breaking news
Ganesh Chaturthi festival
-
70 ఏళ్లు.. 70 అడుగులు
ఖైరతాబాద్ (హైదరాబాద్): ఖైరతాబాద్లో 1954లో అడుగు ఎత్తుతో ఏర్పాటు చేసిన మహాగణపతి.. ఈ ఏడాదితో 70 ఏళ్లయిన సందర్భంగా.. 70 అడుగుల ఎత్తున్న విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు మహాగణపతి నమూనాను శుక్రవారం ఆవిష్క రించారు. ‘శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి’గా 70 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో స్వామి దర్శనమివ్వనున్నారు.నిల్చున్న ఆకృతిలో ఉండే గణపతి తలకు ఇరువైపులా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, మహంకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలు, రెండు వైపులా 14 చేతులు, కుడివైపు చేతుల్లో చక్రం, అంకుశం, పుస్తకం, త్రిశూలం, కమలం, శంఖం, ఎడమ వైపు రుద్రాక్ష, ఆసనం, పుస్తకం, వీణ, కమలం, గద ఉన్నాయి.మహాగణపతి పక్కన కుడివైపు పది అడుగుల ఎత్తులో ప్రత్యేకంగా బాల రాముడి విగ్రహం, ఎడమవైపు రాహుకేతువుల విగ్రహాలను 9 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయనున్నారు.వినాయకుడి పాదాల చెంత 3 అడుగుల మేర మూషిక వాహనం ఉంటుంది. మహాగణపతి కుడివైపు 14 అడుగుల ఎత్తులో శ్రీనివాస కల్యాణం, ఎడమవైపు శివపార్వతుల కల్యాణం విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ తెలిపారు. -
మహారాష్ట్రలోని అష్టగణపతి ఆలయాల గురించి మీకు తెలుసా?
గణపతి ఉపాసనకు మహారాష్ట్ర పెట్టింది పేరు. దానికి తగ్గట్టుగానే ఆ రాష్ట్రంలో గణపతి క్షేత్రాలు కోకొల్లలు. వాటన్నిటిలోకి అష్టగణపతి క్షేత్రాలుగా ప్రాముఖ్యం సంతరించుకున్న ఎనిమిది క్షేత్రాలు గణాధిపత్యులకు ముఖ్యమైనవి. ఈ ఎనిమిదీ ‘అష్టగణపతి క్షేత్రాలు‘గా ప్రసిద్ధికెక్కాయి. 1. మయూరేశ్వర గణపతి – పూనా జిల్లాలో పూనా నుండి నలభై మైళ్ళ దూరంలో నున్న ’మోరగావ్’లో మయూరేశ్వర గణపతి ఆలయం ఉంది. 2. చింతామణి గణపతి – పూనా నుండి పధ్నాలుగు మైళ్ళదూరంలో నున్న ’థేపూర్’ చింతామణి గణపతి క్షేత్రం. 3. గిరిజాత్మజ గణపతి – పూనా నుండి అరవై మైళ్ళదూరంలో నున్న ’లేహ్యాద్రి’ అనే స్థలంలో గిరిజాత్మజ గణపతి క్షేత్రం వెలిసింది. 4. శ్రీ విఘ్నేశ్వర గణపతి – లేహ్యాద్రి సమీపంలోనే ’ఓఝల్’ స్థలంలో ’శ్రీవిఘ్నేశ్వర’ క్షేత్రం వెలిసింది. 5. మహోత్కట గణపతి – పునానుండి 32 మైళ్ళ దూరంలో ’’రాజన్గావ్’’లో మహోత్కట గణపతి ఆలయం ఉంది. 6. భల్లాలేశ్వర గణపతి – మహారాష్ట్రలోని కులాబా జిల్లాలో ’పాలీ’ అనేచోట భల్లాలేశ్వర గణపతి క్షేత్రం ఉంది. 7. వరదవినాయకుడు – కులాబా జిల్లాలో ’’మహర్’’ అనే స్థలంలో ’’వరదవినాయక’’ ఆలయం ఉంది. 8. సిద్ధివినాయకుడు – అహ్మద్ నగర్ జిల్లాలో ’’సిద్ధటేక్’’ అనే స్థలంలో సిద్ధివినాయక క్షేత్రం వెలిసింది...!! -
Ganesh Chaturthi 2023: మనం కొలిచే తొలి దైవం ఆయనే..ఆనాటి నుంచే ఆచారం
సమస్త విఘ్నాలను పోగొట్టి,సర్వ విజయాలను,సత్వర ఫలాలను అందించే విఘ్ననాయకుడు వినాయకుడి పండుగను సభక్తి పూర్వకంగా జరుపుకోవడం అఖండ భారతీయులకు అనాదిగా వస్తున్న ఆచారం.మనం పూజించే తొలి దైవతం ఆయనే. ఎంతటి నాయకుడైనా వినాయకుడి ముందు సాగిలపడాల్సిందే.తమ ఇచ్ఛలు తీరాలంటే ఈ దేవుడిని కొలవాల్సిందే.భిన్న మతాలు,జాతులు కులాలు,సంస్కృతుల సంగమమైన భారతదేశాన్నిఏకం చేసింది,ఈ నేలపై జీవించేవారినందరినీ ఐక్యంగా నిలిపిందీ సనాతన ధర్మం.సహనం,సమ భావనందానికి ఆధారం."సర్వేజనా సుఖినో భవంతు"అన్న ఆర్యవాక్కులు దానికి మూలాధారం.సర్వజనులు బాగుండాలనే మంచితనం మనవారి రక్షణ కవచం.ఎక్కడెక్కడ నుంచో ఎవరెవరో వచ్చి,మనల్ని దురాక్రమించారు. వందల ఏళ్ళు ఈ రాజ్యం పరాయి పాలనలో సాగింది.ఎన్నో భాషా సంస్కృతులు వచ్చి చేరాయి.చాలా సంపదను కోల్పోయాం,విష కౌగిళ్ళ మధ్య నలిగిపోయాం.తుచ్ఛ సంస్కృతి వీధుల్లో ఏరులై పారింది.వీటన్నిటిని తట్టుకొని నిలబడ్డాం.మన ఉనికిని కాపాడుకున్నాం.మనదైన సంప్రదాయం మృగ్యమవకుండా చూసుకున్నాం.ప్రపంచ దేశాలలో భారత్ ను విశిష్టంగా గౌరవింప చేసింది,వివేకానంద వంటి మహనీయులు ప్రసంగిస్తుంటే ఆంగ్లేయులు సైతం మ్రాన్పడి వినేలా చేసింది మనదైన సంస్కారం.ఈ విశిష్ట విధానమే మన జీవనశైలి,మన పెంపకం.కలిసిమెలిసి వుండే కుటుంబ బంధాలు,గొప్ప వివాహ వ్యవస్థ మన దేశాన్ని సర్వోన్నతంగా నిలిపాయి.అదే మన సనాతన ఆచారంలోని ఔన్నత్యం. ఆచారం అంటే ఆచరించేది.హంగూ అర్భాటాలతో ప్రదర్శించేది కాదు.ఆత్మశుద్ధితో సాగే ఆరోగ్య స్రవంతి.పండుగలు మన జీవితంలో భాగం.హృదయంగమంగా జరుపుకోవడం ఒక యోగం.ఇంతటి ఉదాత్త విధానాల రూపమైన పండుగలు,ఆచారాలు రాజకీయాలకు వేదికలుగా మారడం మారుతున్న సమాజానికి, అడుగంటుతున్న విలువలకు అద్దం పట్టే విషాదం.అనంత కాలప్రవాహంలో,లక్షలాదిసంవత్సరాల మానవ జీవన పయనంలో కరోనా కాలం ఎంతో బాధించింది.ఇప్పుడు నిఫా వైరస్ అంటున్నారు.గతంలోనూ ఇటువంటివి ఎన్నో వచ్చి వెళ్లిపోయాయి.రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు.మంచిరోజులు వస్తాయి.భక్తి ప్రదర్శన కాదు.ఆత్మగతమైన అనుభూతి,బుద్ధిని ప్రక్షాళనం చేసే సద్గతి,అని మన పూర్వులు చెప్పారు.అఫ్ఘాన్ వంటి దేశాలను చూస్తేవారి రాక్షస ప్రవృత్తే వారిని ఏకాకులను చేసింది. డబ్బు పరంగా అగ్రరాజ్యమనే పేరున్నా,అమెరికాపై ప్రపంచ దేశాలకు విశ్వాసం లేదు.తుపానులా పైకి లేచిన చైనాను ఎవ్వరూ నమ్మరు.మూలక్షేత్రానికే దెబ్బకొడదామని చూసే పాకిస్తాన్ పట్ల ఎవ్వరికీ గౌరవం ఉండదు.క్షణక్షణానికి బంధాలు మార్చుకుంటున్న రష్యా తీరూ అంతే.ఒకప్పుడు అనంతమైన సంపదకు,సర్వ విద్యలకు నెలవుగా ఉన్న భారతదేశం,నేటికీ ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలోనే ఉన్నప్పటికీ,ప్రపంచం మనల్ని విశ్వసిస్తోంది,గౌరవిస్తోంది.ప్రపంచ తత్త్వశాస్త్రాలను -భారత తత్త్వ సిద్ధాంతాలను తులనాత్మకంగా విశ్లేషించి,భారతీయమైన ఔన్నత్యాన్ని ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణ ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో వివరిస్తూ, ప్రసంగం సాగిస్తే! మేధోసమాజమంతా ఆయనకు,ఆయనలోని భారతీయతకు మోకరిల్లింది. భారతీయ తత్త్వం తెలిసినవారే పాలకులుగా ఉండాలన్నది సర్వేపల్లివారి సంకల్పం.కులాలు,మతాలు, ప్రాంతాలు దాటి రాజకీయాలు సాగే పరిస్థితులు నేడు లేనే లేవు.వినాయకచవితి పండుగ ఎలా జరుపుకోవాలో వాళ్లే నిర్దేశిస్తున్నారు.ఒకరికి నచ్చినది ఇంకొకరికి నచ్చదు.ప్రజలను తదనుగుణంగా తమవైపు తిప్పుకొని రాజకీయమైన లబ్ధి పొందాలనే దృష్టి తప్ప,సంప్రదాయంపై,ఆచార వ్యవహారాలపై ప్రేమ కాదని తెలుస్తూనే ఉంటుంది.వివాదాలకు కావాల్సినంత ప్రచారం జరుగుతూనే ఉంటుంది.పండుగలను వివాదాలకు,ఆచారాలను రాజకీయాలకు వేదికగా మారని సమాజాన్ని చూడాలన్నది విజ్ఞుల హృదయం.సర్వజనులకు జయావహం,ప్రియంవదమైన వాతావరణం రావడమే పర్వదినం. సర్వ విఘ్నాలను తొలగించి,సకల జనులకు సకల జయాలను కలిగించి,ముప్పులకు ముగింపు పలికి,ప్రగతి ప్రయాణానికి ముహూర్తం పెట్టాలని విఘ్ననాయకుడికి విజ్ఞప్తి చేసుకుందాం.సనాతన ధర్మం, భారతీయత అందించిన సదాచారాల మధ్య,సమభావనతో,సోదర తుల్యంగా సహజీవనం చేద్దాం.పర్వదినం అంటే? సర్వులకు మంచిరోజు.పర్యావరణ హితంగా పండుగ జరుపుకుందాం. సరికొత్త సంకల్పాలకు శ్రీకారం చుడదాం.సిద్ధి దిశగా కృషి సాగిద్దాం. --మాశర్మ, సీనియర్ జర్నలిస్ట్ -
వినాయకుని వ్రత కల్పం... చేసుకోవలసిన విధి
పూజకు ఏర్పాట్లు ముందుగా పీటమీద ముగ్గువేసి, బియ్యంపోసి, దానిమీద శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి ప్రతిమను ఉంచి పైభాగాన పసుపు కుంకుమలతో అలంకరించిన పాలవెల్లిని కట్టాలి. పసుపు వినాయకుణ్ణి చేయాలి. పూజ చేసేవాళ్ళు బొట్టు పెట్టుకుని దీపారాధనచేసి వినాయకునికి నమస్కరించి పూజ ప్రారంభించాలి. ముందుగా పసుపుతో చేసిన గణపతిని పూజించాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపారాధన: (ఈ క్రింది శ్లోకాన్ని చదువుతూ దీపాన్ని వెలిగించి, దీపం కుంది వద్ద అక్షతలు ఉంచి నమస్కరించాలి.) శ్లో‘‘ భోదీపదేవి రూపస్త్యం, కర్మసాక్షి హ్యామిఘ్నకృత్‘ యావత్పూజాం కరిష్యామి తావత్వం సిద్ధిదో భవ‘‘ దీపారాధన ముహూర్తస్తు సుముహూర్తోస్తు‘‘ పరిశుద్ధి: (పంచపాత్రలోని నీటిని చెంచాతో తీసుకుని కుడిచేతి బొటనవేలు, మధ్య ఉంగరపు వేళ్ళతో నీటిని ఈ కింది మంత్రం చెబుతూ తలపై చల్లుకోవాలి) అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా! యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశ్శుచిః పుండరీకాక్ష, పుండరీకాక్ష, çపుండరీకాక్షాయ నమః విఘ్నేశ్వరుని వ్రతకల్పము శ్రీ గణేశాయ నమః శ్లో‘‘ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాన్తయే ‘‘ అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దన్తం భక్తానాం యేకదన్త ముపాస్మహే ‘‘ శ్రీ గణేశ షోడశ నామ ప్రతిపాదక శ్లోకాః శ్లో‘‘ సుముఖశ్చైకదన్తశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరమ్బస్కన్దపూర్వజః షోడశైతాని నామాని యః పఠేత్ శ్రుణుయాదపిః విద్యారమ్భే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా, సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తన్య నజాయతే ‘‘ ఆచమనం: ఓం కేశవాయ స్వాహా నారాయణాయ స్వాహా మాధవాయ స్వాహా (అని 3 సార్లు తీర్థం పుచ్చుకోవాలి) తరువాత చేయి కడుక్కోవాలి. గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః హృషీకేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః (రెండు అక్షతలను వాసన చూసి వెనుకకు వేయవలెను) శ్లో‘‘ ఉత్తిష్ఠంతు భూత పిశాచాః! యేతే భూమి భారకాః ఏతేషామవిరోధేన! బ్రహ్మకర్మ సమారభే! (ముక్కుపట్టుకుని ఎడమవైపు నుండి గాలిపీల్చి క్రింది మంత్రం చదివిన తరువాత ముక్కు కుడివైపు నుండి గాలి వదలవలెను.) ప్రాణాయామము: ఓం భూః ఓం భువః ఓగ్ం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగ్ం సత్యం ఓం తత్సవితుర్వ రేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్‘‘ ఓమాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్‘‘ సంకల్పం: మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞేయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావరీ మధ్యప్రదేశే స్వగృహే (సొంత ఇల్లుకానివారు మమ వాసగృహే అని చెప్పుకోవాలి) సమస్త దేవతాబ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ శుభకృత్ నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష బుుతౌ, భాద్రపద మాసే, శుక్లపక్షే, చతుర్థి తిథౌ, సౌమ్యవాసరే, శుభనక్షత్రే, శుభయోగే, శుభకరణ, ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ, శ్రీమాన్ శ్రీమతః గోత్రః................. (మీ గోత్రం చెప్పవలెను) నామధేయః ............................... (ఇంటిపెద్ద / యజమాని తన పేరు చెప్పుకోవలెను) ధర్మపత్నీ సమేతస్య మమ సపుత్రకస్య, సపుత్రికస్య సహ కుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, వీర్య, విజయ, అభయ, ఆయురారోగ్య, ఉద్యోగ, వ్యాపార, ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, సకల ధనకనక, విద్యా ప్రాప్త్యర్థం, వస్తువాహన సమృద్ధ్యర్థం, పుత్రపౌత్రాభివృద్థ్యర్థం, సర్వాభీష్ట ఫల సిద్థ్యర్థం శ్రీ వరసిద్ధివినాయక దేవతా ముద్దిశ్య శ్రీ వరసిద్ధివినాయక దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే‘‘ (కుడిచేతి ఉంగరపు వేలిని నీటిలో తాకవలెను) తదంగ కలశపూజాం కరిష్యేః (మరలా కుడిచేతి ఉంగరపు వేలిని నీటిలో తాకవలెను) కలశపూజ: (కలశాన్ని గంధం, పుష్పములు, అక్షతలతో పూజించి కలశముపై కుడిచేతిని ఉంచి, క్రింది శ్లోకము చెప్పుకొనవలెను) శ్లో‘‘ కలశస్య ముఖే విష్ణుః కంఠేరుద్ర సమాశ్రితః మూలేతత్రస్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌతు సాగరాః సర్వేసప్తద్వీపా వసుంధరా! ఋగ్వేదోధయజుర్వేదస్సామవేదో హ్యధర్వణః అంగైశ్చసహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః గంగేచ యమునే కృష్ణే గోదావరీ సరస్వతీ! నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు ‘‘ అయాంతు శ్రీ గణపతి పూజార్థం దురితక్షయ కారకాః కలశోదకేన పూజా ద్రవ్యాణిచ సంప్రోక్ష్యః దేవమాత్మానంచ సంప్రోక్ష్యః (పసుపుతో చేసిన గణపతిని తమలపాకుపై ఉంచి కుంకుమతో బొట్టు పెట్టవలెను. పసుపు విఘ్నేశ్వరుని క్రింది విధంగా పూజించాలి) శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి (నమస్కరించవలెను) గణానాంత్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనా ముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణాస్పత ఆనసృణ్వన్నూతిభిస్సీదసాదనం ఆవాహయామి ఆవాహనం సమర్పయామి (నీటిని చల్లవలెను) పాదయోః పాద్యం సమర్పయామి (మరల నీటిని చల్లవలెను) హస్తయోః అర్ఘ్యం సమర్పయామి (మరల నీటిని చల్లవలెను) ముఖే ఆచమనీయం సమర్పయామి (మరల నీటిని చల్లవలెను) ఔపచారిక స్నానం సమర్పయామి (నీటిని చల్లవలెను) స్నానానంతర ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను) వస్త్రం సమర్పయామి (పత్తితో చేసిన వస్త్రం లేదా పుష్పం ఉంచాలి) గంధాన్ ధారయామి (గంధమును చల్లవలెను) కుంకుమం సమర్పయామి గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి (అక్షతలు చల్లవలెను) పుష్పాని సమర్పయామి (పూలతో స్వామివారిని అలంకరించవలెను) స్వామికి పుష్పాలతో పూజ (ఈ క్రింది నామాలు చదువుతూ పుష్పాలతో పూజ చేయవలెను) ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయనమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కంద పూర్వజాయ నమః ఓం మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పత్రపుష్పాణి సమర్పయామి (పుష్పాలతోను, పత్రితోనూ పూజించవలెను) ధూపం ఆఘ్రాపయామి (అగరువత్తిని వెలిగించవలెను) దీపం దర్శయామి (దీపమును చూపవలెను) నైవేద్యం సమర్పయామి (బెల్లం ముక్కను నైవేద్యం పెట్టాలి) ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహిః ధియోయోనః ప్రచోదయాత్‘‘ సత్యం త్వరేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి (అని చెప్పి నైవేద్యముపై చుట్టూ నీటిని తిప్పి నైవేద్యంపై నీటిని అభికరించి ఎడమచేతితో కుడిచేతిని పట్టుకొని, కుడిచేతితో నైవేద్యాన్ని గణాధిపతికి చూపిస్తూ ఈ క్రింది మంత్రాలు చెప్పుకోవలెను). ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా శ్రీ మహాగణాధిపతయే నమః యథాభాగం గుడం నివేదయామి (బెల్లం ముక్కను నివేదించాలి) మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటిని చల్లవలెను) హస్తప్రోక్షయామి, పాదౌ ప్రోక్షయామి, ముఖే ఆచమనీయ సమర్పయామి (4సార్లు నీళ్ళు చూపించి వదలాలి) తాంబూలం సమర్పయామి (తాంబూలం ఉంచవలెను) ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను) ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి (కర్పూరమును వెలిగించాలి) శ్లో‘‘ వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ ‘ అవిఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా ‘‘ శ్రీ మహాగణాధిపతయే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. గణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు. మమ ఇష్టకామ్యార్థ çఫలసిద్ధ్యర్థం గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి (గణపతికి పూజచేసిన అక్షతలు కొన్ని తీసుకొని శిరస్సున ఉంచుకొనవలెను.) శ్రీ మహాగణాధిపతిం యథాస్థానం ప్రవేశయామి (పసుపు గణపతిని తూర్పునకు కొద్దిగా జరిపి మరల యథాస్థానంలో పెట్టాలి) వరసిద్ధి వినాయక పూజా ప్రారంభం స్వామిన్, సర్వజగన్నాథ యావత్పూజావసానగా తావత్త్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధింకురు ధ్యానం: స్వామివారి రూపాన్ని ఊహించుట (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకుని గణపతికి నమస్కరిస్తూ ఈ కింది ప్రార్థన చేసిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి) ఓం భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం‘‘ విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహం భజే‘‘ ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం‘‘ పాశాంకుశధరం దేవం ధ్యాయేత్సిద్ధి వినాయకమ్‘‘ ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం ‘‘ భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకమ్ ‘‘ ద్యాయేద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం‘‘ చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితాం ‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధివినాయక స్వామినే నమః ధ్యాయామి. (వినాయకుని ధ్యానించండి...) ప్రాణప్రతిష్ఠ: (స్వామివారికి ప్రాణంపోయుట) ఓమ్ అసునీతే పునరస్మాను చక్షుః పునఃప్రాణ మిహనో దేహి భోగమ్‘ జ్యోక్పశ్యేమ సూర్యముచ్ఛరంత మనుమతే మృఢయాన స్వస్తి అమృతం నై ప్రాణాః ‘ ప్రాణానేవ యథాస్థాన మువహ్వ యతే ‘‘ స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకమ్‘ తావత్త్వం ప్రతిభావేన ప్రతి మేస్మిన్ సన్నిధిం కురు‘‘ సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీ పుత్రం పరివార సమేతం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిన్ ఆవాహితో భవ, స్థాపితో భవ, సుముఖోభవ, సుప్రసన్నోభవ, వరదో భవ, స్థిరాసనంకురు, ప్రసీదః ప్రసీదః ప్రసీదః‘‘ ఆవాహనమ్: స్వామివారిని పిలవటం స్వామివారు వచ్చినట్లుగా భావించటం. (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకుని గణపతికి ఆసనం చూపుతూ నమస్కరించి ఈ కింది శ్లోకాన్ని చదివిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి) అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర‘ అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః ఆవాహయామి‘‘ ఆసనమ్: స్వామివారు మనముందు ఆసనముపై కూర్చుండినట్లు ఊహించటం (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకొని గణపతికి నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకాన్ని చదివిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి). మౌక్తికైః పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం! రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః నవరత్నఖచిత సింహాసనార్థ పుష్పాక్షతాన్ సమర్పయామి‘‘ పాద్యమ్: స్వామివారి పాదాలకు నీళ్ళు సమర్పించి పాదాలు కడుగుతున్నట్లు భావించడం (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దికొద్దిగా చల్లాలి) శ్లో‘‘ సర్వతీర్థ సముద్భూతం‘‘ పాద్యం గంగాది సంయుతం‘‘ విఘ్నరాజ! గృహాణేదం‘‘ భగవన్భక్త వత్సల‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః తమ పాదయోః పాద్యం సమర్పయామి‘‘ అర్ఘ్యమ్: స్వామివారి చేతులకు నీళ్ళు ఇచ్చుట (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దికొద్దిగా చల్లాలి) గౌరీపుత్ర నమస్తేస్తు! శంకర ప్రియనందన! గృహాణార్ఘ్యం మయాదత్తం గంధపుష్పాక్షతైర్యుతం‘‘ శ్రీ సిద్ధిబుద్ధిసమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి‘‘ ఆచమనీయమ్: స్వామివారి నోటికి నీళ్ళు అందించడం తాగుతున్నట్లు భావించుట (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దిగా చల్లాలి) అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజితః గృహాణాచమనం దేవః తుభ్యం దత్తం మయా ప్రభో‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి‘‘ మధుపర్కం: పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార వీటిని కలిపి స్వామివారికి అందించుట (గణపతికి మధుపర్కం సమర్పించాలి) దధిక్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం‘‘ మధుపర్కం గృహాణేదం గణనా«థం నమోస్తుతే‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మధుపర్కం సమర్పయామి. పంచామృత స్నానమ్: పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, వీటితో అభిషేకించేటట్లు భావించుట (పంచామృతాలతో ఈ కింద చెప్పిన వరుసలో గణపతికి అభిషేకం చేయాలి) పాలు: ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వతస్సోమ వృషిణ యం‘ భవా వాజన్య సంగధే‘‘ శ్రీ సిద్ధిబుద్ధిసమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః క్షీరేణ స్నపయామి‘‘ పెరుగు: ఓం దధిక్రాపుణ్ణో ఆకారిషం‘ జిష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్‘ ప్రణ ఆయూగ్ంషి తారిషత్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః దధ్నా స్నపయామి‘‘ నేయి: ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్పునా త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో స్సూర్యన్యరశ్మిభిః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః ఆజ్యేన స్నపయామి‘‘ తేనె: ఓం మధువాతా బుుతాయతే‘ మధుక్షీరంతి సింధవః మాధ్వీర్నస్సంత్వోషధీ!‘ మధునక్తముతోషసి మధుమత్వార్థినగ్ం రజః‘ మధుద్యైరస్తునః పీతా‘ మధుమాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తుసూర్యః మాధ్వీర్గావో భవంతునః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మధునా స్నపయామి‘‘ పంచదార: ఓం స్వాదుఃపవన్వ దివ్యాజన్మనే‘ స్వాదురింద్రాయ సుహవీతు నామ్నే‘ స్వాదుర్మి త్రాయ వరుణాయ వాయమే‘ బృహస్పతయే మధుమాగ్ం ఆదాభ్యః‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః శర్కరేణ స్నపయామి‘‘ (మిగిలిన పంచామృతాలన్నింటినీ ఈ క్రింది శ్లోకం చెబుతూ అభిషేకం చేయాలి) స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక‘ అనాథనాథ‘ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి. ఫలోదకమ్: (కొబ్బరినీటితో అభిషేకం చేయాలి) యాః ఫలినీర్యా ఫలాపుష్పాయాశ్చ పుష్పిణీః‘ బృహస్పతి ప్రసూతాస్తానో ముంచస్త్యగ్ంహనః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః ఫలోదకేన స్నపయామి‘‘ శుద్ధోదకమ్: మంచి నీటితో స్వామిని అభిషేకించునట్లుగా భావించడం (ఈ కింది శ్లోకంతో కలశంలోని నీటితో అభిషేకం చేయాలి. ఇక్కడ గణపతి ఉపనిషత్తు, పురుషసూక్త, నమకచమకాదులతో యథాశక్తి అభిషేకం చేయవచ్చు) గంగాది సర్వతీర్థేభ్యః అహృతైరమలైర్జలైః స్నానం కురుష్వ భగవాన్ ఉమాపుత్ర నమోస్తుతే‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః శుద్ధోదకస్నానం సమర్పయామి‘‘ స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి‘‘ (అంటూ కలశంలోని పుష్పంతో నీటిని పళ్ళెంలో విడవాలి. తరువాత ప్రతిమను వస్త్రంతో తుడిచి గంధం కుంకుమలతో అలంకరించి యథాస్థానంలో ఉంచాలి.) వస్త్రమ్: (నూతన వస్త్రములనుగాని, పత్తితో చేసిన వస్త్రద్వయాన్నిగాని ఈ కింది శ్లోకం చదివాక గణపతి పాదాలవద్ద ఉంచాలి) రక్తవస్త్రద్వయంచారు దేవయోగ్యంచ మంగళం‘ శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజ‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి‘‘ యజ్ఞోపవీతమ్: (పత్తితో చేసిన యజ్ఞోపవీతాన్ని గాని, పుష్పాక్షతలను గాని దేవునివద్ద ఉంచాలి) రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనంచోత్తరీయకం‘ గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి‘‘ గంధమ్: (ఒక పుష్పాన్ని చందనంలో ముంచి గణపతి పాదాల వద్ద ఉంచాలి) చందనాగరుకర్పూర కస్తూరీ కుంకుమాన్వితం‘ విలేపనం సురశ్రేష్ఠ! ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయకస్వామినే నమః గంధాన్ ధారయామి. అక్షతలు: (అక్షతలను దేవుని పాదాల వద్ద ఉంచాలి) అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్‘ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి‘‘ సింధూరం: శ్లో‘‘ ఉద్యద్భాస్కర సంకాశం‘‘ సంధ్యా వదరుణంప్రభో‘‘ వీరాలంకరణం దివ్యం‘‘ సింధూరం ప్రతిగృహ్యతాం‘‘ శ్రీ సిద్ధిబుద్ధి నమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః సింధూరం సమర్పయామి‘‘ మాల్యం: శ్లో‘‘ మాల్యాదీవి సుగంధాని‘‘ మాలత్యా దీనివై ప్రభో‘‘ మయాహృతాని పుష్పాణి‘‘ ప్రతిగృహ్ణీష్య శాంకర‘‘ శ్రీ సిద్ధిబుద్ధి నమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః మాల్యం సమర్పయామి‘‘ పుష్పమ్: (సుగంధ పుష్పాలను దేవుని పాదాల వద్ద ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పం చొప్పున అధాంగపూజ, అష్టోత్తరాలను చెబుతూ అలంకరణ చేయాలి. పుష్పాలు సరిపోని పక్షంలో అక్షతలతో పూజించవచ్చు). సుగన్ధానిచ పుష్పాణి జాజీకుందముఖానిచ ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే‘ శ్రీ సిద్ధిబుద్ధి నమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః పుష్పైః పూజయామి‘‘ అధాంగ పూజా: (స్వామి వారి అంగాన్ని ఒక్కొక్కటిగా అర్చించుట) గణేశాయ నమః పాదౌ పూజయామి‘ ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి‘ విఘ్నరాజాయ నమః జానునీ పూజయామి‘ కామారిసూనవే నమః జంఘే పూజయామి‘ అఖువాహనాయ నమః ఊరుః పూజయామి‘ హేరంబాయ నమః కటిం పూజయామి‘ లంబోదరాయ నమః ఉదరం పూజయామి‘ గణనాథాయ నమః హృదయం పూజయామి‘ స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి‘ పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి‘ గజవక్త్రా్తయ నమః వక్త్రం పూజయామి‘ విఘ్నహంత్రే నమః నేత్రౌ పూజయామి‘ శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి‘ ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి‘ సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి‘ శ్రీ గణాధిపాయ నమః సర్వాణ్యంగాని పూజయామి‘‘ ఏకవింశతి పత్ర పూజ ఏకవింశతి పత్రిపూజ సమయంలో పత్రితోనే పూజించాలి. దూర్వాయుగ్మ పూజ సందర్భంలో గరికతో పూజించాలి. లేని పక్షంలో అక్షతలతో పూజించాలి. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి‘ (మాచి ఆకు) ఓం గణాధిపాయ నమః బృహతీ పత్రం పూజయామి‘ (బలురక్కసి లేక ములక) ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి‘ (మారేడు) ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి‘ (గరికె రెమ్మలు) ఓం çహరసూనవే నమః దత్తూర పత్రం పూజయామి‘ (ఉమ్మెత్త ఆకు) ఓం లంబోదరాయ నమః బదరీ పత్రం పూజయామి‘ (రేగు ఆకు) ఓం గుహాగ్రజాయ నమః అపామార్గ పత్రం పూజయామి‘ (ఉత్తరేణి) ఓం గజకర్ణకాయ నమః తులసీ పత్రం పూజయామి‘ (తులసి) ఓం ఏకదంతాయ నమః చూత పత్రం పూజయామి‘ (మామిడి ఆకు) ఓం వికటాయనమః కరవీర పత్రం పూజయామి‘ (గన్నేరు ఆకు) ఓం భిన్న దంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి‘ (విష్ణుక్రాంతం) ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామి‘ (దానిమ్మ) ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి‘ (దేవదారు) ఓం ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి‘(మరువం) ఓం హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి‘ (వావిలాకు) ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి‘ (జాజి తీగ ఆకు) ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి‘ (దేవకాంచనం) ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి‘ (జమ్మి ఆకు) ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి‘ (రావి ఆకు) ఓం సుర సేవితాయ నమః అర్జునపత్రం పూజయామి‘ (తెల్లమద్ది) ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి‘ (జిల్లేడు ఆకు) ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాణి పూజయామి‘‘ (21 రకముల ఆకులను కలిపి వేసి నమస్కారము చేయవలెను) ఏకవింశతి దూర్వాయుగ్మ పూజ (రెండు, రెండు గరికలుగా స్వామిని అర్చించాలి) గణాధిపాయ నమః దుర్వాయుగ్మం పూజయామి! పాశాంకుశధరాయనమః దుర్వాయుగ్మం పూజయామి! ఆఖువాహనాయ నమః దుర్వాయుగ్మం పూజయామి! వినాయకాయనమః దుర్వాయుగ్మం