ఔటర్‌పై టెర్రర్ | 2 die in accident on outer ring road accident | Sakshi
Sakshi News home page

ఔటర్‌పై టెర్రర్

Published Mon, Dec 16 2013 1:44 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM

ఔటర్‌పై టెర్రర్ - Sakshi

 శంషాబాద్, న్యూస్‌లైన్: ఔటర్ రింగు రోడ్డుపై బైకును కారు ఢీకొన్న ప్రమాదంలో దంపతులు దుర్మరణం పాలయ్యారు. శంషాబాద్ మండలంలోని హుడా కాలనీ సమీపంలో ఆదివారం రాత్రి ఈ ప్రమాదంచోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శంషాబాద్ మండలం బహదూర్‌గూడకు చెందిన దంపతులు దేవులపల్లి సామెల్(50), లక్ష్మి(45)లు ఆదివారం రాత్రి రాజేంద్రనగర్ నుంచి శంషాబాద్‌కు ఔటర్ రింగు రోడ్డుపై రాంగ్ రూట్‌లో వస్తున్నారు. కాగా ఔటర్‌పైకి ద్విచక్ర వాహనాల అనుమతి లేకున్నా వీరి టోల్‌గేట్ సిబ్బందికి తెలియకుండా ఎక్కారు.
 
 శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వైపు వెళుతున్న ఓ కారు హుడా కాలనీ సమీపంలో వీరి బైకును అతివేగంగా ఢీకొంది. ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కారులో ప్రయాణిస్తున్న వారు వాహనాన్ని రోడ్డుపైనే వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. కారు మణికొండ గ్రామానికి చెందినదిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. కారు అతివేగంగా బైకును ఢీకొనడంతో పూర్తిగా నుజ్జునుజ్జయింది. కాగా, బైకులో ఉన్న పత్రాల ద్వారా ఈ వాహనం ఛత్రినాక ప్రాంతానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక క్లస్టర్ ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement