రైతుల కోసం చంద్రబాబు ఎందుకు పోరాడలేదు? | ysrcp leader Nagi Reddy slams APCM over support prices | Sakshi
Sakshi News home page

రైతుల కోసం చంద్రబాబు ఎందుకు పోరాడలేదు?

Published Fri, Jul 6 2018 11:51 AM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

మద్దతు ధర ప్రకటనలో రైతుకు అన్యాయం జరిగిందని  వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్రంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఎన్నికల మ్యానిఫెస్టోలో చంద్రబాబు నాయుడు రైతుల కోసం స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేస్తామని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మద్దతు ధరల విషయంలో రైతులు సంతోషంగా ఉన్నారని చెబుతున్న బీజేపీ నేతల మాటల్లో వాస్తవం లేదన్నారు. వరికి నామమాత్రంగా మద్దతు ధర పెరిగిందని విమర్శించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement