ఎస్పీని కలిసిన కాల్‌మనీ బాధిత దంపతులు | Call money victims meet SP | Sakshi
Sakshi News home page

ఎస్పీని కలిసిన కాల్‌మనీ బాధిత దంపతులు

Published Mon, Dec 21 2015 6:49 PM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM

Call money victims meet SP

హిందూపూర్ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబును కాల్ మనీ బాధిత దంపతులు సోమవారం ఎస్పీ కార్యాలయంలో కలిశారు. హిందూపూర్‌కు చెందిన శశికుమార్, శ్రీరాములు అనే ఇద్దరు కాల్‌మనీ వడ్డీవ్యాపారులు తమకు రూ.4లక్షలు అప్పు ఇచ్చి రూ.40 లక్షల విలువ చేసే రెండు ఇళ్లను వాళ్ల పేరు మీద బలవంతంగా రిజిస్టర్ చేయించుకున్నారని బాధితులు నాగలక్ష్మి, సాయినాథ్ దంపతులు ఎస్పీ ముందు వాపోయారు. బాధితుల గోడు విన్న ఎస్పీ ఈ విషయంపై విచారణ జరిపి చర్య తీసుకోవాలని పోలీసులను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement