వైఎస్సార్ జిల్లా: పులివెందుల ఏటీఎం చోరీ కేసు నిందితులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఏటీఎంలలో నగదు నింపే సిబ్బందే ఈ దొంగతనానికి పాల్పడినట్లు జిల్లా ఎస్పీ నవీన్గులాఠి వెల్లడించారు.
పులివెందుల సమీపంలోని నామాలగుండు వద్ద పోలీసుల తనిఖీల్లో పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారిలో ఏటీఎంలో దోపిడికి పాల్పడిన ఆరుగురు నిందితులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 53 లక్షల నగదుతో పాటు మూడు బైక్లు, ఓ ఆటో స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఏటీఎం చోరీ కేసు నిందితుల అరెస్ట్
Published Thu, Apr 21 2016 5:35 PM | Last Updated on Thu, Oct 4 2018 8:29 PM
Advertisement
Advertisement