వాయిదా దిశగా ఏపీసెట్! | APCET may postpone due to seemandhra agitation | Sakshi
Sakshi News home page

వాయిదా దిశగా ఏపీసెట్!

Published Thu, Sep 5 2013 1:59 AM | Last Updated on Fri, Sep 1 2017 10:26 PM

ఏపీసెట్ నిర్వహణపై గందరగోళం ఏర్పడింది. ఈ నెల 22న జరగనున్న ఏపీసెట్ నిర్వహణపై అభ్యర్థుల్లో సందేహాలు నెలకొన్నాయి.

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఏపీసెట్ నిర్వహణపై గందరగోళం ఏర్పడింది. ఈ నెల 22న జరగనున్న ఏపీసెట్ నిర్వహణపై అభ్యర్థుల్లో సందేహాలు నెలకొన్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా అక్కడి నుంచి రావలసిన వివరాలు ఉస్మానియా యూనివర్సిటీలోని ఏపీసెట్ కార్యాలయానికి అందలేదు. దీంతో ఈ నెల 10 నుంచి జరగాల్సిన హాల్‌టిక్కెట్ల జారీ నిలిచిపోయింది. సుమారు 1.27 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష కోసం ఎదురు చూస్తున్నారు.
 
 వాయిదా పడే అవకాశాలు: సీమాంధ్రలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఏపీసెట్ వాయిదా పడే అవకాశాలున్నాయి. పరీక్ష కోసం ఆ ప్రాంతంలో 8 ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష నిర్వహణకు సుమారు 160 కేంద్రాలు అవసరం ఉన్నట్లు ఏపీసెట్ సభ్యకార్యదర్శి ప్రొఫెసర్ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆ ప్రాంతంలో విద్యాసంస్థల బంద్ కారణంగా పరీక్ష కేంద్రాల వివరాలు అందలేదని, దీంతో పరీక్షల ప్రక్రియను ప్రారంభించలేక పోతున్నామన్నారు. సెట్ నిర్వహణపై 2రోజులో ప్రభుత్వానికి నివేదికను అందచేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement