గొల్లప్రోలు (తూర్పుగోదావరి) : డెంగ్యూతో ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన గౌర రాజు(7) కొన్ని రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.