వైఎస్సార్ జిల్లా పెద్దముడియం మండలం నెమళ్లదిన్నె గ్రామం వద్ద శనివారం ఉదయం ఆటో బోల్తా పడి ఆరుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.
జమ్మలమడుగు: వైఎస్సార్ జిల్లా పెద్దముడియం మండలం నెమళ్లదిన్నె గ్రామం వద్ద శనివారం ఉదయం ఆటో బోల్తా పడి ఆరుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. కొత్తపల్లె నుంచి ఉప్పులూరు గ్రామానికి వ్యవసాయ పనుల నిమిత్తం మహిళా కూలీలు ఓ ఆటోలో వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. గాయపడిన మహిళలను జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.