jac
-
నిరవధిక సమ్మెకు కార్మికుల ప్రణాళికలు!
-
ఆత్మాభిమానం కోసం మా పోరాటం
-
ఏసీబీకి ఫిర్యాదు చేసిన తెలంగాణ సర్పంచ్ ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ
-
మద్యం షాపులు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండాలి
సాక్షి, అమరావతి : మద్యం పాలసీని రూపొందించడంలో రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం ఏమిటని మహిళా సంఘాల ఐక్య వేదిక (జేఏసీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వేదిక నేతలు సుంకర పద్మశ్రీ, డి. రమాదేవి, పి.దుర్గాభవాని, పి. పద్మ, ఎన్. విష్ణు సోమవారం విలేకరులతో మాట్లాడుతూ సర్కారుకు 11 సూచనలు చేశారు. ప్రభుత్వం అక్టోబరు నుంచి అమలులోకి తెచ్చే మద్యం పాలసీని కేబినెట్ ఆమోదంతో త్వరలో ప్రకటించనున్నట్లు.. లైసెన్సింగ్ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు షాపులను ఇవ్వనున్నట్లు, లైసెన్స్ ఫీజుల ద్వారా రూ.2 వేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం రానున్నట్లు వార్తలు వస్తున్నాయని వారు తెలిపారు.అయితే, మద్యాన్ని నియంత్రించడం, నేరాలను అరికట్టడం, ప్రజల ఆరోగ్యం మరీ ముఖ్యంగా మహిళలు, పిల్లలపై హింసను అరికట్టడం ప్రభుత్వ లక్ష్యంగా ఉండాలని చెప్పారు. అక్రమ అమ్మకాలు లేకుండా చేయడమా? లేక ఆదాయాన్ని పొందడమా? అనే దానిపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెస్తామని ఎన్నికల సందర్భంగా కూటమి పార్టీలు మరీ ముఖ్యంగా టీడీపీ ప్రచారం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. నాణ్యమైన మద్యం ప్రజల ప్రాణాలు తీయదా?.. మహిళలపై హింసకు కారణం కాదా?.. నేరాలు పెరగకుండా నిరోధిస్తుందా?.. అని వారు ప్రశ్నించారు. అధ్యయనంలో ఏం తేల్చారు..ఇక వివిధ రాష్ట్రాల్లోని మద్యం విధానాలపై అధ్యయనానికి వెళ్లిన బృందాలు తెలంగాణ విధానం బాగుందని రిపోర్టు ఇచ్చినట్లు మీడియాకు లీకేజీలిచ్చారని,.. కానీ, ఆ బృందాలు ఏం అధ్యయనం చేసి వచ్చాయో ఆ నివేదికను విడుదల చేయాలన్నారు. రాష్ట్రంలో మహిళలు, ప్రముఖుల అభిప్రాయాలు తీసుకోవాలని, సాధారణ జనానికి నష్టంలేని విధానాన్ని రూపొందించాలని జేఏసీ నేతలు కోరారు. ఇక రాష్ట్రంలో వేళలతో నిమిత్తం లేకుండా మద్యం అక్రమ అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని, వాటిని అరికట్టే బాధ్యత ప్రభుత్వానిదేన్నారు. -
ఉత్తరాంధ్రలో పండుగ వాతావరణం
-
బాబుపై రాయలసీమ యువజన విద్యార్థి JAC నేతల ఆగ్రహం
-
కాంట్రాక్టు లెక్చరర్ల జీవితాల్లో వెలుగులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి ఇబ్బందికరంగా ఉన్న ఐదేళ్ల నిబంధనను తొలగించి 2014 జూన్ 2వ తేదీకి ముందు పనిచేసిన అందరినీ రెగ్యులర్ చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయానికి కాంట్రాక్టు లెక్చరర్లు హర్షం వ్యక్తంచేశారు. తాడేపల్లిలో వీరంతా జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం నిర్వహించారు. సీఎం జగన్ నిర్ణయంతో విద్యాశాఖలో జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు ఎక్కువమందికి లబ్ధి చేకూరిందన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది కాంట్రాక్టు లెక్చరర్లు తాడేపల్లిలోని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి భారీ కేక్ను కట్చేసి సజ్జల రామకృష్ణారెడ్డిని గజమాలతో సత్కరించారు. తమ తరఫున సీఎంకు ధన్యవాదాలు తెలియజేయాలని వారు విన్నవించారు. అనంతరం జై సీఎం జగన్ అంటూ నినదించారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. తాత్కాలిక ఉద్యోగుల గుండెల్లో సీఎం జగనన్న చిరస్థాయిగా నిలిచిపోతారని వారందరూ కొనియాడారు. అనంతరం సజ్జల మాట్లాడుతూ.. సీఎం జగన్ అటు ప్రజలు ఇటు ఉద్యోగుల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషిచేస్తున్నారని తెలిపారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నారన్నారు. రెండు దశాబ్దాలకు పైగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను సీఎం జగన్ ప్రభుత్వం ఆర్థిక భారమైనా పరిష్కరించి రెగ్యులరైజ్ చేయడం చారిత్రాత్మక నిర్ణయమని తెలిపారు. ఈ సందర్భంగా.. ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులు పలువురు మాట్లాడారు. వారు ఏమన్నారంటే.. గత పాలకులు ఎగతాళి చేశారు ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు పెంచమంటే మీకిదే ఎక్కువని గత పాలకులు గేలి చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగనన్న మా బాధలు చూసి స్వయంగా మా ధర్నా శిబిరాలకు వచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు. కలకాలం ఆయనకు రుణపడి ఉంటాం. – కల్లూరి శ్రీనివాస్, కాంట్రాక్ట్ లెక్చరర్స్ జేఏసీ కో–చైర్మన్ 10 వేలకు పైగా కుటుంబాల్లో వెలుగులు రెండు దశాబ్దాలకు పైగా ఆపరిష్కృతంగా ఉన్న సమస్యను సీఎం జగన్ పరిష్కరించారు. చంద్రబాబు మమ్మల్ని పట్టించుకోలేదు. కానీ, జగన్ పాదయాత్రలో మా సమస్యను విని సీఎం అయ్యాక చిత్తశుద్ధితో పరిష్కరించారు. ఈ నిర్ణయంతో 10,117 కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపారు. మా కుటుంబాలు ఆయనకు అండగా ఉంటాయి. – డి. ఉమాదేవి, కాంట్రాక్ట్ లెక్చరర్ల జేఏసీ మహిళా కార్యదర్శి సీఎం మేలు మరువలేం.. సీఎం జగనన్న మాట ఇచ్చారు.. నిలబెట్టుకున్నారు. పది కాలాలపాటు సీఎం జగనన్న ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పాలించాలి. మహిళా ఉద్యోగులందరం కలిసి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆయనకు దైవకృçప, ప్రజల ఆశీçస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి.– ఆర్. దీప, కాంట్రాక్ట్ లెక్చరర్ (కాంట్రాక్ట్ లెక్చరర్ల జేఏసీ మహిళా కార్యదర్శి) ఐదేళ్ల నిబంధన తొలగింపు చరిత్రాత్మకం.. సీఎం జగనన్న తీసుకున్న రెగ్యులరైజేషన్ నిర్ణయం 4,500 మంది కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపింది. ఐదేళ్ల నిబంధన తొలగింపు నిర్ణయం చరిత్రాత్మకం. జీవితాంతం సీఎం జగన్కు రుణపడి ఉంటాం. వైఎస్ జగన్ మళ్లీ సీఎం అయ్యేందుకుకృషిచేస్తాం.– కుమ్మరకుంట సురేష్, కాంట్రాక్ట్ లెక్చరర్స్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ -
తిరుపతి: హిందూ జేఏసీ పేరుతో పరిపాలన భవనం ముందు ఓవరాక్షన్
సాక్షి, తిరుపతి: హిందూ జేఏసీ పేరుతో టీటీడీ పరిపాలన భవనం ముందు నేతలు ఓవరాక్షన్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం టీటీడీ పరిపాలన భవనం ముందు ధర్నా చేపట్టారు. కాగా ఇటీవల చిరుత బారినపడి చిన్నారి ప్రాణాలు కోల్పోగా.. టీటీడీ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. నడక మార్గంలో భక్తులకు రక్షణగా ఊతకర్రలు ఇవ్వాలని నిర్ణయించింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత చిన్నారులను అనుమతించకపోవడం, భక్తులను గుంపులుగా పంపాలని, 500 కెమెరాల ఏర్పాటు వంటి జాగ్రత్తలు తీసుకుంది. అయితే నడకదారి భక్తులపై టీటీడీ ఆంక్షల పట్ల హిందూ జేఏసీ వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. టీటీడీ పరిపాలన భవనం ముందు బుధవారం హిందూ జేఏసీ నేతలు నిరసన చేపట్టారు. భక్తుల కోసం టీటీడీ కష్టపడుతుంటే జేఏసీ నేతలు రాజకీయం చేస్తున్నారు. నడక మార్గంలో ఆంక్షలు వద్దంటూ వాదిస్తున్నారు. హిందూ ధర్మ పేరిట శ్రీనివాసానంద సరస్వతి ఓవరాక్షన్ ప్రదర్శిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి వచ్చి తిరుపతిలో డ్రామాలు చేస్తున్నారు. చదవండి: తిరుమలకు ప్రత్యేక బృందాలు.. కొనసాగుతున్న చిరుతల వేట -
సచివాలయంలో సీఎం కేసీఆర్ తో వీఆర్ఏల జేఏసీ భేటీ
-
సీఎంకు నిరుద్యోగ జేఏసీ కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రూప్–1, గ్రూప్–2లో 1,000 పోస్టుల భర్తీకి అనుమతించిన సీఎం వైఎస్ జగన్కు ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు హేమంత్ కుమార్ గురువారం ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ/వార్డు సచివాలయాల్లోనూ బదిలీలకు అవకాశం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. గతంలో సచివాలయాల్లో చేపట్టినట్టే భారీ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. ఇటీవల పరీక్షలు రాసిన ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రశ్నాపత్రంలోని దోషాలను అధిగమించేలా గ్రేస్ మార్కులు ఇవ్వాలని అభ్యర్థించారు. (చదవండి: ఎప్పటి నీటి లెక్కలు అప్పటికే...) -
అమరావతి జేఏసీవై ఏపీ రెవిన్యూ ఉద్యోగ సంఘాల ఫైర్
-
తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు 7 శాతం ఫిట్మెంట్
-
పీఆర్సీ కోసం ఉద్యమాలు ఉధృతం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ సాధన కోసం ఆందోళనలను తీవ్రం చేస్తున్నట్లు తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ప్రకటించింది. 1004 యూనియన్ కార్యాలయంలో సోమవారం సమావేశమై ఉద్యమ కార్యాచరణను ఖరారు చేయడంతో పాటు ఇందుకు సంబంధించిన నోటీసులను యాజమాన్యానికి అందజేసినట్లు జేఏసీ చైర్మన్ జి.సాయిబాబు, కన్వీనర్ రత్నాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావాల్సిన కొత్త పీఆర్సీ విషయంలో యాజమాన్యం నుంచి ఇంకా స్పష్టత రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కార్యాచరణలో భాగంగా ఈనెల 21, 22 తేదీల్లో సర్కిల్ స్థాయిల్లో సమావేశాలు, 24, 25, 28 తేదీల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన, మార్చి 1, 2న డివిజన్ కార్యాలయాలు, జనరేటింగ్ స్టేషన్ల వద్ద భోజన విరామ సమయంలో ప్రదర్శన, మార్చి 3, 4న సర్కిల్ కార్యాలయాలు, కార్పొరేట్ కార్యాలయాలు, జనరేటింగ్ స్టేషన్ల వద్ద భోజన విరామ సమయంలో ప్రదర్శన, మార్చి 8 నుంచి 23 వరకు సర్కిల్ కార్యాలయాలు, కార్పొరేట్ కార్యాలయాలు, జనరేటింగ్ స్టేషన్ల వద్ద రిలే నిరాహార దీక్షలు, మార్చి 14న కేటీపీఎస్ ప్లాంట్ వద్ద, 17న వరంగల్లో, 21న శంషాబాద్లో నిరసన సభలు, 24న విద్యుత్ సౌధలో మహాధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అయినా, యాజమాన్యం స్పందించని పక్షంలో 24న అత్యవసర సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించారు. సమావేశంలో జేఏసీ కో చైర్మన్ శ్రీధర్, కో కన్వీనర్, బీసీ రెడ్డి, వైస్ చైర్మన్ వజీర్ పాల్గొన్నారు. -
అదానీ వ్యవహారంపై జేపీసీ తప్ప మరేదైనా వృథాయే: కాంగ్రెస్
న్యూఢిల్లీ : పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ వ్యవహారంలో సమగ్ర విచారణ అత్యంత అవసరమని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఈ విషయంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) తప్ప మరే కమిటీ వేసినా వృథా ప్రయాసేనని అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటుపై సుప్రీం కోర్టు దగ్గర ప్రతిపాదనలు చేస్తే , ఈ అంశంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్టు అవుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదానీ ఆస్తులకు సంబంధించి హిండెన్బర్గ్ నివేదికలో వచ్చిన ఆరోపణలపై నిపుణులతో కమిటీ వేయాలని సుప్రీం కోర్టు ఈ నెల 13న జరిపిన విచారణలో అభిప్రాయపడిందని, దీనిపై కేంద్రం 17లోగా స్పందించాల్సి ఉందని జైరామ్ రమేష్ గుర్తు చేశారు. జేపీసీ మినహాయించి ఎలాంటి చట్టబద్ధ కమిటీలు వేసినా ఈ విషయంలో ఉపయోగం ఉండదని అన్నారు. చదవండి: మహారాష్ట్ర సంక్షోభంపై సుప్రీం తీర్పు రిజర్వ్.. -
కామారెడ్డిలో కొనసాగుతున్న రైతు జేఏసీ నిరసనలు
-
అవసరమైతే ప్రగతి భవన్ ను ముట్టడిస్తాం : రైతు జేఏసీ
-
కామారెడ్డిలో నేడు రైతు జేఏసీ అత్యవసర సమావేశం
-
రాయలసీమలో పర్యటించే అర్హత చంద్రబాబుకు లేదు : విద్యార్ధి జేఏసీ
-
ఉత్తరాంధ్ర గర్జన.. నరసన్నపేటలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: నరసన్నపేటలో విశాఖ రాజధాని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జేఏసీ కన్వీనర్ లజపతిరాయ్, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఎన్జీవోలు పాల్గొన్నారు. విశాఖ రాజధాని కోసం ప్రతి పల్లె నినదించాలని లజపతిరాయ్ పిలుపునిచ్చారు. ఉద్యమంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలన్నారు. వలసల నివారణ, ఉపాధి అవకాశాలు విశాఖ రాజధానితోనే సాధ్యమన్నారు. చదవండి: పాతవారికే ‘కొత్త’ కలరింగ్!.. కళా వారి రాజకీయ మాయా కళ -
బండి సంజయ్ వ్యాఖ్యలపై ఉద్యోగ జేఏసీ ఆగ్రహం
నాంపల్లి: ఉద్యోగ సంఘాలు అమ్ముడుపోయాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఉద్యోగ జేఏసీ నేతలు నిరసన తెలిపారు. జేఏసీ చైర్మన్ మామిళ్ళ రాజేందర్ నేతృత్వంలో నాంపల్లిలోని టీఎన్జీవో కేంద్ర సంఘం కార్యాలయం నుంచి ఏ–వన్ సిగ్నల్ వరకు చేరుకుని, అక్కడి నుంచి తిరిగి టీఎన్జీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. సోమవారం జరిగిన ర్యాలీలో ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలను నిరసిస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ సెక్రటరీ జనరల్ వి.మమత, టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, టీఎన్జీవో నేతలు గండూరి వెంకటేశ్వర్లు, కస్తూరి వెంకటేశ్వర్లు, రామినేని శ్రీనివాసరావు, ఎస్.ఎం.హుస్సేన్, శ్రీరామ్, తదితరులు పాల్గొన్నారు. -
పవన్ కల్యాణ్ తీరుపై ఉత్తరాంధ్ర జేఏసీ ఆందోళన
-
విశాఖ రాజధాని కాకపోతే పాతికేళ్లలో.. మరో విభజన యుద్ధం
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): ‘స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయింది. ఇప్పటికీ ఉత్తరాంధ్ర జిల్లాలు అత్యంత వెనుకబడి ఉన్నాయి. రాష్ట్ర విభజన సమయంలో వచ్చిన అవకాశాన్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీరుగార్చారు. దేవుడిలా.. ముఖ్యమంత్రిగా వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్ల విశాఖ కేంద్రంగా (రాజధానిగా) ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి మళ్లీ అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మరో 25 ఏళ్లలో ఇంకో విభజన యుద్ధం తప్పదు..’ అని నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ లజపతిరాయ్ పేర్కొన్నారు. విశాఖలో శనివారం నిర్వహించనున్న విశాఖ గర్జనకు సంబంధించిన జెండాను శుక్రవారం విశాఖపట్నంలో మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, జేఏసీ సభ్యుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కేంద్రీకరణ వల్ల ఇప్పటికే నష్టపోయాం. వికేంద్రీకరణకు పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ముఖ్యమంత్రి ఆకాంక్ష.. ఇటు ఉత్తరాంధ్ర, అటు రాయలసీమతో పాటు మధ్యాంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందుతాయన్న ముఖ్యమంత్రి ఆలోచనలకు అన్నివర్గాల ప్రజలు సహకరిస్తున్నారు..’ అని చెప్పారు. విశాఖ కేంద్రంగా రాజధాని కోసం శనివారం విశాఖలో నిర్వహించనున్న విశాఖ గర్జనకు రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్య స్పందన వస్తోందని తెలిపారు. విశాఖ వాసులు.. ఉత్తరాంధ్ర వాసులు ఈ గర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ‘విశాఖ గర్జన ఉత్తరాంధ్ర ప్రజలకే కాదు.. రాష్ట్ర శ్రేయస్సు కోసం జరుగుతున్న ఉద్యమం. ఉత్తరాంధ్ర వెనుకుబాటుతనంపై ఎన్నో కమిటీలు చెప్పాయి. కేంద్రం కూడా గుర్తించింది. అటువంటి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖ పరిపాలన రాజధానిగా, రాయలసీమ వాసుల కోసం కర్నూలు న్యాయ రాజధానిగా, మధ్యాంధ్రప్రదేశ్లో అమరావతి శాసన రాజధానిగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్దేశం..’ అని చెప్పారు. ఇది అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న గొప్ప నిర్ణయమన్నారు. విశాఖపట్నం రాజధాని అయితే ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి బాటపడతాయని తెలిపారు. 1956 ఏప్రిల్ ఒకటినే.. జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ 1953లో ఆంధ్రరాష్ట్రం మద్రాస్ ప్రెసిడెన్సిలో ఉండేదని, ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశంపంతులు ఉన్నప్పుడు తొలి అసెంబ్లీ సమావేశం విశాఖ ఏయూ టీఎల్ఎన్ సభా హాల్లో జరిగిందని చెప్పారు. కర్నూలు రాజధానిగా అప్పుడే ఒక తీర్మానం చేశారని గుర్తుచేశారు. తర్వాత పరిణామాల్లో 1956 ఏప్రిల్ ఒకటిన విశాఖ రాజధానిగా శాసనసభ్యులందరూ అప్పుడే తీర్మానం చేసినప్పటికీ, ఇక్కడి రాజకీయ నాయకులు చొరవ చూపకపోవడంతో రాజధాని హైదరాబాద్కు వెళ్లిపోయిందని చెప్పారు. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత వచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం నిలబెట్టుకోకపోతే భావితరాలకు అన్యాయం చేసిన వాళ్లమవుతామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాజకీయాలు, కులమతాలకతీతంగా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి విశాఖ రాజధానికి సహకరించాలని అభ్యర్థించారు. -
విశాఖకు జై!.. దిక్కులు పిక్కటిల్లేలా గర్జన
సాక్షి, విశాఖపట్నం: తరతరాల వెనుకబాటు తనంపై తమ గొంతు వినిపించేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధమయ్యారు. తమ ఆకాంక్షలను బలంగా చాటేందుకు దిక్కులు పిక్కటిల్లేలా గర్జించడానికి వేచి చూస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా శనివారం నిర్వహించనున్న విశాఖ గర్జనలో పాల్గొనడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. 1956లోనే రాజధానిగా విశాఖ ఏర్పాటు కావాల్సి ఉన్నప్పటికీ వీలు కాలేదని, ఇన్ని దశాబ్దాల తర్వాత ఇప్పుడు తమ చిరకాల కోరిక నెరవేరబోతున్న సమయంలో అడ్డుకునే వారికి బుద్ది చెప్పేలా శాంతియుతంగా గర్జనను నిర్వహిచేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడంటూ నినదిస్తున్నారు. నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న విశాఖ గర్జనకు మేధావులు, ప్రజా సంఘాలు, విద్యార్థి లోకం పూర్తి మద్దతు తెలిపింది. విశాఖ గర్జన విజయవంతానికి వైఎస్సార్సీపీ నేతలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. టీడీపీ, జనసేన, కమ్యూనిస్టు, భారతీయ జనతా పార్టీలు మాత్రం గర్జనకు దూరంగా ఉంటున్నాయి. గత ఎన్నికల్లో గాజువాకలో ఘోరంగా ఓడించారన్న అక్కసుతో ఉత్తరాంధ్రకు వ్యతిరేకంగా తన వాణిని కాస్త జనవాణిగా వినిపించేందుకు జనసేన నేత పవన్ కల్యాణ్ విశాఖకు శనివారమే వస్తుండడం గమనార్హం. టీడీపీ నేతలు కూడా ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రాంతంపై విషం చిమ్ముతున్నారు. తమ హయాంలో జరిగిన భూకబ్జాలను కప్పిపుచ్చుకుంటూ.. దొంగే దొంగ.. దొంగ అని అరిచినట్టుగా.. భూకబ్జాలకు పాల్పడిన టీడీపీ నేతలే వాటి గురించి మాట్లాడుతుండటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. పైగా ఇదే రోజు ఉత్తరాంధ్ర నేతలందరూ ఆ పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యేందుకు సిద్ధమవ్వడంపై మరింత ఆగ్రహం వ్యక్తమవుతోంది. శుక్రవారం ఉత్తరాంధ్ర నాన్పొలిటికల్ జేఏసీ చైర్మన్ లజపతిరాయ్, మంత్రి గుడివాడ అమర్నాథ్తో పాటు పలువురు జేఏసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, మేధావులు ర్యాలీ జరిగే రూట్ మ్యాప్ను పరిశీలించారు. అనంతరం జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో ‘విశాఖ గర్జన’ జెండాను, పాటను ఆవిష్కరించారు. నియోజకవర్గాల వారీ రూట్మ్యాప్ను పోలీసులకు అందజేశారు. ఉత్తరాంధ్ర, ఉమ్మడి విశాఖ జిల్లాల నుంచి ప్రజలు భారీగా తరలిరానున్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల వారీగా వెళ్లేలా వలంటీర్లను కూడా ఏర్పాటు చేశారు. యాత్రలో పాల్గొనే వారందరికీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా వలంటీర్లు సహాయ పడతారు. సాగర తీరాన మూడున్నర కిలోమీటర్ల మేర సుమారుగా లక్ష మందితో గర్జన జరగనుంది. ర్యాలీ సాగేదిలా.. ఉత్తరాంధ్ర నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న ‘విశాఖ గర్జన’ ర్యాలీ శనివారం ఉదయం 9 గంటలకు ఎల్ఐసీ బిల్డింగ్.. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి ప్రారంభం కానుంది. జైలు రోడ్డు జంక్షన్, సెవెన్ హిల్స్ హాస్పిటల్ జంక్షన్, వాల్తేర్ క్లబ్, సిరిపురం జంక్షన్, చిన వాల్తేర్ జంక్షన్ మీదుగా ఆర్కే బీచ్ రోడ్డులోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వరకు సుమారు మూడున్నర కిలోమీటర్ల మేర కొనసాగనుంది. ముందుగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి ఉత్తరాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో జేఏసీ సభ్యులు, ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు, మేధావులు నివాళులర్పించి.. ర్యాలీ ప్రారంభిస్తారు. ర్యాలీ సందర్భంగా ఉత్తరాంధ్ర వెనుకబాటు తనం, ఇక్కడ ప్రజలు పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుండటం, ఇతరత్రా సమస్యలు ఎదుర్కొంటుండటంపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. విశాఖ గర్జన నేపథ్యంలో నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. -
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటమే అసలైన నిబద్ధత: సజ్జల
సాక్షి, తాడేపల్లి: బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ‘బీసీలకు అండగా వైఎస్ జగన్ ప్రభుత్వం-బీసీలకు అందిస్తున్న పథకాలు’పై చర్చ జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణమూర్తి, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ వైఎస్సార్ బాటలోనే సీఎం జగన్ నడుస్తున్నారన్నారు. చదవండి: ‘మద్రాస్, హైదరాబాద్లో తంతే అమరావతిలో పడ్డాం’ ‘‘వైసీపీ బీసీ డిక్లరేషన్ పెట్టినపుడు ఎన్నికల జిమ్మిక్కులంటూ ప్రతిపక్షాలు విమర్శించాయి. ఓట్ల రాజకీయం అని ఆరోపించాయి. కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటమే అసలైన నిబద్ధత. విద్య ద్వారా సాధికారత సాధ్యమని వైఎస్సార్ నమ్మారు. అందుకే ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టారు. వైద్యం ఖరీదైన రోజుల్లో నేనున్నాంటూ పేదలకు ఆపన్నహస్తం అందించిన నేత వైఎస్సార్. ఎంబీసీలు నేడు తమ ఉనికి నిలబెట్టుకుంటున్నారు. తమకు కావాల్సిన హక్కుల సాధనకు పోరాడగలుగుతున్నారని’’ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బీసీల సాధికారతకు ఆనాడు వైఎస్సార్ హయాంలో తొలి అడుగు పడింది. నేడు వైఎస్సార్ బాటలోనే సీఎం జగన్ నడుస్తున్నారు. ఈ రోజు మా పార్టీ సభలు జరిగితే సగానికి పైగా వేదికపై బీసీ నేతలే ఉంటున్నారు. రిజర్వేషన్లు అమలు చేయడం పెద్ద పరీక్ష. అనుకున్న దానికంటే ఎక్కువ శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత వైఎస్ జగన్కే దక్కిందని’’ సజ్జల అన్నారు. -
పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా 15న విశాఖ గర్జన
మహారాణిపేట (విశాఖ దక్షిణ): పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా 15న నిర్వహించనున్న విశాఖ గర్జనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మూడు రాజధానులను సీఎం జగన్ ప్రకటించారని చెప్పారు. ఉత్తరాంధ్ర జేఏసీ పిలుపు మేరకు గర్జనకు వైఎస్సార్సీపీ మద్దతు పలుకుతోందన్నారు. విశాఖ డాబా గార్డెన్స్ అంబేడ్కర్ విగ్రహం నుంచి బీచ్ రోడ్డు వైఎస్సార్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికి మద్దతుగా ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల్లో ర్యాలీలు జరుగుతాయన్నారు. సోమవారం విశాఖ మద్దిలపాలెంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలు సృష్టించాలని చంద్రబాబు, ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లతో గెలిచిన టీడీపీ నేత అచ్చెన్నాయుడు సొంత ప్రాంతం అభివృద్ధి చెందకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ‘మీ వ్యాపారాలకు, నివాసానికి, పిల్లల చదువుల కోసం విశాఖ కావాలా? ఇక్కడి ప్రజల ఓట్లతో గెలిచి ఈ ప్రాంతం మాత్రం అభివృద్ధి చెందకూడదా?’ అని నిలదీశారు. ► టీడీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోతామనే భయం ఆ పార్టీ నాయకుల్లో కనబడుతోంది. ► 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు విశాఖలో చేసిన అభివృద్ధి శూన్యం. వెనకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్ర, విశాఖను అభివృద్ధి చేసింది దివంగత వైఎస్సార్ ఒక్కరే. విశాఖలో హెల్త్సిటీ, ఐటీ పార్క్, ఉత్తరాంధ్ర స్రుజల స్రవంతి, బీఆర్టీఎస్, విమ్స్, బీహెచ్ఈఎల్, ఫార్మా పరిశ్రమలను తెచ్చి ముందుచూపుతో నేటి యువతరానికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. -
అచ్చెన్నాయుడు నోరు అదుపులో పెట్టుకో.. మంత్రి బొత్స హెచ్చరిక
సాక్షి, విశాఖపట్నం: విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలనే నినాదంతో జేఏసీ ఏర్పడిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ర్యాలీని అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. అంబేద్కర్ విగ్రహం నుంచి మహానేత వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ జరుగుతుందని పేర్కొన్నారు. కాగా చంద్రబాబు ప్రాంతీయ విభేదాలు తేవాలని చూస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి దోపిడీకి అడ్డుపడుతున్నారనే బాధ చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. అచ్చెన్నాయుడు ఎందుకు వైజాగ్ను పరిపాలన రాజధానిగా వద్దంటున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉండగా ఉత్తరాంధ్రకు ఏం చేశారని నిలదీశారు. అచ్చెన్నాయుడు పెద్ద జ్ఞానిలా మాట్లాడుతున్నారని, ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. టీడీపీ వాళ్ళు సహనం కోల్పోతున్నారని.. ఎల్లో మీడియాతో కలిసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో పేదలకు పెట్టిన ఒక మంచి పథకమైన అచ్చెన్నాయుడు చెప్పాలని, కనీసం అశోక్ గజపతి రాజు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో భోగాపురం ఎయిర్పోర్టు అయిన కట్టించారా అని ప్రశ్నించారు. ‘ఉత్తరాంధ్ర అభివృద్ధి స్వర్గీయ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రారంభించింది వైఎస్సార్. హెల్త్ సిటీని తీసుకువచ్చింది రాజశేఖర రెడ్డి. బ్రాండేక్స్ కంపెనీ తీసుకువచ్చింది మహనేతనే. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమాలు సీఎం జగన్ చేపట్టారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు మన పథకాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఏపీలోని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేకపోతున్నారు. గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలు తెలిసిన వారు టీడీపీ నేతలు. మన సీఎంకు అటువంటి మాయలు తెలియవు’ అని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. చదవండి: ఎన్టీఆర్ చావుకు కారణమైన వారిని తరిమికొట్టాలి: కొడాలి నాని -
వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ ఏర్పాటు
-
ఉత్తరాంధ్ర అభివృద్ధితోనే వలసలు ఆగిపోతాయి : మేధావులు
-
వికేంద్రీకరణ ద్వారా అణగారిన వర్గాలకు మేలు: జేఏసీ
సాక్షి, విశాఖపట్నం: వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా ఏర్పాటైన జేఎసీ కన్వీనర్గా ప్రొఫెసర్ హనుమంతు లజపతి రాయ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన హక్కుల కోసం పోరాటం చేయాలని ఉత్తరాంధ్ర ప్రజలకు సూచించారు. 75 ఏళ్ల నుంచి ఉత్తరాంధ్ర వెనుకబడి ఉందని, ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. ‘ప్రపంచంలో 14 దేశాల్లో మూడు రాజధానులు ఉన్నాయి. దేశంలో 6 రాష్ట్రాల్లో రెండు రాజధానులు ఉన్నాయి. అమరావతికి మేం వ్యతిరేకం కాదు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి. ఉత్తరాంధ్రకు వ్యతిరేకంగా పని చేసే నేతలను నిలదీయండి.’ అని పేర్కొన్నారు జేఏసీ కన్వీనర్. ఈ సమావేశంలో పాల్గొన్న జేఏసీ కో కన్వీనర్ దేవుడు మాడ్లాడుతూ.. ఇంకా ఉపేక్షిస్తే మన మనుగడకే ఇబ్బంది వస్తుందని ప్రజలకు సూచించారు. అమరావతికి ఉత్తరాంధ్ర ప్రజలు వ్యతిరేకం కాదని, వికేంద్రీకరణ ద్వారా అణగారిన వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. మరోవైపు.. విశాఖ పరిపాలన రాజధాని కావాలన్నారు మేధావుల ఫోరం అధ్యక్షులు. కర్నూలు రాజధాని కాకముందే విశాఖ రాజధాని ప్రతిపాదన ఉందని, ఉత్తరాంధ్ర ప్రజల మంచితనాన్ని చేతగానితనంగా చూడొద్దని హెచ్చరించారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలకు విరుద్ధంగా పాదయాత్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీనామాకు సిద్ధం.. వికేంద్రీకరణ కోసం రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు అవంతి, కరుణం ధర్మశ్రీ. విశాఖ రాజధాని కోసం ఎలాంటి త్యాగానికైనా తాము సిద్ధంమని వెల్లడించారు అవంతి. స్పీకర్ ఫార్మాట్లో జేఏసీ కన్వీనర్కు కరుణం ధర్మశ్రీ రాజీనామా లేఖ. దమ్ముంటే అచ్చెన్నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అచ్చెన్నాయుడిపై పోటీ చేసేందుకు తాను సిద్ధంమని సవాల్ చేశారు. మరోవైపు.. విశాఖ రాజధానిపై రెఫరెండానికి తాము సిద్ధమని తెలిపారు మంత్రి అమర్నాథ్. 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విశాఖతో పాటు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నారు. ఉత్తరాంధ్రకు వ్యతిరేంగా చేస్తున్నయాత్రపై నిరసన తెలియజేస్తామన్నారు. ఏవైనా ఇబ్బందులు తలెత్తితే అందుకు చంద్రబాబుదే బాధ్యతని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: Visakhapatnam: వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ ఏర్పాటు -
వికేంద్రీకరణ కోసం రాజీనామాకు నేను సిద్ధం: కరణం ధర్మశ్రీ
-
స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖను అందించిన కరణం ధర్మశ్రీ
సాక్షి, విశాఖపట్నం: వికేంద్రీకరణ కోసం రాజీనామాకు సిద్ధమని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఈక్రమంలోనే విశాఖపట్నంలో వికేంద్రీకరణకు మద్దతుగా జరుగుతున్న జేఏసీ మీటింగ్లో స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖను జేఏసీ కన్వీనర్ లజపతిరాయ్కు అందజేశారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు దమ్ముంటే వికేంద్రీకరణ వ్యతిరేకంగా రాజీనామా చేయాలని సవాల్ చేశారు. అమరావతికి మద్దతుగా అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి తిరిగి పోటీ చేయాలని కరణం ధర్మశ్రీ సవాల్ విసిరారు. ఇదిలా ఉంటే, ఈనెల 15న విశాఖ రాజధానికి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహిస్తామని వికేంద్రీకరణ జేఏసీ ప్రకటించింది. టూ టౌన్ అంబేడ్కర్ విగ్రహం నుంచి ర్యాలీ జరుగుతుందని తెలిపింది. త్వరలో మండల, నియోజకవర్గ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు కూడా వెల్లడించింది. చదవండి: (Visakhapatnam: అవసరమైతే రాజీనామాకు సిద్ధం: అవంతి శ్రీనివాస్) -
విశాఖ రాజధానికి మద్దతుగా జేఏసీ ఏర్పాటు
-
Visakhapatnam: వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ ఏర్పాటు
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటెల్ ఏర్పాటు, వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ ఏర్పాటైంది. అంబేద్కర్ యూనివర్శిటీ మాజీ ఉప కులపతి హనుమంతు లజపతిరాయ్ జేఏసీ కన్వినర్గా నియమితులయ్యారు. జేఏసీలో సభ్యులుగా ప్రొఫెసర్లు, వైద్యులు, న్యాయవాదులు, జర్నలిస్టులు సహా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉన్నారు. అక్టోబర్ 15న విశాఖ రాజధానికి మద్దతుగా భారీ ర్యాలీ చేపట్టాలని జేఏసీ నిర్ణయించింది. -
సమ్మె విరమించండి.. మాట్లాడుకుందాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కార్మికుల మేలుకోరే ప్రభుత్వం ఉందని, ప్రజా సేవలకు విఘాతం కలిగించి మునిసిపల్ ఒప్పంద పారిశుధ్య కార్మికులు సమ్మె చేయడం భావ్యం కాదని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పినప్పటికీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఇచ్చిన ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ అంశంపై పట్టుబట్టి సమ్మె చేయడం సరికాదని మునిసిపల్ ఒప్పంద కార్మికులకు హితవు పలికారు. ధర్నాలు, సమ్మెలతో సమస్యలు పరిష్కారం కావని, కలిసి చర్చించుకుంటే పరిష్కారమవుతాయన్నారు. పక్క రాష్ట్రంతో పోలిస్తే పారిశుధ్య ఒప్పంద కార్మికులకు ఏపీలో మెరుగైన వేతనాలు ఉన్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో సీఎం వైఎస్ జగన్ కార్మికులకు న్యాయం చేస్తారన్నారు. ప్రస్తుతం కార్మికుల్లో ఏ ఒక్కరికీ రూ.18 వేలకు తక్కువ కాకుండా వేతనం ఇస్తున్నట్టు చెప్పారు. కార్మికులకు కావల్సిన అన్ని సౌకర్యాలు, పనిముట్లు కూడా సరిపడినన్ని అందుబాటులో ఉంచామన్నారు. దీర్ఘకాలిక సమస్యలు అన్నింటినీ పరిష్కరిస్తామని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒప్పంద కార్మికులు సమ్మెను విరమించి విధుల్లోకి రావాలని సూచించారు. కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రజా సేవలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. రెగ్యులర్ సిబ్బంది విధుల్లో ఉన్నారని, కొందరు కాంట్రాక్ట్ సిబ్బంది సైతం సేవలు అందిస్తున్నారని వివరించారు. అవసరమైన యూఎల్బీల్లో తాత్కాలిక సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. యూఎల్బీల్లో సేవలకు వాహనాలు అవసరమైన చోట స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వాహనాలను వినియోగించనున్నట్లు తెలిపారు. హోటళ్లు, మార్కెట్ల వద్ద చెత్త ఉండిపోకుండా ఎప్పటికప్పుడు తరలించాలని సీడీఎంఏ ప్రవీణ్ కుమార్ మునిసిపల్ కమిషనర్లను ఆదేశించారు. సమ్మె నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై గురువారం మంత్రులు ఆదిమూలపు, బొత్స, బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం కానున్నారు. సమ్మెను ఉధృతం చేస్తాం: కార్మిక జేఏసీ మునిసిపల్ కార్మికుల సమ్మెను ఉధృతం చేయాలని నిర్ణయించినట్లు పట్టణ పారిశుధ్య కార్మిక జేఏసీ, సీఐటీయూ నేత కె.ఉమామహేశ్వరరావు బుధవారం తెలిపారు. శుక్రవారం నుంచి మునిసిపల్ ఒప్పంద కార్మికులు విద్యుత్ నిర్వహణ సేవలను నిలిపివేస్తారని చెప్పారు. ఈ నెల 17 నుంచి అన్ని అత్యవసర విభాగాల్లో పనిచేస్తోన్న మునిసిపల్ కార్మికులు విధుల్లో పాల్గొనరాదని కోరారు. గురువారం అన్ని పట్టణాల్లో కార్మికులు అర్ధనగ్న ప్రదర్శనలు చేయనున్నారని, శుక్రవారం మునిసిపల్ కార్యాలయాలను ముట్టడిస్తామని చెప్పారు. -
Telangana: మే 19న ఆటో, లారీ, క్యాబ్లు బంద్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా తెలంగాణ ఆటో, క్యాబ్, లారీ సంఘాల జేఏసీ ఈ నెల 19న రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. బంద్కు సంబంధించి గోడపత్రికను హైదరాబాద్, హైదర్గూడలో జేఏసీ నాయకులు ఆవిష్కరించారు. ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేయనున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. 19న బంద్రోజు రవాణా శాఖ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు తెలిపారు. కరోనా కష్ట కాలంలో కార్మికులను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం జీవో 714 తీసుకొచ్చి ఫిట్నెస్ రెన్యూవల్ రోజుకు 50 పెనాల్టీ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఈ ప్రతిపాదనను కేంద్రప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చదవండి: (మోదీని కించపరిస్తే తాటతీసి తరిమికొడతాం) -
రాజధానిపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాయలసీమ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం
-
పది రోజులు ఆగలేకపోయారా?
సాక్షి, అమరావతి/అనంతపురం శ్రీకంఠం సర్కిల్/నెల్లూరు(పొగతోట): ఏపీ జేఏసీవి అవకాశవాద ఉద్యమాలని.. ఇంతకాలం ఆగినవాళ్లు పది రోజులు ఆగలేకపోయారా అని రాష్ట్ర గ్రంథాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కళ్లేపల్లి మధుసూదనరాజు మండిపడ్డారు. తమ అభిప్రాయాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఏపీ జేఏసీ నాయకులపై ఉద్యోగులు నమ్మకం కోల్పోయారన్నారు. సీఎం జగన్ హామీ ఇచ్చిన తర్వాత కూడా నిరసనలెందుకని ప్రశ్నించారు. బుధవారం అనంతపురంలో నిర్వహించిన జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం త్వరలో ఒక నిర్ణయం తీసుకోబోతున్న తరుణంలో ఇది జేఏసీ విజయమని చెప్పుకోవడానికే ఇలా చేస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం జగన్ మీద నమ్మకంతో జేఏసీ ఆందోళనల్లో గ్రంథాలయ ఉద్యోగులెవరూ పాల్గొనడం లేదని తెలిపారు. సమావేశంలో నాయకులు «శివశంకరప్రసాద్, నరసింగరావు, శివారెడ్డి, కమ్మన్న తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాల ముసుగులో రాజకీయం వద్దు.. ఉద్యోగ సంఘాల ముసుగులో రాజకీయాలు చేయొద్దని, ఉద్యోగుల్లో గందరగోళం సృష్టించవద్దని ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్సోర్స్డ్ సర్వీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అంజనాయక్, ఎన్ఆర్కే రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రభుత్వం ప్రతి ఉద్యోగికి న్యాయం చేస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏనాడు సకాలంలో జీతాలు చెల్లించలేదని చెప్పారు. నిరసనలకు మేము దూరం.. పీఆర్సీ గురించి సీఎం జగన్ ఇచ్చిన హామీపై తమకు పూర్తిస్థాయిలో నమ్మకముందని ఏపీ రెవెన్యూ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మొలతాటి గిరీష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిరసనలు తెలుపుతున్న వారికి సీఎం మాటపై గౌరవం లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి సమయమివ్వకుండా అనాలోచిత ఆందోళనలేమిటని నిలదీశారు. రెండు జేఏసీల నిరసనల్లో తమ అసోసియేషన్ ఉద్యోగులెవరూ పాల్గొనరని స్పష్టం చేశారు. -
అమరావతి జేఏసీ వెబినార్ అట్టర్ ఫ్లాప్
తాడికొండ: అమరావతి రాజధాని పేరిట జేఏసీ చేస్తున్న బినామీ దీక్షల వెబినార్ అట్టర్ఫ్లాప్ అయిందని, దాదాపు రూ.500 కోట్లు ఖర్చు పెట్టినా.. 200 మంది కూడా హాజరు కాలేదని బహుజన పరిరక్షణ సమితి నాయకులు ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 213వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో పలువురు నాయకులు ప్రసంగించారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమింపజేస్తూ అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో 500 రోజుల ఉత్సవాలు జరిగాయని, 29 గ్రామాల్లో ప్రజల మద్దతు ఉందంటూ వెబినార్లో ఉత్సవాలు నిర్వహించి ఎల్లో మీడియాలో ప్రజలను నమ్మించేందుకు నానా తంటాలు పడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు అమరావతి జేఏసీ పేరిట కుల విభజన చేసి దళితులకు ఓ జేఏసీ, తన కులస్తులకు మరో జేఏసీ పెట్టి మరోసారి మోసం చేశాడన్నారు. బహుజనులంతా ఏకమై 213 రోజులుగా ఉద్యమం చేస్తుంటే.. దానిని నిర్వీర్యం చేసేందుకు కోర్టులు, వ్యవస్థలను అడ్డుపెట్టుకుని చంద్రబాబు నాటకాలాడడం సిగ్గుచేటన్నారు. చదవండి: తిరుపతి ఉప ఎన్నికపై పిటిషన్ల కొట్టివేత ఏసీబీ కస్టడీకి ధూళిపాళ్ల -
చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదు..
సాక్షి, అమరావతి: సీపీఎస్ రద్దు, పీఆర్సీ అమలుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సానుకూలంగా స్పందించారని అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం అమరావతి జేఏసీ నేతలు సీఎం వైఎస్ జగన్ను కలిశారు. పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. హెల్త్ కార్డులు పూర్తిస్థాయిలో అమలు జరగడం లేదని సీఎం దృష్టికి తీసుకెళ్లామని.. వెంటనే నివేదికలు తెప్పించాలని సీఎం అధికారులను ఆదేశించారని బొప్పరాజు తెలిపారు. ఐఏఎస్ అధికారి విజయ్కుమార్ ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి అని, ఆయనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఉద్యోగ సంఘాలను చావ చచ్చారా అని మాట్లాడటం పద్ధతి కాదన్నారు. చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని బొప్పరాజు పేర్కొన్నారు. -
ఉద్యోగ సంఘాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే గుణపాఠం చెబుతాం
-
‘స్వప్రయోజనాల కోసమే ఏకపక్ష నిర్ణయం’
సాక్షి, అమరావతి: ఏపీ ఎన్జీవో పిలుపునిచ్చిన ఆందోళనకు మా మద్దతు లేదని ఏపీ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఏకపక్షంగా ఎన్టీవోలు ఆందోళనకు పిలుపునివ్వడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఉద్యోగుల ఐక్యతను దెబ్బతీసేందుకే ఆందోళనకు పిలుపునిచ్చారని విమర్శించారు. స్వప్రయోజనాల కోసం ఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి ఏకపక్ష నిర్ణయం తగదన్నారు. ప్రభుత్వం తక్కువ సమయంలోనే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చిందన్నారు. అనేక విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు పెంచిందని తెలిపారు. పెద్దఎత్తున ప్రజాసంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని.. ఇలాంటి సమయంలో ఆందోళనకు పిలుపునివ్వడం సరైన పద్ధతి కాదన్నారు. ఉద్యోగులు తమ డిమాండ్లపై ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని వెంకటేశ్వర్లు సూచించారు. -
ఈ నెల 19న తెలంగాణ బంద్
-
ఆర్టీసీ సమ్మెకు రాజకీయ తోడ్పాటు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె మరింత ఉధృతం చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయించింది. వరుసగా 7 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం ఎలాంటి చర్చలకు తావులేకుండా వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న నేతలు.. సమ్మెపై ఎక్కడా తగ్గబోమని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో మరింత వాడిగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని భావించిన జేఏసీ.. ఈ కార్యక్రమాల్లో రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేసే దిశగా అడుగులు వేస్తోంది. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో జేఏసీ నేతలు.. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబును కలిశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరగా.. సానుకూలంగా స్పందిస్తూ ప్రతి కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొంటారని, ఈ మేరకు పీసీసీ తరఫున పిలుపునిస్తామని చెప్పారు. కేంద్ర హోం శాఖ మంత్రి జి.కిషన్రెడ్డిని పలువురు ఆర్టీసీ జేఏసీ నేతలు కలిశారు. అనంతరం టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ను కలిశారు. లక్ష్మణ్ స్పందిస్తూ ఆర్టీసీ సమ్మెను తమ భుజాలపై ఎత్తుకుని ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. శనివారం నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని బస్సు డిపోల ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని తెలిపారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో నిర్వహించే అఖిల పక్ష సమావేశానికి తమ పార్టీ ప్రతినిధిని పంపుతామని లక్ష్మణ్ తెలిపారు. నేడు మౌనదీక్షలు.. ఆర్టీసీ జేఏసీ కార్యాచరణలో భాగంగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను తీవ్ర తరం చేయనున్నారు. ప్రతిరోజు ర్యాలీలు నిర్వహిస్తూ నిరసన కార్యక్రమాలు చేపడుతుండగా.. శనివారం గాంధీ విగ్రహాల వద్ద మౌన దీక్షలు చేపట్టనున్నారు. తాలూకా కేంద్రాల్లో అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కలసి వినతిపత్రాలు సమర్పించనుంది. శుక్రవారం కరీంనగర్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ను కలసిన పలువురు వినతులు ఇచ్చే క్రమంలో ఉద్రిక్తతకు దారి తీసింది. శుక్రవారం ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. వరంగల్లో ఆర్టీసీ కార్మికులపై అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ర్యాలీల జోరు.. నినాదాల హోరు! ఆర్టీసీ కార్మికుల 7వ రోజు ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మండల, తాలూకా, జిల్లా కేంద్రా ల్లో ర్యాలీలు చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో ఆర్టీసీ కార్మికులతో పాటు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు పాల్గొని మద్దతు తెలిపాయి. జేఏసీ నేతలు తమ డిమాండ్లను పేర్కొంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చాలాచోట్ల రాస్తారోకోలు చేపట్టడంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. మెజార్టీ బస్సులు రోడ్డెక్కలేదు. ప్రయాణికుల తాకిడికి సరిపడా బస్సులు నడపాలని ఆర్టీసీ భావిస్తున్నా అనుభవజ్ఞులైన డ్రైవర్లు దొరకట్లేదు. -
ఆర్టీసీ సమ్మె రేపు ఆఖిలపక్ష సమావేశం
-
ఆర్టీసీ సమ్మె: అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన జేఏసీ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చంచేందుకు ఆర్టీసీ జేఏసీ బుధవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో జరిగే ఈ సమావేశంలో తమ భవిషత్తు కార్యచరణను ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అధ్యక్షతన జరిగే.. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానించామని జేఏసీ తెలిపింది. సమ్మెని విరమించి విధుల్లో చేరాలని ఓ వైపు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. తాత్కలికంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రైవేటు వాహానాలను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లు పూర్తి కార్యాచరణ రంగం సిద్ధం చేశారు. మరోవైపు డిమాండ్లు నెరవేర్చేవరకు సమ్మెను విరమించేదే లేదని కార్మికులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రేపు జరగబోయే జేఏసీ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. -
గత ప్రభుత్వ నిర్వాహకం వల్లే ఆర్టీసీకి నష్టాలు
-
అగ్రిగోల్డ్ ఆస్తులు.. అధికారపార్టీ నేతలే కాజేశారు
విజయవాడ: వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధిత ఉద్యమ సంఘాలు బుధవారం భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా బాధితుల సమస్యలపై చర్చ జరిగింది. అగ్రిగోల్డ్ బాధితులు అందరూ కలిసి జేఏసీని ఏర్పాటు చేశారు. నాలుగున్నరేళ్లుగా టీడీపీ ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులను అధికార టీడీపీ నేతలే కాజేశారని ఉద్యమ నేతలు మండిపడ్డారు.చంద్రబాబు వల్ల తమనకు ఎటువంటి న్యాయం జరగదని బాధితులు అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్ బాధితులకు అండగా ఉంటామని ఇచ్చిన హామీ పట్ల ఉద్యమ నేతలు హర్షం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే బాధితులకు చెల్లింపులు మొదలు పెడతామన్న హామీపై బాధితులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించుకుంటామని జేఏసీ తీర్మానించింది. రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ నేతలు పర్యటించి వైఎస్సార్సీపీకి అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాల మద్ధతు కూడ గట్టాలని నిర్ణయం తీసుకుంది. -
వైఎస్ జగన్ను కలిసిన ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు
-
బీసీని సీఎంగా ప్రకటించే పార్టీకే మద్దతు
సాక్షి, హైదరాబాద్: గత ఎన్నికల్లో అన్ని పార్టీలు తమకు అన్యాయం చేశాయని భావించిన బీసీ నాయకులు రానున్న ఎన్నికల్లో తమ ఓటు తామే వేసుకోవాలన్న పిలుపుతో ప్రజా జేఏసీగా ఏర్పడ్డారు. ఈ మేరకు గురువారం సోమాజిగూడలో జరిగిన సమావేశంలో జస్టిస్ ఈశ్వరయ్య అధ్యక్షతన ప్రజా జేఏసీ ఏర్పడింది. బీసీని ముఖ్యమంత్రిగా ప్రకటించే పార్టీకే మద్దతివ్వాలని బీసీ నాయకులు తీర్మానించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ.. బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యా పరంగా వెనుకబడినందుకే చట్టసభల్లో సముచిత స్థానం పొందలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి రాజకీయ నాయకులు మోసపూరితమైన వాగ్దానాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, వారి మాటలకు విలువలు లేకపోవడం దీనికి నిదర్శనమన్నారు. ఒకరిని మరొకరు దూషించుకోవడం వల్ల పారదర్శకత లోపిం చిందన్నారు. దేశంలో నాణ్యమైన విద్య, వైద్యం కొరతతో అభివృద్ధి కుంటుపడిందని, కాబట్టి విద్య, వైద్యాన్ని జాతీయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 36 స్థానాల్లోనే బీసీ అభ్యర్థులు పోటీపడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. మన ఓటు మన బీసీలకు వేసి గెలిపించుకుని చట్ట సభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించుకోవడం వల్ల మన సంక్షేమానికి పునాదులు వేసుకున్న వారమవుతామని ఈశ్వరయ్య అన్నారు. గతం ప్రభుత్వాలు కులవృత్తులు, చేతివృత్తుల వారి అభివృద్ధిని నీరుగార్చాయని ప్రొఫెసర్ తిరుమలి అన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ స్థానాల్లో గెలిచిన అభ్యర్థులు అగ్రకులాల నాయకులకు తొత్తులుగా మారారని మండిపడ్డారు. రాష్ట్రంలో దోపిడికి గురవుతున్న ఏౖకైక వర్గం బీసీలేనన్నారు. సామాజిక న్యాయమే ధ్యేయంగా విలువలతో కూడిన నాయకులను గెలిపించుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, కస్తూరి జయప్రసాద్, ప్రొఫెసర్ మురళీమనోహర్, జేబీ రాజు, పీఎస్ఎన్వీ మూర్తి, టీవీ రామ నర్సయ్య, నర్సింహ పాల్గొన్నారు. -
వికారాబాద్ అభ్యర్థిగా మెతుకు ఆనంద్
ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. టీఆర్ఎస్ అధిష్టానం వికారాబాద్ టీఆర్ఎస్ టికెట్ను డాక్టర్ మెతుకు ఆనంద్కు కేటాయించింది. ఈమేరకు బుధవారం ప్రకటించింది. జిల్లాలోని మరో మూడు టికెట్లను కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసిన రోజున ప్రకటించిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణాలతో తాజా మాజీ ఎమ్మెల్యే సంజీవరావుకు టికెట్ నిరాకరించింది. టికెట్ కేటాయింపు విషయంలో పార్టీ అధిష్టానం భారీ కసరత్తు చేసింది. పలుమార్లు మంత్రి కేటీఆర్ జిల్లా మంత్రి మహేందర్రెడ్డితోపాటు ఇతర నేతలతో సమావేశమై సమాలోచనలు జరిపారు. ఎట్టకేలకు టికెట్ ప్రకటించడంతో కార్యకర్తలు, పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, అనంతగిరి: టీఆర్ఎస్ అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితాను బుధవారం రాత్రి ప్రకటించింది. ఈమేరకు వికారాబాద్ నియోజకవర్గం స్థానాన్ని డాక్టర్ మెతుకు ఆనంద్కు కేటయించింది. రెండు నెలలుగా ఈ టికెట్ విషయంలో కొనసాగుతున్న సస్పెన్స్కు ఎట్టకేలకు శుభం కార్డు పడింది. మొదటి జాబితాలో వికారాబాద్ తాజా మాజీ ఎమ్మెల్యే సంజీవరావు పేరు లేకపోవడంతో ఆశావహులు టికెట్ దక్కించుకునేందుకు తీవ్రంగా పోటీపడ్డారు. పార్టీ సీనియర్ నాయకులు, పలువురు డాక్టర్లు యత్నించారు. ఎట్టకేలకు అధిష్టా నం డాక్టర్ మెతుకు ఆనంద్ అభ్యర్థిత్వానికి మొగ్గు చూపింది. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి ప్రసాద్కుమార్ బరిలో దిగారు. ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. మెతుకు ఆనంద్కు టికెట్ రావడంతో ఆయన సన్నిహితులు, పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమంలో కీలక భూమిక డాక్టర్ మెతుకు ఆనంద్ తెలంగాణ ఉద్యమంలో డాక్టర్స్ జేఏసీలో కీలకంగా పనిచేశారు. 2013–14లో వికారాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జిగా వ్యవహరించారు. 2014లో ఎన్నికల్లో ఆయన పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఈసారి ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నించారు. మెతుకు ఆనంద్ వికారాబాద్లో సబితాఆనంద్ పేరుతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. దీంతోపాటు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వికారాబాద్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. -
ఆర్జిత సేవలు బంద్
సాక్షి, హైదరాబాద్: దేవాదాయ శాఖ అధీనంలో ఉన్న దేవాలయాల్లో శుక్రవారం నుంచి ఆర్జిత సేవలు నిలిచిపోనున్నాయి. దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నామని, దేవాలయాల్లో అర్చనాభిషేకాలు నిలిపివేస్తామని తెలంగాణ అర్చక, ఉద్యోగ జేఏసీ కన్వీనర్ గంగు భానుమూర్తి వెల్లడించారు. గురువారం హైదరాబాద్ న్యూనల్లకుంటలోని రామాలయంలో అన్ని జిల్లాల నుంచి హాజరైన ప్రతినిధుల సమావేశం జరిగిందని, ఈ సమావేశంలో ఆర్జిత సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. దేవాలయాలు తెరిచే ఉంటాయని, నిత్యపూజలు, మహానైవేద్యం సమర్పిస్తామని, అయితే, భక్తులు ఫీజు చెల్లించి జరిపించుకునే అర్చనాభిషేకాలను మాత్రం నిలిపివేస్తామని చెప్పారు. తాము సీఎం కేసీఆర్కు, దేవాదాయ మంత్రి, కమిషనర్లకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం చేయడం లేదని, కేవలం దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగానే ఆందోళన చేస్తున్నామని ఆయన చెప్పారు. అర్చక, ఉద్యోగుల వేతనాలను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఇవ్వాలని గత ఏడాది సెప్టెంబర్లో జీవోనెం.577 విడుదల చేశారని, మళ్లీ సెప్టెంబర్ వస్తున్నా అధికారులు ఈ జీవోను అమలు చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జీవోను వెంటనే విడుదల చేయాలని, గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని, కేడర్ ఫిక్సేషన్లో జరిగిన అవకతవకలు సరిచేయాలనే ప్రధాన డిమాండ్లతో ఆందోళనకు దిగుతున్నామని చెప్పారు. గత మూడు రోజుల నుంచి ఈ విషయమై నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నామని, అయినా అధికారులు స్పందించకపోవడంతో ఆర్జిత సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంటున్నట్టు భానుమూర్తి చెప్పారు. -
గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు పెంచాలి
సాక్షి, న్యూఢిల్లీ: హైకోర్టు, కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన మేరకు రాష్ట్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు పెంచాలని తెలంగాణ గిరిజన జేఏసీ డిమాండ్ చేసింది. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ను విడదీసి ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపీ రవీంద్రనాయక్ ధరావత్, గిరిజన నేతలు శంకర్ నాయక్, ఆంగోత్ గణేశ్ నాయక్ల ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీలోని పార్లమెంటు స్ట్రీట్ వద్ద జేఏసీ నేతలు ధర్నా చేశారు. ఎన్నో ఆశయాలతో సాధించుకున్న తెలంగాణలో గత నాలుగేళ్లుగా గిరిజనులకు హక్కుగా దక్కాల్సిన రిజర్వేషన్ ఫలాలు దక్కడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గోండు, కోయ, కోలాం, లంబాడీ తెగల మధ్య విభేదాలు సృష్టిస్తూ గిరిజనుల నిజమైన సమస్యలను పట్టించుకోవడం లేదని నేతలు విమర్శించారు. గిరిజన జనాభా 99 శాతం ఉన్న గిరిజన తాండాలు, గూడాల అభివృద్ధికి జిల్లా పరిషత్తుల ద్వారా వివిధ పద్దుల కింద నాలుగేళ్లుగా విడుదల కావాల్సిన రూ.20 వేల కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
ఉక్కు ఉద్యమంపై విరిగిన లాఠీ
-
ఉక్కు ఉద్యమంపై లాఠిన్యం
కడప సెవెన్రోడ్స్: కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం విద్యార్థి సంఘాల జేఏసీ నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. నాలుగురోజులుగా జిల్లాలో పాదయాత్రలు నిర్వహించిన ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ కార్యకర్తలు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చాయి. వైఎస్సార్ విద్యార్థి విభాగం, ఎన్ఎస్యూఐ సంఘీభావంగా పాల్గొన్నాయి. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నాటకాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పటికే పెద్ద సంఖ్యలో మోహరించి ఉన్న పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వాగ్వాదాలు, తోపులాటలు చోటుచేసుకున్నాయి. పోలీసులు ఒక్కసారిగా విద్యార్థులపై విరుచుకుపడి లాఠీలు ఝళిపించారు. ఈ సంఘటనలో పలువురు గాయపడ్డారు. యోగి వేమన విశ్వవిద్యాలయానికి చెందిన ఎంఆర్ నాయక్ స్పృహ కోల్పోయారు. విద్యార్థులు ఆయనను హుటాహుటిన రిమ్స్కు తరలించారు. అయితే పరిస్థితి మెరుగు పడకపోవడంతో తిరుపతి రుయా ఆస్పత్రికి తీసుకెళ్లారు.విద్యార్థుల కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి కడప ఎమ్మెల్యే అంజద్బాషా, మేయర్ సురేష్బాబు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కడప స్టీల్ ప్లాంటు ఏర్పాటు విషయంలో మళ్లీ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయడమంటే కాలయాపన కోసమేనని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కడపలో స్టీల్ ప్లాంటుకు అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ ఉన్నాయని ఓ వైపు చెబు తూనే టాస్క్ ఫోర్స్కు శ్రీకారం చుట్ట డం దేనికని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని విమర్శించారు. అధికా రంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినా ఏ ఒక్క హామీని అమలు చేసిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని మోసగించిన నేరంలో ప్రధాని మోదీ ప్రథమ ముద్దాయి కాగా, చంద్రబాబు రెండవ ముద్దాయని చెప్పారు. విశాఖలో ఎలాంటి సదుపాయాలు లేకపోయినా అప్పట్లో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్బంగా వారు గుర్తు చేశారు. విశాఖ ఉక్కు ఉద్యమంలో విద్యార్థి, యువకులే ప్రధానంగా పాల్గొన్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయడం ద్వారా మాట నిలుపుకోవాలని, లేకుంటే ప్రజలు తగిన బుద్ది చెబు తారని హెచ్చరిం చారు. స్టీల్ ప్లాంటు ఏర్పాటు విషయంలో చిత్తశుద్ది లేని టీడీపీ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ మాట్లాడుతూ రాయలసీమలోని నిరుద్యోగులు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలన్నారు. సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ స్థాపించాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి కె.ఆంజనేయులు, బి. నారాయణ, పీసీసీ అధికార ప్రతినిధి నీలి శ్రీనివాసరావు, వైఎస్సార్ యువజన విభాగం నాయకులు చల్లా రాజశేఖర్, విద్యార్థి నాయకుడు ఖాజా రహమతుల్లా, జనసేన విద్యార్థి విభాగం నాయకుడు గంగిరెడ్డి, ఎన్ఎస్యూఐ జిల్లా కార్యదర్శి తిరుమలేశ్, పీడీఎస్యూ నాయకులు అంకన్న, సీపీఎం నాయకులు రామ్మోహన్రెడ్డి, సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
కడప విద్యార్థి JAC కలెక్టరేట్ మట్టడిలో అపశృతి
-
గర్జించిన యువ సైన్యం!
కడప వైఎస్ఆర్ సర్కిల్: విభజన చట్టంలో పేర్కొ న్న విధంగా జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాల్సిందేనని విద్యార్థులు గళం విప్పారు. విభజన హామీలు నెరవేర్చాలంటూ మానవహారం చేపట్టారు. బుధవారం నగరంలోని కోటిరెడ్డి సర్కిల్లో విద్యార్థి ఐక్యవేదిక జేఏసీ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో విద్యార్థులు కోటిమందితో మానవహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రానికి ప్రత్యేకహోదా, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు బుందేల్ ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ, జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, విశాఖ రైల్వేజోన్ దుగ్గరాజపట్నం ఓడరేవు వంటి ఏర్పాటు చేస్తామని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా చట్టంలో పొందు పరిచిందన్నారు. అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాల్సింది పోయి ఏ మా త్రం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రధా ని మోదీ 2014 ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోపు ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని ఫీజుబిలిటీ లేదని సుప్రీం కోర్టులో అపిఢవిట్ దాఖలు చేయడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంలోని బీజేపీతో నాలుగేళ్లు కాపురం చేసి ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో విభజన హామీలను నెరవేర్చాలని కోరుతూ ప్రజలను మభ్య పెట్టేందుకు దొంగ పోరాటాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చల్లా రాజశేఖర్ మాట్లాడుతూ విభజన హామీల కోసం విద్యార్థులు, ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తుంటే ముఖ్య మంత్రి చంద్రబాబు పోలీసులు చేత అక్రమ అరెస్ట్లు చేయించడం దారుణమన్నారు. ప్రత్యేక హోదా కోసం తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి యువభేరి నిర్వహిస్తే విద్యార్థులను భయబ్రాం తులకు గురి చేయడం దారుణమన్నారు. వైఎస్ ఆర్ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఖాజా రహంతుల్లా మాట్లాడుతూ విభజన హామీల కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటానికి ప్రజలతోపాటు, సినిమా హీరోలు మద్దతు తెలపాలన్నారు. అనుమతి తీసుకొని 20 వేల మంది విద్యార్థులతో కలిసి మానవహారం చేస్తుంటే కనీసం 10 నిమిషాలు సమయం ఇవ్వకుండా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేయడం హేయమైన చర్య అన్నారు. అపుస్మా జిల్లా అధ్యక్షుడు ఎంవీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కరువుతో అల్లాడుతున్న జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసి ఆదుకోవాల్సింది పో యి జిల్లాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. విభజన హామీలు అమలు చేయాలని వైఎస్ఆర్సీపీ ఎంపీలు 5 మంది తమ పదవులకు రాజీనామా చేసి రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేస్తుంటే టీడీపీ ఎంపీలు పార్లమెంట్లో డ్రామాలాడుతూ ప్రజలను మభ్య పెడుతున్నారని తెలి పారు. ఉక్కు సాధన సమితి జిల్లా గౌరవాధ్యక్షుడు బైరెడ్డి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించి ఏపీలో పుట్టగతులు లేకుండా పోయిందో నేడు బీజేపీకి కూడా అదే గతి పడుతుందన్నారు. విద్యార్థి ఐక్య వేదిక జేఏసీ నాయకుల ప్రసంగాలను పోలీసులు అడ్డుకొని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్యను, మద్దిలేటిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జోగిరామిరెడ్డి, విద్యార్థి ఐక్య వేదిక జేఏసీ యూనియన్ నాయకులు వెంకట శివ, నరసింహ, సగిలి రాజేంద్ర ప్రసాద్, గంగిరెడ్డి, బి. మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ, బీజేపీ రాష్ట్రానికి ద్రోహం చేశాయి
పత్తికొండ టౌన్: టీడీపీ, బీజేపీ మోసాలను ఎండగడుతూ ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడేందుకు ఈనెల 25న రాష్ట్రంలో కోటి మందితో మానవహారం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విద్యార్థి యువజన సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ శ్రీరాములు, కోకన్వీనర్ కారుమంచి తెలిపారు. మానవహారం జయప్రదం చేయాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న జీపు జాతా గురువారం పత్తికొండకు చేరుకుంది. స్థానిక నాలుగుస్తంభాల మంటపం వద్ద వారు మాట్లాడుతూ నాలుగేళ్లుగా బీజేపీ, టీడీపీ కలసి విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి అన్యాయం చేశాయన్నారు. అన్ని వర్గాల ప్రజలు చైతన్యమై, ఏకతాటిపై వచ్చి ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు కోసం పోరాడాలన్నారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా అధ్యక్షుడు సురేంద్ర, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనుంజయ, జిల్లా నాయకులు విజయేంద్ర, రాజు, ప్రతాప్, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి రవితేజ, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు హనుమేశ్, స్థానిక నాయకులు ఉపేంద్ర, రాజు, ప్రభాకర్, సురేంద్ర, సీపీఐ మండల కార్యదర్శి కడవల సుధాకర్, పట్టణ కార్యదర్శి సురేంద్ర, రైతుసంఘం నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు పెద్ద వీరన్న, రాజాసాహెబ్ పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరాములు -
ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి
కోవెలకుంట్ల (కర్నూలు): ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని నిరుద్యోగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు దేవరాజు చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ గురువారం నిరుద్యోగ జేఏసీ, వీహచ్పీఎస్, మాలమహానాడు, జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, వైభవ్ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ర్యాలీ, ధర్నా చేపట్టారు. స్థానిక గాంధీసెంటర్ నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారంగా ఏర్పడి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని బీజేపీ, టీడీపీలు హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నాయని ఆరోపించారు. ప్రత్యేక హోదా సాధన కోసం దశలవారీగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నాయకులు కోగిల ప్రసాద్, సునీల్, సుధాకర్, చినబాబు, సురేష్, బద్రి, అశోక్, శేఖర్ పాల్గొన్నారు. -
రైల్వే జోన్ సాధన కోసం నిరసన రాత్రి
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించాలన్న డిమాండ్తో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన రాత్రి కార్యక్రమం చేపట్టారు. జ్ఞానాపురం వైపు ఉన్న రైల్వే స్టేషన్ ప్రవేశ ద్వారం వద్ద మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు సాగిన ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైల్వేజోన్ అంశం దాదాపు 30 ఏళ్లుగా నడుస్తోందన్నారు. ఇది ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ అని, బోర్డు చైర్మన్ కూడా ఇది పొలిటికల్ విషయమని తెలియజేశారని గుర్తు చేశారు. వుడా మాజీ చైర్మన్ ఎస్.ఎ.రహమాన్ మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం వచ్చి పోరాడినప్పుడు జోన్ తప్పక వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ గత ఎన్నికల సభలో మోడీ ఎన్నో హామీలు ఇచ్చారని, అందులో రైల్వే జోన్ ఒకటని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు దానిని బీజేపీ నాయకులు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఎన్జీవో జిల్లా ప్రెసిడెంట్, నాన్ పొలిటికల్ జేఏసీ కన్వీనర్, కె.ఈశ్వరరావు, ఉత్తరాంధ్ర పొలిటికల్ జేఏసీ రక్షణ వేదిక కన్వీనర్ ఎస్.ఎస్.శివశంకర్, వీజేఎఫ్ అధ్యక్షుడు శ్రీనుబాబు, ప్రత్యేక రాష్ట్ర పోరాట సమితి జి.ఎ.నారాయణరావు పాల్గొన్నారు. వేదికపై కూచిపూడి నాట్యం, మిమిక్రీ, మేజిక్షో, పేరడీ సాంగ్స్ తదితర పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
ఆగస్టులో నూతన రాజకీయ పార్టీ
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్) : బీసీ ఉద్యమనేత, తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో బీసీలకు నూతన రాజకీయ పార్టీ స్థాపించనున్నట్లు బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ నౌడు వెంకటరమణ తెలిపారు. త్వరలో ఆర్. కృష్ణయ్య పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేస్తారన్నారు. పార్టీ పతాకం, విధివిధానాలు ప్రకటిస్తారన్నారు. ప్రెస్క్లబ్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జనాభాలో 52 శాతానికి పైగా ఉన్న బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు బీసీలకు 100 సీట్లు కేటాయిస్తామని హామీలు ఇస్తున్నాయే తప్ప అమలు చేయడం లేదన్నారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయన్నారు. బీసీలకు రాజ్యాధికారం వచ్చినపుడే అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుందన్నారు. బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని వారిని చైతన్య పరిచేందుకు పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో పర్యటిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో 13జిల్లాలకు జేఏసీ అధ్యక్షులను నియమిస్తామన్నారు. రాష్ట్రంలోని ముఖ్యపట్టణాల్లో బీసీల రాజకీయపార్టీ ఆవిర్భావంపై మేధోమథన సదస్సులు నిర్వహిస్తామన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు, మేధావులు, ప్రముఖుల సూచనలు , సలహాలు తీసుకుని పార్టీని ముందుకు తీసుకెళతామన్నారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పాలేటి రామారావు, సంఘం ఉపాధ్యక్షుడు అరవ వెంకటసత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ మారేష్, మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ నూకాలమ్మ, ఉపాధ్యక్షురాలు సీతారత్నం, పరిటాల రాము, పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. -
ఆర్టీసీ సమ్మెకు జేఏసీ మద్దతు
ముషీరాబాద్ : ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల వేతన సవరణ తదితర సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ, యాజమాన్య వైఖరికి వ్యతిరేకంగా అధికార టిఎంయు ఈ నెల 11 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునివ్వడాన్ని ఆర్టీసీలోని 8సంఘాలతో కూడిన జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) స్వాగతించింది. మంగళవారం ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ టీఎంయు ఇచ్చిన ఆందోళన కార్యక్రమాన్ని బలపరుస్తూ 7న కార్మికులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారని, 8, 9, 10తేదీల్లో జేఏసీ నాయకులు రాష్ట్రంలోని అన్ని డిపోల్లో పర్యటించి కార్మికులను సమ్మెకు సమాయత్తం చేస్తారని తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని సమ్మెను నివారించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మూడు ప్రధాన డిమాండ్లపై రాజీలేని పోరాటం చేయాలని టీఎంయును కోరారు. సంస్థ పరిరక్షణలో భాగంగా పన్నుల మినహాయింపులతో పాటు డీజిల్పై పెరుగుతున్న భారాన్ని ప్రభుత్వం భరించే విధంగా ఒప్పించాలని, రూ.24వేలు కనీస వేతనం ఉండేలా మాస్టర్ స్కేల్ అమలు చేస్తూ ఒప్పందం కుదుర్చుకోవాలని, కండక్టర్, డ్రైవర్ల ఉద్యోగ భద్రతపై, టికెట్ తీసుకునే బాధ్యత ప్రయాణికుల పైనే ఉండేలా రెగ్యులేషన్స్ సవరించాలనే డిమాండ్లను సాధించుకునే విధంగా సమ్మె సాగాలని కోరారు. సమావేశంలో రాజిరెడ్డి (ఈయూ), హన్మంత్ ముదిరాజ్ (టిజేఎంయు), విఎస్ రావు (ఎస్డబ్ల్యూఎఫ్), రమేష్ (కెఎస్), అబ్రహం (ఎస్డబ్ల్యూయు), యాదగిరి (కెపి) పాల్గొన్నారు. ఏకపక్ష నిర్ణయాలు తగవు... సమ్మె తేదీ ప్రకటించక ముందే ఆర్టీసీ జేఏసీలోని ముగ్గురు ప్రతినిధులను మాత్రమే ఆహ్వానించి మిగిలిన ప్రతినిధులను పిలవకపోవడాన్ని జేఏసీ తప్పుపట్టింది. చర్చల్లో భాగంగా నిర్దిష్టమైన ప్రణాళికపై చర్చించకుండా జేఏసీని సంప్రదించకుండా ఏకపక్షంగా సమ్మె తేదీని నిర్ణయించడం దారుణమన్నారు. టిఎంయు వైఖరి కార్మికులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని అభిప్రాయపడింది. గుర్తింపు సంఘంగా అన్ని యూనియన్లను ఒకతాటి పైకి తేవడంలో విఫలమయ్యారని ఆరోపించారు. నిరవధిక సమ్మెలోకి వెళ్తే కార్మికులకునష్టం జరగకూడదనే విశాల దృక్పథంతో జేఏసీ కూడా సమ్మెకు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. -
అగ్రకులాల్లో పేదలు పాలకులకు కనిపించరా?
-
మా కులమే అనర్హతా?
సాక్షి, హైదరాబాద్ : ‘‘ఉన్నత కులంలో పుట్టడమే మా తప్పా.. మా కులమే మాకు అనర్హతా... అగ్రకులాల్లో పేదలు కనిపించడం లేదా..’’అని రెడ్డి జేఏసీ నాయకులు పాలకులను ప్రశ్నించారు. పేదరికం ఆధారంగా రిజర్వేషన్లు ఉండాలని, వెయ్యి కోట్ల కార్పస్ ఫండ్తో రెడ్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విదేశాలకు వెళ్లే విదార్థులకు రూ.20 లక్షల సహాయం అందించాలని, గురుకులాల్లో ప్రవేశం కల్పించాలని కోరారు. ఆదివారం హైదరాబాద్లోని రాజా బహద్దూర్ వెంకట్రామిరెడ్డి ప్రాంగణంలో రెడ్ల సమరభేరి పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. సభకు రెడ్లు పెద్ద సంఖ్యలో తరలిచ్చారు. సమావేశానికి హాజరైన కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి టీఆర్ఎస్పై విమర్శలు గుప్పించగా.. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వాటిని తిప్పికొట్టారు. ఈబీసీ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి: నాయిని అగ్ర కులాల్లో చాలామంది పేదలు ఉన్నారని, సీఎంను ఒప్పించి ఈబీసీ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని హోంమంత్రి నాయిని చెప్పారు. పేదలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అగ్ర కులాల పేదలకు కూడా అందాల్సిన అవసరం ఉందన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాల ద్వారా సమస్యలు పరిష్కాం కావన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలతో ద్వారా రేవంత్రెడ్డి నాయకుడు కాగలడేమోగానీ సమస్యలు పరిష్కారం కావని పేర్కొన్నారు. దొరల పెత్తనాన్ని అడ్డుకోవాలి: రేవంత్రెడ్డి తెలంగాణ పోరాటంలో రెడ్ల పాత్ర కీలకమని కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో రెడ్ల పాత్రను తక్కువ చేసే యత్నం జరిగిందని, రెడ్డి అనే కారణంగా కోదండరాంను పక్కన పెట్టారని విమర్శించారు. దొరల పెత్తనానికి ఎదురొడ్డి నిలవకుంటే మన ఉనికికే ప్రమాదమని అన్నారు. వారిని ఓడించే శక్తి రెడ్లకు ఉందని, వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుతామని స్పష్టం చేశారు. రెడ్లకు ప్రత్యేక కార్పొరేషన్ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేరుస్తామని ఎమ్మెల్యేలు డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. రాష్ట్ర జేఏసీ చైర్మన్ నవల్గ సత్యనారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో సినీనటి జయప్రద, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, అసోసియేట్ చైర్మన్ అప్పమ్మగారి రాంరెడ్డి, కొలను వెంకటేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగిన వైద్య సిబ్బంది నిరసన
జనగామ అర్బన్ : తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల జేఏసీ పిలుపుమేరకు జిల్లాలోని వైద్య సిబ్బంది చేస్తున్న పెన్డౌన్, టూల్ డౌన్ కార్యక్రమం బుధవారం రెండో రోజు కొనసాగింది. ఈమేరకు ఏరియా ఆస్పత్రి, చంపక్ హిల్స్లోని ఎంసీహెచ్ల ఎదుట నిరసన తెలిపారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులకు 180 రోజులపాటు ప్రసూతి సెలవులు ఇచ్చి వేతనం చెల్లించాలని కోరారు. వైద్యవిధాన పరిషత్ ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతులు కల్పించి హెల్త్కార్డులు మంజూరు చేయాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. అలాగే, ఎస్టీఓ ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కమిటీ జిల్లా అధ్యక్షుడు పి.లక్ష్మయ్య, కార్యదర్శి కె.రాజేష్, సిబ్బంది సంతప్, సహదేవ్, శ్రీరాములు, మధుకర్, రంజిత్, శశిధర్, అభిలాష్, చంద్రారెడ్డి, శ్రీధర్, రమేష్, రమ్య, ఉమాదేవి, శోభ, నాగమణి, వెంకమ్మ, సానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. -
కోదండరాం పార్టీకి మద్దతు ఇవ్వాలి
భువనగిరి : జేఏసీ చై ర్మన్ కోదండరాం ఏ ర్పాటు చేయనున్న పార్టీకి ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని ఉస్మానియ యూనివర్సిటీ జేఏసీ ఆధ్యక్షుడు మాలిగ లింగస్వామి అన్నారు. బుధవారం స్థానిక ఎస్వీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన జిల్లా టీజేఏసీ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పాలకులకు తగిన రీతిలో బుద్ధి చెప్పే శక్తి కోదండరాంకు మాత్రమే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అ«ధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా కోఆర్డినేటర్ బల్లి దయాకర్, పట్టణ కన్వినర్ డి. రఘువీర్, మండల కన్వినర్ కె. శ్రీశైలం, నరేష్, మల్లేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
రైతుల సమస్యల పరిష్కారానికి కృషి
భైంసారూరల్: రైతు సమస్యలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి వాటిని పరిష్కరించేందుకు కృషిచేస్తామని టీజేఏసీ నిర్మల్ జిల్లా చైర్మన్ ఆరెపల్లి విజయ్కుమార్ అన్నారు. గురువారం టీజేఏసీ జిల్లా కన్వీనర్ డా.ముష్కం రామకృష్ణాగౌడ్తో కలిసి తిమ్మాపూర్ గ్రామంలో రైతుల వద్దకు వెళ్లారు. రైతులు పడుతున్న ఇబ్బందులు, బాధలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం సాధించాక కూడా రైతుల సమస్యలు తీరడం లేదన్నారు. రైతుల సమస్యలు పరిష్కారం చేసేందుకు క్షేత్రస్థాయిలో వెళ్లి వారితో కలిసి సాదక బాధకాలు అడిగి తెలుసుకుంటున్నామన్నారు. ఈనెల 21న రైతు సదస్సు ఏర్పాటు చేస్తున్నామని, సదస్సులో నియోజకవర్గ రైతులంతా పాల్గొని సమస్యలపై చర్చించాలన్నారు. ప్రధాన సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీవీవీ జిల్లా కార్యదర్శి చాకెటి లస్మన్న, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసరాజు, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు జే.రాజు, జేఏసీ నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు. -
నగరంలో మూతపడిన సినిమా థియేటర్లు
-
థియేటర్లు బోసిపోయాయి
సాక్షి, హైదరాబాద్: ప్రతి శుక్రవారం కొత్త సినిమాలతో కళకళలాడే థియేటర్లు బోసిపోయాయి. సినిమా థియేటర్ల యజమానులు బంద్ పాటించడంతో గ్రేటర్ హైదరాబాద్లో సినిమా ఆగిపోయింది. దక్షిణాది రాష్ట్రాల్లో భారంగా మారిన డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ చార్జీలకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ బంద్ కారణంగా.. నగరంలోని సుమారు 200 సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్ల్లో ప్రదర్శనలు నిలిపేశారు. వీపీఎఫ్ క్రమంగా ఎత్తేయాలని, విరామ సమయంలో ప్రదర్శించే రెండు ప్రకటనలను సినిమా పరిశ్రమకు ఇవ్వాలనే డిమాండ్తో పంపిణీదారులు, ప్రదర్శనకారులు, నిర్మాతలు నిరవధిక బంద్కు దిగారు. దక్షిణ భారత సినీ పరిశ్రమ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్కు థియేటర్లు సంపూర్ణ మద్దతునివ్వడంతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్, దిల్సుఖ్నగర్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, కూకట్పల్లి, కొత్తపేట్, సరూర్నగర్, బంజారాహిల్స్, అమీర్పేట్, పంజగుట్ట తదితర ప్రాంతాల్లోని థియేటర్లు, మల్టీప్లెక్స్లు మూతపడ్డాయి. నిత్యం సందర్శకులు, ప్రేక్షకులతో కళకళలాడే నెక్లెస్ రోడ్ ఐమాక్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్లోని థియేటర్లలో ప్రదర్శనలు నిలిపేయడంతో బోసిపోయాయి. పలు థియేటర్ల వద్ద ప్రదర్శనలు నిలిపేస్తున్నట్లు బోర్డులు ఏర్పాటు చేశారు. శుక్రవారం హోలీ సందర్భంగా సెలవు కావడంతో మధ్యాహ్నం వరకు రంగుల్లో మునిగితేలిన యువత.. సాయంత్రం సినిమాకు వెళ్లే అవకాశం లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యింది. థియేటర్లకు సమీపంలోని హోటళ్లు, చాట్ భండార్లు, టీ, జ్యూస్ సెంటర్లు, పాన్డబ్బాలు బోసిపోయి కన్పించాయి. జేఏసీ నిర్ణయం మేరకే.. సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ జేఏసీ నిర్ణయం మేరకే థియేటర్లను మూసివేశాం. వారం పాటు థియేటర్లు మూసేసినా మేము సిబ్బందికి వేతనాలు ఇవ్వాల్సిందే. సర్వీస్ ప్రొవైడర్లు రేట్లు తగ్గిస్తే జేఏసీ నిర్ణయం మేరకు థియేటర్లను మళ్లీ తెరిచేందుకు అవకాశం ఉంటుంది. – రామారావు, సంధ్య 70 ఎంఎం థియేటర్ మేనేజర్ వీకెండ్లో వినోదం కోల్పోయాం.. శుక్రవారం హోలీ, శని, ఆదివారాల్లో సెలవు రావడంతో కుటుంబా లు, స్నేహితులతో కల సి థియేటర్లలో సినిమా కు వెళదామనుకున్నాం. కానీ మాలాంటి వారికి బంద్ వల్ల నిరాశే ఎదురైంది. వీకెండ్లో వినోదం కోల్పోయాం. – కె.వంశీకృష్ణ, ప్రేక్షకుడు -
కష్టాలు కొని తెచ్చుకుంటున్న పవన్: జేపీ
సాక్షి, హైదరాబాద్: సినిమాల్లో అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్, రాజకీయాల్లోకి వచ్చి కోరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారని లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం తనను కలిసిన పవన్ కళ్యాణ్తో పాటు ఆయన మీడియాతో మాట్లాడారు. జేపీ ఇంకా ఏమన్నారంటే.. ‘ప్రజలకు కావలసినవి రావాలంటే అందరూ సమిష్టిగా పోరాడాలి. ఒకసారి చట్టంలో పెట్టాక ఆశలు ఆకాంక్షలు అమలు చేయకపోవడం ఏరు దాటాక తెప్ప తగలేయడం లాగా ఉంది కేంద్రం పని. తెలంగాణకు కూడా కొన్ని హామీలు నెరవేర్చాలి. ఆర్థికంగా జరగవలసిన హామీలు ఖచ్చితంగా అమలు చేయాలి. ప్రత్యేక హోదా అనేది నష్టపోయిన ప్రాంతానికి ఆదుకోవడం కోసం మాత్రమే. బుందేల్ఖండ్కు కేంద్రం నుంచి 4 వేల కోట్లు అందాయి. పదివేల కోట్లు అందాయని కేంద్రం చెబుతుంది. మీ రాజకీయాల కోసం ప్రజలను బలి చేయొద్దు’ పవన్ ఏమన్నారంటే.. ‘రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు కేంద్రం నెరవేర్చలేదు. హామీల సాధనకు జేఏసీని ఏర్పాటు చేస్తామని, మీరు కూడా ఉండాలని జేపీని కోరాం. జేఏసీలో రెండు రాష్ట్రాల నాయకులను భాగస్వామ్యం చేస్తాం. ఒక సమూహంగా పోరాడాల్సిన అవసరం ఉంది. అఖిలపక్ష భేటీ తరువాత ప్రధానమంత్రిని కలిసి అన్నీ వివరిస్తా’ -
పవన్ ఆలోచనల్లో ఎదుగదల, కానీ..: కత్తి
సాక్షి, విజయవాడ : జనసేన అధ్యక్షుడు, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ ఆలోచనల్లో ఎదుగుదల కనిపిస్తోందని, అయితే అది ఆచరణలోకి రావాలని సినీ విమర్శకుడు కత్తి మహేష్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్కు జరుగుతున్న అన్యాయంపై పోరాటానికి పవన్ కోరినట్లు ప్రత్యేకంగా జేఏసీ అవసరం లేదని, పోరాడుతున్న పార్టీలు, ప్రజాసంఘాలతో కలిస్తే సరిపోతుందని అన్నారు. గురువారం ఉదయం కత్తి మహేష్ విజయవాడ లెనిన్ సెంటర్ లో విపక్షాలతో కలిసి బంద్ లో పాల్గొన్నారు. (కాగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధన కోసం అన్ని ప్రజా సంఘాలతో కలిసి జేఏసీ ఏర్పాటు చేసి పోరాటం చేస్తామని పవన్కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యమం చేసిన తరహాలోనే ఏపీలో కూడా ప్రత్యేక హోదా జేఏసీ ఏర్పాటు చేస్తామని నిన్న ఆయన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.) మరోవైపు ప్రత్యేక హోదాను స్వార్ధ ప్రయోజనాల కోసం తాకట్టుపెట్టిన చంద్రబాబు సర్కార్ కు బుద్ది చెబుతామని విద్యార్థి, యువజన సంఘాలు హెచ్చరించాయి. రాష్ట్ర బంద్ లో భాగంగా విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్లో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. మట్టి, నీరుతో రాష్ట్రంను నిలువునా కేంద్రం దగా చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. -
రాజకీయాల్లోకి జేఏసీ
హైదరాబాద్: రాజకీయాల్లో జేఏసీ జోక్యం చేసుకోవాల్సిన సమయం వచ్చిందని, ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ చెప్పారు. ఈ నెల 4 తర్వాత దీనిపై విధి విధానాలు ఖరారు చేస్తామని ఆయన తెలిపారు. రంగారెడ్డి జిల్లా బొంగ్లూర్లో బుధవారం జరిగిన రైతు సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో సంక్షోభంలో ఉన్న వ్యవసాయరంగాన్ని కాపాడుకోవడానికి జేఏసీ కార్యాచరణ రూపొందిస్తుందన్నారు. రైతుకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై పాత పది జిల్లాల్లో పర్యటించిన తర్వాత ఈ నెల 4న తుర్కయంజాల్లో సభ నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రస్తుత రాజకీయాలు సమాజాభివృద్ధికి దోహదపడటం లేదని, ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిన ద్రోహులు అధికారంలో ఉన్నారని విమర్శించారు. ఈ సదస్సుకు జేఏసీ రంగారెడ్డి జిల్లా చైర్మన్ వెదిరె చల్మారెడ్డితో పాటు జిల్లా నాయకులు శ్యాంసుందర్రెడ్డి, కొత్త రవి తదితరులు హాజరయ్యారు. -
బంద్ సక్సెస్
కామారెడ్డి క్రైం: కామారెడ్డి పట్టణ బంద్ విజయవంతమైంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానాన్ని కొందరు అక్రమంగా దున్నడాన్ని వ్యతిరేకిస్తూ జేఏసీ, అఖిలపక్ష, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శనివారం కామారెడ్డి బంద్ జరిగింది. వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. అఖిలపక్షం ఆధ్వర్యంలో రాజకీయ పార్టీ లు, విద్యార్థి సంఘాలు, వామపక్షాలు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించాయి. తప్పుడు పత్రాలను సృష్టించి కళాశాల మైదానాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారికి తగిన గుణపాఠం చెబుతామని అఖిలపక్ష నేతలు పేర్కొన్నారు. కళాశాల ఆస్తులను కాపాడుకోవడం కోసం ఎంతటి ఉద్యమాలకైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఆక్రమిస్తే సహించబోం: విప్ గోవర్ధన్ కళాశాల ఆస్తులను ఆక్రమిస్తే సహించబోమని ప్రభుత్వవిప్ గంప గోవర్ధన్ హెచ్చరించారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ప్రైవేట్ వ్యక్తులు దున్నిన కళాశాల మైదానాన్ని పరిశీలించారు. మైదానంలో వాలీబాల్ ఆడిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి కళాశాల ఆస్తులు వెళ్లకుండా చూసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ప్రజా కోర్టు నుంచి మాత్రం తప్పించుకోలేరన్నారు. కళాశాల భూములను కాపాడుకునేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. జేఏసీ చైర్మన్ జగన్నాథం, మున్సిపల్ చైర్పర్సన్ పిప్పిరిసుష్మ, ఎంపీపీ మంగమ్మ, బహుజన ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు క్యాతం సిద్దిరాములు, టీఆర్ఎస్ నేత నిట్టువేణుగోపాల్రావు, పార్టీ మండల అధ్యక్షుడు పిప్పిరి ఆంజనేయులు, కాంగ్రెస్ నేతలు నల్లవెల్లి అశోక్, నిమ్మ మోహన్రెడ్డి, మామిండ్ల అంజయ్య, బీజేపీ నాయకులు వి.మురళీధర్గౌడ్, చిన్నరాజులు, ప్రభాకర్యాదవ్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సిద్దిరాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కట్ల భూమన్న, ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి రాజలింగం, విద్యార్థి సంఘాల నాయకులు ఆజాద్, అగ్గి రవీందర్, అరుణ్కుమార్, భానుప్రసాద్, సురేశ్ పాల్గొన్నారు. -
ఫిబ్రవరిలో విస్తృతస్థాయి సమావేశం
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్ కార్యాచరణపై చర్చించడానికి ఫిబ్రవరి 3వ తేదీ లేదా 4వ తేదీన విస్తృతస్థాయి సమా వేశం నిర్వహిస్తామని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం వెల్లడించారు. రైతు అధ్యయన యాత్రలపై సమీక్షించడానికి శనివారం హైదరాబాద్లో జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం వివరాలను కోదండరాం మీడియాకు వెల్లడించారు. తెలంగాణలోని పాత 10 జిల్లాల్లో రైతు అధ్యయన యాత్రలు పూర్తయ్యాయని, ఇంకా మిగిలిఉన్న ప్రాంతాల్లో ఈ నెల 20వ తేదీ నాటికి పూర్తిచేస్తామన్నారు. 22వ తేదీ నుంచి 30వ తేదీ దాకా జిల్లాల వారీగా జరిగిన అధ్యయన యాత్రల్లో వచ్చిన అంశాలపై సమీక్షా సమావేశాలు, సదస్సులు ఉంటాయని చెప్పారు. జిల్లా స్థాయి సదస్సులు పూర్తయిన తరువాత విçస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. జేఏసీ నేత గోపాలశర్మ అరెస్టుపైనా సమీక్షించినట్టుగా కోదండరాం వెల్లడించారు. -
కోదండరాంది పదవుల తండ్లాట:బాల్క సుమన్
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులకు న్యాయం చేయాలంటూ కొలువుల కొట్లాట సభ నిర్వహించిన జేఏసీ చైర్మన్ కోదండరాంపై టీఆర్ఎస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. కోదండరాం నిర్వహించింది కొలువుల కొట్లాట సభ కాదు.. తనకు పదవి కోసం జరిపిన తండ్లాట సభ అని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ విమర్శించారు. కోదండరాం కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారని, ఆ పార్టీతో ఆయన చీకటి ఒప్పందం చేసుకున్నారని బాల్క సుమన్ ఆరోపించారు. నిరుద్యోగులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఖాళీల భర్తీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్లోని సరూర్నగర్ స్టేడియంలో నిర్వహించిన ‘కొలువులకై కొట్లాట’ సభలో కోదండరాం.. నేరుగా టీఆర్ఎస్ను, ముఖ్యమంత్రిని సంబోధిస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు. ‘‘కాంట్రాక్టులు ఇప్పించి కమీషన్లు తీసుకోవడంపై దృష్టిపెడుతున్నారు. భూముల్ని ఎవరికి కట్టబెడదామా.. ఇసుక కాంట్రాక్టులు ఎవరికి ఇప్పించుకుందామా అన్నవే ముఖ్యమంత్రికి ప్రధానమయ్యాయి. కాంట్రాక్లర్ల మేలు కోసమే నిరుద్యోగుల జీవితాలను బలి పెడుతున్నారు. నిరుద్యోగుల సమస్య ఈ ప్రభుత్వానికి అప్రధానమైపోయింది’’ అని కోదండరాం విమర్శించారు. -
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
నెల్లూరు(పొగతోట): గూడూరు రూరల్ మండలంలోని ఉపాధిహామీ ఏపీఓ సుబ్బరాయుడిపై దాడి చేసిన అధికారపార్టీ నాయకుడి తనయుడు నాగరాజు, అతని అనుచరులను అరెస్ట్ చేయాలని మహాత్మాగాందీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉద్యోగుల సమాఖ్య(జేఏసీ) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బద్దిపూడి మధు, వల్లూరు దయానంద్ డిమాండ్ చేశారు. ఉపాధి హామీ సిబ్బందికి రక్షణ కల్పించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీఓపై అధికారపార్టీకి చెందిన వ్యక్తులు 20 మంది చుట్టుముట్టి మేము చెప్పిన పనులు చేయవా అంటూ పిడిగుద్దులు గుద్దుతూ, కాళ్ళతో తన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీఓ ప్రాణభయంతో పోలీస్స్టేషన్కు పరుగులు తీసిన పోలీసులు పట్టించుకోలేదన్నారు. ఉపా«ధి సిబ్బంది అభద్రతతో పనులు చేయలేమని తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ ఆర్.ముత్యాలరాజుకు వినతిపత్రం సమర్పించారు. జ్ఞానప్రకాష్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతి, ప్రధాని చిత్రపటాలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంచాలి రాష్ట్రపతి, ప్రధాని చిత్రపటాలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. సురేష్రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ మేరకు.. కలెక్టర్ ఆర్.ముత్యాలరాజుకు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి చిత్రపటాలను అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. న్యాయం చేయండి అల్లూరు చెరువు భూముల్లో పంటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న యానాదులకు న్యాయం చేయాలని యానాది సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పెంచలయ్య కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు చెరువు భూముల్లో 140 యానాది కుటుంబాలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. సమ్మర్స్టోరేజ్ కోసం ఆ భూముల్లో ఐదెకరాలు మాత్రమే ప్రభుత్వం తీసుకుందన్నారు. గతంలో పంటలు సాగు చేసుకున్న యానాదులు భూముల్లోకి వెళితే ఎస్సీలు దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని కలెక్టర్ ఆర్.ముత్యాలరాజుకు వినతిపత్రం సమర్పించారు. భూస్వాముల నుంచి రక్షణ కల్పించండి.. పేద రైతులకు భూ స్వాముల నుంచి రక్షణ కల్పించేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని సీపీఐ సినియర్ నాయకులు పి.దశరథరామయ్య, వి. రామరాజు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు. నెల్లూరు రూరల్ మండలం కందమూరులో 150 ఎకరాల ప్రభుత్వ భూములను నిరుపేదలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. అయితే నెల్లూరుకు చెందిన వ్యాపారులు సాగు చేయనివ్వకుండా రైతులపై క్రిమినల్ కేసులు పెట్టారని తెలిపారు. అప్పటి కలెక్టర్ భూములను పరిశీలించి వ్యాపారులకు ఇచ్చిన పట్టాలను రద్దు చేయమని ఆదేశించినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం దొంగ పట్టాలు సృష్టించి రైతులను భూముల్లోకి దిగనివ్వకుండా అడ్డుపడుతున్నారన్నారు. భూములు సాగు చేస్తున్నా వారికి పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్.ముత్యాలరాజుకు వినతిపత్రం సమర్పించారు. సొసైటీకి ఎన్నికలు నిర్వహించాలి బ్రాహ్మణక్రాక ఫిషర్మెన్ కో–ఆపరేటివ్ సొసైటీకి ఎన్నికలు నిర్వహించేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని సొసైటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. 1975లో జలదంకి మండలం బ్రాహ్మణక్రాక సోసైటీ రిజిస్టర్ అయిందన్నారు. ఎన్నికలు నిర్వహించకుండా జరిగినట్లు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కార్యవర్గ సభ్యుల గడువు పూర్తి అయినందున సోసైటీకి ఎన్నికలు నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతు జిల్లా కలెక్టర్ ఆర్. ముత్యాలరాజుకు వినతిపత్రం సమర్పించారు. -
‘కమిషనరేట్ అక్కడ నిర్మించొద్దు’
సాక్షి, హైదరాబాద్: కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్ హోం స్థలంలోని పదెకరాలను రాచకొండ కమిషనరేట్కు కేటాయించారు. జారీ చేసిన జీవోను రద్దు చేయాలని విక్టోరియా హోం భూముల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని జేఏసీ చైర్మన్ కొదండరాం సదర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వి.ఎం. హోం స్థలాన్ని అనాథ విద్యార్థుల కోసం విద్యా అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ భూములను రాకొండ కమిషనరేట్కు కేటాయించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు. కమిషనరేట్కు తాము వ్యతిరేకం కాదని ఓటర్ రింగ్ రోడ్డు పరిసరాల్లో ప్రభుత్వ భూములు కావాల్సినంత ఉన్నాయన్నారు. అక్కడ నిర్మిస్తే ఎవరికీ ఇబ్బందులు ఉండవని తెలిపారు. దీనిపై ప్రభుత్వ జీవోలను రద్దు చేసే వరకు తాము పోరాడుతామని, పోరాడే వారికి మద్దతు ఇస్తామని కోదండదాం తెలిపారు. -
కలెక్టర్ వైఖరిని నిరసిస్తూ టీచర్ల ర్యాలీ
ఏలూరు (ఆర్ఆర్ పేట) : జిల్లాలో వివిధ ప్రభుత్వ యాజమాన్యాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేసే విధంగా కలెక్టర్ కాటంనేని భాస్కర్ మూడేళ్లుగా ప్రవర్తిస్తున్నారని ఉపాధ్యాయ సంఘాల జేఎసీ నాయకులు విమర్శించారు. కలెక్టర్ విధానాలకు వ్యతిరేకంగా ఉపాధ్యాయుల జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన దశలవారీ ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం ఏలూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ విద్యాశాఖలో బయోమెట్రిక్ హాజరు అమలు చేయడంపై ఇచ్చిన ఆదేశాల ప్రకారం పాఠశాల్లో బయోమెట్రిక్ యంత్రం పనిచేయని పక్షంలో సమీప ప్రాంతంలోని ఇతర కార్యాలయాల్లో హాజరు నమోదుచేయాలని ఆదేశించడం గర్హనీయమన్నారు. ఈ ఆదేశాలను అమలు చేసే క్రమంలో పెరవలిలో ఉపాధ్యాయురాలు బి.రత్నకుమారి ప్రమాదానికి గురై మృతిచెందిన విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా కలెక్టర్ అదే విధానాలను అవలంభిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలల్లో కిచెన్ గార్డెన్లు పెంచాలని, ఎస్ఎంసీ, పీటీఏ సమావేశాలను, టాయిలెట్ నిర్వహణ వాటి ఫొటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేయడం, ప్రతి మూడు నెలలకోసారి పాఠశాలలను మూసివేసి మండలస్థాయిలో టీఎల్ఎం మేళాలను ప్రదర్శించాలని ఆదేశించడం కలెక్టర్ నిరంకుశ వైఖరికి నిదర్శనమన్నారు. ప్రతి గురువారం నిర్వహిస్తున్న విద్యాశాఖ సమీక్ష సమావేశాల్లో ఉపాధ్యాయులను, ఉపాధ్యాయ సంఘాలను, విద్యాశాఖాధికారులను అవమానించే విధంగా చేస్తున్న వ్యాఖ్యలు ఉపాధ్యాయుల్లో మానసిక భయాందోళనలు కలిగిస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి ఏలూరు మున్సిపల్ కార్యాలయం నుంచి ఫైర్స్టేషన్ సెంటర్, డీఈఓ కార్యాలయం మీదుగా కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించి ఆర్డీవో కార్యాలయంలో ఏఓకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయ జేఏసీ నాయకులు పి.జయకర్, పీఎన్వీ ప్రసాదరావు, బీఎ సాల్మన్రాజు, పువ్వుల ఆంజనేయులు, గుగ్గులోతు కృష్ణ, గెడ్డం సుధీర్, జి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
కోదండరాంను వాడుకుంటున్న కాంగ్రెస్
ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి ధ్వజం సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాంను కాంగ్రెస్ పార్టీ కరివేపాకులా వాడుకుంటోందని ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని ఆయన వీలైనంత త్వరగా గుర్తించాలని హితవు పలికారు. మంగళవారం వేణుగోపాలాచారి ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. టీజేఏసీ ముసుగులో కోదండరాం, కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులపై 32 కేసులు, ఇతర ప్రాజెక్టులపై 192 కేసులు దాఖలు చేసి అభివృద్ధిని కాంగ్రెస్ అడ్డుకుంటోందని అన్నారు. దీనికి ఆ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. నంద్యాల ఉపఎన్నిక మాదిరిగానే తెలంగాణలోనూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు డిపాజిట్లు దక్కవని హెచ్చరించారు. -
కోదండరామ్కు ఆ విషయం తెలియదా?
జేఏసీ చైర్మన్ కోదండరామ్పై కర్నె ధ్వజం సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ఢిల్లీలో అబద్దాల చిట్టాతో సంచరిస్తున్నారని, జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కోదండరామ్ అబద్దాలతో ఎవరినీ మెప్పించలేరని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం లక్షా నలభై అయిదు వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిందని మాట్లాడుతున్నారని, అప్పులు తీర్చగలిగే వారికి ఎవరైనా అప్పులు ఇస్తారని పేర్కొన్నారు. దేశంలో మిగతా రాష్ట్రాలు అప్పులు చేయడం లేదా ? ఎఫ్ఆర్బీఎం చట్టానికి లోబడే అప్పులు తెస్తున్నామన్న విషయం కోదండరామ్కు తెలియదా అని ప్రశ్నించారు. అసలు ఎలాంటి తెలంగాణ కావాలో కోదండరామ్ స్పష్టం చేయాలన్నారు. -
పోరాట ఉధృతితోనే ఫలితం
–ముద్రగడ పాదయాత్ర మొదలుపెడితే ప్రభుత్వానికి శ్మశాన యాత్రే –ఉద్యమం చివర స్థాయిలో ఉంది కాపులంతా రెట్టింపు ఉత్సహంతో పనిచేయాలి –పాదయాత్రకు అనుమతి ఇచ్చే వరకూ చలో కిర్లంపూడి తరలిరావాలి –13 జిల్లాల కాపు జేఏసీ నాయకులు కిర్లంపూడి: ఉద్యమాన్ని ఎంత తీవ్రతరం చేస్తే ఫలితాలు అంత తొందరగా వస్తాయని 13 జిల్లాల కాపు జేఏసీ నాయకులు అభిప్రాయ పడ్డారు. గురువారం కిర్లంపూడి ముద్రగడ స్వగృహంలో ముద్రగడ ఆధ్వర్యంలో 13 జిల్లాల కాపు జేఏసీ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకుడు, జిల్లా కాపు సద్భావన సంఘం అధ్యక్షుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో 13 జిల్లాల నుంచి వచ్చిన కాపు జేఏసీ నాయకులు ముద్రగడ పాదయాత్ర భవిష్యత్తు కార్యచరణపై పలు సలహాలు, సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఉద్యమం శివరి దశలో ఉందని రెట్టింపు ఉత్సాహంతో ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తే తొందరలోనే ఫలితాలు వస్తాయన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కాపు జాతికి రిజర్వేషన్లు కల్పిస్తామని, ఏటా వెయ్యి కోట్లు ఇచ్చి కాపుల అభివృద్ధికి పాటుపడతానని, ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యుత్తు అందిస్తానని చెప్పి ఇంత వరకూ ఆ హామీలు అమలు చేయకపోవడంతో జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తమ నాయకుడు ముద్రగడ పద్మనాభం చంద్రబాబు ఇచ్చిన హామీలను గుర్తుచేయడం కోసం నిరవధిక పాదయాత్ర చేపడితే వేలాది మంది పోలీసుల ఆసరాతో పాదయాత్రను అడ్డుకోవడం దారుణమన్నారు. పాదయాత్రకు అనుమతి ఇచ్చే వరకు చలో కిర్లంపూడి నినాదంతో 13 జిల్లాల నుంచి భారీ సంఖ్యలో కాపులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఎన్నో పార్టీల జెండాలు మోసి అలసిపోయాం ... ఇప్పటికైనా జండాలు పక్కనపెట్టి ఒకే ఎజెండాతో ముందుకు సాగుదాం అని ముద్రగడ పిలుపునిచ్చారు. కాపులంతా కొదమ సింహాలు ... వారంతా ముద్రగడ వెంటే ఉన్నారు.... చంద్రబాబు వెనుక ఉన్నది పిల్లి పిల్లలు, వ్యక్తిగత స్వప్రయోజలన కోసం చంద్రబాబు ఎలా ఆడమంటే అలా ఆడుతున్నారని మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, నారాయణ, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులను ఉద్ధేశించి పలువురు జేఏసీ నాయకులు విమర్శించారు. ఈ రోజు కాపు కార్పోరేషన్ పెట్టినా, కాపు రుణాలు ఇచ్చినా ముద్రగడ పోరాటమేనని అన్నారు. జాతి మనుగడ కోసం, జాతి మనుగడ కోసం ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు యావత్తు కాపు జాతి సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో 13 జిల్లాల జేఏసీ నాయకులు పాల్గొన్నారు.