22న అమలాపురంలో సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ | 22th save Andhra Pradesh meeting | Sakshi
Sakshi News home page

22న అమలాపురంలో సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ

Published Mon, Nov 11 2013 12:47 AM | Last Updated on Sat, Sep 2 2017 12:30 AM

22th save Andhra Pradesh meeting

అమలాపురం, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా అమలాపురంలో ఈనెల 22న సేవ్ ఆంధ్రప్రదేశ్ సభను నిర్వహించాలని కోనసీమ జేఏసీ నిర్ణయించింది. ఆదివారం రాత్రి జిల్లా జేఏసీ అధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం, కార్యదర్శి పితాని త్రినాధరావు ఆధ్వర్యంలో అమలాపురం కాటన్ అతిథిగృహంలో కోనసీమ జేఏసీ అధ్యక్షుడు వి.ఎస్.దివాకర్ అధ్యక్షతన కోనసీమ జేఏసీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. అమలాపురం బాలయోగి ఘాట్‌లో ఈనెల 22న మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరింటి వరకు సభ నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. లక్షమందికి పైగా జనాన్ని సమీకరించేందుకు కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఏపీఎన్జీఓల సంఘ అధ్యక్షుడు అశోక్‌బాబును ఈ సభకు ఆహ్వానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement