Dengue
-
డెంగ్యూకు టీకా.. బీహార్లో తుది ట్రయల్స్
పాట్నా: డెంగ్యూ వ్యాధి నుంచి ప్రజలకు త్వరలో విముక్తి లభించనుంది. బీహార్లోని పట్నాలో డెంగ్యూ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఆరుగురికి డెంగ్యూ వ్యాక్సిన్ వేశారు. త్వరలో 500 మందికి ఈ వ్యాక్సిన్ను ఇవ్వనున్నారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిని రెండేళ్లపాటు శాస్త్రవేత్తల బృందం పరిశీలించనుంది.ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్కు చెందిన పాట్నాలోని రాజేంద్ర మెమోరియల్ మెడికల్ సైన్సెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ క్లినికల్ ట్రయల్ నిర్వహిస్తోంది. దేశంలోనే పూర్తిగా తయారవుతున్న ఈ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్ సెప్టెంబర్ 26న ప్రారంభమైందని ఆర్ఎంఆర్ఐఎంఎస్ అధికారి ఒకరు తెలిపారు. ఐసీఎంఆర్, పనాసియా బయోటెక్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్ను తయారు చేసేందుకు కృషి చేస్తున్నాయి.వ్యాక్సిన్ పరీక్షల కోసం 10 వేల మందికి ముందుగా వ్యాక్సిన్ వేసి, వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించనున్నారు. డెంగ్యూ వ్యాక్సిన్ను పరీక్షించేందుకు దేశవ్యాప్తంగా 19 కేంద్రాలను ఎంపిక చేశారు. వాటిలో ఆర్ఎంఆర్ఐఎంఎస్ ఒకటి. ఒక్కో కేంద్రంలో సుమారు 500 మందికి ట్రయల్ వ్యాక్సిన్ వేయనున్నారు. కాగా బీహార్లో డెంగ్యూ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ ఏడాది 4,416 కేసులు నమోదయ్యాయి. 12 మంది డెంగ్యూ బాధితులు మృతిచెందారు. ఒక్క పట్నాలోనే 2,184 కేసులు నమోదయ్యాయి. ఇది కూడా చదవండి: బ్రెజిల్లో తుపాను బీభత్సం.. ఏడుగురు మృతి -
బీహార్లో డెంగ్యూ విజృంభణ.. ఒక్కరోజులో 90 కేసులు
పట్నా: బీహార్లో డెంగ్యూ విజృంభిస్తోంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో డెంగ్యూ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. పట్నాలో వరుసగా మూడవ రోజు రికార్డు స్థాయిలో డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. పాట్నాలో ఒక్కరోజులో అత్యధికంగా 90 మంది డెంగ్యూ బారినపడ్డారు.పాట్నా జిల్లాలో మొత్తం డెంగ్యూ బాధితుల సంఖ్య 1,147కి చేరింది. కంకర్బాగ్ ప్రాంతం డెంగ్యూ కేసులకు హాట్ స్పాట్గా మారింది. ఇక్కడ ప్రతీ ఇంటిలోనూ డెంగ్యూ బాధితులు కనిపిస్తున్నారు. తానాలోని కంకర్బాగ్, అజీమాబాద్ తర్వాత బంకీపూర్ ప్రాంతంలో డెంగ్యూ కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. 28 మంది కంకర్బాగ్లో డెంగ్యూతో బాధపడుతున్నారు. బంకీపూర్లో 23 మంది, పాటలీపుత్రలో 13 మంది, అజీమాబాద్లో ఏడుగురు డెంగ్యూ బారినపడ్డారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల నీరు నిలిచిపోతోంది. దీంతో దోమలు విజృంభిస్తున్నాయి. బీహార్లో మొత్తం 2,419 మంది డెంగ్యూ బారినపడినట్లు వైద్యాధికారులు గుర్తించారు.డెంగ్యూతో ఇప్పటివరకు బీహార్లో ఎనిమిది మంది మృతిచెందారు. డెంగ్యూ ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పీఎంసీహెచ్లోని మెడిసిన్ విభాగం సీనియర్ వైద్యుడు డాక్టర్ రాజన్ కుమార్, ఎన్ఎంసీహెచ్ మెడిసిన్ విభాగం అధిపతి డాక్టర్ అజయ్ కుమార్ సిన్హా విజ్ఞప్తి చేశారు. డెంగ్యూ సోకకుండా ఉండాలంటే దోమలను నివారించాలన్నారు. ఇది కూడా చదవండి: ఏడడుగుల గోడ దూకి మేకను ఎత్తుకెళ్లిన తోడేళ్లు -
Telangana: రాష్ట్రవ్యాప్తంగా 'జోరు వాన'
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీగా వానలు పడుతున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి, చెరువులు అలుగుపోస్తున్నాయి. రహదారులపై నీరు చేరడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని.. ఆదివారం విశాఖపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆది, సోమవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఈ మేరకు 14 జిల్లాలకు రెడ్ అలర్ట్, పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎర్రుపాలెంలో 18.83 సెంటీమీటర్లు శనివారం రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో 18.83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మధిరలో 16.38, బోమన్దేవిపల్లిలో 13.75, వరంగల్ జిల్లా రెడ్లవాడలో 12.35, యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో 10.43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్ర ప్రణాళిక విభాగం గణాంకాల మేరకు.. రాష్ట్రవ్యాప్తంగా 45 చోట్ల 5 సెం.మీ. కంటే ఎక్కువ వర్షాలు కురిశాయి. మొత్తంగా శనివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 2.33 సెం.మీ. సగటు వర్షపాతం నమోదైంది. సీజన్ సగటులో అధిక వర్షపాతం నైరుతి సీజన్లో ఆగస్టు చివరినాటికి రాష్ట్రంలో 57.59 సెం.మీ. సగటు వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా.. ఈసారి 66.37 సెం.మీ. కురిసింది. మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట్ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం.. జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, వికారాబాద్, నాగర్కర్నూల్, ఖమ్మం, ములుగు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మిగతా జిల్లాలన్నీ సాధారణ వర్షపాతానికి కాస్త అటు ఇటుగా ఉన్నాయి. పలు జిల్లాల్లో విస్తారంగా వానలు.. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్లలోని పలు ప్రాంతాల్లో చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. ఏకబిగిన వర్షాలతో రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు నీట మునిగాయి. ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం నార్లాపూర్కు చెందిన పుట్ట మహేశ్ (17) పశువులను మేపడానికి వెళ్లి పిడుగుపాటుతో మృతి చెందాడు. ⇒ ములుగు జిల్లా జగ్గన్నగూడెం సమీపంలోని బొగ్గులవాగు, పస్రా–ఎస్ఎస్ తాడ్వాయి మండలాల మధ్య జలగలంచవాగు పొంగిపొర్లడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. పస్రా– తాడ్వాయి మధ్య కొండపర్తి సమీపంలో జాతీయ రహదారిపై చెట్లు విరిగిపడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారులోని మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో పాకాల వాగు ఉప్పొంగడంతో.. వందల ఎకరాల్లో పొలాలు నీటమునిగాయి. ⇒ ఖమ్మం జిల్లా మధిర పట్టణం జలదిగ్బంధమైంది. బస్సులు, వాహనాల్లో ఉన్న ప్రయాణికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయి ఆందోళనలో పడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి.. భారీ వర్షాల నేపథ్యంలో హుటాహుటిన మధిరకు బయలుదేరారు. అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. ఎర్రుపాలెం మండలం మీనవోలు–పెగళ్లపాడు మధ్య రహదారిపై చేరిన వరదలో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. పోలీసులు స్థానికుల సాయంతో ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఇక్కడి నక్కలవాగులో భవానిపురానికి చెందిన మలిశెట్టి సాంబశివరావు(19) గల్లంతయ్యాడు. ⇒ కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్లో భారీ వర్షం కురిసింది. పట్టణంలో ప్రధాన రహదారిపై నీరు చేరి వాహనాలు నీట మునిగాయి. ⇒ ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. యాదాద్రి జిల్లా రాజాపేటలో, అడ్డ గూడూరు మండలం చౌళ్లరామారంలో పెద్ద సంఖ్యలో చెట్లు నేలకూలాయి. సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో పొలాలు నీటమునిగాయి. ⇒ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. నారాయణపేట జిల్లా బండగొండలో ఇద్దరు యువకులు వాగులో పడి కొట్టుకుపోగా.. స్థానికులు గమనించి కాపాడారు. మహబూబ్నగర్ జిల్లాలో దుందుభి, వర్నె వాగు ఉధృతంగా పారుతున్నాయి. జడ్చర్లలో ఏరియా ఆస్పత్రి జలదిగ్బంధమైంది వనపర్తి జిల్లా పాన్గల్ మండలం దావాజీపల్లి సమీపంలో కేఎల్ఐ కాల్వకు గండిపడటంతో పొలాలు నీటమునిగాయి. నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం వెనచర్లలో ఓ ఇంటి పైకప్పు కూలింది. ⇒ జగిత్యాల జిల్లా కేంద్రంలోని వెంకటాద్రినగర్ వద్ద బ్రిడ్జిపై నుంచి వరద పారుతోంది. అధికారులు ప్రజలను జేసీబీ సహాయంతో వాగును దాటిస్తున్నారు. గ్రేటర్ సిటీకి ముసురు హైదరాబాద్ మహానగరానికి ముసురు పట్టింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దీనితో రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. ట్రాఫిక్ చాలా నెమ్మదిగా సాగింది. లో తట్టు ప్రాంతాల్లోని కాలనీలు జలమయం అయ్యాయి. భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో.. హై దరాబాద్ జిల్లా పరిధిలో పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. విస్తారంగా వానలతో హిమాయత్నగర్, గండిపేట జంట జలాశయాల్లోకి వరద పెరిగింది. దీ నితో మూసీ పరీవాహక ప్రాంతాల వారిని అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. 59 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తుగా తరలించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని ప్రభుత్వ సీఎస్ శాంతికుమారిని సీఎం ఎ.రేవంత్రెడ్డి ఆదేశించారు. రాష్ట్రానికి భారీ వర్ష సూచన నేపథ్యంలో శనివారం ఆయన సీఎస్తో సమీక్షించారు. రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, వైద్యారోగ్య, పోలీసు శాఖలు అప్రమత్తంగా ఉండేలా చూడాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలని ఆదేశించారు. జలాశయాల గేట్లు ఎత్తేసే నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. అన్ని జిల్లా కలెక్టరేట్లు, జీహెచ్ఎంసీ, సచివాలయంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె డీజీపీ జితేందర్, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించిందని.. ఎలాంటి ఆకస్మిక విపత్తు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. వాగులు, వంకలు, చెరువులు పొంగుతున్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా అధికారిని నియమించి.. జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. వర్షాల పరిస్థితికి అనుగుణంగా జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించే విషయంపై కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని సూచించారు.బొగత జలపాతం సందర్శన నిలిపివేత వాజేడు: ఎగువన కురుస్తున్న వర్షాలతో ములుగు జిల్లా వాజేడు మండలం పరిధిలోని బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. కాగా, భారీ వర్షాల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం నుంచి జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రేంజర్ శ్రీనివాస్ శనివారం తెలిపారు. మళ్లీ ఎప్పుడు అనుమతిస్తారనేది మీడియా ద్వారా తెలియజేయనున్నట్లు వెల్లడించారు.సీజనల్ వ్యాధులపై జాగ్రత్తవైద్య సిబ్బందికి మంత్రి దామోదర సూచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ.. తమ శాఖ ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. వర్షాలు తగ్గే వరకు డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది అంతా హెడ్క్వార్టర్స్లోనే ఉండాలని ఆదేశించారు. ఎవరికీ సెలవులు మంజూరు చేయొద్దని డీఎంఈ వాణి, టీవీవీపీ కమిషనర్ రవీందర్ నాయక్ను ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్య శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, బాధితులకు అండగా నిలవాలని కోరారు. డెంగీ, చికున్ గున్యా, మలేరియా తదితర వ్యాధుల కట్టడిపై శనివారం ఆయన అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. కాగా, రాష్ట్రంలో డెంగీ, చికున్ గున్యా, మలేరియా కేసులు నియంత్రణలోనే ఉన్నాయని అధికారులు మంత్రికి నివేదించారు.డెంగీ: రాష్ట్రంలో జనవరి 1 నుంచి ఆగస్టు 30 వరకు పరీక్షించిన మొత్తం 1,06,356 నమూనాలలో రిపోర్ట్ అయిన డెంగీ కేసులు 6,242 అని అధికారులు తేల్చారు. డెంగీ హైరిస్క్ తొలి పది జిల్లాల్లో హైదరాబాద్లో (2,073), సూర్యాపేట (506), మేడ్చల్ మల్కాజ్గిరి (475), ఖమ్మం (407), నిజామాబాద్ (362), నల్లగొండ (351), రంగారెడ్డి (260), జగిత్యాల (209), సంగారెడ్డి (198), వరంగల్ (128) కేసులు నమోదయ్యాయి.చికున్ గున్యా: ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పరీక్షించిన 3,127 నమూనాలలో రిపోర్ట్ అయిన వాటిలో చికున్ గున్యా కేసులు 167. చికున్ గున్యా హైరిస్క్ జిల్లాల్లో హైదరాబాద్ (74), మహబూబ్నగర్ (20), వనపర్తి (17), రంగారెడ్డి (16), మేడ్చల్ (11) కేసులు నమోదయ్యాయి.మలేరియా: జనవరి 1 నుంచి ఆగస్టు 30 వరకు మొత్తం 22,80,500 నమూనాలు పరీక్షిస్తే మలేరియా పాజిటివ్గా 197 కేసులు నమోదయ్యాయి. -
మంకీపాక్స్పై సర్కారు అలర్ట్
సాక్షి, హైదరాబాద్: మంకీపాక్స్పై రాష్ట్ర ప్రభుత్వం ప్రజానీకాన్ని అప్రమత్తం చేసింది. ఈ మేరకు రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య ఆరోగ్యశాఖ సోమవారం మార్గదర్శకాలు జారీచేసింది. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్నునొప్పి, చలి, అలసట, చర్మంపై పాపుల్స్గా మారే మాక్యులోపాపులర్ దద్దుర్లు వంటివి ఉంటే అనుమానిత కేసులుగా పరిగణిస్తారు. మంకీపాక్స్ సాధారణంగా రెండు నుండి నాలుగు వారాల వరకు ఉండే వ్యాధి. పిల్లలలో ఎక్కువగా సంభవిస్తాయి. మంకీపాక్స్ కేసు మరణాలు పిల్లల్లో ఎక్కువగా ఉంటాయి. గత 21 రోజులలో మంకీపాక్స్ ప్రభావిత దేశాల నుంచి వచి్చన ఏ వ్యక్తి అయినా తీవ్రమైన దద్దుర్లతో బాధపడుతుంటే అనుమానించాలని పేర్కొంది. వారితో కలిసివున్న వారిని కూడా గుర్తించాలి. మంకీ పాక్స్ అనేది మశూచి రోగుల్లో కనిపించే లక్షణాలతో ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్ వ్యాప్తిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. తద్వారా మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి అవగాహన, వేగంగా కేసులను గుర్తించడం, ఇన్ఫెక్షన్ నియంత్రణ చర్యలు అవసరమని పేర్కొంది. ఆ మేరకు రాష్ట్రంలో చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అనుమానిత కేసులు గుర్తిస్తే గాం«దీకి పంపాలి మంకీ పాక్స్ సోకిన రోగులను ఐసోలేషన్లో ఉంచాలి. మెడికల్ కాలేజీలు, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంకీ పాక్స్కు సంబంధించిన రోగుల కోసం ఐసోలేషన్ బెడ్లను కేటాయించాలని ఆదేశించారు. ఇప్పటికే గాం«దీ, ఫీవర్ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను కేటాయించిన సంగతి తెలిసిందే. అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లు జిల్లా వైద్యాధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశాలిచ్చారు. అనుమానిత కేసులు ఉన్నట్లు గుర్తిస్తే చికిత్స కోసం గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి పంపాలి. అలాగే హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం ద్వారా వచ్చే అంతర్జాతీయ అనుమానిత ప్రయాణీకులుంటే వారిని రంగారెడ్డి డీఎంహెచ్వోతో సమన్వయం చేసుకొని గాంధీ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు. కాగా 1970లో డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మంకీపాక్స్ మొదటి మానవ కేసు నమోదైంది. వణికిస్తున్న డెంగీ రాష్ట్రంలో డెంగీ విస్తరిస్తోంది. గతేడాది కంటే ఇప్పుడు అధికంగా సీజనల్ వ్యాధులు సంభవిస్తున్నాయని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ రవీంద్రనాయక్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు రాష్ట్రంలో 1.42 కోట్ల ఇళ్లను వైద్య బృందాలు సందర్శించాయి. 4.40 కోట్ల మందిని స్క్రీనింగ్ చేశారని ఆయన తెలిపారు.అందులో 2.65 లక్షల మంది జ్వరం బారిన పడినట్లు రవీంద్ర నాయక్ వెల్లడించారు. వర్షాల కారణంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో దోమల సంతానోత్పత్తి పెరిగి డెంగీ విజృంభిస్తుందని చెప్పారు. ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు మొత్తం 81,932 మంది రక్త నమూనాలను పరీక్షించగా, అందులో 5,372 మంది డెంగీ సోకినట్లు వెల్లడించారు. పాజిటివిటీ 6.5 శాతంగా ఉందని వెల్లడించారు. డెంగీ హైరిస్క్ జిల్లాల్లో హైదరాబాద్ 1,872 కేసులతో మొదటిస్థానంలో ఉంది. సూర్యాపేట 471, మేడ్చల్ మల్కాజిగిరి 426, ఖమ్మం 375, నల్లగొండ 315, నిజామాబాద్ 286, రంగారెడ్డి 232, జగిత్యాల 185, సంగారెడ్డి 160, వరంగల్ జిల్లాల్లో 110 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ పది జిల్లాలను రాష్ట్రంలో హైరిస్క్ జిల్లాలుగా ప్రకటించారు. చికున్గున్యా కేసుల్లోనూ హైదరాబాద్ టాప్ మరోవైపు చికున్గున్యా కేసులు కూడా నమోదవు తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 2,673 మంది రక్తనమూనాలను పరీక్షించగా, 152 మందికి చికున్గున్యా ఉన్నట్లు గుర్తించారు. పాజిటివిటీ రే టు 5 శా తంగా ఉండటం గమనార్హం. చికున్గున్యా హైరిస్క్ జిల్లాలుగా హైదరాబాద్ 61 కేసులతో మొ దటిస్థానంలో ఉంది. వనపర్తి 17, మహబూబ్నగర్ జిల్లా లో 19 నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు మలేరియా కోసం 23.19 లక్షల మంది నుంచి రక్తనమూనాలను సేకరించి పరీక్షించగా, అందులో 191 మలేరియా కేసులు నమోదయ్యాయి. పాజిటి విటీ రేటు 0.008 శాతంగా నమోదైంది. రాష్ట్రంలో టీ æ– హబ్ ల్యాబ్స్ పనిచేస్తున్నాయి. వాటిల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. 53 బ్లడ్బ్యాంకులు అవసరమైన బ్లడ్ యూనిట్లతో సిద్ధంగా ఉన్నాయని డీహెచ్ రవీంద్రనాయక్ తెలిపారు. మొత్తం 33 జి ల్లాల్లో 108 అంబులెన్సులు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. అవసరమైన మందులన్నీ ఆసుపత్రుల్లో ఉన్నాయన్నారు. కట్టడిలో వైఫల్యం... సీజనల్ వ్యాధులను కట్టడి చేయడంలో వైద్య ఆరోగ్యశాఖ విఫలం కావడం వల్లే ఈ పరిస్థితి వచి్చందని వైద్య నిపుణులు చెప్తున్నారు. దోమల నియంత్రణకు ఇతర శాఖలను సమన్వయం చేయటంలో వైఫల్యం చెందిందని విమర్శిస్తున్నారు. పారిశుధ్య నిర్వహణను ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో దోమలు పెరిగాయని చెప్తున్నారు. వానాకాలం మొదలయ్యే సమయానికి ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలి. కానీ అవేవీ చేయలేదు. పైగా కీలకమైన సమయంలో బదిలీలు జరగడం, అవి కూడా సక్రమంగా నిర్వహించకపోవడంతో వైద్య సిబ్బంది ఆందోళనలు చేయాల్సి రావడంతో వైద్య ఆరోగ్య సిబ్బంది సీజనల్ వ్యాధులపై దృష్టిసారించలేకపోయారు. మరో వైపు పారిశుధ్యం లోపించిందని అంటున్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయలేదని, నివారణ చర్యల పట్ల ప్రచారం చేయలేదని మండిపడుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో మందుల కొరత నెలకొందనీ, సాధారణంగా సీ జనల్ వ్యాధులకు ముందే అన్ని ఆసుపత్రుల్లో బఫర్ స్టాక్ ఉంచుకో వా లని సూచిస్తున్నారు. దోమల నివారణకు ఫాగింగ్ కూడా పూర్తిస్థాయిలో జరగడంలేదనీ, నిల్వ నీటిల్లో స్ప్రేయింగ్ చేయడంలేదని వైద్యనిపుణులు ఆరోపిస్తున్నారు. -
దోమల అంతానికి లేజర్ ఫిరంగి!
భారతదేశంలోని ప్రధాన నగరాల్లో విపరీతమైన వర్షాల కారణంగా దోమలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో డెంగ్యూ కేసులు ఎక్కువవుతున్నాయి. ఈ తరుణంలో ఆనంద్ మహీంద్రా ఇంట్లో దోమలను నాశనం చేసే ఓ చిన్న యంత్రానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఈ యంత్రాన్ని 'ఇంటికి ఐరన్ డోమ్' అని ఆయన పేర్కొన్నారు.వర్షాల కారణంగా దోమల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ సమయంలో వాటిని నియంత్రించడానికి ఈ యంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చైనీస్ వ్యక్తి కనిపెట్టిన ఈ యంత్రం ఓ చిన్న ఫిరంగి మాదిరిగా ఉంది.వీడియోలో కనిపించే ఈ చిన్న యంత్రం లేజర్ కిరణాల ద్వారా దోమలను కనిపెట్టి నాశనం చేస్తోంది. నిమిషాల వ్యవధిలోనే ఆ మిషన్ లెక్కకు మించిన దోమలను అంతం చేస్తోంది. ఇలాంటి మిషన్ కొనటానికి ప్రయత్నిస్తున్నట్లు ఆనంద్ మహీంద్రా ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.With dengue on the rise in Mumbai, I’m trying to figure out how to acquire this miniature cannon, invented by a Chinese man, which can seek out & destroy mosquitoes! An Iron Dome for your Home…pic.twitter.com/js8sOdmDsd— anand mahindra (@anandmahindra) August 24, 2024 -
అప్పుడు కరోనా.. ఇప్పుడు డెంగీ
సాక్షి, హైదరాబాద్: కరోనా ప్రపంచాన్ని వణికించింది. దాని బారిన పడి లక్షలాది మంది మృత్యువాతపడ్డారు. కోట్లాది మంది ఆసుపత్రులపాలయ్యారు. అనేక కుటుంబాలను కోవిడ్ ఛిన్నా భిన్నం చేసింది. అటువంటి వైరస్ పీడ విరగడైంది. కానీ కరోనా తర్వాత ఇప్పుడు డెంగీ... భారత్ సహా దక్షిణా సియా దేశాలను వణికిస్తోంది. డెంగీ ప్రాణాంతకమై నదిగా పరిణమించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంటెలిజెన్స్ నివేదిక హెచ్చరించింది. ఈ మేరకు తాజాగా నివేదిక విడుదల చేసింది. మొత్తం 47 రకాల జబ్బులపై పరిశోధన చేసి వాటిపై నివేదిక రూపొందించింది. అందులో ఎక్కువ ప్రమాదకరంగా ఉన్న మొదటి 10 వ్యాధుల పేర్లను విడుదల చేసింది. అందులో భారత్లో డెంగీ, నిఫా, పోలియో, డిప్తీరియా, జికా వైరస్, ఫుడ్ పాయిజనింగ్, రేబిస్ వంటివి ఉన్నాయని పేర్కొంది.ప్రజారోగ్యానికి ముప్పుగా ఉన్న వాటిల్లో అంటువ్యాధులు 80 శాతం, ప్రకృతి వైపరీత్యాలు 3 శాతం, రసాయన పరమైనవి 1 శాతం, మిగిలినవన్నీ కలిపి 16 శాతంగా ఉన్నాయి. అంటువ్యాధులే ప్రధానంగా ప్రజారోగ్యానికి పెనుసవాళ్లుగా ఉన్నాయని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసే బులెటిన్లలో కోవిడ్ తర్వాత డెంగీపైనే అత్యధికంగా అలర్ట్ బులెటిన్లు విడుదలయ్యాయి. ఆ తర్వాత ఎబోలా ఉందని వెల్లడించింది. 2023లో ఇండియాలో మళ్లీ కలరా కేసులు వెలుగుచూశాయని తెలిపింది. డెంగీ, కలరా విజృంభి స్తున్నాయనీ... జాగ్రత్తగా ఉండాలని... మౌలిక సదుపాయాలు మెరుగుపరుచుకోవాలని సూచించింది.దక్షిణాసియాలో డెంగీనే ప్రమాదకరంభారత్ వంటి దేశాల్లో డెంగీ వల్ల ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. దక్షిణాసియా రీజియన్లో డెంగీనే ప్రధానమైనదిగా పరిణమించిందని పేర్కొంది. బంగ్లాదేశ్లో 2002తో పోలిస్తే 2023లో డెంగీ కేసులు 4.8 రెట్లు పెరిగాయి. అక్కడ మరణాలు 9.3 రెట్లు పెరిగాయి. అలాగే థాయ్లాండ్లో కేసులు 2.3 రెట్లు పెరగ్గా మరణాలు 2.5 రెట్లు పెరిగాయి. వాతావరణ మార్పులు, అకాల వర్షాలు, ఎండలు... తదితర కారణాల వల్ల కూడా డెంగీ ముప్పు పెరుగుతోంది. ఎప్పుడు వర్షాలు కురుస్తా యో.. ఎప్పుడు తీవ్రమైన ఎండలు ఉంటా యో తెలియని పరిస్థితి నెలకొంటోంది. దీనివల్ల అందుకు అవసరమైన ఏర్పా ట్లు కూడా సరిగ్గా చేసే పరిస్థితి ఉండటంలేదు. ఆకస్మిక ఉష్ణోగ్రతల వల్ల కూడా దోమల సంతతి వృద్ధి చెందుతోంది. మరోవైపు పట్టణీ కరణ పెరగడంతో డెంగీ వ్యాప్తి చెందుతోంది. నగరీకరణ వల్ల జనం గుంపులుగా ఉండటం... నీటి నిల్వ, మౌలిక సదు పాయాలు లేకపోవడం, నిర్మా ణాలు ఎక్కువకావడం...తదితర కారణాలతో డెంగీ త్వరగా పాకుతోంది. డెంగీ ఒకసారి మొదలైతే అది సులువుగా వ్యాపిస్తుంది.27 దేశాల్లో ఇన్ఫెక్షన్ వ్యాధులుసోమాలియా, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ సహా 27 దేశాల్లో ఇన్ఫెక్షన్ వ్యాధులు వస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలతో మయన్మార్, సూడాన్ సహా 10 దేశాలు ప్రజారోగ్యంలో సమస్యాత్మకంగా ఉన్నా యి. సామాజిక సమస్యల కారణంగా ప్రజారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న దేశాలు కెమరూన్, మయన్మార్, సిరియా. కాగా, ఇన్ఫ్లూయెంజా కేసు లు బంగ్లాదేశ్లో 2023 ఆగస్టులో, థాయ్లాండ్లో అక్టోబర్లో వెలుగుచూశాయి. నిఫా వైరస్ కేసులు బంగ్లాదేశ్, కేరళలో 2023లో నమోదయ్యాయి. 2023లో కేరళలో ఆరు నిఫా కేసులు నమోదు కాగా రెండు మరణాలు సంభవించాయి. థాయ్లాండ్, ఇండోనేసియాల్లో మంకీఫాక్స్ కేసులు నమోదయ్యాయి.ఇంకా ఆ సంస్థపైనే ఆధారం.. ఏదైనా ప్రజారోగ్య సమస్య తలెత్తితే వాటిని ముందస్తుగా గుర్తించడంలో భారత్ సహా అభివృద్ధి చెందుతున్న దేశాలు వెనుక బడుతున్నాయి. ఆయా దేశాల్లోని ప్రజా రోగ్య సంస్థలు ప్రమాదాన్ని పసిగట్టడంలేదు. 2004–08 మధ్య ఇండియా వంటి దేశాల్లో ప్రజారోగ్య సమస్యలు తలెత్తితే వాటిలో 93 శాతం మొదటగా గుర్తించి అలర్ట్ చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థే. అలాగే 2009–13 మధ్య 63 శాతం, 2014–18 మధ్య కాలంలో 84 శాతం, 2019–23 వరకు 91 శాతం ప్రపంచ ఆరోగ్య సంస్థే వాటిని గుర్తించి అప్రమత్తం చేసింది. అమెరికా వంటి దేశాల్లో సగటున 60–70 శాతం వరకు సంఘటనలను ఆయా స్థానిక ప్రభుత్వాలే గుర్తించి అలర్ట్ అవుతున్నాయి. కానీ మనలాంటి దేశాల్లో అటువంటి వ్యవస్థ నేటికీ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడించింది.ఇద్దరిలో ఒకరికి డెంగీ రిస్క్ప్రపంచంలో 2022తో పోలిస్తే 2023లో కోవిడ్ మరణాలు 90 శాతం తగ్గాయి. అయితే ఇప్పుడు భారత్లో డెంగీ వ్యాప్తి పెరిగింది. దేశంలో నిర్మాణాలు జరుగుతున్న 6 శాతం ప్రాంతాల్లో డెంగీ వ్యాప్తి జరుగుతోందని గుర్తించారు. వలసల వల్ల కూడా డెంగీ వ్యాప్తి విస్తరిస్తోంది. వాతావరణ మార్పుల కారణంగా భవిష్యత్తులోనూ ప్రజారోగ్య సమస్యలు పెరుగుతాయని, ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపరుచుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. డెంగీకి వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం పరిశోధన దశలో ఉంది. – డాక్టర్ కిరణ్ మాదల, గాంధీ మెడికల్ కాలేజీ, హైదరాబాద్ -
కేంద్ర మంత్రి జుయల్ ఓరం భార్య మృతి
భువనేశ్వర్: కేంద్ర గిరిజన శాఖ మంత్రి జుయల్ ఓరం భార్య జింగియా ఓరం మృతి చెందారు. డెంగ్యూతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. జుయల్ ఓరం సైతం డెంగ్యూ బారిన పడి అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జింగియా ఓరం మృతి పట్ల ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం రాత్రి ఆయన ఆస్పత్రిని సందర్శించారు. సీఎంతో పాటు ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్, ఆరోగ్య శాఖ మంత్రి ముఖేష్ మహాలింగ్, స్పీకర్ సూరమా పాడి, ఇతర బీజేపీ నేతలు కూడా జింగియా ఓరం భౌతికకాయానికి నివాళులు అర్పించారు. -
తెలంగాణలో డెంగ్యూ డేంజర్ బెల్స్..
-
తెలంగాణలో డెంగ్యూ డేంజర్ బెల్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు జ్వర పీడితులు క్యూ కడుతున్నారు. సాధారణం కంటే 20 శాతం ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్లో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముందస్తు చర్యలు లేకే డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలో జ్వరాల బాధితుల సంఖ్య. పెరుగుతోంది. ఎంజిఎంలో రోజుకు 30 జ్వరం కేసులు నమోదు అవుతుండగా.. రెండు డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. దీంతో 20 పడకల ప్రత్యేక ఫీవర్ వార్డ్ ఏర్పాటు చేశారు. ఎంజీఎం ఆస్పత్రిలో ప్రస్తుత రోజులకు సరిపడా మందులు అందుబాటులో ఉన్నాయని.. డెంగ్యూ ఇమేజింగ్ ఫీవర్, డెంగ్యూ షాట్ సిండ్రోమ్ వస్తే వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ కావాలని సూపరిండెంట్ మురళి తెలిపారు.భాగ్యనగరవాసులకు అలర్ట్.. విషజ్వరాల కారణంగా రోగులతో దవాఖానాలు బిజీ (ఫొటోలు) -
డెంగీ నివారణ ఎలా?
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత వర్షాకాల సీజన్లో డెంగీ వ్యాప్తి అనేది దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఆందోళనకు కారణమవుతోంది. అనేక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో దోమల పెరుగుదల, పారిశుధ్య నిర్వహణ లోపాలతో డెంగీ వ్యాప్తికి అవకాశం ఏర్పడుతోంది. ఇప్పటికే ఢిల్లీలో ఈ కేసులు పెరగగా, మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ డెంగీ కేసుల్లో పెరుగుదల నమోదు కావడం ప్రజల్లో భయాన్ని రేకెత్తిస్తోంది. దీంతో డెంగీ టెస్టింగ్, దీని ట్రీట్మెంట్కు సంబంధించిన సర్వీసులు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయనే దానిపై ఆన్లైన్లో ప్రజలు వెతకడం పెరిగిపోయింది. ఈ జనవరి–మార్చి నెలల మధ్యలో పోల్చితే ఏప్రిల్– జూన్ల మధ్య డెంగీకి చికిత్సలో నిపు ణులైన డాక్టర్లకు 20 శాతం మేర డిమాండ్ పెరిగినట్టు స్పష్టమైంది. భారత్లో స్థానిక సెర్చ్ ఇంజిన్ ‘జస్ట్ డయల్’ విడుదల చేసిన ‘కన్జూమర్ సెర్చ్ ట్రెండ్స్ డేటా’లో ఆయా అంశాలు వెల్లడయ్యాయి. అంతేకాదు.. దోమ కాటు నివారణ కోసం దోమ తెరలకు కూడా భారీగా డిమాండ్ పెరిగినట్టు వెల్లడైంది. జాతీయ స్థాయిలో వీటి అమ్మకాలు ఒక్క సారిగా 64 శాతం పెరగగా...ఢిల్లీలో 709 శాతం, పుణెలో 216 శాతం, అహ్మదాబాద్లో 160 శాతం, బెంగళూరులో 122 శాతం, కోల్కతాలో 96 శాతం, ముంబైలో 31 శాతం, హైదరాబాద్లో 27 శాతం పెరుగుదల నమోదైనట్టుగా తెలుస్తోంది. దోమల సమస్య నియంత్రణకు ‘పెస్ట్కంట్రోల్ సర్వీసెస్’ను కూడా వివిధ ప్రాంతాల్లోని ప్రజలు ఆశ్రయిస్తున్నారు. మొత్తంగా చూస్తే... దేశవ్యాప్తంగా పెస్ట్ కంట్రోల్ కేటగిరీలో ఆన్లైన్లో సెర్చింగ్ 24 శాతం పెరగగా, మెట్రోనగరాల్లో 25 శాతం, నాన్ మెట్రోనగరాల్లో 24 శాతం వృద్ధి నమోదైంది.ఈ విషయంలో ఢిల్లీ 97 శాతం వృద్ధితో ప్రథమస్థానంలో నిలవగా, కోల్కతా 68శాతంతో, అహ్మదాబాద్ 45 శాతంతో, బెంగళూరు 19 శాతం, ముంబై 13 శాతం వృద్ధి సాధించింది.బల్లులు, నల్లుల నివారణకూ ఆన్లైన్ సెర్చింగ్దోమలతో పాటు బల్లులు, తేనెటీగలు, నల్లులు, పాము లు వంటి వాటి నియంత్రణకు అవసరమైన సర్వీసుల గురించి కూడా ఆన్లైన్ సెర్చింగ్ పెరిగింది. డెంగీ కేసుల వృద్ధి నేపథ్యంలో పరిసరాల పరిశుభ్రత, దోమలు రాకుండా రెపెల్లెంట్ల వినియోగం, వేగంగా వైద్యసహాయం తీసుకోవడం, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల్లో అవగా హన వంటి వాటికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. -
డేంజర్ బెల్స్.. ఫీవర్ హాస్పిటల్
-
ఒకేసారి 4 వేరియంట్ల దాడి
ఈ సీజన్లో తెలంగాణకు ‘డెంగీ’ ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించింది. కేసుల తీవ్రత ఈసారి ఎక్కువగా ఉంటుందని తెలిపింది. దేశంలో డెంగీ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఉన్నట్టు పేర్కొంది. ఈ మేరకు డెంగీ తీవ్రతపై ప్రపంచ ఆరోగ్యసంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. డెంగీలోని నాలుగు ప్రధాన వేరియంట్లు తెలంగాణలోనే కనిపిస్తున్నాయని వెల్లడించింది.డీఈఎన్వీ1, డీఈఎన్వీ2, డీఈఎన్వీ3, డీఈఎన్వీ4 ప్రభావం ఎక్కువగా ఉంటున్నట్టు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. కొన్నిసార్లు రెండుమూడు వేరియంట్లు కూడా ఒకేసారి దాడి చేసే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. ఫలితంగా డెంగీ బాధితులు తీవ్రమైన ఇబ్బందులు పడతారని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఆస్పత్రుల్లో అవసరమైన కిట్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించింది. ఈ ఏడాది ఇప్పటివరకు 500కు పైగా డెంగీ కేసులు వెలుగు చూడడం గమనార్హం. – సాక్షి, హైదరాబాద్వైద్య పరీక్షలే కీలకం ⇒ డెంగీ నిర్ధారణలో వైద్య పరీక్షలే కీలకం. కేవలం ప్లేట్లెట్ కౌంట్, డెంగీ స్ట్రిప్ టెస్ట్, సీరమ్ టెస్ట్ వంటి వాటితో దీనిని నిర్ధారించడం శాస్త్రీయం కాదని వైద్య,ఆరోగ్యశాఖ చెబుతోంది. ⇒ విధిగా అందుబాటులో ఉండే ఐజీఎం పరీక్ష చేయించాలి. ⇒ ప్లేట్లెట్లు 20 వేలలోపు పడిపోతే అది ప్రమా దకరంగా భావిస్తారు. 15 వేల కన్నా తగ్గితే డెంగీ షాక్, డెంగీ మరణాలు సంభవిస్తాయి. ⇒ డెంగీ జ్వరం వస్తే తీవ్రతను తగ్గించేందుకు చల్ల ని నీటిలో స్పాంజీని ముంచి శరీరాన్ని తుడ వాలి. ⇒ ఎలక్ట్రాల్ పౌడర్, పండ్ల రసాలు రోగికి ఇవ్వాలి. దీనివల్ల జ్వర తీవ్రత తగ్గి ప్లేట్లెట్లు అదుపు లోకి వస్తాయి. ఇంకా తగ్గకుంటే వైద్యుని వద్దకు తీసుకెళ్లాలని వైద్య,ఆరోగ్యశాఖ సూచించింది. ⇒ వైరల్ ఫీవర్ నుంచి దూరంగా ఉండాలంటే ఫ్రైడే ను డ్రై డేగా పాటించాలి. ⇒దోమలు కుట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. రాత్రి మాత్రమే కాకుండా పగటిపూట కూడా దోమల మందులు వాడాలి. ⇒స్కూల్ పిల్లలకు దోమలు కుట్టకుండా పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉంచాలి. ⇒కాచి వడగాచిన నీటిని తాగాలి. వైరల్ ఫీవర్ వస్తే విపరీతంగా మంచినీరు తాగాలి. పండ్ల రసాలు తీసుకోవాలి. దీనివల్ల ప్లేట్లెట్లు పడిపోకుండా ఉంటుంది.డెంగీ లక్షణాలు⇒డెంగీతో ఉన్నట్టుండి తీవ్రజ్వరం, భరించలేని తలనొప్పి వస్తుంది.⇒కళ్లు తెరవడం కూడా కష్టంగా ఉంటుంది. కదిపితే నొప్పి వస్తుంది. ⇒చర్మంపై దద్దుర్లు అయినట్టు కనిపించడం, కండరాలు, కీళ్ల నొప్పులు ఉంటాయి. ⇒అధిక దాహం, రక్తపోటు పడిపోవడం ఉంటుంది.ముందుగా గుర్తిస్తే ప్రమాదమేమీ ఉండదుఇక డెంగీని ముందుగా గుర్తిస్తే 80 శాతం వరకు ఎటువంటి ప్రమాదం లేకుండా వైద్యుల చికిత్స పొందవచ్చని డాక్టర్లు అంటున్నారు. కానీ కొందరికి తీవ్రమైన రక్తస్రావం అవుతుంది. ముక్కు నుంచి కానీ, మలం ద్వారాగానీ, బ్రష్ చేసేటప్పుడు పళ్ల మధ్య నుంచి రక్తస్రావం అవుతుంది. ఇలా అధికంగా రక్తస్రావం అయితేనే ప్రమాదకరమని చెబుతున్నారు. మహిళలకు పీరియడ్స్ సమయంలో సాధారణ రక్తస్రావం కంటే అధికంగా అయ్యే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దాన్ని వారు గుర్తించాలని సూచిస్తున్నారు.ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెంగీ దోపిడీ...ఏటా డెంగీ జ్వరాలతో బాధపడేవారిని ప్రైవేట్ ఆస్పత్రులు దోపిడీ చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. డెంగీ విషయంలో సాధారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోతే 20 వేల వరకు ప్లేట్లెట్ల సంఖ్య తగ్గినా నష్టంలేదని, అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు 50 వేల వరకు ప్లేట్లెట్లు తగ్గినా ఇబ్బంది లేదని వైద్య నిపుణులు అంటున్నారు. చాలా కేసుల్లో సాధారణ జ్వరానికి చేసే వైద్యమే సరిపోతుందని అంటున్నారు. కానీ అనేక ప్రైవేటు ఆస్పత్రులు 50 వేలకు పైగా ప్లేట్లెట్లు ఉన్నా ఐసీయూలో ఉంచి అదనంగా ప్లేట్లెట్లు ఎక్కిస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. నాలుగైదు రోజులు ఉంచుకొని రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు కూడా ఫీజులు వసూలు చేసిన సంఘటనలు ఉన్నాయి. సాధారణ విష జ్వరాలకు కూడా నాలుగైదు రోజులు ఆస్పత్రుల్లో ఉంచుకొని రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. డెంగీ ఉన్నా లేకపోయినా కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నాయని, ప్లేట్లెట్లు ఎక్కువున్నా తక్కువ చూపిస్తున్నాయన్న ఫిర్యాదులు సర్కారుకు చేరాయి. -
ఐదు వ్యాధులు.. 2023లో జనం గుండెల్లో రైళ్లు!
చివరిదశకు వచ్చిన 2023లో మనం చాలా చూశాం. అంతకన్నా ఎక్కువగానే నేర్చుకున్నాం. కాలంతో పాటు మన జీవన విధానం కూడా ఎంతగానో మారిపోయింది. ఈ జీవనశైలి వల్ల చాలా మంది వివిధ వ్యాధుల బారిన పడ్డారు. ఈ సంవత్సరం కాలుష్యం కారణంగా అనేక వ్యాధులు తలెత్తాయి. 2024ని స్వాగతించే ముందు 2023లో మానవాళి ఎదుర్కొన్న తీవ్రమైన వ్యాధుల గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. తద్వారా రాబోయే సంవత్సరంలో ఈ వ్యాధులతో పోరాడేందుకు మనమంతా సన్నద్దంగా ఉండగలుగుతాం. 2023లో మానవాళి ఎదుర్కొన్న ప్రధాన వ్యాధులేమిటో ఇప్పుడు చూద్దాం.. 1. గుండె జబ్బులు: ప్రస్తుతం గుండె సంబంధిత వ్యాధులు (హృద్రోగాలు) అధికమయ్యాయి. రాబోయే సంవత్సరాల్లో గుండె జబ్బుల ముప్పు పెరగనుందని నిపుణులు చెబుతున్నారు. హృదయాన్ని కాపాడుకునేందుకు మెరుగైన జీవనశైలిని ఎంతో ముఖ్యం. అస్తవ్యస్త జీవనశైలి, మద్యం, ధూమపానం కారణంగా గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. మన దేశంలో అత్యధిక మరణాలు గుండె జబ్బుల కారణంగానే చోటుచేసుకుంటున్నాయి. 2. డెంగ్యూ ఈ సంవత్సరం డెంగ్యూ వ్యాధి ముప్పు అధికంగా వెంటాడింది. వచ్చే ఏడాది కూడా ఈ వ్యాధి విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. డెంగ్యూతో మృత్యువాత పడిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఈ వ్యాధి గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి ప్రభుత్వం పలు కార్యక్రమాలను కూడా చేపట్టింది. ఈ వ్యాధి నివారణకు ఇంట్లోకి దోమలు ప్రవేశించకుండా చూసుకోవాలి. 3. మిస్టీరియస్ న్యుమోనియా ఈ సంవత్సరం మిస్టీరియస్ న్యుమోనియా కేసులు పెరిగాయి. ఈ వ్యాధి చైనా, అమెరికాలో తీవ్రంగా కనిపించింది. ఈ వ్యాధి చైనాలో అధికంగా వ్యాప్తి చెందింది. ఈ వ్యాధి పిల్లలలో అధికంగా కనిపించింది. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న కారణంగానే వారు త్వరగా న్యుమోనియాకు గురవుతున్నారు. భారతదేశంలో ఇలాంటి కేసులు అధికంగా కనిపించనప్పటికీ, ఈ వ్యాధి విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 4. వైరల్, ఇన్ఫెక్షన్ నిపా వైరస్ ముప్పు ఈ సంవత్సరం అధికంగా కనిపించింది. జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ప్రాణాంతక వైరస్ ఇది. గబ్బిలాలతో పాటు పందులు, మేకలు, కుక్కలు, పిల్లుల ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ వ్యాధి ముప్పు మన దేశంలో అధికంగా ఉంది. ఇది కరోనా కంటే చాలా ప్రమాదకరమైనదని నిపుణులు చెబుతుంటారు. 5. కిడ్నీ సంబంధిత వ్యాధులు ఈ సంవత్సరం కిడ్నీ సంబంధిత వ్యాధుల ముప్పు కూడా మనదేశంలో అధికంగా కనిపించింది. అస్తవ్యస్త జీవనశైలి, తగినంత నీరు తాగకపోవడం, ధూమపానం మొదలైనవి కిడ్నీ సమస్యలకు కారణమని వైద్యులు చెబుతుంటారు. ఇది కూడా చదవండి: పదుగురు స్వామీజీలు.. 2023లో అందరినీ ఆకర్షించి.. -
'సభలకు అజిత్ పవార్ హాజరు కాట్లేదు.. ఎందుకంటే..?'
ముంబయి: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కొద్ది రోజులుగా రాజకీయ కార్యక్రమాలకు హాజరవడం లేదనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రాజకీయంగా మరేదైనా బాంబు పేల్చబోతున్నారా..? అనే అనుమానాలకు తావిచ్చాయి. అయితే.. ఈ పుకార్లకు తెరదించుతూ ఎన్సీపీ రెబల్ గ్రూప్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ స్పందించారు. అజిత్ పవార్ డెంగ్యూతో బాధపడుతున్నారని చెప్పారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆరోగ్యం కుదుటపడగానే అజిత్ పవార్ ప్రజల ముందుకు వస్తారని ప్రఫుల్ పటేల్ స్పష్టం చేశారు. 'ప్రజా కార్యక్రమాల్లో అజిత్ పవార్ కనిపించటం లేదని తాజాగా మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఈ పుకార్లకు సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను. డెంగ్యూతో బాధపడుతున్న అజిత్ పవార్.. నిన్నటి నుంచే చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకోవాల్సిందిగా కోరాను.' అని ప్రఫుల్ పటేల్ తెలిపారు. ఇదీ చదవండి: నోరు జారిన రాహుల్.. అదానీ కోసం పనిచేయాలని పార్టీ నేతకు సూచన -
మెదడుపై డెంగీ దాడి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని హైదరాబాద్లో ప్రజలు ఓవైపు సీజనల్ జ్వరాలతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుండగా మరోవైపు డెంగీ వ్యాధిలో తీవ్రమైన, అరుదైన రకానికి చెందిన డెంగీ ఎన్సెఫలైటిస్ వ్యాధి (రోగి మెదడును దెబ్బతీయడం ఈ వ్యాధికారక వైరస్ లక్షణం) బారినపడి ఏకంగా ఒక పీజీ వైద్య విద్యార్థి మృతి చెందడం కలకలం రేపుతోంది. నగరంలోని మల్లారెడ్డి హెల్త్ సిటీలో 3వ సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు చదువుతున్న డాక్టర్ గోపికి ఈ నెల 24న డెంగీ ఎన్సెఫలైటిస్ బారినపడ్డట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో అతన్ని జీడిమెట్లలోని మల్లారెడ్డి నారాయణ మల్టిస్పెషాలిటీ హాస్పిటల్లోని ఐసీయూకు తరలించి చికిత్స అందించారు. అయినప్పటికీ శనివారం పరిస్థితి విషమించడంతో డాక్టర్ గోపి మృతి చెందారు. వెయ్యి మందిలో ఒక్కరిలోనే... డెంగీ ఎన్సెఫలైటిస్ బారినపడ్డ రోగులు కోలుకొనే అవకాశాలు అత్యంత తక్కువని వైద్యులు అంటున్నారు. సాధారణ డెంగీ సోకిన ప్రతి 1,000 మంది రోగుల్లో కేవలం ఒక్కరిలోనే డెంగీ వైరస్ మెదడు దాకా విస్తరించే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ‘డెంగీ వైరస్తో బ్రెయిన్లోని ప్రధాన భాగాలు వాచిపోతాయి. దీంతో రోగులు బ్రతికే అవకాశాలు దాదాపుగా శూన్యం’అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (తెలంగాణ) సైంటిఫిక్ కమిటీ కన్వీనర్ డాక్టర్ కిరణ్ మాదల చెప్పారు. వైద్యుల్లో ఆందోళన..: నగరంలో సీజనల్గా ప్రభావం చూపే డెంగీ వ్యాధి ఈ ఏడాది ఆలస్యంగా ప్రతాపం చూపడం ప్రారంభించింది. ప్రస్తుతం నగరవ్యాప్తంగా దీంతోపాటు పలు రకాల ఫ్లూ జ్వరాలు, శ్వాసకోస వ్యాధులు నగరవాసుల్ని ఆసుపత్రుల బాట పట్టిస్తున్నాయి. దాదాపుగా ప్రతి ఆసుపత్రిలోనూ వైరల్ ఫీవర్ సంబంధిత కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఏకంగా ఒక వైద్య విద్యార్ధి సైతం డెంగీ ఎన్సెఫలైటిస్తో మృతి చెందడం నగరంలోని వైద్యుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇది తొలి కేసు కాదని, ఇప్పటికే కనీసం అరడజను మంది వైద్యులు డెంగీబారిన పడ్డారని వైద్య విద్యార్థులు అంటున్నారు. ‘మన ఆసుపత్రుల్లో ప్రత్యేక డెంగీ వార్డులు లేవు. అలాగే దోమ తెరలు సైతం ఉండవు. ఈ విషయంలో అనుసరించాల్సిన ప్రొటోకాల్ను ఆసుపత్రుల్లో పాటించడం లేదు’అని ఓ వైద్య విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని ఆసుపత్రుల్లో అపరిశుభ్ర పరి స్థితులు దోమల విజృంభణ, డెంగీ వ్యాప్తికి అను కూలంగా ఉన్నాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది. అటువంటి పరిస్థితుల్లో పనిచేసే వైద్య విద్యార్థులే డెంగీ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ ని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల్లో సైతం దోమల వ్యాప్తిని అరికట్టేందుకు తగిన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. -
డెంగ్యూ జ్వరాన్ని ఎలా గుర్తించాలి?లక్షణాలు ఏ విధంగా ఉంటాయి?
ఈ మధ్యకాలంలో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. ఎక్కడ చూసినా డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి జ్వరాలతో హాస్పిటల్స్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ముఖ్యంగా డెంగ్యూ కేసులు ఎక్కువగా చూస్తున్నాం. సరైన సమయంలో చికిత్స తీసుకుంటేనే ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చు. డెంగ్యూ జ్వరం ఉన్న వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. డెంగ్యూ దోమ కాటు వల్ల వస్తుంది. సాధారణంగా పగటిపూట కుట్టే దోమల వల్ల ఇది వస్తుంది. DEN -1 ,DEN-2 , DEN-3 , DEN-4 అనే నాలుగు రకాల వైరస్ల కారణంగా డెంగ్యూ జ్వరం వస్తుంది. దోమలు కుట్టిన 5-8 రోజుల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. డెంగ్యూ జ్వరం రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది సాధారణం కాగా, డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ (ప్రమాదకరమైనది). డెంగ్యూ వ్యాధి లక్షణాలు ఉన్నట్టుండి జ్వరం ఎక్కువగా రావడం తీవ్రమైన తలనొప్పి, కంటినొప్పి కండరాలు, కీళ్ళ నొప్పి వాంతులు అవుతున్నట్లు అనిపించడం డీహ్రైడ్రేషన్కు గురి కావడం పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరల్లోని హాస్పిటల్లో చూపించుకోవాలి. డెంగ్యూ వ్యాధికి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ అంటూ ఏదీ లేదు. కాబట్టి లక్షణాలు కనిపిస్తే సాధ్యమైనంత త్వరగా చికిత్స తీసుకోవాలి. వ్యాధి వ్యాపించే విధానం ఏడిస్ ఈజిప్టై అనే దోమకాటు వల్ల ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. పగలు కుట్టే దోమల వల్ల ఇతరులకు సంక్రమిస్తుంది. ఇంటి పరిసరాల్లో నీళ్లు ఎక్కువగా నిలిచిఉన్నా దోమలు వృద్ది చెందుతాయి. ఎయిర్ కూలర్స్, రిఫ్రిజిరేటర్లో గల డ్రిప్ ఫ్యాన్,పూలకుండీలు, టైర్లు, మూత పెట్టని నీరు నిల్వచేసే తొట్టిలు, కుండీలు, ఫౌంటెన్స్ ద్వారా దోమలు గుడ్లు పెట్టి తర్వాత ఇతరులకు వ్యాపిస్తుంది. డెంగ్యూ.. ఎలాంటి చికిత్స తీసుకోవాలి? మన రక్తంలో తెల్లకణాలు, ఎర్రకణాలతో పాటు ప్లేట్లెట్లు కూడా ఉంటాయి. ఇవి రక్తస్రావం జరగకుండా రక్తం గడ్డకట్టటంలో ప్రముఖపాత్ర పోషిస్తాయి. సాధారణంగా మన రక్తంలో ఈ ప్లేట్లెట్ కణాలు 1.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకూ ఉంటాయి. వీటి సంఖ్య బాగా పడిపోతే రక్తస్రావం కావటానికి దారితీస్తుంది. ♦ప్లేట్లెట్లు 40 వేల వరకూ ఉంటే సాధారణంగా రక్తస్రావం కాదు. ♦ 30 వేల వరకు ఉంటే కొద్దిగా రక్తస్రావం కావొచ్చు. ♦ 20 వేలకు పడిపోతే రక్తస్రావం ఎక్కువగా అవుతుంది. ♦ 10 వేలు మాత్రమే ఉంటే బ్లీడింగ్ విపరీతంగా అవుతుంది. కొన్నిసార్లు రక్తపరీక్షలో ప్లేట్లెట్ కణాల లెక్కింపులో తప్పులు రావొచ్చు. కాబట్టి బాగా తక్కువ సంఖ్యలో ఉన్నట్టు తేలితే మరోసారి పరీక్ష చేసి నిర్ధారించుకోవటం అవసరం. ♦ డాక్టర్లు సూచన మేరకు ట్రీట్మెంట్ తీసుకోవాలి. మంచి బలమైన, పౌష్టికాహారం తినాలి. డీహైడ్రేషన్కు గురి కాకుండా లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. డెంగ్యూకు ఆయుర్వేదంలో చికిత్స ఇలా.. ►వేప, కషాయ, వేపనూనె, కామంచి మొక్క, ఉమ్మెత్త మొక్క సారాన్ని జ్వరం, నొప్పులు తగ్గడానికి వాడతారు. తులసీ, పుదీనా, అల్లం, యాలకులు, దాల్చిన చెక్కలతో చేసిన కషాయాన్ని జ్వరం తగ్గడానికి వాడతారు. ► ఊద రంగులో ఉండే చిలకడదుంపల కషాయం డెంగ్యూని తగ్గించడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది. చిలకడదుంపల ఆకుల్లో డెంగ్యూని నివారించే యాంటీ ఆక్సిడైజింగ్ గుణాలు ఉన్నాయని పరిశోధకులు నిర్థారించారు. ఈ ఆకుల్లో ఉన్న సహజమైన ఫోలిఫినోలిక్ అందుకు కారణం అని తేల్చారు. ► బొప్పాయి ఆకుల రసం, బొప్పాయి కాయ, బొప్పాయి రసంతో డెంగ్యూ వ్యాధిని నివారించవచ్చు. దీనికోసం బొప్పాయి చెట్టు ఆకులు, కాండము లేకుండా మెత్తగా దంచి పసరు తీయాలి. తులసి నూనె: దోమలను తరిమికొట్టడానికి తులసి నూనె చాలా ప్రభావవంతమైనది. ఇది కీటక–వికర్షక సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీని వాసన దోమలను దూరంగా ఉంచుతుంది. లెమన్ గ్రాస్ ఆయిల్: దోమల నుంచి రక్షణ కోసం లెమన్ గ్రాస్ ఆయిల్ను చాలాకాలంగా ఉపయోగిస్తున్నారు. ఈ నూనెను రాసుకుంటే కొన్ని గంటలపాటు దోమల నుంచి రక్షణ లభిస్తుంది. లావెండర్ ఆయిల్: చర్మంపై లావెండర్ ఆయిల్ను రాసుకుని ఆరుబయట సంచరించినా, నిద్రపోయినా దోమలు కుట్టవు. పిప్పరమింట్ స్ప్రే: కొబ్బరి నూనెలో పిప్పరమెంటు బిళ్లను కలిపి స్ప్రే బాటిల్లో నింపాలి. పిప్పరమింట్ ఆయిల్ దోమలను తరిమికొట్టడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. యూకలిప్టస్ ఆయిల్: నిమ్మకాయ,యూకలిప్టస్ నూనెను సమాన పరిమాణంలో కలపాలి. అదే నూనెలో ఆలివ్, కొబ్బరి, అవకాడో నూనె వేసి స్ప్రే బాటిల్లో నింపాలి. ఈ మిశ్రమాన్ని శరీరంపై స్ప్రే చేసుకోవడం ద్వారా దోమల బెడద నుంచి రక్షించుకోవచ్చు. -నవీన్ నడిమింటి ప్రముఖ ఆయుర్వేద నిపుణులు (గమనిక: పైన పేర్కొన్న అంశాలు ఆయుర్వేదంపై అవగాహన కల్పించడానికే. డాక్టర్ల సలహాతోనే వాటిని పాటించాలి. ) -
CWC 2023: షాకింగ్ న్యూస్.. హాస్పిటల్లో అడ్మిట్ అయిన శుభ్మన్ గిల్..?
టీమిండియాకు షాకింగ్ న్యూస్. గత కొద్ది రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్.. ప్లేట్లెట్స్ స్వల్పంగా తగ్గిపోవడంతో చెన్నైలోని కావేరీ హాస్పిటల్లో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం గిల్ వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నట్లు తెలుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ కోసం టీమిండియా న్యూఢిల్లీకి బయల్దేరగా గిల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ చెన్నైలోనే ఉండిపోయాడు. ప్లేట్లెట్స్ కౌంట్ పెరిగాక అతను తిరిగి భారత శిబిరంలో జాయిన్ కానున్నట్లు సమాచారం. గిల్ పూర్తిగా కోలుకునేంత వరకు టీమిండియాతోనే ఉండాలని నిర్ణయించకున్నాడని, అతను విశ్రాంతి కోసం ఇంటికి వెళ్లేందుకు కూడా ఇష్టపడలేదని బీసీసీఐకి చెందిన కీలక వ్యక్తి ఒకరు తెలిపారు. గిల్.. అక్టోబర్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో జరిగే మ్యాచ్ సమయానికంతా పూర్తిగా కోలుకుంటాడని సదరు అధికారి ధీమాగా చెప్పాడు. కాగా, డెండ్యూ ఫీవర్ కారణంగా శుభ్మన్ గిల్ వరల్డ్కప్లో ఇప్పటికే ఆసీస్తో కీలక మ్యాచ్కు దూరమైన విషయం తెలిసిందే. తాజా పరిస్థితుల నేపథ్యంలో అతను రేపు (అక్టోబర్ 11) న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగే మ్యాచ్కు కూడా దూరమయ్యేలా ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ తర్వాత పాక్తో మ్యాచ్కు ముందు రెండు రోజులు గ్యాప్ ఉండటంతో గిల్ పూర్తిగా కోలుకుంటాడని భారత క్రికెట్ అభిమానులంతా ఆశిస్తున్నారు. ఇటీవలికాలంలో భీకర ఫామ్లో ఉన్న గిల్ లేకపోవడం టీమిండియాకు పెద్ద లోటే అయినప్పటికీ విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ లాంటి స్టార్లు ఆ లోటును పూడుస్తున్నారు. ఆసీస్తో జరిగిన మ్యాచ్లో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుపోయిన టీమిండియాను విరాట్, రాహులే గట్టెక్కించారు. ఒక వేళ ఈ మ్యాచ్లో గిల్ ఉండివుంటే పరిస్థితి వేరేలా ఉండేది. టీమిండియా స్వల్ప లక్ష్య ఛేదనకు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండేది కాదు. ఏదిఏమైనప్పటకీ గిల్ డెంగ్యూ నుంచి పూర్తిగా కోలుకుని త్వరలో బరిలోకి దిగాలని ఆశిద్దాం. ఇదిలా ఉంటే, ప్రపంచకప్-2023లో ఇవాళ (అక్టోబర్ 10) రెండు మ్యాచ్లు జరుగనున్న విషయం తెలిసిందే. ఉదయం 10:30 గంటల నుంచి ఇంగ్లండ్-బంగ్లాదేశ్లు ధర్మశాల వేదికగా తలపడనుండగా.. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మాధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో శ్రీలంక-పాకిస్తాన్ జట్లు పోటీపడతాయి. ‘సాక్షి’ తెలుగు న్యూస్ కోసం వాట్సాప్ చానల్ను ఫాలో అవ్వండి -
ఇదెక్కడి వింత.. దోమలను ఆసుపత్రికి తీసుకొచ్చిన వ్యక్తి, షాకైన వైద్యులు
పశ్చిమబెంగాల్లో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తనను కుట్టిన దోమలను బ్యాగ్లో నింపి వాటిని ఆసుపత్రికి తీసుకొచ్చాడు. ఈ విచిత్ర సంఘటన పుర్బా బర్దామన్ జిల్లాలో శుక్రవారం వెలుగుచూసింది. పశ్చిమ బెంగాల్లో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళకోట్లోని కుర్తుబా గ్రామానికి చెందిన మన్సూర్ అలీ షేక్.. తనను కుట్టిన దోమలను సేకరించి ఆసుపత్రికి తీసుకొచ్చాడు. డెంగీ కేసులతో ఆందోళన చెందిన మన్సూర్.. భయంతో తనను కుట్టిన 25, 30 దోమలను చంపి వాటన్నింటిని ఓ పాలిథిన్ బ్యాగ్లో వేసి ఆసుపత్రికి తీసుకొచ్చాడు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్ జుల్ఫికర్ అలీ మన్సూర్ను చూసి ఎమర్జెన్సీ కేసు అనుకున్నాడు. కానీ అతని బ్యాగులో దోమలను చూసి వైద్యుడితోపాటు ఆసుపత్రి సిబ్బంది ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. తన పరిస్థితిపై మన్సూర్ మాట్లాడుతూ.. ‘నా దుకాణం పక్కనలో నీళ్లు నిలిచిపోయి ఉన్నాయి. దీంతో ఆ చుట్టుపక్కల దోమల బెడద ఎక్కువగా ఉంది. దీంతో వాటి బారి నుంచి రక్షించుకునేందుకు నన్ను కుట్టిన దోమలను చంపి కవర్లో వేసి ఆసుపత్రికి తీసుకొచ్చాను. డాక్టర్లు ఆ దోమలను పరీక్షించి సరైన వైద్యం అందిస్తారని ఇలా చేశాను’ అంటూ పేర్కొన్నాడు. అలాగే తమ ప్రాంతంలోని డ్రెయిన్ను వెంటనే శుభ్రం చేయాలని కోరాడు. ఈ ఘటనపై మంగళకోట్ అధికారి సయ్యద్ బసీర్ స్పందిస్తూ.. తక్షణమే ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయిస్తామని తెలిపారు. ఈ విషయాన్ని బ్లాక్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఆ ప్రాంతంలో దోమల సమస్యను అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని, అలాగే నిలిచిపోయిన నీటి నివారణకు, దోమల నివారణ మందులను, బ్లీచింగ్ పౌడర్ను పంపిణీ చేస్తామని చెప్పారు. -
‘బంగ్లా’లో డెంగ్యూ విధ్వంసం.. వెయ్యి దాటిన మృతులు!
మన పొరుగు దేశం బంగ్లాదేశ్లో డెంగ్యూ విధ్వంసం సృష్టిస్తోంది. ఈ ఏడాది బంగ్లాదేశ్లో డెంగ్యూ బారిన పడి 1000 మందికి పైగా మరణించగా, రెండు లక్షల మందికి పైగా ప్రజలు ఈ వ్యాధి బారిన పడ్డారు. అల్ జజీరా నివేదిక తెలిపిన వివరాల ప్రకారం బంగ్లాదేశ్లో 2023లో డెంగ్యూ జ్వరం కారణంగా 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాదికంటే ఈ సంఖ్య దాదాపు నాలుగు రెట్లు ఎక్కువని ఆ నివేదిక పేర్కొంది. 2023 మొదటి తొమ్మిది నెలల్లో (జనవరి నుండి సెప్టెంబర్ వరకు) కనీసం 1,017 మంది మరణించారని నివేదిక పేర్కొంది. దాదాపు 2,09,000 మంది వ్యాధి బారిన పడ్డారు. వీరిలో 2000 మంది రోగులు రెండోసారి ఈ వ్యాధి బారిన పడ్డారు. మరణించిన వారిలో ఎక్కువ మంది 15 ఏళ్లలోపు వారే ఉండటం విశేషం. బంగ్లాదేశ్లోని పలు ఆసుపత్రులు డెంగ్యూ బాధితులతో నిండిపోయాయి. మరోవైపు బాధితులకు సరైన వైద్యం అందడం లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. జనసాంద్రత అధికంగా ఉన్నఈ దక్షిణాసియా దేశంలో డెంగ్యూ వేగంగా విస్తరిస్తోంది. డెంగ్యూ అనేది ఉష్ణమండల ప్రాంతాలలో కనిపించే వ్యాధి. అధిక జ్వరం, తలనొప్పి, వికారం, వాంతులు, కండరాల నొప్పి, రక్తస్రావం మొదలైనవి ఈ వ్యాధి లక్షణాలు. వాతావరణ మార్పుల వల్ల డెంగ్యూ, చికున్గున్యా, ఎల్లో ఫీవర్, జికా వంటి దోమల వల్ల వచ్చే వైరస్లు వేగంగా వ్యాప్తి చెందుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. డెంగ్యూ వ్యాధికి ప్రత్యేకంగా చికిత్స అందించే టీకా లేదా మందు ఇంతవరకూ అందుబాటులో లేదు. డెంగ్యూని వ్యాప్తి చేసే ఏడిస్ ఈజిప్టి దోమ నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో వృద్ధి చెందుతుంది. అందుకే మన ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. ఇది కూడా చదవండి: అమెజాన్లో వందల డాల్ఫిన్ల మృతదేహాలు ఎందుకు తేలుతున్నాయి? -
దడ పుట్టిస్తున్న డెంగీ
బనశంకరి: రాష్ట్రంలో అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలతో రోగకారకమైన ఈడీస్ దోమల ఉత్పత్తి పెరిగింది. దీంతో రాష్ట్రంలో డెంగీ, చికెన్గున్యా కేసులు హెచ్చుమీరుతున్నాయి. జ్వరాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. బాధితులతో ఆస్పత్రులు కిక్కిరిస్తున్నాయి. డెంగీ కేసుల సంఖ్య 10 వేలకు సమీపిస్తుండగా చికెన్గున్యా కేసులు వెయ్యికి దగ్గరలో ఉంది. ఇప్పటివరకు 68 వేల మందికిపైగా డెంగీ అనుమానితుల రక్త నమూనాలు సేకరించగా 9,559 మందిలో డెంగీ కేసులు వెలుగుచూశాయి. 22 వేల మందికి పైగా చికెన్గున్యా అనుమానితుల రక్త నమూనా సేకరించి పరీక్షించగా 982 మంది వ్యాధి బారినపడినట్లు తెలిసింది. డెంగీ లక్షణాలు విపరీతమైన జ్వరం, కంటి కిం నొప్పి, తీవ్రమైన తలనొప్పి, చేతులు కాళ్లు, కీళ్లు నొప్పులు, వాంతులు, తీవ్రమైన కడుపునొప్పి, నోరు, ముక్కులో రక్తస్రావం, చర్మంపై ఎరుపురంగులో గుల్లలు ఏర్పడటం, రక్తస్రావం గుర్తులు, ఎరువు రంగులో మలవిసర్జన, విపరీతమైన దాహం, స్పృహకోల్పోవడం, బీపీ పెరగడం. డెంగీ తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలు బెంగళూరు నగరంలో 5,511, మైసూరులో 454, ఉడుపిలో 429 డెంగీ కేసులు నమోదయ్యాయి. శివమొగ్గ 232, కలబురిగి 219, దక్షిణకన్నడ 210, విజయపుర 188, చిత్రదుర్గ 167, బెళగావి 154, దావణగెరె 152, హాసన 145, చిక్కమగళూరు 143, తుమకూరు 136, కొడగు 119, ధారవాడ 115, చామరాజనగర 113, మండ్య 108, కోలారులో 106 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఉచిత చికిత్స... ఎలాంటి జ్వరం బారినపడినప్పటికీ సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిస్థాయిలో చికిత్స లభిస్తుంది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితరక్తపరీక్షలు, చికిత్స పొందవచ్చు. ఆరోగ్యశాఖ సూచన కేంద్రమార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన ముందుజాగ్రత్తచర్యలు తీసుకోవడం, ప్రజల్లో డెంగీ, చికెన్గున్యా గురించి అవగాహన కల్పించాలని ఆరోగ్యశాఖఅధికారులకు సూచిస్తూ ఆరోగ్యశాఖ కమిషనర్ డీ.రందీప్ ఆదేశాలు జారీచేశారు. చికెన్గున్యా లక్షణాలు ఇది కూడా ఈడీస్ జాతీయ దోమ కాటుతో ఒకరినుంచి మరొకరికి ప్రభలుతుంది. దీనికి నిర్దిష్టమైన చికిత్స లేదు. కానీ ఇది మరణాంతకం కాదు. జ్వరం, కీళ్లలో తీవ్రమైన నొప్పులు, వాపు కనబడుతుంది. రోగలక్షణాలు కనబడిన తక్షణమే డాక్టర్లును సంప్రదించాలి. -
డెంగీతో విద్యార్థిని మృత్యువాత?
కర్ణాటక: టీబీ డ్యాం ప్రాంతంలో నివసిస్తున్న ఓ బాలిక డెంగీతో మృతి చెందిన ఘటన జరిగింది. నగరంలోని విజ్ఞాన్ ఈ టెక్నో పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని జాహ్నవి(13)కి డెంగీ జ్వరం సోకింది. జాహ్నవి టీబీ డ్యాం వంకాయ క్యాంపునకు చెందిన తిరుమలేష్ కుమార్తె. వైరల్ ఫీవర్తో బాధపడుతున్న విద్యార్థిని హొసపేటెలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. అనంతరం ఆమెను తల్లిదండ్రులు మెరుగైన వైద్యం కోసం ఈనెల 18న దావణగెరె బాపూజీ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ బాలిక ఆసుపత్రిలో బుధవారం మృతి చెందింది. జాహ్నవి మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. విజయనగర జిల్లాలో ఈ ఏడాది డెంగీతో మృతి చెందిన మొట్టమొదటి వ్యక్తి విద్యార్థిని జాహ్నవి. బాలిక మృతికి వైరల్ ఫీవరా లేక డెంగీ కారణమా అనే విషయంపై విజయనగర జిల్లా ఆరోగ్య శాఖ ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. -
ములుగు జిల్లాలో డెంగీతో నలుగురు మృతి
సాక్షి, హైదరాబాద్: ములుగు జిల్లాలో డెంగీతో నలుగురు మరణించారని ఆ జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. అయితే వారు గుండె జబ్బులు, ఊపి రితిత్తుల సమస్యలు, జాండిస్, సికిల్ సెల్ అనీమి యా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతు న్నట్టు వివరించారు. రాష్ట్రంలో కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పరిస్థితిపై గురువారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఉన్నతాధికారు లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రజా రోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, డీసీహెచ్లు, టీచింగ్ హాస్పిటళ్లు, జిల్లా దవాఖానల సూపరింటెండెంట్లు, ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా వైద్యాధికారులు డెంగీ మరణాలపై మంత్రి హరీశ్రావు దృష్టికి తీసుకొచ్చారు. వారం రోజుల్లోనే 10 మంది మరణించారంటూ కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి జిల్లాలో వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని వెల్లడించారు. జ్వరాల కోసం ప్రత్యేక ఓపీ కౌంటర్లు... రాష్ట్రంలో అవసరమైతే జ్వరాల కోసం ప్రత్యేక ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. పిల్లల జ్వరాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్న అంశాలను మంత్రి వివరించారు. డెంగీ కేసులు పెరుగుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, ఫీవర్ కేసులు ఆందోళనకర స్థాయిలో లేవని హరీశ్రావు స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఒక్క మరణం కూడా నమోదు కాలేదన్నారు. జ్వర బాధి తుల వివరాలను ఎప్పటికప్పుడు పోర్టల్లో నమో దు చేయాలని, ఆ డేటా ఆధారంగా డీఎంహెచ్ వోలు హైరిస్క్ ఏరియాలను గుర్తించి జాగ్రత్త చర్య లు చేపట్టాలన్నారు. జిల్లాల్లో 24 గంటల కాల్ సెంటర్ను ఏర్పాటు చేసి ప్రజలకు సమాచారం అందించాలని చెప్పారు. మీడియా సమావేశాలు నిర్వహించి సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. మలేరియా విభాగం అడిషనల్ డైరెక్టర్ను కొత్తగూడెం పంపి, అక్కడి పరిస్థితిని సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. -
గోదావరి పరీవాహక ప్రాంతంలో విజృంభిస్తున్న డెంగీ, విషజ్వరాలు
ఈ చిత్రంలో కనిపిస్తున్న ఊరి పేరు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని ప్రేమ్నగర్. ఈ గ్రామ జనాభా 300 మంది కాగా, వీరిలో 50 మందికిపైగా జ్వరాలతో బాధపడుతున్నారు. మూడు నెలల క్రితం ఇక్కడ 30 మంది జ్వరాల బారిన పడగా, గ్రామానికి చెందిన యువకుడు అవినాష్ రెండు రోజుల క్రితం చనిపోయాడు. ఇదే గ్రామంలో తీవ్ర జ్వరంబారిన పడిన ఒకే కుటుంబానికి చెందిన రాంసింగ్, ఓంసింగ్, శారన్భాయ్లను కుటుంబసభ్యులు బుధవారం మెరుగైన వైద్యానికి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇప్పుడా గ్రామం జ్వరాలతో విలవిల్లాడుతోంది. సాక్షిప్రతినిధి, వరంగల్: జూలై ,ఆగస్టు మాసాల్లో కురిసిన ఎడతెరపి లేని వర్షాలు గోదావరి పరీవాహక ఏజెన్సీ పల్లెలను కుదిపేశాయి. ఇప్పుడా ప్రాంతాలను విషజ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మొదలు భద్రాద్రి కొత్తగూడెం వరకు అనేక గ్రామాలు డెంగీ, మలేరియాల వలయంలో బిక్కుబిక్కుమంటున్నాయి. ఎంజీఎం ఆస్పత్రి పూర్వ వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పేషెంట్లతో కిటకిటలాడుతోంది. ఆయా జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులు జ్వరపీడితులతో నిండిపోతున్నాయి. ఇప్పటికే ఎనిమిదిమంది వృద్ధులు, మహిళలు, బాలురు మృత్యువాత పడగా, 15 నుంచి 25 రోజులైనా తగ్గని జ్వరాలతో జనం ఆందోళన చెందుతున్నారు. ఇంటింటా జ్వరపీడితులే... వర్షాలు, వరదలతో అతలాకుతలమైన జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలు.. ఇప్పుడు డెంగీ, మలేరియా, విషజ్వరాలతో విలవిలలాడుతున్నాయి. మహా ముత్తారం, గణపురం, తాడిచర్ల, రేగొండ, కాటారం, మొగుళ్లపల్లి పీహెచ్సీల్లో రోజుకు 150 నుంచి 250 మంది ఔట్పేòÙంట్లుగా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం, మంగపేట, వాజేడు, ఏటూరునాగారం మండలాల్లోని పల్లెలు మంచం పట్టాయి. జిల్లాలో గత జనవరి నుంచి 51 మలేరియా, 18 డెంగీ కేసులు నమోదయ్యాయి. పెద్దపల్లి జిల్లా మంథని, కమాన్పూర్, రామగిరి, ముత్తారం తదితర మండలాల్లోని 39 గ్రామాల్లో డెంగీ, విషజ్వరాలు జనాలను జడిపిస్తున్నాయి. ముత్తారం మండలంలో బేగంపేటకు చెందిన ఓ మహిళ మృతి చెందగా... డెంగీ బాధితుల సంఖ్య 89కి చేరినట్టు అధికారులు ప్రకటించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు, దంతాలపల్లి, మరిపెడ, కొత్తగూడ, గంగారం, కేసముద్రం, గార్ల తదితర మండలాల్లో డెంగీ, విషజ్వరాలు జడలు విప్పాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా, డెంగీ, విషజ్వరాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు మలేరియా 162, డెంగీ 273, విషజ్వరాలు 2,35,835 కేసులు నమోదయ్యాయి. ఈ ఫొటోలో ఉన్న బాబు పేరు వర్షిత్కుమార్. ములుగు జిల్లా మంగపేట. రెండు రోజులనుంచి ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంటున్నాడు. మలేరియా పాజిటివ్ వచి్చంది. రక్తం చాలా తక్కువ ఉందని వైద్యులు ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. తల్లి రమ్య పక్కనే ఉంటూ సపర్యలు చేస్తోంది. వారం రోజులుగా జ్వరం తగ్గడం లేదు మాది ములుగు జిల్లా మంగపేట మండలం రమణక్కపేట. నేను మూడు నెలల గర్భవతిని. వారం రోజుల నుంచి జ్వరం వస్తోంది. తగ్గకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చా. చాలా నీరసంగా ఉంటోంది. – సరిత, రమణక్కపేట, ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలు ఇద్దరు మహిళలు, డెంగీతో ఆరు నెలల పాప మృతి వాజేడు/కన్నాయిగూడెం: ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలు మరణ మృదంగం మోగిస్తున్నాయి. రెండు రోజుల్లోనే ఐదుగురు చనిపోయారు. బుధవారం ఇద్దరు చనిపోగా, గురువారం మరో ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో ఆరు నెలల పాప ఉండడం గమనార్హం. ములుగు జిల్లా వాజేడు మండలం మొట్లగూడెం గ్రామానికి చెందిన కుర్సం రజని (35), ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్లో నివాసి మనీష (30) విషజ్వరంతో మృతిచెందారు. వాజేడు మండల పరిధిలోని దేవాదుల గ్రామానికి చెందిన ఆరు నెలల పాప కూడా డెంగీ జ్వరంతో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. -
జ్వరం తగ్గడం లేదా? డెంగ్యూ ఉండొచ్చు జాగ్రత్త! ఈ లక్షణాలు..
వర్షాకాలం సీజన్ కావడంతో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఎక్కడ చూసినా డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి జ్వరాలతో హాస్పిటల్స్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ముఖ్యంగా డెంగ్యూ కేసులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. సాధారణ జ్వరంలాగే వచ్చే ఈ ఫీవర్ లక్షణాలు త్వరగా బయటపడవు. ఆరోగ్యంగానే కనిపిస్తారు. కానీ రోజులు గడిచే కొద్దీ వారిలో డెంగ్యూ లక్షణాలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటాయి. సరైన సమయంలో చికిత్స తీసుకుంటేనే ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చు. అసలు డెంగ్యూ ఎలా వస్తుంది? దాని లక్షణాలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. డెంగ్యూ ఎలా వస్తుంది? డెంగ్యూ దోమల వల్ల వస్తుంది. ఇది ఏడిస్ ఏజిప్టి అనే ఆడదోమల కారణంగా వ్యాపిస్తుంది.ఈ దోమలు చికెన్గున్యా, యెల్లో ఫీవర్, జికా వైరస్లకు సైతం వాహకాలుగా పనిచేస్తాయి. పగలు కుట్టే దోమలతోనే ఈ వ్యాధి సంక్రమిస్తుంది. దీనివల్ల రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపిస్తుంది. క్రమంగా వైరస్ తీవ్రత ఎక్కువై జ్వరం పెరుగుతుంది. దీంతో పాటు ఇతర లక్షణాలు కూడా మనకు కనిపిస్తాయి. తీవ్రత పెరిగే కొద్దీ ఫ్లూ లక్షణాలు బయటపడతాయి. డెంగ్యూ వైరస్లో నాలుగు సెరోటైప్స్ ఉన్నాయి. వీటిని DENV-1, DENV-2, DENV-3, DENV-4 అని పిలుస్తారు. మన దేశంలో DENV-2 కారణంగా కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ లక్షణాలు కనబడితే జాగ్రత్తపడండి.. వర్షాకాలం మొదలైన జూన్, జులై మాసంలో ప్రారంభమయ్యే విషజ్వరాల తాకిడి ఈ ఏడాది సెప్టెంబర్లోనూ కొనసాగుతుంది. డెంగ్యూ వచ్చిన వారిలో సహజంగానే 3 నుంచి 5 రోజుల వరకు ఆ లక్షణాలు కనిపించవు. మరికొందరిలో మాత్రం జ్వరం వచ్చిన వెంటనే లక్షణాలు కనిపిస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ► డెంగ్యూ వచ్చిన వారికి 104 ఫారెన్హీట్ డిగ్రీల జ్వరం ఉంటుంది. అలాగే తలనొప్పి, కండరాలు, ఎముకలు, కీళ్ల నొప్పులు ఉంటాయి. ► వికారం, వాంతులు మరో ప్రధాన లక్షణం. కళ్లు మండటం, వికారం, వాంతులు,తీవ్రమైన కడుపునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, విసుగు డెంగ్యూ జ్వరం లక్షణాలు. ► డెంగ్యూ జ్వరం ఉంటే శరీరంలో ప్లేట్లెట్స్ సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. డెంగ్యూ జ్వరానికి నిర్దిష్టమైన చికిత్స అంటూ లేదు. అందుకే ఈ లక్షణాలను బట్టి ఎప్పటికప్పుడు చికిత్స చేయించుకోవాలి. ప్లేట్లెట్స్ సంఖ్య 20 వేల కంటే పడిపోతే ప్రమాదకర స్థాయిలో ఉందని అర్ధం. ఈ పరిస్థితుల్లో తక్షణం ప్లేట్లెట్స్ ఎక్కించుకోవల్సి వస్తుంది. డెంగ్యూ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ప్రమాదం. డెంగ్యూ జ్వరాన్ని తగ్గించే ఆహారాలు డెంగ్యూ వచ్చిన జీర్ణమయ్యే ఆహారాన్నే తీసుకోవాలి. ముఖ్యంగా పండ్లరసాలు ఎక్కువగా తీసుకోవాలి. డెంగ్యూ జ్వరంతో బాధపడతున్నవారు బొప్పాయి పండ్లు లేదా ఆ మొక్క ఆకుల రసాన్ని స్వల్ప మొత్తంలో తీసుకోవడం వల్ల రక్తంలో ప్లేట్లెట్స్ పెరిగి త్వరగా కోలుకుంటారు. ఆరెంజ్ జ్యూస్ రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది.నారింజలో విటమిన్-సి సమృద్ధిగా లభిస్తుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడంలో సహాయపడుతుంది. డెంగ్యూ జ్వరాన్ని తగ్గించడంలో కొబ్బరి నీళ్లు ముఖ్యపాత్ర పోషిస్తుంది. డెంగ్యూ జ్వరం అటాక్ చేస్తే శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. అందుకే కొబ్బరినీళ్లను ఎక్కువగా తీసుకుంటే బాడీ హైడ్రేట్గా ఉంటుంది. ఇందులో ఖనిజాలు, ఎలక్ట్రోరోలైట్లు ఇందులో అధికంగా ఉంటాయి. ప్రతిరోజు ఓ కివి పండు తినడం వల్ల ప్లేట్లెట్స్ సంఖ్య పెరుగుతుంది. కివి జ్యూస్ తాగినా మంచి ఫలితం ఉంటుంది. పాలకూరలో విటమిన్-ఇ ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అలాగే పాలకూరలోని పోషకాలు డెంగ్యూ జ్వరాన్ని నివారించడంలో సహాయపడుతుంది. వీట్ గ్రాస్ డెంగ్యూ జ్వరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుంది. తద్వారా జ్వరం తగ్గుతుంది. -
14 ఏళ్లకు కలిగిన సంతానం..
మెదక్ మున్సిపాలిటీ: దేవుళ్లకు మొక్కులు మొక్కంగా 14 ఏళ్లకు ఆ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క మగబిడ్డపుట్టాడు. అల్లారుముద్దుగా పెంచుతున్నారు. డెంగీతో మృత్యువాతపడటంతో వారు కన్నీరుమున్నీరు అవుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ పట్టణంలోని వెంకట్రావు కాలనీకి చెందిన చింతకింది చిన్న శ్రీనివాస్గౌడ్, మాధవి దంపతులకు 14 ఏళ్లకు బాబు పుట్టాడు. పార్థసాయిగౌడ్ నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. శ్రీనివాస్ అన్నదమ్ములకు కూడా మగ సంతానం లేకపోవడంతో బాబును ఎంతో అప్యాయంగా చూసేవారు. అందరూ కలిసి బాబును కంటికి రెప్పలా కాపాడుకునేవారు. స్థానికంగా ఉన్న సిద్ధార్థ్ పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నాడు. వారం రోజులుగా జ్వరం వస్తుండటంతో బాలుడిని ఆస్పత్రులకు తీసుకెళ్లి చికిత్స చేయించారు. జ్వరం తగ్గక పోవడంతో వైద్య పరీక్షలు చేయగా డెంగీగా తేలింది. దీంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా ప్లెట్లెట్స్ తగ్గి బ్రెయిన్డెడ్ కావడంతో బుధవారం మృతి చెందాడు. -
డెంగీతో బీటెక్ విద్యార్థి మృతి
నిజామాబాద్నాగారం: డెంగీ కేసులు జి ల్లాలో క్రమంగా పెరుగుతున్నాయి. ఇందల్వాయి మండలం తిర్మన్పల్లికి చెందిన బీటెక్ విద్యార్థి భరత్ డెంగీతో బుధవారం మృతి చెందాడు. జ్వరం రావడంతో ఇంటివద్ద మందులు వాడినా తగ్గకపోవడంతో మూడు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని ఓ ప్రముఖ ప్రైవేట్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో చేరాడు. మంగళవారం విద్యార్థి పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు హైద్రాబాద్లోని నిమ్స్కు తలించగా చికిత్స పొదు తూ మృతి చెందాడు. జిల్లాలో డెంగీ జ్వరంతో నెలలో ఒకరిద్దరు మరణిస్తున్నారు. రెండు నెలల్లో 120 వరకు డెంగీ కేసులు నమో దు అయ్యాయి. ప్రైవేట్ ఆస్పత్రులకు నిత్యం పదుల సంఖ్యలో డెంగీ బాధితులు వస్తున్నా అధికారికంగా నమోదు కావడం లేదు. కాగా ప్రభుత్వ ఆస్పత్రిలో జూలై, ఆగష్టు నెలలో ఒక్కొక్కరి చొప్పున డెంగీతో మరణించినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. డెంగీతో భరత్ మృతి అధికారులకు సమాచారం లేదు. -
ప్రబలుతున్న జ్వరాలు.. ఆందోళనలో ప్రజలు..!
చింతలమానెపల్లి మండలం నందికొండ గ్రామానికి చెందిన భీంరావుకు జ్వరం రావడంతో కాగజ్నగర్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. కొద్దిగా కోలుకోవడంతో ఇంటికి వెళ్లాడు. మళ్లీ ఆరోగ్య పరిస్థితి విషమించి పదిరోజుల క్రితం ఇంటి వద్ద మృతి చెందాడు. భీంరావు మరణంతో భార్య, పిల్లలు పెద్దదిక్కును కోల్పోయారు. కుమరం భీం: పల్లెలు మంచం పడుతున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్, ఫ్లూజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఆసిఫాబాద్, కాగజ్నగర్ పట్టణాలతోపాటు గ్రామీణ మండలాల్లోని ప్రజలు జ్వరాలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. నాణ్య మైన వైద్యం అందక ఇటీవల పెంచికల్పేట్ మండలంలోని కొండెపల్లిలో ఓ మహిళ, చింతలమానెపల్లి మండలం నందికొండలో యువకుడు మృత్యువాత పడ్డారు. అయితే జిల్లావ్యాప్తంగా జ్వరాల వ్యాప్తిపై అధికారికంగా రికార్డులు లేవు. కేవలం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లోని పరీక్షలనే రికార్డులుగా అధికారులు చెబుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్న వారే అధికంగా ఉండటం గమనార్హం. జ్వరాల వ్యాప్తి గ్రామీణ మండలాల్లో విద్యుత్ సరఫరా అంతరా యంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ కారణంగా నే దోమలతో వ్యాప్తిచెందే మలేరియా, డెంగీ వి జృంభిస్తున్నాయి. కలుషితమైన వాతావరణం, ఆహారం కారణంగా టైఫాయిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. వాతావరణ మార్పులతో చిన్నారులపై ఫ్లూజ్వరం ప్రభావం చూపుతోంది. జలుబు, దగ్గు, స్వల్ప జ్వరంతో అస్వస్థతకు గురవుతున్నారు. టైఫాయిడ్ సోకిన వ్యక్తికి తీవ్రమైన జ్వరం, వాంతులు, విరోచనాలు ఉంటాయి. డెంగీ వ్యాధిగ్రస్తులకు జ్వరంతోపాటు ఒళ్లు నొప్పులు, కళ్ల వెనుక భాగంలో తలనొప్పి ఉంటుంది. వీపు భాగంలో ద ద్దుర్లు, మచ్చలను కూడా గమనించవచ్చు. మలేరియా బానిన వారిలో చలి జ్వరం ఎక్కువగా ఉంటుంది. పీహెచ్సీల్లో పరీక్షలు టైఫాయిడ్, మలేరియా, డెంగీ జ్వరాలకు బాధితుల నుంచి రక్త నమూనాలు సేకరించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాపిడ్ పరీక్షల ద్వారా మలేరియాను నిర్ధారిస్తున్నా.. టైఫాయిడ్, డెంగీ శాంపిళ్లను జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఫలితాలు రావడానికి ఒక రోజు సమయం పడుతోంది. దీంతో కొన్నిచోట్ల అనుమానిత లక్షణాల ఆధారంగానే చికిత్స అందిస్తున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. కట్టడి చర్యలేవి.? జ్వరాల కట్టడికి చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దోమల నివారణకు ఫాగింగ్ యంత్రాలు పంచాయితీ కార్యాలయాల్లో ఉన్నాయి. ప్రమాదాలు జరుగుతుండడంతో ఫాగింగ్ నిలిచిపోయింది. మరోవైపు పారిశుధ్యం అధ్వానంగా ఉండడం కూడా దోమలు ఉధృతికి కారణమవుతోంది. మిషన్ భగీరథ నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో కలుషిత నీరే ప్రజలకు దిక్కవుతోంది. నియంత్రణకు చర్యలు జ్వరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. తిర్యాణి వంటి ఏజన్సీ ప్రాంతాల్లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఎలిసా పరీక్ష ద్వారా డెంగీని కచ్చితంగా నిర్ధారిస్తున్నాం. ఈ ఫలితాలకు అనుగుణంగా చికిత్స అందిస్తున్నాం. – కృష్ణప్రసాద్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డెంగీతో ఒకరి మృతి పెంచికల్పేట్ మండలం అగర్గూడ గ్రామానికి చెందిన గోలేటి మారుతి(42) డెంగీతో ఆదివారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మారుతికి నాలుగు రోజుల క్రితం జ్వరం రావడంతో స్థానికంగా ఆర్ఎంపీ వద్ద చికిత్స తీసుకున్నాడు. జ్వరం తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం ఈస్గాంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మంచిర్యాలకు తీసుకెళ్లగా అక్కడ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడికి భార్య శారద, కుమార్తె ఉన్నారు. కాగా.. మారుతి తెలంగాణ సాంస్కృతిక సారథిలో కళాకారుడిగా 20 ఏళ్లుగా సేవలందిస్తున్నాడు. -
వానల వేళ వణుకు తెప్పించే వ్యాధి..తేలిగ్గా తీసుకుంటే అంతే సంగతి!
చాలారకాల వైరల్ జ్వరాల్లాగే డెంగీ కూడా తనంతట తానే తగ్గిపోయే (సెల్ఫ్ లిమిటింగ్) వ్యాధి. అయితే కొంతమందిలో మాత్రం ప్లేట్లెట్లు ప్రమాద స్థాయి కంటే కిందికి పడిపోతాయి. అది మినహా చాలావరకు డెంగీ నుంచి దాదాపుగా అందరూ కోలుకుంటారు. పైగా ఇది వైరల్ జ్వరం కావడంతో కేవలం లక్షణాలకు మాత్రమే చికిత్స చేస్తూ... ప్లేట్లెట్ కౌంట్ను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఇటీవల పెద్దసంఖ్యలో ఈ కేసులు వస్తున్న నేపథ్యంలో డెంగీపై అవగాహన కోసం ఈ కథనం. డెంగీలో రకాలు ఏ హెచ్చరికలూ లేకుండా వచ్చే డెంగీ (డెంగీ విదవుట్ వార్నింగ్ సైన్స్) ; కొన్ని హెచ్చరికలతో వచ్చే డెంగీ (డెంగీ విత్ వార్నింగ్ సైన్స్) ; తీవ్రమైన డెంగీ (సివియర్ డెంగీ) లక్షణాలు హెచ్చరికలు లేకుండా అకస్మాత్తుగా వచ్చే డెంగీ: డెంగీ ఎండెమిక్ ప్రాంతాల్లో... అంటే డెంగీ ఎక్కువగా వస్తున్న ప్రాంతంలో ఇది కనిపిస్తుంటుంది. వీళ్లలో జ్వరం, వికారం/వాంతులు, ఒళ్లు నొప్పులు, ఒంటి మీద ర్యాష్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని హెచ్చరికలతో కనిపించే డెంగీ: పైన చెప్పిన లక్షణాలతో పాటు పొట్టనొప్పి, ఊపిరితిత్తుల చూట్టూ ఉండే ప్లూరా అనే పొరలో లేదా పొట్టలో నీరు చేరడం. కొందరిలో పొట్ట లోపలి పొరల్లో రక్తస్రావం అవుతుండటం, బాధితులు అస్థిమితంగా ఉండటం, రక్తపరీక్ష చేయించినప్పుడు ఎర్ర రక్త కణాలకూ, మొత్తం రక్తం పరిమాణానికి ఉన్న నిష్పత్తి కౌంట్ పెరగడంతో పాటు ప్లేట్లెట్స్ సంఖ్య పడిపోతుంది. తీవ్రమైన డెంగీ (సివియర్ డెంగీ) కేసుల్లో : అంతర్గత అవయవాల్లో రక్తస్రావం కారణంగా బాధితుడు తీవ్రమైన షాక్కు గురవుతాడు. ఊపిరితిత్తుల్లో నీరు చేరి శ్వాసప్రక్రియకు అంతరాయం ఏర్పడుతుంది. తీవ్ర రక్తస్రావంతో బాధితుడు స్పృహకోల్పోవచ్చు లేదా పాక్షిక స్పృహలో ఉండవచ్చు. మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్తో కీలకమైన అవయవాలు పనిచేయకుండా పోవచ్చు. నిర్ధారణ పరీక్షలు : సీబీపీ ప్రతి 24 గంటలకు ఒకసారి చేయాలి. ∙నిర్ధారణ కోసం డెంగీ ఎన్ఎస్1 యాంటీజెన్ పరీక్ష అవసరం కావచ్చు. డెంగీ ఐజీఎమ్ అనే పరీక్ష కూడా చేయాలి. కొన్ని అడ్వాన్స్డ్ పరీక్షల్లో వ్యాధి నిర్ధారణ రిపోర్టులు వచ్చేందుకు పట్టే సమయం కూడా ఎక్కువే కాబట్టి డాక్టర్లు అవి వచ్చే వరకు ఆగకుండా... లక్షణాలను బట్టి చికిత్స అందించడం ప్రారంభిస్తారు. ∙పై పరీక్షలతో పాటు ఇప్పుడు ఐపీఎఫ్ (ఇమ్మెచ్యూర్ ప్లేట్లెట్ ఫ్రాక్షన్) అనే అత్యాధునిక పరీక్ష అందుబాటులో ఉంది. ఇది ప్లేట్లెట్లను ఎప్పుడు, ఎంత పరిమాణంలో ఎక్కించాలో తెలుసుకోవడంతో పాటు మరెన్నో అంశాలు తెలుసుకోడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. నివారణ ఇలా... అన్ని వ్యాధుల్లోలాగే డెంగీలోనూ చికిత్స కంటే నివారణ ఎంతో మేలు. డెంగీని కలిగించే టైగర్దోమ పగటిపూటే కుడుతుంది. దీని సంతానోత్పత్తి మంచి నీటిలోనే. ఈ ప్రక్రియకు పదిరోజుల వ్యవధి పడుతుంది. కాబట్టి వారంలోని ఏదో ఒకరోజు ఇంటిలోని నీటిని పూర్తిగా ఖాళీ చేసి డ్రై డే గా పాటిస్తే, దీని జీవితచక్రానికి విఘాతం కలిగి ప్రత్యుత్పత్తికి అంతరాయం ఏర్పడుతుంది. ఇళ్ల మూలలూ, చీకటి, చల్లటి ప్రదేశాలే టైగర్ దోమల ఆవాసం. ఇల్లంతా వెలుతురు, సూర్యరశ్మి ధారాళంగా వచ్చేలా చూసుకోవడంతో పాటు, దోమలు రాకుండా తలుపులకు, కిటికీలకు మెష్ అమర్చుకుంటే...ఒక్క డెంగీ దోమలే కాకుండా...మలేరియా, ఇతర వ్యాధులకు గురి చేసే దోమల్నీ నివారించినట్లు అవుతుంది. టైగర్ దోమ పెద్దగా ఎత్తుకు ఎగరలేదు. అందువల్ల కాళ్లు పూర్తిగా కప్పి ఉంచే దుస్తులతో, ఫుల్స్లీవ్తో చాలావరకు రక్షణ కలుగుతుంది. ∙నిల్వ నీటిలోనే దోమ గుడ్లు పెడ్తుంది కాబట్టి కొబ్బరి చిప్పలు, డ్రమ్ములు, బ్యారెల్స్, టైర్లు, కూలర్లు, పూలకుండీల కింద పెట్టే ప్లేట్లు మొదలైన వాటిల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. అలాగే వాడని డ్రమ్ముల్ని బోర్లించి ఉంచాలి. దోమలను తరిమివేసేందుకు మస్కిటో రిపలెంట్స్ వాడవచ్చు. డెంగీ వస్తే ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. కొందరిలో మినహాయించి అది అందరిలోనూ ప్రమాదకరం కాదు. కాకపోతే గర్భిణులు, చిన్నారులు, పెద్దవయసు వారికి డెంగీ సోకినప్పుడు అది తగ్గేవరకు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. చికిత్స: డెంగీ అన్నది వైరస్ కారణంగా వచ్చేది కాబట్టి దీనికి నిర్దిష్టంగా మందులేమీ ఉండవు. అందువల్ల లక్షణాలకు మాత్రమే చికిత్స (సింప్టమాటిక్ ట్రీట్మెంట్) ఇస్తారు. అంటే... అవసరమైనప్పుడు రక్తనాళం ద్వారా ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించడం, అవసరాన్ని బట్టి రక్తాన్ని, ప్లేట్లెట్స్ను, ప్లాస్మా ఎఫ్ఎఫ్పి (ఫ్రెష్ ఫ్రోజెన్ ప్లాస్మా) ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ప్లేట్లెట్స్ కౌంట్ 20 వేల నుంచి 15 వేలు లేదా అంతకంటే తక్కువకు పడిపోతేనే ప్లేట్లెట్స్ ఎక్కించాలి. (చదవండి: అదొక మిస్టీరియస్ వ్యాధి!..ఎలా వస్తుందో తెలియదు..గుర్తించినా.. చనిపోవడం ఖాయం) -
రాష్ట్రానికి డెంగీ ముప్పు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డెంగీ పంజా విసురుతోంది. రోజురోజుకూ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లో అంటే జూలై వరకు రాష్ట్రంలో 961 డెంగీ కేసులు నమోదు కాగా, ఆగస్టు నెలలో సరాసరి రోజుకు వంద మందికి పైగా డెంగీ బారిన పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు అంచనా వేశాయి. ఇక ఈనెల సెప్టెంబర్ మూడు నాలుగు వారాల్లో డెంగీ కేసులు ఇంకా ఎక్కువ సంఖ్యలో నమోదయ్యే అవకాశం ఉందనీ, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు డెంగీ కారక దోమ వృద్ధి చెందుతోందని చెబుతున్నారు. ప్రజలు పగటి పూట దోమ కుట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోకుంటే డెంగీ బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 28 ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెంగీపై సర్వైలెన్స్ డెంగీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో 28 ప్రభుత్వ ఆసుపత్రుల్లో సర్వైలెన్స్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆయా ఆసుపత్రుల్లో డెంగీపై ఎప్పటికప్పుడు నిఘా వేస్తారు. ఆసుపత్రుల పరిధిలోని ప్రాంతాల్లో రక్త నమూనాలు సేకరించి వాటిని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖకు పంపిస్తారు. దీనివల్ల దేశంలో ఎక్కడెక్కడ డెంగీ తీవ్రత ఉందో అంచనా వేస్తారు. ఆ మేరకు చర్యలు చేపడతారు. విధిగా ఐజీఎం పరీక్ష చేయించాలి డెంగీ నిర్ధారణలో వైద్య పరీక్షలే కీలకం. కేవలం ప్లేట్లెట్ కౌంట్, డెంగీ స్ట్రిప్ టెస్ట్, సీరమ్ టెస్ట్ వంటి వాటితో దీనిని నిర్థారించడం శాస్త్రీయం కాదని వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది. విధిగా అందుబాటులో ఉండే ఐజీఎం పరీక్ష చేయించాలని స్పష్టం చేస్తోంది. ప్లేట్లెట్లు 50 వేలలోపు పడిపోతే అది ప్రమాదకరంగా భావిస్తారు. 15 వేల కన్నా తగ్గితే కొన్నిసార్లు డెంగీ మరణాలు సంభవిస్తాయి. డెంగీ జ్వరం వస్తే తీవ్రతను తగ్గించేందుకు చల్లని నీటిలో స్పాంజీని ముంచి శరీరాన్ని తుడవాలి. ఎల్రక్టాల్ పౌడర్, పళ్లరసాలు రోగికి ఇవ్వాలి. దీనివల్ల జ్వర తీవ్రత తగ్గి ప్లేట్లెట్లు అదుపులోకి వస్తాయి. ఇంకా తగ్గకుంటే వైద్యుని వద్దకు తీసుకెళ్లాలని వైద్య ఆరోగ్యశాఖ సూచిస్తోంది. -
దోమలతో జాగ్రత్త.. డెంగీ, మలేరియాతో జనం ఇబ్బందులు
వాతావరణ మార్పులతో జిల్లాలో ఒక్కసారిగా విషజ్వరాలు ప్రబలుతున్నాయి. కురుస్తున్న వర్షాల కారణంగా జనం సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. డయేరియా, వైరల్ జ్వరాలు సోకుతున్నాయి. పల్లె, పట్టణాలనే తేడా లేకుండా పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. ఈ ప్రభావం ప్రజారోగ్యంపై పడింది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో పేరు నమోదుకు జనం బారులు తీరుతున్నారు. ఇందులో చాలా మంది దగ్గు, జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులతో వచ్చినవారే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పారిశుధ్య నిర్వహణ లోపం కారణంగా విషజ్వరాలు ప్రబలుతున్నాయి. ఈనెలలో కురిసిన వర్షాల కారణంగా ఒక్కసారిగా వైరల్ కేసులు పెరిగాయి. జిల్లా ఆసుపత్రితో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. చాలా మంది ఆస్పత్రులకు వెళ్లలేక మంచాన పడుతున్నారు. వైద్యారోగ్యశాఖ అప్రమత్తం సీజనల్ వ్యాధులు ప్రబలుతుండడంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. జిల్లాలో ఇంటింటి జ్వర సర్వే ప్రారంభించారు. విష జ్వరాలు, వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతీ శుక్రవారం డ్రై డే పాటించేలా చర్యలు చేపడతున్నారు. ముఖ్యంగా డయేరియా, వైరల్ ఫీవర్లతో ఆసుపత్రికి ఎక్కువ మంది రోగులు వస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని వైద్యులు సూచిస్తున్నారు. డ్రమ్ములు, పాత టైర్లు వంటి వాటిలో నీరు నిల్వ ఉంటే అందులో దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా ప్రబలి విష జ్వరాలు పెరిగే అవకాశం ఉంది. దుర్శేడ్లో ఒకరికి డెంగీ కరీంనగర్ మండలం దుర్శేడ్లో డెంగీ కేసు నమోదు కావడంతో అధికారులు సోమవారం నియంత్రణ చర్యలు చేపట్టారు. దుర్శేడ్కు చెందిన కాశిపాక అర్జున్ హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఫుడ్ డెలివరీ సంస్ధలో పనిచేస్తున్నాడు. రెండురోజులక్రితం జ్వ రం రావడంతో దుర్శేడ్కు వచ్చిన అర్జున్ ఆది వారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించుకోగా డెంగీగా వైద్యులు గుర్తించి చికిత్స అందిస్తున్నారు. ఎంపీడీవో జగన్మోహన్రెడ్డి, సర్పంచు గాజుల వెంకటమ్మ, ఉపసర్పంచు సుంకిశాల సంపత్రావు, వార్డుసభ్యుడు అశోక్, ఏఎన్ఎం పద్మ, ఆశావర్కర్లు అనిత, లక్ష్మి తదితరులు అర్జున్ ఇంటిని సందర్శించారు. కుటుంబసభ్యుల వివరాలు సేకరించారు. ఇంటి పరిసరాలను పంచాయతీ సిబ్బందితో శుభ్రం చేయించి బ్లీచింగ్ చల్లారు. అనంతరం చామనపల్లి పీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది సమీపంలోని నివాస గృహాల్లోని వ్యక్తులకు వైద్యపరీక్షలు చేశారు. అందుబాటులో వైద్యులు, మందులు వ్యాధులు ప్రబలుతుండడంతో జిల్లా ఆసుపత్రిలో మందులు, వైద్యులను ఎల్లవేళలా అందుబాటులో ఉంచుతున్నాం. పేషెంట్లు ఏ సమయంలో వచ్చినా చికిత్స అందించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కువగా వైరల్ ఫీవర్లు, డయేరియా బారిన పడుతున్నారు. చాలా మంది ఓపీ చూపించుకొని మందులు తీసుకెళ్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకొని చికిత్స అందిస్తున్నాం. – డాక్టర్ కృష్ణప్రసాద్, ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ -
విజృంభిస్తున్న డెంగ్యూ.. వచ్చే నెలలో మరింత వ్యాప్తి..
ఢిల్లీ: దేశ రాజధానిలో డెంగ్యూ విజృంభిస్తోంది. ఒక్క జులై నెలలోనే దాదాపు 121 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఎడతెరిపిన లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇటీవల వరదలు సంభవించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ వరదల కారణంగానే డెంగ్యూ వ్యాపిస్తోందని వైద్యులు తెలిపారు. ఆగష్టు నెలలో డెంగ్యూతో పాటు మలేరియా, చికన్ గున్యా వంటి ఇతర వ్యాధులు కూడా విజృంభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఆరంభం నుంచి జులై వరకు మొత్తం 243 డెంగ్యూ కేసులు నమోదైతే.. ఒక్క జులై నెలలోనే దాదాపు సగంపైనే కేసులు నమోదయ్యాయని వైద్యులు తెలిపారు. ఇటీవల నగరంలో 72 మలేరియా కేసులు కూడా వెలుగులోకి వచ్చాయి. జులై చివరి వారంలోనే 34 కేసులు వచ్చాయని అధికారులు తెలిపారు. జినోమ్ సీక్వెన్సింగ్కి 20 షాంపిల్స్ పంపించగా.. అందులో 19 కేసులు టైప్ 2 డెంగ్యూగా నమోదవుతున్నాయని వైద్యులు తెలిపారు. డెంగ్యూ జ్వరాలు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. 3 నుంచి 5 రోజుల వరకు జ్వరం తగ్గకపోవడం, శరీరంపై ఎర్రని చారలు, ప్లేట్లెట్స్ తగ్గడం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, వెన్ను నొప్పులు ఉంటాయని వైద్యులు సూచించారు. ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. రానున్న వర్షాకాలం కావునా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఇదీ చదవండి: విద్యార్థిని వాటర్ బాటిల్లో మూత్రం కలిపి.. ప్రభుత్వ బడిలో దారుణం.. -
ఢిల్లీలో డెంగ్యూ విజృంభణ.. సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం
వరుసగా కురుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడాలేకుండా వైరల్ జ్వరాలతోపాటు డెంగ్యూ జ్వరం భయపెడుతండటంతో ప్రజలు ఆందోలన చెందుతున్నారు. డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా లక్షణాలతో జ్వరాలు వస్తుండడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు నిండిపోతున్నాయి. ఢిల్లీని వణికిస్తున్న డెంగ్యూ దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఎన్సీర్ పరిధిలో ఇటీవల వచ్చిన వర్షాలు, వరదలతో ఢిల్లీలో డెంగ్యూ, మలేరియా కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది జూలై 22 వరకు ఢిల్లీలో మొత్తం 187 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. 2018 నుంచి పోలిస్తే ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే అత్యధికం. కేవలం జూలై మొదటి మూడు వారాల్లో డెంగ్యూ కేసులు దాదాపు 65 నమోదయ్యాయి. జూన్లో 40, మేలో 23 వెలుగు చూశాయి. వీటికి తోడు 61 మలేరియా కేసులు నమోదయ్యాయ్యాయి. సీఎం సమీక్ష ఈ నేపథ్యంలో ఢిల్లీలో డెంగ్యూ పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం సచివాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నగరాన్ని పట్టి పీడిస్తున్న డెంగ్యూ కేసులను ఎదుర్కోవడానికి సమగ్ర వ్యూహాన్ని రూపొందించాలని లక్ష్యంగా నిర్వహించిన ఈ సమావేశానికి ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్, మేయర్ షెల్లీ ఒబెరాయ్, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు. అధికారులకు కేజీవ్రాల్ ఆదేశాలు అనంతరం ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 20 డెంగ్యూ నమూనాలకు జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించగా.. వాటిలో 19 నమూనాలలో టైప్-2 తీవ్రమైన స్ట్రెయిన్ ఉన్నట్లు తేలినట్లు చెప్పారు. డెంగ్యూ రోగులకు ఆసుపత్రుల్లో పడకలు రిజర్వ్ చేయాలని, ఆసుపత్రులు ‘మొహల్లా’ క్లినిక్లలో తగినన్ని మందుల నిల్వ ఉండేలా చూడాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య శాఖను ఆదేశించినట్లు భరద్వాజ్ తెలిపారు. జరిమానా పెంపు ఇంటి చుట్టుపక్కలా ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి ఉండటం, పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాల్లో దోమలువృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందన్న ఆయన.. ఈ కారణంగానే దేశ రాజధానిలో పరిస్థితి తీవ్రతరంగా మారినట్లు తెలిపారు. ఈ క్రమంలో డెంగ్యూ వ్యాప్తిని నియంత్రించే చర్యల్లో భాగంగా దోమల ఉత్పత్తికి అవకాశమిచ్చే ఇళ్లకు రూ. 1000, వాణిజ్య సంస్థలకు రూ. 5000కు జరిమానాను పెంచుతున్నట్లు పేర్కొన్నారు. -
మానవాళికి డెంగీ ముప్పు!
సాక్షి, అమరావతి : ప్రపంచవ్యాప్తంగా మానవాళికి డెంగీ ముప్పు పొంచి ఉంది. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా దోమలు, వైరస్ల వ్యాప్తి పెరగడమే ఇందుకు కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ఇటీవల వెల్లడించింది. దశాబ్దకాలంగా డెంగీ, జికా, చికున్ గున్యా వంటి ఆర్బోవైరస్ల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు భారీగా పెరిగాయని ప్రకటించింది. ఏడాదికి 100 మిలియన్ల నుంచి 400 మిలియన్ల వరకు ఇన్ఫెక్షన్ కేసులు నమోదవుతున్నాయని ప్రకటించింది. ప్రస్తుతం జనాభాలో దాదాపు సగం మందికి డెంగీ సోకే ప్రమాదం ఉందని హెచ్చరించింది. డబ్ల్యూహెచ్వో వెల్లడించిన కొన్ని ముఖ్యమైన వివరాలు... ♦ అటవీ నిర్మూలన, పారిశుధ్యం, పట్టణీకరణ, నీటిపారుదలలో సమస్యలు దోమలవ్యాప్తికి ప్రధాన కారణం. ♦ ముఖ్యంగా అవపాతం(వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి ద్రవీకరించడం), ఉష్ణోగ్రత పెరుగుదల, అధిక తేమ వంటివి దోమల అవాసాలకు అనుకూలంగా ఉన్నాయి. ♦ ప్రపంచవ్యాప్తంగా 2000 సంవత్సరంలో డెంగీ కేసులు సుమారు 0.5 మిలియన్ నమోదవగా, 2019 నాటికి 5.2 మిలియన్లకు పెరిగాయి. 2023లోనూ ఇదే ఉధృతి కొనసాగుతోంది. ♦ ఈ ఏడాది దాదాపు 129 దేశాలు డెంగీ బారినపడే ప్రమాదం ఉంది. ఇప్పటికే 100కి పైగా దేశాల్లో డెంగీ వ్యాప్తి కనిపిస్తోంది. ♦ ఈ ఏడాది మార్చి చివరి వరకు ప్రపంచవ్యాప్తంగా 4,41,898 డెంగీ కేసులు నమోదవగా, 119 మంది మరణించారు. ♦ చికున్ గున్యా దాదాపు అన్ని ఖండాల్లో విస్తరించింది. ప్రస్తుతం సుమారు 115 దేశాల్లో దాని ప్రభావం ఉంది. -
కర్ణాటకలో జికా వైరస్ కలకలం.. ఐదేళ్ల చిన్నారికి పాజిటివ్
కర్ణాటకలో జికా వైరస్ కలకలం రేగింది. రాష్ట్రంలో తొలి కేసు నమోదైంది. రాయచూర్ జిల్లాలోని అయిదేళ్ల బాలికకు జికా వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి కే సుధాకర్ తెలిపారు. కొన్ని రోజులుగా చిన్నారి అనారోగ్యానికి గురైందని, డెంగ్యూ, చికెన్ గున్యా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో టెస్ట్లు చేయించినట్లు తెలిపారు. టెస్టుల్లో పాజిటివ్గా రావడంతో చిన్నారికి అన్ని జాగ్రత్త చర్యలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మంత్రి సుధాకర్ మాట్లాడుతూ.. పూణె నుంచి వచ్చిన ల్యాబ్ నివేదిక ద్వారా జికా వైరస్ నిర్ణారణ జరిగిందన్నారు. డిసెంబర్ 5న ముగ్గురి నామూనాలను ల్యాబ్కు పంపించగా ఇద్దరికి నెగిటీవ్ వచ్చిందని అయిదేళ్ల చిన్నారికి పాజిటివ్గా తేలిందని తెలిపారు. రాష్ట్రంలో ఇదే మొదటి కేసని వెల్లడించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో పరిస్థితిని ప్రభుత్వం చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తోందని పేర్కొన్నారు. ఏదైనా ఆసుపత్రుల్లో అనుమానాస్పద ఇన్ఫెక్షన్ కేసులు కనిపిస్తే జికా వైరస్ పరీక్షల కోసం నమూనాలను పంపాలని రాయచూర్ దాని పొరుగు జిల్లాల్లోని ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆరోగ్యశాఖ సిద్ధంగా ఉందని, అన్ని ముందస్తు నివారణ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కాగా కొన్ని నెలల కిత్రం జికా వైరస్ కేరళలో తొలిసారి వెలుగు చూసిన విషయం తెలిసిందే. తరువాత మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్లోనూ ఈ కేసులు నమోదయ్యాయి. చదవండి: అందుకే ‘హెల్మెట్’ పెట్టుకోమని చెప్పేది.. ఓసారి ఈ వీడియో చూడండి జికా వైరస్ ఏలా వ్యాప్తిస్తుంది జికా వైరస్ వ్యాధి ఎడెస్ అనే దోమ ద్వారా వ్యాపిస్తుంది. డెంగ్యూ, చికున్గున్యా వంటి ఇన్ఫెక్షన్లను కూడా ఇదే దోమే వ్యాపి చేస్తుంటుంది. ఈ వైరస్ను మొదటిసారిగా 1947లో ఉగాండాలో గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఎడెస్ దోమలు సాధారణంగా పగటిపూట కుడతాయి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో ఎక్కువ యాక్టివ్గా ఉంటాయి. అయితే ఈ వైరస్ పెద్దగా ప్రాణాంతకం కాదు. చికిత్సతో రికవరీ అవుతారు. కానీ గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా వారి కడుపులోని పిండానికి ఇది చాలా ప్రమాదకరం. మైక్రోసెఫాలీ (మెదడుపై ప్రభావం) లేదా పుట్టుకతో వచ్చే జికా సిండ్రోమ్ అని పిలువబడే ఇతర పరిస్థితులకు కారణమవుతుంది. -
Health: రాత్రి నానపెట్టి కిస్మిస్లను పరగడుపున తింటే! అందులోని లైపేజ్ వల్ల
డెంగ్యూ, టైఫాయిడ్, ఇతర వైరల్ ఫీవర్ల బారిన పడిన వారు నీరసం తగ్గి త్వరగా కోలుకునేందుకు పోషకాహార నిపుణులు సూచిస్తోన్న ఆహార చిట్కాలు. రాగులు రాగుల్లో క్యాల్షియం, పీచు పదార్థం అధికంగా ఉంటుంది. అందువల్ల రాగులతో చేసిన వంటకాలను అల్పాహారంగా తీసుకోవాలి. రాగులతో చేసిన దోశ తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగు పడడంతోపాటు, రాగుల్లో ఉన్న పాలీఫీనాల్స్ డయాబెటిక్ రోగుల్లో గ్లైసిమిక్ స్పందనలను తగ్గిస్తాయి. రాగుల్లో ఉన్న క్యాల్షియం, ఫాస్పరస్ ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రాగుల్లో అధికంగా ఉండే ఐరన్ జీవక్రియలను మెరుగు పరిచి ఎర్ర రక్తకణాలకు పోషకాలను అందిస్తుంది. అందువల్ల రాగి జావ, రాగి రొట్టెలు చాలా మంచిది. బెల్లం బెల్లంలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి, సి అధికంగా ఉంటాయి. నెయ్యిలో ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఏ, ఈ, డీ, కే, క్యాల్షియం అధికంగా ఉంటాయి. ఈ రెండింటిని కలిపి భోజనం తరువాత తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగు పడడమేగాక, ఎముకలు దృఢంగా తయారవుతాయి. బాదం, కిస్మిస్ బాదం పప్పులు, కిస్మిస్లను రాత్రి నానపెట్టుకుని ఉదయాన్నే పరగడుపున తినాలి. నానపెట్టిన కిస్మిస్లు శరీరంలో లైపేజ్ ఎంజైమ్ను విడుదల చేసి ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు తోడ్పడతాయి. కిచిడి అదే విధంగా రాత్రి డిన్నర్లో కిచిడి తినాలి. దీనిలో పదిరకాల ఎమినో యాసిడ్స్ ప్రోటీన్లు, పీచుపదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. దీనిలో కాస్త నెయ్యి వేసుకుని తింటే మరింత మంచిది. చదవండి: రాత్రిపూట పదే పదే మూత్ర విసర్జన: కెఫిన్, శీతల పానీయాలు.. ఇంకా వీటికి దూరంగా ఉండకపోతే -
ఒంటివాసనే దోమకాటుకు మూలం
న్యూయార్క్: దోమలు. మనందరికీ ఉమ్మడి శత్రువులు. మలేరియా, జైకా, డెంగీ ప్రాణాంతక జ్వరాలకు కారణం. ఇవి కొందరినే ఎక్కువగా కుట్టడానికి కారణం ఏమిటి? ఫలానా రక్తం గ్రూప్ ఉన్నవారిని, రక్తంలో చక్కెర స్థాయిలు బాగా ఉన్నవారిని, వెల్లుల్లి, అరటిపండ్లు ఎక్కువగా తినేవారిని, మహిళలను దోమలు అధికంగా కుడుతుంటాయని అనుకుంటుంటారు. కానీ, ఇవేవీ నిజం కాదని అమెరికాలోని రాక్ఫెల్లర్ వర్సిటీ పరిశోధకులు తేల్చిచెప్పారు. శరీరం నుంచి వెలువడే ఓ రకం వాసనే దోమలను ఆయస్కాంతంలా ఆకర్షిస్తుందని, అలాంటి వారినే అవి ఎక్కువగా కుడుతుంటాయని తేల్చారు. ఈ వాసనకు కారణం శరీరంలోని కొవ్వు అమ్లాలు (ఫ్యాటీ యాసిడ్స్). ఇవి దోమలను ఆకర్షించే వాసనను ఈ ఉత్పత్తి చేస్తాయట! అధ్యయనం వివరాలను ‘జర్నల్ సెల్’లో ప్రచురించారు. మస్కిటో మ్యాగ్నెట్ మారదు చర్మంలో కార్బోజైలిక్ యాసిడ్స్ స్థాయిలు అధికంగా ఉన్నవారి పట్ల దోమలు విపరీతంగా ఆకర్షణకు గురవుతాయని అమెరికాలోని ‘రాక్ఫెల్లర్స్ ల్యాబొరేటరీ ఆఫ్ న్యూరోలింగ్విస్ట్ అండ్ బిహేవియర్’ ప్రతినిధి లెస్లీ వూషెల్ చెప్పారు. చర్మంలో భారీగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటే దోమల ముప్పు అధికమేనని వివరించారు. జైకా, డెంగ్యూ, ఎల్లో ఫీవర్, చికున్గున్యా వంటి జ్వరాలకు కారణమయ్యే ‘ఎడిస్ ఈజిప్టి’ దోమలపై మూడేళ్లు అధ్యయనం చేశారు. చర్మంలో ఫ్యాటీ యాసిడ్స్ స్థాయిలు బాగా ఉన్నవారే ఎక్కువగా దోమకాటుకు గురవుతున్నట్లు గుర్తించారు. ఆ అమ్లాల నుంచి ఉత్పత్తయ్యే గ్రీజులాంటి కార్బోజైలిక్ యాసిడ్స్ చర్మంపై కలిసి పొరలాగా పేరుకుంటాయి. వాటి నుంచి వచ్చే ఒక రకమైన వాసన దోమలను ఆకట్టుకుంటుందట!. -
డెంగీ విజృంభణ.. ఆ జిల్లాలో రోజుకు 28 కేసులు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అధిక వర్షాలు.. వాతావరణ మార్పులు.. పెరుగుతున్న దోమలతో డెంగీ పంజా విసురుతోంది. ఉమ్మడి జిల్లాలో డెంగీ కేసులు అధికమవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగీ, టైఫాయిడ్, మలేరియా లాంటి ప్రమాదకర జ్వరాలు వ్యాపిస్తుండడంతో పల్లెలన్నీ మంచం పడుతున్నాయి. ప్రతీఇంట్లో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పవచ్చు. రెండు నెలలుగా జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఫలితంగా పీహెచ్సీలతో పాటు జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రులలో ఓపీ, ఐపీ కోసం రోగులు బారులు తీరుతున్నారు. ఆగస్టు, సప్టెంబర్లో విజృంభణ వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా అనారోగ్య వాతావరణం నెలకొంది. ఈ వాతావరణమే వైరల్ ఫీవర్ల వ్యాప్తికి కారకంగా మారుతోంది. గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుధ్య లోపం కారణంగానే దోమలు వృద్ధి చెందుతున్నాయి. దీంతో జ్వరాల ప్రభావం పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ విపరీతంగా పెరిగిపోయింది. ఆగస్టు, సెపె్టంబర్ నెలల్లోనే డెంగీ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆగస్టులో 181 కేసులు, సెపె్టంబర్ (15 నాటికి)లో ఇప్పటి వరకే 422 కేసులు నమోదుతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఆసుపత్రులు కిటకిట సీజనల్ వ్యాధుల కారణంగా ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఇటీవల అనధికారికంగా పదుల సంఖ్యలో డెంగీ మరణాలు నమోదు కావడంతో జ్వరం అంటేనే ప్రజలు వణికిపోతున్నారు. జ్వరం వస్తే చాలు ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా రోగులు వైద్యం కోసం ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ ప్రతి రోజు 2 వేలకుపైగా నమోదవుతుండగా, ఇన్పేషెంట్లకు సరిౖయెన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో జ్వరాల బారినపడిన పిల్లల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్లేట్లెట్స్ పేరుతో దోపిడీ డెంగీ ప్రయివేటు ఆసుపత్రులకు కాసుల వర్షం కురిపిస్తుంది. కరోనా తర్వాత అంతటి సంపాదన తెచ్చే అస్త్రమైంది. డెంగీ జ్వరం వచ్చిందంటే ప్లేట్లెట్స్ తగ్గడం సర్వసాధారణం. ప్లేట్లెట్స్ సాకుగా చూపుతూ ప్రయివేటు ఆసుపత్రులు పేషెంట్లను వారి బం«ధువులను భయాందోళనకు గురిచేసి సొమ్ము చేసుకుంటున్నారు. అవసరం ఉన్నా లేకుండా ప్లేట్లెట్స్ పరీక్ష చేయడం, ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్నాయంటూ తప్పుడు రిపోర్టులు ఇస్తూ పేషెంట్ను ఆసుపత్రికి పరిమితం చేస్తున్నారు. ఇక ఆంటిబయోటిక్స్, సెలాయిన్స్ పెట్టుకుంటూ రోజుల తరబడి ఆసుపత్రిలోనే ఉంచుతున్నారు. అవకాశం వచి్చందే తడవుగా సీజనల్ వ్యాధులను సొమ్ము చేసుకుంటున్నాయి. డెంగీకి మెరుగైన వైద్యసేవలు అందించాలని అందుకు ఖర్చు రూ.వేలల్లో ఉంటుందని ఆసుపత్రి నిర్వాహకులు చెబుతుండడంతో ప్రాణాలను కాపాడుకునేందుకు డబ్బులకు వెనుకాడకుండా పేదలు జేబులను గుల్ల చేసుకుంటున్నారు. రోజుకు 28 కేసులు ఉమ్మడి జిల్లాలో డెంగీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంలో రోజుకు ఒకటి లేదా రెండుకు మించి కేసులు నమోదు కాలేదు. తాజాగా సెప్టెంబరులో డెంగీ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఒక్కసారిగా రోజుకు 28 కేసులు చొప్పున నమోదవడం పరిస్థితికి అద్ధం పడుతోంది. దోమల సంఖ్య పెరగడమే ఈ వైరల్, డెంగీ, మలేరియా జ్వరాలకు కారణమని వైద్యులు స్పష్టంచేస్తున్నారు. గతంతోపోలిస్తే ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కాలువలు, చెరువులు, కుంటలు నిండాయి. ఈ కారణం వల్ల కూడా దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరీంనగర్ విషయానికి వస్తే.. చుట్టూ హారంలా జలాశయాలు, కాలువలు ఉండటంతో దోమల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. ఇదీ చదవండి: వారం వారం.. ప్రగతి లక్ష్యం.. కొత్త విధానానికి శ్రీకారం -
10 నెలల చిన్నారికి అరుదైన వ్యాధి.. సాయం చేసి ఆదుకోరూ..
పైన ఫోటోలో కనిపిస్తున్న పాప పేరు హన్విక. ఆమె వయసు కేవలం 10 నెలలు. ఇంత చిన్న వయసులోనే పాప అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ప్రస్తుతం ఈ చిన్నారి డెంగ్యూ షాక్ సిండ్రోమ్, మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్తో పోరాడుతోంది. పసిపాప పరిస్థితి అత్యంత దీనస్థితికి చేరుకుంది. ఆ పాప తల్లిదండ్రులు దీప్తి, రవి కిరణ్ హైదరాబాద్లో నివసిస్తున్నారు. కూతురు వైద్యం కోసం ఇప్పటికే చాలా డబ్బులు ఖర్చు చేశారు. అయినా పాప ఆరోగ్యం కుదుట పడకపోవడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. తమ కూతురు తీవ్రమైన ఇన్ఫనైట్ డెంగ్యూ, హైపర్ ఫెరిటినిమా, ట్రాన్స్మినిట్స్, కోగులోపతితో బాధపడుతోందని, దాతలు తోచిన సాయం చేసి, ఆదుకోవాలని ఆమె తండ్రి రవి కిరణ్ అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతం తనకు ఎలాంటి ఉద్యోగం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాప పేరు: ఆర్ హన్విక తండ్రి పేరు: రవి కిరణ్ తల్లి: దీప్తి గూగుల్ పే నంబర్: 8019872446 బ్యాంక్ అకౌంట్ వివరాలు అకౌంట్ నంబర్: 403901502892 బ్యాంక్ - ఐసీఐసీఐ, సేవింగ్స్ ఖాతా ఖాతాదారుని పేరు: ముసిలమ్మోళ్ల దీప్తి సాయి ఐఎఫ్ఎస్ఈ కోడ్: ICIC0000008 -
డెంగ్యూతో ఉక్కిరిబిక్కిరి, అయినా సెట్స్కు వచ్చిన కంగనా
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ డెంగ్యూబారిన పడింది. అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్నప్పటికీ ఆమె సెట్స్లో అడుగుపెట్టడం విశేషం. ఇప్పటివరకు హీరోయిన్గా అలరించిన ఆమె ఎమర్జెన్సీ మూవీతో దర్శకురాలిగా అవతారం ఎత్తిన విషయం తెలిసిందే కదా! ఈ సినిమా మీద ఫుల్ ఫోకస్ పెట్టిన ఆమె ఇటీవల అస్వస్థతకు లోనైంది. పరీక్షలు చేయించుకోగా సోమవారం నాడు ఆమెకు డెంగ్యూ ఉన్నట్లు తేలింది. అయితే ఆరోగ్యం సహకరించకపోయినా తను సినిమా పనుల్లో నిమగ్నమైంది. ఈమేరకు కొన్ని ఫొటోలను ఆమె సొంత నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిలింస్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. 'డెంగ్యూ వచ్చి తెల్ల రక్తకణాలు తగ్గిపోయి, జ్వరంతో ఒళ్లంతా కాలిపోతున్నా మీరు మాత్రం పని చేయడం ఆపడంలేదు. దీన్ని ప్యాషన్ కాదు పిచ్చి అంటారు. కంగనా రనౌత్ నిజంగా అందరికీ స్ఫూర్తిదాయకం' అని రాసుకొచ్చింది. దీనిపై సదరు కథానాయిక స్పందిస్తూ.. 'థ్యాంక్ యూ టీమ్.. అయినా బాడీకి జబ్బు వచ్చింది కానీ నా ఆశయానికి కాదు' అని రిప్లై ఇచ్చింది. కాగా కంగనా ఎమర్జెన్సీ మూవీలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీగా నటించనుంది. హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ డేవిడ్ మలినోస్కి ఈ సినిమాకు పని చేస్తున్నాడు. చదవండి: మీనాను పరామర్శించిన అలనాటి హీరోయిన్లు, ఫొటో వైరల్ సోనమ్.. నీ ఫ్రెండ్స్ ఎంతమందితో అతడు బెడ్ షేర్ చేసుకున్నాడు? -
సీజన్ వచ్చేసింది.. వణికించే వ్యాధుల జాబితా! లక్షణాలు, ముందు జాగ్రత్తలు
తొలకరి మొదలైంది.. రోజూ వర్షాలు కురుస్తుండడంతో వీధుల్లో నీరు నిల్వ చేరుతోంది. దోమలు వ్యాప్తి చెందుతుండడంతో సీజనల్ వ్యాధుల విజృంభణ ప్రారంభమైంది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచిస్తున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వెల్లడిస్తున్నారు. జ్వరం.. జలుబు వచ్చిన వెంటనే చికిత్స పొందాలని కోరుతున్నారు. ప్రాణాంతకం కాకముందే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తున్నారు. చిత్తూరు రూరల్ : వర్షాకాలంలో ప్రజలు అధికంగా సీజనల్ వ్యాధుల బారిన పడుతుంటారు. వాతావరణ మార్పులతో తరచుగా జ్వరం, జలుబుతో బాధపడుతుంటారు. రోగాల వ్యాప్తికి ప్రధానంగా దోమలే కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇళ్ల వద్ద, వీధుల్లో నీరు నిల్వ చేరడంతో దోమలు విపరీతంగా పెరిగి వ్యాధుల వ్యాప్తికి కారకాలుగా మారుతున్నాయని వివరిస్తున్నారు. వైరల్ జ్వరాలను ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. ► తేలికపాటి జ్వరం.. జలుబు: సీజన్ మార్పుతో పెరిగే సూక్ష్మక్రిముల వల్ల వైరల్ జ్వరాలు వ్యాప్తి చెందుతాయి. ఇవి గాలి, నీటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి . ఈ వైరల్ ఫీవర్ 3 నుంచి 7 రోజుల వరకు ఉంటుంది. జాగ్రత్తలు: భోజనం చేసే ముందు తప్పనిసరిగా చేతులు శుభ్ర పరుచుకోవాలి. నిల్వ పదార్థాలు తినకూడదుౖ తాజా పండ్లు తీసుకోవాలి . వర్షంలో తడవకూడదు . తడిచిన బట్టలలో ఎక్కువ సేపు ఉండ కూడదు. మాస్క్ తప్పనసరిగా ధరించాలి. ► చికెన్ గున్యా: దోమ కాటు వల్ల చికెన్ గున్యా వస్తుంది. తీవ్రమైన జ్వరం , కీళ్ల నొప్పులు చికెన్ గున్యా లక్ష ణాలు , ఇది సోకితే మొదటి రెండు , మూడు రోజులు జ్వరం ఎక్కువగా ఉంటుంది . జాగ్రత్తలు: ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి . కూలర్లు, టైర్లు మొదలైన వాటిలో నీరు నిల్వ చేరకుండా చూసుకోవాలి. శరీరం మొత్తం కప్పేలా దుస్తులు ధరించాలి . ► మలేరియా: తీవ్రమైన తలనొప్పి, వణుకుతో కూడిన అధిక జ్వరం మలేరియా లక్షణాలు . జ్వరం తగ్గి మళ్లీ వస్తుంది . ఆడ దోమ కాటుతో మలేరియా జిరమ్స్ శరీరంలో లోపలికి వెళ్తాయి . 14 రోజుల తర్వాత అధిక జ్వరం వస్తుంది . ఈ దోమలు నిల్వ ఉన్న వర్షపు నీటిలో వృద్ధి చెందుతాయి. జాగ్రత్తలు: దోమతెరలు వినియోగించాలి. ఇంటి చుట్టూ నీరు నిల్వ చేరకుండా చూసుకోవాలి. ఒకవేళ నీరు నిల్వ చేరితే అందులో కిరోసిన్ గాని పురుగు మందుగాని పిచికారీ చేయించాలి. ► డెంగీ: వైరల్ జ్వరం మాదిరి అకస్మాత్తుగా జ్వరం వస్తుంది. తీవ్రమైన ఒళ్లు నొప్పులు వస్తాయి. ఎముకలు విరిగిపోతున్నంత బాధ కలుగుతుంది . ఒక్కోసారి శరీర అంతర్భాగాల్లో రక్తస్రావం జరుగుతుంది. పొట్ట, కాళ్లు , చేతులు , ముఖం , వీపు భాగాల చర్మంపై ఎరగ్రా కందినట్టు చిన్నచిన్న గుల్లలు కనిపిస్తాయి . ఒక్కోసారి ప్లేట్లెట్స్ తగ్గిపోయి రోగి పరిస్థితి విషమంగా మారుతుంది . ఈడిస్ ఈజిప్టు అనే దోమ కాటుతో డెంగీ వ్యాప్తి చెందుతుంది. ఇళ్లలోని కుండీలు , ఓవర్ హెడ్ ట్యాంక్లు , ఎయిర్ కూలర్లు , పరిసరాల్లో నిర్లక్ష్యంగా పడేసిన కొబ్బరి బొండాలు , ప్లాస్టిక్ కప్పులు , పగిలిన సీసాలు , టైర్లు వంటి వాటిల్లో చేరిన వర్షపు నీటిలో గుడ్లు పెట్టి ఈడిస్ దోమలు వృద్ధి చెందుతాయి. జాగ్రత్తలు: ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి . చెత్తాచెదారం సమీపంలో ఉండకూడదు. ఇంట్లో దోమల మందు చల్లించుకోవాలి . దోమ తెరలు వాడడం శ్రేయస్కరం . వారంలో ఒక రోజు డ్రైడే పాటించాలి . ఇంటి పరిసరాల్లో కొబ్బరి బొండాలు , పాత టైర్లు , ఖాళీ డబ్బాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి . ఎయిర్ కూలర్లు , ఎయిర్ కండిషన్లు , పూలకుండీల్లో నీటిని తరచూ మార్చాలి. నీళ్ల ట్యాంకులపై సరైన మూతలను అమర్చాలి. శరీరమంతా కప్పి ఉంచుకునేలా దుస్తులు వేసుకోవాలి. ► హెపటైటిస్–ఏ: వర్షాకాలంలో హెపటైటిస్– ఎ ( కామెర్లు) వ్యాధి వచ్చే అవకాశం ఉంది . ఇది కాలేయ కణాలలో సంక్రమణ వల్ల కలుగుతుంది. కలుషితమైన ఆహార పదార్థాల నుంచి , తాగునీటి నుంచి రోగ కారకక్రిములు శరీరంలోకి ప్రవేశిస్తాయి . కాలేయ వ్యాధి కారణం గా రక్తంలో బిలిరుబిన్ పరిమాణం పెరుగుతుంది. దీంతో శరీర భాగాలు పసుపు రంగులోకి మారిపోతాయి. జాగ్రత్తలు: శుభ్రమైన ఆహారం తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీటినే తాగాలి. బయట ఆహారం తినకూడదు. వ్యక్తిగత మరుగుదొడ్లు వినియోగించాలి. ► టైఫాయిడ్: వర్షాకాలంలో టైఫాయిడ్ కేసులు పెరిగే అవకాశం ఉంది . ఇది సాల్మొనెల్లా టైఫీ బ్యాక్టీరియా వల్ల వస్తుంది . కలుషిత నీరు తాగడం, ఆహారం తినడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. జాగ్రత్తలు: కాచి చల్లార్చిన నీటిని తాగాలి. బయట ఆహారం తినకూడదు. రోజూ కనీసం 3 నుంచి 4 లీటర్ల నీటిని సేవించాలి. ముఖ్యంగా పండ్ల రసం, కొబ్బరి నీరు, సూప్ వంటివి తీసుకోవడం మంచిది. అప్రమత్తత తప్పనిసరి వర్షాల కారణంగా ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి. తగు జాగ్రత్తలు తీసుకుంటే రోగాలు రాకుండా రక్షణ పొందవచ్చు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలి. ఏమాత్ర జ్వరం, జలుబు వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదు. వర్షంలో తడవకుండా చూసుకోవాలి. – శ్రీనివాసులు, డీఎంఓ -
జలుబు లాగే కరోనా
సాక్షి, హైదరాబాద్: ‘కరోనా కథ ముగిసింది. అది ఎండమిక్ (వైరస్ వ్యాప్తి తీవ్రత తగ్గడం) దశకు చేరుకుంది. ఇక నుంచి అది కేవలం సాధారణ జ్వరం, జలుబు మాదిరిగానే ఉండనుంది. ఒక సీజనల్ వ్యాధిగా మారిపోయింది. దాని గురించి పట్టించుకోవాల్సిన పనిలేదు. అయితే వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి’ అని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. ఇది వ్యాక్సిన్ ద్వారానే సాధ్యమైందని, కాబట్టి టీకా తప్పకుండా వేసుకోవాలని సూచించారు. ఒకవేళ కరోనా కొత్త వేరియంట్ వస్తే మాత్రం ఎలా ఉంటుందో చూడాలని చెప్పారు. శ్రీనివాసరావు మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు వేలకు పైగా క్రియాశీలక కేసులుంటే, అందులో 50 మంది వరకు మాత్రమే ఆసుపత్రుల్లో ఉన్నారన్నారు. మరణాలు సున్నా స్థాయికి చేరుకున్నాయని తెలిపారు. కరోనా, టీబీ సహా జలుబు, జ్వరం, డెంగీ తదితర సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కోసం మాస్క్ ధరించాలని సూచించారు. లక్షణాలున్నవారు ఐదు రోజులు ఐసోలేషన్లో ఉండాలని, తర్వాత ఎవరి పనులు వారు చేసుకోవచ్చని, కాంటాక్ట్ ట్రేసింగ్ అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పష్టం చేసిందన్నారు. వర్షాలు తగ్గాక వ్యాధులు విజృంభిస్తాయి రాష్ట్రంలో బ్యాక్టీరియా, వైరస్ల ప్రభావం పెరగడంతో సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయని శ్రీనివాసరావు అన్నారు. ‘వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు తగ్గిన తర్వాత వ్యాధులు విజృంభిస్తాయి. ఇప్పటికే డెంగీ కేసులు భారీగా నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 1,184 డెంగీ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్లో 516, కరీంనగర్లో 84, ఖమ్మంలో 82, మహబూబ్నగర్లో 54, మేడ్చల్లో 55, పెద్దపల్లిలో 40, సంగారెడ్డిలో 97 చొప్పున దాదాపు అన్ని జిల్లాల్లో డెంగీ వ్యాప్తి చెందుతోంది. ఒక్క జూన్లోనే 565 డెంగీ కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తోంది. అంతేగాక జూలైలో తొలి పది రోజుల్లోనే 222 కేసులొచ్చాయి. 2019 తర్వాత మళ్లీ 2022లో డెంగీ కేసుల్లో పెరుగుదల ఉంది. దీంతోపాటు జనవరి నుంచి ఇప్పటివరకు 203 మలేరియా కేసులూ తేలాయి’ అని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే యాంటీ లార్వా ఆపరేషన్లు, దోమ తెరల పంపిణీని ప్రారంభించిందన్నారు. నీళ్ల విరేచనాల కేసులు 6 వేలు నమోదయ్యాయని, జిగట విరేచనాల కేసులు ఈ నెలలో 600 నమోదయ్యాయని తెలిపారు. టైఫాయిడ్ కేసులూ భారీగా వచ్చాయన్నారు. టైఫాయిడ్ కేసులన్నీ పానీపూరీ తినడం వల్ల వచ్చినవేనని స్పష్టంచేశారు. అన్ని సీజనల్ వ్యాధుల లక్షణాలన్నీ ఒకేలా.. కరోనా సహా అన్ని రకాల సీజనల్ వ్యాధుల లక్షణాలన్నీ ఒకేవిధంగా ఉంటాయని, ఏమాత్రం అనుమానమున్నా పరీక్షలు చేయించుకోవాలని, లక్షణాలను బట్టి వైద్యం తీసుకోవాలని శ్రీనివాసరావు చెప్పారు. ఈ లక్షణాలున్నవారు ఇళ్లలోనే ఐసోలేషన్లో ఉండాలని, తద్వారా ఇతరులకు వ్యాపించకుండా చూడాలన్నారు. 10–20 వేల వరకు ప్లేట్లెట్లు తగ్గినా రోగిని రక్షించుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజలు ఫ్రైడే డ్రై డే కార్యక్రమం చేపట్టాలని కోరారు. వేడి వేడి ఆహారం తీసుకోవాలన్నారు. నీరు రంగు మారితే తప్పక కాచి చల్లార్చాకే తాగాలన్నారు. నిర్దేశిత తేదీ కంటే ముందే గర్భిణులు ఆసుపత్రుల్లో చేరాలని సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజల బలహీనతను సొమ్ము చేసుకోవద్దని హెచ్చరించారు. కోవిడ్ సమయంలో ప్రైవేట్ ఆసుపత్రులపై ఫిర్యాదులు వస్తే వాట్సాప్ నంబర్కు ఫిర్యాదు చేయొచ్చని చెప్పామని, ఇప్పుడు కూడా 9154170960కు ఫిర్యాదు చేయాలని కోరారు. అవసరమైతే తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, టెస్టింగ్ కిట్లను అందుబాటులో ఉంచామన్నారు. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ పూర్తయిందని, సీఎం ఆధ్వర్యంలో త్వరలో కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. వారందరికీ హెల్త్ కార్డులు ఇస్తామని తెలిపారు. -
Telangana: టైఫాయిడ్ విజృంభిస్తోంది.. జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపై టైఫాయిడ్ పంజా విసురుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా టైఫాయిడ్ కేసులు పెరుగుతుండటంతో వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రతీ జిల్లాలోనూ కేసులు వెలుగుచూడటంతో స్థానిక అధికారులను అప్రమత్తం చేసింది. ఈ ఏడాది మే, జూన్, జూలైల్లో ఇప్పటివరకు 5,549 కేసులు నమోదైనట్లు వెల్లడించింది. అందులో అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 908, మంచిర్యాల జిల్లాలో 658 కేసులు నమోదయ్యాయి. డెంగీ కంటే ఐదురెట్లు ఎక్కువగా టైఫాయిడ్ కేసులు నమోదవుతున్నాయి. కలుషిత ఆహారం, నీరు కారణంగా టైఫాయిడ్ పెరుగుతున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ గుర్తించింది. మరోవైపు ఇదేకాలంలో నీళ్ల విరేచనాల కేసులు(అక్యూట్ డయేరియా) 12,620 మేర నమోదయ్యాయి. అందులో ఒక్క హైదరాబాద్లోనే 2,089 కేసులు ఉన్నాయి. టైఫాయిడ్ జ్వరం లక్షణాలు టైఫాయిడ్ను కలిగించే బ్యాక్టీరియా పేగునాళాల ద్వారా వ్యాపించి పేగు గోడలలోకి చొచ్చుకొని పోయి రక్తంలో కలుస్తుందని, మలం, రక్త నమూనాల ద్వారా రోగనిర్ధారణ చేయవచ్చని వైద్యులు అంటున్నారు. పిల్లలు ఎక్కువగా దీనికి ప్రభావితమవుతుంటారని, మెరుగైన పారిశుధ్యం, వ్యాధికి యాంటీబయాటిక్స్ తప్పనిసరి అని పేర్కొంటున్నారు. ఇది అంటువ్యాధి అయినందున అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. టైఫాయిడ్ వచ్చినప్పుడు జ్వరం 104 డిగ్రీల ఫారిన్హీట్ వరకూ చేరుకుంటుందని, విపరీతమైన చమటలు, గాస్ట్రో ఎంటిరైటిస్, విరేచనాలు కూడా సంభవిస్తాయని చెబుతున్నారు. రెండు వారాల తర్వాత శరీరంపై ఒక్కోసారి దద్దుర్లు, గులాబీ రంగు మచ్చలు కనిపిస్తాయని, కడుపునొప్పి కూడా రావచ్చని, ఈ వ్యాధి సోకినవారు ఎక్కువగా మగతగా ఉంటారని, మూడోవంతు రోగులకు ఛాతీ కింద, పొట్ట మీద గులాబీ రంగు మచ్చలు కనిపిస్తాయని చెబుతున్నారు. అరుదైన సందర్భాల్లో సరైన సమయంలో చికిత్స పొందకపోతే టైఫాయిడ్ జ్వరం వల్ల మరణం కూడా సంభవించవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. అప్రమత్తం చేశాం రాష్ట్రంలో డెంగీ కంటే అధికంగా టైఫాయిడ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో వైద్య యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. టైఫా యిడ్ ప్రధానంగా కలుషిత ఆహారం, నీరు వల్లే వస్తుంది. వీధుల్లో తోపుడుబండ్లపై ఉండే ఆహార పదార్థాలు, పానీపూరీ తినడం వల్ల టైఫాయిడ్ సంభవించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎక్కువగా నమోదయ్యే టైఫా యిడ్ కేసులన్నీ పానీపూరీ కేసులే. టైఫాయి డ్ రాకుండా ఉండాలంటే ఆహారం వేడిగా తినాలి. మంచినీళ్లను కాచి వడపోసిన తర్వా తే తాగాలి. పానీపూరీ బండ్లు, తోపుడుబండ్లపై అమ్మే ఆరుబయట ఆహార పదార్థాల ను తినకూడదు. టైఫాయిడ్ లక్షణాలుంటే తక్షణమే వైద్యం తీసుకోవాలి. –డాక్టర్ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకుడు -
డెంగీ, చికున్గున్యా వ్యాధులకు చెక్.. ఐసీఎంఆర్ శుభవార్త
పుదుచ్చేరి: డెంగీ, చికున్గున్యా వ్యాధులతో సతమతమవుతున్న భారతీయులకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) కొత్త శుభవార్త తెచ్చింది. ఈ రెండు వ్యాధుల వ్యాప్తికి కారణమయ్యే వైరస్లులేని లార్వాలను మాత్రమే ఉత్పత్తిచేసే ఆడ ఎడీస్ ఈజిప్టీ జాతి దోమలను ఐసీఎంఆర్, వెక్టర్ కంట్రోల్ రీసెర్చ్ సెంటర్(వీసీఆర్సీ–పుదుచ్చేరి)లు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. వ్యాధికారక వైరస్లు ఉన్న మగ దోమలు ఈ ఆడదోమలతో కలిస్తే వైరస్రహిత లార్వాలు ఉత్పత్తి అవుతాయి. వీటిల్లో వైరస్లు ఉండవుకనుక వాటి నుంచి వచ్చే దోమలు డెంగీ, చికున్గున్యాలను వ్యాపింపచేయడం అసాధ్యం. డబ్ల్యూమేల్, డబ్ల్యూఅల్బీ వోల్బాకియా అనే రెండు కొత్త జాతుల ఆడ ఎడీస్ ఈజిప్టీ దోమలను శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. ఇందుకోసం వీరు గత నాలుగు సంవత్సరాలుగా పరిశోధనలో మునిగిపోయారు. అయితే, ఈ ప్రయోగానికి జనబాహుళ్యంలోకి తేవడానికి ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉంది. డెంగీ, చికున్గున్యా వ్యాధుల వ్యాప్తి అధికంగా ఉన్న జనావాసాల్లో ప్రతీ వారం ఈ రకం ఆడదోమలను వదలాల్సి ఉంటుందని ఐసీఎంఆర్, వెక్టర్ కంట్రోల్ రీసెర్చ్ సెంటర్(వీసీఆర్సీ–పుదుచ్చేరి) డైరెక్టర్ డాక్టర్ అశ్వనీ కుమార్ చెప్పారు. చదవండి: దేశంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్.. ప్రపంచవ్యాప్తంగా 2వారాల్లో.. -
తెలంగాణలో డెంగీ కేసులు 6,284
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఈ ఏడాది డెంగీ కేసులు అధికంగా నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే దాదాపు మూడు రెట్లు అధికంగా నమోదు కావడం గమనార్హం. ఈ ఏడాది నవంబర్ 21వ తేదీ నాటికి 6,284 డెంగీ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది. ఈ మేరకు వివిధ సంవత్సరాల్లో దేశంలో డెంగీ కేసులు ఏస్థాయిలో నమోదయ్యాయో సమగ్ర నివేదిక విడుదల చేసింది. వివిధ రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ కేసుల విషయంలో పదో స్థానంలో ఉందని వివరించింది. అత్యంత ఎక్కువగా ఉత్తరప్రదేశ్లో 27,506 డెంగీ కేసులు నమోదు కాగా, అత్యంత తక్కువగా అరుణాచల్ప్రదేశ్లో మూడు కేసులు నమోదయ్యాయి. ఇక లడఖ్, లక్షద్వీప్లో డెంగీ కేసులు నమోదు కాలేదని కేంద్రం తెలిపింది. గతేడాది దేశవ్యాప్తంగా 44,585 డెంగీ కేసులు నమోదు కాగా, 66 మంది చనిపోయారు. ఈ ఏడాది 1.64 లక్షల కేసులు నమోదు కాగా, 146 మంది చనిపోయారు. అందులో ఒక్క మహారాష్ట్రలోనే 70 మంది చనిపోవడం ఆందోళన కలిగించే అంశం. -
విషాదం: తెల్లవారితే పెళ్లి అంతలోనే ఆస్పత్రి పాలై..
సాక్షి, పెదకూరపాడు: అతను గ్రామ వలంటీర్.. పెళ్లి నిశ్చయమైంది. కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో బిజిగా ఉన్నారు.. ఒకసారిగా జ్వరం, వాంతులు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు గుంటూరులోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. ఇరువైపుల పెద్దలు పెళ్లిని ఈనెల 20వ తేదీకి వాయిదా వేసుకున్నారు. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లింగంగుంట్ల గ్రామానికి చెందిన రావెల నాగచైతన్య(26) గ్రామ వలంటీర్గా పనిచేస్తున్నాడు. అతనికి నరసరావుపేటకు చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 14న పెళ్లి ముహూర్తం. రెండు రోజులుగా చైతన్య జ్వరంతో బాధపడుతున్నాడు. సాధారణ జ్వరంగా భావించిన అతను పెళ్లికి సిద్ధమయ్యాడు. పెళ్లి ముందు రోజు ఒకసారిగా జ్వరం తీవ్రం కావడంతోపాటు వాంతులు అవుతుండడంతో గుంటూరు ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. డెంగీతోపాటు కామెర్ల లక్షణాలు ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మరో ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. చదవండి: (16 రోజుల కిందట వివాహం.. నవ వధువు చైతన్య ఆత్మహత్య) పెళ్లి ఇంట విషాదఛాయలు అలముకున్నాయి. మృతుడు తండ్రి శివయ్య కూడా పదిరోజుల నుంచి డెంగీ లక్షణాలతో బాధపడుతూ గుంటూరులోని ప్రైవేట్ వైద్యశాల నందు చికిత్స పొంది పెళ్లికి నాలుగు రోజుల ముందుగా డిశ్చార్జీ అయి ఇంటికి వచ్చారని కుటుంబ సభ్యులు తెలిపారు. నాగచైతన్య తల్లి వెంకాయమ్మ అంగవైకల్యంతో ఇబ్బందులు పడుతుంది. ఒక కుమారుడు కావడంతో పెళ్లిని ఘనంగా నిర్వహించాలనుకున్నారు. పలు శాఖల ప్రభుత్వ అధికారులు, రాజకీయపార్టీ నేతలు నాగచైతన్యకు నివాళులర్పించారు. -
AP: డెంగీ కట్టడికి స్పెషల్ డ్రైవ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డెంగీ కేసులను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. డెంగీ జ్వరాల బారిన పడిన వారికి ఓ వైపు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ.. కేసుల నియంత్రణకు కార్యక్రమాలు కొనసాగిస్తోంది. ఈ చర్యల ఫలితంగా కేసుల నమోదు క్రమంగా తగ్గుతూ వస్తోంది. నియంత్రణ చర్యలను మరింత ముమ్మరంగా కొనసాగించేందుకు 13 జిల్లాలకు 13 మంది సీనియర్ అధికారులను పర్యవేక్షకులుగా వైద్య, ఆరోగ్య శాఖ నియమించింది. వీరు తమకు కేటాయించిన జిల్లాల్లోని గ్రామాలు, పట్టణాలను ర్యాండమ్గా ఎంపిక చేసి డ్రై డే, ఇంటింట సర్వే, ఫాగింగ్ తదితర కార్యక్రమాలు సక్రమంగా చేపడుతున్నారా లేదా అన్నది పరిశీలించి లోటుపాట్లను ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు. తదనుగుణంగా తదుపరి చర్యలు ఉండేలా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. మూడు రోజులు డ్రై డే డెంగీ కారక దోమల నివారణకు ప్రస్తుతం ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమం అమలవుతోంది. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది తమ పరిధిలోని ప్రజలకు దోమల నివారణపై చైతన్యం కల్పిస్తున్నారు. ఆ రోజు నీటి నిల్వలున్న బాటిళ్లు, టైర్లు, ప్లాస్టిక్ కుండీలు, ట్యాంకులను శుభ్రం చేసుకోవడంపై ప్రజలకు అవగాహన కలి్పస్తారు. ఈ కార్యక్రమాన్ని ఒక్క రోజులో ప్రభావవంతంగా చేపట్టడానికి వీలు పడటం లేదు. దీంతో మూడు రోజులపాటు (శుక్ర, శని, ఆది) ఈ కార్యక్రమం చేపడుతున్నారు. తద్వారా సచివాలయాల పరిధిలోని అన్ని ఇళ్లకు సిబ్బంది కచ్చితంగా వెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 14,986 సచివాలయాల పరిధిలో 1.62 కోట్ల గృహాల వారికి అవగాహన కల్పిస్తారు. ఇప్పటివరకూ 2,92,283 గృహాల్లో దోమలు గుడ్లు పెట్టినట్టు గుర్తించి నిర్మూలించారు. 3,006 నీళ్ల ట్యాంక్లను శుభ్రం చేయించారు. ఏఎన్ఎంలు తమ పరిధిలో ఎక్కడైనా మురుగు కాలువలు, పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే వెక్టర్ కంట్రోల్ హైజీన్ యాప్ ద్వారా పంచాయతీ, మునిసిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకూ ఏఎన్ఎంలు 1,60,453 సమస్యలను లేవనెత్తారు. వీటిలో 1,14,464 సమస్యలు పరిష్కారం కాగా, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. రాష్ట్రస్థాయిలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటు డెంగీ నివారణకు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టేలా రాష్ట్ర స్థాయిలో స్పెషాలిటీ వైద్యులతో 6 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్(ఆర్ఆర్టీ)లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అక్టోబర్ 25 నుంచి 31 వరకూ రాష్ట్రంలో 193 డెంగీ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క విశాఖపట్నంలోనే 43, తూర్పు గోదావరిలో 38, గుంటూరులో 20 చొప్పున.. మూడు జిల్లాల్లోనే ఎక్కువ కేసులు ఉన్నాయి. శ్రీకాకుళంలో 19, ప్రకాశం జిల్లాలో 16 మినహాయిస్తే మిగిలిన అన్ని జిల్లాల్లో కేసుల నమోదు తక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో కేసుల నమోదుపై ప్రభుత్వం ఎంటమలాజికల్ స్టడీ చేపడుతోంది. కేసులు ఎక్కువగా నమోదవుతున్న విశాఖపట్నం, గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాలతో పాటు, మిగిలిన జిల్లాల్లోని ఆరు ప్రాంతాల్లో ఎంటమలాజికల్ స్టడీ ఇప్పటికే ప్రారంభమైంది. మరోవైపు మురుగు నీటి కుంటలు, కాలువల్లో దోమ లార్వాలను తినే 24.75 లక్షల గంబూషియా చేప పిల్లలను వదిలారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 24 సెంటినల్ సర్వైలెన్స్ ఆస్పత్రులు ఉండేవి. వీటిలోనే డెంగీ నిర్ధారణ పరీక్షలు చేసేవారు. ప్రభుత్వం వీటి సంఖ్యను 54కు పెంచింది. ఈ ఆస్పత్రుల్లో ఇప్పటివరకు 58,949 డెంగీ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల నిర్వహణ, డెంగీ బారిన పడిన వారికి వైద్యం, మందులు ఈ ఆస్పత్రుల్లో అందిస్తున్నారు. విష జ్వరాలను ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చి నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకుంది. ప్రతి కేసూ సూక్ష్మ పరిశీలన రాష్ట్రంలో నమోదవుతున్న డెంగీ, మలేరియా ప్రతి కేసును సూక్ష్మంగా పరిశీలిస్తున్నాం. కేసు నమోదు కావడానికి కారణాలేమిటనేది అన్వేషించి నివారణ చర్యలు చేపడుతున్నాం. కేసులు నమోదైన ప్రాంతాలను వైద్యుల బృందం పరిశీలించి మునిసిపల్, పంచాయతీరాజ్ అధికారుల సమన్వయంతో నివారణ చర్యలకు ఉపక్రమిస్తున్నారు. దోమల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. అవసరమైనన్ని టెస్టింగ్ కిట్లు, మందులు అందుబాటులో ఉంచాం. – కాటమనేని భాస్కర్, కమిషనర్, వైద్య ఆరోగ్య శాఖ ఈ ఏడాది అక్టోబర్ నెలాఖరు వరకూ నమోదైన కేసులు ఇలా.. జిల్లా కేసుల సంఖ్య శ్రీకాకుళం 120 విజయనగరం 177 విశాఖపట్నం 899 తూర్పు గోదావరి 506 పశ్చిమ గోదావరి 221 కృష్ణా 153 గుంటూరు 565 ప్రకాశం 134 నెల్లూరు 46 చిత్తూరు 98 వైఎస్సార్ 27 కర్నూలు 181 అనంతపురం 154 మొత్తం 3,281 -
Hyderabad: వ్యాధుల రొద.. రోగుల వరద!
సాక్షి, హైదరాబాద్: అసలే కరోనా మహమ్మారి జడలు విప్పి నాట్యం చేస్తుంటే.. దీనికి తోడు ఇతర వ్యాధులూ నగర వాసుల్ని పట్టిపీడిస్తున్నాయనడానికి ఈ చిత్రాలే నిదర్శనం. డెంగీ, మలేరియా, డయేరియా, విష జ్వరాలు జనాలను భయకంపితుల్ని చేస్తున్నాయి. దీంతో ప్రైవేట్తో పాటు ప్రభుత్వ ఆస్పత్రులకు రోగుల తాకిడి విపరీతంగా పెరిగింది. వందల సంఖ్యలో వ్యాధిగ్రస్థులు దవాఖానాలకు పోటెత్తుతున్నారు. సోమవారం గాంధీ, నిలోఫర్, ఫీవర్ ఆస్పత్రులకు రోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చికిత్స కోసం గంటల తరబడి క్యూలైన్లో నిరీక్షించడం వ్యాధుల తీవ్రతకు దర్పణం పడుతోంది. చదవండి: గాంధీ.. ఇదేందీ! ఆస్పత్రిలో ఒకే బెడ్పై ఇద్దరు బాలింతలు.. ఫీవర్ ఆస్పత్రిలో క్యూలైన్.. నిలోఫర్ ఆవరణలో కిక్కిరిసి.. -
డెంగ్యూపై మాండవీయ సమీక్ష
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీసహా పలు రాష్ట్రాలను పట్టిపీడిస్తున్న డెంగ్యూ వ్యాధి కట్టడిపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆందోళన వ్యక్తంచేశారు. దోమకాటుతో ప్రభలే ఈ వ్యాధి కారణంగా ఢిల్లీలో ఇప్పటికే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో ఇప్పటికే 1,530 డెంగ్యూ కేసులు వెలుగుచూశాయి. గత నాలుగేళ్లలో ఢిల్లీలో ఇంత ఎక్కువ కేసులు రావడం ఇదే తొలిసారి. దీంతో ఢిల్లీ రాష్ట్రానికి చెందిన సంబంధిత వైద్య అధికారులతో మంత్రి మన్సుఖ్ మాండవీయ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మన్సుఖ్ మాట్లాడారు. కేసులు ఎక్కువ అవుతోన్న రాష్ట్రాలను గుర్తించి, ఆయా రాష్ట్రాలకు సంబంధిత నిపుణులను పంపాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్కు సూచించారు. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సాయం అందనుందని భరోసా ఇచ్చారు. -
ఢిల్లీలో డెంగీ తొలి మరణం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో డెంగీ బారిన పడి ఒకరు మృతి చెందారు. ఈ ఏడాది ఇదే తొలి మరణమని వెక్టార్ డిసీజ్ పౌర నివేదిక వెల్లడించింది. ఢిల్లీలోని సరితా విహార్కు చెందిన మమత(35) డెంగీ బారిన పడి సెప్టెంబర్ 20న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆమె సెప్టెంబర్ 25న మృతి చెందారని వివరించింది. ఈ ఏడాది అక్టోబర్ 16 వరకూ ఢిల్లీలో 723 డెంగీ కేసులు నమోదు అయ్యాయని, గడిచిన మూడేళ్లలో ఇదే అత్యధికమని తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్ 9 వరకూ 480 కేసులు వెలుగులోకి రాగా ఒక్క వారంలోనే 243 కేసులు నమోదు అయ్యాయని తెలిపింది. గడిచిన 2 వారాలుగా ఢిల్లీలో డెంగీ కేసులు పెరుగుతున్నాయని దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారి పేర్కొన్నారు. 2020లో 1,072 కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందారని, 2019లో ఇద్దరు, 2018లో నలుగురు, 2017లో 10 మంది, 2016లో 10 మంది మృతి చెందారని నివేదిక పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండు, మార్చిలో ఐదు, ఏప్రిల్లో పది, మేలో 12, జూన్లో ఏడు, జూలైలో 16, ఆగస్ట్లో 72, సెప్టెంబర్లో 217 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది అక్టోబర్ 16 వరకూ ఢిల్లీలో మలేరియా కేసులు 142, చికున్గున్యా కేసులు 69 నమోదయ్యాయని నివేదిక పేర్కొంది. (చదవండి: కోవాగ్జిన్పై అదనపు సమాచారం కావాలి: డబ్ల్యూహెచ్ఓ) -
చిన్నారుల్లో ‘డెంగీ’ కలవరం!
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ నుంచి గ్రేటర్ వాసులు ఇంకా పూర్తిగా కోలుకోకముందే తాజాగా డెంగీ, మలేరి యా, టైఫాయిడ్, చికెన్గున్యా జ్వరాలు వెంటాడుతున్నాయి. ఇటీవల ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు...వాతావరణంలో చోటు చేసుకుంటున్న అనూహ్య మార్పుల వల్ల అనేక మంది విషజ్వరాల బారినపడు తున్నారు. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ప్రస్తుతం ఏ ఇంట్లోకి చూసినా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు దగ్గు, జలుబు, జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతున్నట్లు వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఈ జ్వరపీడితుల్లో చిన్నారులు ఎక్కువగా ఉండటం విశేషం. ప్రతి ఐదుగురు జ్వరపీడితుల్లో ఒకరికి డెంగీ పాజిటివ్ రిపోర్ట్ అవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. బస్తీ, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో సరైన వైద్యసేవలు అందక పోవడంతో శివారు ప్రాంతాల్లోని బాధితులంతా మెరుగైన వైద్యం కోసం నగరంలోని బోధనాసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ఫలితంగా ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ సహా నల్లకుం ట ఫీవర్ ఆస్పత్రి, కోఠి ఈఎన్టీ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు లేకపోవడంతో ఉస్మానియా, నిలోఫర్ ఆస్పత్రుల్లో రోగులను నేలపై పడుకోబెట్టి చికిత్సలు అందించాల్సి వస్తుంది. వెయ్యి పడకల సామర్థ్యం కలిగిన నిలోఫర్ ఆస్పత్రిలో ప్రస్తుతం 1,200 మంది చికిత్స పొందుతున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కిటకిటలాడుతున్న పెద్దాసుపత్రులు.. హైదరాబాద్ జిల్లాలో 85 పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 40పైగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఇక మేడ్చల్ జిల్లాలో 36 ఉన్నాయి. ఈ మూడు జిల్లాల పరిధిలో 200పైగా బస్తీ దవాఖానాలతో పాటు ఏడు ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. ఆయా ఆస్పత్రుల్లో సరైన వైద్యసేవలు అందడం లేదు. సాధారణ రక్త, మూత్ర పరీక్షలకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుండటంతో అత్యవసర పరిస్థితుల్లో వారంతా ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఫీవర్ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. సాధారణ రోజుల్లో ఉస్మానియా ఆస్పత్రిలో రోజు సగటు ఓపీ 1,200 ఉండగా, ప్రస్తుతం 1,800 నుంచి 2,000పైగా నమోదవుతోంది. ఇక ఫీవర్ ఆస్పత్రిలో సాధారణ రోజుల్లో సగటు ఓపీ 350 ఉండగా, ప్రస్తుతం వెయ్యి దాటింది. ఇక నిలోఫర్ చిన్నపిల్లల ఆస్పత్రిలో సాధారణ రోజుల్లో 900 ఉండగా, ప్రస్తుతం ఈ సంఖ్య 1,500 దాటింది. ఈఎన్టీ ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆయా ఆస్పత్రుల్లో రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు లేకపోవడంతో వచ్చిన వారిని నేలపై పడుకోబెట్టి వైద్యసేవలు అందిం చాల్సి వస్తుంది. ఓపీకి వస్తున్న వారిలో ఎక్కువగా జ్వరపీడితులే. కరోనా భయం ఇంకా పోకముందే, డెంగీ జ్వరాలు వెంటాడుతుండటంతో నగరవాసులు కంటిమీద కునుకు లేకుండా గడపాల్సి వస్తుంది. కరోనా, డెంగీలోనూ ఒకే లక్షణాలు ఉండటంతో ఈ జ్వరాల గుర్తింపు ఆందోళన కలిగిస్తోంది. సాధారణ జ్వర పీడితులకు డెంగీ బూచీ.. ఆరోగ్య కేంద్రాల్లో డెంగీ నిర్ధారణ పరీక్షలు చేసే అవకాశం లేకపోవడంతో అక్కడికి వచ్చిన బాధితుల నుంచి రక్తనమూనాలు సేకరించి ఐపీఎంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్కు పంపుతున్నారు. రిపోర్టుల జారీలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో జ్వరం తీవ్రత మరింత పెరిగి రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. విధిలేని పరిస్థితుల్లో పేదలు ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లను ఆశ్రయించాల్సి వస్తుంది. కరోనా, డెంగీ పరీక్షల పేరుతో ఆయా కేంద్రాలు రోగుల నిలువుదోపిడీకి పాల్పడుతున్నాయి. డయాగ్నోస్టిక్ సెంటర్లపై సరైన నియంత్రణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రైవేటు ఆస్పత్రుల్లోని వైద్యులు సాధారణ జ్వరాలను కూడా డెంగీ, కరోనా జ్వరాలుగా పేర్కొంటూ అత్యవసర చికిత్సలను సిఫార్సు చేస్తున్నారు. ఐసీయూ చికిత్సల పేరుతో పేదలను దోచుకుంటుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. నగరం లోని కొంత మంది వైద్యులు డెంగీ మరణాలను బూచిగా చూపించి..ప్లేట్లెట్ కౌంట్స్ చికిత్సల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. అంతేకాదు డెంగీ కేసుల వివరాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు తెలియజేయాల్సి ఉన్నా.. అనుమానం రాకుండా సస్పెక్టెడ్ డెంగీ కేసుగా అడ్మిట్ చేసుకుని చికిత్సలు చేస్తుండటం విశేషం. డెంగీకి కారణాలివే – డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, రంగారెడ్డిజిల్లా ►ఎడిస్ ఈజిప్టే (టైగర్)దోమ కుట్టడం వల్ల డెంగీ సోకుతుంది. సాధారణంగా ఇది పగలు మాత్రమే కుడుతుంది. ►కేవలం పగలు మాత్రమే కుట్టే డెంగీ దోమలు లైట్ల వెలుగులు విరజిమ్ముతుండటంతో రాత్రి వేళలోనూ కుడుతున్నాయి. ►ఇంటి పరిసరాల్లో ఖాళీ కొబ్బరి బోండాలు, సీసాలు, డబ్బాలు, టైర్లు, ప్లాస్టిక్ గ్లాసులు లేకుండా చూసుకోవాలి. ►వర్షపు నీరు వీటిలో చేరి నిల్వ ఉండటం వల్ల దోమలకు నిలయంగా మారి వీటిలో గుడ్లు పెడుతుంటాయి. ►ఇంటి పరిసరాల్లో నీటి గుంతలు లేకుండా చూసుకోవాలి. మంచినీటి ట్యాంకులపై మూతలు పెట్టి ఉంచాలి. సీజన్ మారుతుండటం వల్లే – డాక్టర్ వెంకటి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, హైదరాబాద్ జిల్లా వాతావరణ మార్పులను శరీరం తట్టుకోలేదు. సీజన్ మారిన ప్రతిసారీ దగ్గు, జలుబు, టైఫాయిడ్ జ్వరాలు సర్వసాధారణం. భయపడాల్సిన పనిలేదు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, నిల్వ ఉన్న ఆహార పదార్థాలకు బదులుగా అప్పుడే వండిన తాజా ఆహార పదార్థాలను తీసుకోవడం, గోరు వెచ్చని మంచినీరు తాగడం; తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ప్రతి ఒక్కరూ విధిగా కోవిడ్ టీకాలు వేసుకోవాలి. -
ఖమ్మం ఉమ్మడి జిల్లాపై డెంగ్యూ పంజా
-
విజృంభిస్తున్న విషజ్వరాలు: డెంగీ..మలేరియా..టైఫాయిడ్!
అంబర్పేట: సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దీంతో నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీకి వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. నిత్యం 40 నుంచి 50 ఉండే ఓపీ.. ప్రస్తుత సీజన్లో 70 నుంచి 80కి పెరిగింది. నియోజకవర్గంలోని ఐదు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు నాలుగు బస్తీ దవాఖానాలకు సామాన్య రోగుల సంఖ్య తాకిడి ఎక్కువైంది. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు జ్వరాల భారిన పడిన ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకూ పరుగులు తీస్తున్నారు. ఈ సీజన్లో డెంగీ, మలేరియా, చికున్గున్యా, టైఫాయిడ్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. గత 20 రోజులుగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. దోమల నివారణ, పారిశుధ్య నిర్వహణలో జరుగుతున్న వైఫల్యంతోనే ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పని చేయాలని ప్రజలు కోరుతున్నారు. అండగా బస్తీ దవాఖానాలు సీజన్ వ్యాధులు ప్రబలుతుండటంతో బస్తీ దవాఖానాలు పేదలకు ఎంతో ఊరటనిస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు బస్తీ దవాఖానాల్లో వైద్యులు ఓపీ చూస్తున్నారు. సాధారణ జనంతో పాటు ఇతర జ్వరాలను గుర్తించి చికిత్స అందించడంతో పాటు మెరుగైన చికిత్సకు సిఫార్సు చేస్తున్నారు. నియోజకవర్గంలో అంబర్పేట మున్సిపల్ కాలనీ, బాగ్ అంబర్పేట అయ్యప్ప కాలనీ సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నెహ్రూనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఫీవర్ ఆసుపత్రిలో వెనుకాల ఉన్న తిలక్నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, విద్యానగర్ డీడీ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఓపీతో పాటు వైద్య పరీక్షల శాంపిళ్లు సేకరించి చికిత్స నిర్వహిస్తున్నారు. ఆయా డివిజన్లలో ఉన్న బస్తీ దవాఖానాల్లో సైతం వైద్య పరీక్షల కోసం రక్త నమూనాలు సేకరించి తెలంగాణ డయాగ్నోస్టిక్స్ కేంద్రానికి పంపిస్తున్నారు. వైద్య పరీక్షల్లో తేలిన ఫలితాన్ని బట్టి కోవిడ్కు చికిత్సను అందిస్తున్నారు. దోమల నియంత్రణలో విఫలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని తెలిసినా దోమలను నియంత్రించడంలో జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం విఫలమవుతున్నది. దోమల లార్వా, దోమల విజృంభణలను నివారించడంలో ఎంటమాలజీ విభాగం నిర్లక్ష్యం చేస్తున్నదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూ.. తూ.. మంత్రంగా ఫాగింగ్ చేపట్టి చేతులు దులుపు కుంటున్నారే తప్ప వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు. లార్వా నిర్మూలనలో సైతం పై పై చర్యలు తీసుకొని మిన్నకుండి పోతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వైద్య విభాగాన్ని సమాయత్తం చేశాం సీజనల్ వ్యాధులను నియంత్రించేందుకు కృషి చేస్తున్నాం. నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో సరిపడా మందులను అందుబాటులో ఉంచాం. సీజనల్ వ్యాధులను అరికడుతూనే విస్తృతంగా వ్యాక్సిన్ ప్రక్రియను చేపడుతున్నాం. సీజనల్ వ్యాధులపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. – డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ హేమలత -
యూపీని వణికిస్తున్న విష జ్వరాలు.. హెమరాజిక్ డెంగీ కాటు వల్లే
ఫిరోజాబాద్/లక్నో: ఉత్తరప్రదేశ్లో డెంగీతోపాటు విష జ్వరాలు చిన్నారుల ప్రాణాలను కబళిస్తున్నాయి. జ్వరాల కారణంగా మరో ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటిదాకా మొత్తం మరణాల సంఖ్య 50కి చేరిందని, మృతుల్లో 40 మంది చిన్నారులు ఉన్నారని ప్రభుత్వ అధికారులు శుక్రవారం ప్రకటించారు. జ్వరాల కాటుపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజధాని లక్నోలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆగ్రా, ఫిరోజాబాద్ జిల్లాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని, జ్వర పీడితులకు వైద్య సాయం అందించాలని, మరణాలకు అడ్డుకట్ట వేయాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు ఆక్సిజన్ సదుపాయం ఉన్న ఐసోలేషన్ పడకలు కేటాయించాలన్నారు. కోవిడ్ బాధితుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను జ్వర పీడితుల వైద్యం కోసం వాడుకోవాలని చెప్పారు. ఫిరోజాబాద్లో జ్వరాల తీవ్రతపై కేంద్రం స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడానికి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్సీడీసీ), నేషనల్ వెక్టర్ బార్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్కు చెందిన నిపుణులను ఫిరోజాబాద్కు పంపించింది. మథుర, ఆగ్రా జిల్లాల్లోనూ విష జ్వరాల కేసులు పెరుగుతున్నాయని యూపీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ దినేష్ కుమార్ ప్రేమీ చెప్పారు. ఫిరోజాబాద్ జిల్లాలో ప్రస్తుతం 3,719 మంది బాధితులు చికిత్స పొందుతున్నారన్నారు. హెమరాజిక్ డెంగీ కాటు వల్లే.. ప్రమాదకరమైన హెమరాజిక్ డెంగీ కాటు వల్లే చిన్నారులు ఎక్కువగా బలవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) బృందం తెలియజేసిందని ఫిరోజాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ చంద్రవిజయ్ సింగ్ అన్నారు. ఈ రకం డెంగీ వల్ల బాలల్లో ప్లేట్లెట్ల సంఖ్య హఠాత్తుగా పడిపోతుందని, రక్తస్రావం అవుతుందని వెల్లడించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో ముగ్గురు వైద్యులను ఆయన సస్పెండ్ చేశారు. -
దోమకాటు: బోదకాలు, చికున్ గున్యా, కాలా అజర్.. ఇంకా
వానాకాలం వచ్చిందంటే వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. కానీ ఇదే సమయంలో మనిషికి ప్రమాదకరమైన దోమల్లాంటి కీటకాల విజృంభణ పెరుగుతుంది. అనాది కాలంగా దోమకాటు మనిషికి ప్రాణాంతకంగా ఉంటోంది. ఆధునిక యుగంలో వైద్య విజ్ఞానం పెరిగిన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. అందుకే దోమలే కదా, అని తీసిపారేయకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. భారత్ లాంటి ఉష్ణమండల దేశాల్లో, జనాభా అధికంగా ఉండే దేశాల్లో దోమలు పలురకాలుగా చెలరేగుతుంటాయి. వీటివల్ల రకరకాల వ్యాధులు సంభవించడమే కాకుండా, వీటిలో కొన్ని వ్యాధులు ప్రాణాంతకాలు కూడా! ప్రపంచ ఆరోగ్యసంస్థ లెక్కల ప్రకారం దోమకాటుకు భారత్తో సహా దక్షిణాసియాలో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. సో.. అజాగ్రత్త అస్సలు పనికిరాదు. దోమలు.. వ్యాధులు మనిషి రక్తాన్ని నేరుగా పీల్చే దోమలు అదే రక్తంలోకి పలురకాల సూక్ష్మ క్రిములను ప్రవేశపెడతాయి. దీంతో మనిషిలో పలు రకాల వ్యాధులు ప్రబలుతుంటాయి. భారత్లో దోమల ద్వారా వ్యాపించే కొన్ని ప్రమాదకరవ్యాధుల వివరాలు ఇలా ఉన్నాయి.. మలేరియా ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వల్ల వ్యాపిస్తుంది. ఉదయం, సాయంత్ర వేళ్లలో అనాఫిలస్ దోమకాటు వల్ల ప్లాస్మోడియం సోకుతుంటుంది. సోకిన తర్వాత అధిక జ్వరం, విపరీతమైన చలి, తలనొప్పి, విపరీతమైన చెమటలు, కండరాల నొప్పి లాంటి లక్షణాలు బయటపడతాయి. పిల్లలు, గర్భిణులు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారు, తరచూ ప్రయాణాలు చేసేవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం అతం్యంత ప్రాణాంతక వ్యాధిగా పరిగణించేవారు. ప్రస్తుతం చికిత్స అందుబాటులో ఉంది. తగ్గడానికి క్లోరోక్వినాన్ మందును వాడతారు. బోదకాలు ఒకప్పుడు భారత్లో పలు ప్రాంతాల్లో విపరీతంగా కనిపించేది. వుచరేరియా అనే పరాన్నజీవి వల్ల, క్యూలెక్స్ దోమ కాటుతో సంక్రమిస్తుంది. మనిషి లింఫాటిక్ వ్యవస్థలో పరాన్న జీవి చేరుకొని రక్తం నిండా దాని లార్వాని కోట్ల సంఖ్యలో విడుదల చేస్తుంది. దీనివల్ల లింఫ్ వ్యవస్థ దెబ్బతిని కణజాలాలు వాయడం, చర్మం బిరుసెక్కడం, అవయవాల్లో అనవసర ద్రవాలు చేరడం సంభవిస్తుంది. దీనివల్ల క్రమంగా వైకల్యం వస్తుంది. చికున్ గున్యా ఇది కూడా వైరస్ ద్వారా సోకుతుంది. ఏడిస్ దోమ కాటుతో సంక్రమిస్తుంది. తలనొప్పి, కీళ్లనొప్పులు, వెన్నునొప్పి, దద్దుర్లు కనిపిస్తాయి. లక్షణాలు వారం పాటు ఉండి తగ్గినా, నొప్పులు మాత్రం నెలల పాటు కొనసాగుతాయి. డెంగ్యూతో ఈ వ్యాధి లక్షణాలకు పోలిక ఉంటుంది. రక్తపరీక్షద్వారా నిర్ధారిస్తారు. కాలా అజర్ లెస్మోనియాసిస్ పరాన్నజీవి వల్ల సాండ్ఫ్లై కాటుతో సంక్రమిస్తుంది. వారాల పాటు తగ్గని జ్వరం, ప్లీహం ఉబ్బడం, రక్తహీనత, బరువు తగ్గడం వంటి లక్షణాలుంటాయి. తొందరగా చికిత్స అందకపోతే రెండేళ్లలో మరణించే ప్రమాదం ఉంటుంది. ఈ జ్వరం తగ్గిన తర్వాత చర్మం మీద దద్దుర్లు వస్తుంటాయి. జపనీస్ ఎన్సెఫలైటిస్ ఇది వైరస్ ద్వారా క్యూలెక్స్ దోమ కాటు వల్ల వస్తుంది. జ్వరం, వాంతులు వస్తాయి. ముదిరినప్పుడు మెదడుపై ప్రభావం చూపుతుంది. దీంతో మూర్చరోగం కూడా రావచ్చు. చిన్నపిల్లల్లో ప్రాణాంతకంగా మారుతుంది. డెంగ్యూ దోమల ద్వారా వ్యాపించే ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటి. డెంగ్యూ వైరస్ ద్వారా సోకుతుంది. సోకిన 3–14 రోజుల్లో అధిక జ్వరం, వాంతులు, కీళ్లనొప్పులు, దద్దుర్లు లాంటి లక్షణాలు బయటపడతాయి. తగ్గడానికి నిర్దిష్టమైన మందులు లేవు. లక్షణాలను బట్టి మందులు వాడతారు. దాదాపు వారంలో తగ్గుతుంది. కానీ ఒక్కోసారి జ్వరం చాలా ఎక్కువైతే చర్మం కింద రక్తనాళాలు చిట్లడం లాంటి ప్రమాదాలు జరుగుతాయి. ఇలాంటప్పుడు ఆస్పత్రిలో చేరాల్సిఉంటుంది. దోమల ద్వారా వచ్చే వ్యాధులను తేలిగ్గా తీసుకోకూడదు. ఉదాహరణకు మలేరియా దాదాపు 90కిపైగా దేశాల్లో కనిపిస్తుంది. ఏటా దాదాపు 50 కోట్లమంది దీని బారిన పడుతుంటే, వీరిలో 27 లక్షల మంది మరణిస్తుంటారు. దోమల ద్వారా ఏటా 250 కోట్ల మంది పలు వ్యాధులబారిన పడుతున్నట్లు అంచనా. అందువల్ల ఇవి సోకిన తర్వాత చికిత్స కన్నా నివారణే మంచి మార్గమని నిపుణుల సలహా. చదవండి: National Nutrition Week: ఆరోగ్యానికి 5 చిట్కాలు.. అన్నీ తెలిసినవే! -
కరోనానా? సీజనల్ జ్వరమా?
సాక్షి,విజయవాడ: ఏడాదిన్నరగా కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. దీంతో ప్రజల్లో ఫోబియో నెలకొంది. ఏ జ్వరం వచ్చినా.. జలుబు, చిన్నపాటి దగ్గు వచ్చినా నిర్ధారణ పరీక్షలు కూడా లేకుండా కరోనాగా భావించి మందులు వాడేస్తున్నారు. అవి ఒక్కోసారి ప్రాణాల మీదకి తెస్తున్నాయి. తెలియని వారు చేస్తే ఏదో అనుకోవచ్చు.. విద్యావంతులు సైతం ఇదే విధంగా మందులు వాడుతూ ప్రమాదాలను కొనితెచ్చుకొంటుండటం ఆందోళనకర పరిణామం. ఇవే నిదర్శనాలు.. ∙నగరానికి చెందిన ఒక సూపర్స్పెషాలిటీ వైద్యురాలికి తీవ్రమైన జ్వరం వచ్చింది. స్వయాన వైద్యురాలు అయినప్పటికీ ఎలాంటి నిర్ధారణ పరీక్షలు చేయించకుండానే కరోనాగా భావించి మందులు వాడేశారు. యాంటీ కోయాగ్యులేషన్(రక్తం పలుచన చేసేవి) మందులు కూడా వినియోగించారు. వారం రోజుల తర్వాత ఓ రోజు వేకువజామున ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు చేయగా డెంగీగా నిర్ధారణయ్యింది. సహజంగా డెంగీ జ్వరంలో ప్లేట్లెట్స్ తగ్గి రక్తం గడ్డకట్టే గుణం కోల్పోతారు. దానికి తోడు ఆమె రక్తం పలుచన చేసే మందులు కూడా వాడటంతో పరిస్థితి విషమించి కన్నుమూశారు. ∙నగరానికి చెందిన విద్యావంతుడైన ఓ ప్రైవేటు ఉద్యోగికి ఇటీవల జ్వరం వచ్చింది. ఎంతకీ తగ్గక పోవడంతో, కరోనాగా భావించి మందులు వాడేశారు. మూడు రోజులకు జ్వరం తీవ్రం కావడంతో వైద్యుని వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోగా, టైఫాయిడ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో వైద్యుడు టైఫాయిడ్కు మందులు ఇవ్వడంతో ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. డ్రగ్ రెసిస్టెన్స్ పెరుగుతోంది.. ఇప్పుడు సమాజంలో చాలా మంది చిన్న పాటి జ్వరం వచ్చినా, జలుబు, దగ్గు వచ్చినా, లక్షణాలను బట్టి కరోనాగా భావించి మందులు వాడేస్తున్నారు. అది సరైన విధానం కాదని వైద్యులు సూచిస్తున్నారు. ఏ మందు అయినా అవసరం వచ్చినప్పుడు, ఆ మేరకు మాత్రమే వాడాలంటున్నారు. అనవసరంగా మందులు వాడటం ద్వారా శరీరంలో డ్రగ్ రెసిస్టెన్స్ పెరిగి, అవసరమైనప్పుడు పనిచేయకుండా పోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇదీ ‘సీజనల్’ సమయం.. ప్రస్తుతం సీజనల్ జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే జ్వరం వచ్చిన వెంటనే కోవిడ్ నిర్ధారణ కోసం ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. దానిలో పాజిటివ్ వస్తేనే కరోనాకు మందులు వాడాలి. ఒకవేళ ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చినా జ్వరం తగ్గకుంటే, అప్పుడు సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగీ, టైఫాయిడ్ పరీక్షలు చేయించుకోవాలి. మలేరియా, డెంగీ నిర్ధారణకు జ్వరం వచ్చిన ఒకటీ, రెండు రోజుల్లో పరీక్ష చేయొచ్చు. కానీ టైఫాయిడ్ నిర్ధారణకు వారం రోజుల తర్వాత చేయాల్సి ఉంటుంది. లక్షణాలు ఇవీ.. కోవిడ్: జ్వరం, ఒళ్లు నొప్పులు, పొడిదగ్గు, విరేచనాలు, తలనొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. టైఫాయిడ్: జ్వరం వచ్చిన రోజు నుంచి రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. ఉదయం, సాయంత్రం వేళల్లోనే అధికమవుతుంటుంది, జ్వరం వచ్చినప్పుడు చలి, వణుకు రావడం, విరేచనాలు కూడా అయ్యే అవకాశం ఉంది. డెంగీ: అధిక జ్వరం, ఒళ్లు నొప్పులు, విపరీతమైన న డుం నొప్పితో పాటు, కీళ్ల నొప్పులు ఉంటాయి. మలేరియా: విపరీతమైన జ్వరం, చలి ఎక్కువగా ఉంటుంది, తీవ్రమైన తలనొప్పి, వాంతులు, ఆకలి మందగిస్తుంది. చదవండి:జర జాగ్రత్త!.. ఆహారం.. విరామం.. అతి చేస్తే హానికరం -
తెలంగాణను వణికిస్తున్న విష జ్వరాలు
-
విషమిస్తోంది.. కిక్కిరిసిపోతున్న ఆస్పత్రులు
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో విష జ్వరాలు కమ్ముకుంటున్నాయి. పల్లెలు, ఆదివాసీ గూడేలు మంచం పడుతున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాల తీవ్రత ఒక్కసారిగా పెరిగి ఊళ్లకు ఊళ్లు నీరసిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఆసిఫాబాద్, మహబూబాబాద్ జిల్లాల పరిధిలో పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వేలాది మంది బాధితులు క్యూ కడుతున్నారు. పలుచోట్ల ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ఇక చాలా ప్రభుత్వాస్పత్రుల్లో డెంగీ బాధితులకు ప్లేట్లెట్లు ఎక్కించే సౌకర్యం లేకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. కొందరు పాత జిల్లా కేంద్రాలకు, హైదరాబాద్కు వెళ్తున్నారు. ముందుగా గుర్తించలేక, సరైన సమయంలో చికిత్స అందక డెంగీ, ఇతర జ్వరాలబారిన పడ్డవారు ప్రాణాలు కోల్పోతున్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా డిప్యూటీ తహసీల్దార్ డెంగీతో, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో మరో యువకుడు టైఫాయిడ్తో ప్రాణాలు వదిలారు. మూడు ఊళ్లు.. 200 మంది.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాండురంగాపురం, ఇల్లందులపాడుతండా, తవిశలగూడెం గ్రామంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. మొదట ఈ నెల 4న ఇల్లందులపాడుతండాలో డెంగీ లక్షణాలతో ఒకరిద్దరు మంచాన పడ్డారు. క్రమంగా బాధితుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ మూడు గ్రామాల్లో కలిపి 200మందికిపైగా డెంగీ లక్షణాలతో బాధపడుతున్నారు. ఇప్పటివరకు ఇద్దరు డెంగీ లక్షణాలతో చనిపోయారు. పదుల సంఖ్యలో బాధితులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్, ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లారు. ఒకరి వెనుక ఒకరుగా.... మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో విష జ్వరాలు కమ్ముకున్నాయి. గత నాలుగైదు రోజుల్లోనే లైన్తండా గ్రామంలో 12 మంది జ్వరాల బారిన పడ్డారు. భూపతిపేట, మచ్చర్ల గ్రామాలు, మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలోనూ ఇదే పరిస్థితి. విష జ్వరాల బాధితులతో గూడూరు మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో పడకలన్నీ నిండిపోయాయి. ఎక్కడ చూసినా అదే పరిస్థితి ►భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత నెల వ్యవధిలో విషజ్వరాలు, మలేరియా, డెంగీతో 35 మందికిపైగా చనిపోయారు. అందులో 20 మంది డెంగీ బాధితులే ఉన్నట్టు సమాచారం. అధికారిక లెక్కల ప్రకారమే.. జూలై ఒకటి నుంచి ఇప్పటివరకు 32 వేల మందికిపైగా విషజ్వరాల బారినపడ్డారు. ►ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి జ్వర పీడితులతో నిండిపోయింది. పిల్లల వార్డులోనే వంద మందికిపైగా పిల్లలు చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రికి రోజూ 100 మందికిపైగా విష జ్వరాల బాధితులు వస్తున్నట్టు వైద్య సిబ్బంది చెప్తున్నారు. ►ఉమ్మడి నల్లగొండ జిల్లాలో డెంగీ, మలే రియా, ఇతర విష జ్వరాల బాధితులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. గిరిజన తండాలు ఎక్కువున్న దేవరకొండ ప్రాంతంలో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ కేసులు నమోదవుతున్నాయి. మిర్యాలగూడ, సూర్యాపేటలోనూ ఇదే పరిస్థితి. ►నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్వాడి ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులన్నీ ఇతర విష జ్వరాల బాధితులతో నిండిపోయాయి. ఒక్కో ఆస్పత్రిలో పది నుంచి ఇరవై మంది డెంగీ, మలేరియా బాధితులున్నట్టు తెలిసింది. నిజామాబాద్ పట్టణంతోపాటు ఆర్మూర్, పోచంపాడ్, బాల్కొండ, భీంగల్, డిచ్పల్లి, సిరికొండ, నందిపేట, నవీపేట ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ►ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారమే.. 67 డెంగీ కేసులు, 2 చికున్గున్యా, 32 మలేరియా కేసులు నమోదయ్యా యి. అనధికారికంగా ఈ సంఖ్య వందల్లో ఉంటుందని స్థానిక అధికారులే చెప్తున్నారు. ►ఖమ్మం జిల్లాలో జూలైలో 42, ఈ నెలలో ఇప్పటివరకు 38 డెంగీ కేసులు నమోదైనట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. కానీ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పెద్ద సంఖ్యలో విషజ్వరాల బాధితులు కనిపిస్తున్నారు. డెంగీతో నాయబ్ తహసీల్దార్ .. నిర్మల్: నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో నాయబ్ తహసీల్దార్గా పనిచేస్తున్న కొంతం శ్రీకాంత్(40) మంగళవారం డెంగీ బారినపడి మృతిచెందారు. జిల్లా కేంద్రంలోని నాయుడివాడకు చెందిన ఆయన.. రెవెన్యూ, పౌర సరఫరాల శాఖలో వివిధస్థాయిల్లో పనిచేశారు. ఇటీవలే కలెక్టరేట్కు బదిలీపై వచ్చారు. నాలుగైదు రోజుల క్రితం తీవ్ర జ్వరంరాగా స్థానిక ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు డెంగీగా నిర్ధారించారు. అక్కడ చికిత్స పొందుతుండగా ఆరోగ్య పరిస్థితి విషమించింది. మంగళవారం వేకువజామున హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయారు. శ్రీకాంత్కు భార్య జ్యోతి, కూతురు(12), కుమారుడు(10) ఉన్నారు. టైఫాయిడ్తో యువకుడు మృతి ఇంద్రవెల్లి (ఖానాపూర్): ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్కు చెందిన అశోక్ (25) వారం కింద టైఫాయిడ్ బారినపడ్డాడు. మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందినా ఆరోగ్యం కుదుటపడలేదు. మంగళవారం పరిస్థితి విషమించి మృతిచెందాడు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం కొమిలిపెంటకు చెందిన ఈ మహిళ పేరు జల్ల ముత్తమ్మ. తీవ్ర జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతూ.. స్థానిక ఆర్ఎంపీ వద్ద చికిత్స తీసుకుంది. వారమైనా జ్వరం అదుపులోకి రాకపోవడంతో మన్ననూరు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటోంది. అడ్డగోలు వసూళ్లకు దిగిన ఆస్పత్రులు విష జ్వరాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నవారు పెరుగుతుండటంతో ప్రైవేటు ఆస్పత్రులు అడ్డగోలు వసూళ్ల దందాకు దిగుతున్నాయి. అందులోనూ డెంగీ బారినపడ్డ వారి నుంచి రోజుకు రూ.30 వేల నుంచి రూ. 50 వేల వరకు వసూలు చేస్తున్నారు. రోగులకు ప్లేట్లెట్లు ఎక్కిస్తూ.. ఒక్కో బ్యాగ్కు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నారు. కన్సల్టేషన్, బెడ్, ఇతర చార్జీలు, మందుల పేరిట మరింతగా బిల్లులు వేస్తున్నారని బాధితులు చెప్తున్నారు. -
ఢిల్లీకి మరో ముప్పు.. అటు కరోనా.. ఇటు
సాక్షి, న్యూఢిల్లీ: ఓవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. మరోవైపు దోమకాటు కారణంగా వచ్చే డెంగ్యూ వైరల్ జ్వరాల కేసులు ఢిల్లీలో పెరగడం ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మూడేళ్ల రికార్డును డెంగ్యూ బద్దలు కొట్టింది. జనవరి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 17వ తేదీ మధ్య నమోదైన డెంగ్యూ కేసులు 2018 నుండి వస్తున్న కేసులను అధిగమించాయి. అధికారిక గణాంకాల ప్రకారం గత వారంలో, కొత్తగా నలుగురు డెంగ్యూ రోగులతో మొత్తం రోగుల సంఖ్య ఈ ఏడాది 13కి చేరుకుంది. అయితే జనవరి 1 నుంచి ఏప్రిల్ 17 మధ్య సమయంలో 2017 సంవత్సరంలో 18 మంది, 2018 సంవత్సరంలో 12 మంది, 2019 లో 8 మంది, 2020 లో 7గురు డెంగ్యూ రోగులను గుర్తించారు. అధికార గణాంకాల ప్రకారం మొత్తం 13 మంది డెంగ్యూ రోగుల్లో నలుగురు సౌత్ ఢిల్లీ కార్పోరేషన్ పరిధికి చెందిన వారుగా గుర్తించారు. అదే సమయంలో, ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చిన 22మంది రోగులు డెంగ్యూ చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. అయితే డెంగ్యూ అనేది నిర్దిష్ట చికిత్స లేదా వ్యాక్సిన్ లేని వైరల్ వ్యాధి కాబట్టి ప్రతీ ఒక్కరు దోమలతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వ్యాధిని కలిగి ఉన్న దోమలు ముఖ్యంగా పట్టణ వాతావరణాలకు అనుకూలంగా ఉంటాయని, వాటి పరిధి సమశీతోష్ణ ప్రాంతాల వైపు ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని పరిశోధకులు సైతం తెలిపారు. 1996 నుంచి ప్రతీ సంవత్సరం జూలై, నవంబర్ మధ్య ఢిల్లీ డెంగ్యూ మహమ్మారి బారిన పడుతోంది. ఈ అంటువ్యాధులను బాగా ఎదుర్కోవటానికి, ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకోవడానికి భౌగోళిక శాస్త్రవేత్తలు, వైరాలజిస్టులు, కీటక శాస్త్రవేత్తలు, ఎపిడెమియాలజిస్టుల బృందం గతంలో ఒక అధ్యయనం చేసింది. ఢిల్లీలో దోమ–లార్వా పెంపకాన్ని నివారించడానికి సుమారు 15వేలకు పైగా ఇళ్లను పురుగుమందులతో పిచికారీ చేశారు. బహిరంగ ఉష్ణోగ్రత తగ్గడంతో, దోమలు సాయంత్రం వేళల్లో ఇళ్ళలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తాయి కాబట్టి సూర్యాస్తమయం అనంతరం తలుపులు / కిటికీలు మూసివేసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చదవండి: కరోనా టీకా సంస్థలకు బూస్ట్ లాక్డౌన్ భయం.. విచ్చలవిడిగా షాపింగ్ -
ఇటలీ పర్యటనకు మేరీకోమ్ దూరం
న్యూఢిల్లీ: భారత బాక్సర్ల టోక్యో ఒలింపిక్స్ సన్నాహాలు మొదలు కానున్నాయి. నాణ్యమైన ప్రాక్టీస్ కోసం బాక్సర్లను ఇటలీ పంపించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం 28 మందితో కూడిన భారత బృందాన్ని ఎంపిక చేసింది. 10 మంది పురుషులు, ఆరుగురు మహిళా బాక్సర్లతో పాటు సహాయ సిబ్బంది వచ్చే వారం ఇటలీకి ప్రయాణం కానున్నారు. ఈ మేరకు 52 రోజుల శిక్షణకు అవసరమయ్యే రూ. 1.31 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 5 వరకు ఇటలీలోని అసిసి నగరంలో జరిగే ఈ శిబిరానికి దిగ్గజ మహిళా బాక్సర్ మేరీకోమ్తోపాటు మరో ఇద్దరు బాక్సర్లు పాల్గొనడం లేదు. డెంగ్యూ కారణంగా మేరీకోమ్, గాయం నుంచి కోలుకుంటోన్న మనీశ్ కౌశిక్ (63 కేజీలు) ... అమెరికాలో ప్రాక్టీస్ చేస్తోన్న కారణంగా వికాస్ (69 కేజీలు) ఈ పర్యటనకు గైర్హాజరు కానున్నారు. అనారోగ్యం తగ్గాక ఢిల్లీలోనే ప్రాక్టీస్ చేస్తానని మేరీకోమ్ చెప్పింది. ‘డెంగ్యూతో బాధపడుతున్నా. ఇప్పుడు బాగానే ఉన్నప్పటికీ ప్రయాణించే ఉద్దేశం లేదు. వచ్చే ఏడాది విదేశాలకు వెళ్లడం గురించి ఆలోచిస్తా. ప్రస్తుతానికి ఢిల్లీలోనే ప్రాక్టీస్ చేస్తా’ అని మేరీ తెలిపింది. ఒలింపిక్స్ పతకావకాశాలున్న అమిత్ పంఘాల్ (52 కేజీలు), ఆశిష్ (75 కేజీలు), సతీశ్ (ప్లస్ 91 కేజీలు), సిమ్రన్ (60 కేజీలు), లవ్లీనా (69 కేజీలు), పూజా రాణి (75 కేజీలు) ఈ పర్యటనను వినియోగించుకోనున్నారు. -
అంటువ్యాధులు పరార్
సాక్షి, అమరావతి: గ్రామాల్లో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న పారిశుధ్య కార్యక్రమాలతో అంటువ్యాధులు తగ్గుముఖం పట్టాయి. గత ఏడాదితో పోల్చితే జూన్, జూలై, ఆగస్టులో మలేరియా కేసులు సగానికి పైగా తగ్గగా డెంగీ, డయేరియా 10–20 శాతానికే పరిమితమైనట్లు పంచాయతీరాజ్ శాఖ పరిశీలనలో తేలింది. 13 వేల పంచాయతీల్లో పారిశుధ్య పనులు.. ► ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభంలోనూ, అంతకు ముందు వేసవిలోనూ రాష్ట్రంలోని 13,322 గ్రామ పంచాయతీల పరిధిలో పంచాయతీరాజ్ శాఖ సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టింది. ఓవర్ హెడ్ ట్యాంకు వద్ద మురుగునీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు నిత్యం క్లోరినేషన్, పూడికతీత, బ్లీచింగ్ పౌడర్ చల్లడం లాంటి చర్యలు పెద్ద ఎత్తున చేపట్టారు. ► మండలానికి రెండు గ్రామాల చొప్పున 1,320 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా మనం – మన పరిశుభ్రత పేరుతో చెత్త సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నామమాత్రంగా డెంగీ కేసులు... ► గత ఏడాది జూన్, జూలై, ఆగస్టులో గ్రామీణ ప్రాంతాల్లో 1,163 మలేరియా కేసులు నమోదు కాగా ఈసారి ఇదే కాలంలో కేవలం 601 మాత్రమే నమోదైనట్లు పంచాయతీరాజ్ అధికారులు తెలిపారు. డెంగీ కేసులు గత ఏడాది మూడు నెలల్లో 944 కేసులు నమోదు కాగాఈసారి అదే వ్యవధిలో 24 మాత్రమే గుర్తించారు. ► గత ఏడాది 1,11,685 డయేరియా కేసులు మూడు నెలల్లో నమోదు కాగా, ఈ ఏడాది అదే వ్యవధిలో 20,355 మాత్రమే నమోదయ్యాయి. గతేడాది 9,528 టైఫాయిడ్ కేసులు నమోదు కాగా ఈ ఏడాది 355 కేసులే నమోదయ్యాయి. -
ఏది డెంగీ.. ఏది కరోనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా ఓ వైపు జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటే.. మరోవైపు డెంగీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఎక్కడికక్కడ దోమలు పెరిగిపోతున్నాయి. దీంతో రాబోయే 15 రోజుల పాటు డెంగీ జ్వరాలు విస్తరించే అవకాశముందని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అయితే జ్వ రం వస్తే.. డెంగీదా? లేక కరోనాదా? తెలి యక జనానికి గందరగోళంగా మారింది. ము న్ముందు కరోనాతోపాటు డెంగీ కేసులు కూడా పెరిగే అవకాశం ఉండటంతో వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కిందిస్థాయిలో ఇంటిం టి సర్వే చేసి జ్వర బాధితులను గుర్తించాలని ఆదేశించింది. కరోనా కట్టడి చర్యలను పక్కాగా అమలు చేస్తూనే.. మరోవైపు డెంగీ, మలేరియా, చికున్ గున్యా తదితర వ్యాధుల ను నియంత్రించడంపై వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది. (చదవండి: బాధితులతో రాయ‘బేరాలు’) గతేడాది తీవ్రంగానే డెంగీ.. గతేడాది డెంగీ తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అధికారిక లెక్కల ప్రకారమే అప్పుడు ఏకంగా 13వేల డెంగీ కేసులు నమోదయ్యాయి. సరిగ్గా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో డెంగీ వీరవిహారం చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 1,100 వరకు డెంగీ కేసులు, 600 మలేరియా కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. డెంగీకి, కరోనాకు కామన్గా రెండింటికీ ఒకే తరహా లక్షణాలుండటంతో ఏదేంటో అంతుబట్టడం లేదని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, బాగా నీరసంగా ఉండటం డెంగీలో ఉండే సాధారణ లక్షణాలు. ఇవే కరోనాలో కూడా ఉండటంతో బాధితులు తమకు ఏది సోకిందో టెస్టులు జరిగి నిర్ధారణయ్యే వరకు తెలుసుకోలేకపోతున్నారు. ప్రస్తుతం రెండూ కలిసి వచ్చే అవకాశాలున్నాయా అన్న భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో రెండింటినీ ఒకేసారి ఎదుర్కోవాల్సి రావడం వైద్య యంత్రాంగానికి సవాల్గా మారింది. ఈ నేపథ్యంలోనే ఒక్కో ఆశ కార్యకర్త 50 ఇళ్లకు వెళ్లి జ్వర పరీక్షలు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశించింది. కరోనా కాలం కావడంతో ఉన్న సిబ్బంది అంతా దానికోసమే పనిచేయాల్సి వస్తోంది. దీంతో ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత దృష్ట్యా తక్షణ నియామకాలు చేపట్టాలని సర్కారు ఆదేశించినప్పటికీ.. చాలాచోట్ల తాత్కాలిక నియామకాలకే నోటిఫికేషన్లు ఇవ్వడంతో భర్తీ ప్రక్రియ ముందుకుసాగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. (చదవండి: తెలంగాణలో 1682 కేసులు, 8 మంది మృతి) జిల్లాలకు ఇవే మార్గదర్శకాలు.. ⇒ ప్రతి జిల్లాలోనూ కరోనా కేసులు ఎక్కువున్న ప్రాంతాలు, తక్కువ ఉన్న ప్రాంతా లు, అసలు కేసులు నమోదు కాని ప్రాంతాలుగా వేర్వేరుగా విభజించాలి. ⇒ దోమల నిర్మూలన కార్యక్రమాన్ని చేపడుతూనే కరోనా నిబంధనలను పాటించడంపై ప్రజలను చైతన్యం చేయాలి. ⇒ కరోనా జాగ్రత్తలతోపాటు ఇళ్లు, పరిసరా ల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. ⇒ అన్ని ఆరోగ్య కేంద్రాల్లోనూ డెంగీ, మలేరియా చికిత్సకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలి. ⇒ డెంగీ, మలేరియా ప్రభావిత ప్రాంతాల్లో ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి జ్వర నిర్ధారణ చేయాలి. ⇒ మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలతో కలసి దోమల నిర్మూలన కార్యక్రమాల ను చేపట్టాలి. æ డెంగీ, కరోనా రెం డూ ఉన్న వ్యక్తులను గుర్తిస్తే వెంటనే సమీపం లోని ఆసుపత్రికి సమాచారమివ్వాలి. -
54 శాతం తగ్గిన సీజనల్ వ్యాధులు
ముంబై: కోవిడ్ -19 లాక్డౌన్ కారణంగా.. నగరంలో డెంగ్యూ, మలేరియా, కుష్టు వ్యాధి కేసులు గత ఐదేళ్లలో ఇదే కాలంతో పోలిస్తే.. ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో 54 శాతం తగ్గాయని బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎమ్సీ) వెల్లడించింది. వర్షాకాలం ముందు లాక్డౌన్ అమల్లోకి రావడంతో ఈ ఏడాది బీఎమ్సీ పరిధిలో చేపట్టే వ్యాధి నియంత్రణ చర్యలను ప్రభావితం చేస్తుందనే ఆందోళన వ్యక్తం అయ్యింది. అయితే గత ఐదేళ్ళతో పోల్చితే.. ఈ సంవత్సరం మే వరకు.. ముంబైలో దోమల ద్వారా కలిగే వ్యాధులు అత్యల్ప సంఖ్యలో నమోదయ్యాయని డాటా చూపిస్తుంది. 2016 జనవరి నుంచి మే మధ్య కాలంలో నీరు, దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు 1,762 నమోదయ్యాయని.. అయితే ఈ ఏడాది మే వరకు ఈ వ్యాధుల సంఖ్య 54శాతం తగ్గి 809 కేసులు మాత్రమే వెలుగు చూశాయని డాటా వెల్లడించింది. 2016 మొదటి ఐదు నెలల్లో 114 డెంగ్యూ కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది వీటి సంఖ్య కేవలం 37 మాత్రమే అని బీఎమ్సీ తెలిపింది. దోమల ద్వారా వచ్చే వ్యాధులలో ఈ ఏడాది 71 శాతం తగ్గుదల ఉందన్నది. అదేవిధంగా, 2016లో ఇదే కాలంలో ముంబైలో 1,628 మలేరియా కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది వీటి సంఖ్య 753కు పడిపోయిందని వెల్లడించింది. నగరంలో మే 20 వరకు 19 కుష్టు వ్యాధి కేసులు నమోదయ్యాయి, 2016లో మొదటి ఐదు నెలల్లో ఈ సంఖ్య 20 అని అధికారులు తెలిపారు.(ఏకంగా చైనాను దాటేసిన మహారాష్ట్ర!) ప్రస్తుతం నిర్మాణ కార్యకలాపాలు తగ్గడం వల్ల మలేరియా, ఇతర వ్యాధులు తగ్గాయని ఆరోగ్య అధికారులు తెలిపారు. ‘లాక్డౌన్ సమయంలో ప్రజల కదలికలు 90 శాతం పరిమితం చేయబడ్డాయి. అంతేకాక ప్రజలు పార్కులు, ఆట స్థలాలకు వెళ్లలేదు. నిర్మాణాలపై పరిమితి కారణంగా.. నీరు నిల్వ ఉండే వస్తువులు తగ్గాయి. ఫలితంగా దోమల సంఖ్య కూడా బాగా తగ్గిందని’ అని బీఎమ్సీ అదనపు కమిషనర్ సురేష్ కాకాని అన్నారు. ప్రతి ఏడు వర్షా కాలంలో దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల సంఖ్య పెరుగుతుందని.. అటువంటి రోగుల చికిత్స కోసం కోవిడ్ కాని ఆసుపత్రులను సిద్ధం చేశామని అన్నారు. డెంగ్యూ, మలేరియా, కుష్టువ్యాధి ఉన్న రోగులను కేఈఎమ్ (కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్) ఆసుపత్రితో పాటు ఇతర స్థానిక ఆసుపత్రులకు పంపుతామని కకాని తెలిపారు.(మందు బాబులకు కిక్ ఇచ్చే వార్త) కరోనావైరస్, మలేరియా, డెంగ్యూ, జ్వరం లక్షణాలు ఒకే రకంగా ఉండటం వల్ల రోగులు, వైద్యులలో భయాందోళనలు.. గందరగోళానికి కారణమవుతుందన్నారు. ‘ల్యాబ్ రిపోర్ట్స్ కంటే ముందే డెంగ్యూ, మలేరియాలో కనిపించే అసాధారణమైన ఇతర లక్షణాల వల్ల రోగ నిర్ధారణ చేయగలము. రుచి, వాసన కోల్పోవడం, వేళ్లు, పాదాలపై మచ్చలు వంటి లక్షణాల ద్వారా ఒక అంచనాకు రాగలం. అలాగే ఊఐపిరితిత్తుల గురించి తెలుసుకోవడానికి ఎక్స్-రే సహాయపడుతుంది’ అని హిందూజా ఆసుపత్రిలోని ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ లాన్సెలాట్ పింటో అన్నారు. అంతేకాక గతంలో కోవిడ్ -19, డెంగ్యూతో బాధపడుతున్న రోగులకు చికిత్స అందిచామని ఆయన తెలిపారు. కరోనా రోగికి డెంగ్యూ కూడా ఉంటే ఆరోగ్యపరిస్థితులు మరింత విషమిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.(తుంపర్లు.. యమకింకర్లు!) -
వ్యాధులనుంచి ప్రజలను కాపాడుకుందాం
సాక్షి, హైదరాబాద్: సీజనల్ వ్యాధుల నివారణ లక్ష్యంగా పు రపాలక శాఖ ఆధ్వర్యంలో శ్రీ కారం చుట్టిన ‘ప్రతి ఆదివారం– పది గంటలకి –పది నిమిషాలు’ కార్యక్రమంలో రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులందరూ పాల్గొనడంతో పాటు ప్రజలు పాల్గొనేలా ప్రోత్సహించాలని ఆ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. వర్షాకాలంలో ప్రబలే డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా వంటి వ్యాధులను నివారిద్దామని కోరారు. రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులందరికీ మంత్రి కేటీఆర్ ఆదివారం లేఖ రాశారు. సీజనల్ వ్యాధుల నివారణకు కట్టుదిట్టమైన ప్రణాళికతో సిద్ధంగా ఉన్నామని ఈ లేఖలో తెలిపారు. కరోనాపై చేస్తున్న స మష్టి పోరాటం వల్ల ప్రజారో గ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై అందరిలో అవగాహన పెరిగిందన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు విజృంభించ కుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే అదేశించారని, పట్టణ ప్రగతిలో భాగంగా భారీ ఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టామన్నారు. దోమల నివారణకు జాగ్రత్తలు పాటిస్తే ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చన్నారు. ఇందుకోసం వారానికి కనీసం 10 నిమిషాలను మన కోసం, మన పరిసరాల పరిశుభ్రత కోసం కేటాయించాలని నిర్ణయించామన్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు ఆరోగ్య శాఖ సహకారంతో పురపాలక శాఖ ఒక క్యాలెండర్ రూపంలో ప్రత్యేక ప్రణాళిక రూపొందించిందన్నారు. ఇందులో భాగంగా కీటక నివారిణిల వినియోగం, దోమల నిర్మూలనకు మలాథియాన్ స్ప్రే, ఆయిల్ బాల్స్, ఫాగింగ్ చేయాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని వారానికోసారి స్ప్రే చేస్తున్నామన్నారు. మురికి కాల్వల పూడిక తీత, లోతట్టు ప్రాంతాల్లో నిలిచి న నీటిని ఎత్తిపోయడం, రోజూ చెత్త తరలింపును పకడ్బందీగా నిర్వహించాలని పురపాలికల ను ఆదేశించామన్నారు. ఆదివారం శుభ్రత కోసం.. మన ప్రజలను, పట్టణాలను కా పాడుకునే కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములు చేసేందుకు గత వారం ‘ప్రతి ఆదివారం –పది గంటలకు–పదినిమిషాలు’ కార్యక్రమాన్ని ప్రారంభించామని,. రానున్న పదివారాల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నా రు. శాసన సభ్యులు ముందుగా ఈ కార్యక్రమాన్ని తమ ఇళ్ల నుంచే ప్రారంభించాలని, తర్వాత తమ పరిధిలోని పట్టణాల్లో విస్తృతంగా తిరుగుతూ ఆరోగ్యంపై ప్రజల్లో చైతన్యం కల్పించాలన్నారు. డాక్యుమెంట్ రైటర్స్ రూ.4లక్షల విరాళం ముఖ్యమంత్రి సహాయనిధికి తెలంగాణ డాక్యుమెంట్ రైటర్స్ సంక్షేమ సంఘం రూ. 4 లక్షల విరాళాన్ని అందించింది. ఆదివారం రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, జగదీశ్రెడ్డితో కలిసి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివనాగేశ్వర్రావు, ప్రధాన కార్యదర్శి మురళి కృష్ణమాచారి తదితరులు ప్రగతి భవన్లో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు చెక్కును అందజేశారు. -
కరోనా నెగెటివ్ వచ్చిన డాక్టర్ మృతి
తిరువొత్తియూరు: కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన ఓ డాక్టర్.. డెంగీ జ్వరంతో ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ మృతి చెందారు. విషయం తెలిసి అతని తల్లి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన కోవై జిల్లా కుట్టుపాళయం సమీపం, సిరుముగై రాంనగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈరోడ్ జిల్లా తాళవాడి సమీపంలోని తెంగుమరవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జయమోహన్ (29) వైద్యుడిగా పని చేస్తున్నాడు. కొన్నిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 12వ తేదీన జయమోహన్ డిశ్చార్జ్ అయ్యాడు. కాగా మళ్లీ ఆరోగ్యం బాగలేకపోవడంతో కుటుంబ సభ్యులు మేట్టుపాళయంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. (బగ్గా వైన్ షాప్ పేరుతో ఆన్లైన్లో మోసం) అక్కడి డాక్టర్లు కోవైలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి పంపించారు. తీవ్ర జ్వరం ఉన్న అతనికి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ అని తేలింది. మరోసారి అతనికి పరీక్షలు చేయించగా డెంగీ ఉన్నట్లు నిర్ధారణ అయింది. మంగళవారం రాత్రి పరిస్థితి విషమించడంతో అతడు మృతి చెందాడు. కన్నకొడుకు మరణించాడన్న విషయం తెలిసి అతని తల్లి జ్యోతి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా ఆమెను ఇరుగుపొరుగు వారు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. (భార్యతో సైకిల్పై 120 కిలోమీటర్లు..) -
డెంగీని దూరం పెట్టే దోమలు!
డెంగీ పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది దోమే. ఈ దోమలు గనక డెంగీ కారక వైరస్ను తమ శరీరంలోకి రానివ్వకపోతే వ్యాధన్నదే లేదు. ఇదే అంశాన్ని ఆధారంగా చేసుకుని కాలిఫోర్నియా యూనివర్శిటీ శాస్త్రవేత్త ఒమర్ అక్బరీ ఓ విన్నూతమైన ప్రయత్నం చేశారు. డెంగీ వైరస్ను దూరంగా పెట్టేలా దోమలను డిజైన్ చేశారు. అంటే ఈ దోమలతో డెంగీ అస్సలు వ్యాపించదన్నమాట. పీఎల్ఓఎస్ పాథోజెన్స్ జర్నల్లో పరిశోధన తాలూకూ వివరాలు ప్రచురితమయ్యాయి. నాలుగు వెరైటీల డెంగీ వైరస్లను దూరంగా పెట్టేలా కొత్త రకం దోమలును డిజైన్ చేశారు. డెంగీని వ్యాప్తి చేసే ఆడ దోమల్లో ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఓ యాంటీబాడీ ఉత్పత్తి అయ్యేలా చేశారు. దీంతో ఆడదోమ రక్తం పీల్చుకోగానే ఈ యాంటీబాడీ పనిచేయడం మొదలవుతుంది. ఈ రకమైన దోమల సాయంతో అన్ని దోమజాతుల్లోనూ ఈ యాంటీబాడీ ఉత్పత్తి అయ్యేలా చేయవచ్చునని ఒమర్ అక్బరీ తెలిపారు. మనిషి రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన జన్యువులను దోమల్లోకి ప్రవేశపెట్టి అవి వ్యాధులను అడ్డుకునేలా చేయడం ఈ పరిశోధన తాలూకూ విశేషం. దోమల ద్వారా వచ్చే ఇతర వ్యాధులను కూడా ఈ పద్ధతితో అడ్డుకోవచ్చునని అంచనా. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ఉష్ణమండల ప్రాంతాల్లో డెంగీ సమస్య కొన్ని లక్షల మందిపై ప్రభావం చూపుతోంది. ఆసియా, లాటిన్ అమెరికాల్లో ఈ వ్యాధి కారణంగా చాలామంది పసిపిల్లలు మరణిస్తున్నారు కూడా. ప్రస్తుతం ఈ వ్యాధికి సరైన చికిత్స లేకపోగా.. లక్షణాలను నియంత్రిస్తూ వేచి ఉండటమే ప్రస్తుతం ఆచరిస్తున్న పద్ధతి. -
చినజీయర్కు లేఖ రాస్తా : జగ్గారెడ్డి
సాక్షి, సంగారెడ్డి : చినజీయర్ స్వామి తన వద్దకు వచ్చే ధనిక భక్తుల ద్వారా క్యాన్సర్ పేషెంట్లను ఆదుకునేలా ట్రస్ట్ ఏర్పాటు చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. డెంగ్యూ, క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి ప్రజలను ఆదుకోమని చినజీయర్తోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాస్తానని ఆయన తెలిపారు. ప్రభుత్వం స్పందించకుంటే ప్రజల ఆరోగ్యం కోసం మహా ఉద్యమం చేపడతానన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో డెంగ్యూ, క్యాన్సర్ వ్యాధులు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాయి. స్లమ్ ఏరియాలోని ప్రజలకు ఎక్కువగా డెంగ్యూ వస్తోంది. సంగారెడ్డి ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్స్ కూడా అందుబాటులో లేవు. ఆసుపత్రికి వెళితే దాదాపు రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చవుతూ ప్రజలు అప్పులపాలవుతున్నారు. మరోవైపు క్యాన్సర్ చికిత్సకు రూ.లక్ష నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చవుతుంది. డెంగ్యూను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కేసీఆర్కు లేఖ రాస్తా. ప్రజలకు ఆర్థిక భారం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి’ అని జగ్గారెడ్డి కోరారు. -
కుట్టకుండా కాదు.. పుట్టకుండా..
సాక్షి, హైదరాబాద్ : డెంగీ నియంత్రణ చర్యలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ శ్రీకారం చుట్టింది. దోమల ఉత్పత్తికి బ్రేక్ వేసేందుకు రంగం సిద్ధం చేసింది. రేడియేషన్ ద్వారా పునరుత్పత్తి లేని మగ దోమలను ఉత్పత్తి చేసి, వాటిని ఆడ దోమలపైకి వదలడం ద్వారా వ్యాప్తిని అడ్డుకోవాలనేది దీని ఉద్దేశం. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ శుక్రవారం కీలకమైన నివేదిక విడుదల చేసిందని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి. అంటే జన్యుమార్పిడి దోమలను ఉత్పత్తి చేయడం ద్వారా, క్రమంగా దోమలన్నింటినీ నిర్మూలించాలనేది దీని ఉద్దేశమని ఆ వర్గాలు విశ్లేషించాయి. ఇదిలావుంటే గతేడాది బ్రిటన్కు చెందిన ఒక ప్రముఖ సంస్థ దోమల ద్వారా వచ్చే వ్యాధులను నివారించేందుకు ఇలాంటి ప్రతిపాదనను భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేసిందని వ్యవసాయంలో జన్యు మార్పిడి నిపుణులు డి.నర్సింహారెడ్డి పేర్కొన్నారు. జన్యుమార్పిడి పద్ధతి కావడంతో దీనికి కేంద్రం అనుమతి ఇవ్వలేదని ఆయన వివరించారు. స్టెరైల్ క్రిమి టెక్నిక్ను మొదట అమెరికా వ్యవసాయశాఖ అభివృద్ధి చేసింది. పంటలు, పశువులపై దాడి చేసే కీటకాలు, తెగుళ్లను లక్ష్యంగా చేసుకొని విజయవంతంగా ఉపయోగించారు. ఈ సాంకేతికతను మానవ వ్యాధులపై ప్రవేశపెట్టడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రయత్నిస్తోంది. మగ దోమలను సేకరించి వాటిని తమ లేబొరేటరీలో వాటి గుడ్ల ద్వారా అనేక రెట్ల దోమలను సృష్టిస్తుంది. వాటిని రేడియేషన్ పద్ధతిలో స్టెరిలైజేషన్ చేయడం ద్వారా వాటిలో పునరుత్పత్తి లక్షణం పోతుంది. అనంతరం వాటిని దోమలున్న ప్రాంతాల్లో విడుదల చేస్తారు. అయితే ఇదంతా ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉంది. సాధ్యాసాధ్యాలపై అస్పష్టత ఉన్నా అందుబాటులోకి వస్తే మాత్రం ఆశించిన ఫలితం ఉండనుంది. దోమల స్టెరిలైజేషన్ ఎలా? మున్ముందు ప్రపంచ జనాభాలో సగం మందికి డెంగీ ప్రమాదం పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు. ‘డెంగీ నివారణకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నా, దోమల నియంత్రణకు చేపడుతున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడంలేదు. అందువల్ల కొత్త విధానాలు చాలా అవసరం. ఇందులో దోమల స్టెరిలైజేషన్ పద్ధతి ఆశాజనకంగా ఉంది’ అని ఆమె ఆ నివేదికలో అభిప్రాయపడ్డారు. డెంగీ, చికున్గున్యా, జికా వంటి వ్యాధులను నియంత్రించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రయత్నాల్లో భాగంగా రేడియేషన్ ఉపయోగించి మగ దోమలను పునరుత్పత్తి రహితంగా చేసే సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలని సూచించింది. స్టెరైల్ క్రిమి టెక్నిక్ మొదట అమెరికా వ్యవసాయశాఖ అభివృద్ధి చేసింది. పంటలు, పశువులపై దాడి చేసే కీటకాలు, తెగుళ్లను లక్ష్యంగా చేసుకొని విజయవంతంగా ఉపయోగించారు. మానవ వ్యాధులపై పోరాడటానికి ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆరోగ్య రంగానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాల విశ్లేషణ ప్రకారం జన్యుమార్పిడి, రేడియేషన్ ద్వారా స్టెరిలైజేషన్ చేయడంలో ప్రసిద్ధి చెందిన ఏదో ఒక సంస్థను ఎంచుకుంటారు. ఆ సంస్థ మగ దోమలను సేకరించి వాటిని తమ లేబరేటరీలో వాటి గుడ్ల ద్వారా అనేక రెట్లు దోమలను సృష్టిస్తుంది. వాటిని రేడియేషన్ పద్ధతిలో స్టెరిలైజేషన్ చేయడం ద్వారా వాటిలో పునరుత్పత్తి లక్షణం పోతుంది. అనంతరం వాటిని దోమలున్న ప్రాంతాల్లో విడుదల చేస్తారని నిమ్స్ ప్రముఖ వైద్యులు డాక్టర్ గంగాధర్ అభిప్రాయపడ్డారు. దీన్నే జన్యుమార్పిడి దోమల ఉత్పత్తి అంటారని ఆయన వివరించారు. పట్టణీకరణ వల్లే... వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం తెలంగాణలో ఈ ఏడాది ఇప్పటివరకు 40 వేల మందికి పైగా డెంగీ పరీక్షలు చేస్తే, వారిలో పావు వంతు మందికి డెంగీ నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తున్నది. దేశంలో రెండో స్థానంలో తెలంగాణ ఉందని కేంద్ర ప్రభుత్వమే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో డెంగీ నివారణ పద్ధతులపై రాష్ట్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం వేగవంతమైన ప్రణాళికలేని పట్టణీకరణ, పెరిగిన తేమ, విస్తరించిన వర్షాకాలం, వాతావరణ పరిస్థితులలో వైవిధ్యం ఫలితంగా డెంగీ విజృంభిస్తోంది. అలాగే పేలవమైన నీటి నిల్వ పద్ధతులు దోమల వ్యాప్తికి అనుకూలంగా ఉంటున్నాయి. 2019లో భారతదేశంలో గణనీయంగా డెంగీ కేసులు పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. -
డెంగీ కేసుల్లో కారేపల్లి మొదటి స్థానం
సాక్షి, కారేపల్లి: డెంగీ కేసుల్లో కారేపల్లి మండలం జిల్లాలో మొదటి స్థానంలో ఉందని ఖమ్మండీపీఓ కే. శ్రీనివాసరెడ్డి, డీఎంఅండ్హెచ్ఓ కళావతిబాయి ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం కారేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ కార్యదర్శులతో వారు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ కార్యదర్శులు బాధ్యతాయుతంగా పని చేయాలని, లేదంటే డెంగీ మరణాలు సంభవించే ప్రమాదం ఉందని అన్నారు. ఖమ్మం జిల్లాలో ఉన్న మూడు ఏజెన్సీ మండలాల్లో సింగరేణి మండలం డెంగీ కేసుల్లో మొదటి స్థానంలో ఉందని, జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కారేపల్లి మండలాన్ని డెంగీ బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యంపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, ప్రతి మంగళ, శుక్రవారాల్లో డ్రైడే కార్యక్రమాన్ని విధిగా నిర్వర్తించాలన్నారు. డెంగీ దోమల నివారణ చర్యల పై ప్రజలకు అవగహన కల్పించాలని వారు సూచించారు. మండలంలో కారేపల్లి, నానునగర్తండా, గాదెపాడు, వెంకిట్యాతండా, భల్లునగర్తండా, విశ్వనాథపల్లి, లింగం బంజర, భాగ్యనగర్తండా, ఉసిరికాయపల్లి, చీమలపాడు గ్రామాల్లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని అన్నారు. గ్రామ కార్యదర్శులు డెంగీ కేసులపై తగిన చర్యలు తీసుకోకపోతే మీ రెగ్యులైజేషన్ను నిలిపివేస్తామని డీపీఓ హెచ్చరించారు. చికెన్ గున్యా వచ్చినప్పుడు ఒళ్లు నొప్పులు తగ్గించుకునేందుకు వాడే పెయిన్ కిల్లర్ టాబ్లెట్లతో కిడ్నీలపై ప్రభావం పడి మృత్యువాత పడే ప్రమాదం ఉందని డీఎంహెచ్ఓ సూచించారు. అనంతరం భారత్ నగర్ కాలనీ వీధుల్లో రోడ్లపై పారుతున్న మురికి గుంతల సమస్యను తక్షణమే పరిష్కరించాలని జిల్లా అధికారులు కార్యదర్శిని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో డీఎంఓ సైదులు, ఎంపీపీ శకుంతల, ఫార్మసీ విభాగ పర్యవేక్షకురాలు నాగమణి, పీహెచ్సీ వైద్యాధికారి వై. హన్మంతరావు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న డెంగీ మరణాలు
మంచిర్యాల జిల్లాలో డెంగీ కాటుకు బలవుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. అవగాహన కల్పించడంలో వైద్య ఆరోగ్యశాఖ వైఫల్యం, పారిశుధ్యం మెరుగుపరచడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం సాక్షిగా డెంగీ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే 15 మంది డెంగీ కారణంగా మృత్యువాత పడినా.. ఒక్కరే మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. కేవలం వారం వ్యవధిలోనే 17 మందికి డెంగీ సోకినట్లు అధికారిక వర్గాలే వెల్లడించడం జిల్లాలో పరిస్థితి తీవ్రతను తెలియచేస్తోంది. సాక్షి, మంచిర్యాల: జిల్లాలో డెంగీతో మృత్యువాత పడ్డ వారి వివరాలు (అనధికారికంగా) : జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీనగర్లో ఒకే కుటుంబానికి చెందిన గుడిమల్ల రాజగట్టు(30), అతని భార్య సోనీ (28), కూతురు శ్రీవర్షిణి (6), తాత ఈదా లింగయ్య (80) మృతి. (ఇందులో సోనీ డెంగీతో మృతిచెందినట్లు అధికారికంగా వెల్లడించారు.) కాసిపేట మండలానికి చెందిన రాందేవ్ మృతి. (డెంగీ సోకినట్లు కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రి నిర్ధరించింది.) కాసిపేట మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన విద్యార్థి సౌందర్య(19). కాసిపేట మండలం సోమగూడెంకు చెందిన దుగుట పోశం (64). కాసిపేట మండలం కోమటిచేనుకు చెందిన జాడి మల్లయ్య (53). కాసిపేట మండలం రేగులగూడకు చెందిన నవీన్ (20). క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బీజోన్ రాంనగర్కు చెందిన యువతి కల్వల స్నేహా (23). తాండూర్ మండలం రేచినికి చెందిన గొర్రెల కాపరి గుడిముర్కి తిరుపతి (37) తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ మృతి. భీమారం మండలం కొత్తపల్లి›గ్రామానికి చెందిన ఆకుల రాజశ్రీ (19) డెంగీ జ్వరంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి. జన్నారం మండలం మొర్రిగూడకు చెందిన కామెర పోశం. జన్నారం మండలం దేవునిగూడకు చెందిన అనిల్రావు. బెల్లంపల్లి మండలం మాలగురిజాల గ్రామానికి చెందిన దుగుట లక్ష్మి. నెన్నెల మండల కేంద్రానికి చెందిన జంపాల రాజేశ్వరి. వారం రోజుల్లోనే 17 మందికి డెంగీ వరుసగా వర్షాలు కురుస్తుండడం.. పారిశుధ్య లోపం.. డెంగీ జ్వరాలపై అవగాహన కల్పించకపోవడంతో జిల్లాలో డెంగీ విజృంభణ కొనసాగుతోంది. జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని శ్రీశ్రీనగర్ కాలనీకి చెందిన నలుగురు కుటుంబసభ్యులను డెంగీ బలి తీసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే. డెంగీ జ్వరాలు జిల్లాలో ప్రమాదకరంగా మారినా యంత్రాంగం మాత్రం తమ నిద్రమత్తును వదలడం లేదు. అవి డెంగీ మరణాలు కావంటూ కొట్టిపారేస్తూ.. మరణాలను తక్కువ చేసి చూపించే ప్రయత్నానికే ప్రాధాన్యతనిస్తున్నారు. కాని పారిశుధ్యాన్ని మెరుగుపరచడం, ప్రమాదకర డెంగీ జ్వరంపై అవగాహన కల్పించడాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో రోజురోజుకూ డెంగీ జ్వరపీడితుల సంఖ్య పెరిగిపోతోంది. అధికారిక లెక్కల ప్రకారమే డెంగీ నిర్ధారణ కేసులు కేవలం వారం వ్యవధిలో 17 కేసులు పెరగడం పరిస్థితికి అద్దం పడుతోంది. అక్టోబర్ 29వరకు జిల్లావ్యాప్తంగా 67 మందికి డెంగీ సోకినట్లు అధికారికంగా వెల్లడించారు. మంగళవారం నాటికి ఆ సంఖ్య 84కు చేరుకుంది. అంటే కేవలం వారం రోజుల్లోనే 17 మందికి డెంగీ సోకినట్లయ్యింది. 15 మంది మృత్యువాత జిల్లాలో డెంగీ మరణాలు ఆగడం లేదు. డెంగీ జ్వరాలతో మంచిర్యాలలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మరణం తరువాత కూడా డెంగీ మరణాలు కొనసాగుతుండడం ఆందోళనకరంగా మారింది. ఇప్పటివరకు మంచిర్యాలలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు, కాసిపేట మండలంలో ఐదుగురు, ఇతర మండలాల్లో కలిపి మొత్తం 15 మంది డెంగీతో మరణించినట్లు ఆయా కుటుంబసభ్యులు చెబుతున్నారు. అయితే వీరంతా సాధారణ జ్వరాలు, ఇతరత్రా వ్యాధుల కారణంగానే మరణించినట్లు వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు. కేవలం మంచిర్యాలకు చెందిన సోనీ మాత్రమే డెంగీతో మృతి చెందినట్లు చెబుతున్నారు. నివారణ చర్యలేవి..? జిల్లాలో ఓ వైపు డెంగీ జ్వరాలు విజృంభిస్తుంటే మరోవైపు నివారణ చర్యలు నామమాత్రంగా మారాయి. 15 మంది మృత్యువాత పడినా.. వందలాది మందికి డెంగీ ప్రబలుతున్నా.. సంబంధిత అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదు. ఎంతసేపూ.. అవి డెంగీ మరణాలు కావని చెప్పడానికే అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు తప్పితే.. ఏ జ్వరమైనా ప్రాణాలు పోవడం నిజమనే విషయాన్ని మాత్రం మరచిపోతున్నారు. పైగా 84 మందికి డెంగీ పాజిటివ్ వచ్చినట్లు అధికారులే వెల్లడించినా.. డెంగీ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు పెద్దగా కనిపించడం లేదు. మంచిర్యాలలో నలుగురు మరణించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపడంతో ఆ కాలనీలో కాస్త హడావుడి చేశారు. ఆ తర్వాత ఆ ఊసే మర్చిపోయారు. జిల్లా కేంద్రంలోనే పారిశుధ్యం అధ్వానంగా మారింది. దోమల నివారణకు మందు పిచికారీ చేయడం, పరిసరాలను పరిశుభ్రంగా మార్చడం, నీటి నిలువను లేకుండా చేయడంవంటి చర్యలు కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతున్నాయి. పైగా డెంగీ జ్వరాలపై ప్రజలకు అవగాహన కల్పించడంపై అధికార యంత్రాంగం దృష్టిపెట్టడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఆ కుటుంబానికి మరో షాక్
సాక్షి, మంచిర్యాల : డెంగీ విషజ్వరం ఇప్పటికే ఆ కుటుంబంలో నలుగురిని బలి తీసుకోంది. పదిహేను రోజుల వ్యవధిలో ఆ కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు డెంగీ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదాన్ని జీర్ణించుకోకముందే.. ఆ కుటుంటానికి మరో షాక్ తగిలింది. రెండు రోజుల క్రితం జన్మించిన బాబు కూడా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా కేంద్రం శ్రీశ్రీనగర్లో నివాసం ఉంటున్న గుడిమల్ల రాజగట్టు, సోని దంపతుల కుటుంబంలో డెంగీ విషాదాన్ని మిగిల్చింది. తొలుత రాజగట్టు, ఆ తర్వాత అతని తాత లింగయ్య డెంగీ బారిన పడి మృతి చెందారు. వీరి మృతిని జీర్ణించుకోకముందే రాజగట్టు, సోని దంపతుల కుమార్తె శ్రీవర్షిణి (6)కి డెంగీ జ్వరం వచ్చింది. స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత నెల 27న దీపావళిరోజు మృతి చెందింది. అప్పటికే సోనీకి నెలలు నిండటం.. ఆమెకు కూడా డెంగీ లక్షణాలున్నాయని వైద్యులు నిర్ధారించారు. దీంతో మెరుగైన వైద్యం కోసం సోనిని గత నెల 28న సికింద్రాబాద్లోని యశోదా ఆస్పత్రిలో చేర్చారు. మంగళవారం మధ్యాహ్నం సిజేరియన్ ద్వారా సోని మగబిడ్డకు జన్మనిచ్చింది. శిశువుకు కూడా డెంగీ సోకడంతో ఐసీయూ ఉంచి తల్లీ బిడ్డలకు చికిత్సను అందజేశారు. అయితే బుధవారం మధ్యాహ్నం తల్లి సోని మృతి చెందింది. దీంతో సోనికి జన్మించిన శిశువును ప్రస్తుతం మంచిర్యాలలోని మహాలక్ష్మి ఆస్పత్రిలో అబ్జర్వేషన్లో ఉంచారు. అయితే ప్రస్తుతం ఆ శిశువుకు రక్తకణాలు తగ్గినట్టు వైద్యులు గుర్తించారు. బాబు పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన వైద్యులు రాజగట్టు తల్లిదండ్రులను, అతని పెద్దకొడుకు శ్రీవికాస్ను(8) ఆస్పత్రికి పిలిపించారు. వారి రక్త నమునాలను సేకరించి డెంగీ నిర్ధారణ పరీక్షలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చదవండి : డెంగీతో ఒకే కుటుంబంలో నలుగురు మృతి -
కుటుంబంలో నలుగురిని మింగిన డెంగ్యూ
-
డెంగీతో ఒకే కుటుంబంలో నలుగురు మృతి
సాక్షి, మంచిర్యాల/మంచిర్యాలటౌన్ /రాంగోపాల్పేట్: తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో డెంగీ విజృంభిస్తోంది. ఓ కుటుంబాన్ని వీడని నీడలా వెంటాడి ఛిద్రం చేసేసింది డెంగీ. పదిహేను రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో నలుగురు వ్యక్తులు డెంగీ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. తొలుత భర్త, తర్వాత భర్త తరఫు తాత, ఆపై ముద్దుల కూతురు..ఇప్పుడు ఏకంగా జన్మనిచ్చిన బిడ్డను చూసుకోకుండానే తల్లినే కబళించేసింది మహమ్మారి డెంగీ జ్వరం. వైద్యాధికారుల్ని, ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసే ఈ హృదయ విదారకర ఘటనల వివరాలిలా ఉన్నాయి. ఒకరి వెనుక ఒకరు.. మంచిర్యాల జిల్లా కేంద్రం శ్రీశ్రీనగర్లో నివాసం ఉంటోన్న ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడు గుడిమల్ల రాజగట్టు (30), సోని (28) దంపతులు. రాజగట్టుకు జ్వరం రావటంతో ఈనెల 12న స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చేరి, మూడ్రోజుల పాటు చికిత్స తీసుకున్నాడు. ఎంతకూ జ్వరం తగ్గకపోగా పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 16న మృతిచెందాడు. మృతుడికి సంబంధించిన ఐదోరోజు కర్మ కార్యక్రమాలను నిర్వహిస్తుండగానే రాజగట్టు తాత లింగయ్య(80)కు జ్వరం వచ్చింది. దీంతో లింగయ్యను అదేరోజు రామకృష్ణాపూర్ సింగరేణి ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఈ నెల 20న మరణించాడు. వీరి మృతిని జీర్ణించుకోకముందే రాజగట్టు, సోని దంపతుల కుమార్తె శ్రీవర్షిణి (6)కి డెంగీ జ్వరం వచ్చింది. స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 27న దీపావళిరోజు మృతి చెందింది. అప్పటికే సోనీకి నెలలు నిండటం..ఆమెకు కూడా డెంగీ లక్షణాలున్నాయని వైద్యులు నిర్ధారించడంతో.. వైద్యం కోసం ఈనెల 28న సికింద్రాబాద్లోని యశోదా ఆస్పత్రిలో చేర్చారు. మంగళవారం మధ్యాహ్నం సిజేరియన్ ద్వారా సోని మగబిడ్డకు జన్మనిచ్చింది. శిశువుకు కూడా డెంగీ సోకడంతో ఐసీయూ ఉంచి తల్లీ బిడ్డలకు చికిత్సను అందజేశారు. అయితే బుధవారం మధ్యాహ్నం తల్లి సోని మృతి చెందింది. సోనీని, ఆమెకు పుట్టబోయే బిడ్డనూ ఎలాగైనా రక్షించుకోవాలన్న తాపత్రయంతో రూ.లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆమె మృతదేహాన్ని బుధవారం రాత్రి మంచిర్యాలకు తరలించారు. స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆస్పత్రి వర్గాలతో మాట్లాడి మృతదేహం తరలింపునకు ఉచితంగా అంబులెన్సును సమకూర్చారు. అనంతరం ఆ కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. మిగిలింది ఇద్దరే.. ఒకే కుటుంబంలో డెంగీ మహమ్మారి నలుగుర్ని పొట్టనబెట్టుకోవడంతో ఆ కుటుంబం ఇద్దరు మాత్రమే మిగిలారు. మంగళవారం సోనికి జన్మించిన మగశిశువు(3రోజులు)తో పాటు, పెద్దకుమారుడు శ్రీవికాస్. ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉండటంతో కుటుంబసభ్యులు తల్లడిల్లిపోతున్నారు. కన్నీరుమున్నీరవుతున్న కుమారుడు.. కేవలం 15 రోజుల వ్యవధిలో నలుగురిని కోల్పోవడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకే కుటుంబంలోని తల్లి, తండ్రి, చెల్లెలు ఒకరి తరువాత ఒకరిని కోల్పోయిన రాజగట్టు సోని దంపతుల కుమారుడు శ్రీవికాస్(8)ను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. -
మూడు తరాలను కబళించిన డెంగీ
-
మూడు తరాలను కబళించిన డెంగీ
సాక్షి, మంచిర్యాల : డెంగీ విషజ్వరం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆ కుటుంబంలోని మూడు తరాలను డెంగీ కబళించింది. డెంగీ బారినపడి 15 రోజుల వ్యవధిలో ఆ కుటుంబంలోని నలుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 16న మంచిర్యాలకు చెందిన రాజ గట్టు డెంగీతో మృతిచెందాడు. ఆ తర్వాత 27వ తేదీన అతని కూతురు కూడా డెంగీ బారినపడి మరణించారు. తాజాగా అతని భార్య సోని సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గర్భవతి అయిన సోని మంగళవారం మగశిశువుకు జన్మనిచ్చారు. అయితే డెంగీతో పోరాడుతూ బుధవారం 2.30 గంటల ప్రాంతంలో సోని మృతిచెందారు. అయితే అంతకుముందే.. రాజ గట్టు తాత లింగయ్య డెంగీతో మరణించాడు. డెంగీ బారినపడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందడంతో.. మంచిర్యాల జిల్లా ప్రజలు భయాందోళన వ్యక్తం చేశారు. మరోవైపు మంచిర్యాల జిల్లాలో డెంగీ విస్తరిస్తోంది. బుధవారం జిల్లాలోని భీమారం మండలం కొత్తపల్లికి చెందిన రాజశ్రీ అనే వివాహిత డెంగీ జ్వరంతో మృతిచెందారు. -
తగ్గని జ్వరాలు
సాక్షి, హైదరాబాద్: వర్షాలు ఆగట్లేదు. వ్యాధులు తగ్గ ట్లేదు. జనానికి జ్వరాల బాధలు తప్ప ట్లేదు. జూలైలో ప్రారంభమైన జ్వరాలు ఇప్పటికీ తగ్గట్లేదు. ప్రతి ఇంట్లో ఒకరు జ్వరం బారిన పడ్డారు. డెంగీ, మలేరియా, చికున్గున్యా జ్వరాలు పట్టిపీడిస్తు న్నాయి. తలనొప్పి, ఒళ్లు నొప్పులు, వాం తులు, విరేచనాలతో భయాందోళనకు గురవుతున్నారు. సెప్టెంబర్ చివరి నాటికే వర్షాల తీవ్రత తగ్గిపోవాలి. కానీ అక్టోబర్ నెలాఖరుకు కూడా వర్షాలతో రాష్ట్రం తడిసిముద్దవుతోంది. ఇప్పటికీ సాయం త్రం అయిందంటే చాలు అనేకచోట్ల క్యుములోనింబస్ మేఘాలతో ఒక్క సారిగా కుండపోత వర్షాలు కురుస్తున్నా యి. ఈ వర్షాలు నవంబర్లోనూ కొద్ది రోజులు కొనసాగే పరిస్థితి ఉండటంతో దోమలు మరింత విజృంభించే ప్రమాదం పొంచి ఉంది. రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం ఇద్దరే మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ చెబుతున్నా అనధికారిక సమాచారం ప్రకారం డెంగీ కారణంగా కనీసం 150 మందికిపైగా చనిపోయారు. అందులో ఒక్క నిలోఫర్ ఆసుపత్రిలోనే ఏడుగురు పసి పిల్లలు డెంగీతో చనిపోయారని అక్కడి వైద్యులే ఆఫ్ ది రికార్డు సంభాషణల్లో చెబుతున్నారు. అంకెలను తక్కువ చూపిస్తూ అధికారులు ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దేశంలోనే డెంగీలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని ఏకంగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించిందంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ఒకేసారి రెండు వ్యాధుల విజృంభణ.. డెంగీ, చికున్గున్యా వానాకాలం సీజన్లో వచ్చేవి కాగా, శీతాకాలంలో స్వైన్ఫ్లూ పుంజుకుంటుంది. వర్షాల వల్ల వాతావరణం చల్లగా ఉండటంతో డెంగీ, స్వైన్ఫ్లూ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వానాకాలం, చలికాలంలో వేర్వేరుగా వచ్చే ఈ రెండు వ్యాధులు ఇప్పుడు ఒకేసారి రాష్ట్రంలో విజృంభిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 20 వరకు తెలంగాణలో 1,319 స్వైన్ఫ్లూ కేసులు నమోదు కాగా, 21 మంది చనిపోయారు. దీంతో జ్వరం, తలనొప్పి వస్తేనే ప్రజలు డయాగ్నస్టిక్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. మామూలు జ్వరానికీ పరీక్షల కోసం వేలు ఖర్చు చేస్తున్నారు. ఇదే అదనుగా డయాగ్నస్టిక్ సెంటర్లు, వైద్యులు దీన్ని వ్యాపారంగా మార్చేస్తున్నారు. హైదరాబాద్లో ఓ పేరొందిన ఆస్పత్రి వైద్యులు ప్రతి చిన్న దానికి రూ.5 వేలకు మించి పరీక్షలు చేయిస్తున్నారు. దాంతో పాటు వైరల్ జ్వరాలతో బాధపడుతున్న వారు మందులు విచ్చలవిడిగా మింగుతున్నారు. అది ఇతరత్రా ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుం దని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫాగింగ్ చర్యలు కరువు.. దోమలే డెంగీ, మలేరియా జ్వరాలకు కారణం. ఈ దోమలను నివారించడానికి ఇంట్లో పరిశుభ్రత, నీటిని నిల్వ ఉండకుండా చూడటం ముఖ్యం. చుట్టుపక్కల నీరు నిల్వ ఉంటే అక్కడా డెంగీ దోమలు వ్యాప్తి చెందుతాయి. దోమలను నిర్మూ లించాలంటే నిరంతరం మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు ఫాగింగ్ చేయాలి. కానీ ఈ ఏడాది ఫాగింగ్ యంత్రాలు పూర్తిస్థాయిలో లేకపోవ డంతో దోమల నివారణ జరగలేదు. దీంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ఆ తర్వాత తలెత్తిన పరిణామాలను ఎదుర్కోవడంలో వైద్య, ఆరోగ్య శాఖ విఫలమైంది. చాలాచోట్ల డెంగీ కిట్లను సకాలంలో అందించలేకపోయింది. దీంతో ప్రైవేటు ఆస్పత్రులు కిటకిటలాడాయి. రాష్ట్రంలో ప్రతి కుటుంబం సరాసరి రూ.50 వేల వరకు డెంగీ, చికున్గున్యా, ఇతర వైరల్ జ్వరాలకు ఖర్చు చేసినట్లు అంచనా. కొన్ని కుటుంబాలైతే రూ.2 నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చు చేశారు. కొందరు ప్రత్యేకంగా డెంగీకి బీమా చేయించుకున్నారు. సాయంత్రం ఓపీకి బ్రేక్.. ఏరియా, జిల్లా, బోధనాస్పత్రుల్లో సాయంత్రం వేళల్లోనూ ఓపీ నిర్వహించాలన్న సర్కారు లక్ష్యం నీరుగారుతోంది. ఇప్పటికీ డెంగీ, వైరల్ ఫీవర్లు వస్తున్నా సాయంత్రం డాక్టర్లు ఓపీ చూడట్లేదు. అయితే దీనికి రోగులు రావట్లేదన్న కారణం చూపుతున్నారు. ఇక కీలకమైన వైరల్ ఫీవర్ల సీజన్ కావడంతో కొందరు ప్రభుత్వ వైద్యులు సొంత ప్రైవేటు ఆస్పత్రులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మళ్లీ దోమలు విజృంభించే చాన్స్ ఇప్పటికీ ఆస్పత్రులకు డెంగీ జ్వరాలతో జనం వస్తూనే ఉన్నారు. సీజన్ అయిపోయినా వర్షాల వల్ల ఈ పరిస్థితి నెల కొంది. వర్షాలు తగ్గాక మళ్లీ దోమలు విజృం భించే అవకాశముంది. కాబట్టి ఇళ్లలో పరిశు భ్రత పాటించాలి. –డాక్టర్ కృష్ణ భాస్కర్, పిజీషియన్, సిటీ న్యూరో, హైదరాబాద్ డెంగీలో ఖమ్మం రెండో స్థానం.. దగ్గు, జలుబు, తలనొప్పి తో ప్రజలు ఆస్పత్రులకు వస్తున్నారు. డెంగీ కేసుల్లో రాష్ట్రంలో ఖమ్మం జిల్లా రెండో స్థానంలో ఉంది. అంటే దోమలు ఇక్కడ ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కార్పొరేషన్లో ఎక్కడి చెత్త అక్కడే ఉంది. దీంతో దోమలు పెరిగిపోతున్నాయి. – డాక్టర్ యలమంచిలి రవీంద్రనాథ్, ఖమ్మం -
డెంగ్యూ నివారణ చర్యలేవి?
-
తెలంగాణ ఐఏఎస్లపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
-
తెలంగాణ ఐఏఎస్లపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో డెంగీ వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో హైకోర్టు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డెంగీ గురించి వివరణ ఇచ్చే క్రమంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేందర్ కుమార్ జోషి సహా మున్సిపల్ శాఖ కార్యదర్శి గురువారం న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. ఈ క్రమంలో వారి వివరణపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నివారణ చర్యలు తీసుకుంటున్నట్లయితే జనవరిలో 85గా ఉన్న డెంగీ కేసులు.. అక్టోబర్ నాటికి 3,800కి ఎలా పెరిగాయని ప్రశ్నించింది. ఈ సందర్భంగా మూసీ నదిని ఆనుకుని ఉన్న హైకోర్టులోనే దోమలున్నాయని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో సీఎస్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీని నియమించాలని హైకోర్టు ఆదేశించింది. దోమల నివారణకై యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఇందులో భాగంగా దోమల నివారణకు 1000 మిషన్లు కొనుగోలు చేయాలని.. వీటికోసం ప్రభుత్వం వెంటనే నిధులను మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంపై ప్రతి గురువారం కమిటీ కోర్టుకు నివేదిక సమర్పించాలని తెలిపింది. ఒకవేళ డెంగీ వ్యాధి నివారణలో ప్రభుత్వం గనుక విఫలమైతే.. డెంగీ మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని హైకోర్టు పేర్కొంది. మూసీ నదిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని సీఎస్, అధికారులకు ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ మొదటి వారానికి వాయిదా వేసినట్లు పేర్కొంది. మీరు ఈ దేశ పౌరులు కాదా? డెంగీపై వివరణ ఇస్తున్న సందర్భంగా తెలంగాణ ఐఏఎస్లపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి శిక్షణ ఇచ్చి ఐఏఎస్లను చేస్తే.. మీరు సామాన్య ప్రజలకు ఏం సేవ చేస్తున్నారని మండిపడింది. ఈ సందర్భంగా తెలంగాణ ఐఏఎస్లు ఈ దేశ పౌరులు కాదా అని న్యాయస్థానం ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలను పాటించకుంటే ఐఏఎస్లపై సుమోటో కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పౌరులు ఎవరైనా మరణిస్తే అందుకు వారే బాధ్యత వహించాలని పేర్కొంది. అలా మరణించిన కుటుంబానికి ఐఏఎస్లు తమ సొంత అకౌంట్ నుంచి రూ. 5 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో హైకోర్టు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక సీఎస్ జోషి , ఐఏఎస్లు అరవింద్ కుమార్, లోకేష్ కుమార్ , శాంత కుమారి, యోగితా రాణా సైలెంట్గా ఉండిపోయినట్లు సమాచారం. చదవండి: డెంగీకి బలవుతున్నా పట్టించుకోరా? -
డెంగ్యూతో మహిళా న్యాయమూర్తి మృతి
సాక్షి, హైదరాబాద్ : డెంగ్యూ జ్వరంతో ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయమూర్తి ఎం జయమ్మ ఆకస్మికంగా మృతి చెందారు. కొద్దిరోజులుగా ఆమె హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో జయమ్మ సోమవారం తెల్లవారుజామున రెండు గంటలకు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. హైకోర్టు విభజనలో భాగంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేసిన ఆమె గత ఏడాది డిసెంబర్లో ఖమ్మం రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ అయ్యారు. -
డెంగీతో శైలజ మృతి
హఫీజ్పేట్ : డెంగీతో ఓ యువతి మృతి చెందిన సంఘటన మదీనాగూడలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే వికారాబాద్ జిల్లా, నారాయణపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్రెడ్డి బీహెచ్ఈఎల్ బస్డిపోలో డ్రైవర్గా పని చేస్తూ రామచంద్రాపురం గ్రామంలో ఉంటున్నాడు. అతడి కుమార్తె శైలజ (21)కు శుక్రవారం రాత్రి జ్వరంతో రావడంతో స్థానిక వైద్యులను సంప్రదించగా డెంగీ సోకినట్లు నిర్ధారించారు. దీంతో మెరుగైన వైద్యం కోసం మదీనాగూడలోని శ్రీకర ఆస్పతికి తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఆదివారం ఉదయం ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆస్పత్రి ఎదుట ఆందోళన.... డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే శైలజ మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆస్పతి ముందు ఎదుట ఆందోళన చేపట్టారు. శనివారం రాత్రి డాక్టర్లు అందుబాటులో లేక నర్సులే ఆమెకు చికిత్స చేశారని, సరైన వైద్యం అందనందునే ఆమె మృతి చెందిందని వారు ఆరోపిస్తున్నారు. మియాపూర్ పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకొని వారికి నచ్చజెప్పడంతో ఆందోళన విరమింపజేశారు. -
డెంగ్యూనా? 650 ఎంజీ పారాసిటమాల్ వేసుకోండి!
డెహ్రాడూన్: ఎక్కడ చూసినా డెంగ్యూ ఫీవర్ హడలెత్తిస్తోంది. ఉత్తరాఖండ్ను డెంగ్యూ వణికిస్తోంది. వందలసంఖ్యలో రోగులు డెంగ్యూ ఫీవర్తో బాధపడుతూ.. ఆస్పత్రులకు పోటెత్తుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 4,800 మందికి డెంగ్యూ ఫీవర్ సోకినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా డెహ్రాడూన్ ప్రాంతంలో డెంగ్యూ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక్కడ మూడువేల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఇక తర్వాతి స్థానంలో హల్ద్వానీ ప్రాంతం ఉంది. ఇక్కడ 1100 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. డెంగ్యూ తగ్గడం లేదా.. ఐతే.. ఉత్తరాఖండ్ను డెంగ్యూ వణికిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. డెంగ్యూ ఫీవర్ తగ్గకపోతే.. 500 ఎంజీకి బదులు, 650 ఎంజీ పారసిటమాల్ ట్యాబెట్లు వేసుకోవాలని, డెంగ్యూ తగ్గిపోతుందని ఆయన చెప్పుకొచ్చారు. డెంగ్యూ రాష్ట్రంలో తీవ్రస్థాయిలో పెచ్చరిల్లిందని, ఈ నేపథ్యంలో 650 ఎంజీ పారాసిటమాల్ వేసుకొని.. విశ్రాంతి తీసుకుంటే అదే తగ్గిపోతుందని రావత్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో డెంగ్యూ కారణంగా ఎనిమిది మంది చనిపోయినట్టు గతవారం ఆరోగ్యశాఖ అధికారికంగా వెల్లడించగా.. సీఎం రావత్ మాత్రం కేవలం నలుగురే చనిపోయారని చెప్పుకొచ్చారు. -
డెంగీ మహమ్మారిని మట్టుబెట్టలేరా?
సాక్షి, హైదరాబాద్ : డెంగీ విజృంభించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోతే తీవ్రంగా స్పందించాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించింది. నెలరోజుల్లోగా డెంగీని అదుపు చేయలేకపోతే వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి సమన్లు జారీ చేయాల్సి వస్తుందని కూడా హెచ్చరించింది. వైద్య, ఆరోగ్య శాఖ, జీహెచ్ఎంసీలు దాఖలు చేసిన కౌంటర్లల్లోని విషయాలు పరిశీలించిన ధర్మాసనం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ‘డెంగీ, చికున్ గున్యా, స్వైన్ఫ్లూ వంటి విష జ్వరాలు వచ్చాక మందులు వేయడం కంటే ప్రాథమిక దశలోనే వాటి నివారణకు చర్యలు తీసుకోవాలి. కోటి మందికిపైగా జనాభా ఉన్న నగరంలో 150 పోర్టబుల్ ఫాగింగ్ మిషన్లు ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం అవుతోంది’.. అని వ్యాఖ్యానించింది. డెంగీ వంటి విషజ్వరాలతో జనం అల్లాడుతున్నారని, ఆశించిన స్థాయిలో వైద్య సేవలు అందడం లేదని పేర్కొంటూ హైదరాబాద్కు చెందిన డాక్టర్ ఎం.కరుణ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం తోపాటు, హైకోర్టుకు న్యాయవాది రాపోలు భాస్కర్ రాసిన లేఖను కూడా పిల్గా పరిగణించిన హైకో ర్టు బుధవారం మరోసారి విచారించింది. కౌంటర్ వ్యాజ్యా ల్లోని అంశాలను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్రెడ్డిలతో కూడిన ధర్మాసనం.. డెంగీ అదుపుకాకపోగా కేసుల సంఖ్య పెరిగినట్లుగా ప్రభుత్వం కౌంటర్లో పేర్కొనడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ 5,914 కేసులు నమోదు అయ్యాయి. సెప్టెంబర్ తొలి వారంలో 138 కేసులు నమోదైతే 23వ తేదీ నాటికి ఆ సంఖ్య 309కి పెరిగింది. 22 రోజుల్లో రోగుల పెరుగుదల అక్షరాలా 200 శాతం... అని ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఏజీ చెప్పిన లెక్కల ప్రకారం తెలంగాణలో మొత్తం 22 బ్లడ్ బ్యాంక్లున్నాయి. ఇదేమైనా కేంద్రపాలిత ప్రాంతమా? బ్లడ్ బ్యాంక్ల సంఖ్య పెంపు అంశంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి’అని పేర్కొంది. లార్వా దశలోనే అంతం చేయాలి.. ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నందున మురికివాడల్లో దోమలవ్యాప్తి మరింత పెరగకుండా ఫాగింగ్ ఎక్కువగా చేయాలి. డ్రోన్ల సహాయంతో దోమల్ని లార్వా దశలోనే అంతం చేస్తే బాగుంటుందేమో ఆలోచన చేయం డి. రాపిడ్ డయోగ్నస్టిక్ టెస్ట్ కిట్స్ ద్వారా 80% మేరకు ఫలితాలున్నాయని చెబుతున్నారు. ఎలీసా పరీక్షలకు ప్రైవేట్ లేబరేటరీల్లో రూ. 3,500 వరకూ ఖర్చు అవుతుంది. ఈ పరీక్ష కోసం ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చే ఆలోచన చేయాలి. పత్రికల్లో వస్తున్న వార్తల ప్రకారం చూస్తే రోగులకు సరైన వైద్యం అందడం లేదనిపిస్తోంది’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ వాదిస్తూ.. విషజ్వరాలపై ప్రజల్లో అవగాహన కోసం రోడ్ల కూడళ్లల్లో ప్లెక్సీలు ఏర్పాటు చేశామని తెలిపారు. తదు పరి విచారణ అక్టోబర్ 23కి వాయిదా పడింది. -
బొప్పాయి కోసం గొడవ.. పండ్ల మార్కెట్లో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్ : డెంగ్యూ ఫీవర్ విజృంభిస్తుండటంతో దవాఖానాలు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. సరైన వైద్య సదుపాయాలు లేక రోగులు అవస్థలు పడుతున్నారు. ఇక డెంగీ అటాక్తో తలెత్తే ప్లేట్లెట్ల సమస్యను సమర్థంగా ఎదుర్కొంటే ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి బయటపడొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. బొప్పాయి, దానిమ్మ పండ్లను ఆహారంగా తీసుకుంటే ప్లేట్లెట్ల వృద్ధికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బొప్పాయికి భారీ గిరాకీ ఏర్పడింది. బహిరంగ మార్కెట్లో కిలో రూ.100 పైగా పలుకుతోంది. మరో వైపు బొప్పాయి పంట తగినంత అందుబాటులో లేకపోవడంతో పండ్ల వ్యాపారులు దాని కోసం పోటీపడుతున్నారు. ఈ క్రమంలో కొత్తపేట పండ్ల మార్కెట్లో మంగళవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. చెమటోడ్చి పండించిన పంటకు దళారులు తక్కువ మొత్తంలో చెల్లించి.. బయట భారీ మొత్తానికి అమ్ముకుంటున్నారని రైతులు ఆరోపించారు. దళారుల రేట్లు నచ్చక నేరుగా విక్రయాలు జరిపారు. దీంతో బొప్పాయి పండ్లు తమకే అమ్మాలని రైతులపై దళారులు దాడి చేశారు. పరస్పరం దాడులతో పండ్ల మార్కెట్ దద్దరిల్లింది. పోలీసులు రంగప్రవేశం చేసి గొడవ సద్దుమణిగేలా చేశారు. -
డెంగీ డేంజర్ ; కిట్లకు కటకట..
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ ఆసుపత్రులకు ఇదో పరీక్ష. డెంగీ రోగులకు పరీక్షలు చేయడంలో విఫలమవుతున్నాయి. రాష్ట్రంలో డెంగీ నిర్ధారణ పరీక్షల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. సరిపడా డెంగీ నిర్ధారణ కిట్లు లేక పాట్లుపడుతున్నాయి. రెండు, మూడు రోజులు ఆగాలని వైద్య సిబ్బంది చెబుతుండటంతో జనం గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం డెంగీపై అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నా, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం కిట్లు సమకూర్చకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. నివేదికలతో ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. అవసరం 10 లక్షలు...అందుబాటులో 1.35 లక్షల మందికే వైరల్ జ్వరాలు విజృంభిస్తుండటం, ఒక్కోసారి 103–104 డిగ్రీల జ్వరం వస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా జనం ఆందోళన చెందుతున్నారు. వైరల్ జ్వరాలు, డెంగీ అనుమానిత కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. వైద్యవిధాన పరిషత్ పరిధిలోని 31 జిల్లా, 87 ఏరియా ఆసుపత్రులకు రోజూ లక్షలాదిమంది తరలివస్తున్నారు. పడకలు కూడా దొరకని పరిస్థితి. ఉస్మానియా, వరంగల్ ఎంజీఎం, హైదరాబాద్లోని తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్కూ రోగులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. వేలాది ప్రైవేటు ఆసుపత్రుల నుంచి కూడా డెంగీ నిర్ధారణ కోసం లక్షలాది మంది వస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 10 లక్షలమందికి డెంగీ నిర్ధారణ పరీక్షలు చేయాల్సి ఉండగా, వైద్య విధానపరిషత్ ఆసుపత్రులు, బోధనాసుపత్రుల్లో కేవలం 1.35 లక్షలమందికి మాత్రమే సరిపడా కిట్లున్నాయి. అందులో ప్రాథమిక నిర్ధారణ కోసం నిర్వహించే ర్యాపిడ్ టెస్టు కిట్లు 73 వేలుండగా, పూర్తిస్థాయి నిర్ధారణ కోసం నిర్వహించే ఎలీసా కిట్లు కేవలం 62 వేలమందికి సరిపోను మాత్రమే ఉన్నాయి. ఎలీసా పరీక్షల కోసం రెండు, మూడు రోజులపాటు ఆగాలని ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బంది చెబుతుండటంతో బాధితులు ఉస్సూరుమంటూ వెనుదిరుగుతున్నారు. వైద్య విధాన పరిషత్ యంత్రాంగం విఫలం వైద్య విధాన పరిషత్కు ఇన్చార్జి కమిషనర్గా హైదరాబాద్ కలెక్టర్ మాణిక్రాజ్ కొనసాగుతున్నారు. రెండు విధులతో ఆయన జిల్లా, ఏరియా ఆసుపత్రులపై దృష్టి సారించడంలేకపోతున్నారు. కనీసం ఆయా ఆసుపత్రుల యంత్రాంగంతో సమీక్ష నిర్వహించలేని పరిస్థితి. ఆయన కంటే కిందిస్థాయిలో ఉండే అధికారులు కూడా డెంగీ నిర్వహణ, పర్యవేక్షణలో విఫలమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎలీసా కిట్లు ఏడే.. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకూ అధికారులు డెంగీ నిర్ధారణ కిట్లు తక్కువగానే ఇచ్చారు. ర్యాపిడ్ టెస్టు కిట్లను గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి 500, దుబ్బాక ఆసుపత్రికి 150, తూప్రాన్ ఆసుపత్రికి 250 మాత్రమే ఇచ్చారు. సిద్ధిపేట జిల్లా ఆసుపత్రికి కేవలం ఏడే ఎలీసా కిట్లు ఇచ్చారు. ర్యాపిడ్ పరీక్ష కిట్టు ద్వారా ఒక్కో యూనిట్ ఒక్కరికి, ఎలీసా కిట్టు ఒక్కోటి 96 మందికి పరీక్ష చేయడానికి వీలుంది. నీలోఫర్ ఆసుప త్రికి 70 ఎలీసా కిట్లు మాత్రమే ఇచ్చారు. అయితే, ఇక్కడికి రోజూ కనీసం 2 వేల మందికి పైగా పిల్లలు వస్తున్నారు. హైదరా బాద్లోని ఫీవర్ ఆసుపత్రికి రోజూ 2,500 మంది రోగులు వస్తుంటారు. అక్కడ కేవలం 3,936 మందికి సరిపోయే 41 ఎలీసా కిట్లు అందుబాటులో ఉన్నాయి. ఖమ్మం జిల్లా ఆసుపత్రికి ఐదు ఎలీసా కిట్లు మాత్రమే ఉన్నాయి. ఆలస్యానికి కారణమిదే.. డెంగీ పరీక్షలు నిర్వహించడంలో ఆలస్యానికి కారణం కిట్ల కొరత కాదు. అవసరమైనన్ని కిట్లు అందుబాటులో ఉంచుతున్నాం. అవసరమైనప్పుడు తెప్పిస్తున్నాం. అయితే, ఎలీసా పరీక్షకు నిర్వహించే ఒక్కో కిట్టు ధర రూ.25 వేలు. ఒక్కో కిట్టు ద్వారా 96 మందికి పరీక్షలు చేయడానికి వీలుంది. కొద్దిమంది కోసం ఒక్కసారి కిట్టు విప్పితే మిగతావారి కోసం దాన్ని దాచి ఉంచలేం. కాబట్టి 96 రక్త నమూనాలు వచ్చే వరకు ఆగుతున్నాం. -చంద్రశేఖర్రెడ్డి, ఎండీ,టీఎస్ఎంఎస్ఐడీసీ -
డెంగీ మృతుల వివరాల్ని చెప్పొద్దంటారా?
సాక్షి, హైదరాబాద్: డెంగీ వల్ల అవయవాలు దెబ్బతిని రోగులకు ప్రాణాంతకమవుతోందని, ప్రమాదకర పరిస్థితులు ఉన్న దృష్ట్యా ప్రైవేట్ ఆస్పత్రుల్లోని బాధితుల వివరాలు గోప్యంగా ఉంచాలనడం సరికాదని హైకోర్టు తేల్చిచెప్పింది. వైద్యం పొందుతూ మరణించిన డెంగీ రోగుల వివరాల్ని వెళ్లడించొద్దని ప్రైవేట్ ఆస్పత్రులపై అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు పత్రికల్లో వచ్చిన కథనాలపై హైకోర్టు విస్మయం వ్యక్తంచేసింది. అధికారుల తీరు సమర్థనీయం కాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్రెడ్డిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. డెంగీ నివారణకు తీసుకున్న చర్యల్ని వివరించాలని ఆదేశిస్తూ విచారణను 25కి వాయిదా వేసింది. -
మహమ్మారిలా డెంగీ..
సాక్షి, హైదరాబాద్: డెంగీ మహమ్మారిలా వ్యాప్తిచెందిందని పలువురు వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేలాది మందికి డెంగీ జ్వరాలు సోకుతున్నాయని, తీవ్రత అధికంగా ఉండటం వల్ల వైద్యులు, ఆసుపత్రులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఇటువంటి పరిస్థితి మరెక్కడైనా నెలకొని ఉంటే పరిస్థితిపై రోజూ కొన్ని బులెటిన్లు విడుదల చేసే వారని, కానీ ఇక్కడ మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదని వాపోతు న్నారు. ప్రజలకు అవగాహన కల్పించడంలో, ఫాగింగ్ వంటి నివారణ చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. ‘డెంగీని ఎలా ఎదుర్కోవాలి’అనే అంశంపై గురువారం ఫ్లూచరిస్టిక్ సిటీస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ చర్చలో పాల్గొన్న వైద్యులు పలు అభిప్రాయాలు వెల్లడించారు. పాఠశాలలు, కాలేజీల్లో డెంగీ వ్యాప్తిచెందకుండా ఉండేందుకు విద్యార్థులు గ్లౌవ్స్, ఫుల్ ప్యాంట్ మొదలైన వాటితో యూనిఫాం ధరించడానికి అనుమతించాలని సూచించారు. జూన్ నుంచి వ్యాప్తి విస్తృతం..: డాక్టర్ వసంతకుమార్, అపోలో ఆసుపత్రి ‘డెంగీ ఉన్నట్లు అంగీకరించడం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన మొదటి పని. ఈ సంవత్సరం జూన్ నుంచి డెంగీ, చికున్ గున్యాలు విస్తృతంగా వ్యాపించాయి. ఏటా అనేక కేసులు వస్తున్నప్పటికీ గత 3 దశాబ్దాలుగా హైదరాబాద్లో ఇంతటి ఘోరమైన పరిస్థితి చూడలేదు.’ గర్భిణులపై తీవ్ర ప్రభావం: డాక్టర్ విజయలక్షి్మ, సీనియర్ గైనకాలజిస్ట్ ‘ప్రస్తుతం వస్తున్న కేసులు గతంలో ఇచి్చన మార్గదర్శకాలకు తగినట్లుగా లేవు. గర్భిణీలపై డెంగీ తీవ్ర ప్రభావం చూపుతుంది. రక్తస్రావం వల్ల తల్లీ బిడ్డలకు నష్టం జరుగుతుంది. డెంగీ పాజిటివ్ తల్లులకు ప్రసవించే శిశువులకు ఐసీయూలో చికిత్స, పర్యవేక్షణ తప్పనిసరి’ హోమియోపతి మద్దతు తీసుకోవాలి: డా.శ్రీనివాసరావు, కేంద్ర ఆయుష్ ‘హోమియోపతి ద్వారా స్వైన్ఫ్లూను నియంత్రించగలిగాం. డెంగీ నియంత్రణకు హోమియోపతి మద్దతు కూడా తీసుకోవాలి. అలాగే ప్రభుత్వం ఎపిడమిక్ సెల్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది’ అందరమూ బాధ్యత వహించాలి: డా.విజయానంద్, చిల్డ్రెన్స్ స్పెషలిస్టు ‘డెంగీ మహమ్మారిలా వ్యాపించింది. దీనికి మనమంతా బాధ్యత వహించాలి. ప్రభుత్వం, కొందరు ప్రజలు డెంగీని అత్యంత క్యాజువల్గా తీసుకుంటున్నారు. ఇది మరింత నష్టాన్ని కలిగిస్తుంది. వర్షాకాలం ముందు నుంచే చర్యలు తీసుకోవాలి. ప్రజలను చైతన్యం చేయాలి. డెంగీ వస్తే ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకోవాలని బాధితులే కోరుతున్నారు. అవసరమా లేదా అనేది వైద్యుడు నిర్ణయించాలి. కానీ ప్రజల్లో భయాందోళనలు పెరగడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది’ -
ఆరోగ్య మంత్రి గారూ... ఇటు చూడండి!
‘‘నగరంలోని హుస్సేన్పురకు చెందిన హలీమాబీ విషజ్వరంతో బాధపడుతూ ఆదివారం ప్రభుత్వాసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించింది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరితే వైద్యులెవరూ పట్టించుకోకపోవడంతో మరణించినట్లు బంధువులు ఆరోపించారు. రాత్రి వేళలో ఒక డాక్టర్ కూడా అందుబాటులో లేరని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు వైద్యం అందించడంలో వైద్యులు నిర్లక్ష్యం చేయడం వల్లనే మరణించిందని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అజయ్కుమార్ను సంప్రదించగా.. రెండు రోజులుగా వైరల్ ఫీవర్తో బాధపడుతోందని, దీంతోపాటు రక్తహీనత(ఎనేమియా)తో ఆదివారం రాత్రి ఆస్పత్రిలో చేరిందని, ఆస్పత్రిలో చేరేసరికే 50వేల రక్తకణాలు మాత్రమే ఉన్నాయని, మెరుగైన వైద్యం అందించినట్లు తెలిపారు.’’ సాక్షి, కరీంనగర్: సాక్షాత్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాను విషజ్వరాలు చుట్టుముట్టాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మృత్యుఘోష వినిపిస్తోంది. ఆస్పత్రిలో ఏ వార్డు వద్ద చూసినా విషజ్వరాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న రోగులు, వారి బంధువులు కనిపిస్తున్నారు. ప్రాణాంతకమైన డెంగీతోపాటు మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాలతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఎక్కువ శాతం రక్తంలో ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోయి మెరుగైన వైద్యం అందక మరణిస్తున్నారు. ప్రస్తుతం శిశువులు, పిల్లలు, మైనర్లతోపాటు వృద్ధులు ఎక్కువగా విషజ్వరాలతో చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రిలో చేరుతున్నారు. కాగా మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో డెంగీ కేసుల వివరాలు తెలియజేసేందుకు కూడా వైద్యాధికారులు జంకుతున్నారు. ఆస్పత్రిలో ఆగని మరణాలు.. జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో వివిధ రోగాలతో బాధపడుతూ సరైన చికిత్స అందక పేద రోగులు మరణిస్తున్నారు. మే 21న ప్రభుత్వాస్పత్రిలో కోనరావుపేట మండలం మార్దన్నపేట గ్రామానికి చెందిన బాలింత ఊరగంట మానస(22) సరైన చికిత్స అందక వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మరణించింది. సాధారణ ప్రసవం కోసం కాలయాపన చేసి చివరి నిమిషంలో ఆపరేషన్ చేశారని, తీవ్ర రక్తస్రావం అవుతున్నా ఎవరూ పట్టించుకోలేదని, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మానస మృతిచెందిందని బంధువులు ఆందోళన చేశారు. ఆగస్టు 11న తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీ, మహాత్మనగర్కు చెందిన కనుమల్ల లావణ్య(22) జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. విషజ్వరంతో బాధపడుతూ ఆగస్టు 9న ఆస్పత్రిలో చేరింది. ఫిమేల్వార్డులో రెండు రోజులపాటు చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించడంతో ఐసీయులోకి షిఫ్ట్ చేశారు. రక్తంలో కణాలు తగ్గిపోయాయని ప్లేట్లెట్ ఎక్కించారు. అయినా కోలుకోక చికిత్స పొందుతూ 11న మృతిచెందింది. వార్డులో ఉన్నపుడు రెండురోజులపాటు వైద్యులు పట్టించుకోకపోవడంతోనే లావణ్య మరణించిందని భర్త రమేష్ బంధువులు ఆందోళన చేశారు. ప్లేట్లెట్స్ కొరతతో రోగులకు ప్రాణసంకటం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ఆడెపు నిఖిల్(16) పిల్లల వార్డులో తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్నాడు. విషజ్వరంతోపాటు లివర్ ఇన్ఫెక్షన్ కారణంగా రక్తంలో ప్లేట్లెట్ కౌంట్ 7వేలకు తగ్గిపోయి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో తల్లిదండ్రులు ఆడెపు లత, సత్యనారాయణ కన్నీరు మున్నీరుగా విలపించడం అక్కడ ఉన్నవారిని కలిచివేసింది. కనీసం పేట్లెట్స్ ఇవ్వడానికి బంధువులు, దాతలు ఎవరూ ముందుకు రావడం లేదని ప్రభుత్వం ఆదుకొని తమ కొడుకు ప్రాణాలు నిలుపాలని వేడుకుంటున్నారు. ఇది ఒక్క నిఖిల్ పరిస్థితే కాదు. ఇటీవల మంత్రి ఈటల ప్రాతినిధ్యం వహించే హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో దార హరికృష్ణ(24) డెంగీ వ్యాధితో మృతిచెందాడు. చాలామంది రోగులు ప్లేట్లెట్స్ సమకూరక ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. ప్లేట్లెట్ కౌంట్ కనీసం లక్ష దాటితే తప్ప డెంగీ రోగం నయమయ్యే పరిస్థితి లేదు. దాతలు ఇచ్చే రక్తం నుంచి తెల్లరక్త కణాలను వేరు చేసి, డెంగీ వ్యాధిగ్రస్తులకు ఎక్కించాల్సి ఉంటుంది. జిల్లాలో రక్తదాతలు ముందుకు రాకపోవడం, వైద్యాధికారులు ప్రత్యామ్యాయ చర్యలు తీసుకోకపోవడంతో రోగుల పరిస్థితి విషమంగా మారుతోంది. డెంగీ కేసులు ఇలా.. జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో 2019 ఏప్రిల్లో 116 డెంగీ కేసులు నిర్ధారణ కాగా మేలో 153 కేసులు, జూన్లో 91, జూలైలో 112, ఆగస్టులో 61, సెప్టెంబర్లో ఇప్పటికే 30మందికి డెంగీ నిర్ధారణ అయింది. డీఎంహెచ్ఓ పరిధిలో మాత్రం సెప్టెంబర్లో 21 కేసులు మాత్రమే నమోదు అయినట్లు రికార్డులు తెలుపుతున్నాయి. డీఎంహెచ్ఓ పరిధిలో ఈ సంవత్సరం ఇప్పటి వరకు 72కేసులు నమోదు అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. జిల్లాలో మలేరియా విజృంభించినప్పటికీ, ఇప్పటి వరకు 4కేసులు మాత్రమే నిర్ధారణ అయినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో జ్వరపీడితుల్లో అధికసంఖ్యలో డెంగీతో బాధపడుతుండగా, ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం తక్కువ సంఖ్యలో డెంగీ బారిన పడుతున్నట్లు చూపుతుండడం గమనార్హం. ప్రభుత్వాస్పత్రిలో అదనపు పడకలు.... 500 పడకల సామర్థ్యం కలిగిన ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో 150 పడకలు మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి కేటాయించారు. మిగతా 350పడకలతో మిగతా వార్డుల్లో రోగులకు సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం రోగుల సంఖ్య తీవ్రంగా పెరుగుతుండడంతో ఆస్పత్రి వరండాలో అదనపు పడకలు వేసి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటికే 100కుపైగా అదనపు పడకలు సమకూర్చినట్లు వైద్యాధికారులు తెలుపుతున్నారు. వరండాల్లోనే వైద్య సేవలు అందిస్తుండడంతో చలిగాలులు, దోమల బెడదతో కనుకు తీయలేని పరిస్థితి ఉందని రోగులు వాపోతున్నారు. ప్రతిరోజు ఆస్పత్రిలో 600 వరకు ఓపీ జరుగుతుండగా 100మందికి పైగా ఇన్పేషెంట్లుగా ఆస్పత్రిలో చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. -
ప్రజలారా.. ఫాగింగ్కు అనుమతించండి : ఈటల
సాక్షి, హైదరాబాద్: దోమల నివారణ కోసం ఇళ్లలో ఫాగింగ్ చేసేందుకు అనుమతించాలని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రజలను కోరారు. ఫాగింగ్ చేసేందుకు కొంతమంది అనుమతించడం లేదని తమ దృష్టికి వచ్చిందని, డెంగ్యూ ప్రబలుతున్న నేపథ్యంలో ఫాగింగ్కు సిబ్బందిని అనుమతించా లని కోరారు. వైరల్ ఫీవర్లు, డెంగ్యూ, ఆస్పత్రుల్లో అందుతున్న సేవలపై ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారితో సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రి సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. ఇళ్లలో ఫాగింగ్కు జీహెచ్ఎంసీ సిబ్బందిని ప్రజలు అనుమతించడం లేదని, దీంతో ఇంటి లోపలి దోమలు అలాగే ఉండిపోతున్నాయన్నారు. ప్రభు త్వ చర్యలతో ప్రస్తుతం వైరల్ ఫీవర్లు కొంత తగ్గుముఖం పట్టాయని తెలిపారు. చెప్పేంత వరకు సాయంత్రం ఓపీ సేవలు నిలిపేయొద్దని, మెడికల్ క్యాంపులు కొనసాగించాలన్నారు. జ్వరాల తీవ్రత పూర్తిగా తగ్గే వరకూ సెలవుల రద్దు కొనసాగుతుందన్నారు. డాక్టర్లు, సిబ్బందితో పాటు, అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు. -
ఆగ్నేయ ఆసియానే వణికిస్తున్న ‘డెంగ్యూ’
సాక్షి, న్యూఢిల్లీ : ఒక్క భారత దేశాన్నే కాదు, ఆగ్నేయాసియాలోని వియత్నాం, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలను కూడా ఈసారి డెంగ్యూ జ్వరలు తీవ్రంగా వణికిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గాలు తెలియజేస్తున్నాయి. వియత్నాంలో ఒక్క జూలై నెల నాటికే 1,15,186 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలానికి 29 వేల డెంగ్యూ కేసులు నమోదుకాగా, ఈసారి లక్ష దాటి పోవడం గమనార్హం. ఫిలిప్పీన్స్లో జూలై నెల నాటికి 1, 46, 062 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. గతేడాది అదే ఫిలిప్పీన్స్లో 69 వేల డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. థాయ్లాండ్లో 43, 200 డెంగ్యూ కేసులు నమోదవడంతో ఆ దేశంలో వైద్య అత్యయిక పరిస్థితి ప్రకటించారు. అక్కడే గతేడాది జూలై నెల నాటికి 28,100 డెండ్యూ కేసులు నమోదయ్యాయి. కంపోడియాలో 39 వేల కేసులు, గతేడాది మూడు వేల కేసులు నమోదయ్యాయి. లావోస్, మలేసియా, సింగపూర్, తైవాన్ దేశాల్లో కూడా ఈసారి ఎక్కువ డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి. ఒక్క ఆగ్నేయాసియా దేశాల్లో కాకుండా అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం అమెరికా దేశాల్లో కూడా డెంగ్యూ వ్యాధి ఎక్కువగానే ఉంది. ఈసారి బ్రెజిల్, కొలంబియా, హోండురస్, నికరాగ్వా దేశాల్లో ఆగస్టు మూడవ తేదీ నాటికి 5,84,263 కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు తెలియజేస్తున్నాయి. మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా 1970 దశకం నుంచే డెంగ్యూ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. అత్యధిక జన సాంద్రతతో కిక్సిర్సిన రియో డీ జెనీరియో, ఓ చి మిన్ సిటీ నగరాల్లో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ఈ ఏడాదే డెంగ్యూ కేసులు అత్యధికంగా నమోదవడానికి కారణం ప్రపంచవ్యాప్తంగా జూలై నెలలో వాతావరణం వామ్ (వేడిగా) ఉండడమని ‘లండన్ స్కూల్ ఆఫ్ హైజిన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్’కు చెందిన డాక్టర్ రాచెల్ లోవే తెలియజేశారు. భారత లాంటి సమశీతోష్ణ మండలాల్లో ఉష్ణోగ్రత సగటు 25 సెంటిగ్రేట్ డిగ్రీలు ఉంటే వామ్గాను, 35 డిగ్రీలు ఉంటే హాట్గాను పరిగణిస్తాం. మొత్తం అంతర్జాతీయంగా, అంటే ప్రపంచ దేశాలన్నింటిలో ఎన్నడు లేని విధంగా (ఉష్ణోగ్రతను క్రమం తప్పకుండా నోట్ చేస్తున్న 1880 సంవత్సరం నుంచి) జూలై నెలలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయిందట. ఈ వామ్ వాతావరణంలో డెంగ్యూ వైరస్, వాటిని క్యారీ చేసే దోమలు క్రియాళీలకంగా ఉంటాయని డాక్టర్ రాచెల్ తెలిపారు. మురుగు నీరు, కుంటలతోపాటు ప్లాస్టిక్ వాటర్ కంటెనైర్లు, మొక్కల కుండీలు దోమల గుడ్లకు నిలయాలుగా మారుతున్నాయని కూడా వైద్యులు తెలియజేస్తున్నారు. డెంగ్యూ వైరస్ సోకితే కళ్లలోపల మంట, జ్వరంతోపాటు విపరీతమైన తలనొప్పి వస్తుందట. ఫలితంగా మూత్రంలోకి రక్తం రావడం, శరీరంలోని అవయవాలకు ఊపిరితిత్తులు ఆక్సిజన్ సరిగ్గా అందించలేక శ్వాసకోస ఇబ్బందులు ఏర్పడడం, ఆక్సిజన్ అందక శరీరంలోని ఏదైన అవయం దెబ్బతింటుందని, కీళ్ల నొప్పులు వస్తాయని తెలిపారు. బీపీ కూడా తీవ్రంగా పడిపోతుందని, కొన్ని సందర్భాల్లో మత్యువు కూడా సంభవిస్తుందని డాక్టర్ రాచెల్ వివరించారు. దీన్ని నిరోధించేందుకు ఇప్పటి వరకు సరైన మందులేదని, మానవ శరీరంలో ప్రవేశించిన ఈ వైరస్ తన సైకిల్ను పూర్తి చేసుకొని బయటకు వెళ్లి పోయే వరకు శరీరంలోని ఏ అవయవం దెబ్బతినకుండా రక్షించుకోవడం, వాటి పరిరక్షణకు అవసరమైన మందులు తీసుకోవడం మంచిదని ఆయన చెప్పారు. భారత్లో ఇప్పటి వరకు దాదాపు ఐదు వేల డెంగ్యూ కేసులు నమోదయినాయని వైద్య వర్గాలు తెలియజేస్తున్నాయి. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో గెంగ్యూ ప్రభావం ఎక్కువగా ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. భారత్లో 2005లో అత్యధికంగా 15 వేల డెంగ్యూ కేసులు నమోదయ్యాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. -
డెంగ్యూ తీవ్రత అంతగా లేదు : ఈటల
సాక్షి, ఖమ్మం : రాష్ట్రంలో డెంగ్యూ తీవ్రత అంతగా లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. 99 శాతం జ్వరాలు వైరల్ ఫీవర్లు మాత్రమేనని చెప్పారు. మంగళవారం ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలోని పలు వార్డులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధులపై అధికారులతో కలిసి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందన్నారు. 400 పడకల ఆస్పత్రిలో రోజుకు 675 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. వైరల్ ఫీవర్ల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అత్యవసర పరిస్థితిలో మరో 150 పడకల ఏర్పాటు చేస్తున్నట్టు వ్లెడించారు. ఖమ్మంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు సంబంధించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టు చెప్పారు. మెడికల్ కాలేజీ అనుబంధ ఆస్పత్రుల్లో మాదిరిగా త్వరలో ఖమ్మం హాస్పిటల్లో కూడా సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఖమ్మం ఆస్పత్రి ఖ్యాతిని పెంచేలా.. సకల సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. -
పిల్లలపైనే డెంగీ పడగ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని డెంగీ ఫీవర్ వణికిస్తోంది. ఎక్కడ చూసినా జ్వర బాధితులే కనిపిస్తున్నారు. పెద్దలు, పిల్లలు అందరూ ఈ విషజ్వరాల బారినపడుతున్నారు. అయితే, రాష్ట్రంలో నమోదవుతున్న డెంగీ కేసుల్లో దాదాపు మూడో వంతు మంది చిన్నపిల్లలు ఉండటంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. గతనెల 30 నుంచి ఈ నెల 5 వరకు రాష్ట్రంలో 730 మందికి డెంగీ సోకగా.. వారిలో 261 మంది 15 ఏళ్లలోపు పిల్లలే ఉన్నట్టు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. ఐదేళ్లలోపు చిన్నారుల్లో 50 మందికి డెంగీ రాగా.. 6 నుంచి 10 ఏళ్లలోపు బాలబాలికల్లో 123 మంది డెంగీబారిన పడ్డారు. ఇక 11 నుంచి 15 ఏళ్లలోపున్న వారిలో 88 మంది డెంగీతో బాధపడుతున్నట్టు నిర్ధారణ అయింది. 15 ఏళ్లకు మించిన వారిలో 469 మందికి డెంగీ సోకినట్లు వైద్య ఆరోగ్యశాఖ సర్కారుకు అందజేసిన నివేదికలో తెలిపింది. జ్వరాలు అదుపులోకి వచ్చాయి: ఈటల రాష్ట్రంలో జ్వరాలపై నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. 24 గంటలు పర్యవేక్షణ చేస్తుండడంతో జ్వరాలు అదుపులోకి వచ్చినట్టు చెప్పారు. శుక్రవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంత డాక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 108, 104 వాహనాలు సక్రమంగా నడిచేలా చూడాలని ఆదేశించారు. -
డెంగీ డేంజర్..వణికిస్తున్నఫీవర్
విశ్వనగరం విషజ్వరాలతో వణికిపోతోంది. డెంగీ, మలేరియా, చికున్గున్యా, డిప్తీరియా,డయేరియాలు పంజా విసురుతుండడంతో విలవిల్లాడుతోంది. ఓవైపు డెంగీ దోమమృత్యుఘంటికలు మోగిస్తుంటే.. మరోవైపు ఏజెన్సీ దోమ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 50 మంది డెంగీతో మరణించగా... వారిలో 40 మందికి పైగా గ్రేటర్ జిల్లాల వారే కావడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రేటర్లో విషజ్వరాలు కేసులు నమోదవుతుండడంపై భయాందోళన వ్యక్తమవుతోంది.ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఫీవర్ ఆస్పత్రులకు జ్వరపీడితులు క్యూ కడుతున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే ప్రస్తుతం ఓపీ రెట్టింపు అయింది. ఉస్మానియాలో ఓపీ 2వేల నుంచి 3వేలకు చేరుకుంది. గాంధీలో 3వేల నుంచి 5వేలకు.. ఫీవర్లో 1,200 నుంచి 2,500.. నిలోఫర్లో 1,500 నుంచి 2,500 చేరింది. సెలవు రోజుల్లో సైతం ఆయా ఆస్పత్రుల్లో ఓపీ సేవలు అందిస్తున్నారు. మరోవైపు అన్ని పాఠశాలల్లో ప్రతిరోజు దోమల నివారణ మందు స్ప్రే చేయాలని.. కాలనీలు, రోడ్లపై చెత్త లేకుండా ఏరోజుకారోజు తొలగించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. ఎందుకీ పరిస్థితి? 2018 నవంబర్ మొదలు ఈ ఆగస్టు వరకు ఎన్నికల హడావుడి కొనసాగింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జీహెచ్ఎంసీ పారిశుధ్య, ఎంటమాలజీ సిబ్బందికీ ఎన్నికల విధులు అప్పగించారు. దీంతో ఆ సమయంలో బస్తీల్లో ఫాగింగ్, యాంటీలార్వా ఆపరేషన్ కార్యక్రమాలను పూర్తిగా నిలిపివేశారు. దీనికి తోడు కాలనీల్లో కొత్త నిర్మాణాలు వెలిశాయి. సెల్లార్లు తవ్వడం, నిర్మాణాల క్యూరింగ్ కోసం నీటిని వాడడం, గదుల్లో రోజుల తరబడి నీరు నిల్వ ఉండడం, ట్యాంకులపై మూతలు లేకపోవడం వల్ల అవన్నీ డెంగీ దోమలకు నిలయంగా మారాయి. కనీసం ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఫాగింగ్ చేయలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ దోమలువిస్తరించడంతో విషజ్వరాలు వ్యాపిస్తున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో డెంగీ మృత్యుఘంటికలు మోగిస్తోంది. రెండు రోజుల క్రితం మదీనాగూడకు చెందిన హేమంత్(10), అల్లాపూర్ డివిజన్ గాయిత్రినగర్కు చెందిన అభిషేక్(21), సికింద్రాబాద్కు చెందిన టిజాన్ ఎలిసా విన్స్టన్(13), నార్సింగి మున్సిపాలిటీలో పర్హీన్(15) మృతి చెందగా... బుధవారం లాలాపేటకు చెందిన రిత్విక(5) మరణించింది. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్త మవుతోంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న డెంగీతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉస్మానియా, గాంధీ, ఫీవర్, నిలోఫర్ సహా నగరంలోని ఏ ఆస్పత్రిని పరిశీలించినా 40–50 మంది డెంగీ బాధితులే కనిపిస్తున్నారు. ఆస్పత్రులకు రోగులు పోటెత్తుతుండడంతో ఇప్పటికే సెలవు రోజుల్లోనూ ఓపీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన వైద్యారోగ్యశాఖ తాజాగా వైద్య సిబ్బంది సెలవులపై ఆంక్షలు విధించింది. పరిస్థితి కుదుటపడే వరకు అనివార్యమైతే తప్ప.. సెలవులు మంజూరు చేయొద్దని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలు డెంగీ బారినపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేలా జీహెచ్ఎంసీ సహా వైద్యారోగ్యశాఖను ఆదేశించాలని కోరుతూ బాలల హక్కుల సంఘం హెచ్చార్సీలో బుధవారం ఫిర్యాదు చేసింది. వైద్యారోగ్యశాఖ లెక్కల ప్రకారం ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2 వేలకుపైగా డెంగీ పాజిటీవ్ కేసులు నమోదు కాగా... వారిలో ఇప్పటికే 50 మంది మృతి చెందారు. లెక్కల్లో తకరారు... డెంగీ బాధితుల లెక్కలపై ప్రభుత్వం చెప్తున్న లెక్కలకు.. ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదవుతున్న కేసులకు పూర్తి భిన్నంగా ఉంది. అధికారికంగా ఇప్పటి వరకు 2,113 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదైనట్లు చెబుతున్నా.. వాస్తవంగా ఈ సంఖ్య రెట్టింపు స్థాయిలో ఉన్నట్లు సమాచారం. గాంధీ ఆస్పత్రిలో ఈ ఏడాది ఇప్పటి వరకు 2,889 మంది నుంచి నమూనాలు సేకరించి, ఐపీఎంలో పరీక్షించగా వీరిలో 451 మందికి డెంగీ పాజిటివ్ వచ్చింది. ఒక్క ఆగస్టులోనే 232 కేసులు నమోదయ్యాయి. ఇక ఉస్మానియాలో మే నుంచి ఇప్పటి వరకు 911 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షించగా 208 మందికి పాజిటివ్ వచ్చింది. నిలోఫర్ ఆస్పత్రిలో జూన్, జులై, ఆగస్టు నెలల్లో 799 పాజిటివ్ కేసులు నమోదు కాగా... వీటిలో ఒక్క ఆగస్టులోనే 499 కేసులు నమోదు కావడం విశేషం.ఫీవర్ ఆస్పత్రిలో జులై, ఆగస్టులో 74 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో 391 మంది హైదరాబాద్ జిల్లా వాసులు కాగా, మిగిలిన వారంతా రంగారెడ్డి, మల్కాజ్గిరి జిల్లాలకు చెందిన వారే. ఇక యశోద, కేర్, అపోలో, కిమ్స్, సన్షైన్, సిటిజన్, కామినేని, గ్లోబల్, తదితర ప్రైవేటు ఆస్పత్రులు డెంగీబాధితులతో కిక్కిరిసిపోతున్నాయి. కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాదు కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ రోగులకు పడకలు దొరకని పరిస్థితి నెలకొంది. డెంగీ బాధితుడి నుంచి రెండో శాంపిల్ సేకరించి ఐపీఎంకు పంపాలనే నిబంధన ఉన్నప్పటికీ.. నగరంలోని ఏ ఒక్క కార్పొరేట్ ఆస్పత్రి కూడా దీన్ని పాటించడం లేదు. దీంతో ప్రభుత్వం కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదైన కేసులనే డెంగీ కేసులుగా భావిస్తోంది. డెంగీకి కారణమిదే... ఈడిన్ ఈజిఫ్టై (టైగర్ దోమ) కుట్టడం ద్వారా డెంగీ సోకుతుంది. ఇది పగటి పూట మాత్రమే కుడుతుంది. దోమ కుట్టిన 78 రోజులకు హఠాత్తుగా తీవ్రమైన జ్వరం వస్తుంది. కాళ్లు కదలించలేని పరిస్థితి ఉంటుంది. ఎముకలు, కండరాల్లో భరించలేని నొప్పి, శరీరంపై ఎర్రటి పొక్కులు వస్తాయి. రక్త కణాలు సంఖ్య పడిపోతుంది. కొన్నిసార్లు అవయవాలన్నీ పనిచేయడం మానేస్తాయి. లక్షణాలు గుర్తించి వెంటనే చికిత్స తీసుకోవడం వల్ల డెంగీ నుంచి బయటపడొచ్చు. – డాక్టర్ రాజన్న,చిన్నపిల్లల వైద్యుడు అవసరం లేకపోయినా? ఆరోగ్యవంతుడి రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య 1.50 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటుంది. డెంగీ జ్వరంతో వీటి సంఖ్య క్రమేణా తగ్గుతుంటుంది. 10వేల కంటే తగ్గినప్పుడు మాత్రమే తిరిగి వాటిని భర్తీ చేయాలి. 20వేల లోపు ఉన్నప్పుడు... రక్తస్రావ లక్షణాలు కనిపిస్తే ఎక్కించాలి. 20వేల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఒకవేళ రక్తస్రావం అయినా ప్లేట్లెట్లు ఎక్కించాల్సిన అవసరం లేదు. దీనికి బదులుగా రక్తం గడ్డకట్టేందుకు ప్లాస్మాను ఎక్కిస్తారు. ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడంతో జరిగే అనర్థాలు వ్యక్తిని బట్టి మారుతుంటాయి. ప్లేట్లెట్ల సంఖ్యతో పాటు రక్తంలో ప్యాక్డ్ సెల్ వాల్యూమ్ (పీసీవీ) ఎంత ఉందనేది పరిశీలించడం ముఖ్యం. పీసీవీ సాధారణంంగా ఉండాల్సిన దానికంటే 20శాతం, అంతకంటే ఎక్కువైతే అత్యవసరంగా ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ చాలా ఆస్పత్రులు అవసరం లేకపోయినా ప్లేట్లెట్స్ ఎక్కించి, రోగుల నుంచి భారీగా డబ్బులు దండుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పండ్లకు డిమాండ్.. డెంగీ బాధితుల్లో ప్లేట్లెట్స్ కౌంట్స్ పడిపోతుంటాయి. వైద్యులు ఇచ్చే మందులతో పాటు ప్రత్యామ్నాయంగా బొప్పాయి, కీవీ పండ్లు ప్లేట్లెట్స్ కౌంట్స్ను పెంచేందుకు దోహదపడుతుంటాయని అంతా భావిస్తున్నారు. దీంతో సాధారణ జ్వరపీడితులే కాకుండా డెంగీ బాధితులు సైతం వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఒక్కసారిగా వీటికి డిమాండ్ పెరగడంతో వ్యాపారులు ఈ పండ్ల ధరలను అమాంతం పెంచేశారు. నిన్న మొన్నటి వరకు ఒక కీవీ పండు రూ.15 ఉండగా, ప్రస్తుతం రూ.50 వరకు ధర పలుకుతోంది. ఇక కిలో బొప్పాయి రూ.30 ఉండగా.. ప్రస్తుతం రూ.60కి పైగా పలుకుతోంది. దోమల భారీ నుంచి రక్షించుకునేందుకు తెరలను కొనుగోలు చేస్తుండడంతో వాటి ధరలు కూడా అమాంతం పెరిగాయి. సాధారణ రోజుల్లో రూ.200లోపు దొరికిన దోమ తెర... ప్రస్తుతం రూ.1500కి పైగా ధర పలుకుతోంది. ఇదీ పరిస్థితి ♦ నాచారం ఈఎస్ఐ ఆస్పత్రికి రోగుల తాకిడి పెరిగింది. సాధారణ రోజుల్లో ఓపీ సంఖ్య 1,000 వరకు ఉండగా... నాలుగైదు రోజుల నుంచి దాదాపు 2,000 దాటుతోందని సూపరిటెండెంట్ గంగాధర్ తెలిపారు. ♦ ఉప్పల్ ప్రాథమిక వైద్య కేంద్రంలో సాధారణ రోజుల్లో 100 వరకు ఉండే ఓపీ.. ప్రస్తుతం 200 దాటుతోందని డా.పల్లవి తెలిపారు. ఇక్కడ కనీసం ప్యారాసిటమాల్ ట్యాబ్లెట్లు కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. ♦ మల్లాపూర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఓపీ 100 నుంచి 200లకు పెరిగింది. ♦ ఏఎస్రావునగర్ జమ్మిగడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓపీ రెండింతలైందని డాక్టర్ తేజస్వీని తెలిపారు. ♦ శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో డెంగీతో ఇప్పటికే ముగ్గురు మరణించారు. మదీనాగూడకు చెందిన హేమంత్ (10), పాపిరెడ్డి కాలనీకి చెందిన అవినాష్ (13), మాదాపూర్ చందానాయక్ తండాకు చెందిన చందర్నాయక్ (38) డెంగీతో మృతి చెందారు. ♦ మలక్పేట్ ఏరియా ఆస్పత్రి, సరూర్నగర్, మీర్పేట్, మలక్పేట్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు బాధితులు పోటెత్తుతున్నారు. ♦ సికింద్రాబాద్లోని ఐదు డివిజన్లలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. లాలాపేట యాదవ బస్తీకి చెందిన చిన్నారి రుత్విక బుధవారం డెంగీతో మృతి చెందడం గమనార్హం. ♦ అంబర్పేట నియోజకవర్గంలో నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రెండు బస్తీ దవాఖానాలు ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ 50 నుంచి 250కి చేరింది. ♦ వనస్థలిపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి జ్వరపీడితులు పోటెత్తుతున్నారు. సాధారణంగా రోజుకు సగటున 700–800 మంది అవుట్పేషెంట్స్ వస్తుండగా... ఇటీవల ఈ సంఖ్య 1300లకు చేరింది. -
గ్రేటర్లో హెల్త్ ఎమర్జెన్సీ
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్లో డెంగీ, తదితర జ్వరాల బాధితులతో ఆస్పత్రులు కిక్కిరిసి పోతుండటంతో హెల్త్ ఎమర్జెన్సీ ఏర్పడింది. వ్యాధులు సోకేందుకు ఆస్కారమున్న దాదాపు నెలన్నర రోజుల పాటు వైద్యాధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. అన్ని పాఠశాలల్లోనూ ప్రతిరోజూ దోమల నివారణ మందు స్ప్రే చేయాలని, గల్లీలు, రోడ్లపై చెత్త లేకుండా ఏరోజు కారోజు శుభ్రం చేయాలని నిర్ణయించారు. సీజనల్వ్యాధుల నియంత్రణపై జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వివరాలు వెల్లడించారు. మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోం శాఖ మంత్రి మహమూద్అలీ, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంత కుమారి, జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీతోపాటు శివారు మునిసిపాలిటీల్లోనూ ఏరోజుకారోజు చెత్త తొలగించాలని, అవసరమైతే అదనపు సిబ్బందిని, వాహనాలను వినియోగించాలన్నారు. నగరంలో నిర్మాణాలు జరగని ఖాళీ ప్లాట్లలో చెత్త వేస్తుండటంతో డంపింగ్ యార్డులుగా మారాయని, వాటిని తొలగించే బాధ్యత యజమానులదేనన్నారు. జ్వరాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రైవేట్ డాక్టర్లు, మెడికల్ కాలేజీల సహకారంతో వైద్యశిబిరాలు నిర్వహిస్తామన్నారు. సీజనల్ వ్యాధులపై పత్రికల్లో వచ్చే వార్తలపై వెంటనే స్పందించి తగు వివరణలు ఇవ్వాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్పత్రుల్లో చేరుతున్నవారు, పాజిటివ్ కేసులు తదితర వివరాల కోసం కోఆర్డినేటర్ను నియమించి, పరిష్కార చర్యలు తీసుకుంటామన్నారు. కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా నిత్యం పరిస్థితుల్ని సమీక్షిస్తామన్నారు. దోమలు, అంటు వ్యాధుల నివారణకు ప్రజలు, కాలనీ సంక్షేమ సంఘా లు, బస్తీ కమిటీలు కృషి చేయాలని కోరారు. ఆందోళన అనవసరం... అంటు వ్యాధులతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈటల పేర్కొన్నారు. 2017తో పోలిస్తే ప్రస్తుతం డెంగీ కేసులు తక్కువగా ఉన్నాయన్నారు. అయినా వ్యాధుల నివారణకు విస్తృతచర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆసుపత్రులతో పాటు 95 అర్బన్ హెల్త్ సెంటర్లలో ఈవినింగ్ క్లినిక్లు నిర్వహిస్తున్నామన్నారు. ఒక్క ఫీవర్ ఆస్పత్రిలోనే జ్వర బాధితులకు పరీక్షలు నిర్వహించేందుకు 25 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హోం మంత్రి మహమూద్అలీ మాట్లాడుతూ నగరంలో గణేశ్ ఉత్సవాలు, మొహర్రంల సందర్భంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల్లో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల సహకారంతో ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ, వైరల్ ఫీవర్లు అధికంగా ఉన్న వాడలు, బస్తీలు, కాలనీల్లో వారణ చర్యలతోపాటు ఆయా కార్యక్రమాలను మానిటరింగ్ చేయడానికి సంబంధిత డిప్యూటీ, జోనల్ కమిషనర్లు విధిగా పర్యటించాలని కోరారు.జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ , అంటు వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు, డెంగీ, మలేరియా కేసులు నిర్ధారణ అయిన ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఫాగింగ్, స్ప్రేయింగ్ చేపట్టడం, తిరిగి రాకుండా దీర్ఘకాలిక చర్యలను చేపట్టడం అనే త్రిముఖవ్యూహాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రతి శుక్రవారాన్ని డ్రై డేగా పాటించాలని కోరుతూ జీహెచ్ఎంసీ రూపొందించిన కరపత్రాన్ని మంత్రులు ఆవిష్కరించారు. -
వ్యాధులపై ఆందోళన చెందవద్దు
కీసర: డెంగీ జ్వరాలపై ప్రజలు ఆందోళన చెందవద్దని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. బుధవారం దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని సాయిభవాని గార్డెన్లో డెంగీ, మలేరియా తదితర సీజనల్ జ్వరాలపై అవగాహన కల్పించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మరో మంత్రి మల్లారెడ్డితో కలిసి పాల్గొన్న ఈటల మాట్లాడుతూ.. మంగళవారం తాను నల్లకుంట ఫీవర్, నిలోఫర్ ఆస్పత్రిలో పర్యటించానని, అక్కడి రోగులతో మాట్లాడితే నలుగురు దమ్మాయిగూడకు చెందినవారిమని చెప్పారన్నారు. దీంతో వెంటనే ఇక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్న కేసుల్లో వైరల్ ఫీవర్స్ అధికంగా ఉన్నాయని, ఈ జ్వరాలను కూడా డెంగీగా భావించి ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు వెనువెంటనే వైద్యసేవలు అందేలా సౌకర్యాలు కల్పించామని ఆయన వివరించారు. ఈ సీజన్లో ఇప్పటి దాకా రాష్ట్ర వ్యాప్తంగా 650 ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి 51 వేల మందికి వైద్య పరీక్షలు చేయగా అందులో 61 మందికి మాత్రమే డెంగీ నిర్థారణ అయిందన్నారు. జవహర్నగర్, దమ్మాయిగూడ పరిసర ప్రాంతాల్లో ప్రజలందరికీ వైద్యపరీక్షలు, అవసరమైన మందుల పంపిణీ చేసేవరకు వైద్య శిబిరాలను నిర్వహించాలని వైద్య ఆరోగ్యశాఖ సంచాలకుడు శ్రీనివాస్కు సూచించారు. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా కొంత మేర రోగాల బారిన పడకుండా ఉండేందుకు ఆష్కారం ఉందన్నారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. జవహార్నగర్ చెత్త డంపింగ్ యార్డు సమీపంలో ఉన్న దమ్మాయిగూడ మున్సిపాలిటీలో స్థానిక అధికారులు క్రమం తప్పకుండా పారిశుధ్య నిర్వహణతో పాటు, దోమల నివారణకు ఫాగింగ్ చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందికి అదనంగా మరో 100 మందిని నెలరోజుల పాటు నియమించి పనులు చేయాలని కమిషనర్ రామలింగానికి సూచించారు. ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులందరికీ డెంగీ, మలేరియాపై అవగహన కల్పిండచంతో పాటు, హోమియో మందులను పంపిణీ చేయాలని ఆదేశించారు. అనంతరం మంత్రులు విద్యార్థులకు డెంగీ, మలేరియా జ్వరాలు రాకుండా హోమియో మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ లింగరాజు, రామంతాపూర్ ఆయుర్వేదిక్ ఆస్పత్రి వైద్యులు వెంకటయ్య, ఉమా మహేశ్వర్రావు, కీసర ఆయుర్వేదిక్ వైద్యాధికారి శ్రీదేవి, ఎంపీపీ మల్లారపు ఇందిర తదితరులు పాల్గొన్నారు. జ్వరాల నియంత్రణకు చర్యలు రామంతాపూర్: వాతావరణంలో మార్పుల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ జ్వరాలు ప్రబలుతున్నాయని, సీఎం ఆదేశాల మేరకు పట్టణ, గ్రామీణ ప్రభుత్వ ఆస్పత్రుల్లో జ్వరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. డెంగీ జ్వరాలు రాకుండా వాడే హోమియో మందుల ఉచిత పంపిణీ శిబిరాన్ని బుధవారం రామంతాపూర్ ప్రభుత్వ హోమియో బోధనాస్పత్రిలో ఆయన మేయర్ బొంతు రామ్మోహన్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే భేతి సుభాష్రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. డెంగీ జ్వరాలపై ప్రజలు అపోహలు పెంచుకోవద్దని సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 105 బస్తీ దవాఖానాలతో పాటు ఫీవర్, గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ ఆస్పత్రులలో సెలవు, పండగ దినాల్లో సైతం ఉదయం, సాయంత్రం కూడా ఓపీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా డెంగీ వ్యాధి నిర్థారణ పరీక్షలు చేస్తున్నట్టు తెలిపారు. మంత్రుల వెంట ఆయూష్ అడిషనల్ డైరెక్టర్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ లింగరాజు, కార్పొరేటర్లు ఉన్నారు. -
వణికిస్తున్న జ్వరాలు.. 16 లక్షల మందికి డెంగీ పరీక్షలు
సాక్షి ప్రత్యేక ప్రతినిధి– హైదరాబాద్ : ఒక జిల్లా రెవెన్యూ అధికారి నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. మరో ప్రాంతీయ రవాణా అధికారి కూడా వారం నుంచి ఇదే పరిస్థితిలో ఆసుపత్రిలో ఉన్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో జ్వరాల కారణంగా రోజువారీగా 20–25% మంది కార్మికులు, ఉద్యోగులు విధులకు హాజరు కాలేకపోతున్నారు. ఒక పని కోసం మండల స్థాయి నాయకుడు ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్తే తన మనవడికి జ్వరం వచ్చినందున ఆసుపత్రిలో ఉన్నానని, తాను ఇప్పుడు కలవలేనని చెప్పాడు. అనేక మంది ప్రజాప్రతినిధులు కూడా జ్వరాల బారిన పడ్డారు. సచివాలయంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది జ్వరాలబారిన పడడంతో కుర్చీలు ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనూ జ్వరాల కారణంగా సిబ్బంది విధులకు రావడంలేదు. సాఫ్ట్వేర్ ఉద్యోగులయితే ఆఫీసులకు రానవసరం లేదని, జ్వరం వస్తే విధులకు హాజరయినట్టే పరిగణిస్తామని ఆయా సంస్థలు సమాచారం ఇచ్చేశాయి. ఇదీ పడకేసిన తెలంగాణ తాజా పరిస్థితి. జ్వరపీడితులతో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. డెంగీ పాజిటివ్ వస్తేనే బెడ్ ఇస్తామంటూ ఆసుపత్రులు తేల్చేశాయి. అది కూడా నాలుగైదు రోజుల నిరీక్షణ తర్వాతే. విధిలేని పరిస్థితుల్లో ఒక్కో పడకపై ఇద్దరిని పడుకోబెట్టి చికిత్సనందిస్తున్నాయి. సందర్శకులుండే రిసెప్షన్ సెంటర్లు కూడా రోగులతో నిండిపోతున్నాయి. అనధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 1.25 కోట్ల మంది జ్వరాలతో బాధపడుతున్నారని అంచనా. నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రిలో సోమవారం వచ్చిన ఔట్పేషంట్ల సంఖ్య 2వేల పైమాటే. వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 16లక్షల మంది డెంగీ పరీక్షలు చేయించుకున్నారంటేనే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది. ఎటు చూసినా రోగులే! రాష్ట్రంలోని ఆసుపత్రులు జ్వరబాధితులతో కిటకిటలాడుతున్నాయి. మండల, జిల్లా కేంద్రాల్లో ఉండే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ రోగులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీంతో జ్వరం పేరుతో వచ్చిన వారందరికీ పరీక్షలు చేయాల్సి వస్తోంది. పరీక్షల అనంతరం డెంగీయా? మలేరియానా? అని తేలిన తర్వాతే ఆసుపత్రుల్లోనే ఉంచి చికిత్సనందిచాల్సి వస్తోంది. దీంతో ఆసుపత్రుల్లో పడకలకు కూడా కొరత ఏర్పడింది. తీవ్రజ్వరంతో వచ్చిన రోగికి పడక కావాలంటే నాలుగైదు రోజులు పడుతోందని, రోగుల సంఖ్యకు అనుగుణంగా ఎక్కడా బెడ్లు లేకపోవడంతో ఈ పరిస్థితి తప్పడం లేదని బాధితుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఇదే అదనుగా ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు సొమ్ము చేసుకుంటున్నాయనే ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. జ్వరమనగానే అన్ని రకాల పరీక్షలు రాస్తుండడం, వాటికి వీలున్నంత ఎక్కువగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. అవసరమున్నా లేకపోయినా ఎడాపెడా మందులు రాస్తూ భారీగా దండుకుంటున్నాయి. 12 జిల్లాల్లో హైరిస్క్ రాష్ట్రంలో పరిస్థితిని బట్టి మొత్తం 12 జిల్లాలను ప్రభుత్వం హైరిస్క్ జిల్లాలుగా గుర్తించింది. ఇందులో హైదరాబాద్, భద్రాద్రి జిల్లాల్లో మరింత ప్రమాదకర పరిస్థితులున్నాయని, ఆయాప్రాంతాల్లో తగిన చర్యలు వేగవంతంగా చేపట్టాలని ఆదేశించింది. ఒక్క హైదరాబాద్లోనే 309 డెంగీ హైరిస్క్, 151 మలేరియా హైరిస్క్ ప్రాంతాలను గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఫాగింగ్, యాంటీ–లార్వా ఆపరేషన్లు, నాలాలు, మురుగు కాల్వల్లో డ్రోన్ల ద్వారా స్ప్రేయింగ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, ఈ నివారణ చర్యలేవీ క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోలేదు. గ్రేటర్లో వర్షాల కారణంగా మురుగునీరు ఎక్కడికక్కడ నిలిచిపోయినా పట్టించుకున్న అధికారుల్లేరు. దీంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. క్లోరినేషన్ చేయకపోవడంతో మంచినీటిని ముట్టుకునే పరిస్థితి లేదు. తాగునీరు కూడా జ్వరాలకు కారణమవుతోందనే ఆందోళన నగర ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే హైదరాబాద్ నగర పరిధిలో ఎటుచూసినా అపరిశుభ్రతే దర్శనమిస్తోంది. 24 గంటల ఓపీలేవీ రాష్ట్రంలో జ్వర తీవ్రత దృష్ట్యా జిల్లా కేంద్ర ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రుల్లో 24 గంటల పాటు ఓపీ సేవలు అందించాలని ప్రభుత్వ వర్గాలు ఆదేశించాయి. కానీ, ఎక్కడా ఈ సేవలు కనిపించడం లేదని జ్వర పీడితులు, వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ప్రభుత్వ ఆసుపత్రులకెళ్తే పట్టించుకునే వారే లేరంటున్నారు. వేల రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లినా అక్కడా ప్రయోజనం ఉండటం లేదని బాధితులు, వారి కుటుంబసభ్యులు వాపోతున్నారు. చేతి చమురు వదిలించుకోవడం తప్ప పెద్దగా ప్రయోజనం ఉండటం లేదంటున్నారు. విద్యార్థులకే ఎక్కువ జ్వర పీడితుల్లో అన్ని వయసులు వారున్నా అందులో విద్యార్థుల సంఖ్యే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ జ్వరం వల్ల చనిపోతున్న వారిలోనూ ఎక్కువ మంది చిన్నారులే ఉండడం బాధాకరం. దీంతో తల్లిదండ్రులు.. పాఠశాలలు, విద్యాసంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల్లో పరిశుభ్ర వాతావరణం లేకపోవడం, కొన్ని పాఠశాలల్లో కనీసం వెంటిలేషన్ కూడా లేకపోవడంతో విద్యార్థుల్లో ఎక్కువగా జ్వరాలు ప్రబలుతున్నాయని మండిపడుతున్నారు. చాలాచోట్ల వాటర్ ప్యూరిఫయర్లు కూడా లేకపోవడం, ఫాగింగ్ అసలే జరగకపోవడంతో పాఠశాలల్లోనే జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయనే ఫిర్యాదులు అందుతున్నాయి. అన్ని చోట్లా ఇదే పరిస్థితి ఒక్క పాఠశాలల్లోనే కాదు. రాష్ట్రంలోని అన్ని చోట్లా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, సినిమాథియేటర్లు, షాపింగ్మాల్స్.. ఇలా ప్రతిచోటా.. పనిచేసే సిబ్బంది జ్వరం బారిన పడుతుండటతో ఆయా ప్రాంగణాలు బోసిపోతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది పలుచబడటంతో పౌరసేవల్లో జాప్యం జరుగుతోంది. అయితే, గత మూడేళ్లతో పోలిస్తే రాష్ట్రంలో డెంగీ కేసులు పెరగ్గా, మలేరియా కేసులు తగ్గాయని గణాంకాలు చెబుతున్నాయి. జూన్–ఆగస్టు మాసాల్లో 2017లో సగటున 135 డెంగీ కేసులు నమోదు కాగా, 2019లో అది 149కి పెరిగింది. అదే మలేరియా విషయానికి వస్తే 2017లో 206 కేసులు నమోదు కాగా, 2019లో 47కు తగ్గిపోవడం గమనార్హం. ముందు జాగ్రత్తలివే! డెంగీ, మలేరియా, విష జ్వరాలొచ్చేముందు తీవ్ర జ్వరం, భరించలేని తలనొప్పి వస్తుంది. కళ్లు తెరవడం కూడా కష్టంగా ఉంటుంది. ఒల్లు కదిపితే నొప్పెడుతుంది. చర్మంపై దద్దుర్లు కనిపించడం, కండరాలు, కీళ్లనొప్పులు ఉంటాయి. అధిక దాహం, రక్తపోటు పడిపోవడం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. డెంగీతో పాటు మలేరియా ఇతర జ్వరాల నిర్ధారణలో వైద్య పరీక్షలే కీలకం. కేవలం ప్లేట్లెట్ కౌంట్, డెంగీ స్ట్రిప్ టెస్ట్, సీరమ్ టెస్ట్ వంటి వాటితో నిర్ధారించడానికి శాస్త్రీయత లేదని వైద్య, ఆరోగ్యశాఖ చెబుతోంది. తప్పనిసరిగా ఐజీఎం పరీక్ష చేయించాలి. ప్లేట్లెట్లు 20వేలలోపు పడిపోతే అది ప్రమాదకరం. 15వేల కన్నా తగ్గితే డెంగీ షాక్, మరణాలు సంభవిస్తాయి. డెంగీ జ్వరం వస్తే తీవ్రతను తగ్గించేందుకు చల్లని నీటిలో స్పాంజీని ముంచి శరీరాన్ని తుడవాలి. ఎలక్ట్రాల్ పౌడర్, పళ్లరసాలు రోగికి ఇవ్వాలి. దీనివల్ల జ్వరతీవ్రత తగ్గి ప్లేట్లెట్లు అదుపులోకి వస్తాయి. ఇంకా తగ్గకుంటే వైద్యుని వద్దకు తీసుకెళ్లాలి. దోమలు కుట్టకుండా రోజూ జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రి మాత్రమే కాకుండా పగటిపూట కూడా దోమల మందులు వాడాలి. స్కూల్ పిల్లలకు దోమలు కుట్టకుండా పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉంచాలి. కాచి వడబోసిన నీటిని తాగాలి. వైరల్ ఫీవర్ వస్తే మంచినీరు ఎక్కువగా తాగాలి. పండ్ల రసాలు తీసుకోవాలి. దీనివల్ల ప్లేట్లెట్లు పడిపోకుండా జాగ్రత్తపడవచ్చు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
గ్లోబల్ వార్మింగ్ డెంగీ వార్నింగ్!
డెంగీ, జికా, మలేరియా, చికున్గున్యా, ఎల్లో ఫీవర్, ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధులు ఇవే. ఈ వ్యాధులన్నింటికీ మూలకారణం దోమల సంతతి విపరీతంగా పెరిగిపోవడమే. ఇలా దోమలు పెరిగిపోవడానికి, పర్యావరణంలో వస్తున్న మార్పులకి సంబంధం ఉందట. మానవ చరిత్రలో తిమింగలం కంటే ప్రమాదకరమైనది దోమేనని ప్రముఖ చరిత్రకారిణి తిమొతి వైన్గార్డ్ కొత్త పుస్తకంది మస్కిటో.. ఏ హ్యూమన్ హిస్టరీ ఆఫ్ అవర్ డెడ్లీయస్ట్ ప్రిడేటర్ పుస్తకంలో వెల్లడించారు. ఇందులో దోమలు ప్రపంచ దేశాలకు విస్తరించడానికి, వాతావరణంలో వస్తున్న మార్పులకి సంబంధం ఉందని విశ్లేషించారు. 100 దేశాలకు డెంగీ... వాతావరణంలో వస్తున్న మార్పులు దోమల కారణంగా విస్తరించే వ్యాధులు అనే అధ్యయనంలో ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న వ్యాధుల్లో డెంగీ మొదటి స్థానంలో ఉంది. ముఖ్యంగా దక్షిణ యూరప్ దేశాల్లో వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పుల కారణంగా దోమలు పెరిగిపోయి డెంగీ వ్యాధి ప్రబలుతోందని ఆ అధ్యయనానికి నేతృత్వం వహించిన యాకూబ్ చెప్పారు. ‘భూమి వాతావరణం వేడెక్కిపోతున్న కొద్దీ దోమల సంఖ్య పెరిగిపోతుంది. ఆడదోమలు గుడ్లు పెట్టడానికి వేడి పరిస్థితులు ఉండాలి. వాతావరణం పొడిబారిపోవడం, కాలం కాని కాలంలో వర్షాలు, అడ్డగోలుగా పట్టణీకరణ వంటి కారణాలతో దోమలు ఎక్కువైపోతున్నాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్లో దోమలు వృద్ధి చెందడానికి అనుకూల వాతావరణం ఉంది’అని ఆయన వెల్లడించారు. 1970కి ముందు కేవలం 10 దేశాల్లో మాత్రమే డెంగీ వ్యాధి ఉండేది. ఇప్పుడు 100కిపైగా దేశాలకు విస్తరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ఆ్రస్టేలియా, కండోడియా, చైనా, బంగ్లాదేశ్, మలేసియా వంటి దేశాల్లో డెంగీ వ్యాధి బాగా విస్తరించింది. 200 కోట్లకు బాధితులు గ్లోబల్ వార్మింగ్ పరిస్థితుల్ని అదుపు చేయలేకపోతే వాతావరణంలో వస్తున్న 17 మార్పుల కారణంగా 2050 నాటికి ప్రపంచంలో సగం జనాభా ఉండే ప్రాంతాల్లో దోమలు బాగా వృద్ధి చెందుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2050 నాటికి డెంగీ సహా వివిధ రకాల వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మందికి సోకే అవకాశాలున్నాయని వారు చెబుతున్నారు. జీవో కవచం... దోమలు మన రక్తం వాసనని పసిగట్టి కుట్టడానికి మీదకి వస్తాయి. ఈ రక్తం వాసనని పసిగట్టకుండా దోమల్ని నివారించడానికి గ్రాఫిన్ ఆక్సైడ్ (జీవో) అనే అతి సన్నని పదార్థంతో తయారు చేసిన రక్షణ కవచాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అందుబాటులోకి తేనున్నారు. గ్రాఫిన్లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అణుపరిమాణం అంత సన్నగా ఉంటుంది. రబ్బరులా సాగే గుణం, ఉక్కు కంటే 200 రెట్లు గట్టిగా ఉంటుంది, రాగి కంటే సుల భంగా దేనితోనైనా కలిపేసే అవకాశం కూడా ఉంది. గ్రాఫిన్తో అభివృద్ధి చేసిన అతి పల్చటి కవచం దోమలు మనిషి ఒంటిపై రసాయనాలు గుర్తించకుండా కాపాడుతుందని బ్రౌన్ వర్సిటీకి చెందిన సీనియర్ ప్రొఫెసర్ రాబర్ట్ హర్ట్ వెల్లడించారు. అన్నింటికంటే ముఖ్యంగా ఎలాంటి రసాయనాలు వాడకుండా దోమకాటు నుంచి తప్పించుకోవచ్చన్నారు. మీకు తెలుసా?... - దోమ ఒక్కసారి కాటుతో 0.001 నుంచి 0.1 ఎంఎల్ రక్తాన్ని పీలుస్తుంది. - దోమలు వాటి బరువు కంటే మూడు రెట్లు ఎక్కువ రక్తాన్ని పీలుస్తాయి. - మగ దోమలు శాకాహారులు. ఆడదోమలు మాత్రమే మనుషుల్ని కుడతాయి. ఎందుకంటే ఆడదోమలు గుడ్లు పెట్టడానికి అవసరమైన ప్రొటీన్లు మనుషుల రక్తం నుంచే తీసుకుంటాయి. - ‘ఓ’గ్రూప్ రక్తం ఉన్న వారిని దోమలు ఎక్కువగా కుడతాయి. - ప్రపంచంలో ఐస్ల్యాండ్ మాత్రమే దోమలు లేని దేశం. - మానవ శరీరంలో రక్తాన్ని అంతా 12 లక్షల దోమలు పీల్చగలవు. - దోమలు వాసనల్ని పసిగడతాయి. కొన్ని రకాల వాసనలకు అవి దూరంగా ఉంటాయి. తులసి ఆకులు, నిమ్మకాయలు, వెల్లుల్లి, బంతిపూల వాసన వస్తే దోమలు దూరంగా పారిపోతాయి. - ఆడదోమలు ఒకేసారి 300 గుడ్లు పెట్టగలవు. - దోమల జీవిత కాలం 2 నెలలలోపే. మగ దోమలు 10 రోజులు, ఆడదోమలు 6 నుంచి 7 వారాలు జీవించి ఉండగలవు. -
డెంగీ కౌంటర్లు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సాధారణ జ్వరం సోకి ఆస్పత్రులకు వెళ్లినా డెంగీ పేరిట రోగులను పీల్చిపిప్పి చేస్తున్నారు. ఈ పరిస్థితి నివారణతోపాటు ఈ వర్షాకాల సీజన్లో అంటువ్యాధుల నివారణ కార్యక్రమాలను జీహెచ్ఎంసీ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ మెడికల్ ఆఫీసర్లతోపాటు గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల వైద్యాధికారులు, ఎంటమాలజీ అధికారులతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. జ్వరం సోకిన వారికి ఏ వ్యాధి అయినది సరిగ్గా నిర్ధారించేందుకు ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల్లో జ్వర నిర్ధారణకు ప్రత్యేకంగా 21 కౌంటర్లను అదనంగా తెరవాలని సమావేశంలో నిర్ణయించారు. జ్వరాలతో వచ్చే రోగులకు ప్రత్యేకంగావైద్యపరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారించేందుకు ఏర్పాటు చేయనున్న ఈ కౌంటర్లు ఉస్మానియాలో 5, గాంధీలో 6, ఫీవర్ ఆస్పత్రిలో 10 ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రత్యేక కౌంటర్లలో జనరల్ ఫిజీషియన్ అందుబాటులో ఉంటారని, సాయంత్రం 4 గంటల వరకు ఇవి తెరచి ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎలీసా టెస్ట్ నిర్వహించకుండానే డెంగ్యూగా ప్రకటిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ఇది చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి నిర్ధారణ అయిన డెంగీ వివరాల జాబితా ఇప్పటి వరకు కూడా వైద్య, ఆరోగ్యశాఖకు అందలేదని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఇప్పటి వరకు రెండు విడతల్లో దాదాపు 1100 మెడికల్ క్యాంపులు నిర్వహించగా, వచ్చేనెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీవరకు మరో 695 మెడికల్క్యాంపులు నిర్వహించనున్నట్లు కమిషనర్ దానకిశోర్ ప్రకటించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ జిల్లాలో 250, రంగారెడ్డి జిల్లాలో 165, మేడ్చల్ జిల్లాలో 165 మెడికల్ క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, మలేరియా అధికారులు,జీహెచ్ఎంసీ మెడికల్ ఆఫీసర్లు, ఎంటమాలజీ విభాగం అధికారులు సంయుక్తంగా అంటువ్యాధులు ప్రబలే వల్నరబుల్ ప్రాంతాల్లో ఈ క్యాంపులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దోమలవ్యాప్తి నిరోధానికి వివిధ విభాగాలతో కూడిన ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ సందీప్జా, జోనల్ కమిషనర్లు శ్రీనివాస్రెడ్డి, శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు. -
పట్నంలో అడవి దోమ!
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇప్పటి దాకా ఏజెన్సీ, గిరిజన ప్రాంతాలకే పరిమితమైన దోమలు ఇప్పుడు గ్రేటర్లోనూ దాడులు చేస్తున్నాయి. ప్రధానంగా మలేరియాలో ప్రమాదకరమైన ప్లాస్మోడియం పాల్సీ ఫారం(పీఎఫ్) నగరంలో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ఏడాది ఇప్పటి దాకా 191 మలేరియా కేసులు నమోదవగా, వీటిలో 150 మందిలో పీఎఫ్ లక్షణాలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. అనధికారికంగా ఈ లెక్క మరింత ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. సాధారణంగా ప్లాస్మోడియం అనే పరాన్నజీవి ద్వారా మలేరియా సోకుతుంది. మలేరియాలో ప్లాస్మోడియం వైవాక్స్(పీవీ), ప్లాస్మోడియం పాల్సీఫారం(పీఎఫ్) అనేవి రెండు రకాలు. ప్లాస్మోడియం వైవాక్స్ వ్యాపించినపుడు జ్వరం, ఒళ్లు నొప్పులు, వాంతులు ఉంటాయి. మందులు వాడితే తగ్గిపోతుంది. ఇది అంత ప్రమాదకరమైంది కాదు. కానీ ప్లాస్మోడియం పాల్సీఫారం మలేరియా చాలా ప్రమాదకరమైంది. గతంలో ఎక్కడో గిరిజన, అటవీ ప్రాంతాల్లో కన్పించే ఈ జ్వరాలు.. ప్రస్తుతం నగరంలోనూ వ్యాపిస్తున్నాయి. శివారు ప్రాంతాలు విస్తరించడం, కొత్తగా ఫామ్హౌస్లు అందుబాటులోకి రావడం, నిర్మాణానికి సంబంధించిన గుంతల్లో వరద నీరు చేరి నిల్వ ఉండటం, వాటి నిండా చెత్త పేరుకపోవడం వల్ల ఈ దోమల వ్యాప్తికి కారణమవుతున్నట్లు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రక్త పరీక్ష చేసేవారే లేరు హైదరాబాద్ జిల్లాలో ఫీవర్ ఆస్పత్రి, కింగ్కోఠి, మాసాబ్ ట్యాంక్, మలక్పేట, సికింద్రాబాద్, కంటోన్మెంట్లలో మలేరియా సబ్సెంటర్లు ఉన్నాయి. 17 మంది ల్యాబ్ టెక్నిషియన్ పోస్టులు ఉండగా, వీటన్నింటికీ ఒక్క టెక్నీషియన్ మాత్రమే ఉన్నాడు. మిగతా 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఆయా ఆస్పత్రుల్లో రక్త పరీక్షలు చేసే నాథుడే కనిపించడం లేదు. ఒక ప్రాంతంలో మలేరియా, డెంగీ కేసు నమోదైన వెంటనే ఆ కుటుంబంలోని మిగతా సభ్యులతో పాటు సదరు కాలనీలో 50 మందికి తక్కువ కాకుండా రక్త నమూనాలు సేకరించాలి. వాటిని ల్యాబ్కు పంపి పరీక్షించాలి. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య కార్యకర్తలు నమూనాలు సేకరించాలి. కొన్ని ఏరియాల్లో సేకరిస్తున్నా అవి ల్యాబ్లకు పంపి చేతులు దులుపుకొంటున్నారు. వాటిని పరీక్షించేందుకు తీవ్రంగా సిబ్బంది కొరత వేధిస్తోంది. పారిశుధ్యంపై దృష్టి దోమల నియంత్రణ చేపట్టాల్సిన బల్దియా చోద్యం చూస్తోంది. విజృంభిస్తున్న డెంగీ జ్వరాలు కొన్ని రోజులుగా నగరంలో డెంగీ జ్వరాలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ జిల్లాలో గతేడాది 150 డెంగీ పాజిటివ్ కేసులు నమోదైతే.. ఈ ఏడాది ఇప్పటి దాకా 205 కేసులు నమోదయ్యాయి. వాస్తవానికి ఈ జ్వర లక్షణాలు గుర్తించి వెంటనే చికిత్స తీసుకోవడం వల్ల డెంగీని పూర్తిగా నివారించవచ్చు. అయితే, అందుకు తొలుత రక్త పరీక్షలు చేయాల్సి ఉన్నా ఆస్పత్రుల్లో ఆ అవకాశం దాదాపు ఉండడం లేదు. నగరంలో మలేరియా, డెంగీ జ్వరాలు ప్రబలుతున్నా సరే వైద్య ఆరోగ్యశాఖ మాత్రం నివారణ చర్యలు తీసుకునేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం ఆ శాఖ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. లక్షణాల గుర్తింపు ఇలా.. ప్లాస్మోడియం పాల్సీఫారం రకం మలేరియాను వెంటనే గుర్తించి చికిత్స తీసుకోవాలి. చికిత్స అందించడంలో ఆలస్యమైతే కాలేయం, మూత్ర పిండాలను దెబ్బతీస్తుంది. మెదడుపైనా దాడి చేసి రోగి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. దోమ కుట్టిన 10 నుంచి 14 రోజుల్లో జ్వరం వస్తుంది. రోజు విడిచి రోజు ఒక సమయంలో ఎక్కువగా సాయంత్రం వేళల్లో చలి జ్వరం వస్తుంది. తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఈ లక్షణాలు మూడు రోజులు మించి ఉంటే వెంటనే రక్త పరీక్షలు చేసుకోవాలి. – డాక్టర్ శ్రీహర్ష, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ -
డెంగీ హైరిస్క్ జిల్లాలు 14
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 14 డెంగీ హైరిస్క్ జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అలాగే మలేరియా హైరిస్క్ జిల్లాలను ఐదింటిని నిర్ధారించింది. ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, మహబూబ్నగర్, హైదరాబాద్, వరంగల్ రూరల్, కరీంనగర్, భూపాలపల్లి, రంగారెడ్డి, మహబూబాబాద్, వరంగల్ అర్బన్, మేడ్చల్, నిజామాబాద్ జిల్లాల్లో అత్యధికంగా డెంగీ హైరిస్క్గా ఉన్నట్లు నిర్ధారించారు. ఇక మలేరియా హైరిస్క్ జిల్లాల్లో జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, ఆసిఫాబాద్, మహబూబాబాద్ ఉన్నాయి. ఏడాదికేడాది డెంగీ కేసులు రాష్ట్రంలో అత్యధికంగా నమోదవుతున్నాయి. 2012లో 962 డెంగీ కేసులు నమోదు కాగా, 2018లో ఏకంగా 6,362 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ ఏడాది మే నెల వరకు సీజన్ లేని సమయంలోనే 756 కేసులు నమోదయ్యాయి. అయితే మలేరియా కేసులు మాత్రం తగ్గుముఖం పడుతున్నాయని సర్కారు నివేదిక తెలిపింది. 2015లో 11,880 మలేరియా కేసులు నమోదు కాగా, గతేడాది కేవలం 1,792 కేసులే నమోదయ్యాయి. చికున్గున్యా కేసులు 2012లో 94 కేసులు నమోదు కాగా, గతేడాది ఏకంగా 1,063 నమోదు కావడం గమనార్హం. రేపు కలెక్టర్లతో మంత్రి సమీక్ష... వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం ప్రభుత్వం దృష్టి సారించింది. ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాకాలం ప్రబలే సీజనల్ వ్యాధులపై కేంద్రీకరించింది. ప్రధానంగా పది ఏజెన్సీ జిల్లాల్లో మలేరియా, డెంగీతో పాటు సీజనల్ వ్యాధులను అదుపులో ఉంచేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. శుక్రవారం సీజనల్ వ్యాధులు తీవ్రంగా ఉండే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచి ర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, నాగర్ కర్నూలు, ములుగు జిల్లా కలెక్టర్లు, ప్రాజెక్టు ఆఫీసర్లు, ఐటీడీఏ అధికారులు, జిల్లా వైద్యాధికారులతో వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ సమావేశం కానున్నారు. వర్షాకాలం నేపథ్యంలో ముం దస్తుగా చేపట్టాల్సిన ప్రణాళికపై జిల్లా కలెక్టర్లకు మంత్రి దిశానిర్దేశం చేస్తారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ముందుగా దోమల నివారణకు పంచాయతీరాజ్, విద్య, ఇరిగేషన్, మైనింగ్, ఐసీడీఎస్, మత్యశాఖ అధికార యంత్రాంగంతో సమన్వయ పరిచి చర్యలు తీసుకోనున్నారు. యాంటీ లార్వా ఆపరేషన్ చేపట్టనున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదయ్యే వేక్టర్ బోర్న్ వ్యాధులైన చికెన్ గున్యా, యెల్లో ఫీవర్, డెంగీ, జికా, ఫైలేరియా లాంటి కేసుల వివరాలను కూడా ఈసారి సేకరించి, అవి ప్రబలకుండా అధికార యంత్రాంగంనివారణ చర్యలు తీసుకుంటారు. -
నిలోఫర్లో బాలుడి మృతి.. తల్లిదండ్రుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్ : నగరంలో నిలోఫర్ ఆసుపత్రిలో మూడేళ్ల బాలుడు మృతి చెందడం ఆందోళనకు దారితీసింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాలుడు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే దూల్పేట్కు చెందిన వీర్ సింగ్కు డెంగీ జ్వరం రావడంతో అతని తల్లిదండ్రులు నిలోఫర్ ఆస్పత్రిలో చేర్చారు. మూడు రోజుల నుంచి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలుడు మంగళవారం మృతి చెందాడు. అయితే బాలుడి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. -
ప్లేట్లెట్స్ ఎవరికి, ఎప్పుడు ఎక్కించాలి?
ఈమధ్య ఎవరికైనా జ్వరం వస్తే వైరల్ ఫీవరని హాస్పిటల్లో అడ్మిట్ చేసి, ప్లేట్లెట్స్ ఎక్కించేస్తున్నారు. అసలిది ఎంతవరకు కరెక్ట్ అనే అనుమానం ప్రజల్లో ఉంటోంది. అసలు ప్లేట్లెట్స్ ఎవరికి ఎక్కించాలి? ఎలాంటి పరిస్థితుల్లో ఎక్కించాలి? వివరంగా చెప్పండి. శరీరంలో ప్లేట్లెట్లు ఏమాత్రం తగ్గినా వెంటనే ప్లేట్లెట్లు ఎక్కించాలనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. అది సరికాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మార్గదర్శకాల ప్రకారం ప్లేట్లెట్ల సంఖ్య పదివేల కంటే తగ్గితేగానీ వాటిని ఎక్కించకూడదు. ఒకవేళ పదివేల కన్నా ఎక్కువగా ఉండి రక్తస్రావం అవుతుంటే మాత్రం ప్లేట్లెట్లు ఎక్కించాల్సి ఉంటుంది. శరీరానికి సహజంగానే తగ్గిపోయిన ప్లేట్లెట్స్ను తిరిగి ఉత్పత్తి చేసుకునే శక్తి ఉంటుంది. అందుకే అత్యవసర సమయాల్లో మాత్రమే ప్లేట్లెట్స్ ఎక్కించాలి. సరైన వ్యాధి నిర్ధారణ అవసరం శరీరంలో ప్లేట్లెట్ల సంఖ్య ఎందుకు తగ్గుతుందనే అంశంపై సరైన వ్యాధి నిర్ధారణ జరిగితే చికిత్స సులువవుతుంది. డెంగ్యూ కారణంగా కొందరిలో ప్లేట్లెట్ల సంఖ్య చాలా వేగంగా పడిపోతూ ఉంటుంది. వీరికి డెంగ్యూ చికిత్సతో పాటు అవసరాన్ని బట్టి ప్లేట్లెట్లు ఎక్కించాల్సి ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా ప్లేట్లెట్ల సంఖ్య పడిపోతే వారం పదిరోజుల్లో ఆ పరిస్థితి సాధారణ స్థితికి వస్తుంది. మలేరియా కారణంగా ప్లేట్లెట్లు పడిపోతే మలేరియాకే చికిత్స అందించాలి. ఏవైనా మందుల కారణంగా ప్లేట్లెట్లు పడిపోతూ ఉంటే వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ, ఆ మందులు మానేయాల్సి ఉంటుంది. ముందు ప్లేట్లెట్లు పడిపోవడానికి సరైన కారణం తెలుసుకుని చికిత్స చేయించుకోవాలి. అందుబాటులో అత్యాధునిక చికిత్సా విధానాలు శరీరంలో ఏ కారణంతో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గినా ఇప్పుడు మెరుగైన వైద్యం అందించగలుగుతున్నారు. గతంలో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గితే రోగులు చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉండేది. కానీ అందివస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఇప్పుడు అత్యాధునిక విధానాల్లో చికిత్స అందిస్తుండటం వల్ల చాలామందిని ప్రాణాపాయం నుంచి రక్షించగలుగుతున్నారు. రక్తంలో ప్లేట్లెట్స్ తగ్గితే దాత నుంచి లేదా సేకరించిన రక్తం నుంచి కేవలం ప్లేట్లెట్లను మాత్రమే వేరుచేసి ఎక్కించే అధునాతన సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ (ఎస్డీపీ), రాండమ్ డోనార్ ప్లేట్లెట్స్ (ఆర్డీపీ) అనే రెండు పద్ధతులలో రక్తం నుంచి ప్లేట్లెట్లను వేరు చేసి, అవసరమైన వారికి ఎక్కిస్తున్నారు. ఎస్డీపీ విధానంలో దానుంచి నేరుగా ప్లేట్లెట్లను సేకరిస్తారు. ఆర్డీపీ విధానంలో సేకరించిన రక్తం నుంచి ప్లేట్లెట్లను వేరుచేస్తారు. అయితే ఎస్డీపీ విధానంలో ఒకసారికి 50 వేల నుంచి 60 వేల వరకు ప్లేట్లెట్లను సేకరించే అవకాశం ఉంటుంది. -
డెంగ్యూకు కంగు
జ్వరం వస్తే వచ్చే బెంగ వేరు కానీ డెంగ్యూ జ్వరం అనగానే వచ్చే భయం వేరు. ఇటీవల విజృంభిస్తున్న డెంగ్యూ జ్వరాలు చూసి చాలామంది ఆందోళన చెందుతున్నారు. దీని గురించి అవగాహన కంటే అపోహలు ఎక్కువ.డెంగ్యూకు కంగు తినిపించేలావిషయాలు తెలుసుకోవడం కోసం ఈ సమగ్ర కథనం. డెంగ్యూ అంటే ఏమిటి? డెంగ్యూ అనేది డెంగ్యూ వైరస్ వల్ల వ్యాపించే ఒక వైరల్ జ్వరం. ఈ వైరస్ను ‘ఎడిస్ ఎజిపై్ట’ అనే దోమ వ్యాప్తి చేస్తుంది. టైగర్ మస్కిటో అని కూడా దీనిని పిలుస్తారు. చాలా సందర్భాల్లో డెంగ్యూ జ్వరం మిగతా అన్ని జ్వరాల్లాగే తనంతట తానే తగ్గిపోయే (సెల్ఫ్ లిమిటింగ్) తరహాది. అయితే కొంతమందిలో ప్లేట్లెట్స్ ప్రమాదకర స్థాయి కంటే కిందికి పడిపోతాయి. మరికొందరి అంతర్గత అవయవాల్లోకి రక్తస్రావమయ్యే పరిస్థితి వస్తుంది. అటువంటి సందర్భాల్లో రోగిని ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించడం అవసరమవుతుంది. అలాంటి సమయంలో తప్ప మిగతా అన్ని వేళల్లోనూ ఇది అనుకున్నంత ప్రమాదకరం కాదని గుర్తిస్తే అపోహలు, దురభిప్రాయాలతో కలిగే ఆందోళన తగ్గిపోతుంది. డెంగ్యూలో రకాలు : ఇటీవల డెంగ్యూలో రకాలను పునర్నిర్వచించారు. ఆ విభజనను అనుసరించి డెంగ్యూలో మూడు రకాలు ఉన్నాయి. అవి... 1. ఎలాంటి హెచ్చరికలు చూపకుండా వచ్చే సాధారణ డెంగ్యూ (డెంగ్యూ వితవుట్ వార్నింగ్ సైన్స్) 2.కొన్ని నిర్దిష్టమైన హెచ్చరికలు చూపుతూ వచ్చే డెంగ్యూ (డెంగ్యూ విత్ వార్నింగ్ సైన్స్) 3.తీవ్రమైన డెంగ్యూ (సివియర్ డెంగ్యూ) లక్షణాలు : ∙హెచ్చరికలు చూపకుండా వచ్చే సాధారణ డెంగ్యూ (డెంగ్యూ వితవుట్ వార్నింగ్ సైన్స్) కేసుల్లో : ఈ తరహా డెంగ్యూ వచ్చిన వారు డెంగ్యూ విస్తృతంగా వస్తున్న (ఎండెమిక్) ప్రాంతాలలో నివసిస్తున్న వారై ఉంటారు. ఇలాంటి వారిలో జ్వరం, వికారం/వాంతులు, సాధారణంగా కనిపించే ఒంటినొప్పులు (జనరలైజ్డ్ బాడీ పెయిన్స్), ఒంటి మీద ర్యాష్ వంటి బయటి లక్షణాలు కనిపిస్తాయి. టార్నికేట్ అనే పరీక్ష చేస్తారు. దీంతో పాటు సాధారణ రక్తపరీక్ష చేసినప్పుడు డెంగ్యూ వ్యాధిగ్రస్తుల్లో తెల్ల రక్తకణాల సంఖ్య బాగా తక్కువగా కనిపిస్తుంది. ∙కొన్ని నిర్దిష్టమైన హెచ్చరికలు చూపుతూ వచ్చే డెంగ్యూ (డెంగ్యూ విత్ వార్నింగ్ సైన్స్) కేసుల్లో : ఈ కేసుల్లో పైన పేర్కొన్న లక్షణాలన్నింటితో పాటు పొట్టలో నొప్పి, ఊపిరితిత్తుల చుట్టూ ఉండే ప్లూరా అనే పొరలో లేదా పొట్టలో నీరు చేరడం, పొట్టలోని లోపలి పొరల్లోంచి రక్తస్రావం అవుతుండటం, రోగి అస్థిమితంగా ఉండటం, రక్తపరీక్ష చేయించినప్పుడు ఎర్ర రక్త కణాలకూ, మొత్తం రక్తం పరిమాణానికీ ఉన్న నిష్పత్తి కౌంట్ పెరగడంతో పాటు ప్లేట్లెట్స్ సంఖ్య విపరీతంగా పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ∙తీవ్రమైన డెంగ్యూ (సివియర్ డెంగ్యూ) కేసుల్లో : అంతర్గత అవయవాల్లో రక్తస్రావం కారణంగా రోగి తీవ్రమైన షాక్కు గురవుతాడు. ఊపిరితిత్తుల్లో నీరు చేరి శ్వాసప్రక్రియకు అంతరాయం ఏర్పడుతుంది. తీవ్రమైన రక్తస్రావం కారణంగా రోగి స్పృహకోల్పోవడం లేదా పాక్షికంగానే స్పృహలో ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతర్గత అవయవాలు తమ విధులు నిర్వహించడంలో విఫలం అవుతాయి. అంటే ఆర్గాన్ ఫెయిల్యూర్ అనే కండిషన్ ఏర్పడుతుందన్నమాట. ఇప్పుడు మరింత అధునాతనమైన నిర్ధారణ పరీ„ ఇప్పుడు అత్యంత అధునాతమైన వ్యాధి నిర్థారణ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఐపీఎఫ్ (ఇమ్మెచ్యూర్ ప్లేట్లెట్ ఫ్రాక్షన్) అనే అత్యాధునిక పరీక్ష పెద్ద పెద్ద మెడికల్ సెంటర్లలో అందుబాటులో ఉంది. ప్లేట్లెట్లను ఎప్పుడు, ఎంత పరిమాణంలో ఎక్కించాలో తెలుసుకోవడానికి ఈ పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది. రక్తంలో ప్లేట్లెట్లకు సంబంధించిన కచ్చితమైన వివరాలతో పాటు శరీరంలో ప్లేట్లెట్ల ఉత్పత్తికి తోడ్పడే ఎముకలోని భాగమైన బోన్మ్యారో పనితీరు కూడా ఈ పరీక్షతో తెలుస్తుంది. అంతేకాకుండా ప్లేట్లెట్లు వృద్ధి చెందుతాయా, లేదా, ఒకవేళ ప్లేట్లెట్లు ఎక్కించడం ఎంతమేరకు అవసరం... లాంటి చికిత్సకు ఉపకరించే ఎన్నో విషయాలు ఈ పరీక్ష ద్వారా వైద్యులు నిర్ధారణ చేస్తారు. ఆ మేరకు ప్లేట్లెట్స్ మార్పిడి, చికిత్స విధానాన్ని అవలంబిస్తారు. ఒకవేళ బోన్మ్యారోలో లోపం ఉంటే పైపై చికిత్సలను ఆపేసి, ప్రధానమైన మూలాల్లోకి వెళ్లి మెరుగైన చికిత్సను సకాలంలో అందించి, పేషెంట్ ప్రాణాలను కాపాడతారు. డెంగ్యూకు గురైన ప్రతి పేషెంట్కీ ప్లేట్లెట్ల మార్పిడి అవసరం ఉండదు. కొన్ని మందులు డెంగ్యూ రోగులకు ప్రమాదం సాధారణ జ్వరం వచ్చిన వారికి ఇచ్చినట్లుగా డెంగ్యూ బాధితులకు ఆస్పిరిన్, బ్రూఫెన్ వంటి మందులు ఇవ్వకూడదు. ఎందుకంటే ఆస్పిరిన్ రక్తాన్ని పలచబారుస్తుంది. డెంగ్యూ సోకినప్పుడు ప్లేట్లెట్స్ తగ్గి రక్తస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఆస్పిరిన్ వంటి మందులు తీసుకుంటే రక్తస్రావం జరిగే అవకాశాలను మరింత పెంచుకున్నట్టే. ఇది చాలా ప్రమాదకరం కాబట్టే ఈ జాగ్రత్త పాటించాలి. అయితే గుండెజబ్బులు ఉన్నవారు ఆస్పిరిన్ మామూలుగానే వాడుతుంటారు. ఇలాంటివారు డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు రక్తాన్ని పలచబార్చే మందులు వాడకూడదు. ఇది మరింత ముఖ్యంగా అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. ప్లేట్లెట్లు లక్ష కంటే తగ్గినప్పుడు ప్రతిరోజూ పరీక్ష చేయించుకోవాలి. అయితే రోజుకు ఒకసారి మాత్రమే పరీక్ష చేయించుకోవాలి. జ్వరం తగ్గాక ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుంది. కానీ ఒక్కొక్కసారి పెరిగాక, మళ్లీ తగ్గి, మళ్లీ పెరుగుతాయి. అయితే ప్లేట్లెట్ల సంఖ్య 20,000 కంటే తగ్గితే మాత్రం హాస్పిటల్లో చేరడం అవసరం. నివారణ ఎంతో మేలు... అన్ని వ్యాధుల లాగే డెంగ్యూ విషయంలోనూ చికిత్స కంటే నివారణ ఎంతో మేలు. డెంగ్యూ వచ్చేందుకు దోహదపడే టైగర్దోమ రాత్రిపూట కాకుండా పట్టపగలే కుడుతుంటుంది. నిల్వ ఉండే మంచి నీటిలో సంతానోత్పత్తి చేసుకుంటుంది. ఈ ప్రక్రియకు పదిరోజుల వ్యవధి పడుతుంది. కాబట్టి ఇల్లు, ఇంటి పరిసరాల్లో నీరు నిలవకుండా జాగ్రత్తపడాలి. వీలైతే వారంలో ఏదో ఒకరోజు ఇంటిలోని నీటిని పూర్తిగా ఖాళీ చేసి డ్రై డే గా పాటించాలి. ∙ఇంట్లోని మూలల్లో చీకటి ప్రదేశంలో, చల్లని ప్రదేశాల్లో ఎడిస్ ఎజిపై్ట అవాసం ఏర్పరచుకుంటుంది. కాబట్టి ఇల్లంతా వెలుతురు, సూర్యరశ్మి ధారాళంగా వచ్చేలా చూసుకోవాలి. అయితే అదే సమయంలో బయటి నుంచి దోమలు ఇంట్లోకి రాకుండా నిరోధించుకోవడానికి తలుపులకు, కిటికీలకు మెష్ అమర్చుకోవడం చాలా మంచిది. ∙ఈ దోమ నిల్వ నీటిలో గుడ్లు పెడ్తుంది కాబట్టి కొబ్బరి చిప్పలు, డ్రమ్ములు, బ్యారెల్స్, టైర్లు, కూలర్లు, పూలకుండీల కింద పెట్టే ప్లేట్లు మొదలైన వాటిల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వాడని టైర్లను తడిలేకుండా చేసి ఎండలో పడేయాలి. తాగు నీరు కాకుండా మిగతా అవసరాల కోసం వాడే నీటిలో బ్లీచింగ్ పౌడర్ కలపాలి. దీనివల్ల ఎడిస్ ఎజిపై్ట గుడ్లు పెట్టకుండా నివారించ వచ్చు. ∙ఇంట్లో ఉన్నప్పుడూ ఒంటి నిండా ఉండే దుస్తులనే ధరించాలి. హాఫ్ స్లీవ్స్ కంటే ఫుల్ స్లీవ్స్ ఉత్తమం. కాళ్లనూ కవర్ చేసే పైజామాలు, సాక్స్ వేసుకుంటే మంచిది. ∙ఎడిస్ ఎజిపై్ట దోమలు ముదురు రంగులకు తేలిగ్గా ఆకర్షితమవుతాయి. కాబట్టి లేత రంగుల దుస్తులను ధరించడం మేలు. ∙దోమలను దూరంగా తరిమివేసే మస్కిటోరిపల్లెంట్స్ వాడటం మేలు. పగలు కూడా మస్కిటో రిపల్లెంట్స్ వాడవచ్చు. పికారిటిన్ లేదా ఆయిల్ ఆఫ్ లెమన్ యూకలిప్టస్ లేదా ఐఆర్ 3535... కంపోజిషన్లోని ఈ మూడింటిలో ఏది ఉన్నా ఆ రిపల్లెంట్స్ వాడవచ్చు. ఈ మస్కిటో రిపల్లెంట్స్ ప్రతి 4 – 6 గంటలకు ఒకసారి శరీరంపై బట్టలు కప్పని భాగాల్లో స్ప్రే చేసుకోవాలి. అయితే ముఖం మీద స్ప్రే చేసుకునే సమయంలో ఇవి కళ్ల దగ్గర స్ప్రే కాకుండా జాగ్రత్త పడాలి. చికిత్స డెంగ్యూ అనేది వైరస్ కాబట్టి దీనికి నిర్దిష్టమైన మందులు లేవు. కేవలం లక్షణాలకు మాత్రమే చికిత్స చేస్తుంటారు. అంటే సింప్టమేటిక్ ట్రీట్మెంట్ మాత్రమే ఇస్తారు. వ్యాధి వచ్చిన వ్యక్తి బీపీ పడిపోకుండా ముందు నుంచే నోటిద్వారా లవణాలతో కూడిన ద్రవాహారం (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్స్– ఓఆర్ఎస్) ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ రోగి షాక్లోకి వెళుతుంటే అప్పుడు రక్తనాళం ద్వారా ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించాలి. రక్తస్రావం జరుగుతున్న వ్యక్తికి తాజా రక్తాన్ని, ప్లేట్లెట్స్ను, ప్లాస్మా ఎఫ్ఎఫ్íపీ (ఫ్రెష్ ఫ్రోజెన్ ప్లాస్మా) అవసరాన్ని బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. ప్లేట్లెట్స్ కౌంట్ సాధారణంగా 20 వేల నుంచి 15 వేలు అంతకంటే తక్కువకు పడిపోతే ప్రమాదం. కాబట్టి మరీ తక్కువకు ప్లేట్లెట్స్ సంఖ్య పడిపోతుంటే ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి వస్తుంది. వాటిని ఎప్పుడు ఎక్కించాలన్న అంశాన్ని డాక్టర్లు నిర్ణయిస్తారు. చిన్నాపెద్ద తేడా లేకుండా డెంగ్యూ ఎవరికైనా సోకవచ్చు. ముఖ్యంగా గర్భిణుల పట్ల చాలా జాగ్రత్త వహించాలి. వారిలో జ్వరం వస్తే అది డెంగ్యూ కావచ్చేమోనని అనుమానించి తక్షణం డాక్టర్ను సంప్రదించాలి. వ్యాక్సిన్ ఉంది... అయితే ఇప్పుడు డెంగ్యూకు టీకా (వ్యాక్సినేషన్) అందుబాటులో ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సూచనల మేరకు ఈ టీకాను గతంలో డెంగ్యూ వచ్చిన వారికి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే రెండోసారి డెంగ్యూ రావడం చాలా ప్రమాదకరం కాబట్టి అలాంటి ప్రమాదకరమైన పరిస్థితిని నివారించేందుకు ఈ టీకా తోడ్పడుతుంది. అంటే అంతర్గత అవయవాల్లో తీవ్రమైన రక్తస్రావం అయి రోగి ∙సీబీపీ ప్రతి 24 గంటలకు ఒకసారి చేయాలి. ∙డెంగ్యూ నిర్ధారణ కోసం డెంగ్యూ ఎన్ఎస్1 యాంటీజెన్ పరీక్ష అవసరం కావచ్చు. ∙డెంగ్యూ ఐజీఎమ్ అనే పరీక్ష కూడా చేయాల్సి ఉంటుంది. కొన్ని అడ్వాన్స్డ్ పరీక్షల్లో వ్యాధి నిర్థారణ రిపోర్టులు వచ్చే సమయం కూడా ఎక్కువే కాబట్టి అవి వచ్చే వరకు ఆగకుండా... లక్షణాలను బట్టి ముందుగానే చికిత్స తీసుకోవడం మంచిది. పైగా దీనికి చేసే చికిత్స కూడా లక్షణాలను బట్టి చేసేదే కాబట్టి లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స ప్రారంభించాలి. మరింత ప్రమాదకరమైన ఇతర లక్షణాలు ∙ప్లేట్ లెట్స్ తక్కువైన కారణాన నిరంతర రక్తస్రావం అనే ప్రమాదకరమైన లక్షణమే కాకుండా కొన్ని సందర్భాల్లో కొన్ని ఇతర లక్షణాలూ కనిపిస్తాయి. వాటిల్లో ముఖ్యమైనది ఒంట్లో నీరు, లవణాల మోతాదు బాగా తగ్గిపోవడం (సివియర్ డీహైడ్రేషన్). అంతేకాదు... కొన్ని సందర్భాల్లో హీమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. హెమటోక్రిట్ పెరుగుతుంది. దీనివల్ల రక్తం గడ్డకట్టదు. రక్తపోటు పడిపోతుంది. లివర్ ఎన్లార్జ్ అయి డ్యామేజ్ అయ్యే ప్రమాదమూ ఉంటుంది. హార్ట్బీటింగ్ నిమిషానికి 60 కంటే తక్కువకు కూడా పడిపోవచ్చు. బ్లీడింగ్, ఫిట్స్ వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ప్రమాదమూ ఉంది. మన వ్యాధినిరోధక వ్యవస్థ (ఇమ్యూన్ సిస్టం) డ్యామేజ్ అయ్యే ముప్పు పొంచి ఉంటుంది. ∙గుండె స్పందనలు (హార్ట్బీట్) 60 కంటే తక్కువకు పడిపోవడం అన్నది చాలా ప్రమాదకరమైన సూచన. రోగికి ఇలాంటి పరిస్థితి వస్తే ఇంటెన్సిక్ కేర్లో ఉంచాల్సిన అవసరం ఏర్పడవచ్చు. ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్లకుండా కాపాడుతుంది. సాధారణ డెంగ్యూ నివారణకు దీన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. నిర్ధారణ పరీక్షలు మొదటి సారి కంటే... తర్వాతి వాటితోనే మరింత డేంజర్ సాధారణంగా మొదటిసారి వచ్చే డెంగ్యూ కంటే... ఒకసారి వచ్చి తగ్గాక మళ్లీ వస్తే అది మరింత ప్రమాదకరం. ఎందుకంటే... డెంగ్యూని సంక్రమింపజేసే వైరస్లో నాలుగు రకాలున్నాయి. అదే రకం వైరస్ మరోసారి వస్తే అది ప్రమాదకరం కాదు. కాని... ఒకసారి వ్యాధికి గురైన వాళ్లలో మరోసారి ఇంకో రకమైన డెంగ్యూ వైరస్ వచ్చినప్పుడు అది మరింత తీవ్రరూపంలో కనిపిస్తుంది. అందుకే మొదటిసారి కంటే ఆ తర్వాత వచ్చేవి మరింత ప్రమాదకరంగా పరిణమిస్తాయి. డెంగ్యూ లక్షణాలు కనిపిస్తే యాంటీబయాటిక్స్ వద్దు చాలా మంది గ్రామీణ డాక్టర్లు డెంగ్యూ లక్షణాలు కనిపించగానే యాంటీబయాటిక్ మందులు ఉపయోగిస్తుంటారు. అయితే డెంగ్యూ రోగికి జ్వరం వంటి లక్షణాలు కనిపించగానే యాంటీబయాటిక్స్ వాడటం సరికాదు. ఇలా మందుల వల్ల ప్లేట్లెట్ కౌంట్ తగ్గి్గతే అది అంతర్గత రక్తస్రావానికి దారితీయవచ్చు. ఫలితంగా మందులే ప్రమాదకరం కావచ్చు. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే డాక్టర్ల సలహా తీసుకున్నాకే వాడాలి. ప్రమాదకర పరిస్థితులకు ముందస్తు సంకేతాలివి... ఇంట్లో ఎవరైనా విపరీతమైన కడుపునొప్పితో బాధపడ్తున్నా, నలుపు రంగులో మలవిసర్జనమవుతున్నా, ముక్కులోంచి కానీ, చిగుర్ల్లలోంచి కానీ బ్లీడింగ్ అవుతున్నా, దాహంతో గొంతెండి పోతున్నా, చెమటలు పట్టి శరీరం చల్లబడిపోయినా క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. మలేరియాకీ... డెంగ్యూకూ తేడా ఇది... మలేరియా, డెంగ్యూ... ఈ రెండూ దోమలతోనే వచ్చే జ్వరాలే అయినా మలేరియా అన్నది ఆడ అనాఫిలస్ దోమ కుట్టడం వల్ల వస్తుంది. అదే డెంగ్యూ అన్నది ఎడిస్ (టైగర్) దోమ కారణంగా వస్తుంది.రెండింట్లోనూ కనిపించే సాధారణ లక్షణం జ్వరం. అయితే మలేరియాలోని రకాలను బట్టి జ్వరం అన్నది నిర్దిష్టంగా ఒక నిర్ణీత సమయానికి ప్రతిరోజూ వస్తూ తగ్గుతూ ఉంటుంది. కానీ డెంగ్యూ సోకిన వ్యక్తిలో జ్వరం ఎప్పుడైనా రావచ్చు. డెంగ్యూ వచ్చిన వారిలో వచ్చే నొప్పి ఎముకలు విరిగినంత తీవ్రంగా వచ్చినట్లుగా అనిపిస్తుంది. అందుకే దీన్ని ‘బ్రేక్ బోన్ ఫీవర్’ అని కూడా అంటారు. డాక్టర్ టి.ఎన్.జె. రాజేశ్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ ఇంటర్నల్ మెడిసిన్ – ఇన్ఫెక్షియస్ డిసీజెస్, స్టార్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
బ్యాక్ టు వర్క్
హీరోయిన్స్ ఒకేసారి మూడు నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉంటారు. తీరక లేకుండా ఒక సినిమా సెట్ నుంచి మరో సెట్కు షిఫ్ట్ అవుతుంటారు. ఇలాంటి బిజీ షెడ్యూల్స్లో అనారోగ్యం బారిన పడితే? అంతే.. సినిమాలన్నీ ఆగిపోతాయి. ప్రస్తుతం బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ అలాంటి ఇబ్బందినే ఎదుర్కొన్నారు. నెల రోజులుగా శ్రద్ధా డెంగ్యూతో బాధపడ్డారు. ఆమె ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’, సైనా నెహ్వాల్ బయోపిక్ చిత్రాలు చేస్తున్నారు. జ్వరం కారణంగా షూటింగ్కి వెళ్లలేకపోయారు. ఈ నెల రోజులు ఇంట్లో ఉండటం వల్ల చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను అంటున్నారు శ్రద్ధా కపూర్. ‘‘నా అనారోగ్యాన్ని అర్థం చేసుకుని సహనంగా ఎదురు చూసిన చిత్రబృందాలకు థ్యాంక్స్. త్వరగా కోలుకోవాలని కోరుకున్న అభిమానులకు, ఆత్మీయులకు కూడా. డెంగ్యూ కారణంగా నెల రోజులు ఇంట్లోనే ఉన్నాను. కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే వీలు దొరికింది. మనల్ని ప్రేమించే వాళ్లకు ఎక్కువ టైమ్ కేటాయించాలి అనే విషయాన్ని తెలుసుకున్నాను. ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏదైనా ఉందంటే అది మనవాళ్లతో టైమ్ స్పెండ్ చేయడమే. నా మీద ఇంత ప్రేమను కురిపిస్తున్న అందరికీ ధన్యవాదాలు. థియేటర్స్లో కలుద్దాం’’ అని పేర్కొన్నారు. -
ఉద్యోగుల ఉచిత వైద్యానికి బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: సర్కారు ఉద్యోగులకు, జర్నలిస్టులకు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వం జారీచేసిన హెల్త్ కార్డుల కింద వెద్యం అందట్లేదని వారు వాపోతున్నారు. ముఖ్యంగా నాన్ సర్జికల్ వైద్య సేవలను ఆస్పత్రులు పూర్తిగా నిలిపేశాయి. ప్రభుత్వం నుంచి రూ.250 కోట్ల బకాయిలు పేరుకు పోవడం వల్లే గత్యంతరం లేక వైద్య సేవలు నిలిపేసినట్లు ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. సికింద్రాబాద్లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి ఏకంగా రూ.66 కోట్ల బకాయిలు ఉన్నట్లు తెలిసింది. లాభం ఎక్కువగా ఉండే ఖరీదైన ఆపరేషన్లు మాత్రమే ఆయా ఆసుపత్రులు అంగీకరిస్తున్నాయని ఉద్యోగులు ఆరోపిస్తున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల చర్యల వల్ల ఉద్యోగులు, పింఛన్దారులు, జర్నలిస్టు కుటుంబాలు వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. మరో విచిత్రమేంటంటే ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కూడా ఉంది. ముందుగా డబ్బు తీసుకొని తర్వాత రీయింబర్స్మెంట్ కింద వైద్యం చేయడానికి కూడా ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయి. అలా చేస్తే ఉచిత వైద్యం చేయలేదంటూ ఉద్యోగులు ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నందున ఆ సేవలు కూడా అందించట్లేదని ఓ కార్పొరేట్ ఆసుపత్రి ప్రతినిధి ‘సాక్షి’కి తెలిపారు. పడకలు లేవంటూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం (ఈజేహెచ్ఎస్)ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఆ పథకం కింద రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉద్యోగులకు వైద్య సేవలను ఉచితంగా అందజేయాలి. ఆరోగ్యశ్రీలో ఉన్న అన్ని వైద్య సేవలనూ వీరికి అందజేయాలి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోనూ వైద్య సేవలు పొందేందుకు వీరు అర్హులు. ఎవరైనా ఉద్యోగి తనకు వైద్యం అవసరమని భావిస్తే ముందుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్లకు వెళ్లాలి. అక్కడ చికిత్స చేయలేని పరిస్థితి ఉంటే తదుపరి వైద్య సేవల కోసం రోగికి ఇష్టమైన ఆసుపత్రికి రెఫర్ చేస్తారు. వైద్యం, శస్త్రచికిత్సలు చేస్తే సర్కారు నిర్దేశించిన ప్యాకేజీల ప్రకారం ఆసుపత్రులకు ప్రభుత్వం సొమ్ము చెల్లిస్తుంది. ఉదాహరణకు రోగికి డెంగీ వస్తే అతని ఆరోగ్య పరిస్థితిని బట్టి నాలుగైదు రోజులు అవసరమైతే వారం పది రోజులు కూడా ఆసుపత్రుల్లో ఉంచాలి. కానీ దానికి ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ సరిపోవట్లేదు. ఫుడ్ పాయిజన్ కేసులు, ఇతరత్రా నాన్ సర్జికల్ వైద్య సేవలన్నింటినీ నిలిపేశారు. అలాంటి ఉద్యోగులు ఎవరైనా వస్తే పడకలు లేవంటూ తప్పించుకుంటున్నారు. ఇక సర్జికల్ కేసుల్లో తమకు లాభం ఉన్న కేసులనే తీసుకుంటున్నాయి. నాన్సర్జికల్ వైద్యాన్ని నిరుత్సాహపరచాలని ప్రభుత్వం పరోక్షంగా తమకు సూచించిందని ఓ కార్పొరేట్ యజమాని పేర్కొనడం గమనార్హం. నాన్ సర్జికల్ వైద్యం పేరుతో ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా బిల్లులు వేస్తున్నాయని, అలాంటి కేసులు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లేలా చూడాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. పట్టించుకోని యంత్రాంగం.. ఈజేహెచ్ఎస్ పథకాన్ని పర్యవేక్షించడంలో వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం విఫలమైంది. ఈ పథకానికి ఆరోగ్యశ్రీ సీఈవోనే పర్యవేక్షిస్తున్నారు. గతంలో ఈజేహెచ్ఎస్కు ప్రత్యేకంగా సీఈవో ఉండేవారు. అదనపు బాధ్యతలు ఇవ్వడంతో ఈ పథకంపై దృష్టిపెట్టలేకపోతున్నారని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సీజన్ కావడంతో వైద్య ఆరోగ్య మంత్రి కూడా దీనిపై దృష్టిసారించే పరిస్థితి లేకుండాపోయింది. ఉన్నత స్థాయిలో అధికారులూ పట్టించుకోవడంలేదన్న ఆరోపణలున్నాయి. ఒక్క మహబూబ్నగర్ జిల్లాలోనే రీయింబర్స్మెంట్ బిల్లులు రూ.కోటికి పైగా నిలిచిపోయినట్లు అక్కడి ఉద్యోగులు చెబుతున్నారు. ఇలా రాష్టవ్యాప్తంగా రూ.50 కోట్ల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. సీఎం అనుకున్నట్లు అమలు కావట్లేదు ఈజేహెచ్ఎస్ పథకం సీఎం కేసీఆర్ అనుకున్నట్లుగా అమలు కావట్లేదు. ఆరోగ్యశ్రీ సీఈవో, ఐఏఎస్ అధికారికి ఈజేహెచ్ఎస్ పథకం బాధ్యతలు ఇవ్వడం వల్ల కూడా పర్యవేక్షణ లేదు. వైద్యుడినే సీఈవోగా నియమిస్తే సమస్యల పరిష్కారానికి వీలుండేది. – కారెం రవీందర్రెడ్డి, అధ్యక్షుడు, టీఎన్జీవో బకాయిలు పేరుకుపోవడం వల్లే.. ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోవడం వల్లే ఉద్యోగులకు వాటిల్లో వైద్య సేవలు అందట్లేదు. ఉద్యోగులు సొంతంగా డబ్బు పెట్టి రీయింబర్స్మెంట్ కింద వైద్యం చేయించుకుంటే ఆ బిల్లుల సొమ్ము కూడా సర్కారు ఇవ్వట్లేదు. రాష్ట్రవ్యాప్తంగా కోట్ల రూపాయలు ఉద్యోగులకు పెండింగ్లో పెట్టారు. ఈ చర్యల వల్ల ఉద్యోగులకు వైద్య సేవలు నిలిచిపోయాయి. పింఛన్దారులు దారుణంగా నష్టపోతున్నారు. – వెంకటరెడ్డి, మాజీ అధ్యక్షుడు, పీఆర్టీయూ -
విష జ్వరాలు..
సాక్షి, మంచిర్యాలటౌన్: జిల్లాలో జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పట్టణం, పల్లె తేడా లేకుండా డెంగీ, టైఫాయిడ్, మలేరియాతోపాటు వైరల్ ఫీవర్లతో బాధపడుతున్నారు. మంచిర్యాలలోని ప్రభుత్వాసుపత్రికి నిత్యం 300 వరకూ ఓపీలు వస్తుండడం జ్వరం తీవ్రతకు అద్దం పడుతోంది. గత పదిహేను రోజుల నుంచి ఆ సంఖ్య 550 వరకూ పెరిగింది. ప్రైవేట్ ఆసుపత్రులైతే రోగులతో కిటకిటలాడుతున్నాయి. పారిశుధ్యలోపం, దోమలు జ్వరాలకు ప్రధాన కారణం కాగా, వాతావరణంలో వస్తున్న మార్పులతో వైరల్ ఫీవర్ ఇంట్లోని వారందరినీ చుట్టుముడుతోంది. ఎన్నడూ లేనివిధంగా జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. కాళ్లు కదలడం లేదని, చేతులు వణుకుతున్నాయని, కీళ్లలో ఒక్కటే నొప్పిగా ఉందని, ఒళ్లంతా సలుపుతుందని, ఇలా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా జిల్లా వ్యాప్తంగా చాలా మంది మంచాన పడుతున్నారు. ఆసుపత్రులన్నీ రోగులతో కిక్కిరిసి పోతున్నాయి. ఇటీవల డెంగీతో జిల్లాలో పది మందికి పైగా మృత్యువాత పడ్డారు. దీంతో మరింత భయంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు రోగులు ఉరుకులు పెడుతున్నారు. గడిచిన పదేళ్లలో ఇలాంటి పరిస్థితిని చూడలేదని స్వయంగా వైద్యులే చెబుతున్నారు. ఇంట్లో ఒకరికి వచ్చిందంటే చాలు ఆ వైరల్ జ్వరాలు మెల్లగా మిగిలిన కుటుంబ సభ్యులకు సోకుతున్నాయి. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు మాత్రం రక్తపరీక్షల్లో రక్తకణాలు తగ్గాయని, డెంగీ వ్యాధిగా నిర్ధారణ చేయడంతో మరింత భయానికి రోగులు గురవుతున్నారు. ప్రస్తుత పరిస్థితిలో డెంగీ నిర్ధారణలో కొన్ని పాజిటివ్ కేసులు ఉన్నా, ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్లడ్బ్యాంకులోనే రక్తకణాలు తగ్గిన వారి రక్తపరీక్షలు మరోసారి చేసిన తర్వాతే నిర్ధారిస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతో ఇటీవల 172 మందికి పరీక్ష చేయగా 46 మందికి డెంగీ వ్యాధి ఉన్నట్లుగా గుర్తించారు. పారిశుధ్యమే సమస్య.. పల్లెలు, పట్టణాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారడంతో దోమలు విజృంభిస్తున్నాయి. ఎన్నికల హడావుడిలో అధికారులు బిజీగా ఉండడంతో పల్లెలను అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోనూ సరైన పారిశుధ్య పనులు చేపట్టడం లేదు. దీంతో పట్టణంలోని ప్రజల్లో సగం మంది జ్వరాల బారిన పడ్డారు. దోమలు విజృంభించకుండా ప్రత్యేక చర్యలు తీసుకోకపోవడంతో డెంగీ, వైరల్ ఫీవలర్లకు కారణమవుతున్నాయి. ప్రతి శుక్రవారం జిల్లాలో డ్రై డేగా పాటించాలని అధికారులు భావించారు. కొద్ది వారాలు చేపట్టినా డ్రై డేను అధికారులు మరిచిపోయారు. ప్రైవేట్ బాధుడు.. జ్వరంతో వస్తున్న రోగులను ప్రైవేట్ ఆసుపత్రులు ఫీజుల రూపేనా బాధుతున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందుతుందన్న నమ్మకం లేకపోవడంతో వేలకు వేలు అప్పులు చేసి ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా వైరల్ ఫీవర్ను సైతం రక్తకణాలు తగ్గిపోయాయని, డెంగీ సోకిందని భయబ్రాంతులకు గురిచేస్తూ, వేలాది రూపాయలను అమాయక ప్రజల నుంచి పిండుతున్నారు. జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికైనా పట్టించుకుని పారిశుధ్య సమస్య తీర్చాలని, జ్వరాలతో వస్తున్న రోగులకు ఆసుపత్రుల్లో సరైన పరీక్షలు చేయాలని పలువురు కోరుతున్నారు. -
విషజ్వరాలతో విలవిల!
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రాన్ని వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి. మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వంటి వాటితో ఒక్క సెప్టెంబరు నెలలోనే 1,853 మంది మృత్యువాత పడ్డారంటే రాష్ట్రంలో జ్వరాల తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో తెలుస్తోంది. సగటున రోజుకు 62మంది మరణిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు అనే తేడా లేకుండా అన్ని జిల్లాల్లోని ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. వ్యాధుల తీవ్రత ఈ స్థాయిలో ఉన్నా ప్రభుత్వం మాత్రం విష జ్వరాలు లేనేలేవంటోంది. సాధారణ జ్వరాలు మాత్రమే ఉన్నాయని.. మరణించిన వారు కూడా ఇతర కారణాలతో చనిపోయిన వారేనని బుకాయిస్తోంది. ఓ వైపు వేధిస్తున్న వ్యాధులు.. మరోవైపు సర్కార్ నిర్లక్ష్యం వెరసి.. పేద రోగులకు ప్రాణసంకటంగా మారుతోంది. పరీక్షలు చేయించుకుని, మందుబిళ్లలు తెచ్చుకుని ఉపశమనం పొందుదామని ప్రభుత్వాస్పత్రులకు వెళ్తున్న రోగులకు నిరాశే ఎదురవుతోంది. వైద్యులు ఎప్పుడొస్తారో, మందుబిళ్లలు దొరుకుతాయో లేదో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. ఇక కొన్ని కార్పొరేట్ ఆస్పత్రుల తీరయితే సరేసరి. వచ్చిన వారిని బెంబేలెత్తిస్తూ జేబులు గుల్లచేసి వదిలిపెడుతున్నారు. సమన్వయలోపం.. బాధితులకు శాపం వాతావరణ మార్పులు, ఇటీవల కురిసిన భారీ వర్షాలు.. అధ్వాన్న పారిశుధ్యంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని జిల్లాల్లో ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. జ్వరాల నివారణ ఆరోగ్య శాఖదేనని.. కాదు, స్థానిక యంత్రాంగం పారిశుధ్యాన్ని మెరుగుపర్చుకోకపోవడం వల్లే ఇదంతానని ఎవరికి వారు బాధ్యతల నుంచి తప్పుకునేలా వ్యవహరిస్తుండడంతో శాఖల మధ్య సమన్వయలోపం బాధితులకు శాపంలా మారింది. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, విశాఖ, కర్నూలు జిల్లాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఆ తర్వాత స్థానాల్లో చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాలున్నాయి. కాగితాలపైనే ‘దోమల దండయాత్ర’ దోమలపై దండయాత్ర అంటూ ప్రగల్భాలు పలికిన సర్కారు.. ఆచరణలో మాత్రం చతికిల పడింది. అన్ని శాఖలను సమన్వయపరుస్తూ దోమలపై దండయాత్ర సాగించడానికి చట్టాన్ని తీసుకొస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడా ఊసే ఎత్తడంలేదు. ఇందుకోసం అప్పట్లో మంత్రివర్గ ఉపసంఘాన్ని సైతం ఏర్పాటుచేసింది. ఆ తర్వాత వర్షాకాలం వచ్చేసింది. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో అపరిశుభ్ర వాతావరణం రాజ్యమేలుతోంది. అయినా ‘దండయాత్ర’ అతీగతీ లేకుండాపోయింది. జిల్లాల్లో పరిస్థితి ఘోరం ♦ శ్రీకాకుళం జిల్లాలో మలేరియా, డెంగీ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఎక్కువ శాతం ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల వారే విషజ్వరాల బారినపడ్డారు. ప్లేట్లెట్స్ తగ్గుముఖం పడుతున్నాయని, డెంగీ లక్షణాలు కనిపిస్తున్నాయని.. ఇదొక కొత్తరకం వైరస్ అని, ఇదేమిటో అంతుచిక్కడంలేదని వైద్యులు చెబుతున్నారు. గత నెలలో ఒక్క శ్రీకాకుళం రిమ్స్లోనే 51మంది బలయ్యారు. ♦ విజయనగరం జిల్లాలో ఈ ఏడాది ఒక్క సెప్టెంబర్ నెలలోనే వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం విజయనగరం ప్రభుత్వాస్పత్రిలోనే 41మంది మరణించారు. ఇక జిల్లా వ్యాప్తంగా 35 మంది వరకు డెంగీతో చనిపోయారు. విషజ్వరాలతో అనేకమంది మరణించారు. వీరిలో గ్రామీణ ప్రాంత ప్రజలే అధికం. ఇంకా 5 వేల మంది వరకు జ్వరాలతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ♦ విశాఖలో మురికివాడల్లో నివసిస్తున్న వారికి విష జ్వరాలు ఎక్కువగా సోకుతున్నాయి. ఇక్కడ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న వారిలో అత్యధికులు గ్రామీణులే. నర్సీపట్నం, కోటవురట్ల, సబ్బవరం, చోడవరం, అనకాపల్లి, ఎస్కోట, లక్కవరం తదితర గ్రామాలకు చెందిన వారు ఉన్నారు. కేజీహెచ్ పీడియాట్రిక్స్ విభాగంలో మంగళవారం నాటికి 20 మంది చిన్నారులు జ్వరంతో చికిత్స పొందుతున్నారు. ఒక్క కేజీహెచ్లోనే ప్రభుత్వ రికార్డుల ప్రకారం 224 మంది చనిపోయారు. అంతేకాక.. జిల్లావ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో వందలాది మంది విషజ్వరాలతో బాధపడుతున్నారు. కోస్తాను కుదిపేస్తున్న డెంగీ, మలేరియా ♦ తూర్పుగోదావరి జిల్లాను గత నెల రోజులుగా డెంగీ వ్యాధి కుదిపేస్తోంది. దీనిబారిన పడినవారు ఆర్థికంగా కుదేలైపోతున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలైతే ఖరీదైన వైద్యం చేయించుకోలేక మృత్యువాత పడుతున్నారు. వైద్యాధికారులు మాత్రం మరణాలేవీ లేవంటున్నారు. మరోవైపు.. జిల్లాను కలవరపెడుతున్న డెంగీ జ్వరాలను అధికార యంత్రాంగం అదుపు చేయలేకపోతోంది. అధికారికంగా 302 కేసులే నమోదైనా అనధికారికంగా రోగుల సంఖ్య పది వేలకుపైనే ఉంటుందని అంచనా. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు డెంగీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. కాకినాడ జీజీహెచ్, రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో ఒక్క సెప్టెంబరు నెలలోనే 360మంది మరణించడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. ♦ పశ్చిమ గోదావరి జిల్లా కూడా విషజ్వరాల బారిన పడి మంచమెక్కింది. ఇక్కడ కూడా డెంగీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. వైద్య అధికారులు, ప్రభుత్వం డెంగీ మరణాలు లేవని చూపించేందుకు ప్రయత్నిస్తోంది. గత మూడు నెలల్లో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి 47 మంది డెంగీ రోగులు వచ్చారు. అనధికారికంగా జిల్లాలో డెంగీ మరణాలు సంభవించిన దాఖలాలు ఉన్నా.. అధికారులు వాటిని సాధారణ మరణాలుగా చూపిస్తున్నారు. వరదలు వచ్చి తగ్గడంతో ఏజెన్సీతోపాటు వరద పీడిత ప్రాంతాల్లో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. తాజాగా జిల్లాలో మలేరియా, డెంగీ కేసుల్లో అధిక శాతం ఏజెన్సీతోపాటు డెల్టా ప్రాంతాల్లో కూడా నమోదవుతున్నాయి. ఒక్క సెప్టెంబరు నెలలోనే ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో 56మంది మృత్యువాతపడ్డారు. ♦ కృష్ణా జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలన్న భేదం లేకుండా డెంగీ, టైఫాయిడ్, మలేరియా విజృంభిస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం.. గత ఐదు నెలల్లో మలేరియా, డెంగీ, టైఫాయిడ్ లక్షణాలతో జిల్లా వ్యాప్తంగా 1,485 కేసులు నిర్ధారణకు వచ్చాయి. అయితే, అనధికారికంగా ఈ సంఖ్య ఇక వేల సంఖ్యలో ఉంటుందని చెబుతున్నారు. ఈ జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రుల్లో ఒక సెప్టెంబరులోనే మొత్తం 263మంది మృత్యువాత పడ్డారు. ♦ గుంటూరు జిల్లాలోని ఈమని, చుండూరు, ఫిరంగిపురం, కొల్లూరు, గణపవరం, ఫిరంగిపురం, మాచర్ల, మందపాడు, నరసరావుపేట, పెదపలకలూరు, నూతక్కి, సంగం జాగర్లమూడి, నూజెండ్ల, పెదవడ్లపూడి, తుళ్లూరు, తాడేపల్లి, గుంటూరు నగరంలో జ్వరాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా గుంటూరు జీజీహెచ్లో ఒక్క సెప్టెంబరులో మొత్తం 293 మరణాలు సంభవించాయి. ♦ ప్రకాశం జిల్లాలోనూ డెంగీ, మలేరియా విజృంభిస్తున్నాయి. అయితే, అధికారులు మాత్రం వీటిని ఒప్పుకోవడం లేదు. సాధారణ జ్వరాలేనని చెబుతున్నప్పటికీ ఒక్క ఒంగోలు ప్రభుత్వాస్పత్రిలో 56మంది విషజ్వరాలకు బలయ్యారు. ♦ శ్రీపొట్టిశ్రీ రాములు నెల్లూరు జిల్లాలోనూ అనేకమంది డెంగీ, మలేరియా బారిన పడ్డారు. నెల్లూరు జీజీహెచ్లోనే సెప్టెంబరులో 88మంది మరణించారు. రాయలసీమలో జ్వరాలు, ఎండల తీవ్రత ఎక్కువే ♦ వైఎస్సార్ జిల్లాలో దోమల తీవ్రత, ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో ఇప్పటివరకు 167 మలేరియా కేసులు, 12 డెంగీ కేసులు, 2552 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. వర్షం జాడలేకపోవడంతో ఉష్ణోగత్రలు వేసవిని తలపిస్తున్నాయి. కడప రిమ్స్లో సెప్టెంబరు ఒక్క నెలలోనే 77మంది విష జ్వరాలకు బలయ్యారు. ♦ అనంతపురం జిల్లానూ మలేరియా వణికిస్తోంది. జ్వరాల బారినపడుతున్న వారిలో గ్రామీణులే అధికం. జిల్లాలోని 87 పీహెచ్సీలకు రోజూ దాదాపు 60 వేల మంది రోగులు వైద్యం కోసం వస్తుంటారు. వీరిలో 30 శాతం మంది జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. అనంతపురం సర్వజనాస్పత్రికి రోజూ 2 వేల మంది రోగులు వస్తున్నారు. వీరిలో ఎక్కువమంది జ్వరపీడితులే. గత నెల అనంతపురంలోని జీజీహెచ్లో మొత్తం 98మంది జ్వరాల కారణంగా మరణించారు. ♦ కర్నూలు జిల్లాలోనూ మలేరియా కేసులు అధికంగానే నమోదయ్యాయి. నంద్యాల, కర్నూలు, ఆదోనిల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. 146 అనుమానిత డెంగీ కేసులు నమోదయ్యాయి. అలాగే, ఒక్క కర్నూలు జీజీహెచ్లోనే సెప్టెంబరులో 147 మరణాలు సంభవించాయి. ♦ తిరుపతి రుయా ఆస్పత్రిలో 99మంది మృత్యువాత పడ్డారు. గత నెల రాష్ట్రంలోని ప్రధాన ఆస్పత్రుల్లో మృతి చెందిన వారి వివరాలు.. ఆస్పత్రి మృతుల సంఖ్య జీజీహెచ్, గుంటూరు 293 జీజీహెచ్, కాకినాడ 277 కేజీహెచ్, విశాఖపట్నం 224 జీజీహెచ్, విజయవాడ 210 జీజీహెచ్, కర్నూలు 147 రుయా, తిరుపతి 99 జీజీహెచ్, అనంతపురం 98 జీజీహెచ్, నెల్లూరు 88 డీహెచ్, రాజమండ్రి 83 రిమ్స్, కడప 77 డీహెచ్, ఏలూరు 56 రిమ్స్, ఒంగోలు 56 డీహెచ్, మచిలీపట్నం 53 రిమ్స్, శ్రీకాకుళం 51 డీహెచ్, విజయనగరం 41 -
మళ్లీ కాటేస్తున్న కాళ్లవాపు
సాక్షి, తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం: వరుసగా మూడేళ్లుగా ఏజెన్సీలో కాళ్లవ్యాపు వ్యాధి విజృంభిస్తోంది. గిరిజనులు పిట్టల్లా రాలిపోతున్నారు. భారీ సంఖ్యలో గిరిజనులు చనిపోతేనే అంతో ఇంతో స్పందించే ప్రభుత్వం ఒకరిద్దరు చనిపోతే కనీసం యంత్రాంగం ఆ వైపు కన్నెత్తి చూడడంలేదు. ఘటన జరిగినప్పుడు హడావుడి చేసి..ఆనక మిన్నకుండిపోవడం షరా మామూలైంది. 2016 ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు విలీన మండలాలు చింతూరు, వీఆర్పురం, ఎటపాక, కూనవరం గ్రామాల్లో అంతుచిక్కని కాళ్లవాపు వ్యాధి ప్రబలుతోం ది. 2016లో 15 మంది గిరిజనులు ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో బాధితులు ఆస్పత్రిపాలయ్యా రు. ఆ సమయంలో హడావుడి చేసిన జిల్లా యం త్రాగం కొద్ది రోజుల తర్వాత మిన్నకుండిపోయింది. గతేడాది దాదాపు రెండు వందల మంది ఆస్పత్రి పాలయ్యారు. తాజాగా ఈ ఏడాది కూడా కాళ్లవాపు వ్యాధి వెంటాడుతోంది. ఈ నెల 1వ తేదీన వీఆర్పురం మండలం అన్నవరం గ్రామాని కి చెందిన పూనెం కన్నెమ్మ(50), 2వ తేదీన ప్రత్తిపాక గ్రా మానికి చెందిన పైదా రాముడు (55) కాళ్లవాపు వ్యాధితో మృత్యువాత పడ్డారు. ఐక్యరాజ్య సమితిలో రాష్ట్రం పేరును మార్మోగేలా చేశానని చెప్పుకుంటున్న సీఎం చంద్రబాబు అరణ్యంలో జరిగే తమ బతుకులు, మరణాల వైపు కూడా ఓసారి చూడాలని గిరిజనులు వేడుకుంటున్నారు. మూలాలు ఎక్కడో కనిపెట్టలేదు.. కాళ్ల వాపు వ్యాధి ఎందుకు వస్తుందోనన్న విషయంపై విశాఖ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం బాధితుల వద్ద నమూనాలు సేకరించినా వ్యాధి మూలాలు తేల్చలేకపోయింది. అంతకు ముందు నాటు సారా తాగడంతోనే ఇలా వస్తుందని ఉన్నతాధికారులు ప్రకటనలు చేసి ఆనక నాలుక్కరుచుకున్నారు. చివరకు వైద్యులు, యంత్రాంగం పౌష్టికాహారలేమి, మంచినీరు తాగకపోవడం వల్లే కాళ్లవాపు వచ్చిందని భిన్న ప్రకటనలు చేశారు. పౌష్టికాహారం పంపిణీ ఎక్కడ..? 2016లో బాధిత పల్లెల్లో పర్యటించిన అప్పటి కలెక్టర్ అరుణ్ కుమార్, పీవో చక్రధర బాబు గిరిజనులు ఇళ్లలోకి వెళ్లి పరిశీలించారు. గిరిజనుల ఇళ్లలో బియ్యం అసలు వాడడంలేదని, కనీస పౌష్టికాహారం, వారికి లభించడంలేదని గుర్తించారు. గిరిజన తండాల్లోని వారికి ప్రత్యేకంగా నిత్యావసర సరులను పంపిణీ చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా బియ్యంతోపాటు కందిపప్పు, బెల్లం, నూనె ఇవ్వాలని నిర్ణయించారు. రేషన్ దుకాణాల ద్వారా ఒకసారి ఇచ్చిన యంత్రాంగం ఆ తర్వాత మొహం చాటేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారికి సరుకులు అందలేదు. ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం అయిపోయాక నాటుసారా, జీడి పిక్కలతోనే ఆకలిని తీర్చుకుంటున్నారు. ఏళ్ల తరబడి కనీస ఆహారం, మంచినీరు లేక గిరిజ నులు పలు వ్యాధులు, రక్తహీనతతో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి ఏడాది ప్రాణ నష్టం జరుగుతున్నా గిరిజనుల విన్నపాలు అరణ్య రోదనగా మిగిలిపోతున్నాయి. ముందు జాగ్రత్త ఏదీ..? రెండేళ్లుగా వరుసగా కాళ్ల వ్యాపు వ్యాధి సెప్టెంబర్ నెలలోనే ఎక్కువగా ప్రబలుతోంది. వర్షాకాలంలో గిరిజనులకు కనీ స ఆహారం కూడా దొరకని పరిస్థితి. అంతేకాకుండా కొండవాగుల్లోని నీరు వర్షాల వచ్చే వ్యర్ధాల కారణంగా కలుషితమవుతున్నాయి. మరోదారి లేక ఆ నీటినే గిరిజనులు తాగుతున్నారు. పౌష్టికాహార లోపం వల్ల గిరిజనుల్లో రక్తహీనత ఎక్కువగా కనిపిస్తోంది. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఈ ప్రాంతవాసులు వేగంగా వ్యాధుల బారిన పడుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. కాళ్లవాపు వ్యాధి ప్రబ లడంతో ఆ ప్రభావం మూత్ర పిండాలు, గుండె తదితర అవయవాలపై పడుతోందని వివరిస్తున్నారు. ఈ నేపథ్యం లో గిరిజనులకు పౌష్టికాహారం అందేలా తగిన చర్యలు తీ సుకుని, కాళ్ల వాపు వ్యాధి ప్రబలడానికి ముందుగానే ని యంత్రణ చర్యలు చేపట్టాల్సి ఉన్నా ఆ దిశగా యంత్రాం గం మేల్కొనలేదన్న విమర్శలున్నాయి. ఫలితంగా ఈ ఏడాది కూడా కాళ్లవాపుతో గిరిజనులు మృతి చెందుతున్నారు. పౌష్టికాహార లోపమే ప్రధాన కారణం... ఆహారపు అలవాట్లు మారాలి. కనీస ఆహారం వారికి దొరకదు. ప్రభుత్వం ఇస్తున్న బియ్యం, ఇతర వస్తువులు ఉపయోగించడంలేదు. ఫలితంగా పౌష్టికాహార లోపం తలెత్తుతోంది. పిల్లలు, పెద్దల్లో రక్తహీనత ఎక్కువగా ఉంటోంది. జీలుగు కల్లు, నాటుసారా ఎక్కువగా తాగుతున్నారు. పరిశుభ్రమైన నీరు తాగడంలేదు. కిడ్నీ విఫలమై చివరి దశలో ఆస్పత్రికి వస్తున్నారు. అప్పటి వరకు స్థానికంగానే నాటు మందులు, పెయిన్కిల్లర్ మందులు వాడుతున్నారు. పౌష్టికాహారం తీసుకునేలా గిరిజనులను చైతన్యం చేయాలి.– టి.రమేష్కిశోర్, జిల్లా వైద్యసేవల సమన్వయాధికారి వైద్య శిబిరాలునిర్వహించేందుకు ఏర్పాట్లు వీఆర్పురం మండలంలో కాళ్లవాపుతో గిరిజనులు మృతి చెందిన విషయం మా దృష్టికి వచ్చింది. మూడేళ్లుగా ఈ వ్యాధి వస్తుందని గణాంకాలున్నాయి. 2016లో బాధితులకు కాకినాడ జీజీహెచ్లో ప్రత్యేక వార్డు కేటాయించి వైద్యం అందించాం. ఈ సారీ అదే విధంగా చేసేందుకు ఆస్పత్రి సూపరింటెండెంట్తో మాట్లాడుతున్నాను. కాళ్లవాపు వ్యాధితో మృతి చెందిన గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.– టీఎస్ఆర్ మూర్తి, జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి, కాకినాడ -
ఆదిలాబాద్ను వణికిస్తున్న డెంగ్యూ
-
డెంగీతో విద్యార్థిని మృతి
అంబర్పేట: డెంగీ వ్యాధితో బాధపడుతూ ఓ విద్యార్థిని మృతి చెందిన సంఘటన అంబర్పేట పరిదిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. న్యూ పటేల్నగర్కు చెందిన సాయిని సురేష్ కుమార్తె శ్రీలక్ష్మి(14) స్థానిక ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. గత మూడు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతుండడంతో స్థానికంగా ఉండే ప్రైవేటు వైద్యుడి వద్దకు తీసుకువెళ్లగా సాధారణ జ్వరంగా భావించి మాత్రలు ఇచ్చాడు. బుధవారం రాత్రి ఆమెకు జ్వరం తీవ్రం కావడంతో విద్యానగర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు డెంగీ జ్వరం సోకిందని కార్పొరేటర్ ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. అమీర్పేటలోని కార్పొరేటర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. బాలిక మృతికి స్థానిక ఆర్ఎంపీ వైద్యుడు మహేందర్ కారణమని ఆరోపిస్తూ మృతురాలి కుటుంబసభ్యులు అతని క్లినిక్ ఎదుట ఆందోళన చేపట్టారు. -
పంజా విసిరిన డెంగీ
రాష్ట్రంపై డెంగీ పంజా విసిరింది. విష జ్వరాలతో ప్రజలు వణికిపోతున్నారు. గ్రామాలకు గ్రామాలు కాగిపోతున్నాయి. ఏజెన్సీ, మైదాన ప్రాంతాలనే తేడా లేకుండా అన్ని జిల్లాలు మంచానపడ్డాయి. పలు ప్రాంతాల్లో కుటుంబానికి ఇద్దరు, ముగ్గురు.. డెంగీ, మలేరియా వంటి విషజ్వరాల బారినపడటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇప్పటికే అనధికారికంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడైంది. వేలాది మంది రోగులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. పలు ఆస్పత్రుల్లో పడకలు సరిపోక నేలపైనే రోగులను పడుకోపెట్టి చికిత్స అందించాల్సిన దుస్థితి తలెత్తింది. దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోవడంతో రోజురోజుకీ పరిస్థితి విషమిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్య తీరుపై బాధితులు, వారి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, నెట్వర్క్: విషజ్వరాలతో ఉత్తరాంధ్ర వణికిపోతోంది. శ్రీకాకుళం జిల్లాలో గత రెండు నెలల్లో డెంగీ, మలేరియా బారినపడి 23 మందికిపైగా మృత్యువాత పడ్డారు. కానీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మాత్రం వీటిని సహజ మరణాలుగానే రికార్డుల్లో నమోదు చేస్తూ.. తీవ్రతను కప్పిపుచ్చే చర్యలకు పాల్పడుతోంది. ప్రస్తుతం జిల్లాలో 217 మంది మలేరియాతోనూ, 55 మంది డెంగీతోనూ బాధపడుతున్నారని వైద్యశాఖాధికారులు చెబుతున్నారు. విజయనగరం జిల్లాలో అయితే విషజ్వరాల తీవ్రత అధికంగా ఉంది. జిల్లాలో ఈ ఏడాది 87 డెంగీ కేసులు నమోదయ్యాయి. డెంగీ, ఇతర విషజ్వరాలతో ఇప్పటివరకు 70 మందికిపైగా ప్రాణాలొదిలారు. ఒక్క డెంగీతోనే 30 మంది ప్రాణాలు విడిస్తే.. వైద్యాధికారులు మాత్రం ఇద్దరే చనిపోయారని చెబుతున్నారు. విజయనగరం అర్బన్, నెల్లిమర్ల, డెంకాడ, గజపతినగరం, దత్తిరాజేరు, గుర్లలో డెంగీ కేసుల తీవ్రత అధికంగా ఉంది. ఇక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం 290 మలేరియా కేసులు, 1,100 టైఫాయిడ్ కేసులు, 21,800 డయేరియా కేసులు నమోదయ్యాయి. ఇక విశాఖ జిల్లాలో ఇప్పటివరకు 1,660 డెంగీ కేసులు నిర్ధారణయ్యాయి. అనధికారిక లెక్కల ప్రకారం డెంగీ మరణాల సంఖ్య వందకు పైగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కొంతకాలంగా రోజుకు ఇద్దరు, ముగ్గురు డెంగీతో మృతి చెందుతున్నట్లు సమాచారం. డెంగీ బాధితుల కోసం కింగ్ జార్జి ఆస్పత్రి(కేజీహెచ్)లో ప్రత్యేకంగా పది పడకలు ఏర్పాటు చేశారు. కానీ రోజుకు 20 మందికి పైగా రోగులు వస్తుండడంతో.. వారిని ఇతర వార్డుల్లో ఉంచి వైద్యమందిస్తున్నారు. ప్రస్తుతం కేజీహెచ్లో 22 మంది డెంగీ బాధితులు చికిత్స పొందుతున్నారు. గజగజలాడుతున్న గోదావరి జిల్లాలు.. డెంగీ ధాటికి గోదావరి జిల్లాలు కూడా గజగజలాడుతున్నాయి. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు మృతి చెందారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన వారి సంఖ్య ఇంకా భారీగా ఉండే అవకాశముంది. కానీ డెంగీ మరణాలను వెల్లడించేందుకు అధికారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఈ ఏడాది ఇప్పటి వరకు 258 డెంగీ కేసులు నమోదయ్యాయి. శనివారం జగ్గంపేట మండల మల్లిశాలకు చెందిన పాలిపిరెడ్డి నూక రత్నం(53) డెంగీతో కాకినాడ జీజీహెచ్లో మృతి చెందగా.. వైద్య సిబ్బంది ఈ విషయాన్ని బయటపెట్టవద్దని చెప్పినట్లు తెలిసింది. కాకినాడ రూరల్లో అత్యధికంగా 85 డెంగీ కేసులు నమోదవ్వగా.. కాకినాడ నగరంలో 65 కేసులు నమోదయ్యాయి. దీన్ని బట్టే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. మల్కిపురం మండలం గుడిమెళ్లంకలో ఇటీవల ఓ వ్యక్తి డెంగీతో మృతి చెందారు. రంపచోడవరం నియోజకవర్గంలో గిరిజనులు డెంగీతో అల్లాడిపోతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ జిల్లాలో గత 3 నెలల్లో అధికారికంగానే 44 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఏలూరు, నరసాపురం, భీమడోలు, నల్లజర్ల, రాఘవాపురం, పెనుగొండ, కొవ్వూరు, తాడేపల్లిగూడెం, లంకలకోడేరు, పెనుమంట్ర, ఏజెన్సీ ప్రాంతాల్లో డెంగీ ప్రభావం తీవ్రంగా ఉంది. ఏలూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రి బాధితులతో కిటకిటలాడుతోంది. ప్రస్తుతమున్న వార్డు సరిపోక.. మరో వార్డును అదనంగా కేటాయించారు. ఇక జిల్లా వ్యాప్తంగా 169 మలేరియా కేసులు నమోదయ్యాయి. రాజధానిలోనూ దయనీయమే.. కృష్ణా జిల్లాలోని నందిగామ, ముదినేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో కుటుంబానికి ఇద్దరు, ముగ్గురు జ్వరపీడితులున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రికి సాధారణంగా రోజుకు దాదాపు 200 మంది రోగులు వస్తుండేవారు. కానీ విషజ్వరాల దెబ్బకు రోజుకు 350 మందికి పైగా రోగులు వస్తుండటంతో పడకలు చాలక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నేలపైనే పడుకోపెట్టి చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 42 డెంగీ, 100 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఇటీవల నందిగామ పట్టణానికి చెందిన మారం జయశ్రీ(18) అనే విద్యార్థిని, వెల్లంకికి ముండ్లపాటి నారాయణ(56) డెంగీతో మృతిచెందారు. ముదినేపల్లి మండలం శ్రీహరిపురం శివారు చేవూరుపాలెం గ్రామస్తులు 15 రోజులుగా విషజ్వరాలు, కీళ్లనొప్పులతో బాధపడుతున్నారు. గుంటూరు జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి 87 డెంగీ, 279 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఈమని, చుండూరు, ఫిరంగిపురం, కొల్లూరు, గణపవరం, మాచర్ల, మందపాడు, నరసరావుపేట, నూతక్కి, నూజెండ్ల, పెదవడ్లపూడి, తుళ్లూరు, తాడేపల్లితో పాటు గుంటూరు నగరంలోని అనేక ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా తయారైంది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో అధికారికంగా 17 డెంగీ, 44 మలేరియా కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని 132 గ్రామాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ప్రకాశం జిల్లాలోనూ విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇప్పటివరకు 56 డెంగీ, వందకుపైగా మలేరియా కేసులు రికార్డయ్యాయి. మార్కాపురం నియోజకవర్గంలో 24 మంది డెంగీతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు. డెంగీ నిర్ధారణపై ఆంక్షలు! డెంగీ నిర్ధారణపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. విశాఖ జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో డెంగీ నిర్ధారణ పరికరాలున్నప్పటికీ.. ప్రభుత్వ ఆంక్షల వల్ల కేజీహెచ్లోని ల్యాబ్కు వెళ్లాలని చెబుతున్నారు. దీంతో అక్కడి ల్యాబ్ రోగులతో కిటకిటలాడుతోంది. తీరా వ్యాధి నిర్ధారణయ్యేసరికి చాలా మంది ప్రాణాలు విడుస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటిదాకా కేజీహెచ్లో 4,574 మందికి పరీక్షలు నిర్వహించగా 1,660 మందికి డెంగీగా నిర్ధారణ అయ్యింది. అంటే ప్రతి ముగ్గురు అనుమానితుల్లో ఒకరికి డెంగీ నిర్ధారణ అవుతోంది. పెళ్లయిన 13 రోజులకే ప్రాణం తీసిన విష జ్వరం మాయదారి విష జ్వరం ఓ నవ వరుడిని మింగేసింది. విజయనగరంలోని పూల్బాగ్ కాలనీకి చెందిన పన్నగంటి ఈశ్వరరావు(24) కార్పెంటర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత నెల 24న అతనికి పూల్బాగ్ కాలనీకి చెందిన మౌనికతో వివాహమైంది. జ్వరం రావడంతో ఈశ్వరరావును ఈ నెల 4న నెల్లిమర్ల మిమ్స్కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో.. వైద్యులు బుధవారం అతన్ని కేజీహెచ్కు రిఫర్ చేశారు. అక్కడకు తీసుకెళ్లేసరికే ఈశ్వరావు మృతి చెందాడు. పెళ్లయిన 13 రోజులకే వరుడు చనిపోవడంతో అతని భార్య, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అవసరమైతే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటిస్తాం: సీఎం సాక్షి, అమరావతి: పారిశుధ్య పరిస్థితుల్లో మార్పు రాకపోతే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. డెంగీ విజృంభణ నేపథ్యంలో బుధవారం ఆయన అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎ మాట్లాడుతూ.. విశాఖ, విజయనగరం, గుంటూరు జిల్లాల్లో జ్వరాలు తీవ్రంగా ఉన్నాయన్నారు. దోమల బెడదను నివారించాలని, రక్షిత తాగునీటిని అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. సీమలోనూ విషజ్వరాల విజృంభణ.. రాయలసీమలోనూ విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. అనంతపురం జిల్లాలో 66 డెంగీ కేసులు నమోదవ్వగా.. ఈ నెల 1న నార్పల గ్రామానికి చెందిన అనుష్క(8) మృతి చెందింది. ఇప్పటివరకు 164 మలేరియా, 66 డెంగీ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని అనంతపురం అర్బన్, బుక్కరాయసముద్రం, ఎద్దులపల్లి, కురుకుంట ప్రాంతాల్లోని 30 గ్రామాల్లో డెంగీ తీవ్రత అధికంగా ఉంది. వైఎస్సార్ జిల్లాలోనూ 45 డెంగీ అనుమానిత కేసులు నమోదవ్వగా.. ఏడింటిని నిర్ధారించారు. కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు 134 డెంగీ అనుమానిత కేసులు నమోదవ్వగా.. ఐదుగురికి డెంగీ ఉన్నట్లు నిర్ధారించారు. కాగా, కొత్తపల్లి మండలం చిన్నగుమ్మడాపురం, నందికుంటకు చెందిన లీలావతి, లక్ష్మీదేవి ఇటీవల డెంగీతో మృతి చెందినట్లు వారి కుటుంబసభ్యులు తెలిపారు. తాజాగా, కర్నూలు గణేష్నగర్కు చెందిన లక్ష్మయ్య(21) అనే ఇంజినీరింగ్ విద్యార్థి, పనుల నిమిత్తం కర్నూలుకు వచ్చిన కమలాకర్, ప్రకాష్(ఒడిశా) డెంగీతో బాధపడుతున్నారు. -
రక్తంతో వ్యాపారమా?
