కేంద్ర ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీల మధ్య నెలకొన్న వివాదం మంగళవారం సుప్రీంకోర్టు తీర్పుతో తాత్కాలికంగా సద్దుమణిగింది. శారదా చిట్ఫండ్ కుంభకోణానికి సంబంధించి సీబీఐ విచారణకు సహకరించాలని కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే రాజీవ్ ను అరెస్టు చేయడం వంటి బలవంతపు చర్యలేవీ చేపట్టకుండా సీబీఐని కోర్టు నిలువరించింది. తీర్పు తమకు అనుకూలంగా ఉన్నందున ఆదివారం రాత్రి నుంచి తాను చేపట్టిన ధర్నాను విరమిస్తున్నట్లు మంగళవారం సాయంత్రం మమతా బెనర్జీ ప్రకటించారు.