హైదరాబాద్: సచివాలయ శాఖలు, ఉద్యోగులతో పాటు, శాఖాధిపతుల ఉద్యోగులను అమరావతికి తరలింపు అంశంపై ఏపీ ప్రధాన కార్యదర్శి టక్కర్ సోమవారం కార్యదర్శులతో భేటీ అయ్యారు. తరలింపు వివరాలను కార్యదర్శులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 24 నుంచి పైలెట్ షిఫ్టింగ్ మొదలు పెట్టాలని నిర్ణయించారు. మహిళా ఉద్యోగులకు హాస్టల్ వసతి కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఐఏఎస్ అధికారులకు రేయిన్ ట్రీ అపార్ట్ మెంట్లు కేటాయించాలని నిశ్చయించారు.