జీవోఎంకు ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. విభజన జరిగితే రాజ్యాంగంలోని 371 (డి) అధికరణం వర్తించదని అటార్నీ జనరల్ జి.ఇ. వాహనవతి అంటున్నారు. తాజాగా ఆయన తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన మంత్రుల బృందం (జీవోఎం)కు ఈ మేరకు ఒక నివేదిక సమర్పించారు.
అసలు రాష్ట్ర విభజన అంటూ జరిగితే ఇక 371 (డి) అధికరణం వర్తించబోదని వాహనవతి అందులో స్పష్టం చేశారు. అలా కాదని ఒకవేళ ప్రత్యేక హోదా కావాలనుకుంటే మాత్రం రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. తెలంగాణ ఏర్పాటుచేస్తే ఇక ఆ తర్వాత మిగిలిన రాష్ట్రాలకు అది వర్తించే అవకాశమే ఉండబోదని వాహనవతి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.
విభజన జరిగితే 371 (డి) ఇక వర్తించదు: అటార్నీ జనరల్ వాహనవతి
Published Tue, Nov 19 2013 1:21 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement
Advertisement