే రాజన్న తెగువ, ధైర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించారని, సినిమా చూస్తున్నంత సేపు రాజన్నను చూస్తున్నట్టే ఉందని రాజన్నకు యాత్ర ఘన నివాళి అంటూ సినిమాపై కామెంట్స్ చేస్తున్నారు. (‘యాత్ర’ మూవీ రివ్యూ) విడుదల అన్ని కేంద్రాల్లో వైఎస్ఆర్ అభిమానులు సందడి చేస్తున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ రాగా.. బ్లాక్ బస్టర్ హిట్ అంటూ వారంతా సంబరాలు చేసుకుంటున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన స్పీచ్తో అందరినీ కంటతడి పెట్టించిన అసిస్టెంట్ డైరెక్టర్ వైఎస్ చిత్ర పటానికి పూల మాల వేస్తూ తన అభిమానాన్ని చాటుకున్నారు. చదవండి : ‘యాత్ర’ మూవీ రివ్యూ (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘యాత్ర’ చంద్రబాబుకు చూపించాలి’
-
నార్త్ కెరోలినాలో ‘యాత్ర’ ప్రీ రిలీజ్ ఈవెంట్
నార్త్కెరోలినా : దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చేపట్టిన పాదయాత్ర ఆధారంగా ’యాత్ర’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మళయాళ మెగా స్టార్ మమ్ముట్టి రాజన్న పాత్రలో నటించారు. వైఎస్సార్సీపీ రాలీ చాప్టర్ ఆధ్వర్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏంతో ఆర్భాటంగా జరిగింది. యాత్ర సినిమా శ్రేయోభిలాషులు, వైఎస్ఆర్ అభిమానులు ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఎంతో అట్టహాసంగా నిర్వహించారు. ఎంతో మంది వైఎస్సార్ అభిమానులు హాజరైన ఈ ఈవెంట్లో ఆయన చేపట్టిన ఎన్నో మంచి కార్యక్రమాలు, అంకురార్పణం చేసిన పధకాల గురించి వివరించారు. భారతదేశంలో జరుగుతున్న ‘యాత్ర’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు హజరు కాలేక పోతున్నామన్న వెలితిని ఇక్కడ ప్రవాస ఆంధ్రులు తమ శైలిలో ఈవెంట్ను ఆర్గనైజ్ చేసి తమ ప్రియతమ నాయకుడు స్వర్గీయ డా|| వై ఎస్ రాజశేఖర్ రెడ్డిపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అభిమానులు యాత్ర టీషర్ట్స్ వేసుకుని తమ వంతు ఉడతా భక్తిని తెలియజేసారు. అభిమానులందరు జై వైఎస్ఆ ర్జై జగన్అని నినాదాలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ఈరోజే (ఫిబ్రవరి 8) విడుదలై మంచి టాక్ను సొంతం చేసుకుంది. రిలీజైన అన్ని చోట్లా సందడి వాతావరణం నెలకొంది. -
ప్రేక్షకుల నుంచి విశేష స్పందన
-
దుబాయ్లో ‘యాత్ర’ సందడి
-
దుబాయ్లో ‘యాత్ర’ సందడి
మహానేత వైఎస్రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన యాత్ర సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సదంర్భంగా దేశ విదేశాల్లోని వైఎస్ఆర్ అభిమానులతో థియేటర్లలో కోలాహలంగా మారాయి. దుబాయ్లో చిత్ర ప్రీమియర్ షో సందర్భంగా అక్కడి వైఎస్ఆర్సీపీ యూఏఈ వింగ్ సభ్యులు దివంగత నాయకుడు రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భముగా చంద్రబాబు పాలనను ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలు 2019లో తెలుగుదేశం పార్టీకి గుణపాఠం చెప్తారన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలను కాపీ కొట్టిన బాబు జనాలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ యూఏఈ వింగ్కు చెందిన రమేష్ రెడ్డి, సోమిరెడ్డి, రమణ, బ్రహ్మానందరెడ్డి, కోటి రెడ్డి, అక్రమ్, కుమార్ చంద్ర, కార్తిక్, రెడ్డయ్య, దిలీప్ జి రెడ్డి, నరసింహ, అమర్, వేణుగోపాల్, యస్వంత్, యాసిన్, మధు తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబుకు ‘యాత్ర’ చూపించాలి
సాక్షి, విజయవాడ : దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా చాలా బాగుందని, వైఎస్సార్ పాటించిన విలువలు, విదేయతలను తెరపై ఆవిష్కరించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకోవడం, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలు చక్కగా చూపించారని చెప్పారు. యువరాజ్ థియేటర్లో సినిమా చూసిన అనంతరం మాల్లాది విష్ణుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాజశేఖరరెడ్డి పాదయాత్ర విశేషాలను ప్రత్యేకంగా చూపించిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది తెలుగు ప్రజలంతా తప్పక చూడాల్సిన సినిమా అని పేర్కొన్నారు. ఓట్లు దండుకోవడమే పరమావధిగా ప్రజల్ని మభ్యపెట్టాలని చూసే చంద్రబాబుకు ఈ సినిమా చూపించాలని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కష్టాలు తెలుసుకుని.. అధికారంలోకి రాగానే వారి సమస్యలు పరిష్కారం కోసం అనుదినం పనిచేసిన మహానేత వైఎస్సార్ మార్గంలో మేమంతా పనిచేస్తాం’ అని మల్లాది విష్ణు అన్నారు. -
‘యాత్ర’ మూవీ రివ్యూ
టైటిల్ : యాత్ర జానర్ : బయోగ్రాఫికల్ మూవీ తారాగణం : మమ్ముట్టి, జగపతి బాబు, సుహాసిని, రావూ రమేష్, అనసూయ, పోసాని కృష్ణమురళి సంగీతం : కె దర్శకత్వం : మహి వీ రాఘవ నిర్మాత : విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్ మూవీ యాత్ర. వైఎస్ఆర్లో రాజకీయపరంగానే కాక వ్యక్తిత్వ పరంగా కూడా ఎన్నో మార్పులు తీసుకువచ్చిన ప్రజా ప్రస్థానం యాత్ర నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. దాదాపు రెండున్న దశాబ్దల తరువాత మళయాల మెగాస్టార్ మమ్ముట్టి ఈ సినిమాతో టాలీవుడ్కు రీ ఎంట్రీ ఇచ్చారు. ఇలా ఎన్నో విశేషాలతో తెరకెక్కిన యాత్ర ఎలా సాగింది..? కథ : ఇది ఈవెంట్ బేస్డ్ బయోపిక్. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర.. ఆ యాత్ర సమయంలో వైఎస్ఆర్కు ఎదురైన అనుభవాలు. వాటి వల్ల వైఎస్ వ్యక్తిత్వంలో వచ్చిన మార్పులే ఈ సినిమా కథ. వైఎస్ జీవితంలో జరిగిన సంఘటనలు చూపిస్తే ఆయన వ్యక్తిత్వాన్ని వెండితెర మీద ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయి కష్టాల్లో ఉన్న పార్టీని వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన పట్టుదలతో ఎలా విజయతీరాలకు చేర్చారు.. ఆయన పాదయాత్రకు దారి తీసిన పరిస్థితులేంటి.. పాదయాత్ర రాజశేఖర్రెడ్డి వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పులు తీసుకు వచ్చింది.. యాత్రలో ఆయనకు ఎదురైన అనుభవాలేంటి అన్నదే కథ. నటీనటులు : బయోపిక్ కావటంతో సినిమా అంతా ఒక్క రాజశేఖరరెడ్డి పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఆ పాత్రలో మమ్ముట్టి జీవించాడనే చెప్పాలి. తన నటనతో తొలి షాట్ నుంచే తెర మీద రాజన్ననే చూస్తున్నమంతగా ప్రేక్షకుడిని కథలో లీనం చేశాడు మమ్ముట్టి. రాజశేఖరరెడ్డి రాజసం, హుందాతనం, రాజకీయం, నమ్మిన వారికోసం ఎంతకైన తెగించే వ్యక్తిత్వం లాంటి విషయాలను తెర మీద అద్భుతంగా పలికించాడు. రాజారెడ్డి పాత్రలో.. కనిపించింది రెండు సన్నివేశాలే అయినా జగపతిబాబు తన మార్క్ చూపించారు. విజయమ్మ పాత్రలో ఆశ్రిత సరిగ్గా సరిపోయారు. లుక్ పరంగాను ఆమె విజయమ్మను గుర్తు చేశారు. తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా ఆమె పాత్ర గుర్తుండి పోతుంది. మరో కీలక పాత్రలో కనిపించిన రావూ రమేష్ తనదైన నటనతో కేవీపీ పాత్రకు ప్రాణం పోశాడు. తెర మీద కనిపించింది కొద్దిసేపే అయిన అనసూయ, సుహసిని, పోసాని కృష్ణమురళిలు.. వారు పోషించిన పాత్రలకు జీవం పోశారు. విశ్లేషణ : ఇది వైఎస్ రాజశేఖరరెడ్డి కథ కాదు.. ఆయన వ్యక్తిత్వం. వైఎస్ఆర్ రాజకీయం ఎలా ఉంటుంది? మాటకు, నమ్మకానికి ఆయన ఇచ్చే విలువ ఏంటి? ఆయనను నమ్ముకున్న వ్యక్తులకు ఆయనకు ఎలాంటి భరోసా ఇస్తారు? పాదయాత్రకు ముందు పాదయాత్ర తరువాత వైఎస్ఆర్లో వచ్చిన మార్పు ఏంటి? ఇలా వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యక్తిత్వాలను వెండితెర మీద ఆవిష్కరించారు. తొలి సన్నివేశం నుంచే వైఎస్ఆర్ రాజకీయం ఎలా ఉంటుందో ప్రేక్షకులకు అర్ధమయ్యేలా చూపించారు. పాదయాత్రలో ఆయన ప్రజలతో వైఎస్ఆర్ మమేకమైన తీరు, వారి కష్టాలను అవలోకనం చేసుకోవడం లాంటి అంశాలు ఆకట్టుకుంటాయి. తన ప్రత్యర్థి కూతురు ఇంటికి వచ్చి సాయం అడిగితే.. సాయం చేయద్దన్న వారితో ‘మన గడప తొక్కి సాయం అడిగిన ఆడబిడ్డతో రాజకీయం ఏందిరా’ అనే రాజన్న మాటలకు ఎవరికైనా చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. హైకమాండ్ పెద్దలు వచ్చి మీ ఒక్కరితోనే మాట్లాడలన్నప్పుడు పక్కన కేవీపీ ఉన్నా.. ‘మీరు ఇప్పుడు ఒక్కరితోనే మాట్లాడుతున్నారు’ అనటం ఆయన స్నేహానికి ఎంత విలువ ఇచ్చేవారో గుర్తు చేస్తుంది. మాట ఇచ్చేముందు ఆలోచించాలి.. ఇచ్చాక చేసేదేముంది ముందుకెళ్లాల్సిందే’ అన్న మాటల్లో ఆయన విశ్వసనీయత ఎంతటిదో అర్ధమవుతుంది. ‘నేను పార్టీకి విధేయుణ్ని మాత్రమే బానిసను కాదు’ అంటూ హైకమాండ్ పెద్దలను ఎదిరించినప్పుడు ఆయన ధైర్యం ఎలాంటిదో అర్ధమవుతుంది. మార్కెట్లో ఆత్మహత్య చేసుకోబోయిన రైతుతో ‘నేను విన్నాను.. నేనున్నాను’ అన్ని సన్నివేశం ఆయనలోని నాయకుడిని జ్ఞప్తికి తెస్తుంది. తనను నమ్ముకున్న ఓ పోలీసు కానిస్టేబుల్ తప్పు చేస్తే నాకేందుకులే అని విడిచిపెట్టుకుండా, తనకు చెడ్డ పేరువస్తుందేమో అని ఆలోచించకుండా తానే తగ్గి ‘నా కోసం అతని తప్పును పొరపాటుగా భావించి వదిలిపెట్టమనడం’ ఆయనది ఎంత పెద్ద మనసో చూపిస్తుంది. పాదయాత్ర చేవెళ్ల నుంచి ప్రారంభిస్తే అశుభమన్న పేరొస్తుందేమో అన్న సబితమ్మతో ‘మంచి మనసున్న మనుషులున్నప్పుడు ముహూర్తాలతో పని ఏముంది’ అన్నప్పుడు ఓ అన్న, చెల్లికి ఇచ్చే భరోసా కనిపిస్తుంది. ఇలా ఒక్కో సన్నివేశంతో రాజన్నలోని ఒక్కో గుణాన్ని తెర మీద చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. గ్రామంలోని ఓ ఇంట్లో భోజనం చేయటం, హస్పిటల్లో వైఎస్ఆర్ కళ్ల ముందే ఓ చిన్నారి ప్రాణాలొదలటం, మార్కెట్లో ఆత్మహత్య చేసుకోబోయిన రైతుతో వైఎస్ఆర్ మాట్లాడటం లాంటి సీన్స్ గుండె బరువెక్కేలా చేస్తాయి. రెగ్యులర్ బయోపిక్లా కేవలం కథ చెప్పే ప్రయత్నం చేయలేదు దర్శకుడు మహి వీ రాఘవ. సినిమా తొలి సన్నివేశం నుంచే ప్రేక్షకుడిని కథలో లీనం చేసి రాజన్నతో ప్రయాణం చేసేలా చేశాడు. ప్రతీ ప్రేక్షకుణ్ని పాదయాత్రలో భాగం చేశాడు. అప్పటి రాజకీయ, సామాజిక పరిస్థితులను కళ్లకు కట్టినట్టుగా చూపించాడు. అక్కడక్కడ పొలిటికల్ సెటైర్లు కూడా బాగా పేలాయి. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర పెద్దల ఆహార్యం, వారి డైలాగ్స్ సినిమాకు కామెడీ టచ్ ఇచ్చాయి. ఇక అప్పటి సంఘటనలకు తగ్గట్టుగా ‘బ్రీఫ్డ్ మీ’ డైలాగ్ను జోడించిన సన్నివేశం నవ్వులు పూయించింది. కె అందించిన పాటలు, నేపథ్య సంగీతం ప్రతీ సన్నివేశాన్ని ప్రేక్షకుడికి మరింత దగ్గర చేశాయి. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, సత్యన్ సూరన్ సినిమాటోగ్రఫి ఆకట్టుకుంటాయి. సినిమాకు మరో ప్రధాన బలం సిరివెన్నెల సీతారామశాస్త్రీ అందించిన సాహిత్యం. ఆయన అందించిన పాటలు వైఎస్ వ్యక్తిత్వాన్ని అక్షరాల్లో ఆవిష్కరించాయి. చివర్లో వచ్చే పెంచల్దాస్ పాట ప్రతీ ప్రేక్షకుడిని కంటతడిపెట్టిస్తుంది. సినిమా అంతా ఒక ఎత్తైయితే క్లైమాక్స్లో వచ్చే వైఎస్ రాజశేఖర్రెడ్డి సీన్స్ మరో ఎత్తు. అప్పటి వరకు వైఎస్ఆర్ గొప్పతనాన్ని తెలుసుకొని ఉప్పొంగిపోయిన ప్రేక్షకులను చివర్లో చూపించే రియల్ ఫుటేజ్ కదిలిస్తుంది. మరోసారి ఆ చీకటి రోజును గుర్తుచేస్తుంది. యాత్ర తెలుగు రాజకీయాలను మలుపు తిప్పిన ఓ మహత్తర ఘట్టానికి సాక్ష్యం. ఓ మహానాయకుడి వ్యక్తిత్వానికి వెండితెర రూపం. సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
ప్రజల హృదయాలకు హత్తుకునేలా ‘యాత్ర’
సాక్షి, ఏలూరు: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చరిత్రాత్మక పాదయాత్ర నేపథ్యంతో తెరకెక్కిన సినిమా యాత్ర.. మలయాళ మెగాస్టార్ మమ్మూటి వైఎస్సార్ పాత్రలో నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రజల హృదయాలను హత్తుకునేలా ఈ సినిమా ఉందని సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా తడికలపూడిలో వైఎస్సార్సీపీ నేత కొఠారు అబ్బయ్య చౌదరి, చింతలపూడిలో ఆ పార్టీ నాయకుడు వీఆర్ ఎలీజా వైఎస్సార్ అభిమానులు, పార్టీ కార్యలర్తలతో కలిసి ‘యాత్ర’ బెనిఫిట్ షోను వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యాత్ర సినిమా చాలా బాగుందన్నారు. ప్రజల గుండెలకు హత్తుకునేలా సినిమా ఉందని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ 2003లో చేపట్టిన పాదయాత్రను కళ్లకు కట్టినట్లు సినిమాలో చూపించారని కొనియాడారు. పాదయాత్ర ద్వారా నేరుగా ప్రజల కష్టాలను వైఎస్సార్ తెలుసుకున్న తీరును సినిమాలో చక్కగా చూపించారని, వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి జీవించారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు చూడదగిన సినిమాగా యాత్రను రూపొందించారని అన్నారు. -
970 స్క్రీన్స్లో వెండితెర యాత్ర
మహానేత వైఎస్. రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. వైఎస్ పాత్రలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటించారు. మహి వి. రాఘవ్ దర్శకత్వంలో శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘యాత్ర’ విశేషాలు. ► ‘భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ’ వంటి హిట్ చిత్రాల తర్వాత 70 ఎంఎం బ్యానర్లో 3వ చిత్రంగా రూపొందిన చిత్రం ‘యాత్ర’. ‘‘ఈ టైటిల్ ప్రకటించినప్పటి నుంచి వైఎస్గారి అభిమానుల్లోనే కాదు.. సాధారణ ప్రజల్లో కూడా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇందుకు కారణం.. ఓ మహానేత చరిత్ర తెరకెక్కించటం. వైఎస్గారిని ఎలా చూపించనున్నారు? సినిమా పాజిటివ్గా ఉంటుందా? లేక నెగటివ్గా ఉంటుందా? అనే సందేహాలు ఒకవైపు. అసలు ‘యాత్ర’ ఇప్పడు తీయాల్సిన అవసరం ఏంటి? ఎన్నికల స్టంటా? వైఎస్ జగన్మోహన్రెడ్డిగారికి సపోర్ట్గా తీస్తున్నారా? వంటి ప్రశ్నలు మరోవైపు. వీటన్నింటికీ ఈ రోజు ‘యాత్ర’ సినిమా సమాధానం చెబుతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ► 970 స్క్రీన్స్లో భారీ ఎత్తున ‘యాత్ర’ విడుదలయింది. సాధారణంగా ఒక సినిమా హీరో బయోపిక్ లేదా బిగ్ కాస్టింగ్తో తీసిన సినిమాలు ఇంతటి భారీ స్థాయిలో రిలీజ్ కావటం చూశాం. కానీ, తొలిసారిగా ఓ రాజకీయ నాయకుడి బయోపిక్ తీస్తే ఒక్క ఓవర్సీస్లోనే 180 స్క్రీన్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 500 స్క్రీన్స్.. ఇలా ప్రపంచ వ్యాప్తంగా 970 స్క్రీన్స్లో ఈ చిత్రం విడుదలవటం చూస్తే ‘యాత్ర’పై తెలుగు ప్రజల క్రేజ్ ఏంటో తెలుస్తోందని, అటు అమెరికా నుంచి అనకాపల్లి వరకూ ఈ సినిమాకి అనూహ్యమైన స్పందన లభిస్తోందని నిర్మాతల్లో ఒకరైన విజయ్ చిల్లా చెప్పారు. ► ‘నాయకుడిగా మనకు ఏం కావాలో తెలుసుకున్నాం కానీ... జనానికి ఏం కావాలో తెలుసుకోలేకపోయాం’ అంటూ అధిష్టానాన్ని సైతం లెక్కచేయక పేద ప్రజల కష్టాల్ని వినటానికి కడప గడప దాటి పాదయాత్ర చేసిన వైఎస్గారు జననేతగా, మహానేతగా, పేద ప్రజల గుండె చప్పుడుగా పదిలమైన చోటు సంపాదించుకున్నారు. వైఎస్గారి పాదయాత్ర 68 రోజులు జరిగింది. యాదృచ్ఛికంగా ‘యాత్ర’ షూటింగ్ కూడా 68 రోజుల్లో పూర్తికావటం ఆ పెద్దాయన ఆశీస్సులుగా టీమ్ భావిస్తున్నారు. ► వైఎస్గారి రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం. ఆ సమయంలో జరిగిన ముఖ్య సంఘటనల సమాహారమే ఈ ‘యాత్ర’. పాదయాత్రలో రైతుల కష్టాలు, పేదవాళ్ల ఆవేదనలు, ప్రతి ఒక్కరి భావోద్వేగాలని రాజన్న మనసుతో వినటమే ఈ చిత్రంలో కీలక భాగం. రాజకీయాలు లేని రాజకీయ నాయకుడి కథే ఈ సినిమా. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూసి భావోద్వేగానికి లోనవుతారు. ఎందుకంటే కష్టం ఎవరికైనా కష్టమే. అందుకే ఈ యూనివర్సల్ సబ్జెక్ట్ని తెలుగుతోపాటు భారతదేశం మొత్తం విడుదల చేశాం. ఎమోషనల్ కంటెంట్తో ఉన్న ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకుడు బరువైన గుండెతో థియేటర్స్ నుంచి బయటకి వస్తారు. ► మహి చెప్పిన ‘యాత్ర’ కథలోని పాత్రలు, వాటి కష్టాలు మమ్ముట్టిగారిని కలచి వేశాయి. ఆ తర్వాత ఆయన వైఎస్గారి గురించి పూర్తిగా తెలుసుకుని పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. ‘ఇది రాజకీయ నాయకుడి కథ మాత్రమే కానీ, రాజకీయాలు ఉండవు.. ప్రజల కష్టాలు, రైతుల బాధలు ఉంటాయి.. ఇవన్నీ భారతదేశం అంతటా ఉంటాయి. ఏ రైతుని అడిగినా, ఏ పేదవాడిని అడిగినా వారి కష్టాలు చెప్తారు’ అని మమ్ముట్టి చెప్పారు. ‘యాత్ర’లో ఆద్యంతం ఎమోషన్తో కూడిన పాత్రలు, పాత్ర చిత్రణ కనిపిస్తాయి. తెలుగు ప్రజలందరూ తప్పకుండా చూడాల్సిన చిత్రంగా ఫ్యామిలీ ఎమోషన్స్ని దర్శకుడు చూపించారు. సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమిదని నిర్మాతలు అన్నారు. ► ‘‘యాత్ర’ సినిమా చేయాలనుకున్నప్పటి నుంచి విడుదల వరకూ వైఎస్ జగన్గారు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ ఎక్కడా అభ్యంతరాలు పెట్టలేదు సరికదా కనీసం కథ వివరాలు కూడా అడగలేదు. దర్శకుడికి, ప్రొడక్షన్కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం జగన్గారి గొప్పతనానికి నిదర్శనం. ఇటీవల జగన్గారిని మహి కలిసినప్పుడు.. ‘మీ నాయకుడి చిత్రం మీరు తీస్తున్నారు.. ఆయన గురించి మీకే బాగా తెలుసు.. నాన్నగారు చేసిన పనులు చెప్పండి చాలు’ అని జగన్గారు సున్నితంగా చెప్పటం మా యూనిట్కి నూతనోత్సాహం కలిగించింది. ఇందుకు జగన్గారికి, వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు’’ అని విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి అన్నారు. -
థియేటర్లో ‘యాత్ర’.. డిజిటల్లో ‘యన్.టి.ఆర్’
మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్ యాత్ర సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే వైఎస్ఆర్ కథతో తెరకెక్కిన యాత్ర సినిమా రేపు (శుక్రవారం) థియేటర్లలో రిలీజ్ అవుతుండగా నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన యన్.టి.ఆర్ కథానాయకుడు రేపే అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ కానుంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన యన్.టి.ఆర్ కథానాయకుడుకి డివైడ్ టాక్ రావటమే కాదు కలెక్షన్ల పరంగా కూడా తీవ్రంగా నిరాశపరచింది. దీంతో రెండో భాగం యన్.టి.ఆర్ మహానాయకుడు రిలీజ్పై చిత్రయూనిట్ ఆలోచనలో పడిందన్న ప్రచారం జరుగుతోంది. మహానాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన యాత్ర సినిమాకు మహి వీ రాఘవ్ దర్శకుడు. Stream #NTRKathanayakudu from tomorrow on @PrimeVideoIN.#NandamuriBalakrishna @vidya_balan @DirKrish @RanaDaggubati @iSumanth @NBKFilms_ @VaaraahiCC @vishinduri @mmkeeravaani @sahisuresh @gnanashekarvs @USTelugu @LahariMusic pic.twitter.com/gviz10SxUA — NBK FILMS (@NBKFilms_) 7 February 2019 -
యాత్ర బుకింగ్లు చూస్తుంటే హ్యాపీ
‘‘యాత్ర’ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వైఎస్ రాజశేఖర రెడ్డిగారి పాదయాత్ర ఎంత సెన్సేషన్ అయిందో ప్రేక్షకులందరికీ తెలుసు. పాదయాత్రలో ఉన్న ఎమోషన్స్, మూమెంట్స్ని తీసుకుని మహి రెడీ చేసిన కథతో విజయ్ ‘యాత్ర’ నిర్మించారు. మమ్ముట్టిలాంటి లెజెండ్ నటించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ చూసినప్పుడు, పాటలు విన్నప్పుడు సినిమా ఎప్పుడు చూస్తామా? అనే ఓ ఎగై్జట్మెంట్ కనిపించింది. మా విజయ్కి, మహికి ఆల్ ది బెస్ట్’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. మహి వి. రాఘవ్ దర్శకత్వంలో శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ‘యాత్ర’ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు ఓవర్సీస్లో ఈ సినిమా ఓపెనింగ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఓపెనింగ్స్ స్ట్రాంగ్గా ఉంటేనే ఆ సినిమాకి రెవెన్యూ పరంగా మంచి మ్యాజిక్ జరుగుతుంది. ఫస్ట్ మంచి ఓపెనింగ్స్ రావాలి.. ఆ తర్వాత మంచి టాక్ రావాలి. ఓ సినిమాకి ఓపెనింగ్స్ అన్నవి ఎప్పుడూ ముఖ్యమే.. కానీ ఇప్పుడు చాలా ముఖ్యం అయిపోయాయి. ఒకప్పుడు సినిమా ఫర్వాలేదు అంటే మెల్లిగా ఓపెనింగ్స్ పెరిగేవి. ఇప్పుడు అలా లేదు.. మంచి ఓపెనింగ్స్ వస్తేనే సినిమా. ‘యాత్ర’ అడ్వాన్స్ బుకింగ్లు చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాని నైజాం, వైజాగ్ ఏరియాల్లో మా సంస్థ విడుదల చేస్తోంది. వైఎస్గారి పాదయాత్ర మూమెంట్స్ని ఆ రోజుల్లో టీవీల్లో చూడటం, పేపర్లో చదవటమే. పాదయాత్రతో ఆయన హీరో అయిపోయారు. దాని తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. జనాలకోసం ఏదైనా చేస్తాను అని పాదయాత్ర ద్వారా చూపించారాయన. ఎన్టీ రామారావుగారి తర్వాత మళ్లీ తెలుగు రాష్ట్రాల ప్రజల్లో వైఎస్గారికే అంత ఇమేజ్ వచ్చింది.అలాంటి ఆయన నేపథ్యంలో వస్తున్న ఈ ‘యాత్ర’ పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. విజయ్ చిల్లా మాట్లాడుతూ– ‘‘యాత్ర’ కోసం ఏడాదిన్నరగా పని చేస్తున్నాం. రేపు విడుదలవుతోందంటే చాలా ఎగై్జటింగ్గా, సంతోషంగా ఉంది. వైఎస్గారు రాజకీయ నేత కావొచ్చు.. సినిమాలో రాజకీయాలు ఉండొచ్చు.. కానీ ఇది పూర్తిగా పొలిటికల్ సినిమా కాదు. ఎటువంటి వివాదాలు లేవు. ఈ సినిమా మొత్తానికి సోల్ అండ్ స్పిరిట్ వైఎస్గారే. సినిమా చూడండి.. నచ్చితే ఇతరులకు చెప్పండి. ఇది కేవలం ఆయన అభిమానులకే కాదు.. సినిమాను ప్రేమించేవారెవరైనా చూసి ఎంజాయ్ చేయొచ్చు’’ అన్నారు. ‘యాత్ర’ సినిమాను ఉద్దేశిస్తూ దర్శకుడు మహి వి. రాఘవ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కథను చెప్పడం చాలా గౌరవంగా భావిస్తున్నా. ఆయన కుటుంబం, అభిమానుల నుంచి మాకు అమితమైన ఆదరణ లభించడం గొప్ప విషయం. చిత్రబృందం చాలా కష్టపడింది. దీన్ని మరో సినిమాతో పోల్చి.. ఓ రేస్లా చేయకండి. వైఎస్సార్ ప్రయాణంలా భావించి సెలబ్రేట్ చేసుకుందాం’. ‘ఎన్టీఆర్, వైఎస్సార్.. ఇద్దరూ ఈ నేలతల్లి బిడ్డలు, తెలుగు జాతి గర్వించదగ్గ నాయకులు. మన భిన్నాభిప్రాయాలు వారిని అగౌరవపర్చడానికి కారణాలు కాకూడదు. నాకు వైఎస్సార్, చిరంజీవిగార్లపై ఉన్న ఇష్టం, అభిమానం ఎప్పటికీ చెరిగిపోదు. మనకు స్ఫూర్తినిచ్చిన వారి సినిమాను సెలబ్రేట్ చేసుకుందాం. అదే మనం వారికిచ్చే గొప్ప నివాళి’. ‘మా ‘యాత్ర’ సినిమాను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో తెలుసుకోవాలని చాలా ఆత్రుతగా ఉంది. నిజాయతీగా మీ స్పందన చెప్పండి. నేను వినయంగా వాటిని స్వీకరిస్తా. ఈసారి ఇంకా మంచి కథతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తా.. ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. -
‘మహానాయకుడి ‘యాత్ర’ను సెలబ్రేట్ చేసుకుందాం’
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథ ఆధారంగా యాత్ర సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాకు మహి వీ రాఘవ్ దర్శకుడు. 70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు నిర్మిస్తున్నారు. మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి వైఎస్ రాజశేఖర్రెడ్డి పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఈ శుక్రవారం (ఫిబ్రవరి 8) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు మహి వీ రాఘవ్ తన టీంతో కలిసి ఓ ప్రకటన విడుదల చేశారు. ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితాన్ని తెరకెక్కించే అవకాశం నాకు రావటం వరంగా భావిస్తున్నాను. ఈ విషయంలో నాకు సహకరించిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, కోట్లాది కూడా ఉన్న ఆయన అభిమానులకు నా కృతజ్ఞతలు. ఈ సినిమాను మరే సినిమాలో పోల్చటం గానీ, పోటిగా చూపించటం కానీ చేయకండి. ఆ మహానాయకుడి యాత్రను ఆనందంగా సెలబ్రేట్ చేసుకుందాం. ఎన్టీఆర్ గారూ, వైఎస్ఆర్గారూ ఈ మట్టి వారసులు, ఎంతో కీర్తిని, గౌరవాన్ని మనకు వదిలి వెళ్లిన తెలుగు లెజెండ్స్. మన అభిప్రాయ భేదాలతో వారి గౌరవానికి భంగం కలిగించకూడదు. వైఎస్ఆర్, చిరంజీవి గారిపట్ల నా ప్రేమ కారణంగా నాకు ఎవరి మీద ద్వేషం కలగలేదు. మా యాత్ర సినిమాను ప్రేక్షకులు ఎలా స్వాగతిస్తారో తెలుసుకునేందుకు ఎదురుచూస్తున్న’ అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. -
యాత్ర తొలి టికెట్ @ రూ.4.37లక్షలు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిపై ప్రజల్లో ఎంత అభిమానం ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన చేపట్టిన పాదయాత్ర నేపథ్యంలో మమ్ముట్టి లీడ్ రోల్లో మహి వి. రాఘవ్ తెరకెక్కించిన చిత్రం ‘యాత్ర’. శివ మేక సమర్పణలో 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడి నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా అమెరికాలో ‘యాత్ర’ ప్రీమియర్ షో మొదటి టికెట్ను వేలం వేయగా మునీశ్వర్ రెడ్డి 6,116 డాలర్లకు (దాదాపు 4.37 లక్షలు) సొంతం చేసుకుని వైఎస్పై తనకున్న అభిమానం చాటుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి మాట్లాడుతూ– ‘‘యాత్ర’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్లో ఈ చిత్రానికి మంచి క్రేజ్ నెలకొంది. 70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్, నిర్వాణ సంస్థలు అమెరికాలోని సీటెల్లో ‘యాత్ర’ ప్రీమియర్ షో మొదటి టికెట్ను వేలం వేయగా వైఎస్గారి అభిమాని మునీశ్వర్ రెడ్డి భారీ మొత్తాన్ని చెల్లించి మొదటి టికెట్ను సొంతం చేసుకున్నారు. అయితే ఆయన ఇచ్చిన డబ్బులో టికెట్కి సరిపడా 12 డాలర్లు (దాదాపు 860) మాత్రమే తీసుకుని, మిగతా డబ్బుని వైఎస్సార్ ఫౌండేషన్కు విరాళంగా ఇస్తాం. రాజన్న క్యాంటీన్స్, వాటర్ ప్లాంట్స్ కోసం ఈ డబ్బును వెచ్చించనున్నారు. ఈ వేలంలో పాల్గొన్నవారందరికీ కృతజ్ఞతలు. వైఎస్గారి పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయింది. ఆయన పోరాట పటిమ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. అలాంటి రాజకీయ ప్రజ్ఞాశాలి పాదయాత్రలో జరిగిన వాస్తవిక, భావోద్వేగ సంఘటనలతో ఈ సినిమా నిర్మించాం’’ అన్నారు. -
వైఎస్ ‘యాత్ర’లో పాల్గొనండి!
మహానాయకుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పథకాలతో లబ్ధి పొందని తెలుగు ప్రజలంటూ దాదాపుగా ఉండరు. ఏదో ఒక వ్యక్తి ఏదో ఒక సహాయాన్ని, ప్రయోజనాన్ని పొందే ఉంటారు. ఫీ రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత్ విద్యుత్లాంటి వినూత్న పథకాలతో వైఎస్సార్ తన పాలనలో ప్రజలపై చెరగని ముద్ర వేశారు. మహానేత మరణించి ఇన్నేళ్లైనా.. జనం గుండెళ్లో ఆయనపై ఉన్న అభిమానం మాత్రం చెక్కు చెదరలేదు. చిరంజీవిగా ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన మహానాయకుడు చేపట్టిన పాదయాత్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయానికి తెరలేపిన సంగతి తెలిసిందే. ప్రజలతో కలిసి, వారితో నడిచి, కన్నీళ్లను తుడుస్తూ.. చేపట్టిన పాదయాత్ర.. రాజన్ననను ప్రజలకు మరింత దగ్గర చేసింది. అప్పటి పాదయాత్ర స్మృతులతో పాటు ఎన్నో ఘటనలను యాత్ర పేరుతో వెండితెరపై ఆవిష్కరించబోతోన్న సంగతి తెలిసిందే. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి రాజన్న పాత్రలో నటిస్తుండగా.. ఈ చిత్రం ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘సాక్షి’ - యాత్ర సినిమాను వీక్షించే అవకాశం కల్పిస్తోంది. రాజన్న ప్రవేశపెట్టిన పథకాల వల్ల ఏ విధంగా ప్రయోజనం పొందారు? ఆయనతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మీకు కలిగిన అనుభం, సందర్భాన్ని గురించి నాలుగు విషయాలను కింద పేర్కొన్న ఈ మెయిల్ కు పంపించండి. (టికెట్లు అందజేయడంలో ఉన్న సాంకేతిక ఇబ్బందుల దృష్ట్యా ఈ కాంటెస్ట్ హైదరాబాద్లో నివసిస్తున్న వారికి మాత్రమే పరిమితం) వైఎస్ తో ఉన్న మీ అనుబంధం, అనుభవాన్ని పంచుకోవడానికి మీరు చెప్పే సందర్భం, సన్నివేశం వివరాలతో పాటు మీ పూర్తి పేరు, చిరునామా, ఫోన్ నంబర్ తో సహా info@sakshi.com కు మెయిల్ చేయగలరు. ఈ కాంటెస్ట్లో పాల్గొన్నవారిలో కొందరిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి టిక్కెట్లు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. కాంటెస్ట్లో పాల్గొనండి. టిక్కెట్లు పొందండి. -
వేలంలో ‘యాత్ర’ టికెట్ ఎంత పలికిందంటే..?
సియాటెల్ : దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా యాత్ర సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి రాజన్న పాత్రలో నటించారు. అమెరికాలోని సియాటెల్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో భాగంగా 70ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్, నిర్వాణ సంస్థలు ‘యాత్ర’ ప్రీమియర్ షో మొదటి టికెట్ను వేలం వేశాయి. అందులో మునీశ్వర్ రెడ్డి 6,116 డాలర్లకు(దాదాపు 4.37లక్షలు) మొదటి టికెట్ను గెలుచుకున్నారు. వైఎస్సార్ మీద అభిమానంతో మునీశ్వర్ రెడ్డి యాత్ర టికెట్ బిడ్డింగ్ రూపంలో కొన్నారు. అయితే టికెట్ ధర 12 డాలర్లు మాత్రమే నిర్మాతలు తీసుకుని మిగతా మొత్తాన్ని వైఎస్సార్ ఫౌండేషన్ ద్వారా రాష్ట్రంలో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలకు సహాయంగా ఇస్తామని 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్, నిర్వాణ సినిమాస్ వారు తెలిపారు. ప్రీమియర్ షోలు అధికంగా వేసి, టికెట్ రేట్లు పెంచుకుని జేబులు నింపుకుంటున్న నిర్మాతలు ఉన్న ఈ రోజుల్లో, వచ్చిన డబ్బును సామాజిక కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చిన యాత్ర నిర్మాతలు విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డిలను కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాసులు అభినందించారు. ఈ ఈవెంట్లో పాల్గొన్న వారందరికీ నిర్మాతలు ధన్యవాదాలు తెలిపారు. ఫిబ్రవరి 8న యాత్ర ప్రేక్షకుల ముందుకు రానుంది. -
జైత్ర యాత్ర మమ్మూట్టీ ప్రత్యేక ఇంటర్వ్యూ
-
వైఎస్సార్ అనే దేవుడు మా బాధ విన్నాడు
