Dill raju
-
సీఎం రేవంత్ను కలవనున్న సినీ ప్రముఖల లిస్ట్ ఇదే
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో సినీ ప్రముఖులు నేడు సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు ఇప్పటికే ప్రకటించారు. సుమారు 36 మంది సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. నేడు ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్లోని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశం కానున్నారు.నిర్మాతల నుంచి ఎవరు వెళ్తున్నారంటే.. దిల్ రాజు, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, ఏషియన్ సునీల్ నారంగ్, నిర్మాత సుప్రియ యార్లగడ్డ, నిర్మాత చినబాబు, నిర్మాత నాగవంశీ, పుష్ప నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి శంకర్, పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్,శ్యాంప్రసాద్రెడ్డి, సుధాకర్ రెడ్డి, స్రవంతి రవి కిషోర్ , కె ఎల్ నారాయణ, యూవీ క్రియేషన్స్ వంశీ, భోగవల్లి ప్రసాద్ తదితరులుతెలుగు హీరోలనుంచి వెంకటేష్,నాగార్జున, నితిన్, కిరణ్ అబ్బవరం, వరుణ్ తేజ్, శివ బాలాజీ, హాజరు కానున్నారు.దర్శకుల సంఘం నుంచి అధ్యక్షుడు వీర శంకర్, రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను, డైరెక్టర్ సాయి రాజేష్, విశ్వంభర డైరెక్టర్ వశిష్ట ,కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్ , అనిల్ రావిపూడి, బాబీ, వంశీ పైడిపల్లి, ప్రశాంత్ వర్మ సీఎంతో భేటీ కానున్నారు.తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచి ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ , సెక్రటరీ దామోదర్ ప్రసాద్ వెళ్తుండగా మా అసోసియేషన్తో పాటు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్ నుంచి పలువురు ప్రతినిధులు హాజరు కానున్నారుచర్చకు వచ్చే అంశాలుసినిమా పరిశ్రమ సమస్యలపై చర్చతెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధితోపాటు పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులునంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డుల పరిశీలనచిన్న, మధ్య స్థాయి సినిమాలకు థియేటర్స్ కేటాయింపుతెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేసే సినిమాలకు ప్రోత్సాహకాలుఇటీవల సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటనపై చర్చటికెట్ ధరల పెంపు, పెంపుబెనిఫిట్ షోల అంశాల గురించి చర్చ -
సీఎం రేవంత్తో సినీ పెద్దల భేటీ.. దూరంగా చిరంజీవి!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో సినీ ప్రముఖులు నేడు సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు ఇప్పటికే ప్రకటించారు. పుష్ప2 సినిమా ప్రీమియర్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణం ఆపై అల్లు అర్జున్ అరెస్ట్ వంటి అంశాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. దీంతో ముఖ్యమంత్రిని పులువురు సినీ ప్రముఖులు నేడు కలవనున్నడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యం కలిగింది. అయితే, సీఎంతో భేటీ అయ్యే సినీ పెద్దలు ఎవరనేది ఇంకా ప్రకటించలేదు.ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో భేటీ విషయంలో నిర్మాత, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎఫ్డీసీ) ఛైర్మన్ దిల్రాజు కీలకంగా వ్యవహరించనున్నారు. సీఎంతో భేటే అయేందుకు సినీ ప్రముఖులతో కూడా ఆయన ఇప్పటికే మాట్లాడారని తెలుస్తోంది. గురువారం ఉదయం 10 గంటలకు పోలీస్ కమాండ్ కంట్రోల్రూమ్లో ఈ సమావేశం జరగనుంది. సుమారు 36 మంది సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్,త్రివిక్రమ్, సురేష్బాబు,నితిన్,వరుణ్ తేజ్, శివ బాలాజీ, పలువురు నిర్మాతలు, దర్శకులు ఈ సమావేశానికి హాజరు కానున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ సమావేశంలో చిరంజీవి పాల్గొనకపోవచ్చు అని సోషల్మీడియాలో ప్రచారం జరుగుతుంది. పలు కారణాల వల్ల ఆయన ఈ సమావేశానికి దూరంగా ఉండబోతున్నారని నెట్టింట వైరల్ అవుతుంది. మెగాఫ్యాన్స్ కూడా నేడు జరిగే సమావేశంలో తమ బాస్ దూరంగానే ఉండబోతున్నట్లు ట్వీట్లు చేస్తున్నారు. అయితే, ఇందులో ఎంతమేరకు నిజం ఉందో తెలియాలంటే 10 గంటల వరకు వేచి ఉండాల్సిందే.చిత్ర పరిశ్రమ పెద్దలతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొనే ఛాన్స్ ఉంది. -
సీఎం రేవంత్రెడ్డితో సినీ ప్రముఖుల భేటీపై దిల్ రాజు ప్రకటన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిసెంబర్ 26న చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులతో పాటు కలవబోతున్నట్లు ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు ప్రకటించారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజన పరామర్శించిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. సంధ్య థియేటర్ ఘటన తర్వాత చిత్రపరిశ్రమలో తీవ్ర అలజడి నెలకొంది. అయితే, సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్న నేపథ్యంలో సీఎంతో చిత్ర పరిశ్రమ ప్రముఖులు కలవనున్నారు.సంధ్య థియేటర్ ఘటనతో బెనిఫిట్ షోలు, టికెట్ల ధరలు పెంచడం వంటివి ఉండవని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు ఇదే అంశం గురించి ప్రభుత్వంతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు గురువారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని చిత్ర పరిశ్రమలోని ప్రముఖులతో పాటు తాను కూడా కలవనున్నట్లు దిల్ రాజు తెలిపారు. ఎఫ్డీసీ ఛైర్మన్గా.. ఇండస్ట్రీ, ప్రభుత్వానికి మధ్య వారధిగా తాను ఉంటానని దిల్ రాజు అన్నారు. సంక్రాంతి రేసులో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం వంటి భారీ సినిమాలు ఉన్నాయి. -
సీఎం రేవంత్రెడ్డిని కలిసే ఆలోచనలో సినీ ప్రముఖులు
సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం, చిత్ర పరిశ్రమల మధ్య దూరం పెరుగుతుందని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రముఖ నిర్మాత నాగవంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని తెలుగు సినీ ప్రముఖులు కలుస్తారని ఆయన తెలిపారు. బాలకృష్ణ- బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'డాకు మహారాజ్' ప్రమోషన్స్ కార్యక్రమంలో ఆయన మీడియాతో ఈ విషయాన్ని పంచుకున్నారు.సంధ్య థియేటర్ ఘటనతో బెనిఫిట్ షోలు, టికెట్ల ధరలు పెంచడం వంటివి ఉండవని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు కదా.. మరీ మీరు నిర్మించిన డాకు మహారాజ్ పరిస్థితి ఏంటి అని నాగవంశీని ప్రశ్నించారు. ఈమేరకు ఆయన ఇలా చెప్పుకొచ్చారు. ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు అమెరికాలో ఉన్నారు. గేమ్ ఛేంజర్ ప్రమోషన్ కార్యక్రమం నుంచి ఆయన హైదరాబాద్కు తిరిగొచ్చాక సీఎంను కలుస్తాం. ఆ సమయంలో టికెట్ ధరల పెంపుతో పాటు ప్రీమియర్ షోలపై చర్చ చేస్తామని ఆయన అన్నారు. నా సినిమా డాకు మహారాజ్ కంటే ముదే దిల్ రాజ్ గేమ్ ఛేంజర్ విడుదల అవుతుంది. కాబట్టి, టికెట్ల ధరల విషయంలో ఆయన ఏం తేలుస్తారో అందరికీ అదే వర్తిస్తుంది' అని నాగవంశీ అన్నారు. తాము కూడా అన్ని సినిమాలకు టికెట్ ధరలు పెంచమని అడగమన్నారు. ఏ సినిమాకు అయితే టికెట్ ధర పెంపు అవసరమో వాటికి మాత్రమే అడుగుతామని వంశీ అన్నారు.ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్లతో సినీ ప్రముఖుల భేటీ గురించి తనకు తెలియదని నాగవంశీ తెలిపారు. ఇండస్ట్రీ ఏపీకి తరలి వెళ్లిపోతుందని టాక్ వినిపిస్తోంది కదా..? అనే ప్రశ్నకు ఆయన ఇలా అన్నారు. 'నేను చాలా డబ్బులు పెట్టి హైదరాబాద్లోనే ఇల్లు కట్టుకున్నా.. అలాంటప్పుడు మరోచోటకు ఎందుకు వెళ్తాను. ఏపీ, తెలంగాణ ఇరు రాష్ట్రాల సపోర్ట్ ఇండస్ట్రీకి వుంది.' అని ఆయన అన్నారు. -
సంక్రాంతికి 'గేమ్ ఛేంజర్'.. దిల్ రాజు ప్రకటన
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్. సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే, దసరా సందర్భంగా మెగా ఫ్యాన్స్లో నిర్మాత దిల్రాజు జోష్ నింపారు. గేమ్ ఛేంజర్ విడుదల తేదీని అయన అధికారికంగా ప్రకటిస్తూ ఒక వీడియోను పంచుకున్నారు. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్రాజు ప్రొడక్షన్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించారు. ఇందులో కియారా అద్వాని హీరోయిన్. ముందుగా ఈ సినిమాను డిసెంబర్లో క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటన వెలువడింది. ఈ విషయంపై చిత్ర నిర్మాతల్లో ఒకరైన దిల్రాజు స్పష్టతనిచ్చారు.'గేమ్ ఛేంజర్’ను ముందుగా ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేశాం. కానీ సినిమాను వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నప్పుడు క్రిస్మస్ కంటే సంక్రాంతి అయితే బావుంటుందని నాతో పాటు బాలీవుడ్, కోలీవుడ్, కర్ణాటక ఓవర్ సీస్లోని ఇతర డిస్ట్రిబ్యూటర్స్ అందరం భావించాం. ఈ ఆలోచనను నేను చిరంజీవిగారికి, యువీ క్రియేషన్స్ సంస్థకు తెలియజేశాం. మూడేళ్లుగా ‘గేమ్ చేంజర్’ సినిమాను భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నామని చెప్పాం. వాళ్లు రూపొందిస్తోన్న ‘విశ్వంభర’ సినిమా కూడా భారీ బడ్జెట్ సినిమానే. వాళ్లు సంక్రాంతి వస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అందువల్ల సంక్రాంతి డేట్ కావాలని చిరంజీవిగారితో పాటు యువీ క్రియేషన్స్ సంస్థను అడిగాం. వాళ్లు సానుకూలంగా స్పందించారు. దీంతో ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతి విడుదలకు లైన్ క్లియర్ అయింది. విశ్వంభర సినిమా విషయంలో మరో రిలీజ్ డేట్ను ప్రకటిస్తారు. విశ్వంభర సినిమా కూడా ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్తో సహా నిర్మాణ పనులన్నీ పూర్తి అయ్యాయి. కానీ, నా కోసం, మా సినిమా కోసం వాళ్ల మరో రిలీజ్ డేట్కు విశ్వంభర విడుదల చేయటానికి ఒప్పుకున్నారు. అందుకు చిరంజీవిగారికి, యువీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్, విక్కీకి నా ధన్యవాదాలు. ‘గేమ్ ఛేంజర్’ సినిమాను సంక్రాంతి విడుదల చేస్తున్నాం. ఇటు అభిమానులకు, అటు సినీ ప్రేక్షకులకు నచ్చేలా సినిమాను తీర్చిదిద్దేందుకు కష్టపడుతున్నాం. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు యూ ట్యూబ్లో మారుమోగిపోతున్నాయి. తర్వాత టీజర్తో పాటు మరో మూడు సాంగ్స్ రిలీజ్ చేస్తాం. సంక్రాంతిలోపు ‘గేమ్ చేంజర్’కు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ను అందిస్తూ మూవీ భారీ విజయం సాధించేలా ప్లాన్ చేశాం. సంక్రాంతికి కలుద్దాం.' అన్నారు.సంక్రాంతికి కలుద్దాం! ❤️🔥✊🏼#GameChanger Global Star @AlwaysRamCharan @shankarshanmugh @MusicThaman @advani_kiara @iam_SJSuryah @actorsrikanth @yoursanjali @Naveenc212@AntonyLRuben @DOP_Tirru @artkolla @HR_3555 @ZeeStudios_ @saregamaglobal @saregamasouth @PharsFilm… pic.twitter.com/57Ht1FRW8m— Sri Venkateswara Creations (@SVC_official) October 12, 2024 -
'నా తమ్ముడు, మా నాన్న' అంటూ తారక్పై కల్యాణ్ రామ్ ప్రశంసలు
ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'దేవర'. తాజాగా విడుదలైన ఈ సినిమా తారక్ ఫ్యాన్స్ను మెప్పిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద హౌస్ఫుల్ కలెక్షన్స్తో దేవర దూసుకుపోతున్నాడు. సినిమాకు మంచి ఆదరణ రావడంతో తాజాగా చిత్ యూనిట్ ప్రెస్మీట్ నిర్వహించింది. ఈ క్రమంలో దేవరను ఆదరిస్తోన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. చిత్ర సమర్పకులుగా ఉన్న కల్యాణ్ రామ్ దేవర గురించి ఇలా చెప్పుకొచ్చారు.దేవర సినిమాను ఆదరిస్తున్న వారందరికీ నా ధన్యవాదాలు. నా తమ్ముడు, మా నాన్న (ఎన్టీఆర్) యాక్టింగ్తో అదరగొట్టేశాడు. దేవరలో తన రోల్ వన్ మ్యాన్ షో అని చెప్పగలను. ఎంతో కష్టపడి మాకు ఇంతటి భారీ విజయాన్ని అందించిన చిత్ర యూనిట్కు కృతజ్ఞతలు.' అని కల్యాణ్ రామ్ చెప్పారు.అనంతరం చిత్ర దర్శకులు కొరటాల శివ మాట్లాడుతూ.. 'దేవరతో మాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు, అభిమానులకు ధన్యవాదాలు. సినిమా ఫస్ట్ షో పడిన సమయం నుంచి నాకు వరసుగా కాల్స్ వస్తూనే ఉన్నాయి. దేవర సినిమానే నా ఉత్తమ సినిమా అంటూ వారు అభినందిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. చిత్ర యూనిట్ కష్టం వల్లే దేవర సినిమాకు ఇలాంటి ప్రశంసలు దక్కుతున్నాయి.' అని ఆయన అన్నారు.నైజాంలో ‘దేవర’ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్రాజు కూడా ఈ సక్సెస్ మీట్లో పాల్గొన్నారు. సినిమాలో ఆయన నటన మరోస్థాయిలో ఉంటుంది. 'వన్ మ్యాన్ షోతో సినిమాను తారక్ నడిపించారు. ప్రపంచదేశాలు కూడా నేడు తెలుగు హీరోల వైపు చూస్తున్నాయి. మన తెలుగు సినిమాలు కూడా ఇప్పుడు అన్ని దేశాల్లో రన్ అవుతున్నాయి. దీనంతటికి కారణమైన దర్శకులు, హీరోలకు నేను కృతజ్ఞతలు చెబుతుతున్నా.' అని దిల్ రాజు అన్నారు. -
వరద బాధితుల కోసం ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం..సురేష్ బాబు, దిల్ రాజు భారీ విరాళం
తెలుగు రాష్ట్రాల్లో వరద వల్ల నష్టపోయిన బాధితులకు సాయం చేసేందకు తెలుగు చిత్ర పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. వరద బాధితులపే ఆదుకునేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తాజాగా ప్రకటించింది. నివేదిక సాయంతో బాధితుల కోసం సహాయ కార్యక్రమాలను చేపడుతామని ఫిల్మ్ ఛాంబర్ పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని సినిమా థియేటర్ల వద్ద విరాళాలు, ఆహార వస్తువలను సేకరించేందుకు ఒక టీమ్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.ఇప్పటికే రెండు రాష్ట్రాలకు చాలామంది సినీ ప్రముఖులు విరాళాలు అందించారు. తాజాగా ఫిల్మ్ ఛాంబర్ తరపున ఏపీకి రూ.25 లక్షలు, తెలంగాణకు రూ.25 లక్షలు విరాళం ప్రకటించింది. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ తరపున ఏపీకి 10 లక్షలు, తెలంగాణకు 10 లక్షలు అందిస్తుండగా ఫెడరేషన్ తరపున రెండు రాష్ట్రాలకు చెరో రూ.5 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. దగ్గుబాటి కుటుంబం తరఫున ఇరు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షలు నిర్మాత సురేశ్ బాబు ప్రకటించారు. అనంతరం దిల్ రాజు కూడా తెలంగాణకు రూ. 25 లక్షలు, ఏపీకి రూ.25 లక్షల విరాళం ప్రకటించారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చిన వరదల వల్ల చాలామంది నిరాశ్రయులయ్యారు. దీంతో బాధితులను ఆదుకోవడానికి సినీ పరిశ్రమ ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సినీ పరిశ్రమ చేయబోతున్న యాక్షన్ ప్లాన్ గురించి వివరించారు.ఈ సందర్భంగా ఛాంబర్ గౌరవ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. 'విజయవాడ, ఖమ్మంలో వరదలు రావడం వల్ల చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి విపత్తులు ఎప్పుడు వచ్చినా సాయం చేసేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ముందుంటుంది. అలాగే ఈసారి కూడా ఎలాంటి సహాయసహకారాలు చేస్తే బాగుంటుంది అనేదానిపై చర్చించాము. ఫిల్మ్ ఛాంబర్ తరపున ఏపీ, తెలంగాణకు విరాళంగా ప్రకటిస్తున్నాం. రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్కు సంబంధించి అకౌంట్ నంబర్స్ అలాగే, ఛాంబర్ నుంచి ఒక అకౌంట్ నంబర్ ఇస్తున్నాం. సహాయం చేయాలనుకునేవారు ఈ అకౌంట్స్కు డబ్బులు పంపించవచ్చు.' అని తెలిపారు.నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు మాట్లాడుతూ.. 'ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మన పరిశ్రమ ఆదుకునే విషయంలో ముందుంటుంది. ఇప్పుడు కూడా సినీ పరిశ్రమ అండగా ఉంటుంది. డబ్బు రూపంలోనే కాకుండా నిత్యావసరాలను కూడా అందించే ప్రయత్నం చేస్తాం. ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.' అని చెప్పారు.నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. 'తెలుగు రాష్ట్రాల్లో వరదల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే చాలామంది హీరోలు విరాళాలు అందించారు. అలాగే చాంబర్ నుంచి కూడా సహాయం చేయాలని నిర్ణయించాం. ఫెడరేషన్ పిలుపుమేరకు ఇండస్ట్రీలోని అందరూ ముందుకు వచ్చి విరాళాలు అందించాలని కోరుతున్నాం. తద్వారా వచ్చిన విరాళాలను ప్రభుత్వాలకు అందిస్తాం.' అని చెప్పారు.దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ..'మేము ఈ స్థాయికి రావడానికి కారణం ప్రజల ఆదరణే. ఇప్పుడు వాళ్లు కష్టాల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో మనం వాళ్లను ఆదుకోవాలి. అలాగే మాకు ఎప్పుడూ అండగా ఉండే ప్రభుత్వాలకు మద్దతును తెలియజేయడానికే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. అని చెప్పారు.ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ..'రేపు అన్ని యూనియన్లతో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఒకరోజు వేతనం ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాం. మా కార్మికుల తరపున తెలుగు రాష్ట్రాలకు ఎంత చేయాలో అంతా చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం.' అని చెప్పారు.నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ..'వరద బాధితులను ఆదుకోవడం కోసం ఇండస్ట్రీ నుంచి ఒక కమిటీ ఏర్పాటు చేశాం. తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏమేం ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుని కమిటీ వాటిని తీర్చేలా ముందుకు వెళ్తుంది.' అని చెప్పారు. -
ప్రేక్షకులను మేమే చెడగొట్టాం.. దిల్రాజు వైరల్ కామెంట్స్
టాలీవుడ్లో సినిమా మనుగడ గురించి ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గత కొన్నేళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు నిర్మించిన అనుభువం దిల్ రాజుకు ఉంది. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలను కూడా ఆయన బ్యానర్ నుంచి విడుదల అయ్యాయి. ఈ క్రమంలో కొత్త వారికి కూడా ఆయన భారీగానే అవకాశాలు కల్పించారు. అయితే, తాజాగా ‘రేవు’ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమలో పాల్గొన్న దిల్ రాజు ఇండస్ట్రీలోని పరిస్థితుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రేక్షకులు థియేటర్స్కు రాకుండా తామే చెడగొట్టామని దిల్రాజు కామెంట్ చేశారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యాలు అందరినీ ఆలోచించే విధంగా చేస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ కొత్తవాళ్లు వస్తూనే ఉంటారు. కానీ, వారిలో ఎక్కువగా ఫెయిల్ శాతమే ఉంటుంది. ఈరోజుల్లో ఆడియన్స్ను థియేటర్కు రప్పించడం అంత సులభం కాదు. ఒక్కప్పుడు ప్రేక్షకులను థియేటర్కు రప్పించాలి అంటే ఇంకా ఏమేమి యాడ్ చేయాలని నేను కూడా ఆలోచించేవాడిని. నా వరకు అయితే ఆ పరిస్థితి లేదు. ప్రేక్షకులను థియేటర్కు రప్పించడంలో కొత్త వారికి మాత్రం బిగ్ ఛాలెంజ్గా మారింది. మేము తీసిన బలగం, కమిటీ కుర్రోళ్ళు ప్రేక్షకులను మెప్పించాయి. ఇదే సమయంలో రివ్యూస్ ఇచ్చే వారు కూడా మంచిగానే ఇవ్వడంతో మాకు ఇంకా కలిసొచ్చింది. అసలు ప్రేక్షకులను థియేటర్ల వరకు రాకుండా చెడగొట్టింది మేమేలెండీ.. సినిమా విడుదలయ్యాక నాలుగు వారాలు ఆగండి ఆ తర్వాత ఓటీటీలోకి తెస్తాము.. మీ ఇంట్లోనే కూర్చోని సినిమా చూడండి అని మేమే చెడగొట్టాం. రాంబాబు, ప్రభు నాకు చాలా మంచి సన్నిహితులు. వారు ఈ చిత్రం గురించి చెప్పారు. వీళ్లు వెనకాల ఉండి ఈ సినిమాను తీశారు కాబట్టి.. నేను ముందుండి నడిపించాలని అనుకున్నాను. ఇంత వరకు వీళ్ళు సినిమాని చూసి రివ్యూ రాశారు. ఇప్పుడు వీళ్ళు సినిమా (రేవు) తీశారు. కాబట్టి వీళ్ళ సినిమా (రేవు) చూసి నేను రివ్యూ రాస్తా’ అని అన్నారు.50 రోజుల షరతుప్రస్తుతం దిల్రాజు చేసిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేగుతుంది. సినిమా బాగున్నా వెంటనే ఓటీటీలోకి సినిమాలు వస్తుండటంతో ప్రేక్షకులు పెద్దగా థియేటర్ వైపు వెళ్లడం మానేశారు. సినిమా విడుదలయ్యాక కనీసం 50 రోజుల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలని పలు షరతులు ఉన్నప్పటికీ ఎవరూ వాటిని పాటించడం లేదు. అన్ని చిత్రపరిశ్రమలలో కూడా ఇదే పద్ధతి కొనసాగుతుంది.వాటి రేట్లు తగ్గిస్తేనే మనుగడప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకుడు థియేటర్కు వచ్చే అవకాశమే లేకుండా పోయింది. టికెట్ ధరలుతో పాటు పార్కింగ్, బ్రేక్ టైమ్లో తినుబండారాల ధరలు తారాస్థాయిలో ఉంటున్నాయి. మరికొన్ని థియేటర్లలో అయితే, నీళ్ల బాటిల్ కొనాలన్నా రూ. 100 చెల్లించాల్సిందే. ఒక ఫ్యామిలీ సినిమా చూడాలంటే కనీసం రూ. 2 వేలు ఖర్చు చేయాల్సిందే. ఇవన్నీ కాస్త తగ్గిస్తే సామాన్యుడు కూడా థియేటర్లో అడుగుపెట్టి సినిమా చూస్తాడు. లేదంటే రాబోయే రోజుల్లో థియేటర్ అనే పేరును కూడా మరిచిపోయే ఛాన్స్ ఉంది. -
గేమ్ ఛేంజర్ విడుదల తేదీని ప్రకటించిన దిల్ రాజు
రామ్ చరణ్ నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' సినిమా విడుదల తేదీని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తి అయిందని డైరెక్టర్ శంకర్ తెలిపిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్ నుంచి సినిమా రాలేదు కాబట్టి ఆయన ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. 'గేమ్ ఛేంజర్' పేరుతో రెండేళ్లుగా ఊరిస్తూనే ఉన్న ఇప్పటి వరకు అధికారికంగా మూవీ రిలీజ్ పై స్పష్టత లేదు. అటు డైరెక్టర్ శంకర్ ఇండియన్ 2 మూవీ ప్రమోషన్లలో ప్రకటిస్తాడు అనుకుంటే ఆయన కూడా రివీల్ చేయలేదు.జులై 26న విడుదల కానున్న 'రాయన్' సినిమా ప్రీ- రిలీజ్ కార్యక్రమం తాజాగా హైదరాబాద్లో జరిగింది. అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్ రాజు 'రాయన్' చిత్ర యూనిట్ను అభినందించారు. ఈ సినిమా విజయం సాధించాలని ఆయన కోరుకున్నారు. ఈ క్రమంలో 'గేమ్ ఛేంజర్' విడుదల ఎప్పుడు అంటూ చరణ్ ఫ్యాన్స్ పట్టుపట్టారు. దీంతో ఆయన చెప్పక తప్పలేదు. 'గేమ్ ఛేంజర్' మూవీని క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామని దిల్ రాజ్ ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అయ్యారు. దిల్ రాజు చెప్పిన ప్రకారం డిసెంబర్ 25న గేమ్ ఛేంజర్ విడుదల కానుంది. దీపావళికి విడుదలవుతుందని ఆశించిన ఫ్యాన్స్కు నిరాశే మిగిలింది.‘గేమ్ ఛేంజర్’ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. అంజలి, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
వెంకటేశ్- అనిల్ రావిపూడి హ్యాట్రిక్ సినిమా
‘ఎఫ్ 2, ఎఫ్ 3’ చిత్రాల తర్వాత హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో మరో సినిమా ప్రకటన వచ్చేసింది. అందుకు సంబంధించిన పోస్టర్ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ‘దిల్’ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇందులో మీనాక్షి చౌదరిని హీరోయిన్గా ఇప్పటికే ఎంపిక చేశారు. తాజాగా మరో పాత్ర కోసం ఐశ్వర్య రాజేశ్ని తీసుకున్నట్లు దర్శకుడు అనిల్రావిపూడి ప్రకటించారు.అయితే, తాజాగా ఈ సినిమా స్క్రిప్ట్, ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ను పూర్తి చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. బాపట్ల జిల్లా శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్టును స్వామి వారి పాదాల వద్ద ఉంచి ఆయన పూజలు చేశారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు హిట్ కావడంతో ఈ ప్రాజెక్ట్పై ఫ్యాన్స్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. యాక్షన్ నేపథ్యంలో సాగే చిత్రమని దర్శకుడు అన్నారు. ఇందులో వెంకటేశ్ భార్యగా ఐశ్వర్య, ఆయన ప్రియురాలి పాత్రలో మీనాక్షి చౌదరి కనిపించనున్నారని ముందే అనిల్ రివీల్ చేశాడు. మాజీ పోలీసాఫీసర్, అతని భార్య, ఆ పోలీసాఫీసర్ మాజీ ప్రేయసి... ఈ మూడు ప్రధాన పాత్రల నేపథ్యంలో సాగే క్రైమ్ ఎంటర్టైనర్ మూవీ అని ఆయన అన్నాడు. ఈ నెల 3 నుంచి ఈ ప్రాజెక్ట్ చిత్రీకరణ ప్రారంభించి వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనే ప్లాన్లో ఉన్నట్లు అనిల్ రావిపూడి తెలిపారు. -
‘లవ్ మీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆ ధైర్యం దిల్ రాజుకే సాధ్యం: అల్లు అరవింద్
ఆశిష్, బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం లవ్ మీ. ఇఫ్ యు డేర్ అన్నది ఉపశీర్షిక. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దిల్ రాజు గురించి ఆసక్తరమైన విషయాలను పంచుకున్నారు.లవ్ మీ చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశాన్ని అరుణ్కు దక్కడం చాలా సంతోషం అని అల్లు అరవింద్ అన్నారు. కొత్తవారికి దర్శకత్వం వహించే ఛాన్సులు ఎక్కువగా దిల్ రాజు ఇస్తుంటారని ఆయన గుర్తు చేశారు. డైరెక్షన్లో గత అనుభవం లేని వారికీ అవకాశాలు ఇవ్వడం దిల్ రాజుకే సాధ్యమని అల్లు అరవింద్ తెలిపారు. అలాంటి సాహసం తాను ఏమాత్రం చేయలేనని ఆయన అన్నారు. లవ్ మీ సినిమాతో కీరవాణి, పీసీ శ్రీరామ్లాంటి స్టార్ టెక్నిషియన్లతో మొదటి ప్రాజెక్ట్కే పని చేయడం అరుణ్ అదృష్టమని తెలిపారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని ఆరవింద్ ఆశించారు.దిల్ రాజు మాట్లాడుతూ..'హర్షిత్ రెడ్డి సినిమాపై ఉన్న ఆసక్తితో నిర్మాతగా మారాడు. హన్షిత చిన్నప్పటినుంచి షూటింగ్స్కు వెళ్లేది. కానీ సినిమా రంగంలోకి వస్తుందని ఊహించలేదు. వీరిద్దరు కలిసి దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్పై చిత్రాలు నిర్మిస్తున్నారు. తొలి సినిమా బలగంతో వేణు యెల్దండిని దర్శకుడిగా పరిచయం చేశారు. లవ్ మీతో అరుణ్కు ఛాన్స్ ఇచ్చారు. మరికొన్ని సినిమాల వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం. కొత్తవారిని ప్రోత్సహించాలనేదే మా లక్ష్యం' అని అన్నారు. -
వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
నేషనల్ అవార్డ్ విన్నర్ 'అల్లు అర్జున్' అంటే పేరు కాదు ఒక బ్రాండ్ అనేలా తనను తాను మలుచుకున్నాడు. 'గంగోత్రి'తో ఇండస్ట్రీలో ఆయన ఎంట్రీ సులువుగానే జరిగిపోయింది. కానీ, 'ఆర్య' నుంచి తన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఐకాన్ స్టార్గా ఎదిగాడు. బాక్సాఫీసు దగ్గర వసూళ్ల పరంగానే కాకుండా... పురస్కారాల్లోనూ తగ్గేదేలే అని చాటి చెప్పాడు. 'గంగోత్రి'లో అందర్నీ నటనతో కట్టిపడేసిన బన్ని.. తర్వాత వచ్చిన 'ఆర్య'తో తన మార్క్ను చూపించాడు. ఆర్య సినిమా బన్నీకి మాత్రమే కాదో ఎందరో జీవితాలను మార్చేసింది. ఆ సినిమాతో మొదలైన సుకుమార్- బన్నీ ప్రయాణం.. పుష్ప చిత్రం ద్వారా నేషనల్ అవార్డు వరకు చేరింది. అందుకే ఆర్య సినిమా వారందరికీ చాలా ప్రత్యేకం. సరిగ్గా నేటికి ఆర్య విడుదలై 20 సంవత్సరాలు అయింది.అల్లు అర్జున్ హీరోగా నటించిన రెండవ సినిమానే ఆర్య. సుకుమార్కు ఇదే మొదటి సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా 7 మే 2004లో విడుదలైంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ఇందులో బన్నీకి జోడిగా అనురాధ మెహతా నటించింది. మొదటి ఆటతోనే 'ఫీల్ మై లవ్' అంటూ 'ఆర్య'తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు అల్లు అర్జున్. ఆర్య సినిమా తర్వాత బన్నికి కేవలం తెలుగులోనే కాదు, పొరుగు ఇండస్ట్రీల్లోనూ భారీగా క్రేజ్ వచ్చింది. ఇక్కడ అల్లు అర్జున్ను మనం ప్రేమగా బన్నీ అని పిలుచుకుంటే.. మలయాళం ప్రేక్షకులకు మల్లు అర్జున్ అయిపోయాడు. ఈ సినిమాతో అల్లు అర్జున్ కెరియరే మారిపోయింది. తనలోని డ్యాన్స్,నటన, స్టైల్ ఇలా అన్నీ తెరపై చూపించాడు. దీంతో ఒక్కసారిగా ఆయనకు చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు.ఆర్యతో మారిపోయిన జీవితాలుసుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్య చిత్రం నేటితో 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఎందరో జీవితాలని మార్చింది. నటుడిగా అల్లు అర్జున్, దర్శకుడిగా సుకుమార్, నిర్మాతగా దిల్రాజుకి, సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్కి, డీఓపీగా రత్నవేలుకి, డిస్ట్రిబ్యూటర్గా బన్ని వాసుకి ఇలా చాలామందికి ఆర్య మంచి గుర్తింపునిచ్చింది. వారందరి కెరీర్లో ఒక మైలురాయిగా ఆర్య నిలిచిపోయింది. ఇలా ఎందరికో బ్రేక్ ఇచ్చిన ఆర్యను గుర్తు చేసుకుంటూ ఒక ఈవెంట్ను ప్లాన్ చేయాలని దిల్ రాజు ఉన్నారట. దీని నుంచి అధికారక ప్రకటన రాలేదు.అల్లు అర్జున్ రియాక్షన్ఆర్యకు 20 సంవత్సరాలు. ఇది సినిమా మాత్రమే కాదు.. నా జీవిత గమనాన్ని మార్చిన ఒక క్షణం. ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. అని తెలిపాడు 20 years of Arya. It’s not just a movie … it’s a moment in time that changed the course of my life . Gratitude forever . pic.twitter.com/DIYyWIP7ig— Allu Arjun (@alluarjun) May 7, 2024 -
టాలెంటెడ్ డైరెక్టర్తో దిల్ రాజు- విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రకటన
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరోసారి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్లో నటిస్తున్నారు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా విజయ్ తన కొత్త సినిమాను తాజాగా ప్రకటించారు. 'రాజావారు రాణిగారు' సినిమాతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీసీ సంస్థలో వస్తున్న 59వ సినిమా ఇది. ఈరోజు లాంఛనంగా అనౌన్స్ చేశారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో విజయ్ దేవరకొండ కొత్త సినిమా తెరకెక్కనుంది. మే 9న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు. విజయ్ దేవరకొండ- దిల్ రాజు కాంబోలో ఫ్యామిలీస్టార్ సినిమా కొద్దిరోజుల క్రితమే విడుదలైంది. కొందరు కావాలని సినిమాపై నెగెటివ్ టాక్ వ్యాప్తి చేయడంతో కొంతమేరకు నిరాశపరిచిందని వార్తలు వచ్చాయి. కానీ, హిట్టు ఫ్లాప్తో సంబంధం లేకుండా విజయ్ దేవరకొండతో మరొక సినిమా చేస్తానని దిల్ రాజు గతంలోనే అన్నారు. అయితే ఫ్యామిలీ స్టార్ ఫలితం తర్వాత దిల్ రాజు ఇచ్చిన మాటను పక్కనపెడుతారేమో అని అందరూ అనుకున్నారు. అందరి అంచనాలకు మించి ఆయన తాజాగా కొత్త సినిమాను ప్రకటించారు. కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న రవికిరణ్ కోలాకి ఏకంగా ఇంతటి భారీ ప్రాజెక్ట్ను డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చి దిల్ రాజు అందరిని ఆశ్చర్య పరిచారు. ఇక్కడ విజయ్ దేవరకొండ కూడా తన కమిట్మెంట్తో దిల్ రాజు మనసు గెలుచుకున్నారని చెప్పవచ్చు. A Larger-than-life "Rural Action Drama" is on the cards 🧨#SVC59 will be @TheDeverakonda's Mass EndeavourX A @storytellerkola's Vision 💥 Produced by Raju - Shirish ✨More Updates on 9th May, Stay tuned to @SVC_official pic.twitter.com/FVca4INOGC— Sri Venkateswara Creations (@SVC_official) May 4, 2024 -
ఆర్థిక ఇబ్బందులు ఉంటే 'దిల్ రాజు' సాయం చేశారు: విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ - మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం 'ఫ్యామిలీ స్టార్'. గీతా గోవిందం తర్వాత విజయ్తో డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు నిర్మించారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ప్రెస్మీట్లో పాల్గొన్న విజయ్ దేవరకొండ.. దిల్ రాజు గురించి ఆసక్తికర సంఘటనను గుర్తుచేసుకున్నారు. కొవిడ్ సమయంలో విజయ్కు దిల్ రాజు చేసిన సాయాన్ని బహిరంగంగానే ఇలా చెప్పాడు. 'నాతో సినిమా చేయాలని దిల్ రాజు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. నాకు కూడా ఆయన బ్యానర్లో సినిమా చేయాలనే కోరిక ఉంది. అందుకోసం కొన్ని కథలు కూడా పంపించారు. కానీ సినిమా పట్టాలెక్కేందుకు కాస్త సమయం తీసుకుంది. ఇంతలో కొవిడ్ రావడంతో ఆ సమయంలో నాకు కొంత డబ్బు అవరసరం వచ్చింది. అప్పుడు దిల్ రాజు గారే అడ్వాన్స్ రూపంలో సాయం చేశారు. అప్పటికి సినిమా కూడా ఒప్పుకోలేదు.' అని ఆయన అన్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై తెరకెక్కిన 'కేరింత' కోసం ఆడిషన్స్కు వెళ్లితే తనను సెలెక్ట్ చేయలేదని విజయ్ దేవరకొండ గుర్తుచేసుకున్నాడు. అందుకు తాను బాగా హర్ట్ అయినట్లు ఆయన చెప్పారు. అదే విషయాన్ని కొన్నేళ్ల క్రితం దిల్రాజుతోనూ చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఆ సమయం నుంచి కరెక్ట్ కథ కోసం ఎదురుచూస్తే.. ఇప్పుడు ఫ్యామిలీస్టార్తో సెట్ అయినట్లు విజయ్ అన్నారు. ఫ్యామిలీస్టార్ తర్వాత విజయ్తో మరో సినిమా తీస్తానని దిల్ రాజు ప్రకటించారు. చాలారోజుల నుంచి విజయ్తో భారీ ప్రాజెక్ట్ చేయాలని ప్లాన్ చేసినట్లు దిల్ రాజు అన్నారు. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా రెడీ పెట్టుకున్నానని ఆయన అన్నారు. -
ఆ ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్యామిలీస్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్
విజయ్ దేవరకొండ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ‘ఫ్యామిలీస్టార్’ మరో కొద్దిరోజుల్లో థియేటర్లోకి రానున్నాడు. వేసవి సందర్భంగా ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్కు జోడీగా మృణాల్ ఠాకూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు - శిరీశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విడుదల తేది దగ్గరపడుతుండటంతో ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు స్పీడ్ అందుకున్నాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 2న ఫ్యామిలీస్టార్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని మైసమ్మగూడ వద్ద ఉన్న నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో సాయింత్రం 5:30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మేరకు చిత్ర మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించింది. 'గీత గోవిందం' కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ... సినిమాలో వినోదంతో పాటు ఫైట్స్, కామెడీ, భావోద్వేగాలు అన్నీ కలిపిన పక్కా సమ్మర్ ఎంటర్టైనర్ అని పేర్కొన్నారు. ఒక కుటుంబాన్ని ఉన్నతస్థాయికి తీసుకువెళ్లే ప్రతీ మనిషి ఫ్యామిలీ స్టారే అంటూ ఈ సినిమా చూశాక చాలామంది ఫ్యామిలీస్టార్స్లా మారతారని ఆయన అభిప్రాయపడ్డారు. -
ఆ ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్యామిలీస్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్
విజయ్ దేవరకొండ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ‘ఫ్యామిలీస్టార్’ మరో కొద్దిరోజుల్లో థియేటర్లోకి రానున్నాడు. వేసవి సందర్భంగా ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్కు జోడీగా మృణాల్ ఠాకూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు - శిరీశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విడుదల తేది దగ్గరపడుతుండటంతో ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు స్పీడ్ అందుకున్నాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 2న ఫ్యామిలీస్టార్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని మైసమ్మగూడ వద్ద ఉన్న నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో సాయింత్రం 5:30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మేరకు చిత్ర మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించింది. 'గీత గోవిందం' కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ... సినిమాలో వినోదంతో పాటు ఫైట్స్, కామెడీ, భావోద్వేగాలు అన్నీ కలిపిన పక్కా సమ్మర్ ఎంటర్టైనర్ అని పేర్కొన్నారు. ఒక కుటుంబాన్ని ఉన్నతస్థాయికి తీసుకువెళ్లే ప్రతీ మనిషి ఫ్యామిలీ స్టారే అంటూ ఈ సినిమా చూశాక చాలామంది ఫ్యామిలీస్టార్స్లా మారతారని ఆయన అభిప్రాయపడ్డారు. Let us indulge in an evening of celebration with the amazing team of #Family Star and the energetic fans ❤️🔥#FamilyStar Grand Pre-release event on April 2nd 💥💥 Venue : Narasimha Reddy Engineering College, Maisammaguda, Hyd.#FamilyStarOnApril5th@TheDeverakonda @Mrunal0801… pic.twitter.com/3Mh3MmVKYn — Sri Venkateswara Creations (@SVC_official) March 31, 2024 -
నితిన్ 'తమ్ముడు' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
టాలీవుడ్ హీరో నితిన్ నేడు (మార్చి 30) 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన కొత్త చిత్రానికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. వకీల్ సాబ్ సినిమా డైరెక్టర్ వేణు శ్రీరామ్ కాంబినేషన్లో నితిన్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'తమ్ముడు' అనే టైటిల్ను ఫిక్స్ చేసిన మేకర్స్.. నేడు నితిన్ పుట్టినరోజు కావడంతో ఒక పోస్టర్ను విడుదల చేశారు. ఈ సినిమాని దిల్రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మితమవుతున్న 56వ సినిమాగా రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు కూడా దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఇప్పుడు విడుదల చేసిన పోస్టర్లో నితిన్ కాస్త డిఫరెంట్ లుక్లో కనిపిస్తున్నాడు. ఆడవాళ్లు లారీ తోలుతుంటే లారీపై కుమారస్వామి ఆయుధం పట్టుకొని నితిన్ కూర్చున్నాడు. భారీ యాక్షన్ ఎపిసోడ్కు సంబంధించిన సీన్ నుంచి ఈ పోస్టర్ను విడుదల చేసినట్లు తెలుస్తోంది. నితిన్- దర్శకుడు విక్రమ్ కే కుమార్ కాంబినేషన్లో మరో సినిమాను రానుంది. వీరిద్దరి కాంబోలో ఇష్క్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో నితిన్ భారీ హిట్ అందుకున్నాడు. A story of ambition, courage, and determination🎯 Presenting the passion-filled first look of #THAMMUDU ❤️🔥 Wishing everyone's Favourite Brother @actor_nithiin a very Happy Birthday ❤️🎉#HBDNithiin A Film by #SriramVenu #DilRaju @SVC_official @AJANEESHB pic.twitter.com/30PgqvLvIZ — Sri Venkateswara Creations (@SVC_official) March 30, 2024 -
పద్మశ్రీ అవార్డు గ్రహీతకు 'దిల్ రాజు' సాయం
అంతరించిపోతున్న ఆ కళకు అతడే చివరి వారసుడు. బుర్రవీణను భుజాన మోస్తూ.. రామాయణం, ఆధ్యాత్మిక, గ్రామీణ కథలకు తగ్గట్లు వాయిద్యం వాయిస్తూ.. పాటలు పాడుతూ అందరినీ అబ్బురపరిచారు దాసరి కొండప్ప. వాయిద్యం, పాట మాత్రమే తెలిసిన అతడిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. నారాయణపేట జిల్లా దామరగిద్దకి చెందిన ఒలియ దాసరి కుటుంబీకుడైన కొండప్పది ఎంతో నిరుపేద కుటుంబం.. రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి ఆయనది. తాతల కాలం నుంచే బుర్రవీణ వాయిద్యంతో భిక్షాటన చేస్తూ తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. నేడు కేంద్ర ప్రభుత్వం ఆయన్ను గుర్తించి దేశంలోనే నాలుగో అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అందించడంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా వైరల్ అయింది. కానీ కొన్ని సంవత్సరాలుగా తిరుమలరావు అనే వ్యక్తి ద్వారా ఆంధ్ర ప్రాంతంలో పాటలు పాడి తన కళకు గుర్తింపు సంపాదించారు. ఈ క్రమంలో ఆయన కళను గుర్తించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన కూతురు నిర్మించిన బలగం చిత్రంలో ఒక పాట పాడేందుకు అవకాశం ఇచ్చారు. ఆ చిత్రంలో ‘అయ్యో శివుడా ఏమాయే ఎనకటి దానికి సరిపోయే’ అనే పాటకు తన గాత్రాన్ని అందించాడు కొండప్ప. తాజాగా కొండప్పను తన ఆఫీస్కు దిల్ రాజు పిలుపించుకున్నారు. ఆపై ఆయన్ను సన్మానించి గౌరవించారు. దిల్ రాజుతో పాటు బలగం డైరెక్టర్ వేణు తదితరులు కొండప్పను అభినందించారు. అనంతరం దిల్ రాజు లక్ష రూపాయల చెక్కుని కొండప్పకు అందించారు. ఆ డబ్బును కొండప్ప కోసం మాత్రమే వాడాలని సూచించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. #DasariKondappa garu who sang a song and acted in the film #Balagam has been awarded the PRESTIGIOUS PADMA SHRI ❤️ The entire team met him, felicitated him and presented a cheque of 1 Lakh as a token of appreciation!@VenuYeldandi9 @PriyadarshiPN @kavyakalyanram @dopvenu pic.twitter.com/gVNabIzGNK — Dil Raju Productions (@DilRajuProdctns) February 3, 2024 -
‘ధీర’ట్రైలర్ బాగుంది.. వారి కష్టానికి ప్రతిఫలం రావాలి: దిల్ రాజు
‘‘25 ఏళ్ల నుంచి చదలవాడ బ్రదర్స్ని చూస్తున్నాం. శ్రీనివాస్గారు చిన్న నిర్మాతలకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారు. ఇక లక్ష్ నటించిన ‘ధీర’ట్రైలర్ బాగుంది. తన హార్డ్ వర్క్, చిత్ర యూనిట్ పడిన కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. లక్ష్ చదలవాడ హీరోగా విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ధీర’. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మించిన ఈ మూవీ రేపు (శు క్రవారం) విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి ‘దిల్’ రాజు, దర్శకులు గోపీచంద్ మలినేని, త్రినాథరావు నక్కిన అతిథులుగా హాజరై, సినిమా బిగ్ టికెట్ను లాంచ్ చేశారు. చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘ఇన్నేళ్లలో ఎంతో మంది దర్శకులని పరిచయం చేశాను. ‘ధీర’తో విక్రాంత్ను పరిచయం చేస్తున్నాను. లక్ష్ ను చూసి తండ్రిగా గర్విస్తుంటాను. మా ప్రొడక్షన్లో ఇప్పుడు పదహారు చిత్రాలు రెడీగా ఉన్నాయి’’ అన్నారు. ‘‘పక్కోడి గురించి పట్టించుకోకుండా నచ్చింది చేసే వాడికి ఓ మిషన్ అప్పగిస్తే ఆ ప్రయాణంలో ఏర్పడిన సమస్యల్ని ‘ధీర’లో చూస్తారు’’ అన్నారు లక్ష్ చదలవాడ. ‘‘ధీర’ చాలా యూనిక్ పాయింట్. అందరికీ నచ్చుతుంది’’ అన్నారు విక్రాంత్ శ్రీనివాస్. -
దేవర రిలీజ్ పై దిల్ రాజు కీలక వ్యాఖ్యలు
-
టీజర్ ఆసక్తికరంగా ఉంది
సంబీత్ ఆచార్య, జో శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఎమ్4ఎమ్’. నిర్మాత మోహన్ వడ్లపట్ల ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. మోహన్ మీడియా క్రియేషన్స్, జో శర్మ మెక్విన్ గ్రూప్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా టీజర్ను విడుదల చేసిన ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘టీజర్ ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘దర్శకుడిగా కొత్త అవతారం ఎత్తాను. నెక్ట్స్ హాలీవుడ్లోనూ ఓ సినిమాను నిర్మించబోతున్నాను. రాహుల్ అడబాల, జో శర్మలు ఈ చిత్రకథ రాయడంలో సహకరించారు’’ అన్నారు మోహన్ వడ్లపట్ల. ఎంఆర్సీ చౌదరి, రాహుల్ అడబాల మాట్లాడారు. -
పగ.. ప్రతీకారం...
కళాధర్ కొక్కొండ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘కర్ణ’. మోనా ఠాకూర్ హీరోయిన్గా నటించారు. సనాతన క్రియేషన్స్పై రూపొందిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్ని నిర్మాత ‘దిల్’ రాజు విడుదల చేశారు. కళాధర్ కొక్కొండ మాట్లాడుతూ– ‘‘వాస్తవ ఘటనలతో యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘కర్ణ’. పగ, ప్రతీకారం నేపథ్యంలో కథ సాగుతుంది. ఈ చిత్రంలోని ఫీల్ గుడ్ లవ్స్టోరీ, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్ బీజే, కెమెరా: శ్రవణ్ జి.కుమార్. -
'కర్ణ' కోసం వెళ్లిన దిల్ రాజు
యదార్థ సంఘటనల ఆధారంగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కర్ణ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సనాతన క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై కళాధర్ కొక్కొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూనే స్వీయ నిర్మాణంలో హీరోగా నటిస్తుండడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ ప్రేక్షకుల మెప్పు పొంది ఆసక్తి పెంచేసింది. జూన్ 23వ తేదీన ఈ సినిమాను థియేటర్స్లో విడుదల చేస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఈ మూవీ ట్రైలర్ను దిల్ రాజు చేతుల మీదుగా రిలీజ్ చేశారు. అనంతరం యూనిట్ మొత్తానికి బెస్ట్ విషెష్ చెప్పారు. (ఇదీ చదవండి: Adipurush: ఏకంగా లక్షకు పైగా టికెట్లు కొనేశాడు..!) యుద్ధం శరణం శిక్షామి, స్నేహం శూన్యం రక్ష్యామి, లోకం స్వార్థం ప్రక్షామి అనే లైన్స్ షో చేస్తూ మొదలు పెట్టిన ఈ ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్లో మూవీ సోల్ తెలిసేలా సన్నివేశాలు కట్ చేశారు. ముఖ్యంగా హీరోయిజం, యాక్షన్ సన్నివేశాలు హైలైట్ చేస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. పగ, ప్రతీకారం నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాలకు తోడు పల్లెటూరి వాతావరణం, ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కూడా ఈ సినిమాలో చూడొచ్చని ట్రైలర్ స్పష్టం చేసింది. ట్రైలర్ మొత్తం కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మేజర్ హైలైట్ అయింది. చట్టానికి చిక్కిన రవికిరణం, సంకెళ్లతో బిగిసిన ప్రతీకారం.. ద్రోహం, విద్రోహం.. కన్నీళ్లతో రగిలే ఆగ్రహం.. మేధం నరమేధం రక్తంతో రాసిన శాసనం అంటూ ఉత్కంఠ రేపే సీన్స్ చూపిస్తూ ఈ ట్రైలర్ క్లోజ్ చేశారు. చివరలో సెంటిమెంట్ సీన్స్ చూపించి ఆసక్తి పెంచేశారు. (ఇదీ చదవండి: Adipurush: అక్కడ కేవలం 24 టికెట్లే అమ్ముడుపోయాయట) -
సీనియర్ హీరోయిన్పై మనుసు పడిన రౌడీబాయ్
టాలీవుడ్ రౌడీబాయ్ విజయ్ దేవరకొండ స్పీడ్ పెంచాడు. ఇప్పుడిప్పుడే 'లైగర్' సినిమా గొడవల నుంచి బయటపడుతున్న ఈ యంగ్ హీరో తన నెక్స్ట్ సినిమా కోసం సీనియర్ హీరోయిన్ను తీసుకోవాలని దర్శక నిర్మాతలకు సలహా ఇచ్చాడట. ఇప్పటికే సమంత కాంబినేషన్లో ఖుషి సినిమా చేస్తున్న విజయ్ .. తర్వాత సినిమాకు కూడా సీనియర్ హీరోయిన్పైనే ఆసక్తి చూపుతున్నాడట. తాజాగా నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ పరశురాంతో కలిసి ఓ సినిమాను విజయ్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్గా తీసుకోవాలని వారికి సూచించాడట. ఇదే టాపిక్ టాలీవుడ్లో తెగ వైరల్ అవుతుంది. (ఇదీ చదవండి: కాబోయే మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. అందరి చర్చ దానిపైనే!) పూజానే ఎందుకు? పూరి డైరెక్షన్లో 'జనగణమన' సినిమాను తెరకెక్కించాలనుకున్న విజయ్కు 'లైగర్' షాక్ ఇవ్వడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇదే సినిమాలో పూజ హెగ్డేను హీరోయిన్గా కూడా ఓకే చేశారు. అయితే ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ లేదు కాబట్టి.. పరుశురాం సినిమాతో తనను తీసుకోవాలని విజయ్ ప్లాన్ చేశాడట. ఈ విషయంపై మేకర్స్ కూడా ఓకే చెప్పారట. ఏదేమైనా సమంత తర్వాత మరో సీనియర్ హీరోయిన్తో నటించే అవకాశాన్ని విజయ్ దేవరకొండ పొందాడు. (ఇదీ చదవండి: మంచు మనోజ్- భూమా మౌనిక.. ఇంత ఫ్యాషన్గా ఎప్పుడైనా చూశారా?) -
దిల్ రాజు మాటలకు ఐశ్వర్య రాయ్ ఎలా నవ్వుతుందో చుడండి..
-
దిల్ రాజుకు భారీ షాక్ ఇచ్చిన సమంత..
-
‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుతో దిల్ రాజు భేటీ
మూవీ అర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడు మంచు విష్ణుతో నిర్మాత దిల్ రాజు సమావేశమయ్యారు. గురువారం ఉదయం మా కార్యాలయానికి వెళ్లిన దిల్ రాజు ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా షూటింగ్స్ బంద్పై, మా సభ్యులకు సినిమా అవకాశాలపై వీరు ముచ్చటించారని మంచు విష్ణు తెలిపారు. ఈ మేరు ఆయన ట్వీట్ చేశారు. దిల్ రాజును కలిసిన సందర్భంగా తీసుకున్న ఫొటోను షేర్ చేశారు. చదవండి: తండ్రి మరణాన్ని గుర్తు చేసుకుని ఎమోషనలైన కల్యాణ్ రామ్ ఈ సందర్భంగా తమ సినిమాల్లో ‘మా’ సభ్యులకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలని, అలాగే కొత్తవారు ‘మా’ సభ్యత్వం పొందేలా ప్రోత్సహించాలని దిల్ రాజును కోరినట్లు విష్ణు తెలిపారు. ఈ మేరకు మా సంక్షేమ కమిటి వినతి పత్రాన్ని దిల్ రాజుకు అందించారు. కాగా ‘మా’ సభ్యులకు సినిమా అవకాశాలు కల్పించాలని కోరుతూ విష్ణు ఇకపై పలువురు టాలీవుడ్ నిర్మాతలను కలవనున్నారట. ఈ నేపథ్యంలోనే ఆయన దిల్ రాజుతో భేటి అయినట్లు సమాచారం. చదవండి: విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు హఠాన్మరణం Started meeting our TFI producers on behalf of MAA, requesting them to hire mostly MAA members and also to encourage newcomers to become a part of the MAA family. pic.twitter.com/1AjvqU436J — Vishnu Manchu (@iVishnuManchu) August 4, 2022 -
వాళ్లందర్నీ కలిసి థ్యాంక్స్ చెప్పాను
‘‘రచయిత బీవీఎస్ రవి నాలుగేళ్ల క్రితం నాకు ‘థ్యాంక్యూ’ స్టోరీ లైన్ చెప్పినప్పుడు ఎగ్జయిట్ అయ్యాను. ఇదే లైన్ని నాని ‘గ్యాంగ్ లీడర్’ ప్రీమియర్లో విక్రమ్ కుమార్కి చెబితే తను కూడా ఎగ్జయిట్ అయ్యి, సినిమా చేద్దాం అన్నాడు. ‘మనం’ చిత్రం తర్వాత విక్రమ్కి, చైతన్యకి మధ్య ఉన్న కెమిస్ట్రీ (డైరెక్టర్, హీరోగా) మా సినిమాకి ప్లస్ అయింది. ‘థ్యాంక్యూ’లో మూడు పాత్రల్లో నాగచైతన్య అద్భుతంగా నటించాడు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. అక్కినేని నాగచైతన్య హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘థ్యాంక్యూ’. అనిత సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదలకానుంది. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు విలేకరులతో పంచుకున్న విశేషాలు. ► బీవీఎస్ రవి చెప్పిన స్టోరీ లైన్తో ఓ హీరో కేరక్టర్ రాయాలనుకున్నాం. ఆ పాత్రకి గతం చెప్పాలనుకున్నాం. అందుకే ‘థ్యాంక్యూ’లో హీరో పాత్రలో కాలేజ్, టీనేజ్.. ఇలా అన్నింటినీ డిజైన్ చేశాం. స్క్రీన్ప్లే, సీన్స్ అన్నీ విక్రమ్ స్టైల్లో రాయమని రవికి చెబితే అలాగే రాశాడు. ∙ ► కరోనా లాక్డౌన్ సమయంలో నేను కూడా వ్యక్తిగతంగా ‘థ్యాంక్యూ’ జర్నీని స్టార్ట్ చేశాను. నాకు స్కూల్లో, ఆటోమొబైల్ రంగంలో సహాయం చేసిన వారందర్నీ కలిసి థ్యాంక్స్ చెప్పాను. ఇక ఫిల్మ్ ఇండస్ట్రీలో థ్యాంక్యూ జర్నీని కంటిన్యూ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాను. ∙ ► ‘థ్యాంక్యూ’ సినిమాలో ఒక సాధారణ కుర్రాడు లెజెండ్ అవుతాడు. మొత్తం నేనే అనుకుంటాడు. కానీ అది నిజం కాదు. అతనికి సాయం చేసినవాళ్లు చాలామంది ఉంటారు. అందమైన ప్రేమకథ, వాణిజ్య అంశాలన్నీ కలిపి ఈ కాన్సెప్ట్ని సినిమాటిక్గా చెప్పడానికి ఎక్కువ స్ట్రగుల్ అయ్యాం. గతం గురించి ఆలోచించే టైమ్ ప్రస్తుతం ఎవరికీ లేదు. ► కథ విషయంలో ప్రతి డైరెక్టర్తో డిస్కస్ చేస్తాను. నా సలహాలను కొందరు డైరెక్టర్లు వింటారు.. మరికొందరు తామే రైట్ అంటారు. అలాంటివాళ్లతో నేను వాదించను. ∙పెద్ద డైరెక్టర్ల అనుభవాలు వాడుకుంటాను. కొత్తవాళ్లకి పాయింట్ టు పాయింట్ రాసిస్తాను. దానికి రీచ్ అవుతున్నామా? లేదా అని చెక్ చేస్తాను. మిడ్ వాళ్లతో అటూ ఇటూ ఉంటాను. ► కరోనాకి ముందు, కరోనా తర్వాత ప్రేక్షకుల ఆలోచనలు మారిపోయాయి. అంతకుముందు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూద్దామనే మూడ్లో ఉన్నారు. లాక్డౌన్లో ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో చాలా కంటెంట్ చూసి, ఎడ్యుకేట్ అయ్యారు. ఇప్పుడు వాళ్లకి అంతంత మాత్రం కంటెంట్ నచ్చట్లేదు. దీనికోసం ఇంత డబ్బు పెట్టి వెళ్లాలా? అనుకుంటున్నారు. ఈ విషయంలో చిత్ర పరిశ్రమ మారాల్సిన టైమ్ వచ్చింది. మంచి కంటెంట్ ఇచ్చి టిక్కెట్ ధరలు తగ్గిస్తే జనాలు వస్తారు. ఓటీటీలో త్వరగా సినిమాలు రావడం వల్ల కూడా థియేటర్లకు వచ్చే జనాలు తగ్గారు. మీడియం రేంజ్ నుంచి టాప్ స్టార్స్ సినిమాలు థియేటర్లలో వచ్చాకే ఓటీటీకి వెళ్లాలి. అది ఎన్ని వారాలకు? అనేది నిర్మాతలందరూ కలిసి మాట్లాడుకుంటున్నాం. ఈ మధ్య వచ్చిన ‘మేజర్, విక్రమ్’ సినిమాల కంటెంట్ బాగుండటంతో ప్రేక్షకులు ఆదరించారు... మంచి కంటెంట్ ఉంటే హిట్ చేస్తారు. ► ఒక సినిమా ఫ్లాప్కు చాలా కారణాలుంటాయి. కరోనా తర్వాత వచ్చిన ఆర్థిక ఇబ్బందులవల్ల జనాల్లో డబ్బు ఖర్చు చేసే సత్తా కూడా తగ్గింది. ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించడం అనేది గతంలో నిర్మాత సమస్య. కానీ ఇప్పుడు సినిమాది. అందుకే అందరం కలిసి మాట్లాడుకుంటున్నాం. ప్రతి సినిమాకీ డబ్బు పోతుందని తెలిస్తే బాధ ఉంటుంది. ఈ విషయం డైరెక్టర్లకీ, హీరోలకి కూడా అర్థమైంది. హిందీలో తీసిన ‘హిట్’ సినిమాకి మేం నష్టపోలేదు. కానీ, ‘జెర్సీ’ రీమేక్ని కరోనా పరిస్థితుల్లో రిలీజ్ చేయడం వల్ల 3–4 కోట్ల డ్యామేజ్తో బయటపడ్డాం. ఓటీటీల వల్ల నిర్మాతలకు లాభం కన్నా నష్టమే ఎక్కువ. ఓటీటీలో సూపర్హిట్ అయినా వచ్చేదేమీ లేదు. అదే సినిమా థియేటర్లలో రిలీజ్ అయితే ఆ వసూళ్లు, ఆ ఎనర్జీ వేరు. ప్యాషన్గా సినిమా తీయాలనుకున్నవారికి డబ్బులతో పాటు ఎనర్జీ కూడా ముఖ్యమే. హీరోలందరికీ ప్రస్తుత పరిస్థితు (నిర్మాణ వ్యయాన్ని ఉద్దేశించి) లను, సమస్యను చెబితే అర్థం చేసుకుంటారనే నమ్మకం ఉంది. -
20 ఏళ్ల ప్రయాణం.. ఇది మామూలు విషయం కాదు: దిల్ రాజు
‘‘జయం’(2002) సినిమాతో మొదలైన నితిన్ ప్రయాణం ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకోవడం మామూలు విషయం కాదు. తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఎక్కువ మంది హీరోలు ఉన్నారు. ఇంత పోటీలో కూడా నితిన్ సక్సెస్ ఫుల్గా ఉండటం గొప్ప విషయం. ‘మాచర్ల నియోజకవర్గం’ బ్లాక్బస్టర్ అవుతుంది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. నితిన్, కృతీశెట్టి, కేథరీన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఎమ్.ఎస్. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రాజ్కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 12న రిలీజ్ కానుంది. మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘రా రా రెడ్డి.. ఐ యామ్ రెడీ’ పాట లిరికల్ వీడియోను ‘దిల్’ రాజు విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటను లిప్సిక ఆలపించారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. పాట రిలీజ్ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ– ‘‘నా అభిమానుల కోసం ఈ చిత్రంలో హెవీ డ్యాన్స్ నంబర్స్ పెట్టాం. ‘రా రా రెడ్డి..’ పాటలో నా ‘జయం’ చిత్రంలోని ‘రాను రాను అంటూనే..’ పాటను రిపీట్ చేయడం ప్రత్యేకంగా అనిపించింది. అంజలి కాలికి గాయమైనప్పటిMీ ఫ్లోర్ మూమెంట్స్ని హార్డ్వర్క్తో కంప్లీట్ చేశారు’’ అన్నారు. ‘‘మాచర్ల నియోజకవర్గం’ సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు రాజశేఖర్ రెడ్డి. -
వెనక్కి తగ్గిన నాగ చైతన్య.. 'థ్యాంక్యూ' రిలీజ్లో మార్పు
Naga Chaitanya Raashi Khanna Thank You Movie Postponed: అక్కినేని నాగ చైతన్య తన అభిమానులకు బ్యాడ్ న్యూస్ తెలిపాడు. చై హీరోగా నటించిన తాజా చిత్రం 'థ్యాంక్యూ'. ఈ మూవీ రిలీజ్లో చిన్న మార్పు జరిగింది. ఈ చిత్రాన్ని జులై 8న విడుదల చేయనున్నట్లు ఇంతకుముందు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ రిలీజ్ డేట్లో చిన్న మార్పు చేశారు. ఈ సినిమాను జులై 22న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ప్రకటించారు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటించారు. అలాగే అవికా గోర్ మరో కీలక పాత్ర పోషించింది. ''మా టీజర్ సినిమాపై ఆసక్తి పెంచగా, 'మారో..', 'ఎంటో ఏంటేంటో..' పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. చైతన్య కెరీర్లో స్పెషల్ మూవీగా నిలుస్తుంది.'' అని చిత్రబృందం పేర్కొంది. చదవండి: నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్.. బాయ్ఫ్రెండ్ కామెంట్ ఏంటంటే ? #ThankYouTheMovie is now hitting the screens on July 22nd! It will be worth the wait...We promise! #ThankYou for understanding ♥️ @chay_akkineni @RaashiiKhanna_@Vikram_K_Kumar @MusicThaman @pcsreeram @BvsRavi @SaiSushanthR #MalavikaNair @avika_n_joy @SVC_official @adityamusic pic.twitter.com/xAyBsIbMxJ — Sri Venkateswara Creations (@SVC_official) June 24, 2022 #ThankYouTheMovie in Theatres on July 22nd😍https://t.co/ABhrv9Ndap#ThankYouOnJuly22nd@chay_akkineni @RaashiiKhanna_@Vikram_K_Kumar @MusicThaman @pcsreeram @BvsRavi @SaiSushanthR #MalavikaNair @avika_n_joy @SVC_official @adityamusic pic.twitter.com/RlPP5acpJU — Sri Venkateswara Creations (@SVC_official) June 24, 2022 -
ఎఫ్ 3లో పవన్ కల్యాణ్?, దిల్ రాజు క్లారిటీ
Dil Raju Clarifies On Pawan Kalyan In F3 Movie: విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎఫ్ 3. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో మెహరీన్, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా రేపు(మే 27న) థియేటర్లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్ కార్యక్రమాలంతో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఎఫ్ 3కి సంబంధించిన ఓ ఆసక్తిర అప్డేట్పై ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ మూవీలో పవన్ కల్యాణ్ కనిపించనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. చదవండి: సింగర్ దారుణ హత్య, ప్రాణాలు తీసే ముందు 10 నిద్ర మాత్రలు.. అయితే తాజాగా దీనిపై చిత్ర నిర్మాత దిల్ రాజ్ క్లారిటీ ఇచ్చాడు. ఎఫ్ 3 ప్రమోషన్లో భాగంగా మీడియాతో ముచ్చటించిన ఆయన ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కనిపించనున్నాడని తెలిపాడు. సినీ అభిమానులకు ఇదొక బిగ్ సర్ప్రైజ్ అని చెప్పారు. పవన్ కల్యాణ్తో పాటు టాలీవుడ్ టాప్ స్టార్స్ కూడా స్క్రీన్పై కనిపిస్తారంటూ క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. అనంతరం ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే స్క్రీన్పై పవన్ కల్యాణ్ ఏ విధంగా కనిపించబోతున్నారనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు. దీంతో దీనిపై సస్పెన్స్ నెలకొంది. చదవండి: బిగ్బాస్ నాన్స్టాప్ విన్నర్ బిందు మాధవికి బంపర్ ఆఫర్! -
కన్నడ సినిమాకు ఇంత బడ్జెట్ పెడుతున్నారు.. పిచ్చా అనుకున్నా: దిల్ రాజు
‘‘కేజీఎఫ్’ తొలి భాగం రిలీజ్ అయ్యేవరకు నాలాంటి వాళ్లకు కూడా ఆ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. రిలీజ్ అయ్యాక మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమ కన్నడ పరిశ్రమవైపు చూసేలా చేసినందుకు ఆ టీమ్కి హ్యాట్సాఫ్. ఇప్పుడు ‘కేజీఎఫ్ 2’తో చరిత్ర సృష్టించబోతున్నారు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. యశ్, శ్రీనిధి శెట్టి జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కేజీఎఫ్ 2’. హోంబలే ఫిలింస్పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలకానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో వారాహి చలనచిత్రంపై సాయి కొర్రపాటి రిలీజ్ చేస్తున్నారు. సోమవారం హైదరాబాద్లో జరిగిన సమావేశంలో ‘దిల్’ రాజు మాట్లాడారు. ‘‘కన్నడ ఇండస్ట్రీ గురించి చెబితే చిన్న సినిమాలు తీస్తారు, ఐదు కోట్ల బడ్జెట్తోనే తీస్తారనుకునేవాళ్లం. యశ్తో ప్రశాంత్ ‘కేజీఎఫ్’ సినిమా మొదలు పెట్టినప్పుడు బడ్జెట్ చూసి కొందరు ఆశ్చర్యపోయారు.. మరికొందరు కర్నాటకలోని రెవెన్యూకి మించి ఖర్చు పెడుతున్నాడు.. పిచ్చా వీడికి అనుకున్నారు. ఈ మధ్య వచ్చిన ‘పుష్ప, ఆర్ఆర్ఆర్’ సినిమాలు వసూళ్లలో రికార్డులు క్రియేట్ చేసినట్లు ‘కేజీఎఫ్ 2’ కూడా చరిత్ర క్రియేట్ చేస్తుంది. ఇండియన్ ఫిల్మ్ గర్వపడే రేంజ్కి ఎదిగినందుకు ప్రశాంత్కి, యశ్కి, విజయ్కి అభినందనలు’’ అన్నారు. యశ్ మాట్లాడుతూ– ‘‘నా జీవితంలో ‘కేజీఎఫ్’ చాలా పెద్ద ప్రయాణం. ప్రతి సినిమాను ఆదరించే తెలుగు ఆడియన్స్ అంటే నాకు చాలా గౌరవం. ప్రశాంత్ నీల్ ప్రపంచం, ఆలోచనలు, కలల ప్రతిరూపమే ‘కేజీఎఫ్’ సినిమాలు. విజయ్గారు విజనరీ ఉన్న ప్రొడ్యూసర్. ‘కేజీఎఫ్’ రిలీజ్ చేసేందుకు సాయి కొర్రపాటిగారు చాలా ఎఫర్ట్ పెట్టారు. ‘బాహుబలి’ లాంటి సినిమాతో అన్ని ఇండస్ట్రీల వారికి నమ్మకాన్ని ఇచ్చిన రాజమౌళి, శోభు యార్లగడ్డ, ప్రభాస్గార్లకు థ్యాంక్స్. తెలుగు డైలాగులు, డబ్బింగ్, పాటల విషయంలో కన్నడ కంటే పదిరెట్లు ఎక్కువ శ్రద్ధ తీసుకున్నాం. రామారావుగారు చాలా హార్డ్ వర్క్ చేస్తారు.. ఆయన పనే మాట్లాడుతుంది. ‘కేజీఎఫ్ 2’ తల్లీ–కొడుకు. కుటుంబంతో కలిసి చూసి, ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి సినిమా తీసినందుకు కర్నాటక చాలా గర్వపడుతుంది. కానీ ఇది ఇండియన్ సినిమా. తెలుగువారు ఎక్కడున్నా మా సినిమాని బాగా ఆదరిస్తారని ఓవర్సీస్లో వస్తున్న బుకింగ్స్ చూస్తుంటే అర్థమవుతోంది. మా సినిమా మీ నమ్మకాన్ని, అంచనాలను అందుకుంటుంది’’ అన్నారు. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తనయుడు, హోంబలే ఫిలింస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రామారావు మాట్లాడుతూ–‘‘కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని నెక్ట్స్ లెవల్కి తీసుకెళ్లాలని చెప్పే విజయ్ కిరగందూర్ ఏకంగా పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లారు’’ అన్నారు. ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ– ‘‘కైకాల సత్యనారాయణగారి సమర్పణలో ‘కేజీఎఫ్ 2’ చేశాం. ఆ లెజెండరీ పేరుకు తగ్గట్టు సినిమా తీశామనే నమ్మకం ఉంది. సాయిగారిలాంటి వాళ్లు అరుదుగా ఉంటారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమా గురించి చెప్పాల్సి వస్తే మొదట రాజమౌళి సార్ గురించి మాట్లాడాలి. యశ్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు’’ అన్నారు. ఈ సమావేశంలో కెమెరామేన్ భువన్, డైలాగ్ రైటర్ హనుమాన్, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి పాల్గొన్నారు. -
జెర్సీ ఓటీటీ రిలీజ్పై మేకర్స్ క్లారిటీ
Shahid Kapoor Jersey Movie Makers Clarity On OTT Release: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తాజాగా నటించిన చిత్రం ‘జెర్సీ’.నెచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ చిత్రాన్ని అదే పేరుతో హిందీలో తెరకెక్కించారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించాడు. ఇందులో షాహిద్కు జోడీగా మృణాల్ ఠాకూర్ నటించింది. పంకజ్ కపూర్, శిశిర్ శర్మ,శరద్ కేల్కర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఇప్పటికే పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చిన ఈ చిత్రం విడుదల తేదీని డిసెంబర్ 31, 2021కి ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఇక మూవీ విడుదల మరోసారి వాయిదా పడుతున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ విడుదలకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. జెర్సీని దిల్ రాజు నేరుగా ఓటీటీలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు తెలిసింది. డిసెంబర్ 31 నుంచి కొన్ని ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ ఉన్న నేపథ్యంలో ఈ మూవీ థియేటర్లో విడుదల చేయడం కంటే ఓటీటీ రిలీజ్ చేయడం బెటర్ ఆయన అభిప్రాయడుతున్నాడని, ఇందుకోసం ఇప్పటికే ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్తో దిల్ రాజు చర్చలు జరపగా మంచి ఫ్యాన్సీ రేటుకు ఒప్పందం కూడా కుదిరినట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఈ మూవీని ఓటీటీలో విడుదల చేసేందుకు షాహిద్ నిరాకరించాడని, కావాలంటే తన పారితోషికంలో 31 కోట్ల రూపాయలను తగ్గించుకుంటానని నిర్మాత దిల్ రాజుకు చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో షాహిద్, దిల్ రాజు మధ్య విభేదాలు కూడా తలెత్తినట్లు ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై మేకర్స్ స్పందించారు. జెర్సీ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయడం లేదని వారు స్పష్టం చేశారు. తాజా కోవిడ్ నిబంధనల నేపథ్యంలో మూవీని వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. అంతేగాక మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్తో పాటు విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని, అప్పటి వరకు అందరూ సేఫ్గా ఉండాలంటూ మేకర్స్ ప్రకటన ఇచ్చారు. -
అభిమానులు అర్థం చేసుకోవాలి.. సినిమాల వాయిదాపై దిల్ రాజు
Producer Dill Raju Reaction On Movies Postponed: వచ్చే సంక్రాంతి పండగ రిలీజ్ రేసులో ఎన్టీఆర్-రామ్చరణ్ల ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్ఆర్ఆర్), ప్రభాస్ ‘రాధేశ్యామ్’, పవన్ కల్యాణ్-రానాల ‘భీమ్లా నాయక్’ చిత్రాలు ఉన్నాయి. అయితే ‘యాక్టివ్ తెలుగు ప్రొడ్యూసర్స్ గిల్డ్ (Active Telugu Producers Guild)’ అభ్యర్థన మేరకు సంక్రాంతి రేసు నుంచి ‘భీమ్లా నాయక్’ తప్పుకుంది. ఈ విషయం గురించి యాక్టివ్ తెలుగు ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరఫున నిర్మాతలు ‘దిల్’ రాజు, డీవీవీ దానయ్య స్పందించారు. ‘‘సంక్రాంతి రేసులో ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’, ‘భీమ్లా నాయక్’ చిత్రాలు నిలిచాయి. ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ పాన్ ఇండియన్ సినిమాలు. ఈ రెండు సినిమాలు దాదాపు మూడేళ్లుగా వర్క్స్ జరుపుకుంటూనే ఉన్నాయి. ఈ రెండు సినిమాలు విడుదలవుతున్నాయన్న కారణంగానే జనవరి 7న విడుదల కావాల్సిన ‘గంగూబాయి కతియావాడి’ చిత్రం ఫిబ్రవరికి వాయిదా పడింది. అలాగే ఒకేసారి మూడు పెద్ద సినిమాలు విడుదలైతే స్క్రీన్స్ షేరింగ్ విషయంలో కొన్ని సమస్యలు ఉత్పన్నం కావొచ్చు. ఈ పరిస్థితిలోనే సంక్రాంతి రేసు నుంచి ‘భీమ్లా నాయక్’ తప్పుకోవాల్సిందిగా ఈ చిత్రనిర్మాత రాధాకృష్ణ, హీరో పవన్ను కోరితే, వారు సానుకూలంగా స్పందించారు. జనవరి 12న విడుదల కావాల్సిన ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25న విడుదలవుతుంది. అలాగే ఫిబ్రవరి 25న విడుదల కావాల్సిన ‘ఎఫ్ 3’ (వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలు) సినిమాకు నిర్మాతను నేనే. ‘ఎఫ్ 3’ని ఏప్రిల్ 29కి వాయిదా వేస్తున్నాం. తమ అభిమాన హీరోలను వీలైనంత త్వరగా థియేటర్స్లో చూసుకోవాలని ఫ్యాన్స్కు ఉంటుంది. అనివార్య పరిస్థితుల్లో వాయిదా వేస్తున్నాం. ఈ విషయాన్ని అందరి హీరోల అభిమానులు అర్థం చేసుకోవాలి’’ అని దిల్ రాజు పేర్కొన్నారు. ‘‘భీమ్లా నాయక్’ రిలీజ్ను వాయిదా వేసుకున్నందుకు నిర్మాత చినబాబు, త్రివిక్రమ్, పవన్లకు థ్యాంక్స్’’ తెలిపారు నిర్మాత డీవీవీ దానయ్య. ఈ సమావేశంలో నిర్మాతలు దామోదర ప్రసాద్, స్రవంతి రవికిశోర్ తదితరులు పాల్గొన్నారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ ఆర్ఆర్’ జనవరి 7న, ప్రభాస్ హీరోగా రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాధేశ్యామ్’ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. -
‘రౌడీబాయ్స్’ సాంగ్ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ సందడి
-
మేమిద్దరం ఇండస్ట్రీకి రావాలని కలలు కనేవాళ్లం: విజయ్
ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా నటించిన చిత్రం ‘రౌడీబాయ్స్’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని దిల్రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్లుక్, మోషన్ పోస్టర్, ఫస్ట్సాంగ్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి రెండో పాట విడుదలైంది. ‘ప్రేమ ఆకాశమైతే...’ అంటూ సాగే ఈ పాటే యంగ్ హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశాడు. శ్రీమణి రాసిన ఈ పాటకు దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకుర్చగా జస్ప్రీత్ జస్జ్ ఆలపించారు. చదవండి: ఆ సినిమాలో సాయి పల్లవిపై స్పెషల్ సాంగ్, ఈసారి క్లాసికల్ టచ్తో..! ఈ పాట విడుదల అనంతరం విజయ్ మాట్లాడుతూ.. ‘‘హర్ష, నేను ఇండస్ట్రీలోకి రావాలని కలలు కనేవాళ్ళం. హర్షకు కాలేజ్ మీటర్ బాగా తెలుసు. హర్ష దర్శకత్వం వహించిన మొదటి సినిమా ‘హుషారు’ కంటే ఈ సినిమా ఇంకా పెద్ద విజయం సాధించాలని ఆశిస్తున్నా. ఇక తొలి సినిమా ఎక్స్పీరియన్స్ను ఆశిష్ ఫుల్గా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. నాకు ‘పెళ్ళి చూపులు’ స్ట్రాంగ్గా గుర్తుండిపోయింది. ఆశిష్లో నాకో సిన్సియారిటీ కనిపిస్తుంది. ‘రౌడీ బాయ్స్’ స్టార్ట్ కావడానికి ముందు ఓసారి నన్ను కలిశాడు. అతనిలో నటన పట్ల ఆసక్తి, తపన కనిపించాయి. ఆశిష్... మీ నాన్న (శిరీష్), బాబాయ్ (‘దిల్’ రాజు) చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. నువ్వు.. వారు గర్వపడేలా చేస్తావని ఆశిస్తున్నాను’’ అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ప్రభాస్ బర్త్డే: రాధే శ్యామ్ నుంచి రానున్న బిగ్ సర్ప్రైజ్ -
పరిశ్రమ సమస్యలను రాజకీయం చేయకండి: దిల్ రాజు
సాక్షి, మచిలీపట్నం: సినీ పరిశ్రమ సమస్యలపై ఏపీ మంత్రి పేర్ని నానితో టాలీవుడ్ నిర్మాతలు బుధవారం మచిలీపట్నంలో సమావేశమైన సంగతి తెలిసిందే. భేటీ అనంతరం మంత్రితో పాటు నిర్మాతలు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. కరోనా కాలంలో సినీ పరిశ్రమ ఎంతగా నష్టపోయిందో మంత్రికి వివరించామని తెలిపారు. పరిశ్రమపై కోవిడ్ ప్రభావం, థియేటర్ల సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దృష్టికి గతంలోనే తీసుకెళ్లామని చెప్పారు. చదవండి: పవన్ వ్యాఖ్యలతో ఇండస్ట్రీకి సంబంధం లేదని చిరంజీవి అన్నారు: పేర్ని నాని ‘గతంలో మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు రాజమౌళితో కలిసి సీఎం జగన్ను కలిశాం. మా విజ్ఙప్తిపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సినిమా అనేది చాలా సున్నితమని, ఏ సమస్య వచ్చినా ఆ ప్రభావం నిర్మాతలపైనే పడుతుంది. అందుకే చిత్ర పరిశ్రమ సమస్యలను రాజకీయం చేయొద్దని మీడియాను కోరుతున్నా. టికెట్లు ఆన్లైన్ విధానం కావాలని పరిశ్రమ తరఫున మేమే ప్రభుత్వాన్ని కోరాం. ఆన్లైన్ విధానం ద్వారా పారదర్శకత ఉంటుంది’ అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. చదవండి: Tollywood Producers Meet: సినీ సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం చొరవ అలాగే నిర్మాత సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. రాజకీయం వేరు.. సినిమా పరిశ్రమ వేరని స్పష్టం చేశారు. ఎవరో ఏదో మాట్లాడితే.. తమకు సంబంధం లేదని ప్రకటించారు. థియేటర్లో 100 శాతం ఆక్యూపెన్సీ పెరగాలనేదే తమ ఉద్దేశమని, టికెట్లను ఆన్లైన్ చేయమని అడిగింది తామేనని గుర్తుచేశారు. -
‘రౌడీ బాయ్స్’ మూవీ టైటిల్ సాంగ్ విడుదల
‘‘ప్రేమదేశం, హ్యాపీ డేస్’ చిత్రాలు యువతను షేక్ చేశాయి. ఆశిష్తో మేం సినిమా అనుకున్నప్పుడు అలాంటి ఔట్ అండ్ ఔట్ కాలేజ్ యూత్ స్టోరీ కావాలని శ్రీహర్షను అడిగాను. తన కాలే జ్ లైఫ్లో జరిగిన çఘటనలతో కథ రాసుకుని, ‘రౌడీ బాయ్స్’ తీశాడు’’ అన్నారు ‘దిల్’ రాజు. నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి ఆశిష్ రెడ్డి (శిరీష్ తనయుడు) హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో విక్రమ్ మరో హీరో. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో అనిత సమర్పణలో ఆదిత్య మ్యూజిక్ అసోసియేషన్తో కలసి ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ‘రౌడీ బాయ్స్’ టైటిల్ సాంగ్ను వైజాగ్లో విడుదల చేశారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఇంజినీరింగ్ స్టూడెంట్స్ నాలుగేళ్ల జర్నీ ఈ చిత్రం. రెండు కాలేజీల మధ్య జరుగుతుంది. రౌడీ బాయ్స్ గుడ్ బాయ్స్ ఎలా అయ్యారనేదే కథ. దసరాకు సినిమాను రిలీజ్ చేయనున్నాం’’ అన్నారు. శ్రీహర్ష, ఆశిష్, విక్రమ్, ‘ఆదిత్య’ నిరంజన్, రోల్ రైడా పాల్గొన్నారు. -
ఆలియా.. జాన్వీ... ఫైనల్గా ఎవరో?
రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ ప్యాన్ ఇండియా మూవీని ‘దిల్’ రాజు నిర్మించనున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా ఇప్పటికే పూజా హెగ్డే, రష్మికా మందన్నా, కియారా అద్వానీల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా జాన్వీ కపూర్, ఆలియా భట్ల పేర్లు వినిపిస్తున్నాయి. ప్రముఖ నటి శ్రీదేవి కుమార్తె జాన్వీని దక్షిణాది తెరకు పరిచయం చేయడానికి చాలామంది దర్శక–నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారు. మరోవైపు ఇప్పటికే రాజమౌళి ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్) చిత్రంలో రామ్చరణ్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి.. ఆలియా భట్ను హీరోయిన్గా ఫిక్స్ చేసి ‘ఆర్ఆర్ఆర్’ జోడీని దర్శకుడు శంకర్ రిపీట్ చేస్తారా? లేక జాన్వీని కన్ఫార్మ్ చేసి, కొత్త జోడీని వెండితెరపై చూపిస్తారా? ఆలియా, జాన్వీ కాకుండా మరో హీరోయిన్ని ఎంపిక చేస్తారా? అనేది తెలియాలంటే కొంత కాలం వేచి చూడక తప్పదు. -
కరోనా కలకలం: దిల్ రాజు ఎంత పనిచేశావ్..
హిందీలో లాగానే తెలుగు చిత్రసీమలోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల నిర్మాత అల్లు అరవింద్, రచయిత విజయేంద్ర ప్రసాద్, దర్శకుడు త్రివ్రికమ్, హీరోయిన్ నివేదా థామస్లు కరోనా బారినపడ్డారు. తాజాగా నిర్మాత ‘దిల్’ రాజు, దర్శకులు గుణశేఖర్, వి.ఎన్ .ఆదిత్య పేర్లు చేరాయి. ‘దిల్’ రాజుకు కరోనా లక్షణాలు లేవు. కానీ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఆయన హోమ్ ఐసొలేషన్లో ఉన్నారు. ‘శాకుంతలం’ దర్శకుడు గుణశేఖర్కు సైతం కరోనా పాజిటివ్ అని సోమవారం పొద్దు పోయాక తెలిసింది. గతవారం ఓ స్టూడియోలో పవన్కల్యాణ్ – హరీశ్ శంకర్ కొత్త చిత్రం ఫోటోషూట్ జరుగుతుంటే, అక్కడకు వెళ్ళి పవన్కల్యాణ్ను రాజు కలిశారు. ఆ పక్కనే స్వీయ సమర్పణలో షూటింగ్ జరుగుతున్న ‘శాకుంతలం’ సెట్స్కు కూడా వెళ్ళి వచ్చారు. ఇది ఇలా ఉండగా.. ఇప్పటికే పవన్ కల్యాణ్ హోమ్ క్వారంటైన్లోకి వెళ్ళారు. ఆలస్యంగా పాజిటివ్ అయిన గుణశేఖర్ కూడా క్వారంటైన్ బాట పట్టారు. దాంతో, ‘శాకుంతలం’ షూటింగ్ కొన్నాళ్ళు ఆగనుంది. మరోపక్క ఈ నెల 23న రిలీజు కావాల్సిన నాని ‘టక్ జగదీశ్’ సైతం తెలుగు నేలపై కరోనా కలకలంతో వాయిదా పడింది. -
వకీల్సాబ్ ట్రైలర్ లాంఛ్.. ఫ్యాన్స్ రచ్చ రచ్చ
విశాఖపట్నం : పవన్ కల్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వకీల్ సాబ్’. బాలీవుడ్ సినిమా ‘పింక్’కు రీమేక్గా ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాన్ నటిస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీవేంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజ్, శిరీశ్ ఈ సినిమాను నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు. బోనీ కపూర్ సమర్పణలో చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం అభిమానుల మధ్య ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. దీంతో థియేటర్లో ట్రైలర్ను చూసేందుకు పవన్ ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఒకరిపై ఒకరు తోసుకుంటూ, అద్దాలు పగలకొట్టి మరీ లోపలికి చొచ్చుకెళ్లారు. దీంతో పలువురు పవన్ అబిమానులు గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. #WATCH | Andhra Pradesh: Ruckus erupted at a theatre in Visakhapatnam during the release of the trailer of actor & Jan Sena chief Pawan Kalyan's movie, yesterday pic.twitter.com/MjNrpxto1d — ANI (@ANI) March 30, 2021 చదవండి : మీరు వర్జినా?: వకీల్ సాబ్ ట్రైలర్ ‘వకీల్ సాబ్’ హవా.. అంబరాన్నంటిన టికెట్ల ధరలు -
ఏప్రిల్ 9న లంచ్, డిన్నర్ కలిసి చేద్దాం : దిల్ రాజు
పవన్ కల్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వకీల్ సాబ్’. నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది. హైదరాబాద్లోని సుదర్శన్ థియేటర్లో అభిమానుల మధ్య ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. ‘సరిగ్గా చెప్పండి.. ఏం చెప్పారు.. ఏం చేశారు’, ‘అలా జరగద్దు.. జరగకూడదు’ అనే డైలాగ్స్తో టీజర్ సాగుతుంది. టీజర్ విడుదల సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘పవన్ కల్యాణ్ను బిగ్ స్క్రీన్ పై చూసేందుకు మనం మూడేళ్ళుగా ఎదురుచూస్తున్నాం. వెయిటింగ్ పూర్తయింది. ట్రైలర్ బ్రేక్ఫాస్ట్ మాత్రమే. ఏప్రిల్ 9న లంచ్, డిన్నర్ కలిసి చేద్దాం’’ అన్నారు. ‘‘ట్రైలర్ కంటే సినిమా ఇంకా బాగుంటుంది’’ అన్నారు వేణు శ్రీరామ్. హిందీ హిట్ ‘పింక్’ చిత్రానికి తెలుగు రీమేక్గా ‘వకీల్ సాబ్’ రూపొందిన విషయం తెలిసిందే. చదవండి: లవ్స్టోరీ’ వాయిదాపై చిత్ర యూనిట్ క్లారిటీ పదహారువందల మందిని ప్రేమించా' -
మళ్లీ నిరూపించుకోవాలి!
‘‘సినిమా పరిశ్రమలో లాక్డౌన్ తర్వాత మార్పు వచ్చింది. మరో కొత్త అధ్యాయం మొదలైనట్లుంది. గత చిత్రాలతో సంబంధం లేకుండా మళ్లీ యాక్టర్స్గా నిరూపించుకోవాల్సి వస్తోంది’’ అని అన్నారు విశ్వక్ సేన్ . నరేష్ కుప్పిలి దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా ‘దిల్’ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న సినిమా ‘పాగల్’. ఏప్రిల్ 30న ఈ సినిమా విడుదల కానుంది. నేడు విశ్వక్సేన్ బర్త్ డే. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా విభిన్నమైన కథాంశాలతో సినిమాలు చేశాను. ‘పాగల్’ సినిమా కూడా ఓ కొత్త ప్రయత్నం. ప్రేమించేప్పుడు కొందరు పిచ్చోడిలా ఆలోచిస్తుంటారు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ అలానే ఉంటుంది. అందుకే ఈ టైటిల్ పెట్టాం. మా సినిమా టీజర్లో ఎంటర్టైన్ మెంట్ మాత్రమే చూపించాం... సినిమాలో ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఇవాళ్టితో ‘పాగల్’ సినిమా షూటింగ్ పూర్తయింది. నా బర్త్ డే రోజు కూడా షూటింగ్లో పాల్గొనడం హ్యాపీగా ఉంది. నరేష్ బాగా డైరెక్ట్ చేశారు. నేను చేస్తున్న ‘ప్రాజెక్ట్ గామీ’ సినిమా పూర్తయింది. నిర్మాతలు పీవీపీ, బీవీఎస్ఎన్ ప్రసాద్గార్లతో వర్క్ చేయబోతున్నాను. ఈ ఏడాది నావి మూడు సినిమాలు రిలీజవుతాయి’’ అని అన్నారు. -
పెద్ద దర్శకులు చిన్న సినిమాలు కూడా తీయాలి
‘‘దాసరి నారాయణరావుగారు, రాఘవేంద్రరావుగారు, కోడి రామకృష్ణగారు వంటి వారు పెద ్దసినిమాలతో పాటు చిన్న సినిమాలూ తీశారు. అందుకే వారు వంద సినిమాల మార్క్ను ఈజీగా దాటగలిగారు. పెద్ద దర్శకులు చిన్న సినిమాలు కూడా తీయాలి. పెద్ద డైరెక్టర్ యాడ్ అయితే చిన్న సినిమా పెద్ద సినిమా అవుతుంది. ‘గాలి సంపత్’ అలాంటి పెద్ద సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ హీరో హీరోయిన్లుగా రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో అనీష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గాలి సంపత్’. దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణ, సమర్పణలో ఎస్. కృష్ణ, హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమా మార్చి 11న విడుదల కానుంది. అనిల్æరావిపూడి మాట్లాడుతూ – ‘‘గాలి సంపత్ (రాజేంద్రప్రసాద్ పాత్ర) గొంతుకు ప్రమాదం జరిగి, మాట బయటకు రాదు. గాలి మాత్రమే వస్తుంది. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్గారిది చిలిపిగా మాట్లాడే ఫీ..ఫీ..ఫీ భాష’’ అన్నారు. ‘‘ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి ఎమోషన్స్ ఉన్నాయి’’ అన్నారు అనీష్. ‘‘చిన్న సినిమాగా మొదలైన ‘గాలిసంపత్’ అనిల్ రావిపూడి రాకతో పెద్ద సినిమాగా రిలీజ్ కాబోతోంది’’ అన్నారు సాహు గారపాటి, ఎస్. కృష్ణ. -
వారిద్దరూ జంటగా '101 జిల్లాల అందగాడు'
అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ జంటగా తెరకెక్కిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. ఈ సినిమాతో రాచకొండ విద్యాసాగర్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. నిర్మాత ‘దిల్’ రాజు, డైరెక్టర్ క్రిష్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్స్పై శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. ఈ సినిమాను మే 7న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ చిత్రంలో హీరోగా నటించడంతో పాటు కామెడీ పంచ్లతో ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా మంచి ఎంటర్టైనింగ్ కథను అందించారు అవసరాల శ్రీనివాస్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: రామ్, సంగీతం: శక్తికాంత్ కార్తీక్. -
‘పాగల్’ ఫస్ట్లుక్ విడుదల
‘హిట్’ సినిమా విజయంతో మంచి స్పీడు మీదున్న విష్వక్ సేన్ హీరోగా రాబోతున్న చిత్రం ‘పాగల్’. పాగల్ అంటే పిచ్చి. మ్యూజికల్ రొమాంటిక్ చిత్రంగా తెరకెక్కుతోంది. అంటే.. హీరోకి ప్రేమ పిచ్చి అని ఊహించవచ్చు. ఈ చిత్రానికి నరేశ్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేసింది చిత్రబృందం. ఏప్రిల్ 30న సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం: రధన్. -
తిరిగిచ్చే సమయం వచ్చింది
‘దిల్’ రాజు 50వ పుట్టినరోజు వేడుకకు పలువురు ప్రముఖ సినిమా తారలు కదిలి వచ్చారు. శుక్రవారం (డిసెంబర్ 18) ఆయన బర్త్డే. గురువారం ‘దిల్’ రాజు స్వగృహంలో జరిగిన వేడుకలో చిరంజీవి, పవన్కల్యాణ్, మహేశ్బాబు, ప్రభాస్, రామ్చరణ్, నాగచైతన్య, నితిన్, వరుణ్తేజ్, విజయ్ దేవరకొండ, సాయి శ్రీనివాస్, ప్రకాశ్రాజ్, కన్నడ స్టార్ యశ్ తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా ‘దిల్’ రాజు మీడియాతో మాట్లాడుతూ– ‘‘సినిమా పరిశ్రమకు వచ్చి 25 ఏళ్లవుతోంది. ఈ పాతికేళ్లలో ఇండస్ట్రీ నాకెంతో పేరుతో పాటు డబ్బును కూడా ఇచ్చింది. ఇన్నేళ్ల కెరీర్లో జయాపజయాలు ఉన్నాయి. అన్నింటినీ దాటి ఇక్కడిదాకా వచ్చాను. ఈ ప్రయాణంలో నాకెంతోమంది సాయం చేసి, ఈ స్థాయిలో నిలబడటానికి కారణం అయ్యారు. ఇప్పుడు తిరిగిచ్చే సమయం వచ్చింది. ముఖ్యంగా సాయం కోరి రోజూ ఎంతోమంది వస్తుంటారు. అలా వచ్చేవారిలో ఎంతమంది నిజం చెబుతున్నారో మాకు తెలియదు. అందుకే ఒక కమిటీని ఏర్పాటు చేసి, వారికి కావాల్సిన విద్య, వైద్య సౌకర్యాలు సమకూర్చాలనుకుంటున్నా. దానికి మీడియా ప్రతినిధుల సాయం కూడా ఉంటే నిజంగా అవసరాల్లో ఉన్నవారికి సాయం అందుతుందని అనుకుంటున్నాను’’ అన్నారు. భార్య వైగా, కుమార్తె హన్షితలతో ‘దిల్’ రాజు శిరీష్, విజయ్, రామ్, రామ్చరణ్, ‘దిల్’ రాజు, మహేశ్బాబు, ప్రభాస్, నాగచైతన్య -
దిల్ రాజుతో టాప్ హీరోలు.. ఫోటోలు వైరల్
దాదాపు రెండు దశాబ్దాలుగా టాలీవుడ్లో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్న దిల్ రాజు 50వ పుట్టిన రోజు నేడు(డిసెంబర్ 18). ఈ సందర్భంగా దిల్రాజ్కు సినీ ప్రముఖులను నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తన పుట్టిన రోజును పురస్కరించుకొని ముందు రోజు రాత్రి టాలీవుడ్ ప్రముఖులకు దిల్రాజు గ్రాండ్గా పార్టీ ఏర్పాటు చేశారు. టాలీవుడ్ సెలబ్రిటీస్తో పాటు తనకు పరిచయం ఉన్న స్టార్స్ అందరిని పిలిచాడు. అందులో కన్నడ సూపర్ స్టార్ యశ్తో పాటు తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలా మంది ప్రముఖులు దిల్ రాజు పార్టీకి వచ్చారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇదిలాఉంటే దిల్రాజుతో మహేశ్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, నాగచైతన్య, రామ్, విజయదేవరకొండ కలిసి ఫోటో దిగారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అగ్ర హీరోలందరిని ఒకే ఫ్రేమ్లో అభిమానులు ఫిదా అవుతున్నారు. అలాగే రామ్ చరణ్, ప్రభాస్ కూడా ఫోటోలకు పోజులిచ్చారు. ఈ ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలు చూసి అటు ప్రభాస్.. ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ ఇద్దరు హీరోలతో దిల్ రాజు హిట్ సినిమాలు నిర్మించాడు. ప్రభాస్తో చేసిన మిస్టర్ పర్ఫెక్ట్ సూపర్ హిట్ అయింది. దాంతో పాటు చరణ్తో నిర్మించిన ఎవడు కమర్షియల్ సక్సెస్ సాధించింది.వీరిద్దరూ ఇప్పుడు పాన్ ఇండియా హీరోలుగా మారడంతో ఈ పిక్ కు మరింత క్రేజ్ వచ్చింది. -
ఇండస్ట్రీలోకి దిల్రాజు సతీమణి..!