పూజయామి! ఈశపుత్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి! సర్వసిద్ధిప్రదాయ నమః దుర్వాయుగ్మం పూజయామి! ఏకదంతాయనమః దుర్వాయుగ్మం పూజయామి! ఇభవక్త్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి! మూషికవాహనాయ నమః దుర్వాయుగ్మం పూజయామి! కుమారగురవే నమః దుర్వాయుగ్మం పూజయామి! కపిలవర్ణాయనమః దుర్వాయుగ్మం పూజయామి! బ్రహ్మచారిణేనమః దుర్వాయుగ్మం పూజయామి! మోదకహస్తాయనమః దుర్వాయుగ్మం పూజయామి! సురశ్రేష్ఠాయనమః దుర్వాయుగ్మం పూజయామి! గజనాసికాయ నమః దుర్వాయుగ్మం పూజయామి! కపిత్థఫలప్రియాయనమః దుర్వాయుగ్మం పూజయామి! గజముఖాయనమః దుర్వాయుగ్మం పూజయామి! సుప్రసన్నాయనమః దుర్వాయుగ్మం పూజయామి! సురాగ్రజాయనమః దుర్వాయుగ్మం పూజయామి! ఉమాపుత్రాయనమః దుర్వాయుగ్మం పూజయామి! స్కందప్రియాయనమః దుర్వాయుగ్మం పూజయామి! శ్రీ వరసిద్ధి వినాయకాయస్వామినే నమః ఏకవింశతి – దుర్వాయుగ్మం సమర్పయామి శ్రీ గణపతి అష్టోత్తర శతనామావళి ఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ద్వైమాతురాయ నమః ఓం ద్విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృతినే నమః ఓం సుప్రదీపాయ నమః ఓం సుఖనిధయే నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం సురారిఘ్నాయ నమః ఓం మహాగణపతయే నమః ఓం మాన్యాయ నమః ఓం మహాకాలాయ నమః ఓం మహాబలాయ నమః ఓం హేరంబాయ నమః ఓం లంబకర్ణాయ నమః ఓం హ్రస్వగ్రీవాయ నమః ఓం మహోదరాయ నమః ఓం మహోత్కటాయ నమః ఓం మహావీరాయ నమః ఓం మంత్రిణే నమః ఓం మంగళస్వరూపాయ నమః ఓం ప్రమధాయ నమః ఓం ప్రథమాయ నమః ఓం ప్రాజ్ఞాయ నమః ఓం విఘ్నకర్త్రే నమః ఓం విఘ్నహంత్రే నమః ఓం విశ్వనేత్రే నమః ఓం విరాటత్పయే నమః ఓం శ్రీపతయే నమః ఓం శృంగారిణే నమః ఓం ఆశ్రితవత్సలాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం శీఘ్రకారిణే నమః ఓం శాశ్వతాయ నమః ఓం బలాయ నమః ఓం బలోద్ధితాయ నమః ఓం భవాత్మజాయ నమః ఓం పురాణపురుషాయ నమః ఓం పూష్ణే నమః ఓం పుష్కరక్షిప్తవారిణే నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రపూజ్యాయ నమః ఓం అగ్రగామినే నమః ఓం మంత్రకృతే నమః ఓం చామీకరప్రభాయ నమః ఓం సర్వాయ నమః ఓం సర్వోపన్యాసాయ నమః ఓం సర్వకర్త్రే నమః ఓం సర్వనేత్రే నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం సర్వసిద్ధయే నమః ఓం పంచహస్తాయ నమః ఓం పార్వతీనందనాయ నమః ఓం ప్రభవే నమః ఓం కుమార గురవే నమః ఓం అక్షోభ్యాయ నమః ఓం కుంజరాసుర భంజనాయ నమః ఓం ప్రమోదాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం కాంతిమతే నమః ఓం ధృతిమతే నమః ఓం కామినే నమః ఓం కపిత్థఫలప్రియాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం బ్రహ్మవిద్యాధిపాయ నమః ఓం విష్ణవే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తజీవితాయ నమః ఓం జితమన్మథాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం జ్యాయనే నమః ఓం యక్షకిన్నరసేవితాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గంభీరనినదాయ నమః ఓం వటవే నమః ఓం అభీష్టవరదాయినే నమః ఓం జ్యోతిషే నమః ఓం భక్తనిధయే నమః ఓం భావగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం అపాకృతపరాక్రమాయ నమః ఓం సత్యధర్మిణే నమః ఓం సఖ్యే నమః ఓం సరసాంబునిధయే నమః ఓం మహేశాయ నమః ఓం దివ్యాంగాయ నమః ఓం మణికింకిణీ మేఖలాయ నమః ఓం సమస్తదేవతామూర్తయే నమః ఓం సహిష్ణవే నమః ఓం సతతోత్థితాయ నమః ఓం విఘాతకారిణే నమః ఓం విశ్వక్దృశే నమః ఓం విశ్వరక్షాకృతే నమః ఓం కళ్యాణ గురవే నమః ఓం ఉన్మత్తవేషాయ నమః ఓం అపరాజితే నమః ఓం సమస్త జగదాధారాయ నమః ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః ఓం ఆక్రాన్తచిదచిత్ప్రభవే నమః ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః శ్రీసిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. బిల్వం: శ్లో‘‘ త్రిదళం త్రిగుణాకరం‘‘ త్రినేత్రంచ త్రియాయుధం‘‘ త్రిజన్మ పాప సంహారం‘‘ ఏకబిల్వం శివార్పణం ‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః బిల్వపత్రం సమర్పయామి. ధూపమ్: (అగరువత్తులను వెలిగించి ఆ ధూపాన్ని గణపతికి కుడి చేతితో చూపించాలి. అంతేగాని అగరువత్తులను చుట్టూ తిప్పకూడదు) దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం‘‘ ఉమాసుత నమస్తుభ్యం గృçహాణవరదో భవ‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః ధూపమాఘ్రాపయామి. దీపమ్: (కర్పూర దీపాన్ని గాని, నేతి దీపాన్ని గాని కుడిచేతితో భగవంతునికి చూపాలి) సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాద్యోతితం మయా‘ గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే‘‘ శ్రీసిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః దీపం దర్శయామి‘‘. నైవేద్యమ్: (గణపతికి నివేదించాల్సిన అన్ని ఫలాలను, పిండి వంటలను పళ్ళెంలో ఒక ఆకువేసి ఆ ఆకులో పెట్టి ఉంచాలి. వాటిపై ఈ కింది మంత్రంతో నీళ్ళు చల్లాలి) ఓమ్ భూర్భువస్సువః‘ ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి‘ ధియోయనః ప్రచోదయాత్‘‘ (పుష్పంతో నీటిని పదార్థాల చుట్టూ తిప్పాలి) ఓమ్ సత్యంత్వర్తేన పరిషించామి‘‘ ఓమ్ బుుతంత్వా సత్యేన పరిషించామి‘‘ సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాం దేవగణముదై్గః ప్రకల్పితాన్‘ భక్ష్యం భోజ్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ‘ ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః మహానైవేద్యం సమర్పయామి. (పుష్పంతో నీటిని రెండుసార్లు పళ్ళెంలో విడిచిపెట్టాలి) ఓమ్ అమృతమస్తు! ఓమ్ అమృతోపస్తరణమసి‘‘ (అయిదుసార్లు ఎడమచేతితో కుడిమోచేయిని పట్టుకుని కుడిచేతితో గణపతివైపు నైవేద్యాన్ని చూపాలి) ఓమ్ ప్రాణాయ స్వాహా‘ ఓమ్ అపానాయ స్వాహా‘ ఓమ్ వ్యానాయ స్వాహా‘ ఓమ్ ఉదానాయ స్వాహా ఓమ్ సమానాయ స్వాహా‘‘ (తరువాత సమర్పయామి అన్నప్పుడల్లా పుష్పంతో పళ్ళెంలో నీళ్ళు వదలాలి) మధ్యే మధ్యే పానీయం సమర్పయామి‘ అమృతాపి« దానమసి ఉత్తరాపోశనం సమర్పయామి‘ హస్తౌ ప్రక్షాళయామి‘ పాదౌప్రక్షాళయామి‘ శుద్ధాచమనీయం సమర్పయామి‘‘. తాంబూలమ్: (మూడు తమలపాకులు, వక్కలు, అక్షతలు, పుష్పం, ఫలం సుగంధ ద్రవ్యాలు, దక్షిణలతో తాంబూలాన్ని గణపతి వద్ద ఉంచాలి) పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం‘ కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్‘‘ శ్రీసిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః తాంబూలం సమర్పయామి‘‘ శ్రీ గణేష ప్రార్థన తుండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్ కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జౖయె యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్‘ తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటినందన నీకు మ్రొక్కెదన్ ఫలితము సేయుమయ్య నిను ప్రార్థన చేసెద నేకదంత నా వలపటి చేతి గంటమున వాక్కున నెప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడెద దైవగణాధిప‘ లోకనాయకా! తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని తలచిన పనిగా దలచితినే హేరంబుని దలచితి నా విఘ్నముల దొలగుట కొఱకున్ అటుకులు కొబ్బరిపలుకులు చిటిబెల్లము నానుబ్రాలు చెరకు రసంబున్ నిటలాక్షు నగ్రసుతునకు పటుతరముగ విందుసేతు ప్రార్థింతు మదిన్ శ్రీ వినాయకుని దండకము శ్రీ పార్వతీపుత్ర లోకత్రయీస్తోత్ర, సత్పుణ్యచారిత్ర, భద్రేభవక్త్రా మహాకాయ, కాత్యాయనీనాథ సంజాత స్వామీ శివాసిద్ధి విఘ్నేశ, నీ పాదపద్మంబులన్, నీదు కంఠంబు నీ బొజ్జ నీ మోము నీ మౌళి బాలేందు ఖండంబు నీ నాల్గు హస్తంబులన్నీ కరాళంబు నీ పెద్ద వక్త్రంబు దంతంబు నీ పాద యుగ్మంబు లంబోదరంబున్ సదా మూషికాశ్వంబు నీ మందహాసంబు నీ చిన్ని తొండంబు నీ గుజ్జు రూపంబు నీ శూర్పకర్ణంబు నీ నాగ యజో›్ఞపవీతంబు నీ భవ్యరూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్కంగ శ్రీ గంధమున్ గుంకుమం బక్షతలాజులున్ చంపకంబున్ తగన్ మల్లెలన్మొల్లలన్మంచి చేమంతులున్ తెల్లగన్నేరులన్ మంకెనల్ పొన్నలన్ పువ్వులు న్మంచి దుర్వంబు లందెచ్చి శాస్త్రోక్తరీతిన్ సమర్పించి పూజించి సాష్టాంగంబు జేసి విఘ్నేశ్వరా నీకు టెంకాయలుం పొన్నంటిపండున్ మరిన్మంచివౌ ఇక్షుఖండంబులున్, రేగుబండ్లప్పడాల్ వడల్ నేతిబూరెల్ మరీస్ గోధుమప్పంబులు న్వడల్ పున్గులున్ గారెలున్ చొక్కమౌ చల్మిడిన్ బెల్లమున్ తేనెయుం జున్ను బాలాజ్యమున్నాను బియ్యంబు చామ్రంబు బిల్వంబు మేల్ బంగరున్ బళ్లెమం దుంచి నైవేద్యముంబంచనీ రానంబున్ నమస్కారముల్జేసి విఘ్నేశ్వరా నిన్ను బూజింపకే యన్యదైవంబుల్ ప్రార్థనల్చే యుటల్ కాంచనం బొల్లకే యిన్ముదాగోరు చందంబుగారే మహాదేవ యో భక్తమందారయో సుందరాకార యో భాగ్యగంభీర యో దేవ చూడామణీ లోకరక్షామణీ బంధు చింతామణీ స్వామి నిన్నెంచ నేనెంత నీదాస దాసాదిదాసుండ శ్రీ దంత రాజన్వయుండ రామాభిదాసుండ నన్నిప్డు చేపట్టి సుశ్రేయునింజేసి శ్రీమంతుగన్జూచి హృత్పద్మసింహాస నారూఢతన్నిల్పి కాపాడుటే కాదు నిన్గొల్చి ప్రార్థించు భక్తాళికిన్ కొంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్విద్య యున్నాడియున్ బుత్ర పౌత్రాభివృద్ధిన్ దగన్గల్గగాజేసి పోషించుమంటిన్ గృపన్ గావుమంటిన్ మహాత్మా! ఇవే వందనంబుల్ శ్రీ గణేశా నమస్తే.. నమస్తే...నమః నీరాజనమ్: (హారతి కర్పూరాన్ని వెలిగించి ఆ దీపాన్ని తిప్పుతూ గణపతికి చూపించాలి) ఘృతవర్తిసహస్రైశ్చ కర్పూర శకలైస్తదా‘ నీరాజనం మయాదత్తం గృహాణ వరదోభవ‘‘ సమ్రాజంచ విరాజంచ అభిశ్రీః యాచనోగృహే లక్ష్మీ రాష్ట్రయాముఖే తయామా సగ్ం సృజామసి‘‘ సంతత శ్రీరస్తు‘ సమస్త సన్మంగళానిభవంతు‘ నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః నీరాజనం దర్శయామి‘‘ నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి‘‘ (అని పుష్పంతో పళ్ళెంలో నీటిని విడవాలి) మంత్రపుష్పమ్: (ఇక్కడ మంత్రపుష్పాన్ని పెద్దదిగాని, చిన్నదిగాని చెప్పవలెను. రానివారు ఈ శ్లోకాలతో మంత్రపుష్పాన్ని సమర్పించాలి) గణాధిప నమస్తేస్తు ఉమాపుత్రా విఘ్ననాశక‘ వినాయకేశ తనయ సర్వసిద్ధి ప్రదాయక‘‘ ఏకదంతైక వదన తథా మూషికవాహన‘ కుమారగురవే తుభ్యమర్పయామి సుమాంజలిమ్‘‘ తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి‘ తన్నోదంతిః ప్రచోదయాత్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మప్రదక్షిణ నమస్కారమ్: (పువ్వులు, అక్షతలు తీసుకుని లేచి నిలబడి నమస్కారం చేయాలి. అంతేగాని తనచుట్టూ తాను తిరగకూడదు) ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ‘ నమస్తే విఘ్నరాజాయ‘ నమస్తే విఘ్ననాశన‘‘ యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ‘ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదేపదే‘ పాపోహం పాపకర్మానాం పాపాత్మా పాపసంభవః త్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల‘ అన్యాధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ‘ తస్మాత్కారుణ్యభావేన రక్షరక్ష గణాధిప‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ప్రార్థన: (పుష్పాక్షతలతో ప్రార్థించి, తరువాత వాటిని గణపతి పాదాల వద్ద ఉంచాలి) నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశక‘ ఈప్సితంమే వరందేహి పరత్రచ పరాంగతిమ్‘‘ వినాయక నమస్తుభ్యం సతతం మోదకప్రియ‘ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా‘‘ అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా పుత్రోయమితి మామత్వా క్షమస్వ గణనాయక‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి‘‘ సాష్టాంగ నమస్కారమ్ ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా‘ పాదాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి‘‘ శ్లో‘‘ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపతి యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అనేన పూజావిధానేన శ్రీ మహాగణాధిపతి సుప్రీత స్సుప్రసన్నో వరదోభవతు. (నేను చేసిన పూజలో మంత్రలోపము, క్రియాలోపము, భక్తి లోపము ఉన్నను అవన్నీ మన్నించి గణపతి దేవా పరిపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించుము.) అపరాధ ప్రార్థన: అపరాధ సహస్రాణి క్రియంతేహం అహర్నిశా‘ పుత్రోయమితి మామత్వా క్షమస్వ గణనాయక‘‘ ఆవాహనం నజానామి నజానామి విసర్జనం‘ పూజాంచైవ నజానామి క్షమ్యతాం గణనాయక‘‘ శ్రీ వరసిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయకస్వామినే నమః అపరాధ నమస్కారాన్ సమర్పయామి‘‘ (రెండు చేతులు జోడించి గణపతికి నమస్కరించి, చెంపలు వేసుకోవాలి). (ఈ కింది మంత్రాలను చెబుతూ కొన్ని అక్షతలు చేతిలో తీసుకొని నీటితో పళ్ళెంలో విడిచిపెట్టాలి) అనేక మయాకృతేన కల్పోక్త ప్రకారేణ గణపతి అష్టోత్తర శతనామ సహిత యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజానేన భగవాన్ సర్వాత్మకః శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామిన్ సుప్రీతః సుప్రసన్నః వరదో భవతు. -
గణపయ్యలకు మస్తు డిమాండ్.. జోరుగా అమ్మాకాలు
వినాయక విగ్రహాల అమ్మకాలు జోరందుకున్నాయి. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సమయం రెండు రోజులే ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా విగ్రహాలు, పూజా సామగ్రి కొనుగోళ్లతో యువత సందడి చేస్తోంది. కరోనా కారణంగా గత రెండు, మూడు సంవత్సరాలుగా అంతంత మాత్రంగానే విగ్రహాలు నెలకొల్పారు. ఈసారి ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ సమితులు సిద్ధమయ్యాయి. దీనికి తోడు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడం ఉత్సవ నిర్వాహకులకు కలిసొచ్చింది. ఆశావహులు, అభ్యర్థులు పెద్ద ఎత్తున విగ్రహాలు ఇప్పిస్తున్నారు. మొత్తంగా గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో వినాయక విగ్రహాల అమ్మకాలు ఉన్నట్లు తయారీదారులు చెబుతున్నారు. అయితే మట్టి వినాయకులపై అంతగా ఆసక్తి చూపడం లేదు. ఇళ్లలో ఏర్పాటు చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు.పండుగ మరో రెండు రోజులు ఉన్నందున ఇంకా పెరిగే అవకాశం ఉంది. ధరలు గత ఏడాది మాదిరిగానే నిర్ణయించామని విగ్రహ తయారీదారులు తెలిపారు. -
చవితి వేడుకలకు ముస్తాబవుతున్న గణనాథుడు (ఫొటోలు)
-
TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ (TCSS-(సింగపూర్) ఆధ్వర్యంలో జూమ్ ద్వారా శ్రీ వినాయక చవితి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. సకల విఘ్నాలు తొలగి అందరిపై వినాయకుని ఆశీస్సులు ఉండాలని, ప్రపంచాన్ని కరోనా నుండి కాపాడాలని కోరారు. ఈ పూజను ఇండియా నుండి మహబూబ్ నగర్ కు చెందిన శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ పురోహితులు ఇరువంటి శ్రావణ్ కుమార్ శర్మ అంతర్జాలం ద్వారా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా నడికట్ల భాస్కర్, నంగునూరి సౌజన్య, శివ ప్రసాద్ ఆవుల మరియు, రవి కృష్ణ విజాపూర్ వ్యవహరించారు. సొసైటీ తరపున సొసైటీ అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కార్యదర్శి గడప రమేష్ బాబు, కోశాధికారి కల్వ లక్ష్మణ్ రాజు, ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, గోనె నరేందర్ రెడ్డి, సునీత రెడ్డి, భాస్కర్ గుప్త నల్ల, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, జూలూరి సంతోష్ కుమార్, రోజా రమణి, నంగునూరి వెంకట రమణ, కార్యవర్గ సభ్యులు, శ్రీధర్ కొల్లూరి, పెరుకు శివ రామ్ ప్రసాద్, గార్లపాటి లక్ష్మా రెడ్డి, అనుపురం శ్రీనివాస్, ప్రవీణ్ మామిడాల, శశిధర్ రెడ్డి, కాసర్ల శ్రీనివాస్ లు సంబరాల్లో పాల్గొన్న భక్తులకు ధన్యవాదాలు తెలిపారు. అందరి పై శ్రీ వినాయకుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ ఎల్లప్పుడు సొసైటీ వెన్నంటే ఉంటూ సహకారం అందిస్తున్న వారితో పాటు అందరికి వినాయక చవితి శుభాకాంక్షలతో పాటు కృతజ్ఞతలు తెలియ జేశారు. -
వినాయక ఉత్సవాలపై ఆంక్షలు సబబే
సాక్షి, అమరావతి: కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వెలువరించిన కోవిడ్ మార్గదర్శకాల అమలులో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో వినాయక మండపాలు, విగ్రహాలు ఏర్పాటు చేయరాదంటూ డీజీపీ జారీ చేసిన ఆదేశాలను హైకోర్టు సమర్థించింది. బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి మండపాలు, విగ్రహాలు ఏర్పాటు చేయరాదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రైవేట్ ప్రదేశాల్లో మాత్రమే మండపాలు, విగ్రహాలు ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొంది. అయితే పూజల సమయంలో ఒకేసారి ఐదుగురి కంటే ఎక్కువ మందిని అనుమతించరాదని మండపాల నిర్వాహకులను హైకోర్టు ఆదేశించింది. ఈ దిశగా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మండపాల వద్ద పూజల సమయంలో ఎక్కువ మంది సమూహాలుగా గుమికూడకుండా చూడాలని పోలీసులకు స్పష్టం చేసింది. ఆంక్షలు మాత్రమే.. నిషేధం విధించలేదు హోంశాఖ ముఖ్య కార్యదర్శి తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్, పోలీసు అధికారుల తరఫున ప్రభుత్వ న్యాయవాది వి.మహేశ్వర్రెడ్డిలు వాదనలు వినిపిస్తూ కేంద్రం జారీ చేసిన కోవిడ్ ప్రొటోకాల్స్కు లోబడే వినాయక ఉత్సవాల నిర్వహణపై ఆంక్షలు విధించినట్లు నివేదించారు. ఉత్సవాలపై ఎలాంటి నిషేధం విధించలేదని, కేవలం బహిరంగ ప్రదేశాల్లో మండపాలు, విగ్రహాలు ఏర్పాటు చేయరాదని మాత్రమే ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. మతపరమైన హక్కులన్నీ రాజ్యాంగంలోని అధికరణ 21కి లోబడి ఉంటాయని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. సహేతుక ఆంక్షలు విధించేందుకు ప్రభుత్వాలకు అధికారం ఉందన్నారు. రాజకీయ పార్టీలు ఒకచోట సమావేశాలు నిర్వహిస్తాయని, ఇక్కడ పిటిషనర్లకు అనుమతినిస్తే రాష్ట్రవ్యాప్తంగా 4 వేల చోట్ల అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇవన్నీ కోవిడ్ వ్యాప్తికి కారణం అవుతాయన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇరుపక్షాల వాదనల అనంతరం ప్రభుత్వ న్యాయవాదుల వాదనలతో న్యాయమూర్తి ఏకీభవిస్తూ తీర్పు వెలువరించారు. సహేతుక ఆంక్షలు మంచిదే రాజ్యాంగం ప్రకారం మతపరమైన కార్యకలాపాలను నిర్వహించుకునే స్వేచ్ఛ పౌరులకు ఉందని, ఇలాంటి వాటిపై సంపూర్ణ నిషేధం విధించడానికి వీల్లేదని హైకోర్టు పేర్కొంది. అయితే ఇదే సమయంలో శాంతి, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సహేతుక ఆంక్షలు విధించే అధికారం ప్రభుత్వానికి ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్రాయ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని కేశవయాన గుంట ప్రాంతంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు పోలీసులు అనుమతులు ఇవ్వడం లేదంటూ ఆర్.మణికాంత్ వర్మ, ఎస్.ప్రశాంత్, తిరుపతి ఆటోనగర్కు చెందిన తమ్మా ఓంకార్లు వేర్వేరుగా హైకోర్టులో అత్యవసరంగా లంచ్మోషన్ రూపంలో దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ అనంతరం న్యాయమూర్తి ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. -
వినాయక చవితి శుభాకాంక్షలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో, అభివృద్ధిలో ముందడుగు వేయాలని అభిలషించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఎదురవుతున్న ఆటంకాలు, విఘ్నాలన్నీ తొలగిపోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. (అక్క చెల్లెమ్మల జీవితాల్లో వెలుగు) -
మొదలైన వినాయక విగ్రహాల సందడి
జోగిపేట :వినాయక చవితి పండగను పురస్కరించుకొని హైదరాబాద్ నుంచి వినాయక విగ్రహాలు గ్రామాలకు తరలిస్తున్నారు. సెప్టెంబర్ 5వ తేదీన వినాయక చవితి నిర్వహించనున్నారు. పండగకు 20 రోజుల ముందే విగ్రహాలను తీసుకువెళుతున్నారు. జోగిపేట, నారాయణఖేడ్, పెద్దశంకరంపేట ప్రాంతాలకు కూడా విగ్రహాలను తీసుకువస్తుంటారు. ఈ సారి వినాయక విగ్రహాల రేట్లు బాగా పెరిగినట్లు కొనుగోలు దారులు తెలిపారు. 4, 5 అడుగుల వినాయక విగ్రహాలు రూ.14వేల వరకు పలుకుతున్నాయని కొనుగోలు దారులు తెలిపారు. -
వినాయకచవితికి ఇరుముగ న్
ఇరుముగన్ చిత్రం వినాయకచవితి పండగ సందర్భంగా విడుదలకు సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. సియాన్ విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం ఇరుముగన్. ఆయన తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంతో అందాల భామలు నయనతార, నిత్యామీనన్ నటిస్తున్నారు. అరిమానంబి వంటి విజయవంతమైన చిత్రంతో మోగాఫోన్ పట్టిన యువ దర్శకుడు ఆనంద్శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పులి చిత్ర నిర్మాతల్లో ఒకరైన శిబు తమీన్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఇరుముగన్ తాజాగా భారీ షెడ్యూల్ను శనివారం నుంచి చెన్నైలో జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని జూలైలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు ఇంతకు ముందు తెలిపారు. అయితే చిత్ర విడుదల తేదీ మారనుందని సమాచారం. చిత్ర షూటింగ్ జూన్ చివరి వరకూ జరగనుందని తెలిసింది. చెన్నై షెడ్యూల్ పూర్తి చేసుకున్న తరువాత తదుపరి లడక్లో నిర్వహించనున్నట్లు, చిత్ర క్లైమాక్స్ సన్నివేశాలను బ్యాంకాంక్లో చిత్రీకరించనున్నట్లు సమాచారం. అందువల్ల చిత్రాన్ని వినాయకచవితి పండగను పురష్కరించుకుని సెప్టెంబర్ ఐదున విడుదల చేయడానికి సన్నాహాలు చే స్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి హారీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
తెగబడిన స్నాచర్లు
పండుగ రోజు శుక్రవారం ఆరు చోట్ల చోరీ ► 28 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లిన వైనం ► ఇదే రీతిలో గుత్తి, గుంతకల్లులో శనివారం ఘటనలు ► కలకలం సృష్టించిన ‘చైన్ బ్యాచ్’ - ఆచూకీ తెలిపితే రూ.25 వేలు పారితోషికం అనంతపురం క్రైం : అనంతపురం నగరంలోని పోలీసులకు వినాయక చవితి పండుగ రోజున చైన్ స్నాచర్లు ఝులక్ ఇచ్చారు. శుక్రవారం ఆరు చోట్ల చోరీలకు తెగబడ్డారు. మహిళలనే లక్ష్యంగా చేసుకుని 28 తులాల బంగారు చైన్లు, తాళి బొట్టు చైన్లు లాక్కెళ్లారు. ఒకచోట దొంగతనం జరిగిందని తెలిసి పోలీసులు అక్కడికి వెళ్లి విచారిస్తుండగానే మరో ప్రాంతంలో చైన్ స్నాచింగ్కు పాల్పడి సవాల్ విసిరారు. వన్టౌన్, టూటౌన్, త్రీటౌన్ ఇలా మూడు పోలీస్స్టేషన్ల పరిధిలోనూ చేతివాటం ప్రదర్శించడం గమనార్హం. ఒకరు బైక్ నడుపుతూ మహిళలకు సమీపంలోకి వెళ్లగా, వెనుక కూర్చొన్న యువకుడు ఒక్క ఉదుటున చైను లాగేసుకుంటూ ఉడాయించారు. కాగా, శనివారం గుత్తి, గుంతకల్లులోనూ ఇదే రీతిలో ఇద్దరు యువకులు చోరీలకు తెగించారు. అన్ని సంఘటనలూ ఒకే రీతిలో జరగడం చూస్తుంటే ఒకే గ్రూపు ఈ ఘటనలకు పాల్పడి ఉంటుందనే నిర్ధారణకు పోలీసులు వచ్చారు. పోలీసులు తెలిపిన మేరకు చైన్స్నాచింగ్ ఘటనల వివరాలిలా ఉన్నాయి. ముగ్గు వేస్తుండగా... ఎంపీడీఓ జయరాం భార్య అలివేణి టీచరు. వీరు జీసస్నగర్లో ఉంటున్నారు. ఉదయం 5-50 గంటల ప్రాంతంలో అలివేణి ఇంటి ముందు ముగ్గు వేస్తోంది. ఒక అపరిచిత వ్యక్తి వచ్చి అలివేణి మెడలో నుంచి బలవంతంగా ఐదు తులాల బంగారు చైను లాక్కుని ఉడాయించాడు. కాస్త దూరంలో మరో వ్యక్తి సిద్ధంగా ఉంచుకున్న బైకులో ఎక్కి వెళ్లిపోయాడు. రెప్పపాటులో కనుమరగయ్యారు. ఆంటీ అని పిలిచి... ఆర్టీసీ బస్టాండు వెనుకవైపు ఉన్న షిరిడీ నగర్లో ఉంటున్న రమాదేవి ప్రధానోపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఈమె ఉదయం 6.30 గంటల సమయంలో ఇంటిముందు చెట్టు నుంచి పూలు కోస్తుండగా వెనుకవైపు నుంచి వచ్చిన ఓ వ్యక్తి ‘ఆంటీ...’ అని పిలిచాడు. వెనక్కు తిరిగి చూడగానే ఆమె కాలిపై తొక్కిపెట్టి ఒక్క ఉదుటున మెడలో ఉన్న 7 తులాల బంగారం చైను లాక్కుని వెళ్లాడు. కాస్త దూరంలో మరో వ్యక్తి సిద్ధంగా ఉంచిన బెకైక్కి వెళ్లిపోయాడు. వృద్ధురాలి మెడలోని చైన్ అపహరణ హౌసింగ్ బోర్డులోని ఇండేన్ గ్యాస్ ఎదురుగా రెవెన్యూ కాలనీలో అంజనమ్మ అనే వృద్ధురాలి మెడలో నుంచి మూడు తులాల బంగారు చైనును లాక్కుని ద్విచక్రవాహనం నుంచి ఉడాయించారు. పెద్దావిడ కేకలు వేసినా.. అప్పటికే వారు కనింపిచకుండా వెళ్లిపోయారు. ఇంటిముందు కూర్చుని ఉండగా... శ్రీనగర్కాలనీలో వి. పార్వతమ్మ అనే వృద్ధురాలు ఉదయం 7.30 గంటల సమయంలో ఇంటి ముందు వసారాలో కూర్చుని ఉంది. నిర్మానుష్య ప్రదేశం కావడంతో స్నాచర్లు పార్వతమ్మ వద్దకు నేరుగా వచ్చి 4 తులాల బంగారు చైను లాక్కొని పరారయ్యారు. పెద్దావిడ కేకలు వేసినా ఫలితం లేకపోయింది. కసువు ఊడ్చుతున్న మహిళ నుంచి... ఆజాద్నగర్లో నివాసం ఉంటున్న శారదాంబ వృత్తి రీత్యా టీచరు. ఉదయాన్నే ఇంటి ముందు కసువు ఊడ్చుతోంది. ఆమె వద్దకు వచ్చిన ఆగంతకుడు ఆమె మెడలో నుంచి 5 తులాల బంగారు చైను బలవతంగా లాక్కుని పరిగెత్తాడు. కాస్త దూరంలో ద్విచక్రవాహనంలో సిద్ధంగా ఉన్న మరో వ్యక్తితో కలిసి పారిపోయాడు. ‘ఎవరు మీరు’ అని అడిగితే... బళ్లారిరోడ్డులోని వైశ్యా బ్యాంకు కాలనీలో నివాసం ఉంటున్న గంగావతి ఉదయం పక్కింట్లోకి వెళ్లింది. అప్పటికే ఆమె ఇంటిముందు ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు. తన ఇంట్లోకి వెళ్తూవెళ్తూ ‘ఎవరు మీరు’ అని అడిగింది. సమాధానం చెప్పినట్లే చెప్పి.. దగ్గరకు వచ్చి ఒక్కసారిగా ఆమె మెడలో నుంచి 4 తులాల బంగారు చైనును లాక్కెళ్లారు. ఆమె షాక్ నుంచి తేరుకుని గట్టిగా కేకలు పెట్టేసరికే కనుమరుగయ్యారు. మహిళ మెడలోని బంగారు గొలుసు అపహరణ గుంతకల్లు టౌన్ : పట్టణంలోని గంగానగర్కి చెందిన సరళ శనివారం ఉదయం ఇంటి ఆవరణలో గేదెకు పాలు పితుకుతున్న సమయంలో వెనుక నుంచి గుట్టుచప్పుడు కాకుండా వచ్చిన ఓ దుండగుడు ఆమె మెడలోని తులం బంగారు గొలుసును లాక్కుని వెళ్లాడు. సమీపంలో సిద్ధంగా ఉన్న మరో వ్యక్తి పల్సర్ బైక్పై ఉడాయించారు. బాధితురాలు ఒన్టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రూ.60 వేల విలువైన బంగారు చైన్ అపహరణ గుత్తి: గుత్తి ఆర్ఎస్లోని రైల్వే క్వార్టర్స్లో రైల్వే ఉద్యోగి ఎల్లప్ప, పార్వతమ్మ దంపతులు నివాసముంటున్నారు. పార్వతమ్మ శనివారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో పక్కింటిలోకి వెళుతుండగా ఇద్దరు గుర్తు తెలియని దొంగలు బ్లాక్ కలర్ పల్సర్ బైక్లో వచ్చి ఆమె మెడలోని మూడు తులాల బంగారు చైన్ను లాక్కెల్లారు. దొంగ దొంగ అని బాధితురాలు గట్టిగా అరిచినా ఎవ్వరూ పట్టించుకోలేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆచూకీ తెలిపితే రూ.25 వేలు పారితోషకం చైన్ స్నాచింగ్ ఘటనలను ఎస్పీ రాజశేఖరబాబు సీరియస్గా తీసుకున్నారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని స్టేషన్లను అప్రమత్తం చేశారు. సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. చైన్ స్నాచింగ్లకు పాల్పడిన ముఠా ఆచూకీ తెలిపినా, లేదా పట్టించినా రూ.25 వేలు పారితోషికం ఇస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన కర్నూలు, మహబూబ్నగర్ జిల్లాల ఎస్పీలతో కూడా మాట్లాడి వారిని అప్రమత్తం చేశారు. జిల్లా కేంద్రంలో ‘చైన్ గ్యాంగ్’ కోసం సుమారు 50 బృందాలు గాలింపు చేపట్టాయి. స్నాచింగ్లకు పాల్పడిన ముఠా ఉత్తరాది రాష్ట్రాలకు చెందినదిగా అనుమానిస్తున్నారు. నల్ల రంగు ద్విచక్ర వాహనంలోని ఇద్దరు అగంతకుల్లో ఒకరికి బట్టతల ఉందని, హిందీ భాషలో మాట్లాడినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాగా, స్థానిక యువకులే ఈ ఘటనలకు పాల్పడి ఉండవచ్చని, స్థానికేతరులన్నట్లు హిందీలో మట్లాడి ఉండవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా వరుస చోరీలు పోలీసు శాఖ ప్రతిష్టకు మచ్చ తెస్తున్నాయి.