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లాలో రక్తంతో వ్యాపారం జరగడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డెంగీ విజృంభణను ముఖ్యమంత్రి నియంత్రించలేకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. ‘కృష్ణా జిల్లాలో రక్తపు ప్లేట్లెట్ల విషయంలో కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. యూనిట్ రక్తానికి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. వైద్య, ఆరోగ్యశాఖను కూడా నిర్వహిస్తున్న సీఎం చంద్రబాబు ఉంటున్న చోటే ఇలా జరుగుతోంది. ఈ రాష్ట్రంలో మీ పాలనలో ఏదైనా అదుపులో ఉందా?’ అని ట్వీట్ చేశారు. ‘రక్తంతో వ్యాపారం ఇక్కడ ఒక అంశం. రక్తంతో కూడా వ్యాపారమేనా? ఎక్కడున్నారు ముఖ్యమంత్రిగారు? మీ ప్రభుత్వం డెంగీ విజృంభణను ఎందుకు అడ్డుకోలేకపోతోంది?’ అని అందులో ప్రశ్నించారు. ఏపీలో ఓడాక అమెరికాలో అధికారం కోసం లోకేశ్ ఆలోచిస్తారు ‘2019 ఎన్నికల్లో ఏపీలో ఘోరంగా ఓడిన వెంటనే నారా లోకేశ్ నాయుడు తమ పార్టీ అమెరికాలో అధికారంలోకి ఎలా రావాలో ఆలోచిస్తూ ఉంటారు. మరి చంద్రబాబు ఏ దేశానికి అధ్యక్షుడు కావాలనుకుంటారు? ఏ–స్విట్జర్లాండ్, బి–సింగపూర్, సి–మలేషియా, డి–జపాన్’ అని విజయసాయిరెడ్డి వ్యంగ్యంగా మరో ట్వీట్ చేశారు. -
దోమ దెబ్బ
సాక్షి, సిటీబ్యూరో: ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలు సిటిజన్ల వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. వాతావరణంలో మార్పులకు తోడు ఇళ్ల మధ్య మురుగు నిల్వ, చెత్తా చెదారంతో డెంగీ, మలేరియా దోమలు విజృంభిస్తున్నాయి. నీరు, ఆహార కాలుష్యంతో నగరవాసులు డయేరియా, విషజ్వరాల బారినపడుతున్నారు. వాంతులు, విరేచరాలతో పాటు దగ్గు, జ్వరంతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి, ఉస్మానియా, గాంధీ జనరల్ ఆస్పత్రులు సహా నగరంలోని పలు కార్పొరేట్ ఆస్పత్రులకు రోగులు పోటెత్తుతున్నారు. వర్షాలు తగ్గిన తర్వాత డయేరియా కేసులతో పాటు ఇతర సీజనల్ వ్యాధుల బారిన పడిన బాధితుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది, ఈ సీజనల్ వ్యాధుల విషయంలో నగరవాసులు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. చాపకింద నీరులా డెంగీ, మలేరియా నగరంలో మలేరియా, డెంగీ దోమలు చాపకింద నీరులా విజృంభిస్తున్నాయి. గత నెలలో ఒక్క గాంధీ ఆస్పత్రిలోనే 417 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఆగస్టులో ఇప్పటి వరకు 70పైగా కేసులు, ఉస్మానియాలో కేవలం వారం రోజుల్లోనే 26 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఫీవర్లో 14 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఈ ఏడాది ఇప్పటి వరకు 179 కేసులు నమోదు కాగా, ఈ నెలలో 46 కేసులు నమోదయ్యాయి. 274 మలేరియా కేసులు నమోదు కాగా, వీటిలో ఒక్క ఆగస్టులోనే 31 కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు స్పష్టం చేశారు. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి నీటిని వేడి చేసి, చల్లారిన తర్వాత తాగాలి. హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో తయారు చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇంటి పరిసరాల్లో మురుగు నీరు నిల్వ లేకుండా చూడాలి. పూల కుండీలు, వాటర్ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. – డాక్టర్ సుదర్శన్రెడ్డి, జనరల్ ఫిజిషియన్ -
డెంగీ డేంజర్
వీఆర్పురం (రంపచోడవరం): వీఆర్పురం మండలంలో డెంగీ జ్వరాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఒకే రోజున ఓ అంగన్వాడీ కార్యకర్తతో పాటు మరో వృద్ధురాలు డెంగీ లక్షణాలతో మృతి చెందడంతో జ్వరం బారిన పడిన ప్రతిఒక్కరూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఓ పక్క వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో కాలు బయటకు మోపలేని పరిస్థితి ఉంటే, మరోపక్క డెంగీ జ్వరాలు వెంటాడడం, ఆ లక్షణాలతో ఇద్దరు మృత్యువాత పడడంతో జ్వర బాధితుల్లో ఆందోళన నెలకొంది. వడ్డిగూడెం, వీఆర్పురంలోని రామాలయం వీధి, బీసీ కాలనీ, రేఖపల్లి ఎస్సీ కాలనీ, గొల్లగూడెం, సీతంపేట తదితర గ్రామాల్లోని ఇంటికి ఒకరిద్దరు చొప్పున మంచాన పడిన పరిస్థితులు నెలకొన్నాయి. వారిలో కొంతమంది రక్తపరీక్షలు చేయించుకోగా డెంగీ పాజిటివ్ అని తేలడంతో వారందరూ తెలంగాణ రాష్ట్రం భద్రాచలం వెళ్లి ప్రైవేట్ వైద్యం చేయించుకొని ప్రాణాలు దక్కించుకునేప్రయత్నాలు చేస్తున్నారు. డెంగీ లక్షణాలతో ఇద్దరి మృతి రేఖపల్లి గొల్లగూడేనికి చెందిన కుంజా అక్కమ్మ(45) స్థానికంగా అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. ఆమె నాలుగు రోజుల క్రితం జ్వరం బారిన పడడంతో రేఖపల్లి పీహెచ్సీలో చికిత్స పొందింది. జ్వరం నయం కాకపోవడంతో సోమవారం ఆమెకు డెంగీ పరీక్ష చేయించారు. డెంగీ(రియాక్టివ్) లక్షణాలు తీవ్ర స్థితిలో ఉన్నట్టు తేలడం, మంగళవారం సాయంత్రం ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో 108 వాహనంలో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున ఆమె మృతిచెందింది. అలాగే ఉమ్మిడివరం గ్రామానికి చెందిన కుర్సం సీతమ్మ(60) కూడా డెంగీ బారినపడి భద్రాచలం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. అదే లక్షణాలతో సీతమ్మ మనుమరాలు చిచ్చడి సంజీత కూడా భద్రాచలం ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. క్షీణిస్తున్న రక్తకణాలు వీఆర్పురం గ్రామానికి చెందిన ముత్యాల నందినీ అనే మహిళకు డెంగీ లక్షణాలు లేకున్నా తెల్ల రక్తణాల సంఖ్య 45 వేలకు పడిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అధికారులు స్పందించి గ్రామాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి మా ప్రాణాలను రక్షించాలని ప్రజలు వేడుకొంటున్నారు. జ్వరం వస్తే అశ్రద్ధ చూపవద్దు ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో ఎవరైనా జ్వరం బారిన పడితే అశ్రద్ధ చూపకుండా పీహెచ్సీకి వచ్చి చికిత్స చేయించుకోవాలి. మండలంలో డెంగీ పాజిటివ్ కేసులతో పాటు రియాక్టివ్ కేసులు కూడా నమోదయ్యాయి. పరిసరాల పరిశుభ్రత పాటించి, దోమతెరలు వాడితే డెంగీ దోమల నుంచి రక్షణ పొందగలుగుతారు. అలాగే డెంగీ కేసులు నమోదైన గ్రామాల్లో వైద్య సిబ్బందితో డోర్ టూ డోర్ సర్వే చేయించాం. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నాం.– ఎం.సుందర్ప్రసాద్,రేఖపల్లి పీహెచ్సీ మెడికలాఫీసర్ -
దోమలకు దోమలే విరుగుడు..!!
టౌన్స్విల్, ఆస్ట్రేలియా : ఆస్ట్రేలియాలోని ఓ నగరంలో గత నాలుగేళ్లుగా ఒక్క డెంగీ వ్యాధి కేసు నమోదు కాలేదు. దోమలకు దోమల్నే ప్రత్యర్థులుగా వినియోగించిన శాస్త్రవేత్తలు ఈ విజయాన్ని సాధించగలిగారు. కొన్ని దోమల్లోకి వోల్బాచియా బ్యాక్టీరియాను చొప్పించడం ద్వారా డెంగీ వ్యాధిని వ్యాప్తి చేసే దోమలను నాశనం చేశారు. ఈ పద్దతిని తొలిసారిగా ఆస్ట్రేలియాలోని టౌన్స్విల్ పట్టణంలో ప్రవేశపెట్టారు. ఇది విజయం సాధించడంతో జికా, మలేరియా దోమలను కూడా హతమార్చేందుకు ప్రయత్నాలను ప్రారంభించారు. బ్రెజిల్లోని రియో డి జెనీరోలో జికా దోమలను చంపడమే లక్ష్యంగా అతి త్వరలో కొన్ని ప్రత్యేక దోమలను(వోల్బాచియా బ్యాక్టీరియా ప్రభావితమైనవి) వదలనున్నారు. కొలంబియాలోని మెడ్లిన్, ఇండోనేషియాలోని యోగ్యకార్టాల్లో సైతం ఈ మేరకు సన్నహకాలు జరుగుతున్నాయి. టౌన్స్విల్లో డెంగీపై విజయం సాధించడానికి ప్రధాన కారణం. చిన్నపెద్ద తేడా లేకుండా అందులో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవడమే. విద్యార్థులు సైతం వోల్బాచియా దోమలను వదిలేందుకు ఆసక్తిని కనబర్చారు. దోమలను వదిలిన నాటి నుంచి టౌన్స్విల్లో ఒక్కటంటే ఒక్క డెంగీ కేసు కూడా నమోదు కాలేదు. దీంతో ఈ దోమలను ప్రపంచవ్యాప్తంగా అందించడం ద్వారా డెంగీ వ్యాధిని పూర్తిగా అరికట్టవచ్చనే భావన వ్యక్తం అవుతోంది. -
వణుకుతున్న అన్నంరాజుపేట
జామి విజయనగరం : మండలంలోని అన్నంరాజుపేటలో జ్వరాలు ప్రబలాయి. ప్రతి ఇంటికీ ఒకరిద్దరు జ్వరపీడితులున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎస్సీ కాలనీలో ప్రతి ఇంటికీ ఇద్దరు, ముగ్గురు మంచానపడ్డారు. గ్రామానికి చెందిన కొంతమంది ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు తీయగా, మరికొంతమంది విజయనగరం కేంద్రాస్పత్రిని ఆశ్రయిస్తున్నారు. జ్వరం, తలనొప్పి, తదితర సమస్యలతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఎస్సీ కాలనిలో సుమారు 50 మందికి పైగా జ్వరాలతో భాదపడుతున్నారు. ఇదిలా ఉంటే కాలనీకి చెందిన అలమండ బంగార్రాజు జ్వరం, పచ్చకామెర్లతో సోమవారం మృతి చెందాడు. నాలుగు రోజుల కిందట జ్వరం రావడంతో బంగార్రాజు అలమండ పీహెచ్సీలో వైద్యం పొందాడు. అక్కడ నుంచి విజయనగరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో అనంతరం కేంద్రాస్పత్రిలో చికిత్స తీసుకుంటూ కన్నుమూశాడు. మృతుడికి భార్య వెంకటలక్ష్మి, ,ఇద్దరు చిన్నారులు రేవంత్(5), హరీష్(4)ఉన్నారు. ఆందోళనలో కాలనీవాసులు పారిశుద్ద్యం క్షీణించడం వల్లే జ్వరాలు ప్రబలా యని కాలనీ వాసులు చెబుతున్నారు. కాలనీలో పారిశుద్ధ్య పనులు చేపట్టడం లేదని అంబేడ్కర్ యువజన సంఘ సభ్యులు, స్థానికులు ఆరోపించారు. ఈ విషయమై ఏఆర్ పేట వైద్యాధికారి తూర్పాటి వెంకటరావు మాట్లాడుతూ, కాలనీకి చెందిన బంగార్రాజు అలమండ పీహెచ్సీకి రాగా విజయనగరం ఆస్పత్రికి రిఫర్ చేశామన్నారు. అక్కడ పచ్చకామెర్లకు చికిత్స పొందుతూ మృతి చెందాడని చెప్పారు. పీహెచ్సీ పరిధిలోని ఆరు గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపా రు. అలాగే పారిశుద్ధ్యం, క్లోరినేషన్ విషయమై ఈఓపీఆర్డీ ఏవీ లక్ష్మి వద్ద ప్రస్తావించగా, తక్షణమే పారిశుద్ధ్య పనులు చేపడతామని చెప్పారు. పాతబగ్గాంలో డెంగీ.. గజపతినగరం/ విజయనగరం ఫోర్ట్ : గజపతినగరం మండలం పాతబగ్గాం పంచాయతీ ఎరుకలపేటలో పాలవలస మోహన్ (13) డెంగీ లక్షణాలతో విజయనగరం కేంద్రాస్పత్రిలో సోమవారం చేరాడు. అలాగే గ్రామానికి చెందిన దాసరి సింహాచలం, హర్ష, కిరణ్, తదితరులు జ్వరాలతో బాధపడుతున్నారు. మోహన్కు ప్లేట్లెట్స్ తగ్గినట్లు వైద్యులు చెప్పారని తల్లిదండ్రులు పాలవలస రమణ, పైడితల్లి తెలిపారు. విషయం తెలుసుకున్న మరుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి జయశ్రీ గ్రామంలో సోమవారం ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. సుమారు 50 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి మాత్రమే జ్వరాలు ఉన్నట్టు వైద్యాధికారిణి తెలిపారు. గుమ్మిడివరంలో ప్రబలిన జ్వరాలు సీతానగరం: మండలంలోని లచ్చయ్యపేట పంచాయతీ గుమ్మిడివరంలో జ్వరాలు ప్రబలడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోటు పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో దోమలు వృద్ధి చెంది జ్వరాలు ప్రబలాయని చెబుతున్నారు. గ్రామానికి చెందిన జి. లీలావతి, పి. వనజాక్షి, కె. గౌరమ్మ, తదితర 30 మంది జ్వరాలతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న వైద్యసిబ్బంది డీవీ సత్యనారాయణ, ఆర్. స్వర్ణ, ఆశ వర్కర్ పి. లక్ష్మి, తదితరులు గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించారు. గ్రామంలో కాలువలు సగం వరకు నిర్మించి వదిలేయడంతో ఎప్పుడు వర్షాలు పడినా పరిస్థితి అధ్వానంగా మారుతుందని జి. కృష్ణరాజు, తదితరులు తెలిపారు. కిటకిటలాడిన కేంద్రాస్పత్రి ..1200కు పైగా వచ్చిన రోగులు విజయనగరం ఫోర్ట్: జిల్లా కేంద్రాస్పత్రికి సోమవారం రోగులు పోటెత్తారు. అన్ని ఓపీలకు రోగులు అధిక సంఖ్యలో వచ్చారు. మానసిక, దంత విభాగాలు మినహాయించి ప్రతీ ఓపీ విభాగానికి 100కు పైగా రోగులు వచ్చారు. దీంతో వైద్యులు రోగులకు వైద్యసేవలందించడానికి అవస్థలు పడ్డారు. ఓపీ చీటీలు ఇచ్చే విభాగం, ఫార్మసీ ఇలా అన్ని విభాగాలు రోగులతో నిండిపోయాయి. -
డెంగ్యూకీ ఉందో పాలసీ
డెంగ్యూ వ్యాధి నిర్ధారణ, చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్నవే. అనేక దఫాలుగా రక్త పరీక్షలు, ఔషధాలు, ఇంజెక్షన్లు... ఈ ట్రీట్మెంట్ అంతా ఖరీదైనదే. అందుకే బీమా సంస్థలు ప్రత్యేకంగా డెంగ్యూ కవరేజీ కోసం హెల్త్ పాలసీలను ప్రవేశపెట్టాయి. ఇన్–పేషంట్ హాస్పిటలైజేషన్తో పాటు ప్రీ– హాస్పిటలైజేషన్, పోస్ట్ హాస్పిటలైజేషన్ దాకా ఇవి కవరేజీని అందిస్తున్నాయి. పేద, గొప్ప తారతమ్యం లేకుండా ఎవరికైనా డెంగ్యూ సోకే ప్రమాదముంది కనక.. ఈ వర్షాకాలంలో డెంగ్యూ నుంచి కుటుంబానికి రక్షణ కల్పించేందుకు సమగ్రమైన కవరేజీని అందించే పాలసీని ఎంచుకోవడం శ్రేయస్కరం. సాధారణంగా ఆరోగ్య బీమా పాలసీని కొనేటపుడు చాలా అంశాలు చూసుకోవాలి. మొత్తం కుటుంబానికి కవరేజీ ఉంటుందా లేదా, సమ్ అష్యూర్డ్.. ప్రీమియం ఎంత? అప్పటికే ఉన్న వ్యాధులకు కవరేజీ ఇచ్చేందుకు వెయిటింగ్ పీరియడ్ ఎంత? నెట్వర్క్ ఆస్పత్రుల వివరాలు, క్యాష్లెస్ సదుపాయం, ప్రీ–పోస్ట్ హాస్పిటలైజేషన్, రూమ్ రెంటు పరిమితులు మొదలైనవన్నీ ఇందులో ఉంటాయి. డెంగ్యూ పాలసీలోనూ ఇలాంటివి ఉండేలా చూసుకోవచ్చు. ఈ పాలసీని కొనుగోలు చేసేటప్పుడు ప్రధానంగా పరిశీలించాల్సిన అంశాల్లో కొన్ని ఇవి.. తక్కువ ప్రీమియం ఎక్కువ కవరేజీ ఆరోగ్య బీమా పాలసీని కొనేటపుడు కట్టే ప్రీమియానికి తగినంత విలువ లభిస్తోందో లేదో చూసుకోవాలి. ప్రీమియం తక్కువగా ఉండాలి. అత్యధిక కవరేజీ లభించాలి. ఇటు హాస్పిటలైజేషన్, అటు అవుట్పేషంట్ ట్రీట్మెంట్కూ పనికొచ్చేదిగా చూసుకోవాలి. ఓపీడీ కవరేజీ.. డయాగ్నస్టిక్ టెస్టుల నుంచి కన్సల్టేషన్, హోమ్ నర్సింగ్, ఫార్మసీ దాకా అన్నింటికి కవరేజీనిచ్చేలా డెంగ్యూ పాలసీ ఉండాలి. సాధారణంగా డెంగ్యూ చికిత్స ఇంటి వద్దే పొందవచ్చు. కొనుగోలు ప్రక్రియ సులభంగా పాలసీ ఎంత సరళతరంగా ఉంటే అంత మంచిది. ఏ వయస్సు వారైనా çఏడాది మొత్తానికి ఒకేసారి ప్రీమి యం కట్టేసే పాలసీ తీసుకోవాలి. ముందస్తు వైద్య చికిత్సలు తదితర బాదరబందీ లేకుండా పాలసీ నిబంధనలు సరళంగా ఉన్నది ఎంచుకోవాలి. వెయి టింగ్ పీరియడ్ కూడా తక్కువ ఉండేలా చూసుకోవాలి. ఇతరత్రా సాధారణ ఆరోగ్య బీమా పాలసీలకు రిజెక్ట్ చేసిన వారికి సైతం డెంగ్యూ కేర్ పాలసీ వర్తించేలా ఉండాలి. ఆస్పత్రిలో చేరాకా.. గది అద్దె వంటి వైద్యయేతర ఖర్చులకు కూడా కవరేజీ ఉండాలి. భారీగా చికిత్స ఖర్చులు.. డెంగ్యూ పాలసీని తీసుకోవాలా వద్దా అన్న ఆలోచనలో ఉన్నవారు ఒకసారి దీని చికిత్స వ్యయాలు ఏ స్థాయిలో ఉంటున్నాయో చూసి నిర్ణయం తీసుకోవడం మంచిది. సాధారణంగా డెంగ్యూ వైద్య పరీక్షలకే చాలా ఖర్చవుతుంటుంది. ఇక తీవ్రమైన కేసు అయిన పక్షంలో అప్పటికప్పుడు ఆస్పత్రిలో చేర్చి, ప్లేట్లెట్స్ ఎక్కించాలి. వైద్య పరీక్షలకే దాదాపు రూ.5,000 నుంచి రూ. 10,000 దాకా ఖర్చవుతుంది. ఇక ఆస్పత్రిలో చేరాల్సి వస్తే చికిత్సా వ్యయాలు సుమారు రూ. 35,000 నుంచి రూ.70,000 దాకా ఉంటున్నాయి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకునే బీమా సంస్థలు డెంగ్యూ కేర్ పాలసీలను అందుబాటులోకి తెచ్చాయి. వైద్య పరీక్షల నుంచి చికిత్స వ్యయాల దాకా అన్నింటికీ కవరేజీ అందించేవిగా ఇవి ఉన్నాయి. ఇప్పటికే హెల్త్ పాలసీ ఉంటే... ఒకవేళ ఇప్పటికే మీకో హెల్త్ పాలసీ ఉన్నా.. డెంగ్యూ పాలసీని ప్రత్యేకంగా తీసుకోవడం మంచిదే. తద్వారా మీ ప్రైమరీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీద వచ్చే బోనస్ను యథాతథంగా అందుకోవచ్చు. సాధారణంగా ఏ క్లెయిమూ చేయని పాలసీదారుకు బీమా సంస్థలు కొంత బోనస్ ఇస్తుంటాయి. సమ్ అష్యూర్డ్ను పెంచడం రూపంలోనో లేదా ప్రీమియంలో డిస్కౌంటు ఇవ్వడం రూపంలోనో ఇది ఉంటుంది. ప్రత్యేకంగా డెంగ్యూ కవరేజీ తీసుకోవడం వల్ల.. పాలసీదారు తన ప్రైమరీ హెల్త్ పాలసీలో దీన్ని క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ రకంగా బోనస్లను కాపాడుకోవచ్చు. కాబట్టి.. ఈ వర్షాకాలంలో.. ప్రాణాంతకమైన డెంగ్యూ నుంచి మీకు, మీ కుటుంబసభ్యులందరికీ రక్షణ కల్పించేలా స్వల్ప ఖర్చుతో డెంగ్యూ పాలసీ తీసుకోవడం అన్నివిధాలా శ్రేయస్కరం. ఆంటోనీ జేకబ్ సీఈవో, అపోలో మ్యూనిక్ హెల్త్ -
రక్తదానం చేయాలనుకుంటున్నారా?
కొందరు వ్యక్తులు సమాజానికి ఏదైనా చేయాలనుకుంటారు. ఎంతో కొంత ఉపయోగపడాలనుకుంటారు. రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్టేనని భావించి... వాళ్ల పుట్టినరోజునాడో లేదా వారు ప్రత్యేకమని అనుకునే రోజుల్లో రక్తదానం చేస్తుంటారు. ఇలాంటి మానవీయ వ్యక్తులు రక్తదానం చేసే సమయంలో ఇది గుర్తుంచుకోండి. మీరు రక్తదానం చేయాలనుకున్నప్పుడు రక్తంలోని వివిధ కాంపోనెంట్స్ను విడదేసే సౌకర్యం ఆ బ్లడ్బ్యాంకులో ఉందా, లేదా అని వాకబు చేయండి. ఎందుకంటే... ఒక వ్యక్తి నుంచి మొత్తం రక్తాన్ని (హోల్ బ్లడ్ను) సేకరించి ఏదైనా ప్రమాదం జరిగిన వ్యక్తికి పూర్తి రక్తాన్ని ఎక్కిస్తే... అతడికి అవసరం లేని కాంపోనెంట్స్ కూడా అతడి శరీరంలోకి వెళ్లి, అవి వృథా అయిపోతాయి. కానీ... రక్తంలోని ఏ అంశం లోపించిందో నిర్దిష్టంగా అదే అంశాన్ని (అదే కాంపోనెంట్ను) ఎక్కించే ఆధునిక వసతి సదుపాయాలూ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు... అగ్నిప్రమాదానికి లోనైన ఒక వ్యక్తికి పూర్తి రక్తం కంటే ప్లాస్మా ఎక్కువగా అవసరం. ఇక రక్తహీతన ఎక్కువగా ఉన్న వ్యక్తికి పూర్తి రక్తం కంటే పాకెట్ ఆర్బీసీ ఎక్కువగా అవసరం. అలాగే డెంగ్యూలాంటి వ్యాధి సోకి ప్లేట్లెట్ల సంఖ్య బాగా తగ్గిన వారికి కేవలం ప్లేట్లెట్లు ఎక్కిస్తే చాలు. ఇలా... రక్తాన్ని వేర్వేరు కాంపోనెంట్లుగా విడదీయగల సామర్థ్యం ఉన్న బ్లడ్బ్యాంకుల్లో రక్తదానం చేస్తే... అప్పుడు ఒకరి నుంచి సేకరించిన హోల్బ్లడ్ను వివిధ అవసరాలు ఉన్న చాలామంది రోగులకు ఎక్కించి, ఒకరికంటే ఎక్కువ మందికి ఉపయోగపడేలా చేయవచ్చు. అందుకే రక్తదానం చేయదలచిన దాతలు నేరుగా ఏదైనా బ్లడ్బ్యాంకుకు వెళ్లడం కంటే.... రక్తాన్ని వివిధ కంపోనెంట్లుగా విడదీయగల సామర్థ్యం ఉన్న బ్లడ్బ్యాంకులో రక్తదానం చేయడం మంచిది. -
అయ్యో..భవ్య
అనంతపురం న్యూసిటీ: ఓ వైపు తీవ్ర జ్వరం (107సెంటీగ్రేడ్). మరో వైపు చివరి పరీక్ష. పరీక్ష రాసిన తర్వాత వైద్యం తీసుకుందామనుకున్న ఆ అమ్మాయి...పరీక్ష హాల్లోనే కుప్పకూలి పోయింది. తోటి విద్యార్థినులు హుటాహుటీన సర్వజనాస్పత్రికి తరలించినా కోలుకలేక మృత్యుపడింది. వివరాల్లోకి వెళితే...మడకశిరలోని అమరాపురం మండలం రంగాపురం గ్రామానికి చెందిన కేఎన్ లక్ష్మణమూర్తి, శాంతమ్మల కూతురు ఎం.భవ్య (21) నగరంలోని ఆదర్శ నర్సింగ్ కళాశాలలో మూడో సంవత్సరం విద్యనభ్యసిస్తోంది. శుక్రవారం ఓబీజీ పరీక్ష రాసేందుకు వైద్య కళాశాలకు వచ్చింది. అయితే పరీక్ష కేంద్రంలో భవ్యకు ఫిట్స్ వచ్చాయి. నోటిలో నురుగ వస్తూ ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడింది. దీంతో తోటి విద్యార్థులు కేకలు వేయడంతో అక్కడున్న సిబ్బంది సర్వజనాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి రక్త పరీక్షలకు సిఫార్సు చేశారు. ప్లేట్లెట్స్ 29,000 మాత్రమే ఉండడం... సెలైన్ పెట్టిన ప్రాంతంలో రక్తం రావడంతో వైద్యులు వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాసనందించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కోలుకోని భవ్య మధ్యాహ్నం 3 గంటల సమయంలో మృతి చెందింది. దీంతో భవ్య స్నేహితులు కన్నీరు మున్నీరయ్యారు. ఆదర్శ కళాశాల యాజమాన్యం భవ్య తండ్రి కేఎన్ లక్ష్మణమూర్తికు సమాచారం అందించగా...ఆమె పెద్దనాన్న నాగరాజు అనంతపురం వచ్చి మృతదేహాన్ని సొంతూరుకు తీసుకెళ్లారు. తలలో రక్తం గడ్డ కట్టడం, ప్లేట్ లెట్స్ తక్కువగా ఉండడంతోనే భవ్య మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా, భవ్య వారం రోజులుగా జ్వరంతో బాధపడుతోందని స్నేహితులు చెబుతున్నారు. -
రాష్ట్రంపై డెంగీ కాటు!
-
రాష్ట్రంపై డెంగీ కాటు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపై డెంగీ, మలేరియా, విష జ్వరాలు మళ్లీ పంజా విసురుతున్నాయి. విభిన్న వాతావరణ పరిస్థితులతో రోజు రోజుకూ విజృంభిస్తున్నాయి. రాష్ట్రంలోని 173 గ్రామాలు డెంగీ ప్రభావానికి గురయ్యాయని, ఈ ఏడాది ఇప్పటివరకు 1,799 మందికి సోకిందని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ధారించింది. అనధికారికంగా ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎడతెరిపిలేని వర్షాలు, పారిశుధ్య లోపం, దోమల బెడదతో డెంగీ వ్యాప్తి చెందుతోంది. మరోవైపు డెంగీ బాధితులకు చికిత్స పేరుతో ప్రైవేటు ఆస్పత్రులు దోపిడీకి తెరలేపాయి. లక్షల రూపాయలు వసూలు చేస్తూ పీల్చి పిప్పిచేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక డెంగీ సోకినవారు వేల సంఖ్యలో ఉన్నా దానితో మృతి చెందిన ఘటనలేమీ నమోదు కాలేదని వైద్యారోగ్య శాఖ చెబుతుండగా.. ఇతర వ్యాధులు కూడా ఉండి డెంగీతో మృతి చెందినవారిని వైద్య శాఖ డెంగీ బాధితులుగా గుర్తించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో డెంగీ మరణాలు లేవని నివేదికలో పేర్కొంటోందని అంటున్నారు. ఖమ్మం, హైదరాబాద్లలో అధికంగా.. ఖమ్మం, హైదరాబాద్, మహ బూబ్నగర్ జిల్లాల్లో డెంగీ బాధితులు ఎక్కువగా ఉన్నారు. ఖమ్మం జిల్లా లో అత్యధికంగా 572, హైదరాబాద్లో 426, మహబూబ్నగర్లో 134 మంది డెంగీతో బాధపడుతున్నారు. మలేరియా జ్వరాలు కూడా విజృంభిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 1,940 మంది మలేరియా బారినపడ్డారు. కొత్త గూడెం, భూపాలపల్లి, హైదరాబాద్ జిల్లా ల్లో మలేరియా బాధితులు ఎక్కువగా ఉన్నారు. ప్లేట్లెట్ల పేరుతో దోపిడీ డెంగీ బాధితులకు చికిత్స విషయంలో ప్రభుత్వ ఆస్పత్రులు చేతులెత్తేస్తుండడంతో.. బాధితులను ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు నిలు వునా దోచుకుంటున్నాయి. రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిందంటూ ప్లేట్లెట్ ప్యాకెట్లు ఎక్కిస్తున్నాయి. ఒక్కో ప్లేట్లెట్ ప్యాకెట్ ధర ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఉంటోంది. కార్పొరేట్ ఆస్పత్రులైతే ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నాయి. అవసరం లేకున్నా కూడా ఒక్కో డెంగీ బాధితులకు ఐదు నుంచి 20 వరకు ప్లేట్లెట్ ప్యాకెట్లు ఎక్కిస్తున్నారు. ఎక్కువ రోజులు ఆస్పత్రిలో ఉంచుకుని లక్షల రూపాయలు బిల్లు వసూలు చేస్తున్నారు. ఇక ప్రభుత్వాస్పత్రులు డెంగీ పరీక్షలు, చికిత్స చేసే వసతులు లేవంటూ రోగులను పంపేస్తున్నాయి. మరోవైపు డెంగీ ఆరోగ్యశ్రీలో లేకపోవడంతో దాని బారిన పడే పేదల జీవితాలు ఆగమైపోతున్నాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కోలుకోలేని దుస్థితిలోకి వెళ్లిపోతున్నాయి. పరిసరాల పరిశుభ్రతే అసలు మందు.. వర్షాలతో నీరు నిలవడం, పారిశుధ్య లోపాలే డెంగీ, మలేరియాల వ్యాప్తికి ప్రధాన కారణం. డెంగీ కారక దోమలు మంచినీటిలోనే వృద్ధి చెందుతాయి. నిల్వ ఉండే నీటిలో, డ్రమ్ములలో నిల్వ చేసే నీటిలో ఈ దోమలు పెరుగుతాయి. ఇక డెంగీ కారక దోమలు పగటిపూటే కుడతాయి. దీంతో పగటిపూట ఇళ్లలో ఉండే మహిళలు, పిల్లలే ఎక్కువగా బాధితులు అవుతున్నారు. ఇక దోమల నివారణ మందులు, దోమ తెరలు వినియోగిస్తూ.. డెంగీ రాకుండా నివా రించే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాం ‘‘డెంగీ, మలేరియాల నివారణ విషయంలో రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీ చర్యలు తీసుకున్నాం. డెంగీ ప్రభావం ఉన్న 117 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 123 వైద్య శిబిరాలు నిర్వహించాం. గ్రామాల్లో ఇళ్ల వారీగా నీటినిల్వలను పరిశీలించి దోమల నివారణకు చర్యలు చేపట్టాం. అవసరమైన వారికి వెంటనే చికిత్స అందిస్తున్నాం..’’ – డాక్టర్ ఎస్.ప్రభావతి, వైద్యశాఖ అదనపు డైరెక్టర్ -
డెంగీతో వ్యవసాయశాఖ జేడీఏ మృతి
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ శాఖ సంయుక్త సంచాల కులు (జేడీఏ) మాధవి శ్రీలత (56) డెంగీతో గురువారం మృతిచెందారు. ఆమె హైదరాబాద్ వ్యవసాయశాఖ కమిష నరేట్లో పురుగు మందుల విభాగంలో జేడీఏగా బాధ్య తలు నిర్వహిస్తున్నారు. డెంగీకి గురై మృతిచెందారని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఆమె మృతిపట్ల వ్యవ సాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి, కమిషనర్ డాక్టర్ జగన్మోహన్, అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కె.రాములు సంతాపం వ్యక్తంచేశారు. -
అనంత జిల్లాలో డెంగ్యూ విజృంభన
-
జ్వరమా..? జేబులో డబ్బుందా?
దర్శికి చెందిన సౌజన్య జ్వరంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది అక్కడ సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వెళ్లింది. డెంగీ అని తేల్చి మూడు రోజుల పాటు ఆస్పత్రిలో ఉంచుకుని రూ. 28 వేల బిల్లు వేశారు. ఆ జ్వరమేంటో తెలియని బాధితురాలు ఏమీ చెయ్యలేని పరిస్థితిలో అప్పుచేసి మరీ బిల్లు చెల్లించి ఇంటికొచ్చింది. గుంటూరు జిల్లాకు చెందిన రత్నకుమారి జ్వరంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. రెండ్రోజులకు కూడా జ్వరం తగ్గకపోతే గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ పలు రకాల టెస్టులు చేసి, చివరకు మలేరియా అని తేల్చి రూ. 10 వేలు పిండుకున్నారు. ఈ రెండూ ఉదాహరణలు మాత్రమే. ఇలాంటివి రాష్ట్రవ్యాప్తంగా లక్షల్లో ఉన్నాయి. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ లాంటి ప్రమాదకర జ్వరాలు విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో పేదలకు వైద్యం తలకు మించిన భారం అవుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరైన వైద్యం అందక వారు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. అక్కడ వారు వేలు, లక్షల్లో బిల్లులు కట్టలేక అప్పుల పాలవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేద రోగుల పరిస్థితి ఇలానే ఉంది. పీహెచ్సీల్లో వైద్య పరీక్షల బాధ్యతను చంద్రబాబు ప్రభుత్వం ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించింది. ఆ సంస్థ నిర్లక్ష్యం ప్రైవేట్ ఆస్పత్రులకు వరంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి మూడు ఇళ్లకు ఒక ఇంటిలో జ్వర పీడితులు ఉన్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. పేదలకు అందుబాటులో ఉండాల్సిన పీహెచ్సీల్లో కనీస వైద్య పరీక్షలు సకాలంలో చేయకపోవడం, డాక్టర్లు అందుబాటులో ఉండకపోవడం వంటి సమస్యలు వారిని వేధిస్తున్నాయి. సాధారణ వైరల్ జ్వరమొచ్చినా విధిలేని పరిస్థితిలో ప్రైవేట్ ఆస్పత్రులనే ఆశ్రయించాల్సి వస్తోంది. రకరకాల పరీక్షలతో ప్రైవేటు ఆస్పత్రులు పేదల నుంచి వేలకు వేలు వసూలు చేస్తున్నాయి. మూడు రోజుల్లో తగ్గిపోయే సాధారణ జ్వరానికి కూడా మూడు వేల రూపాయల పైనే గుంజుతున్నారు. గడిచిన రెండు వారాల్లో రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల నుంచి 60 లక్షల మందికిపైనే వైరల్ జ్వరాల బారిన పడినట్టు ప్రభుత్వ అంచనా. వీరిలో చిన్నారులే అధికంగా ఉన్నారు. సీజన్ మారినప్పుడు వచ్చే ఈ జ్వరాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్స్ కేంద్రాలకు మనీ సీజన్గా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి. పీహెచ్సీల్లో ‘మెడాల్’ దారుణాలు రాష్ట్రవ్యాప్తంగా 1,157 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఒక్కో పీహెచ్సీకి తాజా సీజనల్ వ్యాధుల దృష్ట్యా రోజూ 80 నుంచి వంద మంది రోగులు వస్తున్నారు. కానీ కొన్ని వైద్య పరీక్షలు ఇక్కడ జరగకపోవడం, మధ్యాహ్నం 2 గంటల తర్వాత డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో పేదలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అంతేగాక రెండు వందలకుపైగా పీహెచ్సీల్లో డాక్టర్లు లేకపోవడం కూడా ప్రైవేట్ ఆస్పత్రులకు కలసివస్తోంది. పీహెచ్సీల్లోని వైద్య పరీక్షల్లో డెంగీకి సంబంధించి రాపిడ్ టెస్ట్కిట్ను మెడాల్ సంస్థకు అప్పగించారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఈ టెస్టు పీహెచ్సీలోనే చేయాలి. రక్త నమూనా తీసుకున్న అరగంటలో రిపోర్టు ఇవ్వాలి. కానీ మెడాల్ సంస్థ పీహెచ్సీలో ల్యాబొరేటరీ ఏర్పాటు చేయకపోవడంతో రక్తనమూనాలను వేరే చోటకు తీసుకెళ్లి రెండుమూడు రోజుల తర్వాత రిపోర్టు ఇస్తున్నారు. ఈలోగా బాధితుడికి జ్వర తీవ్రత పెరిగితే ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది. ఇలా ప్రధానమైన 7 రకాల పరీక్షలు మెడాల్ సంస్థకు ఇవ్వడం, ఆ సంస్థ మూడు రోజులకు గానీ రిపోర్టులు ఇవ్వకపోవడం వల్ల రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు గర్భిణుల విషయంలో అరగంటలో రిపోర్టు ఇవ్వగలిగే ఆర్పీఆర్ టెస్ట్కు కూడా ఆ ప్రైవేట్ సంస్థ మూడు రోజుల తర్వాత రిపోర్టు ఇస్తోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అప్పోసొప్పో చేసైనా ప్రాణాలు నిలబెట్టుకోవాలని పేదలు కూడా ప్రైవేటు ఆస్పత్రుల బాట పడుతున్నారు. ప్లేట్లెట్స్ పేరిట దోపిడీ ప్రధానంగా ప్రైవేటు ఆస్పత్రులు డెంగీ జ్వరం పేరు చెప్పి బాధితులను పిండేస్తున్నాయి. డెంగీ జ్వర లక్షణాలు పూర్తిగా తెలియకముందే ప్లేట్లెట్స్ (తెల్లరక్త కణాలు) తగ్గిపోయాయని, బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని బెదిరిస్తున్నారు. వాస్తవానికి డెంగీ అని తెలియడానికి రాపిడ్ టెస్ట్ కిట్–ఆర్డీటీ పరీక్ష ఒక్కటే సరిపోదు. ఐజీజీ, ఐజీఎం, ఎలీశా టెస్టులు చేస్తేనే పూర్తి స్థాయిలో ఫలితం తేలుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ పరీక్షలన్నీ చేయకుండానే బాధితుడిని ఇన్పేషెంటుగా చేర్చుకుంటున్నారు. ప్లేట్లెట్స్ ఎక్కించి నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉంచుకుని రూ. 30 వేల నుంచి రూ. 40 వేల వరకూ వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం విశాఖపట్నం, చిత్తూరు, ప్రకాశం జిల్లాలో డెంగీ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయా జిల్లాల్లోని బాధితులు ఆర్థికంగా చితికిపోతున్నారు. జ్వరమంటేనే బాధితులు వణికిపోతున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఏపీలోని వైద్య పరీక్ష కేంద్రాల్లో గడిచిన నెల రోజుల్లో రూ. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు అయ్యింటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెద్దాసుపత్రుల్లో పడకలు లేవు జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వ పెద్దాసుపత్రుల్లో పడకలు సరిపోవడం లేదు. కడప రిమ్స్ చిన్నపిల్లల వార్డులో 40 మందికి కూడా సరిపడే పడకలు లేవు. అలాంటిది 150 మంది ఇన్పేషెంట్లుగా ఉన్నారు. ఒక్కో బెడ్పై ఇద్దరు ముగ్గురిని పడుకోబెడుతున్నారు. ఇంకా దారుణం ఏంటంటే మంచాల కొరతతో జ్వరం తగ్గకముందే పేషెంట్లను డిస్చార్జి చేస్తున్నారు. ఈ పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో నెలకొంది. ఏ పెద్దాసుపత్రిలో చూసినా వైరల్ జ్వరాలు, డెంగీ జ్వర బాధితులే ఉన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా మలేరియా జ్వరాలు నమోదు అవుతున్నాయి. భారీ వర్షాల కారణంగా డాక్టర్లు కూడా ఆస్పత్రులకు రాలేక పోతుండటంతో గిరిజనుల పరిస్థితి దారుణంగా ఉంది. ధరల నియంత్రణపై చర్యలు శూన్యం కార్పొరేట్ లేదా ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నస్టిక్స్ సెంటర్లు ఇష్టారాజ్యంగా వసూళ్లు చేయడానికి లేదు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారమే ధరలు వసూలు చేయాలి. వచ్చిన రోగులందరికీ కనిపించేలా ధరల పట్టికను ఉంచాలి. కానీ చాలా ప్రైవేట్ ఆస్పత్రులు ఈ నిబంధనలు పాటించడంలేదు. ఆస్పత్రుల్లో ధరలను నియంత్రించాల్సిన అధికారాలు రాజకీయ నేతల బెదిరింపుల నేపథ్యంలో మిన్నకుండిపోతున్నారు. ఎవరైనా డీఎంహెచ్వో తనిఖీలకు వెళితే నాలుగు రోజులు కూడా ఆ జిల్లాలో పనిచేయలేరని, అధికార పక్ష నేతలే ఫోన్లు చేసి బెదిరిస్తారని ఓ జిల్లా వైద్యాధికారి వాపోయారు. ప్రైవేట్ ఆస్పత్రుల ధరలను ఎవరూ నియంత్రించే పరిస్థితి లేదని చెబుతున్నారు. జిల్లా వైద్యాధికారులదే బాధ్యత ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల ధరల నియంత్రణ బాధ్యత ఆయా జిల్లా వైద్యాధికారులదే. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం వాళ్లే తనిఖీలు చేసి ధరలు నియంత్రించాలి. కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆర్డీటీ కిట్లతో పరీక్షలు చేసి డెంగీ పాజిటివ్ అంటున్నారు. ఇది సరికాదు. ఐజీజీ, ఐజీఎంతోనే టెస్టులు చేయాలి. తాజాగా కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్, నేను ప్రకాశం జిల్లాకు వెళ్లాం. ఇలాంటి ఫిర్యాదులే వచ్చాయి. నిజంగా ప్లేట్లెట్స్ అవసరమైతే బ్లడ్ సెపరేటర్స్ ఉన్నాయి. మన బ్లడ్బ్యాంకులో లభిస్తాయి. ప్రస్తుతం డెంగీ వ్యాప్తి నిలకడగా ఉంది. ప్రకాశం, చిత్తూరులో కొద్దిగా ఎక్కువగా ఉంది. – డా.గీతా ప్రసాదిని, అదనపు సంచాలకులు, ప్రజారోగ్యశాఖ ప్లేట్లెట్స్ ట్రీట్మెంట్ అనేది తప్పు డెంగీ అంటే చాలు ప్లేట్లెట్స్ అంటూ రోగులను తప్పుదారి పట్టిస్తున్నారు. అసలు డెంగీకి ప్లేట్లెట్స్ ట్రీట్మెంట్ కరెక్టు కాదు. చాలామంది రోగులను చూస్తున్నా.. లక్షకు పడిపోయాయి, 80 వేలకు పడిపోయాయి అని చెబుతున్నారు. 25 వేలు ప్లేట్లెట్స్ ఉన్నా ఏమీ కాదు. కానీ భయభ్రాంతులను చేసి వారిని ఇబ్బంది పెడుతున్నారు. డెంగీ చికిత్సకు సంబంధించి కేంద్రం ప్రత్యేక మార్గదర్శకాలు జారీచేసింది. దీన్నిబట్టి చికిత్స చేయాలి. –డా.ఎన్.సుబ్బారావు, వైద్యవిద్యా సంచాలకులు -
డెంగీ డేంజర్ బెల్
చిత్తూరు అర్బన్/ సాక్షి అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా విష జ్వరాలు ప్రజలను వణికిస్తున్నాయి. వేలాది మంది మంచం పట్టారు. ఈ ఏడాది మలేరియా కంటే డెంగీనే ఎక్కువగా భయపెడుతోంది. ఈ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. చిన్న చిన్న ఆసుపత్రుల్లో ఈ వ్యాధి నిర్ధరణ కిట్స్ లేకపో వడంతో జనం పెద్దాసుపత్రులకు క్యూ కడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 200కు పైగానే డెంగీ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ గుర్తించింది. ప్రభుత్వ దృష్టికి రానివి, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరిగణనలోకి తీసుకుంటే సుమారు 1000 మంది వరకు డెంగీ బాధితులు ఉండవచ్చని వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు 35 మంది డెంగీతో మృతి చెందగా, ప్రభుత్వం మాత్రం సరైన లెక్కలు చెప్పడం లేదు. మంగళ, బుధవారాల్లో ఒక్క చిత్తూరు జిల్లాలోనే ఆరుగురు డెంగీతో మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. వరదయ్యపాలెం, సత్యవేడు, పాలసముద్రం, నాగలాపురం, పిచ్చాటూరు మండలాలకు చెందిన అశోక్ (19), డానియల్ (9), జ్యోషిత (3), రమణమ్మ (75), అంకమ్మ (40), సువర్ణ (14)లు మృత్యువాత పడ్డారు. ఈ జిల్లాలో ఏకంగా 26 వేల మందికి పైగా ప్రజలు విష జ్వరాల బారిన పడినట్లు అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయి. వరదయ్యపాలెం మండలంలోని కారిపాకం, బత్తలవల్లం, తొండూరు సొసైటీ కాలనీ, తొండూరు, రాదకండ్రి, రాచర్ల గ్రామాల్లో ప్రస్తుతం 400 మందికి పైగా ప్రజలు విష జ్వరాలతో మంచానపడ్డారు. మండల పరిధిలోని చిన్నపాండూరు, వరదయ్యపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రోజుకు సగటున 150 మంది జ్వర పీడితులు వస్తున్నారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి రోజుకు 700 మంది జ్వరాలతో వస్తుంటే, తిరుపతి రుయా ఆసుపత్రిలో ఈ సంఖ్య 1200కు చేరింది. తిరుపతి డివిజన్లో 7200 మందికి విష జ్వరాలు సోకితే 110 మంది, చిత్తూరులో 6800 మందికి విష జ్వరాలు వస్తే 38 మంది, మదనపల్లెలో 12,185 విష జ్వరాల కేసుల్లో 73 మంది డెంగీ లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. వారం వ్యవధిలోనే జిల్లాలోని ములకలచెరువు, మదనపల్లె, పెద్దపంజాణి, చౌడేపల్లె, ముడిబాపనపల్లె, నిమ్మనపల్లె, ఎర్రావారిపాలెం, నెరబైలు, వరదయ్యపాలెం, బుచ్చినాయుడు కండ్రిగ, సత్యవేడు, తిరుపతి ప్రాంతాల్లో 18 డెంగీ కేసులు నమోదయ్యాయి. నిండ్ర, గారంపల్లె, మాదిరెడ్డిపల్లె, తంబళ్లపల్లె, పెద్దతిప్పసముద్రం, చిన్నగొట్టిగల్లు, పూతలపట్టు, తొట్టంబేడు ప్రాంతాల్లో 9 మలేరియా కేసులు నమోదయ్యాయి. గ్రామాల్లో పరిస్థితి అధ్వానం విష జ్వరాలు కోరలు చాస్తున్నా వైద్య ఆరోగ్య శాఖ మాత్రం ఇంకా నిద్రమత్తు వీడలేదు. గ్రామాల్లో పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. ఇంటికొకరు చొప్పున విష జ్వరాల బారిన పడటంతో వైద్యం కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. దీనికి తోడు అడపాదడపా వర్షం కురుస్తుండటంతో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా తయారయ్యింది. ఇదే అదనుగా డెంగీ కోరలు చాచడంతో జనం పిట్లల్లా రాలిపోతున్నారు. డెంగీ నియంత్రణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నా, వాస్తవంగా ఆ పరిస్థితి కనిపించడం లేదు. కొరియా నుంచి వేలాది దోమ తెరలు తెప్పించి పంపిణీ చేస్తామని చెబుతున్న మాటలు ఆచరణకు నోచుకోలేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో డెంగీ నిర్ధరణ పరీక్షలు చేయడానికి అవసరమైన సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు సమీపంలోని నగరాలు, పట్టణాలకు పరుగులుదీస్తున్నారు. మరోవైపు బోధనాసుపత్రుల్లో సైతం రోగులకు తగినన్ని మందులు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పాడేరు, శీతంపేట, రంపచోడవరం, శ్రీశైలం ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులు మలేరియాతో మంచం పట్టారు. సుమారు 1500 మందికి పైగా జ్వరాలబారిన పడినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ఆయా తండాలకు రవాణా సదుపాయం లేనందున సత్వర రీతిలో గిరిజనులకు వైద్యం అందడం లేదు. ఫోన్లు చేసినా సకాలంలో 108 అంబులెన్స్లు రావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక చంద్రన్న సంచార వైద్యం (104 వాహనాలు) ఏమైందో తెలియడం లేదంటున్నారు. ఈ పరిస్థితిలో తప్పని పరిస్థితితో ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లినా పడకలు ఖాళీ ఉండటం లేదు. ఒక్కో మంచంపై ఇద్దరు, ముగ్గురు చికిత్స పొందాల్సిన దుస్థితి నెలకొంది. మంచం పట్టిన ‘ప్రకాశం’ సాక్షి ప్రతినిధి, ఒంగోలు:‘ఒక్కో గ్రామంలో 250 మందికి జ్వరాలున్నాయి. డెంగీ, మలేరియా ఎక్కువగా ఉంది. జిల్లా అంతటా ఇదే పరిస్థితి. డాక్టర్లు సరిపడా లేరు.. సరైన మందుల్లేవ్.. రిమ్స్తో సహా ఎక్కడా ప్లేట్లెట్ మిషన్ లేదు’ అని ప్రకాశం జిల్లా కలెక్టరేట్లో వైద్యాధికారుల సమీక్షలో సాక్షాత్తు మంత్రి శిద్దా రాఘవరావు అన్నారంటే జిల్లాలో జ్వరాల తీవ్రత ఎలా ఉందో స్పష్టమవుతోంది. ప్రభుత్వ వైద్యం అందడం లేదనేందుకు మంత్రి మాటలే అద్దం పడుతున్నాయి. జిల్లాలో చిన్న పిల్లలు మొదలు పెద్దల వరకు జ్వరాల బారినపడి అల్లాడిపోతున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం జిల్లాలో 95,524 మంది జ్వర పీడితులున్నారు. ఇందులో మలేరియాతో 106 మంది, డెంగీ లక్షణాలతో 268 మంది, డయేరియాతో 20,819 మంది, టైఫాయిడ్తో 11,015 మంది ఉన్నారు. జిల్లాలో జ్వరాల వల్ల మరణాల్లేవని వైద్యారోగ్య శాఖ చెబుతుండగా, పది రోజుల్లో సుమారు 55 మంది మృతి చెందినట్లు సమాచారం. రోగులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సక్రమంగా వైద్యం అందకపోవడంతో ప్రజలు ఆర్థిక భారమైనా కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా 80 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 7 ఏరియా ఆస్పత్రులు, ఒక మాతాశిశు వైద్యశాల, 8 అర్బన్ హెల్త్ సెంటర్లతోపాటు జిల్లా కేంద్రంలో రిమ్స్ ఆస్పత్రి ఉంది. 193 మంది డాక్టర్లు ఉండాల్సి ఉండగా దాదాపు 30 డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 173 మంది సాఫ్ట్ నర్సులకుగాను 30 వరకు ఖాళీలున్నాయి. ఆరోగ్య కేంద్రాల పరిధిలోని అన్ని విభాగాల్లోనూ సిబ్బంది కొరత ఉంది. మందులు పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు. -
డెంగీతో నవ వధువు మృతి
కాళేశ్వరం(మంథని): డెంగీతో ఓ నవ వధువు మృతి చెందింది. జయశంకర్ జిల్లా మహదేవ పూర్ మండలం పలుగులకి చెందిన ఉమ (19)కు 4 నెలల క్రితం మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం నారాయణపూర్కు చెందిన నిట్టూరి ప్రదీప్తో వివాహమైంది. వారం రోజులుగా తీవ్ర జ్వరంతో చెన్నూర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందింది. డెంగీగా గుర్తించిన వైద్యులు మందులిచ్చారు. సోమవారం ఉదయం మళ్లీ జ్వరం తీవ్రత పెరగడంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. -
డెంగ్యూతో వివాహిత మృతి
పెందుర్తి : వారం రోజులు గా డెంగ్యూతో బాధపడుతూ ఓ వివాహిత మృ తిచెందింది. పెందుర్తి మండలం చినముషిడివాడలో జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. చినముషిడివాడ రిజి స్ట్రార్ కార్యాలయం సమీపంలోని బీసీ కాలనీలో తీగల అప్పలరాజు, పద్మావతి(21) దంపతులు నివాసం ఉంటున్నారు. పద్మావతికి వారం రోజుల నుంచి జ్వరం, వాంతులు, విరేచనాలు కావడంతో బుధవారం గోపాలపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు డెంగ్యూ వ్యాధిగా నిర్థారించారు. అక్కడే చికిత్స పొందుతూ పద్మావతి గురువారం వేకువజామున మరణించింది. ఆమెకు 8 నెలల కుమార్తె ఉంది. స్థానికంగా అపారిశుధ్యం కారణంగానే జ్వరాలు ప్రబలుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చినముషిడివాడ ప్రాంతంలో పారిశుధ్య పనులు సక్రమంగా జరగడం లేదని చెబుతున్నారు. ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు. -
కథలు చెప్పొద్దు
♦ జిల్లాలో పరిస్థితి భయంకరంగా ఉంది. ♦ ఒక్కో గ్రామంలో 300 మంది జ్వర పీడితులున్నారు ♦ 56 మండలాల్లో ఇదే పరిస్థితి ♦ ఎక్కడా డాక్టర్లు సరిగ్గా లేరు.. సరైన మెడిసిన్ లేదు ♦ మీవల్ల సర్కారుకు చెడ్డపేరొస్తోంది ♦ పద్దతి మార్చుకొని ప్రజారోగ్యంపై దృష్టి సారించండి ♦ వైద్యాధికారులపై మంత్రి శిద్దా ఫైర్ ఒంగోలు టౌన్ : ‘ప్రతి గ్రామంలో 250 నుంచి 300 మంది జ్వరాలతో బాధపడుతున్నారు. డెంగీ, మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. జిల్లాలోని 56 మండలాల్లోనూ ఇదే పరిస్థితి. జిల్లాలో పరిస్థితి భయంకరంగా ఉంటే డాక్టర్స్ ఎక్కడా కరెక్ట్గా లేరు. సరైన మెడిసిన్ లేదు. అదేమని అడిగితే స్టోరీలు చెబుతున్నారు. పద్ధతి మార్చుకొని ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాలి. మీరు ఏమి చేస్తారో నాకు తెలియదు. జ్వరాలు మాత్రం కంట్రోల్ కావాలి’అని రాష్ట్ర అటవీ శాఖామంత్రి శిద్దా రాఘవరావు ఆదేశించారు. జిల్లాలో జ్వరాల తీవ్రత నేపథ్యంలో మంగళవారం స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో వైద్యాధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో 96,524 మంది జ్వర బాధితులు: డీఎంహెచ్ఓ జిల్లాలో గతేడాది 1,12,254 మంది సాధారణ జ్వరాలతో బాధపడగా.. ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు 96,524 మంది జ్వరాలతో బాధపడుతున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి జె.యాస్మిన్ వెల్లడించారు. ఈ ఏడాది జనవరిలో 11, ఫిబ్రవరిలో 25, మార్చిలో 21, ఏప్రిల్లో 28, మే నెలలో 19, జూన్లో 7, జూన్లో 13, జూలైలో 13, ఆగస్టులో 53, సెప్టెంబర్లో 91 డెంగీ కేసులు నమోదైనట్లు వివరించారు. ఈ ఏడాది జిల్లాలో మలేరియా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ డెంగీ కేసులు పెరిగాయన్నారు. మంత్రి శిద్దా జోక్యం చేసుకుంటూ తాను 15 రోజుల కిందట దర్శి నియోజకవర్గంలో పర్యటిస్తే అక్కడ వైద్యులు అందుబాటులో లేరని, మందులు కూడా లేవన్నారు. అదే సమయంలో ఒక ఆర్ఎంపీకి చెందిన చిన్న షెడ్లో 50 మంది జ్వర పీడితులు ఉన్నారని, బెడ్స్ లేకపోవడంతో చాపలు, నాపరాళ్లపై పడుకోబెట్టి వైద్యం అందిస్తున్నారన్నారు. ఎంత చెప్పినా మార్పు రావడంలేదని, మీవల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందంటూ వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఒంగోలులో కూర్చుంటే కుదరదని, సరైన డైరెక్షన్ ఇస్తూ జ్వరాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సక్రమంగా పనిచేయకపోతే సస్పెండే: కలెక్టర్ జిల్లాలో వ్యాధులను నియంత్రించేందుకు రానున్న మూడు రోజులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్చంద్ ఆదేశించారు. విధులు సక్రమంగా నిర్వహించకుంటే వైద్యులు, వైద్యులైనా, వైద్య సిబ్బంది అయినా, పంచాయతీ కార్యదర్శులైనా సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. పారిశుద్ధ్యంపై నియోజకవర్గ ప్రత్యేక అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఏరోజుకారోజు తనకు నివేదికలు అందించాలని ఆదేశించారు. ఒంగోలుతో పాటు మిగతా అన్ని మున్సిపాలిటీల్లో జనావాసాల మధ్య పందులు పెంచకుండా ఉండేందుకు, వాటి నిర్వాహకులకు నోటీసులు జారీ చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. 20 రోజుల్లో జిల్లాకు ప్లేట్లెట్స్ మెíషీన్: మంత్రి శిద్దా 20 రోజుల్లో జిల్లాకు ప్లేట్లెట్స్ మెషీన్ వస్తోందని మంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు. సమీక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్లేట్లెట్స్ మెషీన్కు సంబంధించి టెండర్ ప్రక్రియ జరుగుతుందన్నారు. జిల్లాలో డెంగీతో ఎవరూ చనిపోలేదని, వివిధ అనారోగ్య కారణాలతోనే చనిపోయారని స్పష్టం చేశారు. -
డెంగీ లక్షణాలతో ఒకరు మృతి
కుందుర్పి: అప్పిలేపల్లికి చెందిన చాకలి రమేష్ (40) డెంగీ లక్షణాలతో మంగళవారం మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. దినసరి కూలీ అయిన రమేష్ రెండు వారాల కిందట కర్ణాటకలోని చిత్రదుర్గం వెళ్లి డెంగీ బారిన పడ్డాడు. పది రోజులపాటు చికిత్సలు చేయించుకున్నా కోలుకోలేకపోయాడు. పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందినట్లు రమేష్ తమ్ముడు మరిస్వామి తెలిపాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
డెంగీతో బాలుడి మృతి..
- ఇంట్లోకి అనుమతించని యజమాని - శవంతో ఆరుబయటే వర్షంలో తడిసిన కుటుంబీకులు సాక్షి, హైదరాబాద్ : డెంగీతో ఓ బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా.. శవాన్ని ఇంట్లోకి తెచ్చేందుకు ఇంటి యజమాని అంగీకరించలేదు. దీంతో ఆ కుటుంబం శవంతో రోడ్డుపైన వానలో తడుస్తూ రోదించడం పలు వురిని కలచివేసింది. జగద్గిరిగుట్టలోని వెంకటేశ్వరనగర్ లో నివసించే ఈశ్వరమ్మకు ఇద్దరు కుమారులు. జగదీశ్ గుప్తా అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉంటోంది. రెండేళ్ల క్రితం భర్త ఆంజనేయులు కుమార్తెను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటినుంచి కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. పెద్ద కుమారుడు సురేశ్కుమార్ (11)కు ఇటీవల డెంగీ జ్వరం రావడంతో నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ చికిత్స పొందుతూ సురేశ్ బుధవారం రాత్రి మృతిచెందాడు. కాగా, బాలుడి శవాన్ని ఇంట్లోకి తెచ్చేందుకు జగదీశ్ ఒప్పుకోలేదు. దీంతో వర్షంలో తడుస్తూ తెల్లవారే వరకూ శవంతో రోడ్డుపైనే ఉన్నారు. కనీస కనికరం చూపని ఇంటి యజమాని తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు స్పందించి బాలుడి అంత్యక్రియలకు కావాల్సిన ఆర్థిక సాయం అందించి ఈశ్వరమ్మకు తోడ్పడ్డారు. -
మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించని ఓనర్
-
కూకట్పల్లిలో అమానుషం
హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లి వేంకటేశ్వర నగర్లో అమానుష సంఘటన వెలుగుచూసింది. అనారోగ్యంతో ఓ బాలుడు మృతిచెందగా.. వారు అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకురావడానికి నిరాకరించాడు. దీంతో ఆరేళ్ల బాలుడి మృతదేహంతో తల్లి రాత్రంతా వర్షంలో తడుచుకుంటూ ఇంటి బయటే ఉండిపోయింది. డెంగీతో బాధపడుతున్న సురేష్ అనే బాలుడు బుధవారం రాత్రి మృతిచెందగా.. ఇంటి ఓనర్ మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించలేదు. దీంతో ఆ తల్లి నిస్సహాయ స్థితిలో మృతదేహంతో పాటు వర్షంలో తడుచుకుంటూ బయటే ఉండిపోయింది. విషయం తెలుసుకున్న కాలనీ వాసులు చందాలు వేసుకొని బాలుడి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
డెంగీ లక్షణాలతో బాలిక మృతి
బొమ్మనహాళ్: ఉంతకల్లు గ్రామానికి చెందిన ఓరుగటి ఇందు (9) డెంగీ లక్షణాలతో మంగళవారం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామంలో అపరిశుభ్రత నెలకొని వ్యాధులు ప్రబలుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. వైద్యశాఖ ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. -
డెంగీతో ఆసుపత్రిలో చేరిన కమెడియన్
సాక్షి, ముంబై: బాలీవుడ్ ప్రముఖ కమెడియన్ సునీల్ గ్రోవర్ గురువారం రాత్రి ఆసుపత్రిలో చేరారు. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన వైద్య పరీక్షలు చేయించుకోగా.. డెంగీ సోకినట్లు తెలిసింది. ప్రస్తుతం గ్రోవర్ ఆసియన్ గుండె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఓ జాతీయ పత్రిక పేర్కొంది. గత కొద్ది రోజులుగా గ్రోవర్ దేశ వ్యాప్తంగా షోలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆయన తొందరగా కోలుకోవాలని కోరకుందాం. -
డెంగీతో బాలుడు మృతి
వరంగల్: వరంగల్ అర్బన్ జిల్లాలో డెంగ్యూతో ఓ బాలుడు మృతిచెందాడు. ఖిలా వరంగల్ మండలం పెన్షన్పురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే మట్టపెల్లి విజయ్, వినీతల కుమారుడు సాయిచరణ్ (8) గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఆస్పత్రితో చేర్పించగా డెంగ్యూ అని వైద్యులు తేల్చారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. -
డెంగ్యూ, చికున్ గున్యాకు చెక్
సత్వర వైద్యానికి చర్యలు ► రాష్ట్రంలో కొత్తగా 20 పరీక్ష కేంద్రాలు ► ఈ ఏడాది ఏడు ప్రారంభం వచ్చే ఏడాది మరో 13 ఏర్పాటు ► ఆరోగ్యశాఖ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: శరీరంలోని అన్ని వ్యవస్థల ను దెబ్బతీస్తూ... జీవితకాలం ఆరోగ్య సమస్య లను తెస్తున్న డెంగ్యూ, చికున్ గున్యా వ్యాధులను వెంటనే గుర్తించి వేగంగా చికిత్స అందించడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆరోగ్య శాఖ భావిస్తోంది. నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యప్తంగా వ్యాధి నిర్ధారణ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 14 చోట్ల డెంగ్యూ, చికున్ గున్యా నిర్ధారణ పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. వీటికి అదనంగా మరో ఏడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భద్రాచలం, కొత్తగూడెం కేంద్రాలు ఇప్పటికే ప్రారంభమ య్యాయి. సిద్దిపేట, తాండూరు, కామారెడ్డి, నిర్మల్, బాన్సువాడలో త్వరలో కొత్త కేంద్రాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవి కాక వచ్చే ఏడాది మరో 13 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. ప్రస్తుతం తక్కువ సంఖ్యలో పరీక్ష కేంద్రాలు ఉండడంతో వైద్య సేవలు ఆలస్యమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్నవి, కొత్తవాటితో కలిపి రాష్ట్రంలో 34 పరీక్ష కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. దీం తో వేగంగా వ్యాధి నిర్ధారణ, చికిత్స జరగ నుంది. దోమల నిర్మూలన, పరిసరాల పరిశుభ్ర తపై అందరికీ అవగాహన కల్పిస్తూ నే... చికున్ గున్యా, డెంగ్యూ చికిత్సను వేగంగా అందించేం దుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ అదన పు సంచాలకురాలు ఎస్.ప్రభావతి తెలిపారు. చికున్ గున్యా, డెంగ్యూ పరీక్ష కేంద్రాలు ప్రస్తుతం పని చేస్తున్నవి: వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, సంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్నగర్, హైదరాబాద్లోని ఐపీఎం, ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, రొనాల్డ్ రాస్ ఆస్పత్రులు. ప్రతిపాదిత కేంద్రాలు యాదాద్రి, సూర్యాపేట, వనపర్తి, నాగర్కర్నూలు, గద్వాల, భూపాలపల్లి, జగిత్యాల, పెద్దపల్లి, మెదక్, జనగామ, మహబూబాబాద్, అర్మూర్, బోధన్. డెంగ్యూ కేసులు... జిల్లా పేరు 2016 2017 ఖమ్మం 1416 205 హైదరాబాద్ 780 71 రంగారెడ్డి 568 31 నిజామాబాద్ 258 18 కరీంనగర్ 210 15 వరంగల్ 207 08 మహబూబ్నగర్ 122 12 మెదక్ 93 11 నల్లగొండ 66 01 ఆదిలాబాద్ 39 04 వివరాలు.. 2017 ఆగస్టు 16 వరకు. చికున్ గున్యా కేసులు జిల్లాల వారీగా జిల్లా పేరు 2016 2017 హైదరాబాద్ 22 5 మహబూబ్నగర్ 23 3 ఖమ్మం 15 0 రంగారెడ్డి 7 2 నిజామాబాద్ 1 1 ఆదిలాబాద్ 0 1 వరంగల్ 0 1. -
పగబట్టిన డెంగీ
కణేకల్లు మండలం బెణికల్లుకు చెందిన నాలుగేళ్ల బాలుడి పేరు రిషి. తీవ్ర జ్వరంతో ఈనెల 23న అనంతపురం సర్వజనాస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. వైద్య పరీక్షలు చేశాక ఇప్పుడు ‘డెంగీ’గా నిర్ధారించారు. గ్రామంలో అపరిశుభ్రత ఎక్కువగా ఉంటుందని, అందువల్లే ఊరిలో చాలా మంది జ్వరాలతో బాధపడుతున్నట్లు బాలుడి తండ్రి వన్నూరుస్వామి తెలిపారు. – బెంబేలెత్తిస్తున్న మలేరియా, టైఫాయిడ్ – బాధితుల్లో చిన్నారులే అధికం – పీహెచ్సీల్లో అందని వైద్యం – నిర్లక్ష్యం వీడని వైద్య ఆరోగ్యశాఖ 200 : ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు డెంగీ పాజిటివ్ కేసులు 152 : మలేరియా పాజిటివ్ కేసులు 1157 : టైఫాయిడ్ 7 : స్వైన్ ఫ్లూ (ఏప్రిల్ వరకు) 80 : జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 15 : సామాజిక ఆరోగ్య కేంద్రాలు 650 : నిత్యం అనంతపురం సర్వజనాస్పత్రికి వస్తున్న జ్వర పీడితులు (సుమారుగా) అనంతపురం మెడికల్: ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. పల్లెలు.. పట్టణాలు తేడా లేకుండా ప్రజలు మంచం పడుతున్నారు. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ ఏడాది ఇప్పటికే 200 పైగా డెంగీ పాజిటివ్ కేసులు నమోదవడం చూస్తే తీవ్రత ఎంతగా ఉందో అర్థమవుతోంది. ఇవన్నీ ప్రభుత్వాసుపత్రుల్లో నిర్ధారించిన కేసులు మాత్రమే. ఇక కర్నూలు, తిరుపతి, బెంగళూరు, ఇతర ప్రయివేట్ ఆసుపత్రుల్లోచేరి చికిత్స పొందుతున్న రోగులు వందల్లోనే. రికార్డుల్లోకి చేరని రోగులు, మరణాలు పదుల సంఖ్యలో ఉన్నా వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యం వీడని పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో 80 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 15 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, రెండు ఏరియా ఆస్పత్రులు, హిందూపురం జిల్లా కేంద్ర ఆస్పత్రి, 19 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, అనంతపురం సర్వజనాస్పత్రి ఉన్నాయి. అనంతపురం సర్వజనాస్పత్రి, హిందూపురం ఆస్పత్రుల్లో మాత్రమే ‘ఎలీసా’ విధానంలో డెంగీ నిర్ధారణ చేసే అవకాశం ఉంది. అధికారిక లెక్క ఇక్కడ పరీక్షలు చేసినవి మాత్రమే. ఇక కర్నూలు ప్రభుత్వాస్పత్రి, తిరుపతి స్విమ్స్లో జిల్లాకు సంబంధించి పాజిటివ్ కేసులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటున్నాయి. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో చిన్నారులే అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా పారిశుద్ధ్యం పడకేయడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతున్నట్లు స్పష్టమవుతోంది. పంచాయతీలు, మునిసిపాలిటీల్లో పైపులు పగిలిపోయి మంచి నీరు కలుషితమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఓవర్ హెడ్ ట్యాంకులను క్లోరినేషన్ చేయకపోవడం.. ఫ్లోరోస్కోపిక్తో నీటి పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నా పట్టించుకోకపోవడం.. పాట్ క్లోరినేషన్పై కనీస అవగాహన కల్పించని పరిస్థితి ప్రస్తుత వ్యాధుల తీవ్రతకు కారణమవుతోంది. దండయాత్ర పేరుతో ఆర్భాటం ప్రజలు వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కరపత్రాలు ముద్రించి సబ్ సెంటర్ల స్థాయి నుంచి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాల్సి ఉన్నా వైద్య ఆరోగ్యశాఖ మాత్రం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు. క్షేత్రస్థాయి నుంచి రెండు ఫొటోలు మెయిల్ చేస్తే వాటిని ఉన్నతాధికారులకు పంపి ఏదో చేసేశాం అని గొప్పలు చెప్పుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా దోమల బెడద తీవ్రంగా ఉంది. అదేదో ‘శనివారం మాత్రమే దోమలు బయటకు వస్తాయన్నట్లు ఆ రోజు మాత్రమే ‘దోమలపై దండయాత్ర–పరిసరాల పరిశుభ్రత’ అంటూ ఓ కాలనీకి వెళ్లి జెండా ఊపి వచ్చేస్తుండటం గమనార్హం. హై రిస్క్ ప్రాంతాలపైనా దృష్టి లేదాయె జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన డెంగీ, మలేరియా కేసులను పరిశీలిస్తే ఇవన్నీ కొన్ని ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఆత్మకూరు, ధర్మవరం అర్బన్, బ్రహ్మసముద్రం, రాయదుర్గం అర్బన్, కనగానపల్లి, కుందుర్పి, కూడేరు, గార్లదిన్నె, గుంతకల్లు, నాగసముద్రం, కదిరి ప్రాంతాల్లో బాధితులు ఎక్కువగా ఉన్నారు. ఒక్క అనంతపురం నగరంలోనే వందల సంఖ్యలో జ్వర పీడితులున్నారు. మురికివాడల్లో అయితే పరిస్థితి మరీ ఘోరం. 50 డివిజన్ల పరిధిలో 350 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నా పరిస్థితిలో మాత్రం మార్పు కరువయింది. -
నా కూతురు చనిపోయేది : కమల్ హాసన్
చెన్నై: నటుడు కమల్ హాసన్ తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన గళాన్ని పెంచుతున్నాడు. ఇంతకు ముందు ప్రభుత్వంలో అవినీతి పేరుకుపోయిందని విమర్శించిన కమల్ తాజాగా తమిళనాడులో ప్రబలుతున్న డెంగీ జ్వరాలను నిరోధించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, లేకపోతే తప్పుకోవాలని చురకులంటించాడు. ‘ఒకప్పుడు డెంగీ జ్వరంతో నా కూతురు చనిపోయి ఉండేదని, ఈ జ్వరాలపై తమిళనాడు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకపోతే తప్పుకోవాలి’ అంటూ కమల్ ట్వీట్ చేశారు. పాఠశాల డ్రాప్ అవుట్స్ను, నీట్ సమస్యను గ్రహించలేకపోవచ్చు కానీ డెంగీ గురించి తెలుసని ట్వీట్లో పేర్కొన్నాడు. అంతకుముందు అవినీతి ఆరోపణలను ఖండించిన ఏఐఏడీఎంకే నేతలు కమల్కి రాజకీయాల్లోకి వచ్చే దమ్ముందా అని సవాల్ విసిరిన విషయం తెలిసిందే. A high school drop out may not perceive Neet problem.But Dengu i know My child almost died of it. Work on it TN Govt. If unable move aside — Kamal Haasan (@ikamalhaasan) 20 July 2017 -
‘పశ్చిమ’పై ‘డెంగీ’ పంజా
ఏలూరు : జిల్లాపై డెంగీ పంజా విసిరింది. ఇటీవల ఒక్కరోజే జిల్లాలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు మహిళలు డెంగీ జ్వరాల బారిన పడడం రాబోయే ప్రమాదానికి సంకేతంగా భావించి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత రెండు రోజులుగా జిల్లా అంతటా ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈ వర్షాల పట్ల ఒక పక్క హర్షం వ్యక్తం అవుతుంటే మరోపక్క నానాటికీ పెరుగుతున్న జ్వరాల వ్యాప్తితో ప్రజానీకం మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే జిల్లాను టైఫాయిడ్, మలేరియా తదితర జ్వరాలు పీడిస్తుండగా తాజాగా జిల్లాపై డెంగీ పంజా విసురుతోంది. పలువురిని ఆసుపత్రుల పాలు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో అంతంత మాత్రంగా ఉండే పారిశుద్ధ్యం ఈ వర్షం ధాటికి మరింత అధ్వానంగా తయారైంది. దాంతో గ్రామీణులను వ్యాధుల భయం వణికిస్తోంది. జిల్లాలోని ప్రతి మండలంలో పారిశుద్ధ్య లోపం కారణంగానే వ్యాధులు ప్రబలుతున్నాయి. వాస్తవానికి ఈ రోగాల నివారణకు కేవలం ఒక్క వైద్యారోగ్య శాఖాధికారులు మాత్రమే స్పందిస్తే సరిపోదు. గ్రామీణ నీటి సరఫరా శాఖ, పంచాయతీరాజ్, పురపాలక, వైద్య ఆరోగ్యశాఖలు సమన్వయంతో విధులు నిర్వహిస్తేనే ఈ రోగాలను ఆదిలోనే నివారించే అవకాశం ఉంది. శాఖల మధ్య కొరవడిన సమన్వయ లోపం జిల్లా వ్యాప్తంగా పంచాయతీ, గ్రామీణ తాగునీటి సరఫరా, పురపాలక, వైద్యారోగ్యశాఖలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంది. అయితే ఈ శాఖలు సమన్వయంతో కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన ఎవరి పనులు వారు చేసుకుంటూ పోతున్నారు. దీంతో వర్షాకాలం వచ్చిందంటే వైద్యారోగ్యశా>ఖాధికారులదే లోపం అన్నట్లుగా ఇతర శాఖలు భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. వాస్తవానికి వర్షాకాలానికి అనుగుణంగా వైద్యారోగ్య శాఖాధికారులు పూర్తిస్థాయిలో మందులు అందుబాటులో ఉంచారు. వైద్యులను, సిబ్బందిని పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని స్పష్టమైన ఆదేశాలు సైతం జారీ చేశారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో కలుషిత తాగునీటి సమస్యలను పూర్తిగా తొలగించి పరిశుభ్రమైన తాగునీరు అందుతుందో లేదో అనే విషయాన్ని మానిటర్ చేయాలి. పైపులైన్లు లీకేజీ వంటి వాటిని పూర్తిస్థాయిలో నివారించాలి. అదే విధంగా గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులు పరిశుభ్రమైన నీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. వైద్యారోగ్యశాఖ అధికారులు ఈ శాఖలతో సమన్వయంతో పనిచేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో వైద్యసేవలు అందించేందుకు నిరంతరం పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకోవాలి. అయితే జిల్లాలో మాత్రం శాఖల మధ్య సమన్వయం లోపించి ఎవరి బాధ వారే పడతారనే రీతిలో విధులు నిర్వహిస్తున్నారు. నెలల వ్యవధిలో మూడు డెంగీ కేసులు మే నెలలో పెదవేగి మండలం రాయన్నపాలెంలో ఒక డెంగీ కేసు నమోదు అయితే సోమవారం ఒక్కరోజే జిల్లాలోని తాడేపల్లిగూడెంలో ఒక డెంగీ కేసు, అదే విధంగా ఎల్బి చర్ల సారవ గ్రామంలో మరో డెంగీ కేసు నమోదైంది. పారిశుద్ధ్య లోపం కారణంగానే జిల్లాలో డెంగీ కేసులు నమోదు అవుతున్నాయనేది స్పష్టం అవుతోంది. వర్షాకాలం ప్రారంభంలోనే మూడు డెంగీ కేసులు నమోదయితే వర్షాలు మరింత ముదిరితే ఈ కేసులు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనేది కాదనలేని వాస్తవం. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్, కె.కోటేశ్వరి ఇప్పటికే డెంగీ లక్షణాలు కలిగిన వారిని గుర్తించి వారికి అందుకు అనుగుణంగా వైద్య సేవలు అందించాలని అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. అప్రమత్తం కాకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది జిల్లాలో ఆయాశాఖలు, ముఖ్యంగా వైద్యారోగ్యశాఖాధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలో మలేరియా వ్యాప్తి చెందుతోంది. దీన్ని నివారించడంలో ఏజెన్సీలో చూపిస్తున్న శ్రద్ధ ఇతర ప్రాంతాల్లోనూ, ఇతర రోగాలపైనా చూపించకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. వైద్యాధికారులు సిబ్బందిని అప్రమత్తం చేశాం జిల్లాలో ఒకే రోజు రెండు డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వైద్యాధికారులు సిబ్బందిని అప్రమత్తం చేశాం. గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ఎవరైనా జ్వరపీడితులు ఉంటే వారి నుంచి రక్త నమూనాలు సేకరించి పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆధికారులను సిబ్బందికి ఆదేశాలు జారీచేశాం. పాజిటివ్ కేసుల్లో బాధితులను జిల్లా ఆసుపత్రులకు తరలించి పూర్తిస్థాయిలో వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించాం. తాగునీరు కలుషితం కాకుండా గ్రామీణ నీటి సరఫరా శాఖ, గ్రామ పంచాయతీలతో సమన్వయం చేసుకుని పారిశుద్ధ్యంపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో జ్వరాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చాం. – డాక్టర్ కె. కోటేశ్వరి, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి -
డెంగీతో చిన్నారి మృతి
రాయదుర్గం : పట్టణంలోని తహసీల్దార్ రోడ్డులో నివాసముంటున్న అల్తాఫ్ కూతురు ఆయేషా (6) శనివారం డెంగీ జ్వరంతో మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. ఇండేన్ గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తున్న అల్తాఫ్ పెద్ద కూతురు అయిన ఆయేషాకు నాలుగు రోజుల క్రితం జ్వరం వచ్చింది. రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా పరిశీలించిన వైద్యులు బళ్లారికి తీసుకెళ్లాలని సూచించారు. గురువారం బళ్లారి ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా రక్త పరీక్షలు చేసిన వైద్యులు ప్లేట్ లెట్స్ తగ్గిపోయాయని చెప్పారు. వారి సూచన మేరకు తిరిగి విమ్స్కు తీసుకెళ్లగా అక్కడ వైద్యులు పరీక్షించి డెంగీ జ్వరంగా నిర్ధారించారు. అక్కడే చికిత్స పొందుతున్న ఆయేషా శనివారం ఉదయం ఒక్కసారిగా ప్లేట్లెట్స్ పడిపోవడంతో మృతి చెందింది. పాప మృతికి ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ సంతాపం తెలిపి.. రూ.5వేల ఆర్థికసాయం అందజేశారు. -
డెంగీపై అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్
అనంతపురం అర్బన్ : ‘వర్షాకాలం ప్రారంభమైంది. సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. ముఖ్యంగా డెంగీ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలి. పారిశుద్ధ్యం మెరుగుపర్చాలి. డెంగీ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించండి’ అని కలెక్టర్ వీరపాండియన్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని ఎన్ఐసీ నుంచి డెంగీ వ్యాధి, గృహ నిర్మాణం, నీరు - ప్రగతి పనులపై వేర్వేరుగా ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి నాల్గో శనివారం దోమలపై దండయాత్ర కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించేలా ప్రజలను చైతన్యపర్చాలన్నారు. ఆర్ఎంపీలు జ్వరంతో వచ్చిన వారిని ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్ చేయాలని, అలా కాకుండా వైద్యం అందిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎన్టీఆర్ గ్రామీణ, పట్టణ గృహ పథకం కింద చేపడుతున్న ఇళ్ల నిర్మాణాల తీరు సక్రమంగా లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు 11,487 ఇళ్లు గ్రౌండింగ్ చేశారని, 2,285 మాత్రమే పూర్తి చేశారని, పట్టణాల్లో 2,590 గ్రౌండింగ్ చేశారని, 153 మాత్రమే పూర్తి చేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామసభలు నిర్వహించి 2017 - 18, 2018 - 19 సంవత్సరాలకు లబ్ధిదారులను వారం రోజుల్లోగా ఎంపిక చేయాలని ఆదేశించారు. నీరు - ప్రగతి కింద చేపట్టిన పనులను వేగవంతం చేసి నిర్ధేశించిన గడువులోగా పూర్తి చేయాలన్నారు. టెండర్ల ద్వారా చేపట్టాల్సిన పనులకు సంబంధించి వారంలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాలన్నారు. సమావేశంలో జేసీ - 2 సయ్యద్ ఖాజా మొహిద్దీన్, డీఎంహెచ్ఓ వెంకటరమణ, హౌసింగ్ పీడీ ప్రసాద్, ఇరిగేషన్ ఎస్ఈ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
డెంగీ సైరన్..
►విజృంభిస్తున్న మలేరియా ►పదిరోజుల్లో 17 మలేరియా, 6 డెంగీ కేసులు నమోదు ►అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యశాఖ సిటీబ్యూరో: ఇటీవల నగరంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఖాళీ కొబ్బరి బొండాలు, టైర్లలోకి నీరు చేరడంతో దోమలు వ్యాపించి బస్తీవాసుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. యాంటిలార్వా, ఫాగింగ్ నిర్వహించి ఎప్పటికపుడు దోమలను నియంత్రించి, సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాల్సిన ఎంటమాలజీ విభాగం అధికారులు పట్టించుకోలేదు. గ్రేటర్లో కేవలం పది రోజుల్లో 17 మలేరియా, 15 డెంగీ కేసులు నమోదు కావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదైన డెంగీ, మలేరియా కేసుల వివరాలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు చేరడం లేదు. ప్రభుత్వం ఐజీఎం ఎలీసా టెస్టులో పాజిటివ్ వచ్చిన కేసులను మాత్రమే డెంగీగా పరిగణిస్తుంది. కానీ ప్రైవేట్ ఆస్పత్రులు ఎన్ఎస్–1 టెస్టు చేస్తున్నాయి. వీటిలో పాజిటివ్ వచ్చిన వాటిని డెంగీ జ్వరంగా నిర్థారిస్తున్నారు. నిజానికి రోగి నుంచి రెండో శాంపిల్స్ సేకరించి నిర్ధారణ కోసం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)కు పంపాలి. కానీ ప్రభుత్వ ఆస్పత్రులు మినహా నగరంలో ఏ ఒక్క కార్పొరేట్ ఆస్పత్రి కూడా ఐపీఎంకు రెండో శాంపిల్ను పంపడం లేదు. సీజనల్ వ్యాధుల వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని ఎపిడమిక్ సెల్కు తెలియజేయాల్సి ఉన్నా చాలా ఆస్పత్రులు సస్పెక్టెడ్ డెంగీగా పేర్కొంటూ చికిత్స చేసి పంపుతుండడం గమనార్హం. టైగర్ దోమతోనే డెంగీ.. ఈడిస్ ఈజిప్ట్(టైగర్)దోమ కుట్టడం వల్ల డెంగీ వస్తుంది. ఒంటిపై తెల్లని చారలతో కనిపించే ఈ నల్లని దోమ పగటిపూట కుడుతుంది. కుట్టిన 7–8 రోజుల తర్వాత డెంగీ లక్షణాలు బయటపడుతాయి. కళ్లమంట, అధిక జ్వరం, చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి. రక్తంలో ప్లేట్లెట్స్ కౌంట్ కౌంట్ 20 వేలలోపునకు పడిపోయి రక్తస్రావం అవుతుంటే ప్లేట్లెట్స్ ఎక్కించాలి. – డాక్టర్ రాజన్న, చిన్నపిల్లల వైద్యుడు నీరు నిల్వలేకుండా చూడాలి డెంగీ బారిన పడుకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. ఇంటి పరిసరాల్లో మురుగు, పాత టైర్లు, ఖాళీ కొబ్బరి బొండాలు నిల్వ ఉండకుండా చూడాలి. నీటి ట్యాంకులు, క్యాన్లు వారానికోసారి శుభ్రం చేసుకోవాలి. గదుల్లో వెలుతురు ఎక్కువగా ఉండేలా చూడాలి. పిల్లలకు పగటిపూట దోమ తెరలు వాడాలి. ఓవర్హెడ్ ట్యాంక్లపై మూతలు విధిగా ఉంచాలి. – డాక్టర్ రమేష్ దంపూరి, నిలోఫర్ -
ముప్పు ముంచుకొస్తున్నా.. మొద్దు నిద్రే!
కలెక్టర్లతో మంత్రి లక్ష్మారెడ్డి సమావేశమైనా అప్రమత్తం కాని వైద్యాధికారులు రాష్ట్రంలో వ్యాధుల సీజన్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో తాగునీరు కలుషితమయ్యే అవకాశాలున్నాయి. దోమల స్వైరవిహారానికి సమయం ఆసన్నమైంది. ప్రతియేటా వర్షకాలంలో మురుగు పెరిగి వ్యాధులు ప్రబలుతున్నా అధికారులు అలసత్వం మాత్రం వీడడంలేదు. ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ అమాత్యుడు ఆదేశించినా.. పట్టింపులేనట్లుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీలు సైతం వెక్కిరిస్తున్నాయి. – సాక్షి, హైదరాబాద్ డెంగీ హైరిస్క్ జిల్లాలు పాత ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి,నిజామాబాద్, మహబూబ్నగర్ డెంగీ హైరిస్క్లో ఉండే ప్రజలు 54,23,000 మలేరియా హైరిస్క్ జిల్లాలు ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ మలేరియా హైరిస్క్ గ్రామాలు 2,067 మలేరియా హైరిస్క్లో ఉండే ప్రజలు 9,57,000 ఈ సీజన్లో వచ్చే ముఖ్య వ్యాధులు... తాగునీటి కాలుష్యంతో.. డయేరియా, టైఫాయిడ్ దోమల కారణంగా.. మలేరియా, డెంగీ, చికున్గున్యా చిన్నారులకు.. న్యూమోనియా ఏజెన్సీ ప్రాంతాల్లో.. విషజ్వరాలు ఏంచేయాలి.. సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను ఆదుకునేందుకు జిల్లాకో రెస్పాన్స్ టీమ్ను ఏర్పాటు చేయాలి. ఒకేచోట పెద్ద ఎత్తున సీజనల్ వ్యాధులు సంభవిస్తే జిల్లా టీంలు రంగంలోకి దిగుతాయి. అవసరమైతే రాష్ట్రస్థాయి టీం కూడా రంగంలోకి దిగాలి. సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను కాపాడేందుకు 61 రకాల మందులను అందుబాటులో ఉంచాలి. ఏం చేస్తున్నారు... మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశించినా.. అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తం కాలేదు. రెస్పాన్స్ టీమ్ ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. 61 రకాల మందులకుగాను కొన్నింటినే అందుబాటులో ఉంచారు. -
కోరలు చాస్తున్న డెంగీ
► 15 రోజుల వ్యవధిలో 20 మంది మృత్యువాత ► డెంగీతో విలవిల్లాడుతున్న రాచనగరి ► జిల్లా వ్యాప్తంగా 71 కేసుల నమోదు ► ఒక్క మైసూరులోనే 45 మైసూరు: దేశంలో స్వచ్ఛమైన నగరాల జాబితాలో రెండుసార్లు మొదటిస్థానంలో నిలిచిన మైసూరు నగరం ప్రస్తుతం డెంగీ మహమ్మారితో వణుకుతోంది. మైసూరు నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాలు కూడా డెంగీ తదితర విష జ్వరాలతో విలవిల్లాడుతున్నాయి. మైసూరు నగరంతో పాటు నంజనగూడు, పిరియాపట్టణ ప్రాంతాల్లో గత 15 రోజుల వ్యవధిలో ముగ్గురు విద్యార్థులతో పాటు 20 మందికి పైగా డెంగీ బారిన పడి మృత్యువాత పడ్డారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 71 డెంగీ కేసులు నమోదవగా అందులో మైసూరు నగరంలోనే 45 కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన నగర పాలికె డెంగీ అపరిశుభ్రత తాండవిస్తున్న ప్రాంతాల్లో ఫాగింగ్ తదితర నివారణ చర్యలను ముమ్మరం చేసింది. డెంగీ నివారణకు పాలికె నివారణ చర్యలు ముమ్మరం చేసినా ప్రజలు మాత్రం ఇళ్లతో పాటు పరిసరాలను స్వచ్ఛంగా ఉంచడంలో నిర్లక్ష్యం వహిస్తుండటంతో డెంగీ జ్వరాన్ని వ్యాపింప చేసే ఈజిప్ట్ ఈడీస్ దోమల వృద్ధిని అడ్డుకోవడం కష్టసాధ్యమవుతోంది. ఇళ్లల్లోని నీటితొట్లు, ట్యాంకులను ఎప్పటికప్పడు శుభ్రం చేయకపోవడం ఒక కారణం కాగా నగర వ్యాప్తంగా ఉన్న పార్కులు, పర్యాటక ప్రాంతాలకు వచ్చే ప్రజలు ప్లాస్టిక్ బాటిళ్లు, పేపర్ప్లేట్లను ఎక్కడపడితే అక్కడే పారేస్తుండటంతో ప్రతిరోజు నగరంలో 450 టన్నుల చెత్త వెలువడుతోంది. అందులో 250 టన్నుల చెత్తను మాత్రమే సంస్కరణ చేస్తున్న పాలికె మిగిలిన 200 టన్నుల చెత్తను అలానే వదిలేస్తుండటంతో డెంగీని వ్యాపింపచేసే దోమలు రాజ్యమేలుతున్నాయి. ఇక నగరంతో పాటు నగర శివార్లలో ఉన్న మొత్తం 48 చెరువులు చెత్త, వ్యర్థాలు కలవడం కూడా ఈజిప్ట్ ఈడీస్ దోమల వృద్ధికి కారణమవుతున్నాయి. ఈ పరిణామాలకు తోడు తొలకరి వర్షాలు కూడా ప్రారంభమవడంతో వాతావరణం చల్లగా మారడంతో డెంగీ దోమలు మరింత విజృంభించడానికి పరిస్థితులు అనుకూలంగా మారాయి. మొక్కలు పెంచడం ద్వారా దోమలకు చెక్... డెంగ్యూ జ్వరాన్ని వ్యాపింప చేసే ఈజిప్ట్ ఈడీస్ దోమలను లెమన్బ్లామ్, మారీగోల్డ్, కాట్నిప్, సిత్రోనెల్లా గ్రాస్, బిసిల్, రోజ్మేరి, థేమి, యూకలిప్టస్, ల్యావెండర్, పెప్పర్మింట్, గార్లిక్, టీట్రీ, గెరానియ్మ్,లెంటాన,లెమన్గ్రాస్ మొక్కలు పెంచడం ద్వారా దోమలను నివారించవచ్చు. చేపల ద్వారా కూడా దోమలకు చెక్.... మురికినీరు,గుంతలు, నీటితొట్లతో పాటు మంచినీటిలో కూడా ఈజిప్ట్ ఈడీస్ దోమలకు సంతానోత్పత్తి వృద్ధి చేసే సామర్థ్యం ఉండడంతో పాలికె ఫాగింగ్ ద్వారా దోమలను నివారిస్తోంది. అయితే ఫాగింగ్ వల్ల దోమలు మాత్రమే నాశనమవుతున్నా గుడ్లుపై మాత్రం ఫాగింగ్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతుండడంతో డెంగీ దోమల నిర్మూలన అసాధ్యమవుతోంది. అయితే గప్పి రకం చేపలను పెంచడం ద్వారా ఈజిప్ట్ ఈడీస్ దోమల నిర్మూలన సాధ్యమవుతుందని తేలడంతో నీటితొట్లు, నిల్వనీటిలో గప్పి చేపలను పెంచాలంటూ ఆరోగ్యశాఖ ప్రజలకు సూచిస్తోంది. –డీ.రందీప్,జిల్లా కలెక్టర్ ‘ఈ ఏడాది జవనరి నుంచి మే వరకు జిల్లా వ్యాప్తంగా 459 మందికి డెంగ్యూ పరీక్షలను నిర్వహించగా 71 మందికి డెంగ్యూ ఉన్నట్లు నిర్ధారణ అయింది.దీంతో డెంగ్యూ జ్వరం మరింత విజృంభించకుండా జిల్లా ఆరోగ్యశాఖ,గ్రా.పం.సభ్యులు.స్వయం సేవా సంఘాల కార్యకర్తలు డెంగ్యూ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్నారు’. –ఎస్.చిదంబర, సాంక్రమిక రోగాల నియంత్రణాధికారి. -
డెంగీ, మలేరియాపై విస్తృత ప్రచారం
జిల్లా కలెక్టర్ ఆదేశం కాకినాడ వైద్యం : డెంగీ, మలేరియాపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. జాతీయ డెంగీ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం కాకినాడ కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, నిల్వనీటిలో దోమలు ఉంటాయన్నారు. దోమల కారణంగానే డెంగీ సంభవిస్తుందన్నారు. గతేడాది జిల్లాలో 336 డెంగీ కేసులు నమోదు కావడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. వ్యాధి నివారణ కోసం వర్షాలు పడక ముందే జూన్ నెలలో గ్రామాల్లో సర్వే చేపట్టాలని వైద్య ఆరోగ్యశాఖాధికారిని ఆదేశించారు. దోమల నిర్మూలన కోసం డ్రైనేజీలు, నిల్వనీటి ఆవాసాలపై యాంటీలార్వా స్ప్రే చేయించాలన్నారు. డెంగీ నివారణ కోసం పైరీత్రమ్ మందు చల్లడం, ఫాగింగ్ వంటి చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. గ్రామసభల్లో డెంగీ, మలేరియాపై అవగాహన కల్పించాలని డీపీఓను ఆదేశించారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో మహిళా శక్తి సంఘ సభ్యులు, పింఛన్దారులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. కాకినాడ ,రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రులలో డెంగీ మందులు, ప్లేట్లెట్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కో–ఆర్డినేటర్ డాక్టర్ రమేష్ కిషోర్, డీఎంహెచ్ఓ డాక్టర్ చంద్రయ్య, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు, జిల్లా మలేరియా అధికారి పీఎస్ఎన్ ప్రసాద్, జెడ్పీ సీఈవో పద్మ, డీఆర్డీఏ పీడీ మల్లిబాబు పాల్గొన్నారు. ‘గుడా’ కార్యకలాపాలు ప్రారంభించాలి బోట్క్లబ్ (కాకినాడ సిటీ): గోదావరి అర్భన్ డెవలెప్మెంట్ అథారిటీ (గుడా) కార్యకలాపాలను వెంటనే ప్రారంభించాలని అధికారులను కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టుహాల్లో మంగళవారం గుడా తొలి కార్యవర్గ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 15 రోజుల్లో కాకినాడ మున్సిపల్ కార్యాలయంలో గుడా తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేయాలని కమిషనర్ అలీంబాషాను ఆదేశించారు. కాకినాడలో 15 రోజుల్లో రెగ్యులర్ కార్యాలయం ఏర్పాటుకు చేయాలని గుడా వైస్ చైర్మన్ను కోరారు. ఈ నెల 24 నుంచి గుడా కార్యకలాపాలు ప్రారంభమతున్న నేపథ్యంలో 22 నాటికే గుడా పరిధిలోని 240 పంచాయతీ కార్యదర్శులు, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం మున్సిపల్ అధికారులు, గొల్లప్రోలు నగర పంచాయతీ కమిషనర్లకు అవగాహన కల్పించాలన్నారు. పంచాయతీలు, నగర పంచాయతీలు, మున్సిపాలిటీ పరిధిలో 300 చదరపు మీటర్లు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని వెయ్యి చదరపు మీటర్లు పైబడిన విస్తీర్ణంలోని స్థలాల్లో చేపట్టే నిర్మాణాలకు గుడా అనుమతి అవసరమన్నారు. గుడా నిర్వహణకు సర్వే, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఆడిట్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల నుంచి కొంతమంది సిబ్బందిని అదనపు బాధ్యతలపై నియమించాలన్నారు. గుడా వైస్ చైర్మన్ వి.విజయరామరాజు, కాకినాడ మున్సిపల్ కమిషనర్ అలీంబాషా, డీపీఓ టీబీఎస్జీ కుమార్, అర్అండ్బీ ఎస్ఈ ఎస్ఎన్మూర్తి, ట్రాన్స్కో ఎస్ఈ రత్నకుమార్ పాల్గొన్నారు. -
బీజేపీకి ఓటేయండి.. డెంగ్యూ తెచ్చుకోండి
-
బీజేపీకి ఓటేయండి.. డెంగ్యూ తెచ్చుకోండి: కేజ్రీవాల్
ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం రోజురోజుకూ దిగజారుతోంది. ఈరోజు బీజేపీకి ఓటేసి.. రేపు డెంగ్యూ, చికన్ గున్యా లాంటి వ్యాధులు వస్తే దానికి మీరే బాధ్యులు అవుతారని ఓటర్లను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హెచ్చరించారు. ఢిల్లీ వరకు బీజేపీ 'డెంగ్యూ, చికన్ గున్యా పార్టీ' అని ఆయన అభివర్ణించారు. ఎంసీడీ ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి వస్తే రాబోయే ఐదేళ్ల పాటు ఢిల్లీని ఆ పార్టీ మురికిగా ఉంచేస్తుందని అన్నారు. మూడు మునిసిపల్ కార్పొరేషన్లలో ప్రధాని మోదీ పేరును చూపించి అవినీతిని దాచేయడానికి బీజేపీ ప్రయత్నించిందని, ఈ వ్యూహం ఇక్కడ మాత్రం పనిచేయదని చెప్పారు. ఎంసీడీలో పరిస్థితిని మోదీ ఎలా బాగుచేస్తారని.. కార్పొరేషన్లో పనిని మోదీ తీసుకోడానికి వీలుండదని, విజేందర్ గుప్తా లాంటి స్థానిక నాయకులే పనిచేయాలని కేజ్రీవాల్ అన్నారు. పదేళ్ల పాలనలో కార్పొరేషన్ను బీజేపీ పూర్తిగా నాశనం చేసిందని మండిపడ్డారు. దేశ రాజధానిలో ఆరోగ్య సమస్యలన్నింటికీ బీజేపీయే కారణమని ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి అన్నారు. ప్రధానమంత్రి అంతర్జాతీయ వ్యవహారాల్లో బిజీగా ఉన్నారని, కానీ బీజేపీ మాత్రం ఆయన పేరు చెప్పి ఓట్లు అడుగుతోందని విమర్శించారు. కేజ్రీవాల్ ఇతరుల మీద బురద చల్లుతూ కాలం గడిపేస్తున్నారని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ మాకెన్ అన్నారు. ఆయన తన పని చేయడం మానేసి.. అందరినీ ఏదో ఒకటి అంటున్నారని, అసలు ఈ మూడేళ్లలో ఆయన ఢిల్లీకి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. మొత్తం 272 వార్డులున్న ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్కు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. BJP को वोट दिया तो अगले 5साल कूडा,मछर ऐसे ही रहेंगे।कल अगर आपके घर डेंगू हो जाए तो आप ख़ुद उसके ज़िम्मेदार होगे क्योंकि आपने BJP को वोट दिया — Arvind Kejriwal (@ArvindKejriwal) 21 April 2017 दिल्ली वालों के लिए भाजपा "डेंगू और चिकनगुनीया वाली पार्टी" है। — Arvind Kejriwal (@ArvindKejriwal) 21 April 2017 -
చిలకపాడులో..డెంగీ టెర్రర్!
► విష జ్వరాలతో 50 మందికి పైగా ఆస్పత్రి పాలు ► నెలరోజుల వ్యవధిలో గ్రామంలో ఐదుగురికి డెంగీ ► పారిశుద్ధ్య లోపమే రోగాలకు కారణమంటున్న స్థానికులు ప్రాణాంతక డెంగీ జ్వరాలతో చీమకుర్తి మండలంలోని చిలకపాడు ఎస్సీకాలనీ మంచం పట్టింది. 80 కుటుంబాలు ఉన్న ఈ కాలనీలో ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 60 మంది విష జ్వరాలతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరు డెంగీతో బాధ పడుతున్నట్టు వైద్యులు నిర్ధారించారు. నెల రోజుల వ్యవధిలో ఒకే కాలనీకి చెందిన ఐదుగురు డెంగీ బారిన పడటం గ్రామస్తులను ఆందోళనకు గురిచేస్తోంది. చీమకుర్తి రూరల్ : చీమకుర్తి మండలం చిలకపాడు ఎస్సీకాలనీకి చెందిన 13 ఏళ్ల బాలుడు వంకాయలపాటి ఏసయ్య జ్వరంతో బాధపడుతూ ప్రస్తుతం ఒంగోలులోని రిమ్స్లో చికిత్స పొందుతున్నాడు. ఆ బాలుడికి డెంగీ నిర్ధారణ అయినట్లు రిమ్స్ నుంచి వేములపాడు ప్రాథమిక వైద్య కేంద్రానికి మెయిల్ వచ్చిందని ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ పి.హేమలత ధ్రువీకరించారు. ఏసయ్య సోదరుడు మనోహర్ కూడా డెంగీతో బాధపడుతూ రిమ్స్లో చికిత్స పొంది రెండు మూడు రోజుల క్రితమే డిశ్చార్జ్ అయ్యాడు. వీరిద్దరితోపాటు గడిచిన రెండు రోజులుగా ఒంగోలులోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వంకాయలపాటి మనీషా, పాలపర్తి ప్రశాంత్కు డెంగీ నిర్ధారణ అయిందని ఆయా ఆస్పత్రుల వైద్యులు చెప్పారని, ప్రభుత్వ ఆస్పత్రి సూపర్వైజర్ లక్ష్మీనరసింహరావు తెలిపారు. దీంతో ప్రస్తుతం డెంగీ జ్వరంతో ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న గ్రామస్తుల సంఖ్య మూడుకు చేరుకుంది. ఫిబ్రవరి 22వ తేదీన చిలకపాడు వడ్డెపాలేనికి చెందిన తన్నీరు వేణుగోపాల్కు డెంగీ రావడంతో చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చాడు. చిలకపాడు ఎస్సీకాలనీలో రెండు రోజుల నుంచి దాదాపు 50 నుంచి 60 మంది వరకు తీవ్రమైన జ్వరాలతో బాధపడుతూ పక్కనే ఉన్న మద్దులూరులోని ఆర్ఎంపీ వద్ద తాత్కాలిక వైద్యం చేయించుకున్నారు. తగ్గకపోవడంతో ఒంగోలులోని రిమ్స్తో పాటు పలు ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స చేయించుకుంటున్నారు. వారిలో 10 మందికి వైట్ ప్లేట్లెట్స్ పడిపోయినట్లు వైద్య సిబ్బంది చెప్పారని, రోగుల బంధువులు ఆందోళన చెందుతున్నారు. కుటుంబ సభ్యులంతా ఆస్పత్రుల్లోనే..: ఒకే కుటుంబానికి చెందిన వంకాయలపాటి ఇస్రాయేల్, భార్య కోటేశ్వరి, కొడుకులు ప్రవీణ్, జాన్, మనోజ్ జ్వరాలతో బాధపడుతూ ఒంగోలులోని ఒకే ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటున్నారు. మరో కుటుంబానికి చెందిన వంకాయలపాటి రాజా, ఆయన భార్య మనీషా, తాళ్లూరి మరియమ్మ, పాలపర్తి ప్రశాంత్, రేపూరి మాధవి, ఇండ్ల సుమతి జ్వరాలతో బాధపడుతున్నారు. వీరిలో కొందరు వైరల్ ïఫీవర్, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలతో బాధపడుతున్నారు. గత ఏడాది జూలైలో ఇదే మండలంలోని తక్కెళ్లపాడులో డెంగీ జ్వర లక్షణాలు గుర్తించినట్టు అధికారులు పేర్కొంటున్నారు. చిలకపాడు, దాని సమీప గ్రామాలలో జ్వరాల విజృంభణ కారణంగా రోగులతో పాటు వారి బంధువలంతా రెండు మూడు రోజులుగా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. హుటాహుటిన వైద్య శిబిరం...: చిలకపాడు గ్రామంలో డెంగీ, ఇతర జ్వరాలు వ్యాపించిన సంగతి తెలుసుకుని వేములపాడులోని ప్రాథమిక వైద్యకేంద్రం డాక్టర్ పి.హేమల త ఆధ్వర్యంలో సిబ్బంది ప్రత్యేక వైద్యశిబిరం ఏ ర్పాటు చేశారు. 27 మందికి వైద్యపరీక్షలు చే సి మందులు అందజేశారు. ఒంగోలు మలేరి యా డిపార్టుమెంట్ సబ్యూనిట్ ఆఫీసర్ మజీద్, సూపర్వైజర్ లక్ష్మీనరసింహారావు, హెల్త్ అ సిస్టెంట్ల సాయంతో కాలువ ఎబేట్ పిచికారీ చే యించారు. ఎం.ఎల్.ఆయిల్ను కాలువలలో పో యించారు. కాలువల్లో మురుగు పారుదల లేకపోవడం, దోమలు స్వైర విహారం చేయడమే రోగాలకు కారణమని స్థానికులు పేర్కొంటున్నారు. డెంగీతో బాలిక మృతి దొనకొండ : డెంగీతో బాధపడుతున్న బాలిక పరిస్థితి విషమించి మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని ఇండ్లచెరువులో గురువారం వెలుగు చూసింది. వివరాలు.. గ్రామానికి చెందిన కుర్రా గంగారావు కుమార్తె రూప(8) వారం నుంచి జ్వరంతో బాధపడుతోంది. స్థానికంగా వైద్యం చేయించినా జ్వరం అదుపులోకి రాలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు వినుకొండలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ వివిధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు రూప డెంగీ జ్వరంతో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి బాలిక మృతిచెందింది. -
కోవెలకుంట్లలో విషజ్వరాలు
- ఇద్దరు విద్యార్థులకు డెంగీ లక్షణాలు - ఆరుగురికి మలేరియా - నలుగురికి పసిరికలు కోవెలకుంట్ల: పట్టణ ప్రజలు విష జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. ముఖ్యంగా రంగరాజుపేటలోని 1, 2 వార్డులు జ్వర బాధితుల సంఖ్య అధికంగా ఉంది. వేసవి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. జ్వరంతో బాధపడుతున్న మహ్మద్ రఫీ, నౌషార్ కుమారులు షాబీద్, మసూద్ అనే విద్యార్థులకు డెంగీ లక్షణాలు బయటపడ్డాయి. మొదట్లో జ్వరం రావడంతో స్థానిక ఆసుపత్రులలో చూపించినా నయం కాకపోవడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు డెంగీ సోకినట్లు నిర్ధారించారు. ఇదే వార్డుల్లోని సానియా, అస్లాం, షాజిదా, రహీమాన్, మస్తాన్, మహ్మద్ మలేరియా జ్వరంతో బాధపడుతూ పట్టణంలోని ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. అత్తార్ అస్లాం, మగ్బుల్తోపాటు మరో ఇద్దరు పసిరికలతో బాధపడుతున్నట్లు కాలనీవాసులు తెలిపారు. కాలనీలో విష జ్వరాలు ప్రబలడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత వైద్యాధికారులు పరిశీలించి జ్వరాల నియంత్రణకు చరయలు తీసుకోవాలని కోరతున్నారు. -
30 నిమిషాల్లో ‘జికా’ను గుర్తించే యాప్
వాషింగ్టన్: జికా, డెంగీ, చికున్గున్యా వంటి వ్యాధులను కేవలం 30 నిమిషాల్లో గుర్తించే మొబైల్ యాప్ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. స్మార్ట్ ఫోన్తో నియంత్రించగల, బ్యాటరీతో నడిచే డయాగ్నొస్టిక్ పరికరాన్ని రూపొందించారు. ఈ పరికరం విలువ కేవలం 100 డాలర్లు (సుమారు రూ.6,500) మాత్రమే. ఈ ఆవిష్కరణలో భారత సంతతి శాస్త్రవేత్త కూడా పాలుపంచుకున్నారు. ‘పరికరాన్ని అపరేట్ చేయడంలో కొత్త యాప్ ఇంటర్ఫేస్గా పనిచేస్తుంది. సంప్రదాయ లేబొరేటరీ విశ్లేషణ పరికరాల స్థానంలో స్మార్ట్ ఫోన్ కెమెరా సెన్సార్లను ఏర్పాటు చేస్తున్నాం’ అని అమెరికాలోని సాండియా నేషనల్ లేబొరేటరీస్కు చెందిన ఆశిశ్ ప్రియే తెలిపారు. ల్యాంప్ (లూప్– మీడియేటెడ్ ఐసోథర్మల్ ఆంప్లిఫికేషన్) డయాగ్నొస్టిక్ పద్ధతిపై ఆధారపడి ఈ పరికరం పనిచేస్తుంది. -
దోమల దండయాత్ర!
⇒ గ్రేటర్ చుట్టూ చెరువుల్లో పెరిగిన కాలుష్యం ⇒ విపరీతంగా బ్యాక్టీరియా, కోలిఫాం ఉనికి ⇒ వేగవంతంగా దోమ లార్వాల వృద్ధి.. ⇒ పొంచిఉన్న డెంగీ, మలేరియా ముప్పు ⇒ పీసీబీ తాజా పరిశీలనలో వెల్లడి సిటీబ్యూరో: డెంగీ..మలేరియా..స్వైన్ఫ్లూ వంటి వ్యాధులతో అల్లాడుతున్న సిటీపై ఇప్పుడు దోమలు దండయాత్ర చేస్తున్నాయి. చెరువుల కాలుష్యం శాపంగా మారుతోంది. ప్రకృతి రమణీయతకు మారుపేరుగా నిలవాల్సిన పలు జలాశయాలు కాలుష్య కాసారమవుతుండడంతో దోమలు విపరీతంగా వృద్ధి చెందుతున్నాయి. గ్రేటర్ వాసులకు నిద్రలేకుండా చేస్తున్నాయి. గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల నుంచి చేరుతున్న వ్యర్థజలాలతో నగరం చుట్టూ ఉన్న చెరువులు దుర్గంధభరితంగా మారుతున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి తాజా పరిశీలనలో వెల్లడైంది. గతేడాదితో పోలిస్తే ఆయా చెరువుల్లో కోలిఫాం, హానికారక బ్యాక్టీరియా ఉనికి అనూహ్యంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు పలు జలాశయాల్లో గుర్రపుడెక్క పెరగడంతోపాటు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు దోమ లార్వాలు భారీగా వృద్ధిచెందేందుకు అనుకూలంగా ఉండి.. మహానగరంలో దోమలు విజృంభిస్తున్నాయి. ఈ దుస్థితి కారణంగా సిటీజన్లకు మలేరియా, డెంగీ వ్యాధుల ముప్పు పొంచిఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిలువెల్లా కాలుష్యమే.. నగరానికి మణిహారంలా ఉన్న పలు చెరువులు రోజురోజుకూ కాలుష్యకాసారాలుగా మారుతున్నాయి. వీటి ప్రక్షాళనకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో జీహెచ్ఎంసీ యంత్రాంగం విఫలంకావడం శాపంగా పరిణమిస్తోంది. పలు చెరువుల్లో గుర్రపుడెక్క ఉధృతి అనూహ్యంగా పెరిగింది. మరోవైపు సమీప కాలనీలు, బస్తీలు, పారిశ్రామిక వాడలు, వాణిజ్య సముదాయాల నుంచి వెలువడుతున్న వ్యర్థజలాలు మురుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేయకుండానే ఈ చెరువుల్లోకి చేరుతుండడంతో అందులోని హానికారక మూలకాలు నీటిని దుర్గంధభరితంగా మార్చేస్తున్నాయి. ప్రధానంగా డ్రైనేజీ నీరు, వ్యర్థజలాల్లో ఉండే ఫేకల్ కోలిఫాం, టోటల్ కోలిఫాం మోతాదు అధికంగా పెరిగినట్లు పీసీబీ పరిశీలనలో తేలింది. దీంతో ఆయా చెరువుల్లో హానికారక షిగెల్లా, స్టెఫైలోకోకస్, ఇ.కోలి వంటి బ్యాక్టీరియా ఉనికి పెరిగినట్లు స్పష్టమైంది. దీనికి తోడు ప్రస్తుతం కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణస్థాయిలో నమోదవుతుండడంతో పలు చెరువుల్లో దోమల లార్వాలు ఉధృతంగా వృద్ధిచెందుతున్నాయి. ఈ దుస్థితికి కారణాలివే.. కూకట్పల్లి ప్రగతి నగర్ చెరువులో 2015తో పోలిస్తే 2016 సంవత్సరంలో ప్రతి వంద మి.లీ నీటిలో 406 మైక్రోగ్రాముల మేర కోలిఫాం ఉనికి పెరిగింది. సమీప ప్రాంతాల మురుగు నీరు నేరుగా చెరువుల్లోకి చేరకుండా మినీ మురుగు శుద్ధికేంద్రాలను నిర్మించడంలో జీహెచ్ఎంసీ విఫలం కావడంతో పరిస్థితి విషమిస్తోంది. గత 20 ఏళ్లుగా పలు చెరువులు కబ్జాకు గురవడం..చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో భారీగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు ఏర్పడడంతో మురుగు పెరిగింది. చాలా వరకు చెరువులు వాటి ఎఫ్టీఎల్ పరిధిలోని సగం భూములను కోల్పోయి చిక్కి శల్యమై కనిపిస్తున్నాయి.చెరువుల్లో కనీసం గుర్రపు డెక్కను, దోమల లార్వాలను కూడా పూర్తిస్థాయిలో తొలగించడంలేదు. కూకట్పల్లి అంబీర్ చెరువులోకి సమీప ప్రాంతాల నుంచి భారీగా మురుగు నీరు నేరుగా వచ్చి చేరుతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారు. ఈ చెరువు చుట్టూ భారీగా అక్రమ నిర్మాణాలు వెలిసినా బల్దియా యంత్రాంగం ప్రేక్షకపాత్రకే పరిమితమైంది. చెరువులు, మూసీ పరివాహక ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం నగరంలోని అంబర్ చెర్వు, ప్రగతినగర్, కాప్రా, పెద్ద చెర్వు, సాయిచెర్వు, దుర్గంచెర్వు, నల్లచెర్వు, లక్ష్మీనారాయణ చెర్వులకు సమీపంలో ఉన్న కూకట్పల్లి, కెపిహెచ్బీ, మూసాపేట్, శేరిలింగపల్లి, మణికొండ, జిల్లెలగూడా, బాలాపూర్, బాలానగర్ ప్రాంతాలతోపాటు మూసీ పరివాహక ప్రాంతంలోని మెహిదీపట్నం, మసాబ్ట్యాంక్, చాదర్ఘాట్, కోఠి, మలక్పేట్, దిల్సుఖ్నగర్, అంబర్పేట్, ముషీరాబాద్, ఉప్పల్, బోడుప్పల్, రామంతాపూర్, రాజేంద్రనగర్, హయత్నగర్ తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ప్రస్తుతం నగరంలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణస్థాయిలో అంటే కనిష్టంగా 18, గరిష్టంగా 33 డిగ్రీల మేర నమోదవుతుండడంతో దోమ లార్వాలు గణనీయంగా వృద్ధిచెంది ఆయా ప్రాంతాలను దోమలు ముంచెత్తుతున్నాయి. లార్వాల వృద్ధిని నిరోధించేందుకు యాంటీ లార్వా స్ప్రే చేయడంలోనూ జీహెచ్ఎంసీ యంత్రాంగం విఫలమవుతోంది. మరోవైపు రోజువారీగా గ్రేటర్వ్యాప్తంగా వెలువడుతోన్న 1400 మిలియన్ లీటర్ల వ్యర్థజలాల్లో సగం మాత్రమే ఎస్టీపీల్లో శుద్ధిచేసి మూసీలోకి వదులుతున్నారు. మిగతా 700 మిలియన్ లీటర్ల మురుగునీరు ఎలాంటి శుద్ధిలేకుండానే మూసీలో కలుస్తుండడంతో పరిస్థితి విషమిస్తోంది.