కరోనా వైరస్ విజృంభణతో చిత్ర పరిశ్రమ తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. తొమ్మిది నెలల విరామం అనంతరం ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకుంటున్నా.. ప్రేక్షకుడు మాత్రం ఆ వైపుకు కన్నెత్తికూడా చూడటంలేదు. మరోవైపు కరోనా సెకండ్ వేవ్ భయం దర్శక, నిర్మాతలను తీవ్రంగా వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్లో నిర్మించబోయే సినిమాలను ఓటీటీని వేదికగా చేసుకుని విడుదల చేయాలనే ఆలోచనలో పడ్డారు. దీనికి అనుగుణంగానే కథలను సిద్ధం చేసుకుంటున్నారు. కొత్త ఆలోచనలకు పదునుపెడుతూ.. ఓటీటీ దిశగా అడుగులు వేస్తున్నారు. (కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నా) ఈ క్రమంలో టాలీవుడ్ బడా నిర్మాత దిల్రాజు సైతం ఓటీటీకి తగ్గకథల కోసం వెతుకులాట ఆరంభించారు. అయితే భర్త కోసం తన సతీమణి తేజస్వీని స్వయంగా ఓ కథను సిద్ధం చేశారని చిత్రపరిశ్రమలో టాక్ వినిపిస్తోంది. లాక్డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన ఆమె కొత్త కథలపై దృష్టిసారించారని, ఓటీటీకి అనుగుణంగా సృజనాత్మకతతో కూడిన ఓ కథను భర్తకు బహుమతిగా ఇచ్చారని సమాచారం. భార్య స్టోరీకి ఫిదా అయిన దిల్రాజు.. ఆ కథకు మరింత మెరుగులు దిద్దేందుకు ఆమెకు సహాయంగా ఓ రచనా బృందాన్ని ఏర్పాటు చేశాడని తెలిసింది. (దిల్రాజుకు షాకిచ్చిన వరుణ్, వెంకీ..!) ఓటీటీ విస్తరిస్తున్న నేపథ్యంలో భార్య రూపొందించిన కథాంశాన్ని తెరక్కించాలని నిర్ణయించినట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అనుకున్నట్లు కథ కార్యరూపం దాల్చితే తేజస్వీని సైతం చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. దిల్రాజు ప్రస్తుతం విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న ఎఫ్3 మూవీ నిర్మాణ బాధ్యతల్లో బిజిబిజీగా ఉన్నారు. కాగా దిల్’రాజు మొదటి భార్య అనిత 2017లో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. అనంతరం హైదరాబాద్కు చెందిన తేజస్విని (వైఘా రెడ్డి)ని గత మార్చిలో వివాహం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని నర్సింగ్పల్లిలోగల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది. -
మూడు సినిమాలకు శ్రీకారం
‘క్రియేటివ్ మెంటార్స్ యానిమేష¯Œ అండ్ గేమింగ్ కాలేజీ’ మేనేజింగ్ డైరెక్టర్ కొవ్వూరి సురేష్ రెడ్డి మూడు కొత్త చిత్రాలను ప్రకటించారు. ప్రముఖ పత్రిక ఫోర్బ్స్ ఇటీవల ప్రకటించిన 30 ఏళ్ల లోపు గల అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్న యువ వ్యాపారవేత్త, ఏకైక తెలుగు వ్యక్తి సురేష్రెడ్డి. ప్రసాద్ ల్యాబ్స్ సహకారంతో ఫిలిం స్కూల్ కూడా నిర్వహిస్తున్న సురేష్రెడ్డి ‘పి19 ఎంటర్టై¯Œ మెంట్’ సంస్థను స్థాపించి, శుక్రవారం మూడు చిత్రాలను ప్రకటించారు. ఈ మూడు చిత్రాల ప్రీ లుక్స్, లోగోలను ప్రసాద్స్ గ్రూప్ చైర్మన్ అక్కినేని రమేష్ ప్రసాద్, ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ –‘‘మా తొలి చిత్రానికి ‘సూపర్స్టార్ కిడ్నాప్’, ‘పేపర్ బోయ్’ చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన ఆకాష్రెడ్డి దర్శకత్వం వహిస్తారు. రెండో సినిమాని ‘ఋషి’, ‘ఆంధ్రాపోరి’, ‘ఐతే 2.0’ ఫేమ్ రాజ్ మాదిరాజు డైరెక్ట్ చేస్తారు. ఈ చిత్రాన్ని ఎన్నారై రవికాంత్ జామితో కలిసి నేను నిర్మిస్తాను. మూడో సినిమాకి దర్శకుడు పూరి జగన్నాథ్ శిష్యుడు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తారు’’ అన్నారు. ఆర్థోపెడిక్స్ డాక్టర్ దశరథరామిరెడ్డి, నిర్మాతలు కె.ఎల్. దామోదర ప్రసాద్, రాజ్ కందుకూరి, జీ5 క్రియేటివ్ హెడ్ నిమ్మకాయల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నా
కొంత కాలంగా నిర్మాత ‘దిల్’ రాజు రెండో వివాహం చేసుకోబోతున్నారనే వార్త ప్రచారంలో ఉంది. తాజాగా జీవితంలో కొత్త ప్రయాణాన్ని (పెళ్లిని ఉద్దేశించి) ప్రారంభిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు ‘దిల్’ రాజు. ఈ ప్రెస్ నోట్లో ఈ విధంగా పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం ప్రపంచమంతా కష్టకాలంలో ఉంది. వృత్తిపరంగా అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యక్తిగతంగానూ కొంతకాలంగా సరిగ్గా సాగడంలేదు. కానీ త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరింపబడతాయి, అందరం బావుంటాం అనే ఆశతో ఉన్నాను. ఈ నమ్మకంతోనే నా జీవితంలో మరో ప్రయాణాన్ని తిరిగి ప్రారంభిస్తున్నాను’’. ఆదివారం నిజామాబాద్లోని ‘దిల్’ రాజు ఫార్మ్ హౌస్లో రాత్రి 11.30 గంటలకు అతి కొద్దిమంది సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక జరిగింది. ‘దిల్’ రాజు వివాహం చేసుకున్నది వాళ్ల బంధువుల అమ్మాయినే అని, సినిమా నేపథ్యం లేని కుటుంబం అని తెలిసింది. 2017లో ‘దిల్’ రాజు భార్య అనిత హార్ట్ ఎటాక్తో మరణించిన సంగతి తెలిసిందే. -
కరోనా విరాళం
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సినిమా తారలు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు, సినిమా కార్మికుల కోసం ఇటీవలే ‘సీసీసీ మన కోసం’’ (కరోనా క్రైసిస్ చారిటి మనకోసం) ఏర్పాటు చేశారు ఇండస్ట్రీ ప్రముఖులు. ఇప్పటికే పలువురు తారలు విరాళాలిచ్చారు. ఆదివారం విరాళం ప్రకటించిన వారి వివరాలు. ► రవితేజ (20 లక్షలు) ► వరుణ్ తేజ్ (20 లక్షలు) ► ‘దిల్’ రాజు, శిరీష్ (10 లక్షలు) ► శర్వానంద్ (15 లక్షలు) ► సాయిధరమ్ తేజ్ (10 లక్షలు) ► విశ్వక్ సేన్ (5 లక్షలు) ► ‘వెన్నెల’ కిశోర్ (2 లక్షలు) ► సంజయ్ (25 వేలు) -
పాగల్ ప్రారంభం
‘హిట్’ వంటి హిట్ చిత్రం తర్వాత విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘పాగల్’. ఈ చిత్రం ద్వారా నరేష్ కుప్పిలి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ సినిమా గురువారం హైదరాబాద్లో ప్రారంభమైంది. విశ్వక్సేన్పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత పి. కిరణ్ కెమెరా స్విచ్చాన్ చేయగా హీరో రానా దగ్గుబాటి క్లాప్ ఇచ్చారు. దర్శకుడు త్రినాథరావు నక్కిన గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత ‘దిల్’ రాజు స్క్రిప్ట్ని సినిమా యూనిట్కు అందజేశారు. బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ– ‘‘విశ్వక్తో ‘పాగల్’ సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఒక క్రేజీ సబ్జెక్టుతో ఈ చిత్రం తీస్తున్నాం. ప్రస్తుత పరిస్థితులు చక్కబడ్డాక షెడ్యూళ్లను ప్లాన్ చేస్తాం. నరేష్ లాంటి ప్రతిభావంతుడిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘నరేష్ చెప్పిన స్క్రిప్ట్ ఎగ్జయిటింగ్గా అనిపించడంతో ‘పాగల్’ చిత్రాన్ని అంగీకరించా. సరికొత్త జానర్లో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు విశ్వక్సేన్. ‘‘టైటిల్ని బట్టి ఇది యాక్షన్ సినిమానా? అని అడుగుతున్నారు. లవ్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉంటుంది. ఒక మంచి సినిమా చూశామనే తృప్తి ప్రేక్షకులకు కలుగుతుంది’’ అన్నారు నరేష్ కుప్పిలి. సంగీత దర్శకుడు రథన్, కెమెరామేన్ మణికంద¯Œ , ఎడిటర్ గ్యారీ, ప్రొడక్షన్ డిజైనర్ లతా తరుణ్ తదితరులు మాట్లాడారు. -
హిట్ ఇస్తున్నందుకు గర్వంగా ఉంది
‘‘అ’ సినిమాతో నాని నిర్మాతగా మారి నేర్చుకున్నాడు.. ఇప్పుడు ‘హిట్’ అంటున్నాడు. ఎంత నమ్మకం లేకుంటే ఆ పేరు పెడతాడు. చాలా సినిమాలు చేశాడు కదా.. కొన్ని ఆడతాయి, మరికొన్ని ఆడవు. ఆడని వాటిలోని తప్పులు.. ఆడిన వాటిలోని బెస్ట్లు తీసుకుని ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని ‘హిట్’ అని పేరు పెట్టే్టశాడు. మొత్తంగా ఓ డాక్టర్ని(శైలేశ్) డైరెక్టర్ చేశాడు నాని’’ అని డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు అన్నారు. ‘ఫలక్నుమాదాస్’ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా, రుహానీ శర్మ హీరోయిన్గా నటించిన చిత్రం ‘హిట్’. ‘ది ఫస్ట్ కేస్’ అన్నది ఉపశీర్షిక. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది. ప్రీ రిలీజ్ వేడుకలో డైరెక్టర్ రాజమౌళి మాట్లాడుతూ– ‘‘హిట్’ సినిమా టీజర్, ట్రైలర్ చాలా బాగున్నాయి.. యూనిట్ ప్రమోషన్ ఐడియాలు కూడా కొత్తగా ఉన్నాయి. సినిమా మంచి హిట్ అవ్వాలి. ఉపశీర్షికలో ఫస్ట్ కేస్ అని పెట్టారు.. రెండో కేస్, మూడో కేస్ అంటూ దీనికి మరిన్ని ఫ్రాంచైజీలు రావాలి. సినిమా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు. అనుష్క మాట్లాడుతూ– ‘‘ఈరోజు నేను ఇక్కడికి అతిథిగా రాలేదు. నాని, ప్రశాంతి నా కుటుంబసభ్యులే. ‘అ’ చాలా మంచి సినిమా. రెండో సినిమా చాలా మంచి కథతో వస్తారనుకుని వేచి చూశా. ‘హిట్’ ట్రైలర్స్, పాటలు బాగున్నాయి’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘హిట్’ సినిమా పెద్ద విజయం సాధించాలి. నాని హీరో అయినప్పటికీ కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తున్నాడు.. అలాంటి నాని బ్యానర్కి సక్సెస్ కావాలి’’ అన్నారు. నాని మాట్లాడుతూ–‘‘హిట్’ సినిమాని తొలుత నేనే చేద్దామనుకున్నా.. విశ్వక్ అయితే బాగుంటుందనిపించింది. శైలేష్ చెప్పిన కథల్లో ‘హిట్’ వెంటనే తీయాలనిపించింది. డాక్టర్ ఉద్యోగం వదలొద్దని తొలుత చెప్పేవాణ్ణి.. ఈ రోజు చెబుతున్నా ఉద్యోగం వదిలేయ్.. పర్లేదు. ‘ఫలక్నుమాదాస్’లో విశ్వక్ ఆ పాత్రకు సరిపోయాడు.. ‘హిట్’ సినిమా చూశాక ఏ పాత్ర అయినా ఇరగదీస్తాడనే నమ్మకం ఉంది. ఈ సినిమాకి ఇద్దరు హీరోలు.. ఒక్కరు విశ్వక్ సేన్.. మరొకరు సంగీత దర్శకుడు వివేక్ సాగర్. ‘అ’ సినిమా బాగున్నా డబ్బులు రాలేదేమో? అని కొందరు రాస్తుంటారు.. నిర్మాతగా నేను చెబుతున్నా. ఆ సినిమా పక్కా కమర్షియల్ హిట్. ఈ నెల 28న ప్రేక్షకులకు ‘హిట్’ రూపంలో ఓ క్వాలిటీ, మంచి సినిమా ఇస్తున్నాం.. ఇందుకు గర్వంగా ఉంది’’ అన్నారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘రుహాని శర్మ మంచి నటి. ప్రశాంతిగారు సో స్వీట్. ఒకేసారి రెండు సినిమాలు చేయొద్దు.. ఒక్కొక్కటి చేస్తే ప్రశాంతంగా ఉంటుందని నాని అన్న సలహా ఇచ్చాడు.. అది ఎంతో ఉపయోగపడింది. శైలేష్గారు శాస్త్రవేత్తలాంటివాడు.. తెలివైనవాడు. ‘హిట్’ సినిమాకి నీళ్లు ఎక్కువ తాగి రాకండి.. వాష్రూమ్ వెళ్లే టైమ్ కూడా ఉండదు. ఇలాంటి థ్రిల్లర్ సినిమా తెలుగులో నేను చూడలేదు’’ అన్నారు. శైలేశ్ కొలను మాట్లాడుతూ– ‘‘2017లో నానీ అన్నకి కథ చెప్పా.. విన్నాక ‘నువ్వే ఎందుకు దర్శకత్వం చేయకూడదు?’ అన్నారు. ఆ తర్వాత సిడ్నీ వెళ్లిపోయి డైరెక్షన్ నేర్చుకుని వచ్చి ఈ సినిమా తీశా. నన్ను దర్శకునిగా పరిచయం చేసినందుకు మీకు థ్యాంక్స్ అన్న. ప్రశాంతి మేడమ్కి థ్యాంక్స్. విక్రమ్ రుద్రరాజు అని నేను రాసుకున్న పాత్రకి రెట్టింపు నటన ఇచ్చిన విశ్వక్కి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఈ చిత్రం బాగా రావడానికి ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు. నాకు అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకి థ్యాంక్స్’’ అన్నారు రుహాని శర్మ. ఈ వేడుకలో నిర్మాత ప్రశాంతి, డైరెక్టర్ నందినీ రెడ్డి, హీరోలు రానా, నవదీప్, సందీప్ కిషన్, ‘అల్లరి’ నరేశ్, సునీల్, కార్తికేయ, నటి మంచు లక్ష్మి, నటులు భానుచందర్, రాహుల్ రామకృష్ణ, రవివర్మ, నిర్మాతలు రాజ్ కందుకూరి, బెక్కం వేణుగోపాల్, సంగీత దర్శకులు కీరవాణి, వివేక్ సాగర్, కాలభైరవ, కెమెరామేన్ మణికంద¯Œ , ఎడిటర్ గ్యారీ, డైరెక్టర్ తరుణ్ భాస్కర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పాల్గొన్నారు. -
క్లైమ్యాక్స్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను
‘‘సరిలేరు నీకెవ్వరు, ‘అల.. వైకుంఠపురములో, జాను’ చిత్రాలతో ఈ ఏడాది అప్పుడే ‘దిల్’ రాజుగారు హ్యాట్రిక్ కొట్టారు. ‘జాను’ అందమైన ప్రేమకథ. క్లైమ్యాక్స్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను. నేను చూసిన ‘గీతాంజలి’, నేను డైరెక్ట్ చేసిన ‘పదహారేళ్ల వయసు’ సినిమాల క్లైమ్యాక్స్ తర్వాత ‘జాను’ చిత్రం అంతలా కదిలించింది’’ అన్నారు దర్శకుడు కె. రాఘవేంద్రరావు. శర్వానంద్, సమంత జంటగా సి. ప్రేమ్కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాను’. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రబృందం థ్యాంక్స్ మీట్ను నిర్వహించింది. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘తొలి రోజు నుంచి ఇటు ఇండస్ట్రీ నుండి అటు మీడియా, సోషల్ మీడియా, ప్రేక్షకుల నుండి మా ‘జాను’కి అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రేమ్, ఇతర సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు. శర్వానంద్, సమంత కళ్లతోనే నటించారు. మా బ్యానర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ అని చెబుతున్నారు. జనరల్గా సినిమాలు తీసేటప్పుడు లెక్కలు వేసుకుంటాను.. కానీ ‘జాను’కి లెక్కలు వేసుకోలేదు. ఇలాంటి సినిమాను ప్రోత్సహిస్తేనే మరిన్ని మంచి సినిమాలు చేయగలం’’ అన్నారు. ‘‘సినిమాని చూసిన వారందరూ చాలా పాజిటివ్గా స్పందించారు’’ అన్నారు సమంత. శర్వానంద్ మాట్లాడుతూ– ‘‘నా కెరీర్లో గుర్తుండిపోయే సినిమా ‘జాను’. హిట్స్ కొడుతున్నా కానీ... నటుడిగా ఏదో మిస్ అయ్యాననే భావన మనసులో ఉండిపోయింది.. అది ‘జాను’తో తీరింది. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను’’ అన్నారు. దర్శకులు బి.వి.ఎస్. రవి, నందినీ రెడ్డి, పాటల రచయిత శ్రీమణి, రచయిత ‘మిర్చి’ కిరణ్ మాట్లాడారు. -
అదే మాకు పెద్ద సక్సెస్
‘‘ఒక నటుడిగా నేను బాగానే చేస్తున్నానంటున్నారు కానీ రావాల్సిన పేరు ఇంకా మనకు రాలేదా? అనే ఒక చిన్న వెలితి ఉండేది. ‘జాను’ చిత్రం యాక్టర్గా నన్ను మెరుగుపరిచింది. నా కెరీర్లోనే ఎప్పుడూ రానన్ని ప్రశంసలు వస్తున్నాయి. ఈ విజయం యాక్టర్గా నా ఆకలిని కొంచెం తీర్చింది’’ అన్నారు శర్వానంద్. సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో శర్వానంద్, సమంత ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘జాను’. తమిళంలో హిట్ సాధించిన ‘96’ చిత్రానికి ఇది రీమేక్. ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమా వేశంలో శర్వానంద్ చెప్పిన విశేషాలు. ► ‘96’ చూసి క్లాసిక్ మూవీ, తెలుగు రీమేక్ అవసరమా? అనిపించింది. ‘శతమానం భవతి’(2017) సినిమా సమయంలో కూడా ‘కథ బాగుంది కాకపోతే నా పాత్ర అంతగా ఉన్నట్లు లేదు’ అనే సందేహం వచ్చినప్పుడు.. ఈ సినిమాతో ఫ్యామిలీకి దగ్గరవుతావు’ అన్న ‘దిల్’ రాజుగారి జడ్జ్మెంట్ నిజమైంది. ‘జాను వర్కౌట్ అవుతుంది’ అని అన్నారాయన. ఆ నమ్మకంతోనే నటించాలనుకున్నాను. ‘దిల్’ రాజుగారు నిర్మాత కాకపోతే గ్యారంటీగా ‘జాను’ చిత్రం చేసేవాడిని కాను. ► ఒక రోజు రాత్రి జరిగే కథ. ఓ నలభై రోజులు కాల్షీట్లు ఇస్తే సరిపోతుందిలే అనుకున్నా. కానీ రామచంద్ర క్యారెక్టర్ కళ్లతోనే ఎక్కువగా మాట్లాడాలి. ఇరవై రోజులు కెన్యాలో షూట్ చేశాం. మాల్దీవుల్లో చేశాం. ఓ సీన్లో గాయపడ్డాను. మరోవైపు కో–స్టార్గా సమంత. రిలీజ్ తర్వాత మా ఇద్దరి యాక్టింగ్కు పోలికలు పెట్టి ట్రోల్ చేస్తారేమోనన్న భయం. కానీ నా కెరీర్లోనే నేను బాగా కష్టపడ్డ సినిమా ‘జాను’. సమంత కాకుండా వేరే ఎవరైనా ‘జాను’ పాత్ర చేసినా నా నుంచి అంత నటన వచ్చి ఉండేది కాదేమోనని ఒక యాక్టర్గా నేను అనుకుంటున్నాను. ‘96’లో చేసిన విజయ్సేతుపతి, త్రిషలను మర్చిపోయి ‘జాను’లో శర్వా, సమంతలను చూస్తున్నాం అంటున్నారు. అదే మాకు పెద్ద సక్సెస్. ► వ్యక్తిగా, నటుడిగా సమంత నుంచి చాలా నేర్చుకున్నాను. ‘నేనొక సూపర్స్టార్.. నేను అక్కినేని ఫ్యామిలీ’ అనే గర్వం తనలో లేదు. నేనొక షాట్ పూర్తి చేసి వెళ్లి కూర్చొంటే... సమంత మాత్రం మానిటర్ దగ్గరకు వెళ్లి చెక్ చేసుకునేది. ఇప్పుడు ఆ ఫార్ములాను నా సెట్లో నేను వాడుతున్నాను. రిలీజ్ తర్వాత మేం ఫోన్లో మాట్లాడుకున్నాం. ‘సైలెంట్గా ఉంటావ్ కానీ బాగానే మార్కులు కొట్టేశావ్.. నువ్వు దొంగవి’ అంది సమంత. ► ప్రతి ఒక్కరి జీవితంలో ఫస్ట్ లవ్ ఉంటుంది. నాకు కూడా ఉంది కాబట్టే రామచంద్ర పాత్రలో బాగా నటించానేమో (నవ్వుతూ). ఫస్ట్ లవ్ను పెళ్లి చేసుకునేవారు చాలా తక్కువ. 100లో 5 పర్సెంట్ ఉంటారేమో. ► నా కెరీర్లో ‘గమ్యం, ప్రస్థానం’ వంటి మంచి హిట్స్ ఉన్నాయి. కానీ ‘జాను’ లాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావు. నా కెరీర్లో ‘జాను’ గుర్తుండిపోయే సినిమా. ► తక్కువ రోజుల్లోనే షూట్ను కంప్లీట్ చేద్దామనే అక్షయ్కుమార్ ఫార్ములాను ఫాలో అవుదామని ఫిక్స్ అయ్యాను. 3 సినిమాలు అయిపోవాలి.. 3 సెట్స్పై ఉండాలి. ‘శ్రీకారం’లో రైతు పాత్ర చేస్తున్నాను. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 24న విడుదల చేస్తున్నాం. -
యూత్ఫుల్ ఎంటర్ టైనర్
‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న చిత్రానికి బుధవారం కొబ్బరికాయ కొట్టారు. ఈ చిత్రంతో హరి కొలగాని దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీ సాయి లక్ష్మీ క్రియేష¯Œ ్స పతాకంపై పి.యస్.ఆర్ కుమార్ (వైజాగ్ బాబ్జి) నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్లో ప్రారంభం అయ్యింది. తొలి సన్నివేశానికి నిర్మాత బి.వి.యస్. ఎన్. ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత ‘దిల్’ రాజు తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. పి.ఎస్.ఆర్ కుమార్ (వైజాగ్ బాబ్జి) మాట్లాడుతూ–‘‘డిస్ట్రిబ్యూటర్గా తెలుగు సినిమా పరిశ్రమతో నాకు చాలా అనుబంధం ఉంది. నేను నిర్మాతగా మారడంలో బెక్కం వేణుగోపాల్ ప్రోత్సాహం ఎంతో ఉంది’’ అన్నారు. ‘‘శబ్దాలయా, అన్నపూర్ణ సంస్థలలో డైరెక్షన్ డిపార్ట్ మెంట్లో పనిచేశాను. యూత్ఫుల్ ఎంటర్ టైనర్గా రూపొందనున్న చిత్రమిది. ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ నేటి నుంచి ప్రారంభమై ఇరవై రోజుల పాటు హైదరాబాద్లో జరుగుతుంది’’ అన్నారు హరి కొలగాని. ‘‘ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తాను’’ అన్నారు సాయి ధన్సిక. ఈ చిత్రానికి సమర్పణ: వాగేశ్వరి (పద్మ), కెమెరా: వాస్లి శ్యాం ప్రసాద్, సంగీతం: శేఖర్ చంద్ర, సహ నిర్మాతలు: పవన్, సుమన్, లైన్ ప్రొడ్యూసర్: వెంకట యస్కె కులపాక. -
పేరు కోసమే కష్టపడ్డాను
‘‘నా కెరీర్ ప్రారంభం నుంచి కూడా నేను పేరుకోసమే పని చేశాను. ఒక సినిమా చేయాలా? వద్దా? అనే నా నిర్ణయాన్ని డబ్బు ప్రభావితం చేయలేదు. కొత్త సినిమాని ఒప్పుకునేముందు ఆ సినిమా వల్ల నాకు ఎంత పేరు వస్తుందని మాత్రమే ఆలోచించుకుని నా వంతు కష్టపడ్డాను. డబ్బు ఆటోమేటిక్గా వచ్చేసింది(నవ్వుతూ)’’ అని సమంత అన్నారు. శర్వానంద్, సమంత జంటగా సి. ప్రేమ్కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాను’. తమిళంలో హిట్ సాధించిన ‘96’ చిత్రానికి ‘జాను’ తెలుగు రీమేక్. ‘96’ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రేమ్కుమారే ‘జాను’ సినిమాని డైరెక్ట్ చేశారు. ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం రేపు(శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా సమంత చెప్పిన విశేషాలు... ► ‘జాను’ ఇద్దరు వ్యక్తుల కథ. నాకైతే చాలా పెద్ద సినిమా చేశాననిపించింది. ఎక్కువ రిస్క్ అనిపించింది. నా 100 పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాను. ‘96’ సినిమా బాగా నచ్చింది. ఆ చిత్రంలో విజయ్ సేతుపతి బాగా చేశారన్నారు. నాకైతే ‘96’ త్రిషగారి సినిమా అనిపించింది. ఈ సినిమా రీమేక్లో నటించకూడదని తొలుత అనుకున్నాను. ‘దిల్’రాజుగారు అడగడంతో కాదనలేకపోయాను. కానీ ‘జాను’ సినిమా చేయకపోతే నా కెరీర్లో ఒక మంచి సినిమా కోల్పోయేదాన్ని.. పశ్చాత్తాపం చెందాల్సి వచ్చేది. ► త్రిషగారి నటనను కాపీ చేయలేదు. సినిమాలోని పాత్రని అర్థం చేసుకుని నా శైలిలో విభిన్నంగా నటించాను. అది స్క్రీన్పై ఎంత వర్కవుట్ అయ్యిందన్నది ప్రేక్షకులు చెబుతారు. నేను చాలా కష్టపడ్డాను. స్క్రిప్ట్ను చాలాసార్లు చదివాను. నాకైతే పూర్తి నమ్మకం ఉంది. విడుదల తర్వాత ప్రేక్షకులు కూడా నమ్ముతారని ఆశిస్తున్నాను. ‘96’లాంటి సినిమాలను రీమేక్ చేయడం కష్టం. కానీ ప్రేమ్కుమారే తెరకెక్కించడంతో ఆ మ్యాజిక్ను రీ–క్రియేట్ చేశారనిపించింది. ► స్క్రిప్ట్ ప్రకారం నా నటన బట్టే శర్వాగారి నటన ఉంటుంది. అందుకే ఒకరికొకరు సహాయం చేసుకుని బెస్ట్ ఔట్పుట్ రావడం కోసం కష్టపడ్డాం.. శర్వా బాగా నటించారు. క్లైమాక్స్ మార్చడం కోసం షూటింగ్ను ఆపేశామనే వార్తల్లో నిజం లేదు. శర్వాగారికి ఆరోగ్యం సహకరించనప్పుడు కొంత షూట్ ఆపాం. ఆ తర్వాత మొదలైన ఒక్క షెడ్యూల్లోనే సినిమాను పూర్తి చేశాం. ► నా కెరీర్లో పది సంవత్సరాలు గడిచిపోయాయి. కాలం గడిచేకొద్దీ కొత్త హీరోయిన్లు వస్తుంటారు. ట్రెండ్ మారిపోతుంటుంది. కొందర్ని బెటర్ పెర్ఫార్మెన్స్ అంటారు.. ఇంకొందర్ని బ్యూటిఫుల్ అంటారు. కానీ వీలైనంత కాలం నా పేరు నిలిచిపోవాలని నేను కోరుకుంటున్నాను. అందుకు తగ్గట్లు కష్టపడుతున్నాను. నేను చేసే ప్రతి సినిమా నా మొదటిదిగా భావిస్తాను. నా నటన, నా ప్రవర్తన పట్ల సినిమా యూనిట్ సంతోషంగా ఉన్నారో లేదో కూడా ముఖ్యమే. ► ప్రమోషన్స్ ఎంతవరకు సినిమా కలెక్షన్స్ను ప్రభావితం చేస్తాయో నాకు తెలియదు. కానీ నేను ఒక చోటుకు వెళ్లి సినిమాను ప్రమోట్ చేయడం వల్ల పది టిక్కెట్లైనా అమ్ముడు పోతాయంటే వెళ్లి ప్రమోట్ చేస్తాను. ఎందుకంటే ఒక నిర్మాత నన్ను నమ్మి, ఇంత పారితోషికం ఇచ్చినప్పుడు చేయాలి. మూవీ విడుదలై, విజయం సాధిస్తే నేను ఫోన్ లిఫ్ట్ చేయను (సరదాగా). అదే రిలీజ్కు ముందు అయితే నాకు వీలైనంత ప్రమోషన్ చేస్తాను. రిలీజ్ టైమ్లో సినిమా ఫలితం గురించి కాస్త ఆందోళనకి గురవుతా. ► నా చదువు పట్ల మా అమ్మగారు మరీ స్ట్రిక్ట్గా ఉండేవారు కాదు. కానీ, నేను ఫుల్ మార్క్స్ రావాలని కోరుకుంటాను. 12వ తరగతిలో అకౌంట్స్లో 200కి 199 మార్కులు రావడంతో బాగా ఏడ్చాను. నేను ఫెయిల్ అయ్యానని మా అమ్మ అనుకున్నారు. అసలు విషయం తెలియడంతో సైలెంట్గా వెళ్లిపోయారు. ► నా సినిమాలను చూడమని నా స్నేహితులకు చెబుతుంటాను. నేను గ్రాడ్యుయేషన్ చేసేటప్పుదు మాది గర్ల్స్ కాలేజ్. చాలా స్ట్రిక్ట్. ఎవరూ టీవీ, ఇండస్ట్రీ అంటూ ఉండేవారు కాదు. కానీ, నేను చేసేదాన్ని. సినిమాలకే కాదు.. కుటుంబానికీ సమయం కేటాయించాలనుకుంటున్నాను. ఒక ఆర్టిస్టుగా నేను సాధించే విజయాల కన్నా కూడా నా వ్యక్తిత్వం గురించి మా కుటుంబ సభ్యులు గర్వంగా ఫీల్ అవుతారు. ► ‘రంగస్థలం’ తర్వాత సమంత ఏం చేసినా హిట్ అయిపోతుందన్నారు. ఆ సినిమాలో నా క్యారెక్టరైజేషన్, కొంచెం కథ తెలుసంతే. ఎంటైర్ స్క్రిప్ట్ తెలియదు. ఇప్పుడు నేను సినిమాలను చాలా తెలివిగా ఎంచుకుంటున్నాని అంటున్నారు. కానీ అది అలా జరుగుతోందంతే. ► ‘ది ఫ్యామిలీమేన్ సీజన్ 2’ వెబ్ సిరీస్లో కొత్త సమంతను చూస్తారు. చాలా కష్టపడ్డాను. నేను ఒక్కషాట్లో కూడా డూప్ వాడలేదు. అప్పుడు అనుకున్నాను.. సినిమాలో ఫైట్స్ కోసం హీరోలు ఇంత కష్టపడతారా అని!. ఇందులో నేను చేసిన పాత్రను ఇదివరకు చేయలేదు. -
స్ట్రయిట్ సినిమా చేయడం ఈజీ
శర్వానంద్, సమంత జంటగా నటించిన చిత్రం ‘జాను’. తమిళంలో విజయవంతమైన ‘96’ చిత్రానికి రీమేక్ ఇది. తమిళ సినిమాకి దర్శకత్వం వహించిన సి. ప్రేమ్కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు విలేకరులతో మాట్లాడారు. ► నేను నిర్మాతగా చేసిన మొదటి సినిమా నుండి స్క్రిప్ట్తో పాటు ట్రావెల్ చేయటం అలవాటు. అందుకే రీమేక్ చిత్రాలు తీయలేదు. అది మాత్రమే కాదు స్ట్రయిట్ సినిమా చేయటం ఈజీ. మధ్యలో ‘ప్రేమమ్’, ‘బెంగుళూర్ డేస్’ సినిమాలు చూసినప్పుడు ఎగ్జయిట్ అయ్యాను. ‘బెంగుళూర్ డేస్’ సినిమాకి చాలా వర్కవుట్ చేసి హీరోలుగా నాని, శర్వానంద్లను అనుకున్నాను. తర్వాత మూడో హీరో విషయంలో శాటిస్ఫై అవ్వలేదు. డ్రాప్ అయ్యాను. ‘ప్రేమమ్’ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు సితార ఎంటర్టైన్మెంట్ నాగవంశీ ‘అన్నా.. ఈ సినిమాని నేను రీమేక్ చేస్తాను’ అన్నాడు. ‘సరే’ అన్నాను. ► అనుకోకుండా ఈ ఏడాది మూడు రీమేక్ సినిమాలు చేస్తున్నాను. ‘96’ తమిళ చిత్రాన్ని ‘జాను’ పేరుతో చేశాను. నాని హీరోగా తెలుగులో విజయం సాధించిన ‘జెర్సీ’ చిత్రాన్ని షాహిద్ కపూర్తో హిందీలో రీమేక్ చేస్తున్నా. బాలీవుడ్లో నిర్మాతగా నాకిది ఫస్ట్ సినిమా. అలాగే హిందీ ‘పింక్’ను తెలుగులో పవన్ కల్యాణ్ హీరోగా చేస్తున్నాను. ఈ సినిమాను మే 15న రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ► ‘జాను’ సినిమా విషయానికొస్తే ‘96’ సినిమా ట్రైలర్ చూడగానే ఆసక్తిగా అనిపించింది. అప్పటినుండి దాన్ని ఫాలో అవుతూ వచ్చాను. నాకు తమిళ్ పెద్దగా అర్థం కాకపోయినా సినిమా టచ్ చేసింది. ఈ సినిమాలో అద్భుతమైన సన్నివేశాలతో పాటు చిన్నప్పటి ఫ్రెండ్స్, రీయూనియన్ అనగానే పాత రోజు లకు వెళ్లిపోతాం. జనరల్గా పదో తరగతి ప్రేమలు సక్సెస్ కావు. ఈ సినిమాలోనూ అంతే. ఈ పాయింట్ లె లుగు ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుంది. ► అల్లు అర్జున్తో మేం చేసిన ‘ఆర్య’ సినిమాకి ఈ చిత్రదర్శకుడు ప్రేమ్కుమార్ అసిస్టెంట్ కెమెరామేన్గా చేశాడట. మాకు గుర్తు లేదు. ‘96’ చూడ్డానికి కెమెరామేన్ విజయ్ చక్రవర్తితో వెళ్లినప్పుడు తను ఆ విషయం నాకు చెప్పాడు. మీకు ఆసక్తి ఉంటే తెలుగులో కూడా మీరే డైరెక్ట్ చెయ్యండని ప్రేమ్తో అంటే, సరే అన్నారు. తెలుగు ఆడియన్స్ను దృష్టిలో పెట్టుకొని ఈ కథలో చిన్న మార్పులు చేశాం. ► నేను ఈ సినిమా చూస్తున్నప్పుడే త్రిష ప్లేస్లో సమంతను ఊహించుకున్నాను. ముందు సమంత ఈ సినిమాలో నటించటానికి భయపడింది. షూటింగ్ స్టార్ట్ అయిన రెండు రోజుల తర్వాత ప్రతి రోజూ మేజిక్ జరుగుతోంది, మీరు నన్ను ఒప్పించకుంటే మంచి సినిమా మిస్ అయ్యేదాన్ని అని మెసేజ్ పెట్టింది. ► విజయ్ సేతుపతి ‘96’లో అద్భుతంగా నటించాడు. అతనిలాంటి హీరో దొరుకుతాడా అనుకున్నాను కానీ, ఈ కథను ఓన్ చేసుకొని శర్వానంద్ అద్భుతంగా బ్యాలెన్స్ చేశాడని ప్రేమ్కుమార్ అన్నాడు. మా బేనర్లో నెక్ట్స్ మహేశ్బాబు హీరోగా సినిమా ఉంటుంది. దర్శకుడు వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. -
‘దిల్’ రాజుకి ఏమైనా మెంటలా!
‘‘తమిళచిత్రం ‘96’ని తెలుగులో రీమేక్ చేస్తున్నాం అని వార్తలు రాగానే వీళ్లకేమైనా పిచ్చా? ‘దిల్’ రాజుకేమైనా మెంటలా? అని కామెంట్స్ వినిపించాయి. నేను ఏ ఫీలింగ్తో అయితే ఉన్నానో రేపు సినిమా చూసిన ప్రేక్షకులకు కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది’’ అని ‘దిల్’ రాజు అన్నారు. శర్వానంద్, సమంత జంటగా సి. ప్రేమ్కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాను’. తమిళ చిత్రం ‘96’కి ఇది రీమేక్. ఫిబ్రవరి 7న ఈ చిత్రం విడుదల కానుంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘నా 17 ఏళ్ల కెరీర్లో ఇది తొలి రీమేక్. తమిళంలో రిలీజ్ కాకముందే చూశాను. తమిళం అర్థం కాకపోయినా ఆ పాత్రలతో కనెక్ట్ అయి ప్రయాణించాను. అప్పుడే రీమేక్ చేయాలని నిశ్చయించుకున్నాను. నాపై నమ్మకం ఉంచి సినిమా చేయమని సమంతకు చెప్పాను. సినిమా చూసి చేస్తానని శర్వా (శర్వానంద్) చెప్పాడు. ‘జాను’ చూశాక అమ్మాయిలు శర్వాతో, అబ్బాయిలు సామ్తో లవ్లో పడతారు. అలాంటి లవర్ మనకు లేరని ఈర్ష్య పడతారు’’ అన్నారు. ‘‘రీమేక్ చేయాలా వద్దా? అని మాట్లాడుకుంటున్నప్పుడు రాజు అన్న ‘నన్ను నమ్ము’ అన్నారు. ఆయన జడ్జిమెంట్ మీద నాకు నమ్మకం ఉంది. ‘శతమానం భవతి’ అప్పుడు కూడా ఇదే అన్నారు. నాకు మంచి హిట్ ఇచ్చారు. ఈసారి కూడా అదే చేస్తారనుకుంటున్నాను. సమంతగారు లేకపోతే నేను అంతగా యాక్ట్ చేయలేకపోయేవాడినేమో. లవ్ ఫెయిల్యూర్ అనేది జరుగుతూనే ఉంటుంది. అయితే ఫస్ట్ లవ్ అందరికీ గుర్తుంటుంది. ఈ పదేళ్లలో ఇలాంటి లవ్స్టోరీ రాలేదనుకుంటున్నా’’ అన్నారు శర్వానంద్. ‘‘రీమేక్ మూవీ కోసం రాజుగారు కలుస్తాను అంటే భయపడ్డాను. ఒకవేళ ఆయన్ను కలిస్తే సినిమాకి ఓకే చెప్పేస్తాను. ఆయన బ్యానర్తో ఉన్న అనుబంధం కారణంగా ఈ సినిమా ఒప్పుకున్నాను. ప్రతిరోజూ సెట్లో మ్యాజిక్ జరగాలంటే కష్టం. కానీ శర్వానంద్ వల్ల ఆ కష్టాన్ని దాటేశాం. నా పర్ఫార్మెన్స్కి వచ్చే క్రెడిట్ మా ఇద్దరికీ దక్కుతుంది’’ అన్నారు సమంత. -
నా కెరీర్లో ఇలాంటి సంక్రాంతి చూడలేదు
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి 22 ఏళ్లు అవుతోంది. నా కెరీర్లో ఇప్పటివరకు ఇలాంటి సంక్రాంతిని చూడలేదు’’ అని అన్నారు ‘దిల్’ రాజు. మహేశ్బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో రష్మికా మందన్నా కథానాయికగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో రామబ్రహ్మం సుంకర, మహేశ్బాబు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలైన సంగతి తెలిసిందే. తమ సినిమాకు మంచి స్పందన, కలెక్షన్స్ వస్తున్నాయని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘కేవలం ఐదు నెలల్లో సినిమాను పూర్తి చేసి ‘సరిలేరు మాకెవ్వరు’ అనిపించారు మహేశ్బాబు, అనిల్ రావిపూడి. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని బ్లాక్ బస్టర్కా బాప్ అనే స్థాయిలో రెవెన్యూ క్రియేట్ చేసి డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ నిజమైన సంక్రాంతి అనుకునేలా చేశారు అనిల్. మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్కు, ఏకే ఎంటర్టైన్మెంట్స్కి హాయ్యస్ట్ రెవెన్యూ కలెక్ట్ చేసిన సినిమాగా చేశారు అనిల్. డిస్ట్రిబ్యూటర్స్కు ఎంత లాభాలు కావాలో అంత లాభం వచ్చింది. ఇంకా ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేస్తుందన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేం. ఈ సంక్రాంతికి ఇంత మంచి రెవెన్యూ ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘సంక్రాంతి పండగ ముగిసిపోయింది. కానీ పండక్కి విడుదలైన సినిమాలకు సంక్రాంతి ఇంకా నడుస్తూనే ఉంది. మహేశ్గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అంటే మామూలు విషయం కాదు. అనిల్ కష్టానికి తగిన ప్రతిఫలం మా అందరికీ వచ్చింది. మేము ఊహించిన కలెక్షన్స్ కన్నా ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. తెలుగు ఇండస్ట్రీలోనే బెస్ట్ సంక్రాంతి అంటూ కొందరు డిస్ట్రిబ్యూటర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి సంక్రాంతిలో మా సినిమా ఉండటం సంతోషంగా ఉంది’’ అన్నారు అనిల్ సుంకర. ‘‘సంక్రాంతికి బాక్సాఫీస్ దద్దరిల్లిపోయింది. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని మహేష్గారి కెరీర్లోనే పెద్ద హిట్గా నిలిపిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇంకా మూడు వారాల రన్ ఉంది. సినిమాలో కొత్తగా 90సెకన్లు ఉండే ఓ సీన్ను జోడించబోతున్నాం. దాంతో ఇంకొంచెం నవ్వులు బోనస్గా లభిస్తాయి. సినిమాను మళ్లీ చూడాలనుకునేవారికి, కొత్తగా చూడాలనుకునేవారి కోసం ఈ సీన్ను యాడ్ చేస్తున్నాం. ఎప్పుడు యాడ్ చేస్తామనేది త్వరలో చెబుతాం’’ అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. -
నేను తీసుకున్న మంచి నిర్ణయం సరిలేరు నీకెవ్వరు చేయటమే
‘‘నా కెరీర్లో నేను తీసుకున్న మంచి నిర్ణయం ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేయటమే. 20 ఏళ్ల కెరీర్లో ఇంత అద్భుతమైన స్పందనను నేనెప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. నాన్న అభిమానులు, నా అభిమానుల తరఫున దర్శకుడు అనిల్కి థ్యాంక్స్’’ అన్నారు మహేశ్బాబు. సంక్రాంతి కానుకగా ఈ నెల 11న విడుదలైన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. మహేశ్బాబు, రష్మిక జంటగా ‘దిల్’ రాజు సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రానికి మహేశ్బాబు కూడా ఓ నిర్మాతగా వ్యవహరించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయశాంతి ప్రత్యేక పాత్రలో నటించారు. ‘బ్లాక్బస్టర్ కా బాప్’ పేరుతో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా 100 కోట్ల షేర్ పోస్టర్ను చిత్రం డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మహేశ్బాబు మాట్లాడుతూ– ‘‘అనిల్ రావిపూడి ఈ సినిమాలో ఎన్నో మంచి డైలాగులు రాశారు. కానీ, ‘రమణా.. లోడెత్తాలిరా’ అనే డైలాగ్ మాత్రం బీభత్సంగా పేలింది. కథ వినగానే దేవిశ్రీ ప్రసాద్ మాస్ సాంగ్ చేయటానికి మంచి అవకాశం ఉందని ముందే చెప్పారు. అలా వచ్చిందే ‘మైండ్ బ్లాంక్’ సాంగ్. ‘కొడుకు దిద్దిన కాపురం’ చిత్రంలో విజయశాంతి గారితో నటించాను. ఆ సినిమా పెద్ద హిట్. ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్బస్టరో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ సంక్రాంతిని ఎప్పటికీ మరచిపోను. నాలుగైదేళ్లుగా నా అభిమానులు, ప్రేక్షకులు కొత్త మహేశ్ను కోరుకుంటున్నారు. అది ఈ సినిమాతో సాధ్యం చేసిన నిర్మాత అనిల్ సుంకరగారికి థ్యాంక్స్’’ అన్నారు. విజయశాంతి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాని ‘బ్లాక్బస్టర్ కా బాప్గా నిలిపిన ప్రేక్షకులకు నమస్కరిస్తున్నాను. సైనికుల తల్లిదండ్రుల బాధ ఏంటో అనిల్ ఈ చిత్రంలో సందేశాత్మకంగా చూపించారు. మహేశ్బాబుతో పని చేయటం కంఫర్ట్గా ఉంటుంది. ఈ సినిమాలో చేసిన భారతి పాత్ర నా కెరీర్కి ఎంతో ప్రత్యేకం. రాములక్కా.. మళ్లీ సినిమాలు చేయండి అని అడుగుతున్నారు. ఈ రాములక్క సినిమా చేయాలంటే సబ్జెక్ట్ బాగుండాలి, పాత్ర దద్దరిల్లాలి’’ అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘మహర్షి’ సినిమా సక్సెస్ మీట్లో అన్నాను... మహేశ్ సార్ నా సినిమా వల్ల మీ ముఖంలో నవ్వురావాలి, మిమ్మల్ని ఆనందంగా చూడాలి అని. సినిమా విడుదలైన రోజు నుండి నేను ఆయనతోనే ఉంటున్నాను. ఆయన ఎంతో సంతోషంగా ఉంటున్నారు. బాబు బ్యాటింగ్ మొదలయ్యింది, ఫస్ట్ వీక్ 100 కోట్లు కలెక్ట్ చేసింది’’ అన్నారు. ‘‘మహేశ్తో ఇలాంటి జోనర్లో సినిమా చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నా. ఎవరూ ఊహించని విధంగా ఆయన నటన ఉంది. అనిల్ రావిపూడికి థ్యాంక్స్’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, యం.ఎల్.ఏ వినయ్ భాస్కర్, వరంగల్ సీపీ రవీందర్తో పాటు నటుడు రాజేంద్రప్రసాద్, నిర్మాతలు ‘దిల్’ రాజు, అనిల్ సుంకర, దర్శకులు వంశీ పైడిపల్లి, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
విచిత్రమైన జోన్లో ఉన్నాం
‘‘అనిల్ రావిపూడి ‘ఎఫ్ 2’ సినిమా చేస్తున్నప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ కథని నాకు 40 నిమిషాలు చెప్పాడు.. ఎగ్జైటింగ్గా అనిపించింది. అయితే ‘మహర్షి’ తర్వాత వేరే సినిమా కమిట్మెంట్ ఉంది.. దాని తర్వాత చేద్దామన్నాను.. తను కూడా ‘ఎఫ్ 2’ తర్వాత వేరే సినిమా చేస్తాను.. ఆ తర్వాత ఇద్దరం చేద్దాం సార్ అన్నాడు. కానీ, ‘ఎఫ్ 2’ సినిమా చూశాక ‘సరిలేరు నీకెవ్వరు’ ఈ సమయంలో నేను చేయడం కరెక్ట్ అనిపించింది. అనిల్కి చెప్పగానే చాలా సంతోషంగా ఒప్పుకున్నాడు’’ అని మహేశ్బాబు అన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్బాబు, రష్మిక మందన్నా జంటగా విజయశాంతి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ‘దిల్’ రాజు సమర్పణలో రామబ్రహ్మం సుంకర, మహేశ్బాబు నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా మహేశ్బాబు విలేకరులతో చెప్పిన విశేషాలు. ► ‘శ్రీమంతుడు’ సినిమా నుంచి నేను అన్నీ సందేశాత్మక చిత్రాలే చేస్తున్నా. వాణిజ్య అంశాలతో కూడిన ‘దూకుడు’ లాంటి వినోదాత్మక చిత్రం రావాలని నా అభిమానులు కోరుకున్నారు.. నాక్కూడా చేయాలనిపించింది. జూలైలో ఈ సినిమా స్టార్ట్ చేసి, డిసెంబరులో పూర్తి చేశాం. ఐదు నెలల్లో సినిమా పూర్తి చేశాం. ఈ సినిమా ఈ టైమ్లో చేయడం నా కెరీర్లో తీసుకున్న మంచి నిర్ణయమని అనుకుంటున్నాను. ► సినిమా చాలా బాగా వచ్చింది.. బొమ్మ (సినిమాని ఉద్దేశించి) దద్దరిల్లిపోతుంది. నేను, నిర్మాతలు, డైరెక్టర్తో పాటు యూనిట్ అంతా హిట్ సాధించబోతున్నామనే పూర్తి నమ్మకంతో ఉన్నాం. సినిమాని మా టీమ్తో పాటు కొంతమంది చూశారు. మేము ఏదైతే ఫీల్ అయ్యామో సినిమా చూసినవాళ్లు కూడా అలాగే ఫీల్ అవడం చాలా సంతోషంగా అనిపించింది. తొలి రోజు షూటింగ్ నుంచి ఈ రోజు వరకూ అదే వైబ్స్ ఫీలయ్యాం. దీన్ని బట్టి చూస్తే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందనే వైబ్స్ కనిపిస్తున్నాయి. ► ‘బిజినెస్ మేన్’ సినిమా తర్వాత నేను త్వరగా చేసిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. కథ అనుకున్నప్పడు జూన్లో స్టార్ట్ చేసి సంక్రాంతికి విడుదల చేద్దామనుకున్నాం.. ఎందుకంటే ఇది పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా.. అందుకే జూలైలో సినిమా స్టార్ట్ చేసి, పూర్తయ్యేవరకూ నాన్స్టాప్గా పనిచేశాం. ఇందులో నేను ఆర్మీ మేజర్ పాత్ర చేస్తుండటంతో మేకోవర్ కోసం ఓ నెల టైమ్ పట్టింది. ఈ పాత్ర కోసం 6 కిలోలు బరువు తగ్గాను. ► టీమ్ చక్కగా కుదిరితే సినిమాలు త్వరగా పూర్తవుతాయి.. కొన్ని సినిమాలు అలా కుదురుతాయి.. మరికొన్ని మన చేతుల్లో ఉండవు. అన్నీ ఐదు నెలల్లోనే పూర్తి కావాలంటే ఎలా? మంచి క్వాలిటీ కావాలి కదా? అయితే ‘సరిలేరు నీకెవ్వరు’కు అన్నీ కుదిరాయి.. పైగా సంక్రాంతి లక్ష్యంగా పెట్టుకున్నాం కాబట్టి వచ్చాం. ► ఈ చిత్రంలో నాది బాధ్యతగల ఆర్మీ మేజర్ పాత్ర. ఇష్టం వచ్చినట్లు చేయలేం.. దాన్ని అనిల్ చక్కగా తెరకెక్కించాడు. ఇప్పటివరకూ అనిల్ తీసిన సినిమాలు ఒక ఎత్తు.. ఈ సినిమా వేరే ఎత్తు. ఈ సినిమాతో దర్శకుడిగా పది రెట్లు పెరుగుతాడు. అంత బాగా తీశాడు ఈ సినిమాని. ► నేను ఒక్కసారి డైరెక్టర్కి సరెండర్ అయిపోతే వాళ్లు చెప్పినట్లు చేస్తా. ‘దూకుడు’ తర్వాత మళ్లీ అంత వాణిజ్య అంశాలున్న చిత్రమిది. అలాగని ‘దూకుడు’లా ఉండదు.. ఫ్రెష్గా ఉంటుంది. ఈ క్రెడిట్ అంతా అనిల్దే. నా గత సినిమాలను చూసి ఈ పాత్రని అనిల్ తీర్చిదిద్దారు. ఈ సినిమాలో ఓ మాస్ సాంగ్ ఉండాలనేది అనిల్ కోరిక.. పైగా ఈ చిత్రంలో ఆ పాటకి అవకాశం ఉండటంతో పెట్టాం. ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా మరో ఎత్తు. నా అభిమానులు, ప్రేక్షకులు కొత్త మహేశ్ను చూస్తారు. ► విజయశాంతిగారితో ‘కొడుకు దిద్దిన కాపురం’ సినిమా తర్వాత, దాదాపు 30 ఏళ్లకు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేశాను. సెట్లో తొలిరోజు ఆమెను కలవగానే ‘కొడుకు దిద్దిన కాపురం’ షూటింగ్ నిన్ననే జరిగినట్టు అనిపించింది. ఈ సినిమా ఒప్పుకున్నందుకు ఆమెకు థ్యాంక్స్.. ఎందుకంటే ఈ సినిమాలోని భారతి పాత్ర ఆమె తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. పదేళ్ల తర్వాత సంగీతగారు ఇందులో నటించారు. ఆమెను అనిల్ ఒప్పించి తీసుకొచ్చారు. ► కృష్ణగారి సర్ప్రైజ్ ఏంటో సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రేక్షకులు తప్పకుండా థ్రిల్ ఫీల్ అవుతారు. ఈ సినిమాలో సైనికులపై వచ్చే థీమ్ సాంగ్ అంటే నాకు ఇష్టం. ఈ చిత్రంలో చాలా సర్ప్రైజ్ అంశాలున్నాయి.. ప్రేక్షకుల స్పందన కోసం వేచి చూస్తున్నా. ఈ పాత్ర చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను.. ఈ మధ్య కాలంలో అంత సరదాగా ఎప్పుడూ ఉండలేదు. సినిమా స్టార్ అయిన నాలుగో రోజు నుంచే సరదాగా ఉన్నా. ► ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకి అడ్వాన్స్ తీసుకోకుండా చేశానని కాదు కానీ, ఈ సినిమా ఐదు నెలల్లో చేయాలనుకున్నాం.. ఎలా ఉంటుంది? బడ్జెట్ ఎంత? అనుకోలేదు. నేను కూడా ఈ సినిమాకి ఓ నిర్మాత కావడంతో అడ్వాన్స్ తీసుకోలేదు. ఒక నిర్మాతగా నేను తీసుకున్న నిర్ణయమది. నేను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఇది కూడా ఒకటి. భవిష్యత్తులో అందరూ ఇలాగే చేస్తే ఓ సినిమాకి ఆర్థికంగా చాలా మిగులుతుంది. ► ఒకే రోజు రెండు సినిమాలు విడుదలవడం మంచిది కాదు.. రెవెన్యూ షేర్ అయిపోతుంది. ‘అల.. వైకుంఠపురములో...’ మరుసటి రోజు విడుదలకు ఒప్పుకున్నందుకు నిర్మాతలకు థ్యాంక్స్. హీరోలెప్పుడూ థియేటర్ల గురించి పట్టించుకోరు.. సోలో రిలీజ్ కావాలని అంటారంతే. డబ్బులు నా ఒక్కడికే వస్తే ఎలా? సినిమా కొన్నవారికి కూడా రావాలి కదా? సంక్రాంతి కాబట్టి మూడు నాలుగు పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయంతే. ఈసారి ఒకేరోజు కాకుండా ఇండస్ట్రీ వారు మాట్లాడుకుని గ్యాప్తో విడుదల చేస్తున్నారు. ► నాన్నగారికి (కృష్ణ) ‘దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు’ ఇవ్వాలని చిరంజీవిగారు కోరడం సంతోషాన్నిచ్చింది. ఆ మరుసటి రోజు నాన్నగారిని కలిసినప్పుడు.. ‘చిరంజీవి బాగా మాట్లాడారు.. నా తరఫున థ్యాంక్స్ చెప్పు’ అన్నారు. చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించేందుకు రెండు ఫౌండేషన్లు పని చేస్తున్నాయి. వాటికి నా వంతు సహాయం అందిస్తున్నా. భవిష్యత్లో పెద్దగా చేస్తా. ► ప్రయోగాలు, వైవిధ్యమైన సినిమాలు అనుకోవడానికి బాగుంటాయి. కానీ, 125 నుంచి 130 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు అన్ని యాంగిల్స్ చూడాలి.. ఫ్రెష్గా ఉండాలి.. పైగా పెద్ద హీరోలందరం ఒక విచిత్రమైన జోన్లో ఉన్నాం.. అన్నీ ఉండాలి.. లేకుంటే మార్కెట్కి ఇబ్బంది. అన్నీ కుదిరితే చిన్న సినిమా చేయొచ్చు. ► దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఎలాగూ బాగా ఇస్తాడు.. నేపథ్య సంగీతం చాలా బాధ్యతగా చేస్తాడని నా భావన. నేపథ్య సంగీతంలో మంచి అనుభవం గతంలో మణిశర్మగారికి ఉండేది.. ఇప్పుడు దేవిశ్రీకి ఉంది. ఇప్పటికి 25 సినిమాలు చేశాను.. ఇంకా కొత్తగా ఏం చేయాలి? ఏం చేయొచ్చు? అని ఆలోచిస్తుంటా. ► మా సినిమా నుంచి ముందు అనుకున్న కెమెరామేన్ తప్పుకున్నప్పుడు రత్నవేలుగారికి ఫోన్ చేయగానే గంట సమయం తీసుకుని ఓకే అన్నారు. తను లేకుంటే ఇంత స్పీడ్గా సినిమా పూర్తవ్వదు.. రామ్–లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్స్ ఇరగ్గొట్టేశారు. ► ‘కేజీఎఫ్’ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ని కలిశాను.. కొన్ని స్టోరీ లైన్స్ విన్నా.. ఆ మాత్రానికే సినిమా ఫిక్స్ అయిపోదుగా? -
నన్ను మోసిన ప్రతి మెట్టూ నాకు ముఖ్యమే
‘‘మనం చేసే పని నచ్చేవారు వందలో అరవై నుంచి డెబ్బై మంది మాత్రమే ఉంటారు. ముప్పై మంది మనం ఏం తీసినా తిడతారు. అందుకే 70 మంది కోసమే సినిమా తీయాలి. నా సినిమాల కథలను ఏ కొందరో విమర్శించారని నేను పక్కకు పోయి ఓ ప్రయోగాత్మక సినిమా తీస్తే... అదేంటీ అనిల్ రావిపూడి అతని బలమైన జానర్ను వదిలేసి ఇలాంటి సినిమా తీశాడు? అనే వార్తలు వస్తాయి. నేను చేసిన ప్రతి సినిమా ఆ హీరోల కెరీర్లో వన్నాఫ్ ది బెస్ట్ ఫిలింసే’’ అన్నారు అనిల్ రావిపూడి. మహేశ్బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో అనిల్ సుంకర, మహేశ్బాబు నిర్మించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతున్న సందర్భంగా అనిల్ రావిపూడి చెప్పిన విశేషాలు. ► ‘సుప్రీమ్’ సినిమా కోసం జోధ్పూర్ నుంచి హైదరాబాద్కు ట్రైన్లో వస్తున్నప్పుడు ఒక సైనికుడిని కలిశాను. ఆయనతో మాట్లాడినప్పుడు సైనికులు ఏయే పరిస్థితుల్లో ఎలా ఉంటారో తెలుసుకున్నాను. ఆ సంఘటనల నుంచి ప్రేరణ పొంది ‘సరిలేరు నీకెవ్వరు’ కథ రాసుకున్నాను. ‘ఎఫ్ 2’ సినిమా సమయంలో మహేశ్బాబుగారికి ఈ కథ చెప్పాను. క్యారెక్టరైజేషన్ బాగా నచ్చి, నాపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చారు. ఈ సినిమాను మహేశ్గారి నమ్మకానికి నేను ఇచ్చే బహుమతిగా భావిస్తున్నా. మహేశ్గారి టైమింగ్ బాగుంటుంది. దర్శకులకు ఆయన పూర్తి స్వేచ్చ ఇస్తారు. దర్శకులకు కావాల్సింది వచ్చేంత వరకు కష్టపడుతూనే ఉంటారు. మహేశ్గారికి నేను కాదు.. ఆయన నా కెరీర్కు ప్లస్. విజయశాంతిగారు మొదట్లో చేయనన్నారు. ఒకసారి కథ వినమన్నాను. కథ విన్నాక భారతి పాత్ర చేయడానికి ఆమె ఒప్పుకున్నారు. ఆమె కోసమే ఈ పాత్ర రాశాను. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన పాటల పట్ల దర్శకుడిగా పూర్తి సంతృప్తిగా ఉన్నాను. నిర్మాతలు ‘దిల్’ రాజు, అనిల్ సుంకరగారు సహకరించారు. ► దేశభక్తి, వినోదం అనే అంశాలను ఒకేసారి డీల్ చేయడం కాస్త కష్టంతో కూడుకున్న పనే. కానీ దాన్నే హీరోగారి చేత ఎంటర్టైనింగ్గా ఎలా చెప్పించాం అనేది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. బోర్డర్ నుంచి అజయ్కృష్ణ (మహేశ్ పాత్ర పేరు) అనే ఆర్మీ ఆఫీసర్ ఓ బాధ్యతతో కర్నూలు వస్తాడు. ఒక యుద్ధ వాతావరణం నుంచి సాధారణ ప్రజల మధ్యలోకి వచ్చిన అతనికి ప్రజలు అమాయకులుగా కనిపిస్తారు. ఎందుకంటే సరిహద్దుల్లో శత్రువులు వేరు, సమాజంలోని శత్రువులు వేరు. వీరందరూ బాధ్యతతో ఉండాలనేది అజయ్కృష్ణ వ్యక్తిత్వం. యుద్ధంలో శత్రువును చంపడం కాదు. శత్రువును మార్చడం ముఖ్యమని మా సినిమా చెబుతుంది. ఇందులో వచ్చే ఆర్మీ ఎపిసోడ్ చాలా కీలకం. క్లైమాక్స్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను మెప్పిస్తాయి. ► ప్రస్తుతం నా సినిమా ప్రయాణం బాగానే సాగుతోంది. అయితే నన్ను మోసిన ప్రతి మెట్టూ నాకు ముఖ్యమే. ‘పటాస్’ సినిమాతో దర్శకుడిగా కల్యాణ్రామ్గారు అవకాశం ఇచ్చారు. ‘సుప్రీమ్’తో సాయిధరమ్ తేజ్, ‘రాజా ది గ్రేట్’కి రవితేజగారు, ‘ఎఫ్ 2’కి వెంకటేష్, వరుణ్తేజ్ గార్లు వీరందరు నన్ను ఇంతదూరం తీసుకువచ్చారు. ఇప్పుడు సూపర్స్టార్ మహేశ్గారితో సినిమా చేశాను కాబట్టి నేను ఏదో గొప్ప అని ఊహించుకోవడం లేదు. నేను వచ్చిన దారి నాకు గుర్తు ఉంది. ► ఏ దర్శకుడికైనా అతని ప్రయాణంలో ఏదో సందర్భంలో ఫ్లాప్ వస్తుంది. మనకు తెలియకుండానే ఆ తప్పు జరిగిపోతుంది. కానీ ఆ తప్పుని ఎంత దూరంలో జరుపుకుంటామనేది మన చేతుల్లో ఉంటుంది. ఆ తప్పు తొందరగా జరగకూడదని ప్రయత్నిస్తున్నాను. నేను తీసిన ప్రతి సినిమా సూపర్హిట్ అవుతుందని నేను చెప్పలేను. ► చిరంజీవిగారితో సినిమా చేసే అవకాశం వస్తే ఎగిరి గంతేస్తా. బాలకృష్ణగారితో సినిమా చేయాల్సింది. కుదర్లేదు. భవిష్యత్లో ఉండొచ్చు. ‘ఎఫ్ 2’ సీక్వెల్ ఆలోచన ఉంది. ప్రస్తతానికి నా తర్వాతి చిత్రం గురించి ఇంకా ఏమీ అనుకోలేదు. -
అందర్నీ టార్చర్ పెట్టాను!
‘‘నేను చాలా సెటిల్డ్ యాక్టర్ని. ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో చాలా ఎమోషనల్గా నటించాను. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ఫుల్ ఎనర్జీ ఉన్న పాత్ర చేశాను. ప్రస్తుతం అన్ని రకాల పాత్రలు చేస్తూ ప్రయోగాలు చేస్తున్నాను’’ అన్నారు రష్మికా మందన్నా. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో రష్మిక కథానాయిక. ‘దిల్’ రాజు సమర్పణలో రామబ్రహ్మం సుంకర, మహేశ్బాబు నిర్మించారు. ఈ నెల 11న ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా రష్మికా చెప్పిన విశేషాలు. ► దర్శకుడు అనిల్గారు కథ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. ఆయన కథను మొత్తం యాక్ట్ చేసి చూపిస్తారు. ఈ సినిమాలో నా పాత్ర ఇలా వచ్చి అలా వెళ్లిపోయేది కాదు. నా పాత్రకో ముగింపు కూడా ఉంటుంది. సినిమాలో మంచి ఫీల్ ఉంది. మహేశ్బాబుగారు, విజయశాంతిగారితో కలసి యాక్ట్ చేయడం బోనస్. ► ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నా పాత్ర చాలా డ్రమాటిక్గా ఉంటుంది. హీరో వెంటపడి అల్లరి చేసే పాత్ర నాది. చాలా హైపర్ యాక్టివ్. ఫుల్ లెంగ్త్ నవ్వించే పాత్ర నాది. ట్రైన్ ఎపిసోడ్లో మహేశ్బాబు పాత్రను నా పాత్ర చాలా టార్చర్ పెడుతుంది. ఈ సినిమాలోనే కాదు సెట్లోనూ అందర్నీ టార్చర్ పెట్టాను. సెట్లో అందరూ కామ్గా ఉంటే అందర్నీ డిస్ట్రబ్ చేస్తుంటాను. అదే నా బలం అనుకుంటున్నాను (నవ్వుతూ). ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పుకునేటప్పుడు ‘మరీ అంత టార్చర్ పెట్టకే’ అని అనుకున్నాను. ► ఈ సినిమా ట్రైలర్లో కనిపించినంత హైపర్గా నిజజీవితంలో ఉండను. మా దర్శకుడు చెప్పినట్లు చేశాను. మీరు చేసి చూపించండి, దాన్ని కాపీ కొడతాను అని చెప్పి కాపీ కొట్టేశా. కాపీ అంటే పూర్తి కాపీ కాదు. ఆయన చెప్పినదానికి కొంచెం నా స్టయిల్ జత చేసి నటించాను. ► విజయశాంతిగారితో నాకు ఎక్కువ సన్నివేశాలు లేవు. మొదట్లో ఆమెతో మాట్లాడాలంటే కొంచెం టెన్షన్ పడ్డాను. ఆమెను లేడీ అమితాబ్ అంటారు కదా. అలాగే సీనియర్ యాక్టర్ అని చిన్న భయం ఉండేది. కానీ సెట్లో ఆమె ఎనర్జీ చూసి ఫ్యాన్ అయిపోయాను. చాలా పాజిటివ్గా ఉంటారు. కేరళలో షూటింగ్ అప్పుడు మేం ఫ్రెండ్స్ అయిపోయాం. రెండు రోజులు మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు ఫోన్ చేసి కూడా విసిగిస్తున్నా. త్వరలోనే మేమిద్దరం కలసి ఓ సినిమా చేస్తాం (నవ్వు). ► ఈ సినిమాలోని ‘మైండ్ బ్లాక్..’ సాంగ్లో డ్యాన్స్ హైలైట్గా ఉంటుంది. నాకు డ్యాన్స్ అంతగా రాదేమో అని మా టీమ్ అనుకున్నారు. ప్రేక్షకులు ఎలా ఎంజాయ్ చేస్తారో అని ఎదురు చూస్తున్నాను. ► వచ్చే నెలలో ‘భీష్మ’ విడుదల అవుతుంది. సుకుమార్– అల్లు అర్జున్ కాంబినేషన్లో హీరోయిన్గా చేయబోతున్నాను. రెండు మూడు నెల్లలో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. మిగతావి చర్చల్లో ఉన్నాయి. -
సమస్యలను పరిష్కరించడమే గిల్డ్ టార్గెట్
మహేశ్బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో చిత్రాలు ఈ నెల 11, 12 తేదీల్లో విడుదల కానున్నాయి. అయితే ఈ చిత్రాల విడుదల తేదీలపై రెండు మూడురోజులుగా చిన్న అస్పష్టత ఏర్పడింది. విడుదల తేదీలు మారే అవకాశం ఉందనే వార్తలు వినిపించాయి. కానీ ‘ప్రొడ్యూసర్స్ గిల్డ్’ చొరవతో ఈ సినిమాలు ముందు ప్రకటించిన తేదీల్లోనే రిలీజ్ కానున్నాయి. ఈ విషయాన్ని తెలియజేయడానికి ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో నిర్మాత కె.ఎల్. దామోదర ప్రసాద్ మాట్లాడుతూ – ‘‘చర్చల అనంతరం సినిమా విడుదల తేదీలపై క్లారిటీ వచ్చింది. కారణాలు ఏమైనా కావచ్చు. సమస్యలకు పరిష్కారం దొరకడమే ముఖ్యం. ఈ రోజు జరిగిన మీటింగ్లో అందరూ పాజిటివ్గానే స్పందించారు’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘గతంలో జరిగిన ‘ప్రొడ్యూసర్స్ గిల్డ్’ మీటింగ్లో నిర్మాతలతో మాట్లాడి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని 11వ తేదీన, అల వైకుంఠపురములో చిత్రాన్ని 12న విడుదల చేయాలనుకున్నాం. అయితే కొన్ని పరిణామాల మధ్య ‘అల వైకుంఠపురములో’ జనవరి 10 లేదా 11న విడుదల అవుతుందని వార్తలు వచ్చాయి. దాంతో మరోసారి గిల్డ్లో చర్చలు జరిగాయి. పెద్ద సినిమాలు విడుదలవుతున్నప్పుడు అందరూ బావుండాలనే ఉద్దేశంతో ముందు అనుకున్న తేదీలకే సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలను ఒప్పించాం. ఇండస్ట్రీలో ఇలాంటి సమస్యలు వస్తే పరిష్కరించడానికి గిల్డ్ ముందుంటుంది. ఎందుకు కన్ఫ్యూజన్ వచ్చింది అనేది పక్కన పెడితే సమస్యను పరిష్కరించడమే గిల్డ్ టార్గెట్’’ అన్నారు. నిర్మాత రాజీవ్ రెడ్డి కూడా పాల్గొన్నారు. -
రెండేళ్ల ప్రయాణం ఇద్దరిలోకం ఒకటే
‘రెండేళ్ల ప్రయాణమే ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమా. కృష్ణ చెప్పిన ఐడియా నచ్చింది. ఇద్దరు ముగ్గురు హీరోలను అనుకున్నాం కానీ కుదర్లేదు. ఆ తర్వాత రాజ్ తరుణ్తో ప్రాజెక్ట్ ఓకే అయింది’’ అన్నారు ‘దిల్’ రాజు. జీఆర్.కృష్ణ దర్శకత్వంలో రాజ్తరుణ్, షాలినీ పాండే జంటగా నటించిన చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ–రిలీజ్ వేడుకలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘మిక్కి జె.మేయర్, సమీర్ రెడ్డి వంటి టాప్ టెక్నీషియ¯Œ ్స ఈ సినిమాకు పనిచేశారు. హీరోయిన్ విషయంలో ముగ్గురు, నలుగుర్ని అనుకున్నాం.. కానీ, శిరీష్ మాత్రం షాలినీ పేరును చెప్పి ఒప్పించాడు. రాజ్తరుణ్, షాలినీ పాండే మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత నాకు ఎక్కలేదు.. ఆ విషయాన్ని డైరెక్టర్కి చెప్పాను. మళ్లీ మార్పులు చేర్పులు చేసి సినిమాను చూపించాడు. ఫైనల్ సినిమా చూసి డైరెక్టర్కి షేక్ హ్యాండ్ ఇచ్చాను. ఫస్టాఫ్ టైమ్పాస్లా ఉంటుంది. సెకండాఫ్ గుడ్. ముఖ్యంగా క్లైమాక్స్ వెరీగుడ్ అనిపిస్తుంది. నిజాయతీగా చేసిన చిత్రమిది. ఈ ఏడాది ‘ఎఫ్2, మహర్షి’ తర్వాత ఈ సినిమాతో సక్సెస్ కొడితే హ్యాట్రిక్ వచ్చేసినట్టే’’ అన్నారు. ‘‘ఇదో అందమైన ప్రేమకథ. సినిమా అందరికీ నచ్చుతుంది. థియేటర్లోనే సినిమా చూడండి.. పైరసీని ప్రోత్సహించొద్దు’’ అన్నారు రాజ్ తరుణ్. ‘‘పుట్టుక నుండి చివరి వరకు ఇద్దరి వ్యక్తుల జర్నీ ఈ సినిమా’’ అన్నారు దర్శకుడు జీఆర్ కృష్ణ. ఈ కార్యక్రమంలో నిర్మాత బెక్కం వేణుగోపాల్, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
బ్లాక్బస్టర్ బహుమతి
హీరోగా విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక దర్శకునిగా శివ నిర్వాణ తెరకెక్కించిన రెండు చిత్రాలు ‘నిన్నుకోరి (2017), మజిలీ (2019)’ హిట్ సాధించాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు నిర్మించనున్నారు. బుధవారం (డిసెంబరు 18) నిర్మాత ‘దిల్’ రాజు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ‘‘రాజుగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. బ్లాక్బస్టర్ బహుమతి లోడ్ అవుతోంది’’ అని పేర్కొన్నారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ‘వరల్డ్ ఫేమస్ లవర్, హీరో, ఫైటర్’ సినిమాలతో విజయ్ బిజీ. అలాగే నాని హీరోగా నటిస్తున్న ‘టక్ జగదీష్’తో శివ నిర్వాణ కూడా బిజీ.. సో.. వీరిద్దరు వారి వారి సినిమాలను పూర్తి చేశాక ఈ సినిమా సెట్స్పైకి వెళ్తుందని ఊహించవచ్చు. -
హ్యాట్రిక్ హిట్తో 2020కి స్వాగతం చెబుతాం
‘‘2019లో ‘ఎఫ్2, మహర్షి’ వంటి బ్లాక్బస్టర్స్ సాధించాం. ఈ ఏడాది నాలుగైదు సినిమాలు ఉంటాయనుకున్నాం కానీ మూడు సినిమాలతోనే ముగిస్తున్నాం. మా మూడో చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’ని ఈ నెల 25న విడుదల చేస్తున్నాం’’ అన్నారు ‘దిల్’ రాజు. రాజ్ తరుణ్, షాలినీ పాండే జంటగా జీఆర్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఓ టర్కీ సినిమా చూసిన కృష్ణ ఈ ఐడియాను నాకు చెప్పాడు. మన నేటివిటీకి తగిన విధంగా కథను డెవలప్ చేశాం. ఫీల్ గుడ్ లవ్స్టోరీ. ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగే ప్రేమకథ. సినిమాల్లో ఒకప్పటితో పోలిస్తే చాలా మార్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం లిప్కిస్ల ట్రెండ్ నడుస్తోంది. మా సినిమాలో కూడా లిప్కిస్ ఉండటంతో సెన్సార్ వారు ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. మేం అనుకున్నట్లు జరిగితే హ్యాట్రిక్ హిట్తో ఈ ఏడాదిని ముగిస్తాం. 2020 మాకు మంచి వెల్కమ్ అవుతుంది’’ అన్నారు. ‘‘పుట్టిన దగ్గరి నుంచి ఒకటయ్యేవరకు హీరో, హీరోయిన్ మధ్య సాగే ప్రేమకథ ఇది. మంచి సినిమా చూశామనే ఫీలింగ్తో ప్రతి సన్నివేశాన్ని ఎంజాయ్ చేసి బయటకు వస్తారు ప్రేక్షకులు. ఈ సినిమాలో వైవిధ్యమైన రాజ్తరుణ్ కనపడతారు’’ అన్నారు జీఆర్ కృష్ణ. ‘‘నాకు కలిసొచ్చిన డేట్.. ‘ఉయ్యాల జంపాల’ విడుదలైన డిసెంబర్ 25న ఈ సినిమా విడుదలవుతోంది’’ అన్నారు రాజ్ తరుణ్. ‘‘పెద్ద సాంకేతిక నిపుణులు సపోర్ట్ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు నిర్మాత బెక్కం వేణుగోపాల్. -
ఈ ఉగాదికి హింసే!
‘‘ఈ క్షణం నుంచి నా శత్రువులకి నా దయా దాక్షిణ్యాలే దిక్కు’ అన్నాడు షేక్స్పియర్. అదే నేనూ అంటున్నాను. శత్రువులందరూ జాగ్రత్తగా ఉండండి’’ అంటున్నారు నాని. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుధీర్బాబు హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రం ‘వి’. నివేదా థామస్, అదితీ రావ్ హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఉగాది కానుకగా మార్చి 25న విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ‘‘వయొలెన్స్ (హింస) కావాలన్నారుగా. ఇస్తాను. ఉగాదికి సాలిడ్గా ఇస్తాను’’ అని ట్వీటర్లో పేర్కొన్నారు నాని. ఈ సినిమాలో సుధీర్బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో, నాని విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇది నాని 25వ చిత్రం కూడా కావడం విశేషం. ఈ సినిమాకు సంగీతం: అమిత్ త్రివేది. -
తెలుగు పింక్
ఇక పవన్ కల్యాణ్ సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టేశారా? అని చాలామంది అనుకుంటున్న తరుణంలో ఓ వార్త తెరమీదకు వచ్చింది. హిందీ హిట్ చిత్రం ‘పింక్’ తెలుగు రీమేక్లో ఆయన నటించబోతున్నారన్నది ఆ వార్త సారాంశం. గత ఏడాది ‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత పవన్ కల్యాణ్ మరో సినిమాలో నటించని సంగతి తెలిసిందే. ఇక హిందీ ‘పింక్’ని తమిళంలో అజిత్తో ‘నేర్కొండ పార్వై’గా రీమేక్ చేసిన బోనీకపూరే తెలుగు రీమేక్ను నిర్మించబోతున్నారు. ‘దిల్’ రాజు మరో నిర్మాత. ‘ఓ.. మై ఫ్రెండ్, ఎమ్సీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి)’ చిత్రాల ఫేమ్ వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకుడు. హిందీ హిట్ ‘బదాయి హో’ తెలుగు రీమేక్ నిర్మాణానికి తొలిసారి షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న బోనీ కపూర్, ‘దిల్’ రాజు తాజాగా ‘పింక్’ తెలుగు రీమేక్ను కూడా నిర్మించబోతుండటం విశేషం. ‘బదాయిహో’ తెలుగు రీమేక్లో ఎవరు నటించబోతున్నారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. మరి.. ‘పింక్’లో పవన్ నటిస్తారా? లేదా? -
ఆవిరి ఐడియా అలా వచ్చింది
‘‘హారర్ జానర్లో రకాలు ఉన్నాయి. ‘ఆవిరి’ హారర్ మూవీ కాదు. మంచి ఫ్యామిలీ బేస్డ్ థ్రిల్లర్. గతంలో నేను చేసిన ‘అవును, అనసూయ’ చిత్రాలు కూడా థ్రిల్లర్ మూవీసే. హారర్ కాదు. ప్రేక్షకులను భయపెడితే థ్రిల్ ఫీల్ అవుతారని నేను అనుకోను’’ అని దర్శక–నిర్మాత, రచయిత రవిబాబు అన్నారు. నేహా చౌహాన్, రవిబాబు, శ్రీముక్త, భరణీ శంకర్, ముక్తార్ ఖాన్ ప్రధాన తారాగణంగా రవిబాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఆవిరి’. నవంబరు 1న ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా రవిబాబు చెప్పిన విశేషాలు. ► నేను, ‘దిల్’ రాజుగారు ఎప్పట్నుంచో మంచి మిత్రులం. ఆయన నిర్మించిన ‘బొమ్మరిల్లు’ నాకు చాలా ఇష్టం. మేం ఇద్దరం ఎప్పట్నుంచో సినిమా చేయాలనుకుంటున్నాం. ‘ఆవిరి’ సినిమాతో కుదిరింది. ఈ సినిమా తీయడానికి ముందు ‘దిల్’ రాజుగారికి కథ చెప్పాను. సినిమా పూర్తయ్యాక చూపిస్తే, బాగుందన్నారు. నేను ఎవరితో సినిమా తీసినా ఫస్ట్ కాపీ పూర్తయ్యేవరకు బాధ్యత తీసుకుంటాను. ► ‘అదుగో’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు రెండున్నరేళ్లు పట్టింది. ఆ సమయంలో నెక్ట్స్ ఏ చిత్రం చేయాలి? అని ఆలోచిస్తున్నప్పుడు అప్పటి వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి ఇంట్లో ఓ స్పిరిట్ ఉందన్న వార్తలు చదివాను. ఈ ఐడియాకు కొన్ని కల్పిత అంశాలు జోడించి ‘ఆవిరి’ కథ రాసుకున్నాను. ‘అదుగో’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండటంతో కొన్ని సినిమాల్లో నటించలేకపోయా. ‘సాహో’ వదులుకున్నాను. మళ్లీ నటుడిగా బిజీ అవుతా. ► భారీ బడ్జెట్ సినిమాలు తీయడం కంటే కొత్త ఐడియాలతో ప్రేక్షకుల మెప్పు పొందడమే గొప్పగా భావిస్తాను. ఇప్పటివరకు నేను ప్రయత్నించిన జానర్లు ఎవరూ ప్రయత్నించి ఉండరు. ∙నా దగ్గర నాలుగైదు ఐడియాలు ఉన్నాయి. వాటిలో ఓ ముసలాయన పాత్ర ఆధారంగా ఓ కథ ఉంది. అక్కినేని నాగేశ్వరరావుగారు బతికి ఉండి ఉంటే ఆయన్ను ఈ క్యారెక్టర్ చేయమని రిక్వెస్ట్ చేసేవాడిని. -
నా జీవితంలో ఇదొక మార్పు
‘ఆది, దిల్, ఠాగూర్, అదుర్స్, నాయక్, ఖైదీ నంబర్ 150’ వంటి ఎన్నో హిట్ సినిమాలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన దర్శకుడు వీవీ వినాయక్ ‘సీనయ్య’ చిత్రంతో తొలిసారి హీరోగా మారారు. నరసింహ దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా వినాయక్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు కొరటాల శివ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకులు కె. రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘ఆది’ సినిమాతో వినయ్(వినాయక్)తో నా ప్రయాణం మొదలైంది. మా సంస్థను స్థాపించిన తర్వాత తొలి సినిమా వినాయక్ దర్శకత్వంలో ‘దిల్’ చేశాం. ఈ సినిమా పేరే మా ఇంటిపేరుగా మార్చేంత హిట్ సాధించింది. 1982–1984 నేపథ్యంలో సాగే కంప్లీట్ ఎమోషనల్ స్టోరీ ‘సీనయ్య’. ఈ సినిమాలో ఎవర్ని హీరోగా అడుగుదామా? అనుకుంటున్న తరుణంలో మా సంస్థలో సినిమాలు చేసిన దర్శకులు గుర్తుకువచ్చారు. ఈ కథకు వినయ్ అయితే సరిపోతాడనిపించి నరసింహతో చెప్పగానే ఎగై్జటింగ్గా ఫీలయ్యాడు. ఆ తర్వాత వినయ్కు కథ చెప్పడంతో నటిస్తా అన్నాడు. ఈ కథలో భాగమైన హరిని భవిష్యత్లో దర్శకుడిగా పరిచయం చేస్తా. వచ్చే ఏడాది వేసవిలో ‘సీనయ్య’ విడుదల చేస్తాం’’ అన్నారు. వినాయక్ మాట్లాడుతూ– ‘‘రాజుగారు ఓ రోజు వచ్చి...‘నువ్వు నన్ను ‘దిల్’ రాజుని చేశావ్. నేను నిన్ను హీరోని చేద్దాం అనుకుంటున్నా’ అన్నారు. నరసింహ చెప్పిన కథ నచ్చి, పాత్ర కోసం బరువు తగ్గాను. ఇప్పుడు ఎలాంటి దుస్తులైనా వేసుకోగలుగుతున్నా (నవ్వుతూ). జీవితంలో నాకు ఇదొక మార్పు’’ అన్నారు. ‘‘మంచి ఎమోషనల్ కథ ఇది’’ అన్నారు నరసింహ. దర్శకులు సుకుమార్, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, మెహర్ రమేష్, నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, సి.కల్యాణ్, డీవీవీ దానయ్య, అనిల్ సుంకర, బెల్లంకొండ సురేష్, బెక్కం వేణుగోపాల్, వల్లభనేని వంశీ, రచయిత హరి పాల్గొన్నారు. -
హార్ట్ టచింగ్ లవ్స్టోరీ
ఇండస్ట్రీలో అభిరుచి గల నిర్మాతగా పేరు సంపాదించుకున్నారు ‘దిల్’ రాజు. తాజాగా ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ అనే చిత్రాన్ని అక్టోబరు 8న తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారాయన. రాకేష్ వర్రె, గార్గేయి హీరో హీరోయిన్లుగా నటించారు. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్ బ్యానర్పై బసవ శంకర్ దర్శకత్వంలో రాకేష్ వర్రె నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ‘‘హార్ట్ టచింగ్ లవ్స్టోరీ చిత్రాలను ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తుంటారు. ఈ చిత్రం కూడా ఆ కోవలోకే వస్తుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ కూడా. మా సినిమాను విడుదల చేస్తున్న ‘దిల్’ రాజుగారికి స్పెషల్ థ్యాంక్స్. సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు రాకేష్. ఈ సినిమాకు శంకర్ శర్మ సంగీతం అందించారు. -
ఫుల్ జోష్
హీరోగా పదేళ్లు పూర్తి చేసుకున్నారు నాగచైతన్య. ఇటీవలే ‘మజిలీ’ సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్నారు. ప్రస్తుతం చేస్తున్న ‘వెంకీ మామ’ షూటింగ్ కూడా చివరి దశలో ఉంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ ప్రేమకథను ఈ మధ్యనే పట్టాలెక్కించారు నాగచైతన్య. ఇప్పుడు ‘దిల్ రాజు’ బ్యానర్లో నూతన దర్శకుడు శశి సినిమాలో యాక్ట్ చేయడానికి అంగీకరించారు. ఈ సినిమాకు ‘అదే నువ్వు అదే నేను’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫిక్స్ కాలేదు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇది కాకుండా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సీక్వెల్ ‘బంగార్రాజు’లో తండ్రి నాగార్జునతో కలసి నటించనున్నారు నాగచైతన్య. -
సినిమా సౌధానికి మేనేజర్లు పునాదిరాళ్లు
‘‘ఎగ్జిక్యూటివ్ మేనేజర్లు ఎంత కష్టపడతారు, ఎంత శ్రమిస్తారు అనేది నేను చూశా. సినిమా ఆఫీస్ ప్రారంభం నుంచి ఆ చిత్రం విడుదలయ్యే వరకు శ్రమించేది మేనేజర్లు. సినిమా అనేది అద్భుతమైన సౌధం అనుకుంటే మేనేజర్లు పునాదిరాళ్లు’’ అని హీరో చిరంజీవి అన్నారు. తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ ఆధ్వర్యంలో ‘తెలుగు సినీ రథసారధుల రజతోత్సవం’ హైదరాబాద్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ–‘‘షూటింగ్ జరుగుతున్న సమయంలో తక్కువ నిద్రపోయేది మేనేజర్లే. కాబట్టి సినిమా సక్సెస్లో వారి వంతు చాలా ఉంటుంది. ‘సైరా’ సినిమా షూటింగ్ లొకేషన్ కోసం మా మేనేజర్ లొకేషన్ వారి కాళ్లమీద పడి అనుమతి తీసుకున్నారు. ఇందుకు మేనేజర్స్కి మా హృదయపూర్వక నమస్కారాలు. మేనేజర్స్ సిల్వర్ జూబ్లీ రజతోత్సవం ఇంత వైభవంగా జరగడం ఆనందంగా ఉంది’’ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ–‘‘సినిమా ఇండస్ట్రీలోని అతిరథ మహారథులు ఈ ఫంక్షన్కు రావడం హర్షించదగ్గ విషయం. ఈ వేడుకను ఇంత గ్రాండ్గా చేసిన మేనేజర్స్ యూనియన్కు అభినందనలు. భవిష్యత్తులో కూడా నేను చిత్ర పరిశ్రమకు సహాయపడతాను’’ అన్నారు. నటుడు కృష్ణంరాజు మాట్లాడుతూ– ‘‘ప్రొడక్షన్ మేనేజర్స్ ఇంత మంచి ఫంక్షన్ చేస్తారని ఊహించలేదు. వారు తలుచుకుంటే సినిమాని టైమ్లో పూర్తి చేయగలరు. తెలుగు చిత్ర పరిశ్రమలో గత 50 ఏళ్ల నుండి ఎంతో మంచి మేనేజర్స్ను చూశాను. వారు భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలి’’ అన్నారు. నటుడు గిరిబాబు మాట్లాడుతూ– ‘‘ప్రొడక్షన్ మేనేజర్ల సేవలు చాలా అమూల్యమైనవి. సినిమాకి కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి గుమ్మడికాయ కొట్టేవరకు వారు సినిమాకు చాలా సహాయంగా ఉంటారు. వారు పదికాలాల పాటు చల్లగా ఉండాలి’’ అన్నారు. దర్శకుడు రాఘవేంద్ర రావు మాట్లాడుతూ– ‘‘ఈ మధ్య కాలంలో ఇంత గొప్ప ఫంక్షన్ చూడలేదు. మేనేజర్లు చేస్తున్న ఈ ఫంక్షన్ పెద్ద సక్సెస్ దిశగా ముందుకు వెళుతుంది. నేను ఇన్ని గొప్ప సినిమాలు చేయడానికి సహకరించిన మేనేజర్స్కు కృతజ్ఞతలు’’ అన్నారు. హీరో మహేశ్బాబు మాట్లాడుతూ– ‘‘ఈ ఫంక్షన్లో చిరంజీవిగారిని కలవడం కొత్త ఎనర్జీని ఇచ్చింది. మేనేజర్స్ చేస్తున్న ఈ వేడుకకు రావడం సంతోషంగా భావిస్తున్నా. భవిష్యత్తులో వారు మరిన్ని సక్సెస్ ఫుల్ ఈవెంట్స్ చేయాలి’’ అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘మేనేజర్లు చేసిన ఈ అద్భుతమైన కార్యక్రమానికి హాజరవడం సంతోషం. నేను 32 సినిమాలు తీశాను కాబట్టి రూ.32 లక్షలు మేనేజర్స్ యూనియన్కు ఇస్తున్నా. నేను నిర్మించిన మంచి చిత్రాల్లో మేనేజర్స్ సహాయ సహకారాలు ఉన్నాయి’’ అన్నారు. కాగా మేనేజర్స్ యూనియన్కు నటీనటులు జీవిత, రాజశేఖర్ రూ.10లక్షలు విరాళం ప్రకటించారు. ఈ వేడుకలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, చినజీయర్ స్వామి, కోటా శ్రీనివాసరావు, జయప్రద, సుమలత, జయసుధ, రోజా రమణి, అల్లు అరవింద్, సురేశ్ బాబు, నీహారిక, నాగబాబు, రామ్–లక్ష్మణ్, సందీప్ కిషన్, రాశీఖన్నా, రెజీనా, ప్రగ్యాజైస్వాల్, పూజాహెగ్డే, ఎమ్.ఎల్.కుమార్ చౌదరి, శ్రీకాంత్, అశ్వినీదత్, బోయపాటి శ్రీను, టి.సుబ్బిరామిరెడ్డి, సాయి ధరమ్ తేజ్, మారుతి, తనీష్, శివ బాలాజీతో పాటు ‘తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్’ గౌరవ అధ్యక్షుడు ఎమ్.సీతారామరాజు, అధ్యక్షుడు అమ్మిరాజు కాసుమిల్లి, ప్రధాన కార్యదర్శి: ఆర్.వెంకటేశ్వర రావు, కోశాధికారి: కె.సతీష్, ఉపాధ్యక్షులు డి.యోగనంద్, కుంపట్ల రాంబాబు, జాయింట్ సెక్రటరీలు సురపనేని కిషోర్, జి.నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. రోజారమణి, సుమలత, టి. సుబ్బరామిరెడ్డి, జయప్రద, చిరంజీవి, తలసాని శ్రీనివాస్ యాదవ్, రఘురామకృష్టం రాజు, అమ్మిరాజు, రాజశేఖర్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వారికి శేష్ ఒక ఉదాహరణ
‘‘ఇండస్ట్రీలో మాకు బ్యాక్గ్రౌండ్ లేదు. మమ్మల్ని ఎవరు చూసుకుంటారు’ అని చాలామంది అంటుంటారు. వారందరికీ అడివి శేష్ ఒక ఉదాహరణ. ప్రతిభ ఉండి కష్టపడితే మంచి ఫలితం ఉంటుంది’’ అన్నారు నిర్మాత ‘దిల్’రాజు. అడివి శేష్, రెజీనా, నవీన్చంద్ర ముఖ్య తారాగణంగా వెంకట్ రామ్జీ దర్శకత్వంలో పీవీపీ పతాకంపై పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నే నిర్మించిన చిత్రం ‘ఎవరు’. ఈ సినిమా ఈ నెల 15న విడుదలైంది. మంచి టాక్తో ప్రదర్శించబడుతోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘ఒక స్టోరీ ఎలా ఉంది? ఏంటి? అంటే నేను చెప్పగలను కానీ ఇలాంటి ట్విస్ట్లతో కూడుకున్న సినిమాను నేను సరిగ్గా జడ్జ్ చేయలేను. ‘ఎవరు’ సినిమా చూశాను. పాటలు, ఫైట్స్ లేవు. వరుస ట్విస్ట్లతో ఆడియన్స్ను థియేటర్లో కూర్చోబెట్టారు. ఇటీవల ఇలాంటి సినిమా తెలుగులో రాలేదు. ఈ సినిమాను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసినందుకు హ్యాపీ. అడివి శేష్ని క్యారెక్టర్ ఆర్టిస్టు అనాలా? లేక హీరో అనాలా?.. డైరెక్టర్ రామ్జీ యాక్టర్ అనమంటున్నారు. ‘క్షణం’, ‘గూఢచారి’ ఇప్పుడు ‘ఎవరు’ వంటి సినిమాలతో శేష్ యాక్టర్గా ఎదుగుతున్నాడు. మా బ్యానర్లో సినిమా చేయమని అడిగాను. రెజీనా, నవీన్చంద్ర బాగా నటించారు. ‘నేను లోకల్’ సినిమా సమయంలో నవీన్చంద్రకు హీరోగానే కాకుండా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ట్రై చేయమని చెప్పాను. అతను బాగా చేస్తున్నారు. చాలామంది హీరోలకు ఇలా చెబితే ..‘రాజుగారి ఏంటీ ఇలా చెబుతారు.. హీరోగా చేయమని ఎంకరేజ్ చేయాలి కదా’ అనుకుంటారు. ఏళ్ల తరబడి హీరోలుగా చేసిన వారు కూడా ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయాల్సిందే. క్యారెక్టర్ ఆర్టిస్టు ఎప్పుడూ ఉంటాడు. నా మిత్రుడు పీవీపీ బ్యానర్లో మరో మంచి సినిమా వచ్చినందుకు సంతోషంగా ఉంది’’ అని అన్నారు. ‘‘సినిమా విజయం సాధించడంతో మంచి హ్యాపీ మూడ్లో ఉన్నాను. చాలాకాలం తర్వాత హాయిగా ఎనిమిది గంటలు నిద్రపోయాను. ‘దిల్’ రాజుగారి ‘ఎవడు’ సినిమాలో మెయిన్ విలన్గా చేయడానికి అప్పట్లో ప్రయత్నించాను. కుదర్లేదు. బహుశా.. నేను అప్పటికీ ఆ స్థాయిలో లేనేమో. ఇప్పుడు ‘దిల్’ రాజుగారు ‘ఎవరు’ సినిమా చూసి అభినందించడం మరిచిపోలేను. సినిమా చూసి మా బ్యానర్లో ఎప్పుడు సినిమా చేస్తున్నావ్? అన్నారు. హ్యాపీ ఫీలయ్యాను. కలెక్షన్స్ గురించి మాట్లాడను. కానీ ‘గూఢచారి’ కంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయని చెప్పగలను’’ అన్నారు అడివి శేష్.‘‘‘అరవిందసమేత..’లో చేసిన బాల్ రెడ్డి పాత్రలానే ‘ఎవరు’లో నేను చేసిన అశోక్ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. హీరోగానే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ ట్రై చేయమన్న ‘దిల్’ రాజుగారి సలహాను పాటిస్తూనే ఉంటాను’’ అన్నారు నవీన్చంద్ర. ‘‘ఇది సమిష్టి విజయం’’ అన్నారు వెంకట్ రామ్జీ. ‘‘సక్సెస్ను అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్ అన్నారు మురళీ శర్మ. ‘‘ఈ సినిమాకు, నేను చేసిన సమీర పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సింగిల్ స్క్రీన్కి వెళ్లి చూశాం. ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలోని ట్విస్ట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి చూడబోయేవారి ఆసక్తిని తగ్గించవద్దు. వారు కూడా సినిమాను థియేటర్లో ఎంజాయ్ చేయాలి’’ అన్నారు రెజీనా. -
కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టాం
‘‘ఇండస్ట్రీలో రెండు దశాబ్దాల పాటు మాకు అద్భుతమైన ప్రయాణం దొరికినందుకు ఆనందంగా ఉంది. ఇండస్ట్రీ నుంచి మేము తీసుకున్న దానికి, మాకు లభించిన అనుభవాన్ని పంచాలనుకుంటున్నాం. ఇందుకోసం కొంతమంది నిర్మాతలతో మా వెంకటేశ్వర క్రియేషన్స్ (ఎస్వీసీ) అసోసియేట్ అవుతోంది. స్క్రిప్ట్ నుంచి రిలీజ్ డేట్ వరకు ఆయా చిత్రనిర్మాతలకు మా సంస్థ నుంచి మద్దతు ఇస్తాం. మా సంస్థ ద్వారా ఎంతోమంది నిర్మాతలకు, రాబోయే నిర్మాతలకు ఉపయోగపడాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇందుకోసం కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతున్నాం’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. పంపిణీరంగం నుంచి నిర్మాతగా మారి, ఎన్నో విజయాలు చూస్తున్నారు ‘దిల్’ రాజు. ఎస్వీసీ సంస్థ 20ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘1999లో ‘ఒకే ఒక్కడు’ సినిమాతో మా వెంకటేశ్వర ఫిల్మ్స్ మొదలైంది. ఈ సినిమాకు ముందు (1998 జూలై 24) ఇదే జూలై 24న ‘తొలిప్రేమ’ చిత్రం నైజాం డిస్ట్రిబ్యూషన్లో భాగస్వామ్యులుగా ఉన్నాం. పవన్కల్యాణ్గారిని స్టార్ని చేసిన సినిమా అది. ‘పెళ్లి పందిరి’ సినిమా సక్సెస్ మమ్మల్ని ఇక్కడివరకూ తీసుకువచ్చింది. ఈ రెండు సినిమాల నిర్మాతలకు థ్యాంక్స్. అలాగే మా డిస్ట్రిబ్యూషన్లో ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలను అందించిన నిర్మాతలందరికీ ఈ రోజు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఈ పదహారేళ్లలో 32 సినిమాలు తీశాం. 2017లో ఆరు, గత ఏడాది మూడు సినిమాలు మా సంస్థ నుంచి వచ్చాయి. ఈ ఏడాది నాలుగు సినిమాల రిలీజ్లు ప్లాన్ చేస్తున్నాం. ఒక సినిమా సక్సెస్ కావాలంటే స్క్రిప్ట్ దగ్గర నుంచి రిలీజ్ వరకు కావాల్సినవి ఎన్నో ఉంటాయి. శివలెంక కృష్ణప్రసాద్గారు, విజయ్, సత్యనారాయణరెడ్డి, కృష్ణ, గోపీ, రాహుల్, హరి, సాగర్, రాహుల్ యాదవ్ నక్కా, విజయ్ చిల్లా, మహేశ్ కోనేరు, రాజీవ్.. ఇలా ఈ నిర్మాతలందరితో మాకు ఒక మంచి అనుబంధం ఉంది. ఈ అనుబంధాన్ని తర్వాత స్థాయికి తీసుకువెళ్లాలనే ఆలోచనతో మా సంస్థతో అసోసియేషన్ గురించి ఆలోచించాం. వారితో ట్రావెల్ అవుతూ మా సంస్థ నుంచి వస్తున్న మంచి సినిమాల మాదిరిగానే వారు కూడా మంచి సినిమాలు తీయడానికి మా వంతు కృషి చేస్తాం. వీరేకాదు, మంచి సినిమాలు చేయాలని మంచి స్క్రిప్ట్ను తీసుకువస్తే మా ఎస్వీసీని వాడుకుని తెలుగు ఇండస్ట్రీకి మంచి సినిమాలు ఇవ్వాలనే ఆలోచనతో ఈ కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నాం.అలాగే డబ్బు సంపాదిస్తూ ప్రేక్షకులకు మంచి సినిమాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. హారిక హాసిని, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు కూడా ఈ సందర్భంగా «థ్యాంక్స్’’ అని అన్నారు. ‘‘రాజుగారితో నాకు 18ఏళ్ల పరిచయం ఉంది. సినిమాలపై పిచ్చితో ఇండస్ట్రీవైపు వచ్చారు రాజు, శిరీష్, లక్ష్మణ్. ‘ఎస్వీసీ’ సక్సెస్ఫుల్ జర్నీలో నా వంతుగా నాలుగు సినిమాలు ఉండటం హ్యాపీగా ఉంది. ఎస్వీసీని నా మాతృసంస్థగా భావిస్తాను. రైటర్గా నాకు జన్మనిచ్చారు. ఈ సంస్థ సపోర్ట్తో నాలాంటి దర్శకులు చాలామంది స్థిరపడే అవకాశం ఉంది’’ అన్నారు దర్శకుడు వంశీపైడిపల్లి. ‘‘ఎస్వీసీ’ జర్నీలో నాది 2015–2019 టైమ్. ‘దిల్’ రాజుగారి జడ్జిమెంట్, లక్ష్మణ్ ప్లానింగ్, శిరీష్ ఎగ్జిక్యూషనే ఈ సంస్థ సక్సెస్కు కారణమనిపిస్తోంది. ఎస్వీసీ అంటే సక్సెస్ వీళ్ల కేరాఫ్ అడ్రస్’’ అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ‘‘ఇండస్ట్రీలో అన్నింటినీ అన్ని రకాలుగా చూసినవాడే నిర్మాత. ఈ ముగ్గురూ ఇంత దూరం వచ్చారు. వీరితో అసోసియేట్ అవ్వడం హ్యాపీ’’ అన్నారు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్. ‘‘ఇలాంటి పెద్దబ్యానర్లో అసోసియేట్ అయితే చిన్న సినిమాలు మరింత ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అవుతాయి’’ అన్నారు నిర్మాత రాహుల్ యాదవ్. ‘‘నిర్మాత అంటే ప్రతిరోజూ యుద్ధమే. 20ఏళ్లలో దాదాపు 95 శాతం విజయాలతో ఈ సంస్థ టాప్ ప్రొడక్షన్ హౌస్గా నిలబడింది’’ అన్నారు నిర్మాత మహేశ్ కోనేరు. ‘‘ఆర్య’ సినిమా సమయంలో నేను, బన్నీవాసు, యూవీ క్రియేషన్స్ ఈ బ్యానర్తో అసోసియేట్ అయ్యాం. ఈ రోజు మేమంతా నిర్మాతలుగా మారాం’’ అన్నారు విజయ్ చిల్లా. ‘‘సినిమా చూపిస్తా మామా’ చిత్రం నుంచి ఈ సంస్థతో అసోసియేట్ అయ్యాను’’ అన్నారు బెక్కం వేణుగోపాల్. లక్ష్మణ్, శిరీష్, సాగర్, కృష్ణ, గోపీ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్ఎక్స్100లా పెద్ద హిట్ కావాలి
‘‘కమల్ హాసన్గారి ‘గుణ’, బాలకృష్ణగారి ‘ఆదిత్య 369’ సినిమాల టైటిల్స్లో సగం సగం కలిపి చక్కగా కథకు తగ్గట్టు ‘గుణ 369’ టైటిల్ కుదిరింది’’ అని ‘దిల్’ రాజు అన్నారు. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ, అనఘ జంటగా నటించిన చిత్రం ‘గుణ 369’. అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో అనిల్ కడియాల, తిరుమల రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలోని తొలిపాట ‘తొలి పరిచయమా.. తొలి పరవశమా ఇది’ ను నిర్మాత ‘దిల్’ రాజు రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ – ‘‘తొలి పరిచయమా...’ ఫీల్ గుడ్ సాంగ్లా ఉంది. ఈ సినిమా ‘ఆర్ఎక్స్ 100’లా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ఇదేదో వండి వార్చిన కథ కాదు. నిజంగా జరిగిన కథ. రియలిస్టిక్గా ఉంటుంది. ఇంతకు ముందు సిల్వర్స్క్రీన్ మీద ఇలాంటి కథ రాలేదు’’ అన్నారు అర్జున్ జంధ్యాల. ‘‘గోల్డెన్ హ్యాండ్ ‘దిల్’ రాజుగారితో బోణీ కొట్టినందుకు మా ఆల్బమ్కు తిరుగుండదని నమ్మకంగా ఉన్నాం. భరద్వాజ్ కంపోజిషన్, విశ్వనాథ్ సాహిత్యం, హరిహరన్గారి గాత్రం సంగీత ప్రియులను ఆకట్టుకునేలా ఉన్నాయి’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: సత్య కిశోర్, శివ మల్లాల. -
హార్ట్ టచింగ్ లవ్స్టోరీ
రాకేశ్ వర్రె హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘ఎవరికీ చెప్పొద్దు’. బసవ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎల్లా ప్రగడ గార్గేయి కథానాయిక. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు విడుదల చేయనున్నారు. రాకేశ్ మాట్లాడుతూ– ‘‘హార్ట్ టచింగ్ లవ్స్టోరీస్ను తెలుగు ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తుంటారు. అలాంటి రొమాంటిక్ కామెడీ స్టోరీతో ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. అభిరుచి ఉన్న నిర్మాత ‘దిల్’ రాజుగారు మా సినిమాను విడుదల చేయడానికి ముందుకు వచ్చినందుకు థ్యాంక్స్’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: శంకర్శర్మ, లైన్ ప్రొడ్యూసర్: కేతన్ కుమార్. -
ఆగస్టులో ఆరంభం
‘ఆది, దిల్, ఠాగూర్, అదుర్స్, నాయక్, ఖైదీ నంబర్ 150’ ఇలా ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు వీవీ వినాయక్ ఇక నటుడిగా లొకేషన్లోకి అడుగుపెట్టనున్నారు. అవును.. వీవీ వినాయక్ లీడ్ రోల్లో ఓ సినిమా తెరకెక్కనుంది. ‘దిల్’ రాజు నిర్మిస్తారు. నరసింహ రావు దర్శకుడు. ఈ సినిమా పూజా కార్యక్రమం త్వరలోనే జరుగుతుందని తెలిసింది. అలాగే రెగ్యులర్ షూటింగ్ను ఆగస్టు రెండోవారంలో టీమ్ ప్లాన్ చేసిందని సమాచారం. సెట్లో నటీనటులతో ఎలా చేయాలో చెప్పి, చేయించుకున్న వినాయక్కి నటన పెద్ద కష్టం కాదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. -
డబ్బూ పేరు తెచ్చిన చిత్రం మహర్షి
‘‘మహేశ్ కెరీర్లో అత్యధిక షేర్ సాధించిన సినిమాగా ‘మహర్షి’ నిలిచింది. నైజాంలో ఇంకో రెండు, మూడు రోజుల్లో 30 కోట్ల షేర్ను టచ్ చేయబోతున్నాం. ఈ సంవత్సరం సంక్రాంతికి ‘ఎఫ్2’తో పెద్ద హిట్ సాధించాం. సమ్మర్లో ‘మహర్షి’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాం. ఈ రెండు సక్సెస్లు ఇచ్చిన కిక్తో ఇంకో మూడు సినిమాలతో రాబోతున్నాం’’ అని ‘దిల్’ రాజు అన్నారు. మహేశ్బాబు, పూజా హెగ్డే జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మహర్షి’. వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా పతాకాలపై రూపొందిన ‘మహర్షి’ సూపర్ హిట్గా నిలిచి 100 కోట్ల షేర్ క్రాస్ చేసింది. ఈ సందర్భంగా చిత్రనిర్మాతల్లో ఒకరైన ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘నేను ఫస్ట్ టైమ్ ఇంకో రెండు పెద్ద ప్రొడక్షన్ హౌస్లతో కలిసి పని చేయడానికి కారణం వంశీ కథ చెప్పినప్పుడు వచ్చిన ఎగై్జట్మెంట్. అదే నమ్మకంతో ఈ సినిమా బాధ్యత తీసుకున్నాను. ఒక సినిమా విషయంలో బాధ్యత తీసుకున్నప్పుడు ఆ సినిమా హిట్ అయితే వచ్చే కిక్కే వేరు. కొన్ని సినిమాలు డబ్బుతో పాటు మంచి పేరుని కూడా తెస్తాయి. అలాంటి చిత్రం ’మహర్షి’. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా రైతులను కలిసినప్పుడు ‘ఈ సినిమా తర్వాత రైతుల గురించి, వ్యవసాయం గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేలా చేశారు’ అని చెప్పినప్పుడు వచ్చిన సంతృప్తి ఎంత డబ్బు వచ్చినా రాదు. త్వరలోనే వంశీతో మరో సూపర్ హిట్కి రెడీ అవుతున్నాం’’ అన్నారు. వంశీ పైడిపల్లి మాట్లాడుతూ– ‘‘వై.ఎస్. జగన్గారు, నేను స్కూల్మేట్స్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాం. స్కూల్లో రెడ్ హౌజ్ కెప్టెన్గా వ్యవహరించేవారు. అప్పుడే ఆయనలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఏపీ సీఎంగా జగన్గారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ‘మహర్షి’ టీమ్ తరపున శుభాకాంక్షలు. నేనెప్పుడూ చూడనంత పెద్ద బ్లాక్ బస్టర్తో పాటు మహేశ్బాబు కెరీర్లోనే ల్యాండ్ మార్క్ మూవీగా ‘మహర్షి’ నిలిచింది. మేం ఎక్కడికెళ్లినా మాకు ఒక గుర్తింపునిచ్చారు అని చెమర్చిన కళ్లతో రైతులు అంటున్నారు’’ అన్నారు. -
నవ ప్రపంచం కోసం
‘‘గాడ్ ఆఫ్ గాడ్స్’ చిత్రం ట్రైలర్ నా చేతుల మీదగా విడుదల కావడం నా అదృష్టం. మన దేశంలో ఉన్న మతాలు, వేరే ఏ దేశంలోనూ లేవు. బ్రహ్మకుమారీస్ వాళ్లు ఇక ముందు ఇలాంటి సినిమాలు తీయదలచుకుంటే నేను వాళ్ల వెంట ఉంటాను’’ అన్నారు ‘దిల్’ రాజు. వెంకట్ గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గాడ్ ఆఫ్ గాడ్స్’. డివిజన్ ఆఫ్ బ్రహ్మకుమారీస్ సమర్పణలో జగన్మోహన్ గర్ల్, ఐఎంఎస్ రెడ్డి నిర్మిస్తున్నారు. తేజశ్వీ మనోజ్ఞ, త్రియిగమంత్రి, రాజసింహ వర్మ ముఖ్య పాత్రల్లో నటించారు. శాంతి, ప్రేమ, విలువలతో కూడిన నవ ప్రపంచ పునరుద్ధరణ కథాంశంతో తెరకెక్కింది. ఈ చిత్రం ఆడియోను ‘దిల్’ రాజు రిలీజ్ చేసి మాట్లాడుతూ – ‘‘నా వల్ల ఎవరికీ చెడు జరగకూడదన్నది నా కాన్సెప్ట్’’ అన్నారు. ‘‘బ్రహ్మకుమారీస్ చేసే సర్వీస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే’’ అన్నారు లయన్ సాయి వెంకట్. ‘‘ఎన్ని దేశాల్లో మా భక్తులు ఉన్నారన్నది ఈ చిత్రం ద్వారా తెలిసింది’’ అన్నారు కుల్దీప్ దీదీ. తేజశ్వీ మనోజ్ఞ, వెంకట్ గోపాల్, ఐఎంఎస్ రెడ్డి మాట్లాడారు. -
‘120 స్థానాల్లో గెలుపు ఖాయం’
సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి శ్రీవారిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మాజీమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ స్వామి వారిని ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావాలని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 120 స్థానాల్లో తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ప్రజల మద్దతు ఆయనకే ఉందని, జాతీయ స్థాయిలో సర్వేలన్ని వైఎస్సార్సీపీకే అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. అమరావతి కోటపై వైఎస్సార్సీపీ జెండా వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృద్వీరాజ్ మొదటిసారిగా అలిపిరి నుంచి కాలినడక మార్గంలో వెళ్లారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావడానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా శ్రీవారికి తలనీలాలు సమర్పిస్తానని ఆయన తెలిపారు. ఏపీ ప్రజల ఆకాంక్ష మేరకు వైఎస్ జగన్ సీఎం కావాలన్నారు. మే 23న అమరావతి కోటపై వైఎస్సార్సీపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. మహర్షి సినిమా దర్శక, నిర్మాతలు పైడిపల్లి వంశీ, దిల్రాజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి విజయంతో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. -
ఫ్యాన్సే కాదు.. నేనూ కాలర్ ఎగరేస్తున్నా
‘‘నా కెరీర్లో ‘మహర్షి’ స్పెషల్ ఫిల్మ్. నా బిగ్గెస్ట్ హిట్స్ని వారంలో దాటేయబోతున్నాం. దీనికి మించిన ఆనందం నాకు లేదు. సినిమాను సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు, మా నాన్నగారి(కృష్ణ) అభిమానులకు, నా అభిమానులకు హ్యాట్సాఫ్’’ అని హీరో మహేశ్బాబు అన్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్బాబు హీరోగా, పూజాహెగ్డే హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘మహర్షి’. సి. అశ్వనీదత్, పీవీపీ, ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడులైంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన సక్సెస్మీట్లో మహేశ్బాబు మాట్లాడుతూ – ‘‘ఈ రోజు మదర్స్ డే (ఆదివారం). నాకు అమ్మంటే దేవుడితో సమానం. ఎప్పుడూ సినిమా రిలీజ్కు ముందు అమ్మ ఇంటికి వెళ్లి కాఫీ తాగుతాను. ఆ కాఫీ తాగితే దేవుడి గుడిలో ప్రసాదం తిన్నట్లు ఉంటుంది. అమ్మ ఆశీస్సులు నాకు చాలా ముఖ్యం. అందువల్లే ‘మహర్షి’ సినిమా ఇంత సక్సెస్ అయ్యింది. అందుకే అమ్మలకు ఈ సినిమా సక్సెస్ను అంకితం ఇస్తున్నాం. ‘మహర్షి’ సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో వంశీ మాట్లాడుతూ నాన్నగారి అభిమానులు, నా అభిమానులు కాలర్ ఎత్తుకుని తిరుగుతారని అన్నాడు. వాళ్లు (అభిమానులు) కాలర్ ఎత్తారు వంశీ... ఇవాళ నేను కూడా కాలర్ ఎత్తాను. దత్గారు నన్ను ఎప్పుడూ ప్రిన్స్ బాబు అని పిలుస్తుంటారు. విపరీతంగా నచ్చినప్పుడు మాత్రం మహేశ్ అని పిలుస్తారు. ఆ పేరు కోసం ఎప్పుడూ వేచి చూస్తుంటాను. ఇలాంటి సినిమా మాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ మహేశ్ అని దత్గారు అనడంతో చాలా సంతోషంగా అనిపించింది’’ అన్నారు. అశ్వనీదత్ మాట్లాడుతూ– ‘‘కృష్ణగారు హిట్సాధించిన ఎక్కువ సినిమాలు రైతు నేపథ్యంలో తెరకెక్కినవే. ఇప్పుడు మహేశ్ 25వ సినిమా రైతుల నేపథ్యంలో తెరకెక్కడం సంతోషంగా ఉంది. ఈ సినిమా సంచలన విజయానికి కారణం మహేశ్బాబు, వంశీలే. మే 9న వైజయంతీ బ్యానర్లో విడుదలైన మూడు సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి గౌరవం తీసుకువచ్చినందుకు గర్వంగా ఉంది. ‘దిల్’ రాజును చూస్తే డి.రామానాయుడుగారు గుర్తుకువస్తారు’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా కొనసాగుతున్నానంటే సీనియర్ ప్రొడ్యూర్స్ నుంచి నేను పొందిన ప్రేరణే కారణం. ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుకలో నేను మాట్లాడిన మాటలు నిజమైనందుకు సంతోషంగా ఉంది. ఫస్ట్ వీక్లోనే మహేశ్గారి కెరీర్లోని రికార్డులను క్రాస్ చేయబోతున్నాం. ఈ సినిమా విజయం ఎంత పెద్దదో ఇప్పుడే చెప్పలేం’’ అన్నారు. వంశీ పైడిపల్లి మాట్లాడుతూ– ‘‘దర్శకుడిగా ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం మా అమ్మగారే. ‘మహర్షి’ సక్సెస్ క్రెడిట్లో 80శాతానికిపైగా మహేశ్గారికే చెందుతుంది. అశ్వనీదత్గారు, పీవీపీగారు బాగా సపోర్ట్ చేశారు. డైరెక్టర్గా నాకు జన్మనిచ్చిన ‘దిల్’ రాజుగారికి థ్యాంక్స్. ఇది మైండ్లకు చెప్పే సినిమా కాదు. మనసులకు చెప్పే సినిమా అని చెప్పాను. మనసుతో సినిమా చూసి ఇంత ఆనందాన్ని మాకు ఇస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్స్’’ అన్నారు. ‘‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ– ‘‘మహేశ్గారు పర్ఫెక్షన్కి నిదర్శనం. నేను సీరియస్ క్యారెక్టర్స్ను చేయగలనని నమ్మిన వంశీ, మహేశ్లకు థ్యాంక్స్. ఇవాళ మా నాన్న(దర్శక–నిర్మాత ఈవీవీ సత్యనారాయణ) ఉండి ఉంటే చాలా సంతోషంగా ఫీలయ్యేవారు. ఒక డైరెక్టర్గా ఆయన గర్వపడేవారు. ఎందుకంటే ఆయన డైరెక్టర్ కంటే ముందు రైతు. ఆ రైతుగా ఇంకా గర్వపడేవారు. హిట్ అన్న పదం విని నాలుగేళ్లు అయ్యింది. ‘మహర్షి’ సక్సెస్తో నాకు అనిపించింది... సక్సెస్కు కామాలే ఉంటాయి... ఫుల్స్టాప్లు ఉండవు’’ అన్నారు. ‘‘మహేశ్ కెరీర్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబడుతోంది ఈ చిత్రం. కథకు తగ్గట్టు సినిమాను తీస్తాడు వంశీ. పెద్ద సినిమాను ఎంత ప్రేమించి తీస్తారో, చిన్న సినిమానూ అంతే ప్రేమించి తీస్తారు ‘దిల్’ రాజు. అశ్వనీదత్ వంటి సీనియర్ ప్రొడ్యూసర్లు ఇండస్ట్రీకి అవసరం’’ అని పోసాని కృష్ణమురళి అన్నారు. ‘‘రైతుల గురించి చర్చించిన ఈ సినిమాలో నా భాగస్వామ్యం ఉండటం హ్యాపీ’’ అన్నారు పృధ్వీ. ‘‘నేను కర్నూలులో స్టేజ్ ఆర్టిస్టుని. షార్ట్స్ఫిల్మ్స్లో నటిస్తున్న నన్ను చూసి దర్శకుడు వంశీ నాకు మహేశ్బాబుతో కలిసి నటించే అవకాశం ఇచ్చారు’’ అని రైతు పాత్ర చేసిన గురుస్వామి అన్నారు. నటులు శ్రీనివాసరెడ్డి, కమల్ కామరాజు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, గీత రచయిత శ్రీ మణి, వీఎఫ్ఎక్స్ నిపుణుడు యుగంధర్ మాట్లాడారు. -
మహేశ్ కెరీర్లో మహర్షి ల్యాండ్ మార్క్
‘‘మహర్షి’ సినిమా కమర్షియల్గా నాన్ ‘బాహుబలి’ రికార్డులతో తెలుగు ఇండస్ట్రీలో టాప్ గ్రాసర్గా నిలుస్తుందని అనుకుంటున్నా. ఈ సమ్మర్ బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్గా ఈ చిత్రం నిలుస్తుంది’’ అని ‘దిల్’ రాజు అన్నారు. మహేశ్బాబు, పూజాహెగ్డే జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మహర్షి’. అశ్వనీదత్, ‘దిల్’ రాజు, పీవీపీ నిర్మించిన ఈ సినిమా గురు వారం విడుదలైంది. శుక్రవారం నిర్వహించిన సక్సెస్ మీట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘నేను ముందుగా ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే మొదటిరోజు అన్ని సెంటర్స్లో మహేశ్బాబు కెరీర్లోనే హయ్యెస్ట్ రెవెన్యూ కలెక్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహేశ్ అభిమానులకు ధన్యవాదాలు. శుక్రవారం సెలవు కాకున్నా నెల్లూరులో ఉదయం 9 థియేటర్స్ హౌస్ఫుల్ అయ్యాయి. మహేశ్ కెరీర్కు ‘మహర్షి’ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అవుతుంది. గురువారం విడుదలైన ఈ సినిమా కలెక్షన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో 24కోట్ల 61 లక్షల రూపాయల షేర్ను సొంతం చేసుకుంది’’ అన్నారు. వంశీ పైడిపల్లి మాట్లాడుతూ – ‘‘ఇదొక హార్ట్ హిట్టింగ్ ఫిల్మ్. ఈ విజయం నా రాబోయే చిత్రాలకు మంచి ఎనర్జీ ఇచ్చింది. నాకు ఫస్ట్టైమ్ డిస్ట్రిబ్యూటర్స్ కాల్ చేసి అభినందిస్తున్నారు. మహేష్ ఈ సినిమాపై పెట్టుకున్న నమ్మకాన్ని ప్రేక్షకులు, ఫ్యా¯Œ ్స నిజం చేశారు. ఇండస్ట్రీ నుండి ఎన్నో కాల్స్ వస్తున్నాయి. మోస్ట్ స్పెషల్ కాల్ చిరంజీవిగారిది. ఆయన ఫోన్ చేయడంతో ఎవరండీ అన్నాను. ‘నేను చిరంజీవిని మాట్లాడుతున్నాను’ అనగానే గూస్ బమ్స్ వచ్చాయి. మే 9న చిరంజీవిగారి ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమా రిలీజైన రోజు నుంచి నాకు సినిమాలపై ప్యాష¯Œ మొదలైంది. అదేరోజున ‘మహర్షి’ రిలీజ్ అవడం, అశ్వనీదత్గారు కూడా ఈ సినిమాతో అసోసియేట్ అవడం మర్చిపోలేనిది. ఇది నా జీవితంలో ఓ మెమొరబుల్ మూమెంట్. వినాయక్గారి ‘ఆది’ సినిమా చూసి సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీకి వచ్చాను. అలా నా కెరీర్లో ఒక ఇంపార్టెంట్ పర్స¯Œ అయిన వినాయక్గారు ఫోన్ చేసి అభినందించడం కూడా ఒక హైపాయింట్’’ అన్నారు. ‘‘మహర్షి’ సినిమాని సక్సెస్ చేసిన తెలుగు ఆడియ¯Œ ్సకి ధన్యవాదాలు. మహేష్గారి ల్యాండ్మార్క్ ఫిల్మ్లో నేను కూడా భాగమైనందుకు హ్యాపీగా ఉంది. ‘పాలపిట్ట..’ సాంగ్కి స్క్రీన్ కనపడకుండా పేపర్స్ వేయడం చాలా థ్రిల్లింగ్గా అన్పించింది’’ అన్నారు పూజాహెగ్డే. దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ మహేష్గారు కమర్షియల్ ఎంటర్టైనర్స్తో పాటు సోషల్ మెసేజ్ ఉన్న సినిమా చేయడం చాలా గ్రేట్. మహేష్గారి 25వ సినిమా ‘మహర్షి’, ఎన్టీఆర్గారి 25వ సినిమా ‘నాన్నకు ప్రేమతో’, సూర్య 25వ సినిమా ‘సింగం’ చిరంజీవిగారి 150వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ ఇలా.. అందరి ల్యాండ్ మార్క్ ఫిలింస్లో భాగమవ్వటం గౌరవంగా భావిస్తున్నాను’’ అన్నారు. -
టికెట్ రేట్ల పెంపుకి ప్రభుత్వం కారణం కాదు
‘‘కొన్ని సినిమాలు చూసినప్పుడు ‘వావ్.. ఎంత మంచి సినిమా చేశారు.. ఎంత బాగా తీశారు’ అనిపిస్తుంది. ‘మహర్షి’ నా సినిమా కాకపోయినా, మా సంస్థ ఈ సినిమాతో అసోసియేట్ కాకపోయినా కూడా నేను అలాగే ఫీలయ్యేవాణ్ణి. ‘మహర్షి’ గ్రేట్ సినిమా అని అందరూ అంగీకరిస్తారు’’ అని ‘దిల్’ రాజు అన్నారు. మహేశ్బాబు, పూజా హెగ్డే జంటగా, ‘అల్లరి’ నరేశ్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘మహర్షి’. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా పతాకాలపై సి.అశ్వినీదత్, ‘దిల్’ రాజు, పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు పంచుకున్న విశేషాలు... ► మహేశ్గారి కెరీర్లోని టాప్ సినిమాల లిస్టులో ‘మహర్షి’ కూడా ఉంటుంది. ‘మహర్షి’ ప్రీ రిలీజ్ వేడుకలో నేను చెప్పినట్టు.. ‘ఈ సినిమా ఎంత సక్సెస్ కావాలని ఆశపడుతున్నారో అంతే కోరుకోండి’ అని అభిమానులకు చెప్పాను. అది అతి నమ్మకంతో చెప్పలేదు. ఈ సినిమాతో నా ప్రయాణం, కథ, ప్రీ రిలీజ్కి ముందే సినిమా చూడటంతో నమ్మకంతోనే ఆ మాట చెప్పాను. ► అశ్వినీ దత్గారి పేరు కూడా ఈ సినిమాతో అసోసియేట్ అయి ఉంది. మే 9న ఆయన సంస్థలో ‘జగదేకవీరుడు అతిలోక సుందరి, మహానటి’ సినిమాలు విడుదలై హిట్ అయ్యాయి. పీవీపీగారు కూడా ప్యాషన్తో ఈ సినిమాతో అసోసియేట్ అయ్యారు. ఈ సినిమాతో వంశీ టాప్ డైరెక్టర్లలో ఒకరిగా ఉంటాడు. మ్యాజిక్ క్రియేట్ చేసే సినిమా ఇది. ఈ మాట కూడా అతి నమ్మకంతో అనడం లేదు. ► భారీ బడ్జెట్తో చేసిన సినిమా కావడం వల్ల పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నాం. ఐదో షో కోసం తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ జీఓ వల్ల 8 గంటలకే షోలు పడతాయి. మామూలుగా తెలంగాణలో 8 గంటల షోల ట్రెండ్ లేదు. ఆంధ్రప్రదేశ్లో తెల్లవారుజామున 5 గంటలకే షోలు స్టార్ట్ అవుతాయి. మేం అనుమతి ఇస్తే వాళ్లు అర్ధరాత్రి ఒంటి గంటకు కూడా షోలు మొదలుపెడతారు. ► తెలంగాణ ప్రభుత్వం కాకుండా, థియేటర్ల ఓనర్లే కోర్టు ద్వారా టికెట్ రేట్ల పెంపుకు అనుమతి తెచ్చుకున్నారు. అలాగే ఆంధ్రాలోనూ పెరిగాయి. తెలంగాణలో రూ.80 టికెట్ రూ.100 చేశారు. రూ.100ది రూ.125 చేశారు. మల్టీప్లెక్స్ల వారు రూ.150 ఉన్న చోట రూ.200 చేశారు. రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, వైజాగ్, కర్నూలు... ఇలా అక్కడ రూ. 200 ఉంది. మల్టీప్లెక్స్లలో బెంగుళూరులో వీకెండ్లో రూ.300–500 ఇచ్చేంత ప్రొవిజన్ ఉంది. తెలంగాణలో అది లేదు. తెలుగు స్టేట్స్లో లిమిటేషన్ ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచిందని కొన్ని మీడియాల్లో తప్పుడు వార్తలు రాశారు. ► ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతికి సినిమాలు విడుదలైనప్పుడు రేట్లను పెంచుకోవచ్చు. కానీ తెలంగాణలో అది ఇది వరకు లేదు. పక్క రాష్ట్రాల వారితో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ కనీసం పెరగాలి కదా అని థియేటర్ల వాళ్లు వెళ్లి టిక్కెట్ల పెంపునకు అనుమతి తెచ్చుకున్నారు. ► ఒకప్పుడు సక్సెస్ఫుల్ సినిమా జర్నీకి జూబ్లీ వేడుకలు జరిగాయి. ఆ తర్వాత అవి 100 రోజులయ్యాయి. ఇప్పుడు ‘బాహుబలి’ లాంటి సినిమాకు కూడా 50 రోజులే అవుతున్నాయి. ఒక గ్రేట్ సినిమా వచ్చినా రెవెన్యూ అనేది మేజర్గా తొలి నాలుగు రోజులే ఉంటుంది. ఆ వీకెండ్స్ ఉన్న రెవెన్యూ మెయిన్గా సాగుతోంది. ఇప్పుడు అందరూ సినిమాను ఫాస్ట్గా చూడాలనేది ఒకటి, రెండోది పైరసీ వల్ల డ్యామేజ్ ఎక్కువగా జరుగుతోంది. ఎంత కంట్రోల్ చేసినా పైరసీ వస్తూనే ఉంది. అలాంటప్పుడు పెద్ద సినిమాల టార్గెట్ రీచ్ కావాలంటే టికెట్ ధరల పెంపు తప్పదు. ► నేను ఖర్చు పెట్టింది, వచ్చింది... ఇలాంటి నిజాలు ఎవరికి తెలుసు? ఎవరికీ తెలియకుండా, ఎవరికి కావాల్సినవి వాళ్లు రాసుకుంటున్నారు. నిజానిజాలు ఏంటన్నది నాకు తెలుసు. నా పార్టనర్లకు తెలుసు. ఈ సినిమా బడ్జెట్ ఎంత అనేదాని మీద చాలా విషయాలు ఉంటాయి. లాంగ్ ప్రాజెక్టులకు డ్యామేజ్లు పడతాయి. వడ్డీలు కావొచ్చు, అనుకోని అంశాలు కావొచ్చు... వాటన్నింటినీ బడ్జెట్లోకి తీసుకోలేం. ► ప్రపంచవ్యాప్తంగా 2000 స్క్రీన్లున్నాయి. ఆన్లైన్ బుకింగ్లో ఎక్స్ట్రార్డినరీ పుల్లింగ్ ఉంది కాబట్టి, ఒక థియేటర్ ఫుల్ అయితే, పక్క థియేటర్ వాళ్లను అడిగినా సినిమా వేస్తారు. ‘బాహుబలి’ తర్వాత అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న సినిమా ‘మహర్షి’. రెవెన్యూ ఎంత వస్తుందనేది చూడాలి. -
ఇకనుంచి నా ఫ్యాన్స్కీ అది మ్యాజికల్ డేట్ అవుతుంది
20 ఏళ్లు.. 25 సినిమాలు. హీరోగా మహేశ్బాబు జర్నీ ఇది. ఈ జర్నీలో మహేశ్ ఎప్పటికీ మరచిపోలేని తీయని జ్ఞాపకం ఒకటి ఉంది. ఆ విషయంతో పాటు మహేశ్బాబు ఇంకా చాలా విశేషాలు చెప్పారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అశ్వనీదత్, ‘దిల్’రాజు, పీవీపీ నిర్మించిన ‘మహర్షి’ ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మహేశ్బాబు చెప్పిన విశేషాలు. ► మహర్షి’ సినిమా చేయడానికి కారణం? కథ విని, చాలా ఎగై్జట్ అయ్యాను. సినిమాలో కాలేజ్ ఎపిసోడ్ చాలా ఇంపార్టెంట్ అని, కాన్ఫిడెంట్గా చేద్దాం అని వంశీ పైడిపల్లితో చెప్పాను. ఎందుకంటే హీరోగా 20 ఏళ్లు పూర్తయింది. 25 సినిమాలు చేశాను. ఇప్పుడు మళ్లీ కాలేజ్ స్టూడెంట్ అంటే నమ్మేలా ఉండాలి. ఆ ఎపిసోడ్ దాదాపు 45 నిమిషాలు ఉంటుంది. అందుకే దాన్ని మేం బాగా డీల్ చేశాం. సినిమాలో అది నా ఫెవరెట్ పోర్షన్. సినిమా చూస్తున్నప్పుడు గర్వంగా ఫీల్ అయ్యాను. ఆడియన్స్కు కూడా తప్పకుండా నచ్చుతుంది. ► వంశీ ఈ కథతో మీ కోసం రెండేళ్లు వెయిట్ చేయడం గురించి? నిజానికి ఓ 20 నిమిషాలు కథ విని వంశీని పంపించేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఆ టైమ్లో నాకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. దాదాపు 40 నిమిషాలు కథ చెప్పాడు. బాగా నచ్చింది. ముందు ఇచ్చిన కమిట్మెంట్స్ పూర్తి చేసిన తర్వాతే మీ సినిమా ఉంటుంది అని చెప్పాను. ‘పర్లేదు. వెయిట్ చేస్తాను. ఆ వెయిటింగ్ గ్యాప్లో కథకు ఇంకా మెరుగులు దిద్దుతాను’ అని చెప్పాడు. మీరు తప్ప ఈ సినిమాలో హీరోగా ఎవరూ కనిపించడం లేదు అన్నాడు. వంశీ కన్విక్షన్కు హ్యాట్సాఫ్. అతనితో వర్క్ చేయడం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ► 25వ సినిమా ‘మహర్షి’ అని ముందే ప్లాన్ చేశారా? నేను చేయాల్సిన సినిమాలు ఉండటం. వంశీ వెయిట్ చేయడం. ఇలా అన్నీ కలిసి ‘మహర్షి’ నా కెరీర్లో 25వ సినిమా అయింది. 25వ సినిమాగా ఇదే చేయాలని ప్లాన్ చేసి చేయలేదు. ‘మహర్షి’లో మంచి డెప్త్ ఉంది. ఈ మధ్య కాలంలో ఆడియన్స్ ఇలాంటి సినిమాను చూసి ఉండరు. ఫ్యామిలీ ఎమోషన్స్, క్లాస్, మాస్, యూత్.. హీరో ఫ్యాన్స్.. ఇలా అన్ని యాంగిల్స్ని కవర్ చేశాడు వంశీ. ► ఈ మధ్య మీరు సోషల్ మేసేజ్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపిస్తోంది? అదేం కాదు. ‘శ్రీమంతుడు, భరత్ అనే నేను’ సినిమాల్లో మంచి మెసేజ్ ఉంది. అలాంటి సినిమాల్లో నటించడం నాకు హ్యాపీగా ఉంది. అలాగే ‘మహర్షి’ సినిమాలో కూడా ఓ పవర్ఫుల్ పాయింట్ ఉంది. అది ఇప్పుడే చెప్పి ప్రేక్షకుల ఎగై్జట్మెంట్ తగ్గించేయను. ► ‘శ్రీమంతుడు’ సినిమాలో దత్తత అనే పాయింట్ ఉంది. ఇందులోనూ అలాంటి పాయింట్ ఏదైనా? ఉంటుంది. ఓ పవర్ఫుల్ పాయింట్ను టచ్ చేశాం. సినిమా రిలీజ్ రోజున ఆడియన్స్ ఎగై్జట్ అవుతారని అనుకుంటున్నాం. ఆ పాయింట్ రైతుల సమస్యల గురించా? అనే విషయం ఇప్పుడే చెప్పలేను. థియేటర్స్లో చూడాల్సిందే. ► ఈ సినిమాలో మూడు లుక్స్లో కనిపిస్తున్నారు. మీ ఫేవరెట్ లుక్ ఏది? ఇంతకు ముందు ఒకే లుక్లో సినిమాలు చేస్తున్నానని అన్నారు. ఈ సినిమాలో మూడు లుక్స్ ఉంటాయి. స్టూడెంట్లా, రైతులా, బిజినెస్మన్లా కనిపిస్తాను. ఏ లుక్ ట్రై చేసినా అది ఆ సినిమా, అందులో క్యారెక్టర్ ప్రకారమే ఉంటుంది. అలాగే లుక్ మార్చడమంటే హెయిర్ స్టయిల్ మార్చడం, గడ్డం పెంచడం తప్ప కొత్తగా ఏమీ ఉండదు (నవ్వుతూ). ► ఇది మల్టీ ప్రొడ్యూసర్స్ సినిమా.. అనుకున్న బడ్జెట్ కన్నా కాస్త ఎక్కువైనట్లుంది? అశ్వనీదత్, ‘దిల్’ రాజు, పీవీపీగారికి ముగ్గురూ నిర్మించారు. ‘మహర్షి’ చాలా పెద్ద స్కేల్ సినిమా. ఇంత బాగా రావడానికి వాళ్ల ముగ్గురి సపోర్ట్ చాలా ఉంది. సినిమాలో హీరో న్యూయార్క్లో సీఈవో. అంటే కార్లు, హెలికాప్టర్లు కావాలి. అప్పుడు అనుకున్నదానికంటే ఖర్చు ఎక్కువ అయ్యింది. ప్రొడ్యూసర్స్ బాగా సపోర్ట్ చేశారు. కొన్ని కీలక సన్నివేశాలను విలేజ్లో షూట్ చేద్దాం అనుకున్నాం. కుదర్లేదు. సెట్ వేశాం. ఆ సీన్స్లో ప్రతిరోజూ దాదాపు వెయ్యిమంది జూనియర్ ఆర్టిస్టులు కావాల్సి వచ్చింది. డిసెంబర్లో షూట్ చేశాం. 5 గంటలకు సూర్యుడు వెళ్లిపోతాడు. లైట్ ఫెయిల్ అవుతుంది. ఆ షెడ్యూల్ మరో పది రోజులు పెరిగింది. ఇలాంటి కారణాలు ఉన్నాయి. ► ఇక మీ నుంచి ఏడాదికి కనీసం రెండు సినిమాలు అశించవచ్చా? ఈ రోజుల్లో సినిమా అనేది టఫ్ టాస్క్ అయిపోయింది. నాన్నగారి టైమ్లో 300– 350 సినిమాలు వరకూ చేశారు. ఇప్పుడు 25వ సినిమానే పెద్ద ల్యాండ్మార్క్ ఫిల్మ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరో విషయమేటంటే పెద్ద సినిమా చేయాలంటే కనీసం 8 నుంచి 10 నెలలు సమయం పడుతుంది. ఒక పర్ఫెక్ట్ ప్రొడక్ట్ ఇవ్వడానికి అంత సమయం పడుతుంది. పెద్ద సినిమా షూటింగ్ అంటే అన్ని పనులు జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక పెద్ద సినిమా ఐదారు నెలల్లో వస్తే అద్భుతమే. ‘భరత్ అనే నేను’ తర్వాత నెల రోజుల కంటే ఎక్కువ టైమ్ తీసుకోలేదు నేను. వెంటనే ‘మహర్షి’ స్టార్ట్ చేశాం. ► వంశీతో వర్క్ంగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వంశీ కథ ఎలా చెప్పాడో అలానే తీశాడు. కథను చాలా క్లారిటీగా కమ్యూనికేట్ చేస్తాడు. అది నా పెర్ఫార్మెన్స్ అయినా కూడా కావొచ్చు. బాగా చేశాడు. సినిమా రిలీజైన తర్వాత వంశీకే పేరు వస్తుంది. అంత బాగా తీశాడు. చాలా ఎక్స్ట్రార్డినరీగా తీశాడు. ఈ కథను రెండేళ్లు రాశాడు. స్క్రిప్ట్పై ఎంత టైమ్ స్పెండ్ చేస్తే అవుట్పుట్ అంత బాగా వస్తుంది అంటాం. ఈ సినిమాకు అలా జరిగింది. ► 20 ఏళ్ల జర్నీ గురించి ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో కొందరు దర్శకులకు థ్యాంక్స్ చెప్పి, కొందరు దర్శకుల పేర్లు ప్రస్తావించకపోవడానికి కారణం? ఆ ఈవెంట్కు వచ్చే ముందు దాదాపు 16 గంటలు ప్రయాణం చేసి యూరప్ నుంచి వచ్చాను. స్టేజ్ మీద నేను మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ఫ్యాన్స్ వచ్చారు. ఆ హడావిడిలో మర్చిపోయాను. అది నా మిస్టేక్. దర్శకుడు పూరి జగన్నాథ్కు థ్యాంక్స్. ‘పోకిరి’ నన్ను సూపర్స్టార్ని చేసిన ఫిల్మ్. అలాగే దర్శకుడు సుకుమార్గారికి థ్యాంక్స్. ‘1: నేనొక్కడినే’ క్లాసిక్ కల్ట్ సినిమా నా కెరీర్లో. వన్నాఫ్ మై ఫెవరేట్ డైరెక్టర్ సుకుమార్. ► అలాగే కొందరు దర్శకులు కథ రెడీ చేసుకున్నాక వెయిట్ చేయలేకపోతున్నారు అనే కామెంట్ కూడా చేశారు? వంశీ రెండేళ్లు వెయిట్ చేశాడని అతన్ని అభినందించడానికి, పొగడటానికి అన్న మాట అది. సుకుమారుగారి గురించి కామెంట్ చేశాననట్లు రాశారు. సుకుమార్గారిని పాయింట్ అవుట్ చేసి అన్నది కాదు. సుకుమార్గారు నాకు స్పెషల్ డైరెక్టర్. భవిష్యత్లో మేం కచ్చితంగా కలిసి సినిమా చేస్తాం. ► హిట్టయిన డైరెక్టర్స్ పేర్లు మాత్రమే ప్రీ–రిలీజ్ వేడుకలో చెప్పారనే విమర్శ ఉంది.. సక్సెస్.. ఫెయిల్యూర్ అని కాదు. నా కెరీర్ గ్రాఫ్లో ఈ దర్శకుల సినిమాలు చాలా కీలకం. అందుకే వాళ్ల పేర్లు చెప్పాను. ‘మురారి’ అనే సినిమా నటుడిగా నాకు చాలా క్రూషియల్. మహేశ్ యాక్ట్ చేయగలడు అని చెప్పిన సినిమా అది. ‘ఒక్కడు’ నన్ను స్టార్ని చేసింది. ‘అతడు’ సినిమా నాకు యూఎస్లో మార్కెట్ని ఓపెన్ చేసింది. ‘పోకిరి’ సినిమా తర్వాత సూపర్స్టార్ అన్నారు. ఇవన్నీ నాకు ముఖ్యమైన సినిమాలు. ఇప్పుడు నా జర్నీలో ‘మహర్షి’ 25వ సినిమా. అంతేకానీ హిటై్టన డైరెక్టర్స్ పేర్లు చెప్పడమే అని కాదు. ► ‘శ్రీమంతుడు’ సినిమాతో ‘మహర్షి’కి పోలికలు ఉన్నాయి అంటున్నారు? ఈ సినిమాకు, ‘శ్రీమంతుడు’ సినిమాతో సంబంధం లేదు. సినిమా చూస్తే తెలుస్తుంది. టీజర్ అప్పుడు పోల్చి చూశారేమో.. ట్రైలర్ వచ్చిన తర్వాత అలాంటి కామెంట్స్ ఏం వినబడలేదు. ► 25 సినిమాలు చేశారు. మీ కెరీర్లో మోస్ట్ మెమొరబుల్ మూమెంట్ అంటే ఏది చెప్తారు? నాన్నగారితో ‘మురారి’ మార్నింగ్ షో సినిమా చూశాను. అది కూడా హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో. ‘మురారి’ సినిమా క్లైమాక్స్ తర్వాత నా భుజంపై నాన్నగారు చేయి పెట్టారు. అదే నా మోస్ట్ మెమొరబుల్ మూమెంట్. సినిమా బాగుందా? బాలేదా? అలా ఏం చెప్పలేదు. భుజంపై చేయి వేసి అలా తడిమారు.. అంతే. ‘మహర్షి’ సినిమా గురించి నాన్నగారు ఏం చెబుతారో అని ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నాను. ► మే 9న చాలా సెంటిమెంట్స్ ఉన్నాయి? మే 9 నిజంగా మ్యాజికల్ డేట్. అశ్వనీదత్ గారికి రెండు బ్లాక్బస్టర్ సినిమా (జగదేకవీరుడు అతిలోక సుందరి, మహానటి)లు ఉన్నాయి. ఇక నుంచి మా అభిమానులకు కూడా ఆ డేట్ మ్యాజికల్గా మారబోతోంది. ► బౌండ్ స్క్రిప్ట్ ఉంటేనే సినిమాలు అంగీకరిస్తాను అంటున్నారు.. బ్రౌండ్ స్క్రిప్ట్ ముఖ్యం. అరగంట కథ విని ఎగై్జట్ అవ్వడం కన్నా మూడు గంటలు స్క్రిప్ట్ విని చేయడం మంచిది. షూటింగ్లోకి దిగిన తర్వాత స్క్రిప్ట్ గురించి మళ్లీ డిస్కషన్స్ ఉండకూడదని నా ఫీలింగ్. నేను గతంలో చేసిన తప్పుల నుంచి నేర్చుకున్నాను. ‘స్పైడర్, బ్రహ్మోత్సవం’ సినిమాలు 20 నిమిషాల నరేషన్ విన్నప్పుడు ఎగై్జట్ అయ్యాను. సేమ్ టైమ్ షూటింగ్లో దిగినప్పుడే నాకు తెలిసిపోయింది. మన లోపల ఉన్న భయం చెప్పేస్తుంది. ఆ తప్పులు మళ్లీ రిపీట్ చేయకూడదు అనుకుంటున్నాను. ఇక మీదట డిటైల్డ్ స్క్రిప్ట్ ఉండి.. కథ నచ్చితేనే సినిమా చేస్తాను. ► బోయపాటి శ్రీను, త్రివిక్రమ్, రాజమౌళిలతో మీరు సినిమాలు చేయాల్సి ఉందేమో? రాజమౌళిగారు, నేను ఓ సినిమా చేయాలనుకుంటున్నాం. కేఎల్ నారాయణగారు నిర్మాత. నా కమిట్మెంట్స్, ఆయన కమిట్మెంట్స్ పూర్తయినప్పుడు మా కాంబినేషన్లో సినిమా ఉంటుంది. త్రివిక్రమ్గారితో కూడా చర్చలు జరుగుతున్నాయి. ► హిస్టారికల్ సినిమాల్లో నటించే ఇంట్రెస్ట్ ఉందా? హిస్టారికల్ సినిమాలు చేయాలంటే నాకు భయం. రాజమౌళిగారిలాంటి దర్శకులు కన్విన్స్ చేసినప్పుడు చేస్తాను. ► అడవి శేష్తో ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ సినిమా గురించి? అడవి శేష్ ‘గూఢచారి’ సినిమా చూశాను. నచ్చింది. అలాంటి ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించాలనుకున్నాం. సోనీ పిక్చర్స్వారు కలసి పని చేద్దాం అని వచ్చారు. కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేస్తాం. నాకు నచ్చిన అన్ని కథలను నేను చేయలేను. వీలైతో వాటిలో కొన్నింటిని నిర్మిస్తాను. ► మీ సినిమాలు వేరే భాషలో విడుదల కాకపోయినా ఒక్క తెలుగులోనే మీ మార్కెట్ 150 కోట్ల వరకూ ఉంటుంది. అది గర్వంగా ఉంటుందా? ప్రౌడ్గాను ఉంది. అలాగే టెన్షన్గానూ ఉంది. థియేట్రికల్ బిజినెస్ 130 కోట్లు వరకూ జరిగినప్పుడు కలెక్షన్స్ 150–160 కోట్లు ఉన్నప్పుడే బయ్యర్స్ అందరూ హ్యాపీగా ఉంటారు. అలా ఉండాలంటే సినిమా కచ్చితంగా బ్లాక్బస్టర్ అయి తీరాలి. వేరే ఆప్షన్ లేదు. ► మేడమ్ తుస్సాడ్స్వాళ్లు తయారు చేసిన మీ స్టాచ్యూ చూసి మీ వైఫ్, పిల్లలు ఎలా రియాక్ట్ అయ్యారు? నమ్రతా రియాక్షన్ కంటే సితార మా పాప రియాక్షన్ మాత్రం ప్రైస్లెస్. స్టాచ్యూ అంటే ఏదో అనుకుంది కానీ చూసి షాక్ అయింది. ఫస్ట్ టైమ్ ఆ బొమ్మను చూసినప్పుడు తను ఇచ్చిన రియాక్షన్ మర్చిపోలేనిది. ► దర్శకుడు సుకుమార్తో మీ సినిమా సడన్గా ఎందుకు క్యాన్సిల్ అయ్యింది? సుకుమార్గారు, నేను ముందు సినిమా చేద్దాం అనుకున్నాం. కానీ వరుసగా అన్నీ సోషల్ మెసేజ్లు, ఇంటెన్స్ సినిమాలు చేస్తున్నాను అనిపించింది. అందుకే అనిల్ రావిపూడిగారి సినిమాను సెట్స్పైకి తీసుకెళ్లాలని అనుకున్నాను. నాకు కొత్తగా, ఫ్రెష్గా నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చినట్లు ఉంటుందనుకున్నాను. అదే సుకుమార్గారితో చెప్పను. చెరో సినిమా చేశాక మళ్లీ కలిసి సినిమా చేద్దామనుకున్నాను. ► అనిల్ రావిపూడి సినిమా మీ ఫ్యాన్స్ సలహా మేరకు అంగీకరించారా? ‘మహర్షి’ తర్వాత అనిల్తో సినిమా చేయా లన్నది నా ఛాయిస్. ఆ సినిమా జూన్ ఎండ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ‘దూకుడు’ తర్వాత ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ చేయలేదు. ఇలాంటి సినిమా నేను చేసి చాలా రోజులు అయింది. మైనపు బొమ్మ ఆవిష్కరణలో భార్యాపిల్లలతో మహేశ్ -
అతని ప్రేమలోకంలో?
ప్రేమికులిద్దరిదీ ఒకటే లోకం. అందులో ఒకరు రాజ్ తరుణ్. మరి రాజ్ తరుణ్ ప్రేమ లోకంలో ఉన్నది ఎవరు? అనే విషయంపై క్లారిటీ దొరికింది. రాజ్తరుణ్ హీరోగా జి.ఆర్. కృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా ‘ఇద్దరి లోకం ఒకటే’. ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండేను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ వార్త నిజమైతే రాజ్ తరుణ్, షాలినీ తొలిసారి జోడీ కట్టినట్లే. ఈ సినిమాకు మిక్కీ జె.మేయర్ సంగీతం అందిస్తున్నారు. సమీర్ రెడ్డి ఛాయాగ్రాహకులుగా పని చేస్తున్నారు. -
ఇద్దరి లోకం ఒకటే
యువ కథానాయకుడు రాజ్తరుణ్ ‘ఇద్దరి లోకం ఒకటే’ అంటున్నారు. ఆయన హీరోగా జి.ఆర్.కృష్ణ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై తెరకెక్కుతోన్న ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమా సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. చిత్రనిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ క్లాప్ ఇవ్వగా, ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ‘దిల్’రాజు మనవడు మాస్టర్ ఆరాన్‡్ష గౌరవ దర్శకత్వం వహించాడు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘రాజ్తరుణ్తో మా బ్యానర్లో చేస్తోన్న రెండో చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. యువత, కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రంతో జి.ఆర్. కృష్ణని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. మిక్కీ జె.మేయర్ సంగీతం, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, అబ్బూరి రవి మాటలు సమకూర్చుతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరా లను తెలియజేస్తాం’’ అన్నారు. -
మస్త్ బిజీ
బ్రేక్ వేయకుండా రయ్రయ్ మంటూ కెరీర్ ఎక్సలేటర్ను తొక్కేస్తున్నారు నాగచైతన్య. ఈ ఏడాదిలో ఆల్రెడీ ‘మజిలీ’తో సక్సెస్ అందుకున్నారాయన. ప్రస్తుతం ‘వెంకీ మామ’ సినిమా షూటింగ్లో వెంకటేశ్తో కలిసి సందడి చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది సెకండ్ హాఫ్లో రిలీజ్ కానుంది. ఈ చిత్రం పూర్తి కాగానే నూతన దర్శకుడు శశితో ఓ సినిమా స్టార్ట్ చేయనున్నారు. ‘దిల్’ రాజు నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమా ఫుల్ లవ్స్టోరీగా తెరకెక్కనుందని తెలిసింది. ఇందులో కథానాయికగా ‘జెర్సీ’ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ను ఎంపిక చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉందని తెలిసింది. ఈ సినిమా తర్వాత ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమా చేస్తారు. సో.. ఈ ఏడాదంతా ఆయన మస్త్ బిజీబిజీ అన్నమాట. -
ఈ సక్సెస్ నా ఒక్కడిది కాదు
‘‘చిత్రలహరి’ సినిమాతో తేజుకి మంచి సక్సెస్ రావడం చాలా సంతోషంగా ఉంది. తేజు దీన్ని ఇలాగే కొనసాగించాలి. ఫెయిల్యూర్ తన దరిదాపుల్లోకి కూడా రాకూడదని కోరుకుంటున్నాను’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. సాయిధరమ్ తేజ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘‘చిత్రలహరి’. కల్యాణీ ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ ఈ చిత్రంలో కథానాయికలుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలైంది. హైదారాబాద్లో జరిగిన ఈ సినిమా సక్సెస్ మీట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘సినిమాలో తేజుని చూసినప్పుడు పర్సనల్గా కూడా నాకు తేజునే గుర్తుకొచ్చాడు. సింపుల్ క్యారెక్టర్స్ను హీరోలకు అడాప్ట్ చేస్తూ కిశోర్ సినిమాలు చేస్తుంటారు. తన స్టామినాకు తగ్గ సక్సెస్ ఇంకా రాలేదనే భావిస్తున్నారు. ఇండస్ట్రీకి రాగానే మూడు బ్లాక్బస్టర్స్ సాధించిన మైత్రీ మూవీ మేకర్స్ చిన్న స్పీడ్ బ్రేకర్ దాటి మళ్లీ సక్సెస్బాట పట్టింది. సునీల్ తిరిగి సక్సెస్ ట్రాక్లోకి రావడం హ్యాపీగా ఉంది’’ అని అన్నారు. ‘‘కలెక్షన్స్ బాగా వచ్చాయి. సినిమా సక్సెస్ అంటున్నారు. కానీ సినిమా ప్రజలకు బాగా రీచ్ కావడమే నా దృష్టిలో సక్సెస్. ఈ సినిమా సక్సెస్ నా ఒక్కడిది కాదు. సినిమా చూసి స్ఫూర్తి పొందిన ప్రతి ఒక్కరికీ ఈ సక్సెస్ చెందుతుంది. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్. కిశోర్ నా స్నేహితుడే. పోసానిగారు లవ్లీ పర్సన్. ఈ సినిమాలో ఆయన చేసిన పాత్రలో మా అమ్మను చూసుకున్నాను’’ అన్నారు సాయిధరమ్తేజ్. ‘‘ఈ సినిమాలో మంచి పాత్ర చేశాను. హీరో సాయి, దర్శకుడు కిశోర్, నిర్మాతలకు అభినందనలు’’ అన్నారు పోసాని కృష్ణమురళి. ‘‘సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు కిశోర్. ‘‘నాకు మంచి పాత్ర ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు సునీల్. ‘‘ఇప్పటివరకు 35 స్ఫూర్తి పాటలు రాశాను. ఈ సినిమా కోసం కూడా అలాంటి పాట రాశాను. ఈ విజయోత్సవ సభలో అందర్నీ చూడటం సంతోషంగా ఉంది’’ అన్నారు పాటల రచయిత చంద్రబోస్. -
వ్యూహం పన్నారా?
‘సమ్మోహనం’ సక్సెస్ తర్వాత దర్శకుడు మోహన్కృష్ణ ఇంద్రగంటి థ్రిల్లర్ కథాంశంతో ఓ సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. సుధీర్బాబు, నానిలతో ఈ మల్టీస్టారర్ రూపొందనుంది. ఇందులో నాని పాత్ర నెగటివ్ షేడ్స్లో ఉంటుందని సమాచారం. నాని సరసన అదితీరావ్ హైదరీ, సుధీర్కి జోడీగా నివేదా థామస్ నటించనున్నారట. ఈ సినిమాకు ‘వ్యూహం’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారని టాక్. ఈ నలుగురిలో ఎవరు వ్యూహం పన్నారో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ వేచి చూడాల్సిందే. ‘సమ్మోహనం’ తర్వాత సుధీర్, అదితీలను, ‘జెంటిల్మేన్’ తర్వాత నాని, నివేదా థామస్లను ఇంద్రగంటి రిపీట్ చేస్తున్నారు. జులైలో ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మించనున్నారు. -
ల్యాండ్మార్క్ మూవీ అవుతుంది
‘‘మహేశ్బాబు లాంటి స్టార్ హీరో సినిమాలో ఉన్నప్పుడు కథను చెప్పాలనుకుంటున్న స్టయిల్లో చెబుతూనే ఆయన స్టార్డమ్ పక్కన పెట్టకుండా చేయాలి. కాబట్టి కాస్త సమయం పట్టింది. ‘ఊపిరి’ సినిమా సమయంలో మహేశ్గారికి ఈ ఐడియా చెప్పాను. 6 నెలల తర్వాత కథ చెప్పాను. ఈ కథను చెప్పే సమయంలో ‘మహర్షి’ ఆయన 25వ సినిమా అవుతుంది అని తెలియదు. అలా కుదిరింది. మహేశ్గారి కెరీర్లోనూ, మా అందరి కెరీర్లలోనూ ‘మహర్షి’ ల్యాండ్మార్క్ మూవీ అవుతుంది’’ అని వంశీ పైడిపల్లి అన్నారు. మహేశ్బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. అశ్వనీదత్, ‘దిల్’ రాజు, పీవీపీ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం టీజర్ శనివారం రిలీజైంది. ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘మహర్షి’లో మొదటి పాట రిలీజ్ చేసినప్పుడు ఇది ఫ్రెండ్షిప్ మూవీ అన్నారు. టీజర్ చూడగానే అభిప్రాయాలు మార్చుకున్నారు. ట్రైలర్, పాటలన్నీ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా గురించి ఇంకా మాట్లాడుకుంటారు. వంశీ 5 సినిమాల్లో 4 నాతోనే చేశాడు. ఈ సినిమా మీద 3 ఏళ్లుగా వర్క్ చేస్తున్నాడు. కంటెంట్ పరంగా, మేకింగ్ పరంగా అద్భుతమైన సినిమా ఇది. సినిమా చూశాక ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. మా కష్టాన్ని మే 9న ప్రేక్షకులు చూస్తారు’’ అన్నారు. ‘‘టీజర్కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సినిమా మీద అందరం నమ్మకంగా ఉన్నాం. నిర్మాతల సహకారానికి థ్యాంక్స్. అడిగింది కాదనకుండా ఇచ్చారు. మహేశ్గారు నిజంగా డైరెక్టర్స్ యాక్టరే. రిషి పాత్రకు ఊపిరి పోశారు. ఆయన నమ్మకం, సపోర్ట్ కారణంగానే ఇంత మంచి సినిమా చేయగలిగాం. ప్రస్తుతం ఒక పాట చిత్రీకరిస్తున్నాం. మరో పాట బ్యాలెన్స్ ఉంది. నరేశ్గారు అద్భుతమైన పాత్ర చేశారు. రాజుగారితో సినిమాలు చేస్తూనే ఉంటాను’’ అన్నారు వంశీ పైడిపల్లి. -
కాంబినేషన్ కుదిరేనా?
టాలీవుడ్లో ఉన్న టాప్ స్టార్స్ అందరితో యాక్ట్ చేశారు సమంత. పవన్ కల్యాణ్ (అత్తారింటికి దారేది), మహేశ్బాబు (దూకుడు) ఎన్టీఆర్ (బృందావనం), రామ్చరణ్ (రంగస్థలం) ఇలా జత కట్టిన ప్రతి హీరోతో హిట్ సాధించారు సమంత. ప్రభాస్తో మాత్రం సమంత ఇప్పటివరకూ ఒక్కసినిమాలో కూడా నటించలేదు. అయితే త్వరలోనే సమంత, ప్రభాస్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చేస్తోన్న ‘సాహో, జాన్’ చిత్రాల తర్వాత ‘దిల్’ రాజు నిర్మాణంలో ప్రభాస్ ఓ సినిమాలో యాక్ట్ చేస్తారట. ‘దిల్’ రాజు ప్రొడక్షన్లో ‘96’ రీమేక్లో హీరోయిన్గా చేస్తున్నారు సమంత. ‘96’తో పాటు సమంతతో మరో రెండు సినిమాల డీల్ కుదుర్చుకున్నారట నిర్మాత ‘దిల్’రాజు. అందులో భాగంగా రూపొందే సినిమాలోనే సమంత– ప్రభాస్ జోడీ కడతారట. ఈ సినిమాకు దర్శకుడు ఎవరో తెలియాల్సి›ఉంది. మరి ఈ కొత్త కాంబినేషన్ కుదిరేనా? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. మరోవైపు ప్రభాస్ ‘జాన్’ విషయానికి వస్తే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ సోమవారం ముగిసింది. ‘‘జాన్ సెకండ్ షెడ్యూల్ పూర్తి చేశాం. 1970లో యూరప్లో జరిగే ఇద్దరి ప్రేమికుల కథే మా చిత్రం’’ అని పేర్కొన్నారు చిత్రదర్శకుడు రాధా కృష్ణకుమార్. -
బాలీవుడ్కి ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్
ఎగ్జిబిటర్గా, డిస్ట్రిబ్యూటర్గా, నిర్మాతగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘దిల్’ రాజు ఇప్పుడు హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ‘ఎఫ్ 2’ (ఫన్ అండ్ ప్రస్ట్రేషన్) ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. వంద కోట్లు వసూలు చేసిన ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్తో కలిసి హిందీలో రీమేక్ చేయనున్నారు ‘దిల్’ రాజు. తెలుగులో విజయవంతమైన ‘రెడీ’ చిత్రాన్ని సల్మాన్ఖాన్, ఆసిన్ జంటగా అదే పేరుతో, ‘పెళ్లాం ఊరెళితే’ చిత్రాన్ని ‘నో ఎంట్రీ’ గా హిందీలో తెరకెక్కించి, విజయం సాధించిన అనీస్ బజ్మీ ‘ఎఫ్ 2’కి దర్శకత్వం వహిస్తారు. నటీనటుల వివరాలు త్వరలో ప్రకటిస్తారు. ∙‘దిల్’ రాజు ∙బోనీకపూర్ -
ఎవరి లైఫ్లోనూ ఆమె ఉండకూడదు
‘‘సూర్యకాంతం’ సినిమా టీజర్ చూడగానే థ్రిల్ ఫీలయ్యా. సినిమా ఓపెనింగ్ టైమ్లో నిహారిక పాత్ర బావుందని వరుణ్ తేజ్తో చెప్పా. లేడీ అర్జున్రెడ్డిలాగా బాగా చేసింది. ఈ నెల 29న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మా సంస్థ ద్వారా ఈ సినిమా విడుదల చేస్తున్నాం. ఈ ఏడాది మా బ్యానర్లో ఇది మూడో హిట్ కావాలని ఆకాంక్షిస్తున్నా’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్ జంటగా ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సూర్యకాంతం’. వరుణ్ తేజ్ సమర్పణలో నిర్వాణ సినిమాస్ బ్యానర్పై సందీప్ ఎర్రంరెడ్డి, సుజన్ ఎరబోలు, రామ్ నరేష్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 29న రిలీజ్ అవుతోంది. హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఇద్దరు అమ్మాయిల మధ్యలో స్ట్రగుల్ అయ్యే పాత్రలో రాహుల్ విజయ్ నటన నన్ను ఆకట్టుకుంది. రాహుల్లో ఆ టాలెంట్ ఉంది కాబట్టి నేను ఎంకరేజ్ చేస్తున్నా. నా లైఫ్లోనే కాదు, ఎవరి లైఫ్లోనూ సూర్యకాంతం ఉండకూడదు’’ అన్నారు. హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘నాగబాబుగారి కొడుకుగా ఓ సినిమాలో నటించా. అందుకే నిహారికకు అన్నగా ఇక్కడికి వచ్చాను. ‘సూర్యకాంతం’ టీజర్ చాలా బావుంది. నా ‘అర్జున్ రెడ్డి’ సినిమాని సృజన్, సందీప్ అమెరికాలో విడుదల చేశారు. వాళ్లకు ఈ సినిమా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు. ‘‘సూర్యకాంతం’ సినిమా ఈ రోజు ఇక్కడి వరకు వచ్చిందంటే కారణం మా అన్న వరుణ్తేజ్. టీమ్ అంతా ఓ ఫ్యామిలీలా కష్టపడి ఈ సినిమా చేశాం. నా పాత్రకు 100 శాతం న్యాయం చేశానని అనుకుంటున్నా’’ అన్నారు నిహారిక కొణిదెల. ‘‘ప్రణీత్ను పిలిపించి అభి క్యారెక్టర్కి నేను సూట్ అవుతానని వరుణ్ తేజ్ అన్న సూచించారు. నిహారికగారు సూర్యకాంతం టైటిల్కి కరెక్టుగా సరిపోయారు’’ అని రాహుల్ విజయ్ అన్నారు. ‘‘దిల్’ రాజుగారు మా సినిమా చూసి, రిలీజ్ చేస్తుండటం మాకు చాలా ఆనందంగా అనిపించింది. నా జీవితంలో ఈ సినిమా చాలా స్పెషల్ సినిమా’’ అన్నారు ప్రవీణ్. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది’’ అని నిర్మాతల్లో ఒక్కరైన సందీప్ ఎర్రంరెడ్డి’’ అన్నారు. కృష్ణకాంత్, విజయ్ మాస్టర్, దివ్య, కాలభైరవ, పెర్లిన్, మార్క్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీదేవి గొప్పతనం అది
‘‘ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అన్న తేడా లేకుండా ఇండియాలోనే ఒక నంబర్ 1 స్టార్గా ఎదిగిన శ్రీదేవిగారిపై రామారావుగారు పుస్తకం రాయడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మూమెంట్స్ రామారావుగారితోనే ఆగిపోతాయేమో అనిపించింది. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ కమర్షియల్ అయిపోయారు’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావు రచించిన ‘అతిలోకసుందరి శ్రీదేవి కథ’ పుస్తకావిష్కరణ బుధవారం జరిగింది. రకుల్ప్రీత్ సింగ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రథమప్రతిని మాదాల రవి అందుకున్నారు. తొలిప్రతిని శివాజీరాజా కొనుగోలు చేశారు. యువకళావాహిని–సియోటెల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ‘‘అతిలోకసుందరి అనే టైటిల్ ఒక్క శ్రీదేవిగారికే సూట్ అవుతుంది. ఇండియాలో సూపర్స్టార్ శ్రీదేవిగారు. దురదృష్టవశాత్తు ఆమె మనకు దూరమయ్యారు. కానీ ఎప్పటికీ గుర్తు ఉంటారు. శ్రీదేవిగారిపై పుస్తకం రాసిన రామారావుగారికి శుభాకాంక్షలు’’ అన్నారు రకుల్. దర్శక–నిర్మాత– నటుడు ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘శ్రీదేవిగారు మరణించినప్పుడు ప్రపంచమంతా కన్నీరు కార్చింది. ఆమె గొప్పతనం అలాంటిది. ఆమెపై పుస్తకం రాసిన పసుపులేటి రామారావుగారికి సెల్యూట్’’ అన్నారు. సినిమాల సెన్సార్ విషయంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై ఆయన మాట్లాడుతూ– ‘‘నా సినిమా సెన్సార్ సమస్య వల్ల ఓసారి ముంబై వెళ్లాను. శ్రీదేవిగారు ఏ తెలుగువారు అక్కడ కనిపించినా ఆత్మీయంగా మాట్లాడేవారు. నన్ను అక్కడ చూశారు. ‘బాగున్నారా? ఏంటి.. ఇలా వచ్చారు’? అన్నారు. ‘సెన్సార్ ఇబ్బందుల్లో పడ్డాను’ అన్నాను. ‘మీ విప్లవ సినిమాలు బాగుంటాయి. నాకు కూడా అలాంటి సినిమాల్లో నటించాలని ఉంది’ అన్నారు. ఇప్పుడు ఆ శ్రీదేవిగారు ఉంటే.. సెన్సార్ పరంగా ఇప్పుడు ఏవేం జరుగుతున్నాయో చూసి కన్నీరు పెట్టుకునేవారు. ఎంత దుర్మార్గమండి.. రామ్గోపాల్ వర్మగారు ఓ సినిమా (‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను ఉద్దేశించి) తీశారు. సెన్సార్ చేయరా? ఎవరెవరో వచ్చి ఎగిరిపడితే ఆపేస్తారా? పోసానిగారు ఓ సినిమా (‘ముఖ్యమంత్రిగారూ మీరు మాట ఇచ్చారు’ చిత్రాన్ని ఉద్దేశించి) చేశారు. దాన్ని సెన్సార్ చేయరా? అసలేం జరుగుతోంది. ఏం ప్రజాస్వామ్యం ఇది? సెన్సార్బోర్డ్ వాళ్లు చెబుతారా ఏ సినిమా చూడచ్చో, ఏది చూడకూడదో. ఇలా నిర్మాతలను ఇబ్బంది పెడితే ఎలా? ఎన్.టీ రామారావుగారి మీద ‘మండలాదీశుడు’ సినిమా తీస్తే... ‘రామారావుగారూ.. మీ గురించి ఇలా తీశారు’ అంటే.. ‘మా గురించి గొప్పగా చెప్పినా చూస్తారు. తిట్టినా చూస్తారు బ్రదర్’ అన్నారు. అదీ ఆయన సంస్కారం. 1962లో మనకు, చైనాకు యుద్ధం వచ్చిన సమయంలో నెహ్రూగారి విధానాలను తప్పుపడుతూ జర్నలిస్ట్, కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ కార్టూన్లు వేశారు. కొందరు రాజకీయనాయకులు ఆర్కే లక్ష్మణ్పై వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ‘‘కళాకారులు, జర్నలిస్టులు ప్రజలపక్షం. మనం వారి వాదనలను వినాలి. వారి అభిప్రాయాలను గౌరవించాలి’’ అని నెహ్రూ అన్నారు. ఇప్పుడేంటండీ.. మనం సినిమా తీస్తాం. సెన్సార్ ఆగిపోవడమా? అమరావతి వెళ్లి వివరణ ఇచ్చుకోవడమా? ఎవరో కోర్టుకు వెళితే సినిమాను ఆపేయాలా? అలాంటప్పుడు సెన్సార్ బోర్డ్ పర్పస్ ఏంటి? ఇలాంటి సెన్సార్ విధానాన్ని ముక్తకంఠంతో ఖండించాలి’’ అన్నారు. ‘‘శ్రీదేవిగారు పాత్రికేయులను బాగా గౌరవించేవారు’’ అన్నారు పసుపులేటి రామారావు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
ఈ సక్సెస్ మా నాన్నగారికి అంకితం
‘‘షూటింగ్కు అందరికంటే ముందు వచ్చే ప్రొడక్షన్ యూనిట్, ఆలస్యంగా వెళ్లే లైట్మేన్లు, మమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్లే డ్రైవర్స్. ఇలా చాలా డిపార్ట్మెంట్స్ కష్టం ఈ సినిమాలో ఉంది. సినిమా బావుంటుందని అందరం నమ్మి పని చేశాం’’ అని కల్యాణ్రామ్ అన్నారు. కెమెరామేన్ కేవీ గుహన్ తెలుగులో తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘118’. కల్యాణ్రామ్ హీరోయిన్గా, షాలినీ పాండే, నివేదా థామస్ హీరోయిన్లుగా నటించారు. మహేశ్ యస్ కోనేరు నిర్మాత. మార్చి 1న రిలీజ్ అయిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సందర్భంగా చిత్రబృందం సక్సెస్మీట్ ఏర్పాటు చేసి, సినిమాలో పని చేసిన అందరికీ షీల్డ్లను బహూకరించారు. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ మాట్లాడుతూ – ‘‘సినిమా ఇంత పెద్ద సక్సెస్ చేసి నన్ను రుణపడిపోయేలా చేశారు. నివేదా ఈ సినిమాకు సెకండ్ హీరో. సినిమాకు పని చేసిన అందరికీ థ్యాంక్స్. గుహన్గారి నెక్ట్స్ సినిమా కూడా నాతోనే చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ కాంప్లిమెంట్ తారక్ ఇచ్చాడు. తనకు థ్యాంక్స్. జయాపజయాలు పెక్కన పెట్టి ప్రతి సినిమాకు ‘ఆల్ ది బెస్ట్ నాన్న’ అని నాన్నగారు (హరికృష్ణ) చెబుతుండేవారు. ఈ విజయాన్ని ఆయనకు అంకితమిస్తున్నాను’’ అన్నారు. ‘‘డిస్ట్రిబ్యూటర్గా 23 ఏళ్లు పూర్తి చేశాను. అందులో కొన్ని బ్యూటిఫుల్ మెమొరీస్ ఉన్నాయి. వాటిలో ఈ సినిమా కూడా ఉంటుంది. మంచి సినిమా డిస్ట్రిబ్యూట్ చేయడం ఆనందాన్ని ఇచ్చింది’’ అన్నారు. ‘‘కల్యాణ్రామ్గారితో మరో సినిమా చేయాలనుకుంటున్నాను. డైరెక్టర్ కావాలనుకుంటున్న కలను ఆయన నిజం చేశారు. 118 నిర్మాత మహేశ్ బాగా ప్రమోట్ చేశారు. సక్సెస్తో పాటు గౌరవం కూడా తెచ్చిపెట్టింది’’ అన్నారు. ‘‘మంచి ప్రయత్నం అని అందరూ అభినందిస్తున్నారు. పని చేసిన అందరికీ థ్యాంక్స్’’ అన్నారు షాలినీ పాండే. ‘‘కథ వినగానే సినిమాలో భాగం అవ్వాలనుకున్నాను. కాన్సెప్ట్ సినిమాలను ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు షాలినీ పాండే. -
క్వాలిటీ కోసమే విడుదల వాయిదా
‘‘మహర్షి’ చిత్రం షూటింగ్ తుదిదశలో ఉంది. ఈనెల 17 నాటికి రెండు సాంగ్స్, కొన్ని మాంటేజెస్ మినహా చిత్రీకరణ పూర్తవుతుంది. రెండు పాటల్ని సెట్ వేసి తీస్తాం. మాంటేజ్ సన్నివేశాలను అబుదాబీలో చిత్రీకరిస్తాం. ఏప్రిల్ 12కి సాంగ్స్తో సహా సినిమా మొత్తం పూర్తవుతుంది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. మహేశ్బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మహర్షి’. పూజా హెగ్డే కథానాయిక. ‘అల్లరి’ నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పి.వి.పి సినిమా పతాకాలపై రూపొందుతోంది. నిర్మాతల్లో ఒకరైన ‘దిల్’ రాజు ఈ సినిమా గురించి మాట్లాడుతూ– ‘‘ఈ కథ కోసం వంశీ రెండేళ్లు కష్టపడ్డాడు. సినిమా బాగా వచ్చింది. యూనిట్ అంతా చాలా ఎగ్జయిటెడ్గా ఉన్నాం. అశ్వినీదత్గారు, నేను, పివీపీగారు సినిమా బ్లాక్బస్టర్ హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నాం. ఏప్రిల్ 25న సినిమాను విడుదల చేయాలని అనుకున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కావడానికి సమయం పడుతుండటంతో నేను, మహేశ్, వంశీ.. టీమ్ అంతా కలిసి మాట్లాడుకున్నాం. క్వాలిటీలో రాజీపడకుండా హైటెక్నికల్ వేల్యూస్తో నిర్మించిన ఈ సినిమాను మే 9న విడుదల చెయ్యాలని నిర్ణయించుకున్నాం. అదే రోజున అశ్వినీదత్గారి ‘జగదేకవీరుడు–అతిలోకసుందరి, మహానటి’ వంటి బ్లాక్బస్టర్స్ విడుదలయ్యాయి. మేలో మా బేనర్ ద్వారా ‘ఆర్య, పరుగు, భద్ర’ వంటి సూపర్హిట్స్ అందుకున్నాం. ఇలా సెంటిమెంట్గా కూడా కలిసొచ్చింది. మహేశ్గారి కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్గా ‘మహర్షి’ నిలుస్తుంది. ఈ ఏడాది సంక్రాంతికి మా బ్యానర్లో ‘ఎఫ్2’ తో బ్లాక్బస్టర్ కొట్టాం. ఈ సమ్మర్కి కూడా ‘మహర్షి’తో బ్లాక్బస్టర్ కొడుతున్నాం. ‘ఒక్కడు, పోకిరి, శ్రీమంతుడు’ సినిమాల తరహాలో ఈ సినిమాలో నావల్ పాయింట్ ఉంటుంది. సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకుడు మన వంతుగా ఏం చేస్తున్నాం అనే ఫీలింగ్తో వస్తాడు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: కె.యు.మోహనన్. -
సొంత సినిమా సక్సెస్ అయినట్టుగా అనిపిస్తోంది
‘‘పటాస్’ తర్వాత కల్యాణ్రామ్, మా కాంబినేషన్లో హిట్ కొట్టాం. ‘118’ రెగ్యులర్ మూవీ కాదు. కొత్త ప్రయత్నం. రివ్యూస్, ఆడియన్స్ రెస్పాన్స్ రెండూ పాజిటివ్గానే ఉన్నాయి’’ అని ‘దిల్’ రాజు అన్నారు. కల్యాణ్ రామ్ హీరోగా కేవీ గుహన్ దర్శకత్వంలో తెరకె క్కిన చిత్రం ‘118’. నివేదా «థామస్, షాలినీ పాండే కథానాయికలు. మహేశ్ కోనేరు నిర్మించిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోందని ప్రముఖ నిర్మాత, ఈ చిత్ర పంపిణీదారులు ‘దిల్’ రాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘118’ సినిమాను ఏపీ, తెలంగాణలలో రిలీజ్ చేశాం. రెండు రోజులకు మూడు కోట్ల షేర్ వచ్చింది. గుహన్గారితో 20 ఏళ్ల అనుబంధం ఉంది. మా సొంత సినిమా సక్సెస్ అయినట్టుగా అనిపిస్తోంది’’ అన్నారు. ‘‘కొత్త సినిమాలు తీయడానికి ప్రేక్షకుల స్పందన ప్రేరణ ఇస్తుంది. నాకు ‘దిల్’రాజుగారు గాడ్ బ్రదర్లాగా. ఆయన చేతి నుంచి సినిమా రిలీజ్ అవ్వడం సంతోషం’’ అన్నారు గుహన్. ‘‘‘పటాస్’ రిలీజ్ అయి నాలుగేళ్లయింది. అప్పుడూ ‘దిల్’ రాజుగారే సినిమాను పంపిణీ చేశారు. ఆ రోజు మమ్మల్ని నమ్మారు. మళ్లీ ఇప్పుడు. నా ప్రతి సినిమాను రాజుగారికి చూపిస్తా (నవ్వుతూ)’’ అన్నారు కల్యాణ్ రామ్. ‘‘ఫీడ్బ్యాక్ వింటుంటే చాలా çహ్యాపీగా ఉంది. ఫస్ట్ మాకు ధైర్యాన్ని ఇచ్చింది తారక్గారు. ఆ తర్వాత రాజుగారు’’ అన్నారు మహేశ్ కోనేరు. -
ఈరోజుల్లో సినిమా ఆడటమే కష్టం
‘‘హుషారు’ సినిమా ఫస్ట్ సాంగ్ రిలీజ్ రోజునే సినిమా బాగుందని, ఆడుతుందని చెప్పాను. నిజంగానే ప్రేక్షకులు ఆదరించారు. ఈరోజుల్లో సినిమా ఆడటమే కష్టం. అలాంటిది 50 రోజులు పూర్తి చేసుకోవడం అంటే సాధారణ విషయం కాదు. ‘హుషారు’ యూనిట్కు అభినందనలు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. తేజస్ కంచర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ మంచు, దినేష్ తేజ్, దక్షా నగార్కర్, ప్రియా వడ్లమాని, హేమా ఇంగ్లే ముఖ్య తారలుగా శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హుషారు’. బెక్కెం వేణుగోపాల్, రియాజ్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 14న విడుదలై 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిపిన 50 రోజుల వేడుకలో బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ– ‘‘మా సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఇంత పెద్ద విజయం సాధిస్తుందని నేను ఊహించలేదు. ‘హుషారు’ సినిమా కోసం ఏడాదిన్నర కష్టపడ్డాం. కష్టానికి మంచి ఫలితం వస్తుందనడానికి మా సినిమానే ఓ ఉదాహరణ’’ అన్నారు. ‘‘ఈ సినిమాకు పనిచేసిన ప్రతిరోజూ నా లైఫ్లో ఓ తీపి గుర్తు. ప్రేక్షకులు సినిమాను మళ్లీ మళ్లీ చూసి ఇంత పెద్ద హిట్ ఇచ్చారు’’ అని శ్రీహర్ష కొనుగంటి అన్నారు. తేజ్ కొర్రపాటి, దినేష్, తేజస్ కంచెర్ల, ప్రియా వడ్లమాని, దక్షా నగార్కర్ ఈ విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. -
యాత్ర బుకింగ్లు చూస్తుంటే హ్యాపీ
‘‘యాత్ర’ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వైఎస్ రాజశేఖర రెడ్డిగారి పాదయాత్ర ఎంత సెన్సేషన్ అయిందో ప్రేక్షకులందరికీ తెలుసు. పాదయాత్రలో ఉన్న ఎమోషన్స్, మూమెంట్స్ని తీసుకుని మహి రెడీ చేసిన కథతో విజయ్ ‘యాత్ర’ నిర్మించారు. మమ్ముట్టిలాంటి లెజెండ్ నటించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ చూసినప్పుడు, పాటలు విన్నప్పుడు సినిమా ఎప్పుడు చూస్తామా? అనే ఓ ఎగై్జట్మెంట్ కనిపించింది. మా విజయ్కి, మహికి ఆల్ ది బెస్ట్’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. మహి వి. రాఘవ్ దర్శకత్వంలో శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ‘యాత్ర’ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు ఓవర్సీస్లో ఈ సినిమా ఓపెనింగ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఓపెనింగ్స్ స్ట్రాంగ్గా ఉంటేనే ఆ సినిమాకి రెవెన్యూ పరంగా మంచి మ్యాజిక్ జరుగుతుంది. ఫస్ట్ మంచి ఓపెనింగ్స్ రావాలి.. ఆ తర్వాత మంచి టాక్ రావాలి. ఓ సినిమాకి ఓపెనింగ్స్ అన్నవి ఎప్పుడూ ముఖ్యమే.. కానీ ఇప్పుడు చాలా ముఖ్యం అయిపోయాయి. ఒకప్పుడు సినిమా ఫర్వాలేదు అంటే మెల్లిగా ఓపెనింగ్స్ పెరిగేవి. ఇప్పుడు అలా లేదు.. మంచి ఓపెనింగ్స్ వస్తేనే సినిమా. ‘యాత్ర’ అడ్వాన్స్ బుకింగ్లు చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాని నైజాం, వైజాగ్ ఏరియాల్లో మా సంస్థ విడుదల చేస్తోంది. వైఎస్గారి పాదయాత్ర మూమెంట్స్ని ఆ రోజుల్లో టీవీల్లో చూడటం, పేపర్లో చదవటమే. పాదయాత్రతో ఆయన హీరో అయిపోయారు. దాని తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. జనాలకోసం ఏదైనా చేస్తాను అని పాదయాత్ర ద్వారా చూపించారాయన. ఎన్టీ రామారావుగారి తర్వాత మళ్లీ తెలుగు రాష్ట్రాల ప్రజల్లో వైఎస్గారికే అంత ఇమేజ్ వచ్చింది.అలాంటి ఆయన నేపథ్యంలో వస్తున్న ఈ ‘యాత్ర’ పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. విజయ్ చిల్లా మాట్లాడుతూ– ‘‘యాత్ర’ కోసం ఏడాదిన్నరగా పని చేస్తున్నాం. రేపు విడుదలవుతోందంటే చాలా ఎగై్జటింగ్గా, సంతోషంగా ఉంది. వైఎస్గారు రాజకీయ నేత కావొచ్చు.. సినిమాలో రాజకీయాలు ఉండొచ్చు.. కానీ ఇది పూర్తిగా పొలిటికల్ సినిమా కాదు. ఎటువంటి వివాదాలు లేవు. ఈ సినిమా మొత్తానికి సోల్ అండ్ స్పిరిట్ వైఎస్గారే. సినిమా చూడండి.. నచ్చితే ఇతరులకు చెప్పండి. ఇది కేవలం ఆయన అభిమానులకే కాదు.. సినిమాను ప్రేమించేవారెవరైనా చూసి ఎంజాయ్ చేయొచ్చు’’ అన్నారు. ‘యాత్ర’ సినిమాను ఉద్దేశిస్తూ దర్శకుడు మహి వి. రాఘవ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కథను చెప్పడం చాలా గౌరవంగా భావిస్తున్నా. ఆయన కుటుంబం, అభిమానుల నుంచి మాకు అమితమైన ఆదరణ లభించడం గొప్ప విషయం. చిత్రబృందం చాలా కష్టపడింది. దీన్ని మరో సినిమాతో పోల్చి.. ఓ రేస్లా చేయకండి. వైఎస్సార్ ప్రయాణంలా భావించి సెలబ్రేట్ చేసుకుందాం’. ‘ఎన్టీఆర్, వైఎస్సార్.. ఇద్దరూ ఈ నేలతల్లి బిడ్డలు, తెలుగు జాతి గర్వించదగ్గ నాయకులు. మన భిన్నాభిప్రాయాలు వారిని అగౌరవపర్చడానికి కారణాలు కాకూడదు. నాకు వైఎస్సార్, చిరంజీవిగార్లపై ఉన్న ఇష్టం, అభిమానం ఎప్పటికీ చెరిగిపోదు. మనకు స్ఫూర్తినిచ్చిన వారి సినిమాను సెలబ్రేట్ చేసుకుందాం. అదే మనం వారికిచ్చే గొప్ప నివాళి’. ‘మా ‘యాత్ర’ సినిమాను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో తెలుసుకోవాలని చాలా ఆత్రుతగా ఉంది. నిజాయతీగా మీ స్పందన చెప్పండి. నేను వినయంగా వాటిని స్వీకరిస్తా. ఈసారి ఇంకా మంచి కథతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తా.. ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. -
అలా ఫిక్స్ అయితే బోల్తాపడతాం
‘‘స్క్రిప్ట్ స్టేజ్ నుంచి ప్రతిదీ ప్లాన్డ్గా చేసుకుంటే ప్రతి సినిమా ఆడుతుందనేదే నా నమ్మకం. ఒక్కోసారి స్క్రిప్ట్ వల్ల కావచ్చు.. మరోసారి కాస్టింగ్ కుదరక కూడా మిస్ఫైర్ అవ్వొచ్చు.. ఒక సినిమా ఆడలేదంటే దానికి చాలా కారణా లుంటాయి’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. ఇటీవల ‘ఎఫ్ 2’ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకుని, మరిన్ని సినిమాలను సెట్స్పైకి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్న ఆయన గురువారం హైదరాబాద్లో మీడియాతో పలు విశేషాలు పంచుకున్నారు. ► 2017 ఎంత సక్సెస్ఫుల్గా గడిచిందో, 2019 కూడా అదే స్థాయి సక్సెస్ ఇస్తుందనిపించింది. కొత్త సంవత్సరం ఆరంభంలోనే ‘ఎఫ్ 2’తో ఇంత పెద్ద సక్సెస్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో 2021లో ‘ఎఫ్ 3’ సినిమా ప్లాన్ చేస్తున్నాం. దాదాపు సేమ్ టీమ్ ఉంటుంది. అయితే ఈసారి ముగ్గురు హీరోలు ఉంటారు. ► 2017లో 6 సినిమాలు చేయాలని నేనేమీ అనుకోలేదు, అలా జరిగిపోయింది. అలాగని 2019లో కూడా 6 సినిమాలు చేయాల్సిందే అని ఫిక్సయితే బోల్తా పడే చాన్స్ ఉంది. కాబట్టి దాని గురించి అంత కచ్చితంగా చెప్పలేను. ప్రస్తుతానికి 4, 5 స్టోరీస్ అయితే చాన్సెస్ ఉన్నాయి. ► తమిళ ‘96’ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నాం. నా కెరీర్లో తొలి రీమేక్ ఇది. ఈ సినిమా గురించి మీడియాలో చాలా ఫేక్ న్యూస్లు బయటికి వచ్చాయి. తమిళంలో ఈ సినిమాని తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ తెలుగు రీమేక్కి కూడా దర్శకత్వం వహిస్తారు. హీరోగా శర్వానంద్ కరెక్ట్ అనీ, హీరోయిన్గా సమంత అయితే బాగుంటుందని, వాళ్లే కావాలని ప్రేమ్ అన్నారు. ► ‘96’ చక్కటి ఫీల్ ఉన్న సినిమా. రెండు పాత్రల మధ్య ఒక జెన్యూన్ ఫీల్ని దర్శకుడు ట్రావెల్ చేయించిన విధానం నాకు అద్భుతమనిపించింది. ఈ సినిమాను తెలుగులో కూడా నువ్వే చేయాలని డైరెక్టర్తో చెప్పాను. ‘96’ తమిళంలో క్లాసిక్ సినిమా అనిపించుకుంది. తెలుగులో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. కచ్చితంగా హిట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ► మహేశ్బాబుతో చేస్తున్న ‘మహర్షి’ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తాం. అమెరికా షెడ్యూల్ అప్పుడు వీసా ఆలస్యం కావడంతో సినిమా విడుదలను 5 నుంచి 25కు మార్చడం జరిగింది. నాగచైతన్యతో ఓ సినిమా ఉంటుంది. స్క్రిప్ట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. షూటింగ్ ఎప్పుడు మొదలు పెట్టాలనే చర్చలు జరుగుతున్నాయి. అలాగే ‘పలుకే బంగారమాయెనా’ అనే ప్రాజెక్ట్ కూడా ఉంది. ఈ చిత్రం విడుదలను 2020 సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నాం. ఇవి కాకుండా గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ సినిమా ఉంది. కానీ ముందు అనుకున్న కథతో ఈ సినిమా చేయడం లేదు. -
వరుణ్ తేజ్ కొత్త చిత్రం ప్రారంభం
-
కొత్త చాప్టర్ షురూ
సినిమాల ఎంపికలో వైవిధ్యానికి పెద్దపీట వేస్తుంటారు వరుణ్ తేజ్. విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులకు మరింత చేరువ అవుతున్నారు. వరుణ్ నటించనున్న తాజా చిత్రానికి ‘వాల్మీకి’ అనే పేరును ఖరారు చేశారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించనున్న ఈ సినిమా ఆదివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. రామ్ బొబ్బ కెమెరా స్విచ్చాన్ చేయగా, నటి, వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక కొణిదెల క్లాప్ ఇచ్చారు. దర్శకులు వీవీ వినాయక్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘నా తర్వాతి చిత్రానికి ‘వాల్మీకి’ అనే టైటిల్ ఖరారు చేశాం. కొత్త చాప్టర్ మొదలైంది’’ అని ఈ సందర్భంగా వరుణ్ తేజ్ పేర్కొన్నారు. ‘‘మా ‘వాల్మీకి’ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. డైరెక్టర్ సుకుమార్, నిర్మాత ‘దిల్’ రాజుతో పాటు పలువురు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా. కాగా, తమిళ హిట్ చిత్రం ‘జిగర్తాండ’ కి ‘వాల్మీకి’ తెలుగు రీమేక్ అనే సంగతి తెలిసిందే. -
యాభై.. వందరోజుల వేడుకలు పోయాయి
‘‘ఇప్పటికే మా ‘ఎఫ్ 2’ సినిమా 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం సంతోషం. ఇంకెంత వసూలు చేస్తుందో మాకు తెలీదు. ఇది చాలా గొప్ప విషయం. ఈరోజు నుంచి మరికొన్ని సీన్స్ యాడ్ చేస్తున్నాం. ప్రేక్షకులు కేరింతలు కొట్టే విధంగా ఈ కొత్త సీన్స్ ఉంటాయి’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘ఎఫ్ 2’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్, లక్ష్మణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలై 100కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పడానికి ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘గతంలో 50 రోజులు, 100 రోజుల వేడుకలుండేవి. ఇప్పుడు అవన్నీ పోయి 50 కోట్లు, వందకోట్ల గ్రాస్, షేర్స్ వచ్చాయి. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరికీ మా ‘ఎఫ్2’ చిత్రం వంద కోట్ల గ్రాస్ షీల్డ్స్ని పంపిస్తున్నాం. ఇది మా సినిమాతో స్టార్ట్ చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘వందకోట్ల సినిమా చెయ్యాలన్నది ప్రతి డైరెక్టర్ కల. అది ‘ఎఫ్2’ తో నాకు దక్కినందుకు హ్యాపీ. ప్రేక్షకులు మరింత ఎంజాయ్ చేయడానికి 5 కొత్త సీన్స్ని యాడ్ చేస్తున్నాం. ఈ చిత్ర విజయంలో చాలామంది కష్టం ఉంది’’ అన్నారు అనిల్ రావిపూడి. ‘‘దిల్’ రాజుగారు రిలీజ్ చేసిన ‘హ్యాపీడేస్’ సినిమా నాకు టర్నింగ్ పాయింట్. ఇప్పుడు ‘ఎఫ్ 2’ బిగ్గెస్ట్ హిట్ అవడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు తమన్నా. -
అందరూ నవ్వుతుంటే కన్నీళ్లొచ్చాయ్
‘‘ఈ సంక్రాంతికి ‘ఎఫ్ 2’ని హిట్ కాదు.. సూపర్ హిట్ కాదు.. సూపర్ డూపర్ హిట్ చేశారు. నిజంగా అభిమానుల కళ్లలో ఆ ఆనందం చూసి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నా’’ అని వెంకటేశ్ అన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అన్నది ఉపశీర్షిక. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీశ్, లక్ష్మణ్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 12న విడుదలైంది. శుక్రవారం హైదరాబాద్లో నిర్వహించిన గ్రాండ్ సక్సెస్ మీట్లో వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘పదేళ్ల తర్వాత థియేటర్కి వెళ్లి ప్రేక్షకుల రియాక్షన్ చూసినప్పుడు అక్కడ అందరూ నవ్వుతున్నారు.. కానీ, నాకు మాత్రం కన్నీళ్లు వచ్చాయ్. చాలా రోజుల తర్వాత థియేటర్లో అంత రియాక్షన్ చూసినప్పుడు.. మేమంతా కష్టపడి పనిచేసి ఆ సినిమా మీకు చూపెట్టినప్పుడు మీరు అంత బాగా ఆదరించి ప్రేమ చూపెట్టడం నిజంగా వండ్రఫుల్ ఫీలింగ్. ఇందుకు మనస్ఫూర్తిగా ప్రేక్షకులు, ఫ్యాన్స్కి థ్యాక్స్ చెబుతున్నా. నావి ఎన్నో సినిమాలు సంక్రాంతికి విడుదలయ్యాయి. ‘గణేశ్, ప్రేమించుకుందాం రా... నా బిగినింగ్ సినిమా ‘బొబ్బిలి రాజా నుంచి మొన్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, చంటి, ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు సినిమాలు కానీ, నవ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి... ఇలా ఎన్నో సినిమాలను సూపర్ హిట్ చేశారు. అనిల్ ఈ కథ చెప్పి నన్ను ఒప్పించడం.. చాలా రోజుల తర్వాత మళ్లీ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ సినిమా చేయడం.. ప్రేక్షకులు ఇంత పెద్ద సక్సెస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి వండ్రఫుల్ సినిమా ఇచ్చినందుకు ‘దిల్’ రాజు, శిరీష్, లక్ష్మణ్లకు థ్యాంక్స్. అనిల్ చాలా మంచి ఎనర్జీ ఇచ్చాడు. వరుణ్ టెరిఫిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ సినిమాని కుటుంబంతో కలిసి మళ్లీ మళ్లీ చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ మా సినిమా టైటిల్ని అనిల్ ‘ఎఫ్ 2’ అని అనౌన్స్ చేశాడు. దాని తర్వాత ‘వీ 2’ అని వెంకటేశ్గారు, వరుణ్గారు జాయిన్ అయ్యారు. సినిమా రిలీజ్ రోజు ‘ఈ 2’ అని(ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్) కొందరు మెసేజ్లు పంపించారు. ఫైనల్గా ‘బీ 2’ అని (బొమ్మ బ్లాక్బస్టర్) బిరుదు ఇచ్చేశారు. మా బ్యానర్లో ఇది 31వ సినిమా. ఈ సంక్రాంతికి అద్భుతమైన సినిమా అయినందుకు టీమ్ అంతా చాలా ఎంజాయ్ చేస్తున్నాం.ఈ సక్సెస్ అనిల్ ఒక్కడిదే కాదు.. టెక్నీషియన్స్ అందరిదీ. మీరందరూ ఉన్నారు కాబట్టే ఇంతపెద్ద సక్సెస్ వచ్చింది. ఈ సినిమా హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఇంత పెద్ద హిట్ అవుతుందని నేను కూడా ఊహించలేదు. ఈ క్రెడిట్ మా టీమ్తో పాటు ప్రేక్షకులదే. మిమ్మల్ని కొంచెం నవ్విస్తే చాలు ఆ సినిమాకి బ్రహ్మరథం పడతారని అర్థం అయింది. వెంకటేశ్గారు ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ తో 50కోట్ల క్లబ్లో ఉన్నారు. వరుణ్ ‘ఫిదా’ సినిమాతో 50కోట్ల క్లబ్లో చేరారు. ఇద్దరూ ‘ఎఫ్ 2’ తో 50కోట్ల క్లబ్ దాటేశారు. మా బ్యానర్కి హయ్యస్ట్ ప్రాఫిట్ తెచ్చిన సినిమా ఇదే.. చాలా హ్యాపీ’’ అన్నారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘ఎఫ్ 2’ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు బిగ్ థ్యాంక్స్. ఓ సినిమా చేయాలంటే 100 నుంచి 200 మంది ఎఫర్ట్ ఉంటుంది. మా ‘ఎఫ్ 2’ సినిమాకి ఇంకా ఎక్కువ మంది పనిచేశారు. ఈ సినిమాకి అందరూ చాలా పాజిటివ్ మైండ్సెట్తో పనిచేశారు.. అందరికీ థ్యాంక్స్. నేను నిజంగా కామెడీ అంటే ఇద్దర్నే చూశా. ఒక్కరు చిరంజీవిగారు, రెండోది వెంకటేశ్గారు. వాళ్లను చూసి ఇలా మనం చేయగలుగుతామా? అనిపించేది. వెంకీగారి పక్కన ఎలా చేస్తాం అనే భయం, సిగ్గు ఉండేది. ఆయన ఓ బ్రదర్లా నా పక్కన ఉంటూ సపోర్ట్ చేశారు. వెంకీగారు నిజంగా నా కో బ్రదర్, బెస్ట్ఫ్రెండ్. మీతో పనిచేయడం మరచిపోలేను. వెంకీగార్ని, అనిల్గార్ని, ఈ టీమ్ని మిస్ అవుతున్నందుకు ఎక్కడో ఫీలింగ్ ఉండేది. కానీ, త్వరలోనే ‘ఎఫ్ 3’ సినిమా చేయబోతున్నాం. మీ అభిమాన హీరో ఎవరైనా కావొచ్చు. కానీ, వాళ్లందరికీ నచ్చే కామన్ వ్యక్తి వెంకటేశ్గారు’’ అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘ఈ సంక్రాంతికి ఇంత మంచి సినిమా తీసే అవకాశం ఇచ్చిన మా నిర్మాతలకి థ్యాంక్స్. ప్రతి సినిమా నాకు ఓ ఎత్తు అయితే ఈ సినిమా మరో ఎత్తు. నటీనటులందరూ లైఫ్పెట్టి పనిచేశారు. అందరికీ థ్యాంక్స్. తమన్నా, మెహరీన్ చాలా బాగా నటించారు. దేవిశ్రీగారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. వెంకీ సార్తో కలిసి వరుణ్ చాలా కష్టపడి చేశాడు. మళ్లీ మళ్లీ వరుణ్తో పనిచేయాలనుకుంటున్నా. వెంకటేశ్గారి దెబ్బకి బాక్సాఫీస్ అబ్బ. ఈ చిత్రంలో వెంకీగారు లుంగీ కట్టుకుని డ్యాన్స్ చేస్తుంటే ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ గుర్తొచ్చింది. ఆయనొక లైబ్రరీ. మనం ఏరుకోవడమే. ఆయన ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఈ నవ్వుల్ని మీకు ఇచ్చినందుకు మీరు నవ్వుతూ కలెక్షన్లు ఇచ్చారు. నా లైఫ్లో ఇది నవ్వుల సంక్రాంతి.. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు ప్రేక్షకులకు ఎప్పుడూ రుణపడి ఉంటాం. మా టీమ్ని ఎంతో ఎంకరేజ్ చేసిన మహేశ్బాబుగారికి థ్యాంక్స్. ‘ఎఫ్ 3’ సినిమా కచ్చితంగా ఉంటుంది’’ అన్నారు. నిర్మాతలు శిరీష్, లక్ష్మణ్, కథానాయిక మెహరీన్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, నటీమణులు అన్నపూర్ణ, రజిత, ప్రగతి, అనసూయ, పాటల రచయితలు శ్రీమణి, కాసర్ల శ్యాం తదితరులు పాల్గొన్నారు. -
శర్వా @ త్రీ షేడ్స్!
‘పడి పడి లేచె మనసు’ అంటూ ఈ శుక్రవారం ఓ ప్రేమకథను మన ముందుకు తీసుకువస్తున్న శర్వానంద్ మరో లవ్స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారని సమాచారం. విజయ్ సేతుపతి, త్రిష కాంబినేషన్లో ప్రేమ్కుమార్ తెరకెక్కించిన ఫీల్గుడ్ లవ్స్టోరీ ‘96’. తమిళనాట ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. వెంటనే తెలుగు రీమేక్ హక్కులను ‘దిల్’ రాజు సంపాదించుకున్నారు. ఈ రీమేక్లో శర్వానంద్ హీరోగా నటించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందులో హీరోయిన్గా సమంత నటించనున్నారని టాక్. ఆల్రెడీ శర్వానంద్ ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ వంటి సూపర్హిట్ లవ్స్టోరీలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సుధీర్వర్మతో చేస్తోన్న గ్యాంగ్స్టర్ డ్రామా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఆ తర్వాత ‘96’ రీమేక్ పట్టాలెక్కుతుందట. ఒరిజినల్ వెర్షన్ డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ఈ రీమేక్కు దర్శకుడు. కాగా, తమిళ వెర్షన్లో హీరో ట్రావెల్ ఫొటోగ్రాఫర్. 15 ఏళ్లు, 19 ఏళ్లు, 37 ఏళ్ల వయసుతో మూడు రకాల షేడ్స్లో విజయ్ సేతుపతి కనిపించారు. సో.. రీమేక్లోనూ హీరో పాత్ర అదే పోషించనున్నారు. -
గీతాంజలి, ఫిదాలా హిట్ అవ్వాలి
‘‘తెలుగు ఇండస్ట్రీకి ఎంతో మంది కొత్త నిర్మాతలు వస్తుంటారు. కానీ కొంతమందే సక్సెస్ అవుతున్నారు. అలాంటి వారిలో ‘పడి పడి లేచే మనసు’ నిర్మాత సుధాకర్ ఒకరు అనిపిస్తోంది. తను 14 రీల్స్, మైత్రీ మూవీస్లో చేస్తున్నప్పటి నుంచి ఐదేళ్లుగా నాకు పరిచయం. తొలి సినిమానే శర్వానంద్, హను వంటి మంచి కాంబినేషన్లో నిర్మించడం హ్యాపీ’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. శర్వానంద్, సాయి పల్లవి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పడి పడి లేచె మనసు’. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్ని ‘దిల్’ రాజు రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘హను ఫస్ట్ సినిమా ‘అందాల రాక్షసి’ చాలా మంచి సినిమా. కానీ, ఎందుకు హిట్ అవ్వలేదో తెలీదు. ప్రేమకథలు తీయడంలో మణిరత్నంగారి టేకింగ్ హను సినిమాల్లో కనిపిస్తుంది. ట్రైలర్ చూస్తుంటే ‘పడి పడి లేచె మనసు’తో 100 శాతం హిట్ సాధిస్తాడనే నమ్మకం ఉంది. శర్వానంద్, సాయి పల్లవిల మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. ఈ సినిమా ‘గీతాంజలి, ఫిదా’ సినిమాల్లా హిట్ అవ్వాలి’’ అన్నారు. ‘‘లై’ సినిమా రిజల్ట్ తర్వాత డిప్రెషన్లో ఉన్నా. అలాంటి టైమ్లో శర్వాని కలిసి లవ్స్టోరీ చేద్దామనడంతో ఓకే అన్నాడు. తను చక్కని సపోర్ట్ ఇచ్చాడు. శర్వా, నిర్మాత సుధాకర్ లేకుంటే ఈ సినిమా వచ్చేది కాదు. కోల్కత్తా, నేపాల్లో షూటింగ్ చేశాం. చాలా ఇష్టపడి చేసిన సినిమా ఇది. చాలాకాలం గుర్తుండిపోతుంది’’ అన్నారు హను రాఘవపూడి. ‘‘మా సినిమా టీజర్కి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశాం. సినిమా గురించి ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడతా’’ అని శర్వానంద్ అన్నారు. ‘‘రెండున్నర గంటల పాటు అందర్నీ అలరించే మంచి లవ్ ఎంటర్టైనర్ ఇది’’ అన్నారు నటుడు సునీల్. ఈ కార్యక్రమంలో సుధాకర్ చెరుకూరి, నిర్మాత సునీల్ నారంగ్, నటీనటులు శత్రు, కల్పిక, పాటల రచయిత కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
96 కాదు 99
ఈ ఏడాది తమిళనాట సూపర్ హిట్ సినిమాల్లో ‘96’ ఒకటి. విజయ్ సేతుపతి, త్రిష నటించిన ఈ మ్యాజికల్ లవ్ స్టోరీ వేరే ఇండస్ట్రీల్లోనూ రీమేక్ అవుతోంది. తెలుగులో ఈ చిత్రం హక్కులను నిర్మాత ‘దిల్’ రాజు సొంతం చేసుకున్నారు. ఇప్పుడీ చిత్రం కన్నడంలోనూ రీమేక్ కానుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న మలయాళ నటి భావన ఈ చిత్రం ద్వారా కమ్బ్యాక్ ఇవ్వనున్నారు. గణేశ్, భావన ముఖ్య పాత్రల్లో నటించనున్న ఈ చిత్రానికి ‘99’ అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్టు సమాచారం. -
సంచలనం సృష్టిస్తుందని నమ్ముతున్నాం
రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ముఖ్య తారలుగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘2.ఓ’. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా గత గురువారం (నవంబర్ 29) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తెలుగులో ఈ చిత్రాన్ని ఎన్.వి.ఆర్. సినిమా సంస్థ విడుదల చేసింది. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత ఎన్.వి. ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘2.ఓ’ ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.110 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 21.5 కోట్లు వసూలు చేసి, దిగ్విజయంగా ప్రదర్శింపబడుతోంది. అన్ని ఏరియాల్లో అన్ని థియేటర్స్ హౌస్ఫుల్స్ అవుతున్నాయి. డబ్బింగ్ సినిమా చరిత్రలోనే ‘2.ఓ’ సంచలనం సృష్టిస్తుందని ఆశిస్తున్నాం’’ అన్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘2.ఓ’ చిత్రాన్ని ప్రసాద్గారు, మేము, యు.వి.క్రియేషన్స్ కలిసి తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశాం. ఈ చిత్రాన్ని నేను మూడు సార్లు చూశాను. ఈ మధ్యకాలంలో ఏ సినిమానీ అన్నిసార్లు చూడలేదు. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.21.5 కోట్లు వసూలు చేయడం చాలా సంతోషాన్ని కలిగించింది. శంకర్గారు ఈ సినిమాని విజువల్గా హాలీవుడ్ స్థాయిలో చూపించారు. ఇండియన్ సినిమాలోనే ఇంత భారీ బడ్జెట్ సినిమా ఇంతవరకూ రాలేదు. ‘మహర్షి’ షూటింగ్కి వెళ్లినప్పుడు ‘ఏం తీశారండీ శంకర్గారు. చాలా బాగుంది.. గౌతమ్ మళ్లీ చూడాలంటున్నాడు’ అని మహేశ్బాబుగారు అన్నారు. ఈ మాట వినగానే పిల్లలు ఈ చిత్రాన్ని ఎంతగా ఇష్టపడుతున్నారో అర్థమైంది’’ అన్నారు. -
విద్యా వ్యవస్థలోని వాస్తవాలతో..
‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’ ఫేమ్ నందితా శ్వేత ముఖ్య పాత్రలో చిన్నికృష్ణ తెరకెక్కించనున్న చిత్రం ‘అక్షర’. సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై అహితేజ బెల్లంకొండ, సురేశ్ వర్మ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ముహుర్తం శనివారం జరిగింది. తొలి సన్నివేశానికి పారిశ్రామికవేత్త రఘురామ కృష్ణంరాజు కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత ‘దిల్’ రాజు క్లాప్ ఇచ్చారు. దర్శకుడు సుధీర్ వర్మ గౌరవ దర్శకత్వం వహించారు. హీరోలు కార్తికేయ, విజయ్ రాహుల్, దర్శకుడు కల్యాణ్ కృష్ణ కురసాల స్క్రిప్ట్ని నిర్మాతలకు అందించి, శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా నందితా శ్వేత మాట్లాడుతూ – ‘‘కథ వినగానే బాగా ఎగై్జట్ అయ్యాను. నిర్మాతల ఆలోచనలు నన్ను ఇంప్రెస్ చేశాయి. కథ మీద చాలా నమ్మకంగా ఉన్నాం. చాలా బాధ్యత గల పాత్ర. కొంచెం భయంగా కూడా ఉంది’’ అన్నారు. ‘‘నా కథను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్. ఈ బ్యానర్ని నిలబెట్టే సినిమా అవుతుంది. విద్యా వ్యవస్థలోని వాస్తవాలకు వినోదం జోడించి చెప్పబోతున్నాం. నందితా శ్వేతాతో పాటు 3 ముఖ్యమైన పాత్రలున్నాయి. త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు దర్శకుడు చిన్నికృష్ణ. ‘‘కాన్సెప్ట్ టీజర్కి మంచి స్పందన లభించింది. డిసెంబర్ సెకండ్ వీక్లో షూటింగ్ మొదలుపెట్టి సమ్మర్కి విడుదల ప్లాన్ చేస్తున్నాం. ఆడియన్స్ ఆలోచనలో మార్పు కలిగించే చిత్రం అవుతుంది అనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు అహితేజ, సురేశ్ వర్మ. ఈ చిత్రానికి సంగీతం: సురేశ్ బొబ్బిలి, కెమెరా: జి.శివ, సహనిర్మాత: కె. శ్రీనివాసరెడ్డి. -
మహేష్ మేనల్లుడి సినిమా ప్రారంభం
-
ఆయన మాటలే స్ఫూర్తి
‘‘జీవితంలో మనం చాలా చూస్తుంటాం. గెలుపు, ఓటములు సహజం. అది క్రీడల్లో అయినా, రాజకీయాల్లో అయినా. మా సినిమా వాళ్ల విషయానికి వస్తే సక్సెస్, ఫెయిల్యూర్స్ వచ్చినా సినిమా తీయాలనే ప్యాషన్తో ఇక్కడే ఉంటూ.. సక్సెస్ గురించి ట్రావెల్ అవుతుంటారు’’ అని నిర్మాత ‘దిల్’రాజు అన్నారు. రామ్ హీరోగా, అనుపమా పరమేశ్వరన్, ప్రణీత హీరోయిన్స్గా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమా దసరా కానుకగా ఈనెల 18న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ‘దిల్’రాజు మాట్లాడుతూ– ‘‘స్రవంతి’ రవికిషోర్గారు 30 ఏళ్లుగా సినిమాలు తీస్తూనే ఉన్నారు. 2002 ఫిబ్రవరి 16న ‘అమృత’ సినిమాని విడుదల చేయడానికి తీసుకున్నాం. ‘తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద ప్రొడ్యూసర్గా నిన్ను చూస్తాను’ అని రవికిషోర్గారు అనడంతో సోప్ వేస్తున్నాడనుకున్నాను. ‘బొమ్మరిల్లు’ సక్సెస్మీట్లో ఆయన గుర్తు చేసే వరకు నాకు గుర్తుకులేదు. నాలో ఏం చూసి ఆయన ఆ మాట అన్నారో తెలియదు. ఇప్పుడు ఏ సినిమా అయినా సక్సెస్ కాకపోతే.. ‘సక్సెస్, ఫెయిల్యూర్ కామన్. మనం ముందుకెళుతుండాలి’ అని ఆయన చెప్పిన మాటలను నేను స్ఫూర్తిగా తీసుకుంటాను. ఆయనకు థ్యాంక్స్. ప్రసన్న చెప్పిన కథలోని ఓ పాయింట్కి నేను, రామ్, దేవిశ్రీ ప్రసాద్, ప్రకాశ్రాజ్గారు కనెక్ట్ అయ్యాం. ఇది హిలేరియస్ మూవీ.. ఓ అద్భుతమైన పాయింట్ని సినిమాలో చూస్తారు’’ అన్నారు. ‘‘రాజుగారి లైఫ్లో ప్రేమకథలు ఉన్నాయో లేదో కానీ ప్రతి సినిమాను ఎంతగానో ప్రేమించేస్తారు. త్రినాథరావుగారితో పనిచేయడం చాలా కష్టం. ఎందుకంటే ఆయన ముందు ప్రేక్షకుడు, ఆ తర్వాతే డైరెక్టర్. ప్రకాశ్రాజ్గారితో పనిచేయడం గౌరవంగా ఉంటుంది’’ అన్నారు రామ్. ‘‘104 డిగ్రీల జ్వరం ఉన్నా రామ్ అద్భుతంగా డ్యాన్స్ చేశాడు. రామ్, ప్రకాశ్రాజ్గారు పాటను చాలా చక్కగా పాడారు’’ అన్నారు త్రినాథరావు నక్కిన. ‘‘మా సినిమా పాటలను హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్. అనుపమా పరమేశ్వరన్, నిర్మాతలు శిరీష్, లక్ష్మణ్, పాటల రచయిత శ్రీమణి, నటుడు ప్రవీణ్, రచయిత ప్రసన్నకుమార్, సాయికృష్ణ పాల్గొన్నారు. -
మరో టూర్కి సిద్ధం
ప్రాగ్ వెళ్లి వచ్చిన తోడల్లుళ్లు తర్వాత ఎక్కడికి వెళ్లాలో డిసైడ్ అయ్యారు. మరి ఈసారి డ్యూయెట్ పాడతారో ఏదైనా ముఖ్యమైన సన్నివేశాల కోసమో అన్నది తెలియాల్సి ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్ 2’. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అనేది ఉపశీర్షిక. తమన్నా, మెహరీన్ కథానాయికలు. ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ బ్యాంకాక్లో జరగనుందన్న సంగతి తెలిసిందే. ఈ నెల 15న ఈ షెడ్యూల్ స్టార్ట్ కానుందని సమాచారం. ఈ షెడ్యూల్తో సినిమా చిత్రీకరణ 50 శాతానికి పైగా పూర్తవుతుందని టాక్. ఆ తర్వాత లాస్ట్ షెడ్యూల్ను హైదరాబాద్లో ప్లాన్ చేశారట. మొత్తం షూటింగ్ను నవంబర్ నెలలో పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఇందులో వెంకీ, వరుణ్ తోడల్లుళ్లుగా, తమన్నా, మెహరీన్ అక్కా చెల్లెళ్లుగా కనిపించనున్నారు. సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
ప్రేక్షకులకు ఆ పట్టింపులు లేవు
‘‘బెక్కెం వేణుగోపాల్ నా వద్దకు వచ్చి సినిమా తీస్తున్నానని చెప్పగానే నవ్వాను. ఏదో విషయం ఉంటే తప్ప సినిమాలు ఆడటం లేదని చెప్పాను. ఎకానమీ బడ్జెట్లో తీస్తున్నానని చెప్పడంతో సరే అని చెప్పా’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. తేజస్ కంచెర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ చుంచు, దినేష్ తేజ్, రాహుల్ రామకృష్ణ, దక్ష నాగార్కర్, ప్రియ వడ్లమాని, హేమ ఇంగ్లి, రమ్య, అప్పాజీ, ప్రమోదిని ముఖ్య తారలుగా శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హుషారు’. లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ నిర్మించారు. ఈ చిత్రంలో భాస్కరభట్ల రాసిన ‘నానానా’ అనే పాటను ‘దిల్’ రాజు విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘నేను మంచి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ, వీళ్లేమో నన్ను పిలిచి పాటను విడుదల చేయమన్నారు. భవిష్యత్తులో వీళ్ల దారికే నేను రావాల్సి ఉంటుందేమో. ప్రేక్షకులిప్పుుడు మంచీ, చెడు ఆలోచించడం లేదు. ఎంటర్టైన్ అయ్యామా? లేదా? అని చూస్తున్నారు. అంతేగానీ లిప్లాక్లున్నాయా, ఇంకోటున్నాయా? అనే పట్టింపులు లేవు’’ అన్నారు. ‘‘శ్రీహర్ష చెప్పిన ‘హుషారు’ కథ నచ్చడంతో సినిమా మొదలుపెట్టి, పూర్తి చేశాం. సినిమా బాగా వచ్చింది. ‘అర్జున్రెడ్డి’ తర్వాత రథన్ సంగీతం అందించిన సినిమా ఇది. తేజస్ మినహా అందరూ కొత్తవారే అయినా బాగా చేశారు’’ అన్నారు బెక్కెం వేణుగోపాల్. ‘‘ఈ రోజుల్లో లైఫ్కి గ్యారంటీ లేదు. ప్రతి సెకనూ హ్యాపీగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారనే కథతో తెరకెక్కించిన చిత్రమిది’’ అన్నారు శ్రీహర్ష. అసోసియేట్ నిర్మాతలు లింగా శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, సంగీత దర్శకుడు రథన్, భాస్కరభట్ల, తేజస్, అభినవ్, ప్రియా వడ్లమాని, తేజ పాల్గొన్నారు. -
తొంభయ్యారు.. తెలుగుకి తయారు
సినిమా విడుదలై విజయం సాధించిన తర్వాత ఇతర భాషల్లో రీమేక్ అవ్వడం సహజం. కానీ తమిళంలో ఇంకా రిలీజ్ కాని ‘96’ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత, నిర్మాత ‘దిల్’ రాజు తెలిపారు. విజయ్ సేతుపతి, త్రిష జంటగా సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ప్రేమ కథాచిత్రం ‘96’. ఈ చిత్రం అక్టోబర్ 4న విడుదల కానుంది. ఇందులో ఫొటోగ్రాఫర్ పాత్రలో విజయ్సేతుపతి, టీచర్ పాత్రలో త్రిష కనిపిస్తారట. ఆల్రెడీ ఈ సినిమాను చూసి, రీమేక్ రైట్స్ దక్కించుకున్నారు ‘దిల్’ రాజు. దీంతో తెలుగు రీమేక్లో ఎవరు నటిస్తారు? అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. నాని, సమంత పేర్లు తెరపైకి వచ్చాయి. ‘‘తమిళంలో అక్టోబర్ 4న విడుదల కాబోతున్న ‘96’ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నాం. నటీనటులను ఇంకా ఫైనలైజ్ చేయలేదు. త్వరలో పూర్తి వివరాలను వెల్లడిస్తాం’’ అని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ అధికారిక ట్వీటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. మరి... ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ప్రేమికులు ఎవరో తెలియాలంటే కొంతకాలం వేచి ఉండక తప్పదు. -
ప్రేమ ప్రదక్షణలు
ప్రేయసి కోసం ఓ కాలేజీ చుట్టూ ప్రేమ ప్రదక్షణలు చేస్తున్నారు హీరో రామ్. మరి... ఆయన ప్రేమ ఫలించడానికి ఈ ప్రదక్షణలు, వెయిటింగ్లు ఏ మాత్రం సాయం చేసాయన్నది సిల్వర్ స్క్రీన్పై తెలుస్తుంది. రామ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా ‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న సినిమా ‘హలో గురు ప్రేమకోసమే..’. ఇందులో అనుపమా పరమేశ్వరన్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అనుపమ పాత్ర పోషిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం సినిమాలో కీలకమైన కాలేజీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అలాగే కొన్ని నైట్ సీన్స్ను కూడా కెమెరాలో బంధిస్తున్నారు చిత్రబృందం. బావ–మరదళ్ల బ్యాక్డ్రాప్లో ఈ సినిమా ఉంటుందట. రామ్ మామయ్య పాత్రలో ప్రకాశ్రాజ్ కనిపిస్తారు. టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబర్ 18న రిలీజ్ కానుంది. -
టైటిల్లో ప్లస్ ఏంటి?
సాయి శ్రీనివాస్, దీక్షా శర్మ జంటగా శరత్ నర్వాడే దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘శుభలేఖ+లు’. ప్రియా వడ్లమాని, వంశీ నెక్కంటి, మోనా బేద్రే ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. హనుమా తెలుగు మూవీస్ పతాకంపై సి.విద్యాసాగర్, ఆర్.ఆర్. జనార్ధన్ నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ను నిర్మాత ‘దిల్’ రాజు హైదరాబాద్లో విడుదల చేశారు. దర్శకుడు శరత్ నర్వాడే మాట్లాడుతూ– ‘‘శుభలేఖ+లు’ డిఫరెంట్ సినిమా అని చెప్పను కానీ, మన ఇంట్లో చూసిన కథలానే ఉంటుంది. టైటిల్లో ప్లస్ గురించి చాలా మంది అడిగారు. ఒక పెళ్లి వల్ల కొందరి లవ్స్టోరీస్కి క్లియరెన్స్ వచ్చి మరో రెండు జంటలు పెళ్లికి సిద్ధమవుతాయి. అందుకే టైటిల్ అలా పెట్టాం’’ అన్నారు. ‘‘ఎప్పటి నుంచో సినిమా చేయాలనే ఆసక్తి ఉండేది. ఈ చిత్రం ఎంత గొప్పగా ఉంటుందో ఇప్పుడే చెప్పను. సినిమా సక్సెస్ తర్వాత మాట్లాడతా’’ అన్నారు జనార్ధన్. ‘‘నా హృదయానికి దగ్గరైన సినిమా ఇది. శరత్గారు హార్ట్ టచింగ్గా తెరకెక్కించారు’’ అన్నారు సాయి శ్రీనివాస్. దీక్షా శర్మ, రచయిత విస్సు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కేఎమ్ రాధాకృష్ణన్, కెమెరా: మురళీమోహన్ రెడ్డి. -
గుమ్మడికాయ కొట్టగానే కొబ్బరికాయ
‘సమ్మోహనం’ హిట్ తర్వాత సుధీర్బాబు హీరోగా నటించి, నిర్మించిన ‘నన్ను దోచుకుందువటే’కి ఇటీవలే గుమ్మడికాయ కొట్టారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగానే మరో చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు. సుధీర్ బాబు, మెహరీన్ జంటగా పులి వాసు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రిజ్వాన్ నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత ‘దిల్’ రాజు క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వీవీ వినాయక్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం వస్తున్న చిత్రాలకు భిన్నంగా, వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమా రూపొందనుందని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. రాజేంద్ర ప్రసాద్, నరేష్ వీకే, పోసాని కృష్ణమురళి, ప్రగతి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత: ఖుర్షీద్ (ఖుషి), సంగీతం: ఎస్ఎస్ తమన్, కెమెరా: పి.వి శంకర్. -
ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందనుకుంటున్నా
‘‘పెళ్లి నేపథ్యంలో చాలా సినిమాలు, పాటలు వచ్చాయి. ఇప్పుడు మా ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రంలో ప్రత్యేకత ఏమై ఉంటుందని ఆడియన్స్ ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ థియేటర్లో సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకులు ఓ కొత్త అనుభూతిని ఇంటికి తీసుకెళ్తారని నమ్మకంతో చెప్పగలం’’ అన్నారు ‘దిల్’ రాజు. నితిన్ హీరోగా ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘శ్రీనివాస కల్యాణం’. రాశీఖన్నా, నందితా శ్వేత కథానాయికలుగా నటించారు. ‘దిల్’ రాజు, శిరీశ్, లక్ష్మణ్ నిర్మించారు. జయసుధ, సీనియర్ నరేశ్, రాజేంద్రప్రసాద్, ప్రకాశ్రాజ్ తదితరులు నటించిన ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రాన్ని వచ్చే నెల 9న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు పాత్రికేయులతో మాట్లాడుతూ– ‘‘పన్నెండేళ్ల క్రితం ఆగస్టు 9న విడుదలైన ‘బొమ్మరిల్లు’ చిత్రం మా బ్యానర్లో ల్యాండ్ మార్క్గా నిలిచింది. ఇప్పుడు అదే రోజున ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. లక్కీగా ప్రస్తుతం మా బ్యానర్లో సినిమా చేస్తోన్న మహేశ్బాబు బర్త్డే కూడా అదే రోజు. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ చిత్రాన్ని రిలీజ్ చేసిన మే 9న ‘మహానటి’ సినిమాను నిర్మాత అశ్వనీదత్గారు రిలీజ్ చేసి హిట్ కొట్టారు. మా ‘బొమ్మరిల్లు’ విడుదలైన ఆగస్టు 9న ‘శ్రీనివాసకళ్యాణం’ చిత్రం విడుదల చేస్తున్నాం. అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందన్న నమ్మకం ఉంది. ‘దిల్’ తర్వాత నితిన్తో ‘శ్రీనివాసకళ్యాణం’ లాంటి సినిమా చేయడానికే ఈ గ్యాప్ వచ్చిందని అనుకుంటున్నాను. స్క్రిప్ట్కు కాస్త టైమ్ పట్టినప్పటికీ షూటింగ్ తొందరగా పూర్తి చేశాం. ఆల్రెడీ రిలీజ్ చేసిన సాంగ్స్కు మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘ నా లైఫ్లో జరిగిన సంఘటనలు ప్రతి కుటుంబంలో జరుగుతాయి. నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు కూడా ఈ సినిమాకు తోడయ్యాయి. తల్లిదండ్రులు వారి పిల్లలకు పెళ్లి చేయాలనుకున్నప్పుడు కొన్ని విషయాలనైనా మా సినిమా నుంచి తీసుకుంటారన్న నమ్మకం ఉంది. పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయిలు, అబ్బాయిలు ‘శ్రీనివాసకళ్యాణం’ లా పెళ్లి జరిగితే బాగుండు అనుకుంటారు. మా బ్యానర్లో ‘బొమ్మరిల్లు, శతమానం భవతి’ తర్వాత వస్తోన్న అటువంటి సినిమా ‘శ్రీనివాస కళ్యాణం’. వెంకటేశ్వర స్వామి మాతో ఈ సినిమా చేయించాడని అనుకుంటున్నాను’’ అన్నారు. -
పెళ్లి జరుగుతున్న ఫీల్ని కలిగిస్తుంది
‘‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా అనుకున్న టైమ్కి పూర్తవడానికి నటీనటులు, టెక్నీషియన్స్ కృషి ఎంతో ఉంది. నితిన్ అన్నట్లు.. నేను ఈ సినిమా కోసం ఆల్మోస్ట్ అసిస్టెంట్లాగానే పనిచేశా’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. నితిన్ హీరోగా, రాశీఖన్నా, నందితా శ్వేత హీరోయిన్లుగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు, శిరీష్, లక్ష్మణ్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 9న విడుదలకానుంది. మిక్కీ జె.మేయర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘శతమానం భవతి’ తర్వాత పెళ్లి కాన్సెప్ట్తో సినిమా చేద్దామనుకుంటున్నా అని సతీష్ చెప్పాడు. ‘నేను లోకల్’ సినిమా రిలీజ్ తర్వాత తిరుపతికి వెళ్లా. ‘శ్రీనివాస కళ్యాణం’ టైటిల్ పెట్టినప్పుటి నుంచే ఏదో వైబ్రేషన్. నాకే ఐడియాలు వచ్చాయి. ఏడుకొండల స్వామి దర్శనం వద్ద ఈ కథ తయారయింది. నా కూతురి పెళ్లి చేశా.. మనవడు పుట్టినప్పుడు ఆనంద పడ్డా. నా భార్య చనిపోయినప్పుడు బాధపడ్డా. ఈ మూడు ఇన్సిడెంట్లు నా లైఫ్లో జరిగాయి. దీన్ని సతీష్తో షేర్ చేసుకుంటే ఈ చిత్రం కథకి రౌండప్ అయింది. ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండే ఎమోషనల్ మూమెంట్సే ఈ సినిమా. ఇందులో పెళ్లి గురించి అద్భుతంగా చెప్పినా, సినిమా చూసిన తర్వాత ఆయా పాత్రల్లో నటించిన వారిని హృదయంలో పెట్టుకుని వెళతారు. ఈ సినిమా చూస్తే మీ ఇంట్లో ఓ పెళ్లి జరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ‘శ్రీనివాస కళ్యాణం’ ఎంత గొప్ప సినిమా అవుతుందనేది ఆగస్టు 9న తెలుస్తుంది. కానీ, ఓ మంచి సినిమా చేశామని కాన్ఫిడెంట్గా ఉన్నాం. ‘దిల్’ తర్వాత నితిన్తో సినిమా అనుకున్నా కుదరలేదు. నితిన్ ఫ్లాప్స్లో ఉన్నప్పుడు ఒక్కసారి ఇంటికొచ్చి.. అంకుల్.. నాకు ఓ సినిమా కావాలన్నప్పుడూ కుదరలేదు. అవన్నీ ఎందుకు కుదరలేదు అంటే ఈ ‘శ్రీనివాస కళ్యాణం’ చేయాలని ఉంది కాబట్టే. అది మనకెవ్వరికీ తెలీదు. భగవంతుడు ఇవన్నీ డిజైన్ చేసి పెడతాడు’’ అన్నారు. నితిన్ మాట్లాడుతూ–‘‘నా లైఫ్లో ‘శ్రీనివాస కళ్యాణం’ బ్యూటిఫుల్ మెమొరీ. ‘అ ఆ’ తర్వాత మిక్కీ ఈ చిత్రానికి మంచి పాటలిచ్చాడు. ఇందులో ‘కల్యాణం వైభోగం’ పాట నా సినిమాల్లో టాప్ 3లో ఉంటుంది. ప్రతి పెళ్లిలోనూ ఈ పాట మార్మోగుతుంది. రాజుగారి గురించి నటుల్లో నాకంటే ఎక్కువ ఎవరికీ తెలీదు. ఆయన ఫస్ట్ సినిమా ‘దిల్’ హీరో నేనే కాబట్టి. ‘దిల్’ షూటింగ్ లేకున్నా రాజుగారు పొద్దునే ఆఫీసుకి వెళ్లిపోయి రేపటి సీన్స్ గురించి ఆలోచించేవారు. ‘ఫస్ట్ సినిమాకి వీడికి ఎందుకంత బిల్డప్’ అనుకునేవారు. ‘దిల్’ చిత్రంలో ‘మై నేమ్ ఈజ్ రాజు అంటే.. ఎందుకంత ఫోజు’ అంటాను. ఈ డైలాగ్ కావాలనే సరదాగా పెట్టాం. ఆ సినిమా హిట్ అయింది. మళ్లీ మేం చేయాలనుకున్నా సెట్కాలేదు. ‘శ్రీనివాస కళ్యాణం’తో కుదిరింది. ఇన్నేళ్ల తర్వాత కూడా రాజుగారి క్రమశిక్షణ చూసి నేను షాక్ అయ్యా. ‘దిల్’ టైమ్లో ఆయనది ఓవరాక్షన్ అనుకునే వారు. కానీ, అది ఆయన ప్యాషన్. అందుకే ఎవరి సపోర్ట్ లేకుండా ఇంత సక్సెస్ అయ్యారు. ఈ సినిమా కోసం ఆయన అసిస్టెంట్లాగా పనిచేశారు. నా సినీ కెరీర్ అయిపోయాక చూస్కుంటే టాప్ 1,2 స్థానాల్లో ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు. ‘‘యుగాలు మారినా, దేవుడు ఏ అవతారం ఎత్తినా.. పెళ్లి గొప్పదనం గురించి చెబుతూనే ఉన్నాడు. అలా చెప్పాలని చేసిన ప్రయత్నమే ‘శ్రీనివాస కళ్యాణం’. ఈ రోజుల్లో పెళ్లి ఈవెంట్గా మారిపోయింది. కానీ, అది బ్యూటిఫుల్ మూమెంట్. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు స్ఫూర్తి పొందుతారని నమ్ముతున్నా’’ అన్నారు సతీష్ వేగేశ్న. ‘‘సమాజానికి విలువలున్న సినిమాలను ఇస్తూ గుర్తింపు పొందుతున్న మంచి సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. అందుకే రాజు అంటే నాకు ఇష్టం’’ అన్నారు నటుడు ప్రకాశ్ రాజ్. ‘‘నా 41ఏళ్ల సినీ జీవితంలో ఎన్నోరకాల ఫంక్షన్స్ చూశా. నా జీవితంలో ఎప్పుడూ ఫ్యామిలీతో సినీ ఫంక్షన్కి వెళ్లలేదంటే మీరందరూ నమ్మి తీరాలి. కానీ, ఈ రోజు కుటుంబంతో సహా వచ్చానంటే ముఖ్య కారణం ‘శ్రీనివాస కళ్యాణం’. ‘లేడీస్ టైలర్’, ‘అహనా పెళ్లంట’ సినిమాలు హిట్ అయ్యాక నాకు భయం వేసింది. ఇక ఎలాంటి సినిమాలు తీయాలని. ‘శతమానం భవతి’ వంటి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న సతీష్ రెండో సినిమా ఏం తీస్తాడులే అనుకున్నవారికి ‘శ్రీనివాస కళ్యాణం’ చూస్తే తెలుస్తుంది. మా డాడీ రామానాయుడిగారి తర్వాత హ్యాట్సాఫ్ టు ‘దిల్’ రాజు. సినిమా అతని శ్వాస. ఇండస్ట్రీ, నాలాంటి నటీనటులు నాలుగు కాలాలపాటు బాగుండాలంటే రాజులాంటి వ్యక్తి ఉండాలి’’ అన్నారు నటుడు రాజేంద్రప్రసాద్. ‘‘నరేశ్, నేను తొలిసారి ‘పండంటి కాపురం’ లో నటించాం. అది విడుదలై శనివారంతో 46 ఏళ్లు అయింది. ఈ జర్నీలో ఎన్నో పాత్రలు చేశా. బహుశా రామానాయుడుగారి తర్వాత ‘ఆల్ ఇట్స్ ది వే ‘దిల్’ రాజుగారే అనుకుంటున్నా’’ అని జయసుధ అన్నారు. నిర్మాతలు సుధాకర్ రెడ్డి, శిరీష్, లక్ష్మణ్, హర్షిత్ రెడ్డి, రాశీఖన్నా, నందిత శ్వేత, మిక్కీ జె. మేయర్, కెమెరామేన్ సమీర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
2020లో ఆ ప్లాన్ ఉంది
‘‘చిన్న సినిమా తీయాలంటే భయం వేస్తోంది. ఎందుకంటే ఆడకపోతే మొత్తం పోతుంది. ఆడియన్స్ను థియేటర్స్కు తీసుకురావాలంటే వాళ్లకు ఏదో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. పెట్టిన డబ్బుతో చిన్న సినిమాను సక్సెస్ చేసి, తిరిగి డబ్బు తెచ్చుకోవడం కష్టమైపోయింది. గతేడాది మిడిల్ రేంజ్ హీరోలతో నాలుగు సినిమాలు తీశాను. రైట్ కంటెంట్తో రైట్ సినిమా తీస్తే సినిమా హిట్ అవుతుందని గతేడాది ప్రూవ్ అయ్యింది’’ అన్నారు ‘దిల్’ రాజు. రాజ్తరుణ్, రిద్ధి కుమార్ జంటగా అనీష్కృష్ణ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మాణ సారథ్యంలో శిరీష్ సమర్పణలో హర్షిత్ నిర్మించిన సినిమా ‘లవర్’. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు చెప్పిన సంగతలు... ► అనీష్ దర్శకత్వం వహించిన ‘అలా ఎలా?’ చూశాను. బాగుందనిపించింది. ఆ తర్వాత 2016లో అనీష్ ఓ స్టోరీలైన్ చెప్పాడు. గతేడాది ఆరు సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా కుదరలేదు. సేమ్టైమ్ నాలుగేళ్లుగా ప్రాజెక్ట్స్ చూసుకుంటున్న హర్షిత్ కూడా తనకు ఓ సినిమాను అప్పజెప్పమని అడిగాడు. ఎందుకో ఈ సినిమా ఇవ్వాలనిపించింది. మ్యూజిక్ సమ్థింగ్ డిఫరెంట్గా ఉండాలి, ఒక్కో పాటను ఒక్కో బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్తో చేయిస్తానని హర్షిత్ అన్నప్పుడు షాకయ్యాను. కానీ ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్కు మంచి స్పందన లభిస్తుంది. సినిమా చూసిన వారందరూ క్లైమాక్స్ బాగుందని చెబుతున్నారు. ఆ రోజు హర్షిత్ అడిగిన వాటికి వంద శాతం పాసయ్యాడు. కానీ ఈ సినిమా బడ్జెట్ ముందుగా అనుకున్నట్లు 5 కోట్లు కాక, దాదాపు 8 కోట్లకు చేరుకుంది. లక్కీగా ఈ రోజుల్లో శాటిలైట్, హిందీ డబ్బింగ్ అంటూ ఇలా మార్కెట్ కూడా పెరిగింది. ఇది మంచి విషయం. ► ఫ్యామిలీ ఎమోషన్స్కు దూరమైన ఓ అనాథ కుర్రాడు, తన వారసులకు ఆ సమస్య రాకూడదని ఆలోచిస్తాడు. అలాగే తాను ప్రేమించిన అమ్మాయి తనకు అద్భుతమైన లైఫ్ ఇవ్వాలని కోరుకుంటాడు. అతని ప్రయాణంలో జరిగిన సంఘటనలే ‘లవర్’ చిత్రం. ► రెగ్యులర్ సినిమాలే ఇండస్ట్రీలో వస్తాయన్న కామెంట్స్ వినిపిస్తుంటాయి. కొత్త సినిమాలు తీయాలని నాకూ ఉంటుంది. కానీ ఫ్యామిలీ అండ్ యూత్ జానర్పై నాకు గ్రిప్ ఉంది. అందుకే షిఫ్ట్ అవ్వను. అలా కాకుండా కాస్త బయటికి వెళ్లినప్పుడు ఎకానమీ పరంగా ఆలోచించాల్సి వస్తుంది. ఎక్కడ పెడుతున్నాం? ఎంత వస్తుంది అని ఆలోచించాల్సిందే. ► మా బ్రదర్ వాళ్ల అబ్బాయిని హీరోగా పరిచయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. నో డౌట్.. తన ఫస్ట్ సినిమా ‘దిల్’ రాజు సినిమానే. టైటిల్ ‘పలుకే బంగారమాయెనా’ అనుకుంటున్నాం. కథ రెడీ అవుతోంది. పక్కా నా స్టైల్ సినిమానే. ► డెహ్రాడూన్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన తర్వాత మహేశ్బాబు సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ హైదరాబాద్లో ప్లాన్ చేస్తున్నాం. ఇంద్రగంటితో ఓ మల్టీస్టారర్ సినిమా ఉంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘దాగుడుమూతలు’ అనుకున్నాం. వర్క్ జరుగుతోంది. ఈ స్క్రిప్ట్ చేస్తామా? లేక వేరే చేస్తామా? అనేది ఓ పది రోజుల్లో తెలుస్తుంది. గల్లా అశోక్ సినిమా స్క్రిప్ట్ ఫైనలైజ్ అయ్యింది. అక్టోబర్ లేదా సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది. ► ఇక సినిమాల రిలీజ్ విషయానికొస్తే... నితిన్ ‘శ్రీనివాస కల్యాణం’ చిత్రాన్ని ఆగస్టు 9న విడుదల చేస్తాం. వెంకటేశ్, వరుణ్తేజ్ మల్టీస్టారర్ ‘ఎఫ్ 2’ని సంక్రాంతికి రిలీజ్ అనుకుంటున్నాం. రామ్ హీరోగా ‘çహలో గురు ప్రేమకోసమే’ చిత్రాన్ని అక్టోబర్ 18న విడుదల చేస్తాం. మహేశ్ సినిమా ఏప్రిల్ 5న విడుదల అవుతుంది. మా ప్రొడక్షన్ హౌస్ ఓన్లీ టాలీవుడ్కే పరిమితం కాదు. 2020లో బాలీవుడ్లో ఓ సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నాం. నా విషయానికొస్తే... నో యాక్టింగ్ నో డైరెక్షన్. ఈ రెండు విషయాల్లో క్లారిటీ ఉంది. -
నెర్వస్గా ఫీల్ అవుతున్నా
‘‘ఇప్పటి వరకు మా బ్యానర్లో 27 సినిమాలు వచ్చాయి. అందులో 22 సక్సెస్ అయ్యాయి. మిగిలిన 5 కూడా వర్కౌట్ అయ్యాయి. ‘లవర్’ చిన్న సినిమాగా వస్తున్నా పెద్ద సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నా’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. రాజ్ తరుణ్, రిద్ధి కుమార్ జంటగా ‘అలా ఎలా’ ఫేమ్ అనీశ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవర్’. ‘దిల్’ రాజు నిర్మాణ సారథ్యంలో హర్షిత్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం అందించిన అంకిత్ తివారి, తనీశ్, సాయి కార్తీక్, జె.బిలు ‘లవర్’ ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రం లుక్స్, టీజర్, సాంగ్స్ బావున్నాయి. హర్షిత్ ఫస్ట్ సినిమా. నా ఫస్ట్ సినిమా కంటే నెర్వస్గా ఫీల్ అవుతున్నా. అందరూ హార్డ్ వర్క్ చేసి మంచి అవుట్పుట్ ఇచ్చారు’’ అన్నారు. ‘‘మా చిత్రం పెద్ద సక్సెస్ అవుందని భావిస్తున్నా’’ అన్నారు రాజ్ తరుణ్. ‘‘తెలుగులో నా మొదటి చిత్రమిది’’ అన్నారు రిద్ధి కుమార్. ‘‘సోలో నిర్మాతగా నా ఫస్ట్ సినిమా ఇది’’ అన్నారు హర్షిత్ రెడ్డి. ‘‘అలా ఎలా’ చిత్రం తర్వాత ‘లవర్’ కి మూడేళ్లు గ్యాప్ వచ్చింది. త్వరగా చేసి ఉంటే మా నాన్నగారు ఈ సినిమా చూసేవారు. ప్రస్తుతం ఆయన లేరు’’ అన్నారు అనీశ్ కృష్ణ. -
ముహూర్తం కుదిరింది
రీసెంట్గా మూడు పదుల వయసులోకి అడుగుపెట్టిన హీరో నితిన్ పెళ్లి చేసుకున్నారు. కాస్త ఆగి మీ ఆలోచనలకు అడ్డుకట్ట వేయండి. ఆయన పెళ్లి చేసుకున్నది రియల్ లైఫ్లో కాదు రీల్ లైఫ్లో. నితిన్ హీరోగా ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘శ్రీనివాస కల్యాణం’ రిలీజ్కు ముహూర్తం కుదిరింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 9న విడుదల కానుంది. ఇందులో రాశీఖన్నా, నందితా శ్వేతా కథానాయికలుగా నటించారు. ‘‘ఒక సాంగ్, ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తయింది. దాదాపు 12 సంవత్సరాల క్రితం మా బ్యానర్లో ‘బొమ్మరిల్లు’ విడుదలైన ఆగస్టు 9న ఇప్పుడు మళ్లీ ‘శ్రీనివాస కల్యాణం’ ప్రేక్షకుల ముందుకు రానుంది. మళ్లీ అదే రోజున అదే స్థాయి విజయాన్ని ‘శ్రీనివాస కల్యాణం’ చిత్రంతో అందుకోవాలని ప్రయత్నిస్తున్నాం’’ అన్నారు ‘దిల్’ రాజు. -
కంటెంట్ని నమ్మి ఇంత దూరం వచ్చాం
‘‘ఆరు బంతులకి ఆరు సిక్స్ (వరుసగా 6 చిత్రాల హిట్స్ని ఉద్దేశించి)లు కొట్టిన బ్యాట్స్మెన్ తర్వాతి బాల్కి ఎలా నెర్వస్గా ఫీల్ అవుతాడో నా పరిస్థితి అలా ఉంది. ‘అలా ఎలా’ సినిమాని ఫ్యామిలీ అంతా కలసి బాగా ఎంజాయ్ చేశాం. ఈ సినిమాని కూడా ‘అలా ఎలా’లానే ఎంటర్టైనింగ్ వేలో చేశాడు అనీష్’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. రాజ్ తరుణ్, రిద్ధి కుమార్ జంటగా నటించిన చిత్రం ‘లవర్’. అనీష్ కృష్ణ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించారు. ఈ సినిమా ఆడియో రిలీజ్ హైదరాబాద్లో జరిగింది. ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘సోలోగా సినిమా చేస్తాను.. నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను అని హర్షిత్ (‘దిల్’ రాజు అన్న కొడుకు) అనడం మొదలుపెట్టాడు. ఇన్నేళ్లుగా శిరీష్, నేను ట్రావెల్ అవుతున్నాం. కంటెంట్ని నమ్మి ఇంత దూరం వచ్చాం. నేను బిగినింగ్ డేస్లో ఏం చేశానో హర్షిత్ అలానే చేశాడు. ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాడు. గతేడాది నుంచి మాకు వస్తున్న సక్సెస్లు ఆగకూడదు. తనకి తొలి సక్సెస్ రావాలి. రాజ్ తరుణ్ ఫ్లాప్లో ఉన్నా ఫస్ట్ లుక్ ట్రెండ్ అయిందంటే మా బ్యానర్కి ఉన్న వేల్యూ అది. రాజ్కి సరిపోయే కథలున్న ప్రతిసారీ మేం తనతో సినిమాలు చేస్తాం’’ అన్నారు. రాజ్ తరుణ్ మాట్లాడుతూ – ‘‘ఫస్ట్ సినిమాలాగే భావించి ఈ సినిమా చేశాను. నా లుక్ మారడానికి హర్షిత్ కారణం. నా గురించి నాకన్నా ఎక్కువ కేర్ తీసుకున్నారు. నన్ను భరించి ఈ సినిమా తీసినందుకు అనీష్కి థ్యాంక్స్. సినిమా చాలా బాగా తీశాడు. సంగీత దర్శకులందరూ మంచి మ్యూజిక్ ఇచ్చారు. రాజుగారు నాతో ఏడాదికి ఓ సినిమా చేస్తానని మాటిస్తే ఇంకే సినిమాలు ఒప్పుకోను’’ అన్నారు. హర్షిత్ మాట్లాడుతూ – ‘‘మాములుగా అబ్బాయి సినిమాల్లోకి వస్తానంటే తల్లిదండ్రులు ఇన్వెస్ట్ చేస్తారు. నన్ను నమ్మి నా బాబాయ్లు 10 కోట్లు దాకా ఖర్చు పెట్టారు. టోటల్ టీమ్ అంతా కష్టపడి పని చేశారు’’ అన్నారు. ‘‘రాజు, శిరీష్గార్లు సినిమా చూసే కంటే ముందు హర్షిత్ నా సినిమాలు ఎడిట్ టేబుల్ మీద చూసేవాడు. తనకి మంచి జడ్జిమెంట్ ఉంది’’ అన్నారు అనిల్ రావిపూడి. ‘‘లాస్ట్ ఇయర్ ఈ బేనర్లో రిలీజైన ఫస్ట్ సినిమా ‘శతమానం భవతి’, ఈ ఇయర్ ‘లవర్’ రిలీజవుతోంది. ఇది కూడా సక్సెస్ కావాలి’’ అన్నారు సతీష్ వేగేశ్న. ‘‘అలా ఎలా’ చూసి, సినిమా చేద్దాం అన్నారు రాజుగారు. 20 నిమిషాలు కథ విని ఓకే అన్నారు. ‘60 శాతం మందికి నచ్చితే చాలని నువ్వు చేశావు. దాన్ని 100 శాతం మందికి రీచ్ అయ్యేలా చేస్తాను’ అని రాజుగారు అన్నారు’’ అని చెప్పారు అనీష్. -
అందుకే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశా
తెలుగు సినీ పరిశ్రమలో మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నారు సుధీర్బాబు. ఇప్పుడు ఆయన ‘సుధీర్బాబు ప్రొడక్షన్స్’ అనే బ్యానర్ను స్థాపించారు. ఈ బ్యానర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘తన సమర్థత మీద ప్రయాణించే మంచి మనసున్న వ్యక్తి సు«ధీర్బాబు. ‘సుధీర్బాబు ప్రొడక్షన్స్’ మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను’’అన్నారు. ‘‘సుధీర్బాబు నిర్మాత అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. సక్సెస్ఫుల్ నిర్మాతగా సుధీర్బాబు పేరు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను’’అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. సుధీర్బాబు మాట్లాడుతూ–‘‘ ఏదో ఒకరోజు నేను ప్రొడక్షన్ స్టార్ట్ చేసే స్టేజ్లో ఉంటే కొత్తవాళ్లను తీసుకుని ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలనుకున్నా. అలాగే స్టార్ట్ చేశా. కృష్ణగారు, మహేశ్ వాళ్లను వాడేసుకుని ఎప్పుడూ సినిమాలు చేయాలనుకోలేదు. సొంతంగా ఎదగాలని కోరుకుంటాను. అందులో ఒక తృప్తి ఉంటుంది. నేను ప్రొడక్షన్ హౌస్ పెట్టడానికి అదే రీజన్. మంచి సినిమాలు, జనాలకు గుర్తుండే సినిమాలు చేయాలన్నదే నా విజన్. ప్రొడ్యూసర్ అవుతానని అనుకోలేదు. అయ్యా. దర్శకుణ్ణి కూడా అవుతానేమో. ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు లేవు. బయటి ప్రొడక్షన్లో కూడా నటిస్తాను. మా బ్యానర్లో రాబోతున్న తొలి సినిమా షూటింగ్ ఆర్ఎస్ నాయుడు దర్శకత్వంలో తుదిదశకు చేరుకుంది. మంచి సందర్భం చూసుకుని ఇలాగే గ్రాండ్గా ఈ సినిమా గురించి ప్రకటిస్తాం. ఇప్పుడు ఏ విషయం ఎనౌన్స్ చేయడం లేదు. ఎందుకంటే నేను హీరోగా చేసిన ‘సమ్మోహనం’ సినిమా రిలీజ్ అవుతుంది. అందుకే ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేద్దామనుకోవడం లేదు. అందుకే బ్యానర్ లాంచ్ వరకు మాత్రమే పెట్టాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు సందీప్ కిషన్, దర్శకులు వంశీ పైడిపల్లి, శ్రీరామ్ ఆదిత్య, నిర్మాతలు లగడపాటి శ్రీధర్, అనిల్ సుంకరలతోపాటు చైతన్య తదితరులు పాల్గొన్నారు. -
నా కొంగులో నా గుండెలో....
రాఘవ్, కరాణ్య కత్రీన్ జంటగా కోటేంద్ర దుద్యాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బంగారి బాలరాజు’. కె.ఎండి. రఫీ, రెడ్డం రాఘవేంద్రరెడ్డి నిర్మాతలు. చిన్నికృష్ణ–చిట్టిబాబు రెడ్డిపోగు స్వర పరచిన ఈ చిత్రంలోని ‘నా కొంగులో నా గుండెలో....’ అంటూ సాగే పాటను నిర్మాత ‘దిల్’ రాజు విడుదల చేశారు. ‘చెలియా నీ కోసం’ అనే మరో పాటను మంత్రి భూమా అఖిలప్రియ రిలీజ్ చేశారు. హీరో రాఘవ్ మాట్లాడుతూ– ‘‘టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజుగారు మా చిన్న సినిమా పాటని పెద్దమనసుతో రిలీజ్ చేసి, మమ్మల్ని అభినందించడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘రాయలసీమలో జరిగిన ఓ వాస్తవ కథ ఆధారంగా అల్లుకున్న అందమైన ప్రేమ కథతో రూపొందిన చిత్రమిది. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు చూసేలా ఉంటుంది. ‘దిల్’రాజుగారు, భూమా అఖిలప్రియగారు, బిజ్జం పార్థసారధిరెడ్డిగారు మా చిత్రంలోని పాటలను విడుదల చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా : చక్రవర్తి. -
ఈ సినిమాతో మళ్లీ ప్రూవ్ అవుతుంది
‘‘పూరి జగన్నాథ్ స్క్రిప్ట్ మనస్ఫుర్తిగా రాస్తే చాలా అద్భుతంగా సినిమా తీస్తాడు. ఆ విషయం ఇది వరకు చాలాసార్లు ప్రూవ్ అయింది. ఈ సినిమాతో మళ్లీ ప్రూవ్ అవుతుంది. జెన్యూన్ లవ్స్టోరీ తీశాడు’’ అన్నారు ‘దిల్’ రాజు. ఆకాశ్ పూరి, నేహా శెట్టి జంటగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మెహబూబా’. శ్రీ వెంకటేశ్వర రిలీజ్ బ్యానర్పై వరల్డ్వైడ్గా ఈ సినిమా రేపు విడుదల కానుంది. బుధవారం ‘మెహబూబా’ సినిమా స్పెషల్ షో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘కొత్తవాళ్లతో సినిమా తీస్తున్నప్పుడు జనరల్ ఆడియన్స్కు చూపిస్తే జనరల్ టాక్ తెలుస్తుందని పబ్లిక్ షో ఏర్పాటు చేశాం. నేనూ, పూరి కలసి రెండు సినిమాలు చేశాం (ఇడియట్, పోకిరి) రెండూ బ్లాక్బస్టర్స్గా నిలిచాయి. మామూలుగా పూరి సినిమాల్లో ఒక సెటైర్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో అలాంటిది ఏమీ ఉండదు’’ అని అన్నారు. పూరి మాట్లాడుతూ– ‘‘దిల్’ రాజుగారు కాన్ఫిడెంట్గా ఉన్నారు. నిజంగానే చాలా సంవత్సరాల తర్వాత జెన్యూన్గా సినిమా తీశాను. పాజిటీవ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. మా కాంబినేషన్లో వచ్చిన ఇడియట్, పోకిరి పెద్ద హిట్లు. ఈ సినిమా కూడా అదే రేంజ్లో అవుతుందనుకుంటున్నాను. ఆడియన్స్ ఒక చోట నవ్వుతారు అనుకుంటే నాలుగు చోట్ల నవ్వుతున్నారు. స్పెషల్ థ్రిల్ కలిగింది. అమేజింగ్ రెస్పాన్స్’’ అన్నారు. చార్మి మాట్లాడుతూ – ‘‘ఈ షో తర్వాత ఇంకా కాన్ఫిడెంట్గా ఉన్నాం. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు యూఎస్లో ఫస్ట్ ప్రీమియర్ను టీమ్ అంతా కలసి చూస్తాం. యూఎస్లో 2 వీక్స్ టూర్ చేస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆకాశ్ పూరి, నేహా శెట్టి, విషు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఫన్ ప్లస్ ఫ్రస్ట్రేషన్... తొలకరిలో స్టార్టవ్వున్
ఫన్ ఒకరిది. ఫ్రస్ట్రేషన్ మరొకరిది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ మాత్రం ఆడియన్స్ది. ఈ ఎంటర్టైన్మెంట్ను సిల్వర్స్క్రీన్పై అందించేందుకు ‘ఎఫ్2’లో జాయిన్ అవ్వడానికి వీ2 రెడీ అవుతున్నారు. వేసవిలో ప్రీ–ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసుకుని వర్షాకాలంలో షూటింగ్కు కొబ్బరికాయకొట్టి చలికాలంలో చిత్రానికి గుమ్మడికాయ కొట్టేలా చిత్రబృందం ప్లాన్ చేస్తోందని సమాచారం. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్2’ (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్). అయితే ఎవరు ఫన్ క్యారెక్టర్ చేయబోతున్నారు? ఎవరు ఫ్రస్ట్రేషన్ క్యారెక్టర్లో నటించనున్నారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. రీసెంట్గా ఈ సినిమా టైటిల్ లోగోను అధికారికంగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అన్నట్లు... వీ2 అంటే వెంకీ ప్లస్ వరుణ్ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమా షూటింగ్ను జూన్లో స్టార్ట్ చేయనున్నారు.‘‘ఎఫ్2’ సినిమా షూటింగ్ను జూన్లో స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. సెట్లో ఫుల్ ఫన్ స్టార్ట్ అవ్వబోయేది అప్పుడే’’ అని పేర్కొన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. అంతేకాదు వెంకీ, వరుణ్, ‘దిల్’ రాజుతో ఉన్న ఫొటోను అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సంగతి ఇలా ఉంచితే ఈ సినిమాలో వెంకటేశ్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహరీన్ నటించనున్నారని టాక్. -
పూరి కెరీర్లో వన్నాఫ్ ది బెస్ట్ మూవీ మెహబూబా
‘‘పూరి జగన్నాథ్ ఎక్స్ట్రార్డినరీ డైరెక్టర్. టాప్ సార్ట్స్ అందరితో సినిమాలు చేసి సక్సెస్ కొట్టారు. అద్భుతమైన కథ రాస్తే ఆయన అత్యద్భుతంగా సినిమా తీస్తారు. ‘మెహబూబా’ సినిమా చూశాను. బయటకు వచ్చాక తెలిసినవారికి, తెలియనివారికి సినిమా బాగుందని చెప్తున్నాను’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా పూరి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘మెహబూబా’. నేహా శెట్టి కథానాయిక. శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి కనెక్ట్స్ నిర్మించిన ఈ సినిమాను నిర్మాత ‘దిల్’ రాజు మే 11న రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమా అయినా బ్లాక్బస్టర్ అవుతుంది. ఎలా ఉంటుందో అనుకుంటూ ‘మోహబూబా’ చూశాను. ఎందుకంటే ఆడియన్స్లో నా జడ్జ్మెంట్పై మంచి అభిప్రాయం ఉంది. అద్భుతమైన స్క్రీన్ప్లేతో సినిమాను పూరి సూపర్గా తీశారు. పూరి జగన్నాథ్ కెరీర్లో వన్నాఫ్ ది బెస్ట్ మూవీ అవుతుంది. ఆకాశ్, నేహా బాగా నటించారు’’ అన్నారు ‘దిల్’ రాజు. ‘‘చాలా కాన్ఫిడెన్స్గా సినిమా చేశాం. ‘దిల్’ రాజుగారు సినిమా చూసి బాగుంది అనగానే మా కాన్ఫిడెన్స్ టెన్ టైమ్స్ రెట్టింపు అయ్యింది. అందరూ ‘మీ నాన్న నిన్ను లాంచ్ చేస్తున్నారు. వెరీ లక్కీ’ అంటున్నారు. కానీ ‘మెహబూబా’ లాంటి సినిమాతో మా నాన్నని నేను లాంచ్ చేస్తున్నానని గర్వంగా చెప్పగలను. ఆడియన్స్కు సినిమా నచ్చుతుంది’’ అన్నారు ఆకాష్ పూరి. ‘‘పూరి చాలా క్లారిటీగా స్క్రిప్ట్ రాస్తారు. సినిమా బాగా వచ్చింది. ‘దిల్’ రాజుగారు సినిమా చూసి, పూరీని హగ్ చేసుకుని ‘ఇదీ పూరి సినిమా అంటే.. ఇదీ పూరి సినిమా అంటే’’ అన్నారు. ఆయన జడ్జ్మెంట్ కరెక్ట్గా ఉంటుంది’’ అన్నారు ఛార్మి. ఈ కార్యక్రమంలో కెమెరామేన్ విష్ణుశర్మ, ఆర్ట్ డైరెక్టర్ జానీ తదితరులు పాల్గొన్నారు. -
అన్ని అంశాలు ప్యాకేజ్తో ఉంటాయి –‘దిల్’రాజు
‘‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ కథను మేర్లపాక గాంధీ ముందు నాకే చెప్పాడు. సింపుల్ కథ. సినిమా సూపర్హిట్ అయ్యింది. రెండో సినిమా ‘ఎక్స్ప్రెస్ రాజా’ కూడా మంచి హిట్. తన సినిమాలో క్యారెక్టర్స్, కామెడీ, మ్యూజిక్.. ఇలా అన్ని అంశాలు ప్యాకేజ్తో ఉంటాయి’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. నాని హీరోగా అనుపమా పరమేశ్వరన్, రుక్సార్ మీర్ హీరోయిన్లుగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’. వెంకట్ బోయనపల్లి సమర్పణలో షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమా ఈనెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాను నేనే రిలీజ్ చేస్తున్నా. గాంధీ సినిమాలతో ప్రేక్షకులకు పెద్దగా ఒత్తిడి ఉండదు. ఎంజాయ్ చేస్తారు. నేను రీసెంట్గా ఈ సినిమా చూశా. నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్’’ అన్నారు. నాని మాట్లాడుతూ– ‘‘నా ప్రతి సినిమా విడుదల టైమ్లో టెన్షన్ ఉంటుంది. ఎక్కువ సినిమాలు చేస్తే టెన్షన్ అలవాటు పడిపోతుందని అనుకుంటే.. ప్రతి సినిమాకు కామన్గా వచ్చేస్తోంది. రెండు రోజుల ముందు సినిమా చూశాం. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఈ సమ్మర్లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’’ అన్నారు. ‘‘ మా సినిమాను రాజుగారు విడుదల చేస్తుండటం హ్యాపీ’’ అన్నారు మేర్లపాక గాంధీ. వెంకట్ బోయనపల్లి, సాహు గారపాటి, హరీష్ పెద్ది పాల్గొన్నారు. -
మా ఇద్దరి మధ్య పోటీ జరుగుతోంది – ‘దిల్’ రాజు
‘‘బాహుబలి’ ఫంక్షన్ తర్వాత ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా వేడుక తిరుపతిలో జరుగుతుంటే చాలా ఆనందంగా ఉంది. గాంధీ ఈ సినిమాతో హ్యాట్రిక్ డైరెక్టర్ కాబోతున్నాడు. నాకు, నానీకి పోటీ జరుగుతోంది. ఇద్దరం వరుస హిట్ల మీద ఉన్నాం. సినిమాకు కథ బాగుంటే అన్నీ బాగున్నట్టే. ఈ చిత్రాన్ని ఏపీ, తెలంగాణలో మేం విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. నాని, అనుపమా పరమేశ్వరన్, రుక్సార్ హీరో హీరోయిన్లుగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం‘కృష్ణార్జున యుద్ధం’. వెంకట్ బోయనపల్లి సమర్పణలో సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా తిరుపతిలో ప్రీ–రిలీజ్ వేడుక నిర్వహించారు. ‘దిల్’ రాజు సినిమా ట్రైలర్ను, ఫస్ట్ టికెట్ను ఆవిష్కరించారు. మేర్లపాక గాంధీ మాట్లాడుతూ– ‘‘కథ చెప్పడం మొదలుపెట్టిన పది నిమిషాలకే నానీగారు ఓకే చెప్పేశారు. చిత్తూరు యాసను ఆయన చాలా ఈజీగా పలకడం గర్వంగా ఫీలవుతున్నా. సుబ్బలక్ష్మి, రియా పాత్రల్లో ఇద్దరు హీరోయిన్లు బాగా చేశారు. హిప్ హాప్ తమిళ మంచి సంగీతాన్నిచ్చారు’’ అన్నారు. నాని మాట్లాడుతూ– ‘‘చిన్నప్పటి నుంచి మా తాతగారి ఊరికి ఎన్నిసార్లు వెళ్లానో తెలియదు కానీ, అంతకు మూడు రెట్లు ఎక్కువ తిరుపతికి వచ్చాను. నేనే కాదు.. ప్రతి తెలుగోడు తిరుపతివాడే. గాంధీని చూస్తే సొంత సోదరునిలా అనిపించేది. ఈ మధ్య కాలంలో ఇంత ఎంజాయ్ చేసిన సినిమా ఇంకోటి లేదు. ఏదైనా మంచి పని చేయాలంటే తిరుపతికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాం. మన ప్రీ–రిలీజ్ ఈవెంట్ ఇక్కడ మొదలైంది. ఇక తిరుగులేదు’’ అన్నారు. అనుపమా పరమేశ్వరన్, రుక్సార్, చిత్ర సంగీతదర్శకుడు హిప్ హాప్ తమిళ, తిరుపతి ప్రసాద్, ‘నిన్ను కోరి’ దర్శకుడు శివ నిర్వాణ, ప్రశాంతి, మౌర్య, ప్రభాస్ శ్రీను, ఫైట్ మాస్టర్స్ జాషువా, ఆర్.కె, డ్యాన్స్ మాస్టర్ రఘు తదితరులు పాల్గొన్నారు. -
హలో గురు ప్రేమ కోసమే
లైఫ్లో లవ్ పార్ట్ సెపరేట్ గురూ! ఆ మజానే వేరు. అందుకే ప్రేమ కోసం ఎంత దాకా అయినా వెళ్లాలి. ఏం చేయడానికైనా తెగించాలి అంటున్నారు హీరో రామ్. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రామ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మిస్తున్న చిత్రం ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్లో జరిగింది. ఈ చిత్రానికి ‘హలో గురు ప్రేమకోసమే’ అనే టైటిల్ను ఖరారు చేశారు. టైటిల్ చదవగానే ‘హలో గురూ ప్రేమకోసమే రోయ్ జీవితం..’ అని ‘నిర్ణయం’లో నాగార్జున సందడి చేసిన పాట గుర్తొస్తోంది కదూ. ఆ సంగతలా ఉంచితే.. ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ సినిమా తర్వాత మరోసారి రామ్కు జంటగా ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ నటిస్తున్నారు. ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వంశీ పైడిపల్లి క్లాప్ ఇవ్వగా, దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విచ్చాన్ చేశారు. నిర్మాతలు ఎర్నేని నవీన్, ‘స్రవంతి’ రవికిషోర్ స్క్రిప్ట్ను డైరెక్టర్కు అందించారు. దర్శకుడు హరీష్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. ప్రకాశ్రాజ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ‘‘రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 12న స్టార్ట్ కానుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చనున్నారు’’ అని చిత్రబృందం అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: విజయ్ కె.చక్రవర్తి. -
ఖర్చు తగ్గిందన్నమాట!
సోషల్ మీడియాలో ఒకటే చర్చ. హీరో నితిన్ పెళ్లి గురించి. పెళ్లికొడుకు గెటప్లో ఉన్న ఫోటోను నితిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే ఇందుకు కారణం. కానీ నితిన్ పెళ్లికొడుకుగా మారింది రియల్ లైఫ్లో కాదు. రీల్ లైఫ్లోనే. ‘శతమానం భవతి’ ఫేమ్ సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నితిన్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘శ్రీనివాస కల్యాణం’. ఇందులో రాశీఖన్నా, నందిత శ్వేత కథానాయికలుగా నటిస్తున్నారు. ఆల్మోస్ట్ 14 ఏళ్ల తర్వాత నితిన్, ‘దిల్’ రాజుల కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందుతుండటం విశేషం. ఈ సినిమా మోషన్ పోస్టర్ను ఆదివారం రిలీజ్ చేశారు. చిత్రీకరణ మొదలైంది. ‘‘ ఈ నెల 16 నుంచి రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది. ఈ షెడ్యూల్ ఈ నెల 30 వరకు జరుగుతుంది. ఈ ఏడాది జూన్ కల్లా షూటింగ్ను కంప్లీట్ చేసి, జూలై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: మిక్కి జె. మేయర్, కెమెరా: సమీర్ రెడ్డి. ఈ సినిమా సంగతి ఇలా ఉంచితే..‘‘మ్యారేజ్కి కెమెరామెన్ అవసరం లేదన్నా, ఇవే పెళ్లి ఫొటోలు అని పోస్ట్ చేసినా నమ్మేలా ఉన్నాయ్’’ అని ఓ నెటిజన్ నితిన్ పోస్ట్ చేసిన ఈ సినిమా ఫొటోను ఉద్దేశించి అన్నాడు. ‘ఖర్చు తగ్గిందన్నమాట’ అంటూ సరదాగా అతనికి బదలు ఇచ్చాడు నితిన్. -
మహేశ్ సినిమాతో ఎంట్రీ షురూ
ఒక్కొక్కరుగా టీమ్లో యాడ్ అవుతున్నారు. ఎవరి టీమ్లో అంటే.. మహేశ్బాబు టీమ్లో. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్బాబు హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్ పతాకాలపై ‘దిల్’ రాజు, అశ్వనీదత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్, లొకేషన్స్ హంట్ కంప్లీట్ చేసిన చిత్రబృందం ఇప్పుడు నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రీసెంట్గా కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేసిన చిత్రబృందం, ఇప్పుడు లేటెస్ట్గా బాలీవుడ్ కెమెరామేన్ కేయు మోహనన్ను టీమ్లోకి తీసుకున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేసింది. ‘డాన్, తలాష్, రాయీస్’ వంటి హిందీ చిత్రాలకు కెమెరామేన్గా వర్క్ చేశారు మోహనన్. తెలుగు సినిమాకి ఆయన వర్క్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. ఈ సినిమా రెగ్యులర్ షూట్ను ఏప్రిల్లో స్టార్ట్ చేయనున్నారని సమాచారం. -
సంక్రాంతికి మినహాయింపు
ఇలా అండర్స్టాండింగ్కి రావడానికి ఏర్పాటైన సమావేశంలో ఆ రెండు చిత్రాల నిర్మాతలతో పాటు నిర్మాత ‘దిల్’ రాజు, కె.ఎల్ నారాయణ పాల్గొన్నారు. ‘‘రెండు భారీ చిత్రాల మధ్య కనీసం రెండు వారాల గ్యాప్ ఉండాలని మాట్లాడుకున్నాం. అందుకే ‘భరత్ అనే నేను’ చిత్రాన్ని ఏప్రిల్ 20న, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రాన్ని మే 4న రిలీజ్ చేయాలని నిర్ణయించాం. ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలన్న అభిప్రాయంతో తీసుకున్న ఈ నిర్ణయాన్ని సపోర్ట్ చేసిన మా హీరోలు, దర్శకులకు కృతజ్ఞతలు’’ అన్నారు నిర్మాతలు డివీవీ దానయ్య, లగడపాటి శ్రీధర్, ‘బన్నీ’ వాసు. ‘‘సంక్రాంతి సీజన్ను మినహాయించి మిగిలిన సందర్భాల్లో రెండు భారీ చిత్రాల మధ్య ఇలా రెండు వారాల గ్యాప్ ఇచ్చి రిలీజ్ డేట్స్ ప్లాన్ చేయడం వల్ల పరిశ్రమకు ఎంతో మేలు జరగుతుంది. ‘భరత్ అనే నేను, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాల నిర్మాతల మధ్య మంచి అండర్స్టాండింగ్ కుదరడం శుభపరిణామంగా భావిస్తున్నాం’’ అన్నారు నాగబాబు. ఏప్రిల్ 20న ‘భరత్ అనే నేను’, ఆరు రోజుల గ్యాప్ తర్వాత 27న ‘కాలా’, ఆ నెక్ట్స్ వీక్ మే 4న ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ వస్తాయి. ఎలాగూ ఏప్రిల్ 5న నితిన్ ‘ఛల్ మెహన్రంగ’, ఏప్రిల్ సెకండ్ వీక్లో నాని ‘కృష్ణార్జున యుద్ధం’ వచ్చేస్తాయి. అటు ఆ రెండు సినిమాలకూ.. ఆ తర్వాత విడుదల కానున్న సినిమాలకూ మధ్య గ్యాప్ రావడంతో ఏప్రిల్ వార్ వేడి తగ్గింది. -
‘కొత్త డైరెక్టర్ చేశాడా అని పెదనాన్న షాక్ అయ్యారు’
‘‘లవ్ స్టోరీకు కావల్సింది కెమిస్ట్రీ అని అప్పుడు ఆ ‘తొలిప్రేమ’, ఇప్పుడు ఈ ‘తొలిప్రేమ’ ప్రూవ్ చేశాయి. వరుణ్, రాశీ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. వరుణ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ‘తొలిప్రేమ’ సినిమా సక్సెస్ మీట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘ఫిదా’ స్టార్ట్ అయ్యే టైమ్లో వెంకీ నా దగ్గరకు వచ్చి ‘సార్ నేనీ సినిమా బయటవాళ్లతో చేసుకుంటాను’ అన్నాడు. ‘సరే’ అన్నాను. సినిమా అయిపోయాక బాపినీడు సినిమాను తీసుకొచ్చి మళ్లీ నా చేతుల్లో పెట్టాడు. వరుణ్ తేజ్ లుక్స్ బాగున్నాయి. ‘ఫిదా, తొలిప్రేమ’ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించాడు. నెక్ట్స్ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలి. రాశీ బాగా చేసింది’’ అన్నారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ – ‘‘ఈ కథను నమ్మిన ‘దిల్’ రాజు గారికి థ్యాంక్స్. మీరు లేకపోతే సినిమా స్టార్ట్ అవ్వకపోయేది. నా మీద, వెంకీ మీద నమ్మకం ఉంచారు. వెంకీకి సినిమా మీద ఉన్న ప్రేమ, మేకింగ్లో ఉన్న కన్విక్షన్ సూపర్బ్. పెదనాన్న (చిరంజీవి) ఈ సినిమాను చూసి, డెబ్యూ డైరెక్టర్ ఈ సినిమా తీశాడా అని షాక్ అయ్యారు’’ అన్నారు. ‘‘ఈ సినిమాతో నాకు ఫీమేల్ ఫ్యాన్స్ పెరుగుతారు అనుకుంటున్నాను. నాకు ఇంత మంచి క్యారెక్టర్ రాసిన వెంకీకి థ్యాంక్స్’’ అన్నారు రాశీ ఖన్నా. వెంకీ మాట్లాడుతూ – ‘‘రాశీని అనుకున్నప్పుడు భయం ఉండేది కానీ చాలా బాగా చేసింది. ఈ కథను వరుణ్ బిలీవ్ చేయటం వల్లే ఈ సినిమా ప్రాణం పోసుకుంది. ఈ సినిమాకు రెండు పిల్లర్స్ జార్జ్, తమన్. లిరిక్స్ రాసిన శ్రీ మణిగారికి థ్యాంక్స్. ప్రసాద్గారిని సార్ అని పిలుస్తాను కానీ నాకు ఫ్రెండ్ లాంటి వారు. బాపినీడు మంచి ఫ్రెండ్’’ అన్నారు. ‘‘ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ అంతా వరుణ్ తేజ్కు ఇస్తున్నాను. ఎందుకంటే ఈ సినిమాను నమ్మి చేశాడు. టెక్నీషియన్స్ అందరూ చాలా బాగా చేశారు’’ అన్నారు బీవీఎస్ఎన్ ప్రసాద్. ‘‘నేను ఫస్ట్ టైమ్ వర్క్ చేసిన హీరోస్ అందరితో బ్లాక్బాస్టర్స్ కొట్టాను ‘బృందావనం, కిక్, దూకుడు’.. ఈ సినిమా స్టార్ట్ అప్పుడు ఇదే అనుకున్నాను. అలాగే సూపర్ హిట్ అయింది’’ అన్నారు తమన్. -
ఇక్కడి నీటిలోనే ఏదో ఉంది – ‘దిల్’ రాజు
‘‘భీమవరం ఊర్లో ఏముందో తెలియదు కానీ ఇక్కడి నుంచి త్రివిక్రమ్, సునీల్ వంటివారు.. పక్కనున్న పాలకొల్లు నుంచి చిరంజీవిగారు, కృష్ణంరాజుగారు, ప్రభాస్ వంటి ఎందరో తెలుగు చిత్ర పరిశ్రమకి వచ్చారు. ఇక్కడి నీటిలోనే ఏదో ఉంది. సినిమాకు కావాల్సిన కళ ఇక్కడ ఉంది. అదే మిమ్మల్ని, మమ్మల్ని ఇక్కడివరకు తీసుకొచ్చింది’’ అని నిర్మాత ‘దిల్’రాజు అన్నారు. వరుణ్ తేజ్, రాశీఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ‘తొలిప్రేమ’ ఈ నెల 10న విడుదలవుతోంది. ఈ సందర్భంగా భీమవరంలో ప్రీ–రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ‘దిల్’రాజు మాట్లాడుతూ– ‘‘1998లో వచ్చిన ‘తొలిప్రేమ’కు, 2018లో రానున్న ‘తొలిప్రేమ’కు నేనే డిస్ట్రిబ్యూటర్ని. ఆ ‘తొలిప్రేమ’ లా ఈ చిత్రం కూడా 100 శాతం యూత్దే. బ్యూటీఫుల్ లవ్స్టోరీ. ‘ఫిదా’ తర్వాత ఈ సినిమా రావడం వరుణ్కి ప్లస్ అవుతుంది’’ అన్నారు. ‘‘తొలిప్రేమ’ టైటిల్ పెట్టినప్పుడు కాస్త భయపడ్డాం. వరుణ్ ఏమో ‘పర్వాలేదు కదా’ అన్నాడు. ఆ సినిమాతో పోలిక పెట్టను కానీ.. దాని గౌరవాన్ని కాపాడతాను’’ అన్నారు వెంకీ అట్లూరి. ‘‘చిరంజీవితో సినిమా తీయాలని 33ఏళ్ల కిందట తణుకు నుండి మద్రాస్ వెళ్లాను. బన్నీతో ‘ఆర్య 2’, రామ్చరణ్తో ‘మగధీర’, పవన్కల్యాణ్తో ‘అత్తారింటికి దారేది’ తీశా. వరుణ్తో తీసిన ‘తొలిప్రేమ’ గ్యారంటీగా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు బీవీఎస్ఎన్ ప్రసాద్. ‘‘వెంకీకి తొలి చిత్రమే అయినా బాగా తీశాడు. భవిష్యత్లో పెద్ద దర్శకుడవుతాడు. ఈ సినిమాను అందరి కంటే ఎక్కువగా నమ్మింది ‘దిల్’రాజుగారే. బాపినీడు, ప్రసాద్గారు అద్భుతంగా నిర్మించారు. సినిమాటోగ్రాఫర్ జార్జ్ విలియమ్స్ ప్రతి సీన్ను ఎంతో అందంగా చూపించారు. కథకు తగ్గ టైటిల్ అనిపించే ‘తొలిప్రేమ’ పెట్టాం. బాబాయ్ టైటిల్ని పాడు చేసేలా ఉండదు ఈ సినిమా’’ అన్నారు వరుణ్ తేజ్. ఎమ్మెల్యే రాధాకృష్ణ, రాశీఖన్నా, నటుడు ‘హైపర్’ ఆది, ఎస్.ఆర్.కె.ఆర్.కాలేజ్ ప్రిన్సిపాల్ పార్థసారథి పాల్గొన్నారు. -
కన్ఫ్యూజన్ వద్దని..
వరుణ్ తేజ్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవియస్యన్ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘తొలి ప్రేమ’. సాయిధరమ్ తేజ్ హీరోగా వీవీ వినాయక్ దర్శకత్వంలో సి. కల్యాణ్ నిర్మించిన చిత్రం ‘ఇంటిలిజెంట్’. ఈ రెండు సినిమాలను ఫిబ్రవరి 9న విడుదల చేయాలనుకున్నారు. దాంతో రెండు చిత్రాల నిర్మాతలు డిస్కస్ చేసుకొని ‘తొలిప్రేమ’ సినిమాను ఫిబ్రవరి 10న విడుదల చేయడానికి డిసైడ్ అయ్యారు. ఈ సందర్భంగా బీవియస్యన్ ప్రసాద్, ‘దిల్’ రాజు విలేకరులతో మాట్లాడారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘కష్టపడి సినిమా చేశాక రెవెన్యూ తెచ్చుకోవడం ముఖ్యం. అందుకని ప్రసాద్గారు ‘తొలిప్రేమ’ సినిమాను 10న రిలీజ్ చేస్తున్నారు. ఈ మధ్య హీరోలు సినిమాలు వేగంగా చేస్తున్నారు. దాంతో ప్రతి శుక్రవారం నాలుగైదు సినిమాలు రిలీజవుతున్నాయి. అందుకని క్లాష్ ఏర్పడుతోంది. నేను ‘తొలి ప్రేమ’ చూశాను. ప్రసాద్గారి బ్యానర్లో వచ్చిన ‘డార్లింగ్, అత్తారింటికి దారేది’లాగా మంచి సక్సెస్ సాధిస్తుంది. డిస్ట్రిబ్యూటర్గా లాస్ట్ ఇయర్ ఫెయిలయ్యాను. ఈ ఇయర్ ‘భాగమతి’తో హిట్ సాధించాను. ‘తొలిప్రేమ’ కూడా సక్సెస్ అవుతుందనుకుంటున్నా’’ అన్నారు. ‘‘తొలిప్రేమ’ను ఫిబ్రవరి 9న విడుదల చేద్దామనుకున్నాం. అదే రోజు ‘ఇంటిలిజెంట్’ రిలీజ్ డేట్ను ప్రకటించారు. వరుణ్, ధరమ్తేజ్ ఫ్యాన్స్ మధ్య కన్ఫ్యూజన్ ఏర్పడకూడదని ‘దిల్ ’ రాజుగారితో మాట్లాడి ఫిబ్రవరి 10న విడుదలను ప్లాన్ చేశాం’’ అని బీవియస్యన్ ప్రసాద్ అన్నారు. -
ఎంసీఏ అంటే... మిడిల్ క్లాస్ ఆడియన్స్
నాని, సాయి పల్లవి జంటగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన చిత్రం ‘ఎంసీఏ’. ఈ నెల 21న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ–రిలీజ్ ఫంక్షన్ను చిత్రబృందం వరంగల్లో నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ– ‘‘వేణు నాకీ కథ చెప్పగానే మీరంతా గుర్తొచ్చారు. ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయికి, అమ్మాయికి తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమా మొత్తం వరంగల్లోనే చిత్రీకరించాం. ఈ సినిమాతో సాయి పల్లవి నా ఫేవరెట్ కో–స్టార్ అయిపోయింది. ‘దిల్’ రాజుగారు, దేవిశ్రీ ప్రసాద్లతో సినిమా చేద్దాం అనుకుంటూ ఉన్నా. ఒకే సంవత్సరంలో రెండు సినిమాలు చేసేశాం’’ అని అన్నారు. ‘‘వేణుగారు చాలా కష్టపడి తెరకెక్కించారు. నాని చాలా హార్డ్ వర్కింగ్. ప్రతి సీన్ను ఇంప్రూవ్ చేయటానికి తపిస్తుంటారు. రాజుగారికి, శిరీష్గారికి థ్యాంక్స్’’ అని సాయి పల్లవి అన్నారు. మిడిల్ క్లాస్ అంటే అమ్మాయో, అబ్బాయో కాదు మిడిల్ క్లాస్ ఆడియన్స్. మిడిల్ క్లాస్ అంటే ఒక మైండ్ సెట్. మిడిల్ క్లాస్ అందరికీ నచ్చుతుంది. నాని వల్లే ఈ సినిమా స్టార్ట్ అయింది. అందరికీ థ్యాంక్స్’’ అన్నారు వేణు శ్రీరామ్. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, ఎర్రబెల్లి దయాకర్, ఆలూరి రమేష్ పాల్గొన్నారు. -
డబుల్ హ్యాట్రిక్ని టార్గెట్ చేశాం
‘‘ఎం.సి.ఎ.(మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమాని ఈ నెల 21న విడుదల చేస్తామని ఆగస్ట్ 19నే ప్రకటించా. అయితే, ఈ నెల 15న విడుదల చేయడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ కుదరలేదు. అందుకే 21న విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. నాని, సాయిపల్లవి జంటగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించిన ‘ఎం.సి.ఎ’ ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ– ‘‘ఈ ఏడాది మా బ్యానర్లో ఐదు సినిమాలు హిట్ సాధించాయి. ఇదే ఏడాది ‘ఎం.సి.ఎ’తో డబుల్ హ్యాట్రిక్ సాధించాలనుకున్నాం. అందుకే, కథ అనుకున్నప్పటి నుంచి డిసెంబర్లో రిలీజ్కి ప్లాన్ చేశాం. ఈ సినిమా హిట్ అయితే మా బ్యానర్ డబుల్ హ్యాట్రిక్ సాధిస్తుంది. మధ్య తరగతి కుటుంబ సభ్యుల మధ్య రిలేషన్షిప్, డ్రామాతో పాటు ఈ సినిమాలో బ్యూటిఫుల్ లవ్స్టోరీ ఉంటుంది. శ్రీరామ్ వేణు మధ్యతరగతి యువకుడు కాబట్టి ప్రేక్షకులకు నచ్చేలా సన్నివేశాలు రాసుకున్నారు. వదిన, మరిది మధ్య అనుబంధం ఈ చిత్రంలో హైలెట్. భూమిక వదినగా కనిపిస్తారు. నాని, సాయిపల్లవిల మధ్య సీన్స్ చూసి ప్రేక్షకులు ఎగ్జయిట్ అవుతారు. దేవిశ్రీ ప్రసాద్ మంచి పాటలిచ్చారు. సోమవారం ట్రైలర్ విడుదల చేయబోతున్నాం. ఈ నెల 16న ప్రీ–రిలీజ్ వేడుక ప్లాన్ చేస్తున్నాం. 21న ప్రేక్షకులు ఏం చెబుతారని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాం. మ్యాజిక్ వర్కవుట్ అయితే సినిమా పెద్ద హిట్ సాధిస్తుంది’’ అన్నారు. అఖిల్ హీరోగా నటించిన ‘హలో’ ఈ 22న విడుదల కానున్న విషయం తెలిసిందే. ‘‘ఈ సినిమా ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. రెండు సినిమాలు ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు ‘దిల్’ రాజు. -
ఓటమి వల్లే గెలుపు
‘‘జవాన్’ టైటిల్ వినగానే మిలటరీ నేపథ్యంలో సినిమా ఉంటుందేమో అనుకుంటారు. ఈ సినిమాలో ఆర్మీని టచ్ చేయలేదు. సామాజిక బాధ్యత అనేది మెయిన్ పాయింట్’’ అని సాయిధరమ్తేజ్ అన్నారు. సాయిధరమ్, మెహరీన్ జంటగా బి.వి.ఎస్. రవి దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో కృష్ణ నిర్మించిన ‘జవాన్’ ఈ రోజు విడుదలవుతోన్న సందర్భంగా తేజ్ పంచుకున్న విశేషాలు... ► ‘జవాన్’ కథ విన్న వెంటనే ఓకే చెప్పేశా. ఇందులో నేను చేసిన జై పాత్ర నా వ్యక్తిగత జీవితానికి దగ్గరగా ఉంటుంది. హుద్హుద్ తుపాను, చెన్నైలో వరదలు, నిజాంపేటలో వర్షపు నీరొచ్చినప్పుడు సామాజిక బాధ్యతగా ఎలా స్పందించానో సినిమాలో నా పాత్ర అలానే ఉంటుంది. ► ప్రతి ఒక్కరూ మన ఇంట్లోని సమస్యలను ఎదుర్కోడానికి జవాన్లాగా నిలబడతాం. దాన్ని బేస్ చేసుకుని సినిమా తీశాం. జవాన్ అంటే అందరూ ఆర్మీ అనుకుంటారు. కానీ, సమస్యల్ని ఎదుర్కొనే మనమందరమూ జవాన్లమే అని రవిగారు చక్కగా చెప్పారు. ► సినిమా బాగా రాకపోవడంతో రీషూట్స్ జరిగాయనీ.. నిర్మాతలు హ్యాపీగా లేరనీ.. కొరటాల శివగారు స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అయ్యారన్నది అవాస్తవం. రవిగారు–కొరటాలగారు బెస్ట్ ఫ్రెండ్స్. వారి మధ్య మా సినిమా డిస్కషన్స్ వచ్చినప్పుడు కొరటాలగారు సలహా ఇచ్చారంతే. ► ఈ ఏడాది మార్చి 31న షూటింగ్ ప్రారంభించాం. సెప్టెంబర్ 1న విడుదల చేయాలనుకున్నాం. కానీ, ప్రతివారం వరుసగా సినిమాలు విడుదల ఉండటంతో ప్రేక్షకులు నా సినిమానే ఎందుకు చూడాలి? అనుకున్నా. నిర్మాతలకు డబ్బులు రావాలి. నాకు హిట్ కావాలి. మా చిత్రం ప్రేక్షకులకు బాగా చేరువ కావాలనే ఉద్దేశంతో షూటింగ్ మెల్లగా చేశాం. అందుకే రిలీజ్ లేట్ అయింది. ► హిట్టు, ఫ్లాప్లను ఎలా తీసుకుంటారనే ప్రశ్నకు బదులిస్తూ... రెండింటి గురించి పెద్దగా పట్టించుకోను. మన పని కరెక్ట్గా చేశామా? లేదా? అని ఆలోచిస్తా. సినిమా ఫ్లాప్ అయితే.. ఎక్కడ తప్పు జరిగింది? తెలుసుకుని తర్వాత సినిమాకి జాగ్రత్త పడతా. సక్సెస్, ఫెయిల్యూర్లను వేర్వేరుగా చూడను. అయినా ఓటమి వల్లే గెలుపు వస్తుంది. ► జనరల్గా నేను నవ్వుతూ ఉంటాను. కానీ, ఈ సినిమాలో నవ్వకూడదు. చాలా మెచ్యూర్డ్గా మసులుకోవాలి. అందుకు నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యా. నా నుంచి ఇంత మంచి నటన రాబట్టుకున్న క్రెడిట్ మొత్తం రవిగారిదే. ► ‘విన్నర్’ సినిమా తర్వాత నేను అమ్మాయిల వెంటపడి టీజ్ చేసే సన్నివేశాలు, పాటలు చేయనని చెప్పేశా. ఈ సినిమాలో మెహరీన్ది నన్ను డామినేట్ చేసే పాత్ర. చాలా బాగా చేసింది. తమన్ చాలా మంచి పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చారు. రాశీఖన్నాతో పాట పాడించాలనే ఐడియా తమన్దే. ► వినాయక్గారితో చేస్తోన్న సినిమా 60 శాతం పూర్తయింది. ఫిబ్రవరిలో రీలీజ్ అనుకుంటున్నాం. ఆ తర్వాత కరుణాకరన్ దర్శకత్వంలో ఓ లవ్స్టోరీ చేస్తా. మరికొన్ని కథలు వింటున్నా. -
శ్రావణ మాసంలో శ్రీనివాస కల్యాణం!
కల్యాణం వచ్చినా! కక్కొచ్చినా ఆగదని తెలుగులో ఓ సామెత. అంటే... ప్రతిదానికీ ఓ టైమ్ రావాలి. టైమ్ వచ్చినప్పుడు ఎవరూ ఆపలేరు. సిన్మాల్లోనూ అంతే! కొన్ని కాంబినేషన్లు కుదరడానికి టైమ్ రావాలి. అలాగే... హీరో నితిన్, నిర్మాత ‘దిల్’ రాజు కాంబి నేషన్ మళ్లీ కుదరడానికి 14 ఏళ్లు పట్టింది. నితిన్ హీరోగా పరిచయమైన ‘దిల్’తో, ఆ చిత్రనిర్మాత వెంకట రమణ అలియాస్ రాజు చిత్రపరిశ్రమలో ‘దిల్’ రాజుగా స్థిరపడ్డారు. అది విడుదలైన 14 ఏళ్లకు ఈ హీరో, నిర్మాత మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి ‘శ్రీనివాస కల్యాణం’ అనే పేరుని నిర్ణయించారు. శనివారం ఈ చిత్ర వివరాలను అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది వసంత మాసం (మార్చి)లో చిత్రీకరణ ప్రారంభించి, శ్రావణ మాసం (ఆగస్టు)లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తామన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్రెడ్డి, సంగీతం: మిక్కీ జె. మేయర్. -
సూపర్ హిట్ తీస్తా – హను రాఘవపూడి
శర్వానంద్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ సినిమాస్ పతాకంపై ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరుకూరి నిర్మిస్తోన్న చిత్రం ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్లో జరిగింది. హీరో శర్వానంద్పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ‘దిల్’ రాజు క్లాప్ ఇచ్చారు. కొరియోగ్రాఫర్ రాజు సుందరం కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు సుకుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. హను రాఘవపూడి మాట్లాడుతూ– ‘‘ప్రేమకథా చిత్రమిది. శర్వానంద్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది. నా మిత్రులు ప్రసాద్, సుధాకర్ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను. సూపర్హిట్ చిత్రాన్ని అందిస్తా’’ అన్నారు. ‘‘శర్వానంద్తో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఫ్రెష్ సబ్జెక్ట్తో చాలా కొత్తగా హను రూపొందించనున్నారు. మా బ్యానర్లో నిర్మిస్తోన్న ఈ తొలి చిత్రం హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. త్వరలోనే రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేయనున్నాం’’ అన్నారు నిర్మాతలు. ఈ వేడుకలో నిర్మాతలు వై. రవిశంకర్, ఎస్. రా«ధాకృష్ణ, అనీల్ సుంకర, రామ్ ఆచంట, గోపీ ఆచంట, బాపినీడు, నాగవంశీ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ స్వరకర్త. -
కార్తీ ఏడాదికో తెలుగు సినిమా చేయాలి
‘రజనీకాంత్, కమల్హాసన్, కార్తీక్ వంటి హీరోలు తెలుగులో చాలా మంచి సినిమాలు చేశారు. కార్తీ కూడా సంవత్సరానికి ఒక తెలుగు స్ట్రైట్ సినిమా చెయ్యాలి. అతనితో సినిమా చేసేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నారు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. కార్తీ, రకుల్ ప్రీత్సింగ్ జంటగా వినోద్ దర్శకత్వంలో ఎస్.ఆర్. ప్రభు, ఎస్.ఆర్. ప్రకాశ్ తమిళంలో నిర్మించిన చిత్రం ‘ధీరన్ అధికారమ్ ఒండ్రు’. ఈ సినిమాని ‘ఖాకి’ పేరుతో ఆదిత్య మ్యూజిక్ అధినేతలు ఉమేశ్ గుప్తా, సుభాష్ గుప్తా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. జిబ్రాన్ స్వరపరచిన ఈ సినిమా పాటలను ‘దిల్’ రాజు రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘పోలీస్ పాత్రలు హీరోలకి ఛాలెంజింగ్గా ఉంటాయి. ‘నా పేరు శివ’, ఊపిరి’ సినిమాలతో కార్తీ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఆదిత్య మ్యూజిక్ అధినేతలు ‘ఖాకి’తో నిర్మాతలుగా మారుతుండటం సంతోషం’’ అన్నారు. కార్తీ మాట్లాడుతూ– ‘‘పోలీస్ పాత్రల్లో రెండు సినిమాలు చేశా. దర్శకుడు వినోద్ చెప్పిన కథ వినగానే చాలా ఇన్స్పైర్ అయ్యాను. చాలా మంది పోలీసాఫీసర్స్ని కలిశాను. 1995 నుంచి 2005 వరకూ జరిగిన ట్రూ స్టోరీ ఇది. ఇప్పటివరకు వచ్చిన పోలీస్ స్టోరీస్ కంటే డిఫరెంట్గా ఉంటుంది. ఈ నెల 17న సినిమా విడుదలవుతుంది’’ అన్నారు. ‘‘ఎంటర్టైన్మెంట్తో పాటు హిందూయిజం, ఎడ్యుకేషన్, పోలీస్ డిపార్ట్మెంట్స్, ్రౖకైమ్.. ఈ చిత్రంలో చూపించాం. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇస్తుంది’’ అన్నారు వినోద్. ‘‘ఖాకి’ నాకు స్పెషల్ మూవీ. నా పాత్ర కొత్తగా ఉంటుంది’’ అన్నారు రకుల్. నిర్మాతలు కె.ఎస్.రామారావు, శివలెంక కృష్ణప్రసాద్, కె.అచ్చిరెడ్డి, పి.కిరణ్, లగడపాటి శ్రీధర్, శైలేంద్రబాబు, దర్శకులు ఎస్.వి.కృష్ణారెడ్డి, ఎన్.శంకర్, కెమెరామెన్ సత్యం తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీధర్ రెడ్డి. -
‘దిల్’తో రామ్ హై
‘దిల్తో పాగల్ హై’ కదా... ‘దిల్తో రామ్ హై’ అంటారేంటి? వాట్ అమ్మా... వాటీజ్ దిస్ అమ్మా! తప్పుగా రాశారమ్మా! అనుకుంటున్నారా? అదేం లేదు. మీరు చదివిందీ... అక్కడ రాసిందీ... కరెక్టే! ‘దిల్’ అంటే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత ‘దిల్’ రాజు. త్వరలో ఈయన నిర్మాణంలో రామ్ ఓ సిన్మా చేయనున్నారు. ‘నేను లోకల్’ ఫేమ్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. మాస్ అండ్ ఎనర్జిటిక్ ఎంటర్టైనర్గా ఈ సిన్మాను తీయాలనుకుంటున్నారట! యాక్చువల్లీ... రామ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకుడిగా ‘దిల్’ రాజు నిర్మాణంలో ఓ సినిమా డిస్కషన్స్లో ఉందని గతంలో వార్తలొచ్చాయి. తర్వాత అదే కాన్సెప్టుతో రవితేజ హీరోగా ‘రాజా... ది గ్రేట్’ వచ్చింది. ఇప్పుడు రామ్–‘దిల్’ రాజు కాంబినేషన్లో సినిమాకు కథ కుదిరిందన్న మాట! మొన్న శుక్రవారమే విడుదలైన రామ్ ‘ఉన్నది ఒకటే జిందగీ’ మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సంతోషంలో కొత్త సినిమాను త్వరలో ప్రారంభించాలనుకుంటున్నారట!! -
ఫీల్గుడ్ లవ్స్టోరీ– ‘దిల్’ రాజు
‘‘ఈ చిత్రకథ నాకు తెలుసు. మంచి ఫీల్గుడ్ లవ్స్టోరీ. ఈ పాటలో సాహిత్యం, చిత్రీకరణ విధానం బాగుంది. మా సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. మంచి హిట్టవ్వాలని కోరుకుంటూ యూనిట్కి ఆల్ ది బెస్ట్’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. కార్తీకేయ, సిమ్రత్ జంటగా రిషి దర్శకత్వంలో రవీందర్ ఆర్. గుమ్మడికొండ నిర్మించిన ‘ప్రేమతో మీ కార్తీక్’ సినిమా తొలి పాటను ‘దిల్’ రాజు విడుదల చేశారు. రిషి మాట్లాడుతూ– ‘‘క్లీన్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. మా చిన్న చిత్రానికి ‘దిల్’ రాజు అండ దొరకడం మా అదృష్టం’’ అన్నారు. ‘‘మా అన్నయ్య కొడుకు కార్తికేయ పుణే ఫిలిం ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకుని, ఒకట్రెండు షార్ట్ ఫిలిమ్స్లో నటించాడు. సెకండ్ హీరో, ఇతర అవకాశాలు రావడంతో వద్దని నేనే నిర్మాతగా మారి ఈ సినిమా చేశా’’ అన్నారు రవీందర్ ఆర్. గుమ్మడికొండ. ‘‘త్వరలో సినిమా రిలీజ్కు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు లైన్ ప్రొడ్యూసర్ అశోక్రెడ్డి గుమ్మడికొండ. కార్తికేయ, మైత్రిమూవీస్ నవీన్ ఎర్నేని పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: రమణ శ్రీ గుమ్మడికొండ, గీతా మన్నం.