‘‘మా ఇంటి గడప దగ్గర చెప్పులు వదిలేసి లోపలికి వెళ్తే వైఎస్సార్గారివి మూడు ఫోటోలు ఉంటాయి. పదేళ్ల క్రితం ఆగిపోవాల్సిన మా అమ్మ గుండె ఇప్పటికీ వినబడుతుందంటే దానికి కారణం వైయస్సార్గారు’’ అంటూ ఎమోషనల్ అయ్యారు రవికుమార్. శుక్రవారం ‘యాత్ర’ ప్రీ–రిలీజ్ వేడుకలో మహానేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాల ద్వారా లబ్ధి పొందిన పలువురు మాట్లాడారు. వారిలో ‘యాత్ర’కు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన రవికుమార్ తన మనోభావాలను పంచుకున్నారిలా. 2008లో నేను డిగ్రీ చదువుతున్నాను. మా అమ్మకు ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్కి తీసుకెళితే హార్ట్లో హోల్ ఉందని, ఆరు నెలల కంటే బతకదని చెప్పారు. మా అమ్మ దండం పెట్టి ‘అరే, నాకు బతకాలని ఉందిరా. ఏమైనా చేసి ఓ మూడు లక్షలు అప్పు చేసి నాకు ఆపరేషన్ చేయించు’ అన్న మాటలు నాకింకా గుర్తు. అమ్మ కంటే ఏదీ ఎక్కువ కాదనిపించి చదువు మానేసి హైదరాబాద్ వచ్చాను. ఓ హోటల్లో ఎంగిలి ప్లేట్లు, గ్లాసులు కడుగుతూ పనిచేశాను. నాలుగు నెలలు కష్టపడి పనిచేస్తే నేను సంపాదించింది 20 వేలు. అవి మా అమ్మ మందులకు, బస్సు చార్జీలకు కరిగిపోయాయి. మా అమ్మకు రోజులు దగ్గర పడ్డాయని తెలిసి నన్ను పిలిచి చెల్లిని బాగా చూసుకోమని చెప్పింది. చర్చి, గుడి, మసీదు ఏ దేవుడినీ వదలకుండా దండం పెట్టుకునేది. ఏ దేవుడూ ఆమె ఏడుపు వినలేదు. కానీ, వైఎస్సార్ అనే దేవుడు ‘నేను విన్నాను, నేను ఉన్నాను’ అని ఆరోగ్యశ్రీ పథకం పెట్టారు. కామినేని హాస్పిటల్లో రూపాయి ఖర్చు లేకుండా అమ్మకు వైద్యం చేశారు. వైద్యం కోసం ఎవరినైనా అప్పు అడిగితే షూరిటీగా ఏం పెడతారు? అని అడిగేవారు. మాకు ఉన్నదల్లా రెండు గదుల ఇందిరమ్మ ఇల్లు మాత్రమే. అది కూడా ఆ దేవుడి (వైఎస్సార్) దయే. ఈ ఫంక్షన్కు మా అమ్మను తీసుకొచ్చేవాణ్ని. కానీ తీసుకురాలేదు. కారణం మా అమ్మకి నేను ఇప్పటికీ ఏం పని చేస్తున్నానో తెలియదు. నేను సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తున్నానని మా అమ్మకి చెప్పాలంటే భయం వేసి చెప్పలేదు. ఎందుకంటే సినిమాలంటే ఒప్పుకోరని. కానీ అమ్మా... ఇప్పుడు చెబుతున్నాను, ఫిబ్రవరి 8న విడుదలయ్యే ‘యాత్ర’ సినిమాను మా అమ్మ, చెల్లెలితో మా ఊరు డిచ్పల్లిలో చూస్తాను. నేనీ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి వైఎస్సార్గారి రుణం కొంచెమన్నా తీర్చుకున్నాను అనుకుంటున్నాను. నాకీ చాన్స్ ఇచ్చిన దర్శకుడు మహి.వి.రాఘవ్ గారికి నిర్మాతలు విజయ్ చిల్లా గారికి, శశి దేవిరెడ్డి, శివ గార్లకు జీవితాంతం రుణపడి ఉంటాను’’ అని రవికుమార్ ఎమోషనల్ కావడం వీక్షకులను కదిలించింది. ఈ సందర్భంగా ‘సాక్షి’ మాట్లాడినప్పుడు రవికుమార్ మరిన్ని విశేషాలు పంచుకున్నారు. ► ‘యాత్ర’ మీ మొదటి సినిమానా? దర్శకుడు మహీ వి. రాఘవ్గారు తీసిన ‘పాఠశాల’ నా మొదటి సినిమా. ఆ సినిమాకు ఆఫీస్బాయ్గా పనిచేశాను. నేను కాఫీ షాప్లో చేసే రోజుల్లో మహీ అక్కడికి వస్తుండేవారు. అలా ఆయన సినిమాలతో అసోసియేట్ అయ్యే అవకాశం ఏర్పడింది. మహీగారు చేసిన ‘ఆనందోబ్రహ్మ’కు రైటర్గా, ‘యాత్ర’కు రచనా సహకారం అందించాను. ► వైయస్సార్గారికి మొదటినుంచే అభిమానిగా ఉండేవారా? మొదట్లో రాజశేఖర్ రెడ్డిగారంటే రాజకీయనాయకులు, మన ముఖ్యమంత్రి అని తెలుసు. కానీ మా అమ్మకు తిరిగి ప్రాణం పోశాక ఆయన మీద అభిమానం పెరిగిపోయింది. ► మొన్న జరిగిన వేడుకలో మాట్లాడాలని ముందే అనుకున్నారా? లేదు. పది నిమిషాల ముందు చెప్పారు. టైముంది. నువ్వు కూడా లబ్ధి పొందావు కదా. నీకు అనిపించింది మాట్లాడితే మాట్లాడు అన్నారు. సడెన్గా దర్శకులు స్టేజ్ మీద మాట్లాడమంటే ఎమోషనల్ అయిపోయాను. ► ఇలా వైయస్గారి బయోపిక్ ఐడియా ఉందని మహీ మీతో చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? మహీసార్, నేను, రాజశేఖర్ అని ఓౖ రెటర్. మేం ముగ్గురం ట్రావెల్ అవుతుంటాం. ఫస్ట్ మాతోనే చెప్పారు. చాలా ఎగై్జట్ అయ్యాను. రైతు ఆత్మహత్య చేసుకునే సీన్ ఒకటి, నారాయణరెడ్డిగారు ఎప్పుడొచ్చినా వైయస్గారు ఆయనకు సీట్ ఇచ్చి కూర్చోమనేవారట. అలాగే హై కమాండ్ ఏదో విషయం మాట్లాడటానికి వైయస్గారిని ఒక్కరే రావాలని చెప్పారట. నాతో కేవీపి కూడా వస్తారని సమాధానం పంపారట. దానికి వాళ్లు ‘సీటు కావాలంటే ఒక్కరే రావాలి’ అని చెప్పారట. ‘పదవులు చాలా చూస్తాం. నాతో ఉండే మనుషులే ఎక్కువ’ అనుకునేవారట. ఇలా కొన్ని సీన్స్ చెప్పడంతో మేం ముందుకు వెళ్లాం. ► మీ అమ్మగారు ఇప్పుడు ఎలా ఉన్నారు? బాగున్నారు. చలికాలం అప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మొన్న ఫంక్షన్లో నేను మాట్లాడినది విని, ఫోన్ చేసి ఏడ్చారు. ‘యాత్ర’ సినిమాకి పని చేశానన్న ఆనందం అది.