![ప్రతి జిల్లాలోనూ పుస్తక ప్రదర్శనలు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/5/41483303268_625x300.jpg.webp?itok=DcA7jS72)
ప్రతి జిల్లాలోనూ పుస్తక ప్రదర్శనలు
విజయవాడ పుస్తకమహోత్సవం ప్రారంభంలో సీఎం వెల్లడి
సాక్షి, విజయవాడ: ప్రతి జిల్లాలోనూ పుస్తక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ, భాషా, సాంస్కృతికశాఖ, ఎన్టీఆర్ ట్రస్టులు సంయుక్తంగా నిర్వహిస్తున్న 28వ పుస్తకమహోత్సవాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో చంద్రబాబు మాట్లాడుతూ.. ఇప్పటికే అనంతపురం, తిరుపతి, రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు.
ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, సమాజం నాలెడ్జ్ సొసైటీగా మారడానికి ఇటువంటి పుస్తకప్రదర్శనలు ఉపయోగపడతాయని అన్నారు. ఈ విషయాల్లో మీడియా సానుకూల దృక్పథాలతో రాయడం నేర్చుకోవా లని సూచించారు. మంచి సంఘటనలు బాగా పబ్లిష్ చేయాలని పేర్కొన్నారు. ఆన్లైన్లో సమాచారమంతా అందుబాటులో ఉంటున్నప్పటికీ, పుస్తకం చదువుతుంటే పొందే అనుభూతి వేరుగా ఉంటుందన్నారు. పుస్తకం చదవడం ఒక అలవాటుగా పెట్టుకోవాలన్నారు.