ప్రసిద్ధ కోటప్పకొండ ఆలయం మెట్ల మార్గంలో ఓ ప్రేమజంటపై గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ప్రియుడు మృతిచెందగా, ప్రియురాలు తీ్వ్రగాయాలపాలైంది.
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పీఆర్సీ తండాకు చెందిన బానోతు స్వాతి (18), మాచర్ల మండలం శ్రీరాంపురం తండాకు చెందిన నాయక్(20) గత కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. బుధవారం కోటప్పకొండ ఆలయంలో దైవదర్శనానికి వచ్చిన ఇరువురూ మెట్ల మార్గంలో వెళుతుండగా మాటువేసిన దుండగులు కత్తులతో బెదిరించి నగదు, విలువైన వస్తువులు దోచేయత్నం చేశారు. మొదట షాక్కు గురైనప్పటికీ తేరుకున్న నాయక్.. అడ్డుకునే ప్రయత్నం చేయగా దుండగులు అతణ్ణి పొడిచారు. దీంతో తీవ్ర రక్తస్త్రావమై నాయక్ మరణించాడు. ప్రస్తుతం స్వాతి నర్సారావు పేట ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
ప్రేమికులపై దాడి.. ప్రియుడి మృతి
Published Wed, Feb 25 2015 6:05 PM | Last Updated on Sat, Sep 2 2017 9:54 PM
Advertisement
Advertisement