
'100 కోట్లతో ప్రజాప్రతినిధుల కొనుగోలు'
చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని భూమన కరుణాకర్రెడ్డి విమర్శించారు.
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి విమర్శించారు. స్థానిక ప్రజాప్రతినిధులను రూ. 100 కోట్లు వెచ్చించి కోనుగోలు చేసి.. ఎమ్మెల్సీ స్థానాలను చంద్రబాబు కైవసం చేసుకున్నారని ఆయన విమర్శించారు.
గతంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులను కొనుగోలు చేశారని, ఇది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని భూమన మండిపడ్డారు. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో దుష్టపాలన కొనసాగుతుందని, ఆయన దురాగతాలు ఎక్కువకాలం కొనసాగవని భూమన అన్నారు.