పాడేరు: విశాఖపట్నం జిల్లా పాడేరు మండలం మస్త్యగెడ్డ వద్ద ఓ బైకు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను పాడేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం సాయంత్రం పాడేరు వైపు బైక్పై వెళుతుండగా ... ఎదురుగా వస్తున్న జీపును తప్పించబోయి అదుపుతప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది.