hindupur
-
అక్రమంగా హిందూపురం ఛైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకున్న టీడీపీ
-
ఏంది బాలయ్య.. ఇదీ ఓ గెలుపేనా?
సత్యసాయి జిల్లా, సాక్షి: ఏపీలో పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సభ్యులపై ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. మాట వినని వాళ్లను బెదిరించడమే కాదు.. ఎత్తుకెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అన్యాయంగా పదవులు లాక్కుని.. తమదే గెలుపంటూ కూటమి ప్రభుత్వం ప్రకటించుకుంటోంది. ఈ క్రమంలో..హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలోనే బరితెగింపు వ్యవహారం నడిచింది. 23 మంది సభ్యుల మద్దతుతో హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవి సొంతం చేసుకుంది టీడీపీ. అయితే.. బలం లేకున్నా అన్యాయంగా చైర్మన్ పదవి లాక్కోవడం ఇక్కడ దారుణం.ఇక్కడ మొత్తం 38 వార్డులు ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లో 30 వార్డులను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఈసారి ఎన్నికల కోసం వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభ పెట్టాలని టీడీపీ నేతలను ఎమ్మెల్యే బాలయ్య దగ్గురుండి ప్రోత్సహించారు. మాట వినని కౌన్సిలర్లను బెదిరించారు కూడా. అలా.. 16 మందిని తనవైపునకు తిప్పుకుంది. ఈ అరాచకాలను చూసి ‘‘ఏంది బాలయ్య ఇది?’’ అంటూ హిందూపురం వాసులు విస్తుపోతున్నారు. డాకు బాలయ్యా.. ఇదీ ఓ గెలుపేనా?హిందూపురంలో టీడీపీ విజయం అనైతికమని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అంటున్నారు. ‘‘హిందూపురంలో 38 వార్డులకు గాను 30 వార్డుల్లో వైఎస్సార్ సీపీ కి బలం ఉంది. ఎమ్మెల్యే బాలకృష్ణ బెదిరించి.. ప్రలోభాలకు గురి చూసి వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను లాక్కున్నారు. ఓ డాకూలా ఎమ్మెల్యే బాలకృష్ణ దోపిడీ చేశాడు. నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చారు. ఈ గెలుపు.. అసలు గెలుపే కాదు. సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇలాగే మోసాలతో గెలిచారు. చంద్రబాబు, బాలకృష్ణలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు’’ అని అన్నారాయన. -
నీచ రాజకీయాలకు తెరతీసిన ఎమ్మెల్యే బాలకృష్ణ
శ్రీ సత్యసాయి జిల్లా: మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అడ్డదార్లు తొక్కుతున్నారు. నోరు తెరిస్తే బ్లడ్డు...బ్రీడు అంటూ తన గురించి తాను గొప్పగా చెప్పుకునే బాలకృష్ణ నీచ రాజకీయానికి తెరతీశారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కొనుగోలు చేసి బెంగళూరులో క్యాంపు రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం బాలకృష్ణ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండున్నర నెలలుగా ఖాళీగా ఉన్న హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పదవిని దక్కించుకునేందుకు టీడీపీ ఎప్పటిలా తన కుటిల రాజకీయాలకు తెరతీసింది. ఇందుకోసం ఎమ్మెల్యే బాలకష్ణనే రంగంలో దిగారు. తనకు అనుకూలమైన వారిని చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టేందుకు నానా తంటాలు పడుతున్నారు.ఇందులో భాగంగా ఖర్చుకు ఏమాత్రం వెనుకాడని ఎమ్మెల్యే బాలకృష్ణ వైఎస్సార్సీపీ ఒక్కో కౌన్సిలర్కు రూ.10 లక్షలు చొప్పున కొనుగోలు చేశారు. అలా మొత్తంగా 12మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్ను కొనుగోలు చేసింది. అనంతరం వారిని బస్సుల్లో బెంగళూరులో టీడీపీ ఏర్పాటు చేసిన క్యాంప్కు తరలించింది. మరింత మందిని ప్రలోభాలకు గురి చేసేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే బెదిరింపులతో టీడీపీలో చేరిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు.. తిరిగి సొంతగూటికి చేరారు. అయితే ఎమ్మెల్యే బాలకృష్ణ చేస్తున్న పెడుతున్న ప్రలోభాలు, బెదిరింపులకు భయపడి టీడీపీలో చేరితో భవిష్యత్తు నాశనం అవుతుందని భావిస్తున్న కౌన్సిలర్లు వైఎస్సార్సీపీలోనే కొనసాగేలా తీర్మానించారు. కాగా, హిందూపురం మున్సిపాలిటీలో 38 మంది కౌన్సిలర్లు ఉండగా.. గత ఎన్నికల్లో 30 వార్డుల్లో వైఎస్సార్సీపీ జయకేతనం ఎగురవేసింది. టీడీపీ కేవలం ఆరు వార్డులకే పరిమితమైంది. కానీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురి చేయడం గమనార్హం. -
బాలకృష్ణ ఇలాకాలో మద్యం షాపు దక్కించుకున్న వ్యక్తి కిడ్నాప్
-
బాలకృష్ణ నిద్ర పోతున్నావా... దసరా రోజున ఇలాంటి ఘటన దారుణం
-
బాలయ్య ఇలాకాలో అత్తాకోడలిపై అత్యాచారం
-
టీడీపీకి దండం.. జగనన్నతోనే ఉంటాం
-
Hindupur: ఆ నలుగురు కౌన్సిలర్లు.. తిరిగి వైఎస్సార్సీపీ గూటికి
సాక్షి, తాడేపల్లి: అనంతపురం జిల్లా హిందూపురం కౌన్సిలర్లు బుధవారం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్హన్రెడ్డిని కలిశారు. శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్, హిందూపురం వైఎస్సార్సీపీ సమన్వయకర్త దీపికతో కలిసి వీరంతా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ను కలిశారు. ఇటీవల టీడీపీలో చేరిన నలుగురు కౌన్సిలర్లు తిరిగి వైఎస్సార్సీపీ గూటికి చేరారు. వైఎస్ జగన్ను కలిసి పార్టీ కోసం పనిచేస్తామని హామీ ఇచ్చారు. అధికార పార్టీ నేతల ప్రలోభాలు, బెదిరింపులకు తామిక తలొగ్గేదిలేదని ఏది ఏమైనా ప్రజల పక్షాన నిలబడి వైఎస్సార్సీపీ వెంటే నడుస్తామన్నారు. వైఎస్ జగన్ను కలిసిన వారిలో సత్యసాయి జిల్లా పార్టీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్, హిందూపురం ఇన్ఛార్జీ దీపిక, ఇతర వైఎస్సార్సీపీ నేతలు ఉన్నారు.కాగా టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హిందూపురం మునిసిపాలిటీలో కౌన్సిలర్లను భయపెట్టి, మభ్యపెట్టి తమ పార్టీలో చేర్చుకుని మునిసిపల్ ఛైర్మన్ స్ధానం దక్కించుకునేందుకు కుట్ర పన్నారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను భయపెట్టి టీడీపీలో చేర్చుకున్నారు. వీరిలో మల్లిఖార్జున, పరుశురాముడు, రహమత్బీ, మణిలు తమ తప్పు తెలుసుకుని తిరిగి వైఎస్సార్సీపీలో చేరారు. -
రైతుల భవనాన్ని కూల్చేసిన టీడీపీ భూకబ్జాదారులు
హిందూపురం: సినీ హీరో, సీఎం చంద్రబాబు బావమరిది ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో టీడీపీ కబ్జాదారులు పేట్రేగిపోయారు. 30 ఏళ్ల క్రితం రైతులు హిందూపురం కోఆపరేటివ్ మిల్క్ డెయిరీ సొసైటీ ఏర్పాటు చేసుకొని, పట్టణం నడిబొడ్డున మెయిన్ బజారులో ఓ స్థలాన్ని కొనుక్కొని అందులో భవనాన్ని నిర్మించుకొన్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే ఆ స్థలంపై టీడీపీ కబ్జాదారుల కన్ను పడింది. వారు మూడురోజుల క్రితం రాత్రి వేళ ఆ భవనాన్ని కూల్చేశారు. స్థలాన్ని చదును చేసి, వారి చేతుల్లోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకొన్న రైతులు సోమవారం పెద్ద సంఖ్యలో పట్టణం నడిబొడ్డున ఉన్న ఆ స్థలం వద్దకు చేరుకొన్నారు. టీడీపీకి చెందిన భూ కబ్జాదారుల నుంచి రైతుల ఆస్తులను కాపాడాలంటూ ఆందోళనకు దిగారు. వారికి రైతు సంఘం, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. అనంతరం ర్యాలీగా టూటౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి, అక్కడ ధర్నా చేసి, ఫిర్యాదు చేశారు. సొసైటీ భవనాన్ని దౌర్జన్యంగా కూల్చివేసి, అందులోని సామగ్రి, విలువైన డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లిన వారిని అరెస్టు చేయాలని సీఐ కరీంకు ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందించారు. అనంతరం ఎమ్మెల్యే బాలకృష్ణ నివాసానికి కూడా వెళ్లారు. ఆయన లేకపోవడంతో పీఏలకు వినతి పత్రాలు అందజేశారు. 177 మంది రైతులు కలిసి నిరి్మంచుకున్న సొసైటీ భవనాన్ని కూల్చివేసి.. ఆ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయతి్నంచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. సీఎం బావమరిది బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురంలోనే టీడీపీ నాయకులు ఇలా కబ్జాలకు పాల్పడుతున్నారంటే.. రాష్ట్రంలో ఇంకెన్ని కబ్జాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చునన్నారు. ‘సినిమాల్లో రైతుల కోసం పోరాడే బాలయ్యా.. నీ నియోజకవర్గంలోని రైతులను కాపాడు’ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే బాలకృష్ణ చొరవ తీసుకొని కూల్చివేసిన భవనం స్థానంలో కొత్తది నిరి్మంచి, సదుపాయాలు కలి్పంచాలని డిమాండ్ చేశారు.పచ్చ నాయకులే కబ్జాలకు పాల్పడుతున్నారు పాడి రైతులందరం సొసైటీగా ఏర్పడి 30 ఏళ్ల క్రితం స్థలాన్ని కొని భవనం నిరి్మంచుకున్నాం. ఈ భవనం కేంద్రంగా చాలాకాలం పాల వ్యాపారం చేసుకొన్నాం. తర్వాత వ్యాపారం దెబ్బతినడంతో సొసైటీని మూసేశాం. అయినా అందులో సామగ్రి, డాక్యుమెంట్లు ఉన్నాయి. ఇప్పుడా స్థలం విలువ రూ.కోట్లలో ఉండడంతో టీడీపీ నాయకులు కబ్జా చేయాలని చూస్తున్నారు. ఇటీవల నంజుడేశ్వర బిల్డింగ్లోనూ ఓ షాపును దౌర్జన్యంగా ఖాళీ చేయించారు. ఇలాంటివి బాలకృష్ణ నియోజకవర్గంలోనే జరగడం శోచనీయం. – చంద్రశేఖర్రెడ్డి, సొసైటీ సభ్యుడు, హిందూపురం -
ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలో టీడీపీ నేతల బరితెగింపు
-
నూటికి తొంభై మార్కులు
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా నమస్కారం! నా పేరు డాక్టర్ ఇస్మాయిల్ పెనుకొండ. నేను పుట్టి పెరిగింది హిందూపురంలో. గత ఇరవై ఏళ్ళుగా అమెరికాలో, గత పదేళ్ళుగా టెక్సాస్లోని డాలస్ నగరంలో ఉంటున్నాం. వృత్తి రీత్యా అమెరికా ప్రభుత్వ వైద్యునిగా పని చేస్తున్నాను. నేను పుట్టి బుద్ధెరిగాక పట్టుకున్న మొదటి జెండా అన్నగారి ‘తెలుగుదేశం’ జెండానే! మా నాన్న హిందూపురంలో తెలుగుదేశం పార్టీ కోసం షామియానా వేసి, మైకుసెట్టు పెట్టి చేసిన ప్రచారం ఇంకా గుర్తుంది. అలాగే నేటికీ నలభై ఏళ్ళుగా గుండెల నిండా నింపుకున్న అభిమానంతో మెగాస్టార్ చిరంజీవి వీరాభిమానిని కూడా! గత జనవరిలో నేను అనంతపురం వచ్చాను. అంతకు ముందు నేను పనిచేసిన పాతూరు ప్రభుత్వాసుపత్రిని సి.డి. ఆసుపత్రి అనేవారు. నేను పనిచేసినప్పుడు కానీ,గత రెండేళ్ళ వరకూ కానీ అది ఒక పాడుపడిన వందేళ్ళ నాటి పెంకుటిల్లులాంటి భవనంలో ఉండేది. రెండేళ్ళ క్రితం కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో రూపొందించిన ఒక నూతన భవనంలో నడుస్తోంది. ఐదారు మంది డాక్టర్లు, పాతికమంది వరకూ ఇతర ఉద్యోగులతో మంచి వైద్యకేంద్రంగా రూపొందింది. ఆ ఆసుపత్రిని ఇలా చూడడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. మరో ముఖ్యమైన అంశం ప్రభుత్వ విద్య. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని వచ్చినవాళ్ళం... ఏదో కొంత మంది మాత్రమే ఉన్న కొద్ది వనరులను ఉపయోగించుకొని జీవితంలో ఓ స్థాయికి చేరాము. అలా సార్వజనీనమైన అవకాశాలను అందిపుచ్చుకొని అందరూ అదే రకమైన విజయాన్ని అందుకోలేక పోయారు. అలాంటిది, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు జరుగుతున్న విద్యాబోధన, తెలుగుతో పాటు ఆంగ్లమాధ్యమంలో చదివించడం, చిన్న తనం నుంచే డిజిటల్ మీడియాతో వాళ్ళకు విద్యను బోధించడం చాలాచోట్ల చూసి ఆశ్చర్యపోయాను. అలాగే నీటైన యూనిఫాం, బ్యాగులు, పుస్తకాలు, కాళ్లకు షూస్తో సహా వాళ్లకు అందించి పిల్లలలో ఆ వయస్సు నుంచే ఒక ఆత్మ విశ్వాసాన్ని, స్థైర్యాన్ని పెంచి వారి వ్యక్తిత్వానికి మంచి పునాదులు పడేలా చేసింది. అభివృద్ధి అనేదానికి – పెద్ద నగరాల్లో ఓ పెద్ద ఐకియా స్టోర్, ఎంజాయ్ చేయడానికి పబ్బులు, పెద్ద పెద్ద బిల్డింగులు, విశాలమైన రోడ్లు – ఇవి మాత్రమే సూచికలు కాకూడదు. అభివృద్ధికి ఒక సూచిక ఏమిటంటే దారిద్య్ర రేఖ దిగువన ఉన్న ప్రజలు ఎంతవరకూ బాగుపడ్డారు? అది గత ఐదేళ్ళలో చూసుకుంటే సగటు ఆటోరిక్షా నడిపే కార్మికుడు, అరటికాయలు అమ్మి పొట్టపోసుకునే కార్మికురాలు, రోడ్డుసైడు మెకానిక్కు, ఒక సన్నకారు రైతు – వీళ్ళకు కనీస భరోసా లభిస్తోంది. ‘మా పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోంది, మాకు రోగమొస్తే ప్రభుత్వ ప్రాథమిక వైద్యకేంద్రాల్లో కనీస వైద్యం అందుతుంది, నాకు క్యాన్సర్ వచ్చినా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం దొరుకుతుంది’ అన్న భరోసా గత ఐదేళ్ళలో దొరికింది. మొన్ననే ధర్మవరంలో జిలేబీలు అమ్ముకునే కార్మికురాలి కూతురుకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడింది. దీనిపై నేనొక చిన్న ట్వీట్ పెడితే, సీఎంవోలో డా.హరికృష్ణారెడ్డి గారు స్పందించి రూ.20 లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగా అందించే ఏర్పాటు చేశారు. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు నాకు తెలిసే ఉన్నాయి.2019 మేలో జగన్మోహన్రెడ్డి ఎన్నికలలో ఘన విజయం సాధించినప్పుడు నేను సామాజిక మాధ్యమాల్లో ‘మీ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యాలుగా ‘‘విద్య’ – ‘వైద్యా’లను ఎన్నుకొని, వాటి రూపురేఖల్ని సమూలంగా మారుస్తూ ప్రజలకు అందుబాటులోనికి తేవాలని’ కోరాను. ఈనాడు ప్రభుత్వం ఆ ముఖ్యమైన రెండు విషయాల్లోనూ చాలా సమర్థంగా పనిచేసిందని ప్రత్యక్షంగా గమనించాను. ‘పల్లెటూళ్ళే పట్టుగొమ్మలని’ మహాత్మాగాంధీ గారన్నారు. పల్లెల్లో అత్యంత దారుణమైన స్థితిలో ఉన్న దరిద్రనారాయణుడికి చేసే సేవే నిజమైన సేవ అని ఆయన భావించారు. అలా ప్రస్తుత ప్రభుత్వంలో సామాన్యుడికి కనీస అవసరాలైనా తీరుతున్నాయని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పేదేమిటంటే – నేనేదైతే ప్రభుత్వ ప్రాధమ్యాలుగా ఉండాలని, ప్రజలకు మెరుగ్గా సేవ చేయాలని భావించానో అవి నెరవేరాయి. నాకు తెలిసిన కొద్దిమందికి కూడా ఎంతో కొంత మేలు జరిగింది కాబట్టే ఇలా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఏతావతా, చెప్పొచ్చేదేమిటంటే – అటూ ఇటూ జరిగిన కొన్ని సంఘటనలు ఉన్నా, విద్య–వైద్య పరంగా స్థూలంగా నేను ఈ ప్రభుత్వానికి వందకు 80–90 మార్కులు వేయ గలుగుతాను.ధన్యవాదాలు, జైహింద్.డా‘‘ ఇస్మాయిల్ పెనుకొండ వ్యాసకర్త అమెరికాలో వైద్యుడు -
హిందూపూర్ లో నా మెజారిటీ ఎంతంటే..?
-
హిందూపురానికి బాలకృష్ణ చేసిందేమీ లేదు.. అందుకే ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారు
-
సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..
-
హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ
-
ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్
-
జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్
-
చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
-
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
-
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
-
కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం
-
హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు
-
కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం
-
హిందూపురం అభివృద్ధిపై ప్రజలు ఏమంటున్నారు ?
-
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై.. టీడీపీ నేతల దాడి
-
మహిళల శక్తి.. ఈ ముగ్గురికి మూడినట్టే
-
సీఎం జగన్ కు జీవితాంతం రుణపడి ఉంటాం
-
నేను లోకల్.. సీఎం జగన్ పేదల పక్షపాతి
-
హిందూపురంలో బాలకృష్ణను ఓడిస్తాం: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: హిందూపురంలో బాలకృష్ణ రెండుసార్లు గెలిచినా అభివృద్ధి చేయలేకపోయారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. హిందూపురం నియోజకవర్గం మానెంపల్లి గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం జగన్ పాలనలో జనం సంతోషంగా ఉన్నారని, చంద్రబాబు ఎన్నికల హామీలు నెరవేర్చలేదన్నారు. ‘‘99 శాతం లబ్ధిదారులకు పథకాలు అందజేశాం. సీఎం జగన్ వెనుకబడిన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపిక హిందూపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారు. హిందూపురం పార్లమెంటు నుంచి బోయ-వాల్మికి సామాజిక వర్గానికి చెందిన శాంత బరిలో ఉంటారు. వెనుకబడిన వర్గాలకు చెందిన ఇద్దరు మహిళలకు ఒకే చోట గతంలో ఏ పార్టీ అవకాశం ఇవ్వలేదు. కుప్పంలో చంద్రబాబు, హిందూపురంలో బాలకృష్ణను కచ్చితంగా ఓడిస్తామని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ‘‘టిక్కెట్ల కేటాయింపులో ఉన్న కొంత అసంతృప్తి ని త్వరలోనే అధిగమిస్తాం. టీడీపీ- జనసేన తరపున ఎవరు పోటీ చేస్తారో ఇప్పటిదాకా స్పష్టత లేదు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయింది. ఓట్లు చీల్చేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలు అధిగమిస్తాం. ఎన్నికల్లో సచివాలయ సిబ్బంది ని ఉపయోగించటం లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు అవగాహన లేక ఈసీకి ఫిర్యాదు చేశారు. నిజమైన రాయలసీమ ద్రోహి చంద్రబాబే’’ అని మంత్రి పెద్దిరెడ్డి దుయ్యబట్టారు. ఇదీ చదవండి: బ్రో.. ఇది దొంగ ఓటు! -
ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఖచ్చితంగా వైఎస్ జగన్ మళ్ళీ సీఎం అవుతారు: పెద్దిరెడ్డి
-
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కు చేదు అనుభవం
-
బాలయ్యా.. పిచ్చివేషాలు మానుకో..
హిందూపురం టౌన్: ‘బాలయ్యా.. పిచ్చి వేషాలు మానుకో... మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడం, నీచంగా మాట్లాడడం వంటి పిచ్చివేషాలు వేస్తే మహిళలే నిన్ను తరిమికొట్టడం ఖాయం..’అని హిందూపురం ఎమ్మెల్యే, సినీహీరో నందమూరి బాలకృష్ణను వైఎస్సార్సీపీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక హెచ్చరించారు. మహిళలు, తోటి నటీమణుల పట్ల బాలకృష్ణ అసభ్యకరంగా వ్యవహరించడం, అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం హిందూపురంలో మహిళలు ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహం నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు సాగిన ర్యాలీలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బాలకృష్ణ డౌన్ డౌన్.. బాలకృష్ణ గో బ్యాక్.. సైకో బాలకృష్ణ... అని నినాదాలు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాలకృష్ణ పోస్టరును చెప్పులతో కొడుతూ దహనం చేశారు. ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అని చెప్పుకోవడానికి కూడా ఇక్కడి మహిళలు సిగ్గుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బాలకృష్ణ సంస్కారం లేకుండా తోటి సినీనటి విచిత్రతో ఎలా అసభ్యంగా ప్రవర్తించారో ఆమె నోటితోనే విన్నామని చెప్పారు. ఓ సినీ ఫంక్షన్లోనూ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. ఇలాంటి సైకో ఆలోచనలు ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేగా అనర్హుడన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ మాట్లాడుతూ హిందూపురం సమస్యలపై ఏ రోజూ అసెంబ్లీలో మాట్లాడని బాలకృష్ణ.. మహిళలపై మాత్రం నీచంగా మాట్లాడడం, అసభ్యంగా ప్రవర్తించడం రివాజుగా మార్చుకున్నాడని విమర్శించారు. మహిళలకు బాలకృష్ణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చదవండి: ఇదేమి పని ‘నారాయణా’ -
గుండు కొట్టించుకుంటే రూ.1000 ఇచ్చారు !..అడ్డంగా దొరికిన టీడీపీ నేతలు
-
ఫ్యాన్ ప్రభంజనం.. హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ
సాక్షి, అనంతపురం జిల్లా: ఎన్నిక ఏదైనా, ఎప్పుడొచ్చినా వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టిస్తోంది. ఫ్యాన్ స్పీడ్కు ప్రత్యర్థులు నలవలేకపోతున్నారు. తాజాగా, పలు పంచాయితీలు, వార్డులకు జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. దీంతో వైఎస్సార్సీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ తగిలింది. చలివెందుల పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారు విజయం సాధించారు. 337 ఓట్లతో సర్పంచ్గా ఉపేంద్రరెడ్డి గెలుపొందారు. తాడిపత్రిలో.. తాడిపత్రిలో జేసీ బ్రదర్స్కు ఎదురుదెబ్బ తగిలింది. జేసీ సొంత మండలం పెద్దపప్పూరులో టీడీపీ ఓటమి చెందింది. దేవునుప్పలపాడు పంచాయతీలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు కాటమయ్య గెలుపొందారు.తాడిపత్రి నియోజకవర్గంలో ఐదు వార్డుల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ఘన విజయం సాధించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో జరిగిన పంచాయితీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఒక్కొక్కటిగా ఫలితాలు వెలువడుతున్నాయి. మెజార్టీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు.. బలపర్చిన అభ్యర్థులే జయకేతనం ఎగరేస్తున్నారు. మొత్తం 35 సర్పంచ్, 245 వార్డు మెంబర్ల స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. -
హిందూపూర్లో 350 ఎకరాల్లో టెక్స్టైల్ మరియు ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ కోసం పారిశ్రామికపార్క్ ఏర్పాటు
-
హిందూపురంలో వైఎస్సార్సీపీ జెండా ఎగరేద్దాం: దీపిక
హిందూపురం: వచ్చే ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీని అఖండ మెజార్టీతో గెలిపించి పార్టీ జెండా ఎగరేద్దామని నియోజకవర్గ సమన్వయకర్త దీపిక పిలుపునిచ్చారు. సమన్వయకర్తగా నియమితులయ్యాక తొలిసారిగా ఆదివారం హిందూపురం వచ్చిన ఆమెకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. తూమకుంట చెక్పోస్టు నుంచి హిందూపురం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక మెయిన్ బజారు గాంధీ సర్కిల్ వద్ద గజమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులనుద్దేశించి దీపిక మాట్లాడారు. ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణ నియోజకవర్గ ప్రజల సమస్యలను గాలికొదిలేశారని విమర్శించారు. చుట్టపు చూపుగా వస్తూ వెళ్తూ ఓటరు తీర్పును అపహాస్యం చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. పార్టీ నాయకులు, ప్రజలకు రుణపడి ఉంటానని, హిందూపురం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. హిందూపురం సమన్వయకర్తగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ నాయకులందర్ని కలుపుకుని ముందుకు సాగుతానన్నారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపే ధ్యేయంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. వై నాట్ 175 అన్న జగనన్న నినాదాన్ని నిజం చేద్దామన్నారు. నాయకుల ఆప్యాయత, ఆశీర్వాదాలు ఎల్లవేళలా తనపై ఉండాలని కోరారు. త్వరలోనే పార్టీ నాయకులతో కలిసి ప్రజలతో మమేకమవుతానని తెలిపారు. సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిద్దామన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా జగనన్న చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. అందరికీ సమన్యాయం చేయడం ఆయనతోనే సాధ్యమైందన్నారు. జగనన్న ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పక్షపాతి అన్నారు. మైనార్టీల సంక్షేమానికి 4 శాతం రిజర్వేషన్ కల్పించి వైఎస్సార్ ఎంతో మేలు చేశారని తెలిపారు. తండ్రిని మించి సీఎం వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారన్నారు. చంద్రబాబు మళ్లీ కళ్లబొల్లి మాటలు చెబుతూ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆయన్ను నమ్మరాదని సూచించారు. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాల్లో పవన్ కల్యాణ్కు ఒక్కటి కూడా లేవని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే బాలకృష్ణకు హిందూపురం ప్రజల గురించి ఆలోచించే టైం లేదని ఎద్దేవా చేశారు. దీపికకు మనందరి మద్దతు అందిద్దామని పిలుపునిచ్చారు. మున్సిపల్ వైస్ చైర్మన్ బలరామిరెడ్డి, కౌన్సిలర్లు శివ, షాజియాలు మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా ముందుకుపోదామన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కొటిపి హనుమంతరెడ్డి, పెనుకొండ మాజీ సమన్వయకర్త నాగలూరు బాబురెడ్డి, కౌన్సిలర్లు మారుతిరెడ్డి, ఆసీఫ్, రామచంద్ర, గిరి, జయప్ప, పురశురాం, నాగేంద్రబాబు, రోషన్, పార్వతీ, నాగేంద్రమ్మ, రహమత్బీ, ఎంపీపీ పురుషోత్తంరెడ్డి, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు ఉపేంద్రరెడ్డి, నాగమణి, జనార్దన్రెడ్డి, లక్ష్మినారాయణ, మండల కన్వీనర్ నారాయణస్వామి, వైస్ ఎంపీపీ అంజన్రెడ్డి, జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, నక్కలపల్లి శ్రీరామిరెడ్డి, సర్పంచ్లు శంకర్రెడ్డి, నాగరత్నమ్మ, నాయకులు డిష్ నాగరాజు, మహేష్, చంద్రశేఖర్, అబీబ్, ఆనంద్రెడ్డి, శివశంకర్రెడ్డి, తిమ్మిరెడ్డి, పెద్ద ఎత్తున కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
ప్రేమిస్తున్నానంటూ వెంటపడి..పెళ్లి మాట ఎత్తగానే...
సాక్షి, హిందూపురం: ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి సర్వమూ దోచేసిన యువకుడు.. పెళ్లి మాట ఎత్తగానే ముఖం చాటేశాడంటూ ఓ యువతి నడిరోడ్డుపై ధర్నాకు దిగింది. బాధితురాలు తెలిపిన మేరకు.. హిందూపురం మండలానికి చెందిన ఓ యువతి అనంతపురం జిల్లా గుత్తిలోని ఓ కళాశాలలో ఎంబీఏ పూర్తి చేసింది. కళాశాలలో చదువుకుంటున్న సమయంలోనే కర్నూలు జిల్లా పెద్దకడుబూరు ప్రాంతానికి చెందిన గణేష్ పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. మూడేళ్ల పాటు తనతో పాటు తిప్పుకున్నాడు. ప్రస్తుతం దళితురాలిననే కారణం చూపి పెళ్లికి అంగీకరించడం లేదు. గణేష్ చేసిన మోసంపై ఇప్పటికే పోలీసు స్పందన కార్యక్రమంలో ఎస్పీని కలసి ఫిర్యాదు చేసింది. దీనిపై 20 రోజుల క్రితం హిందూపురం రూరల్ పోలీసులు పిలిపించుకుని విచారణ చేశారు. అయినా తనకు న్యాయం చేకూరలేదంటూ శనివారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద కేవీపీఎస్ నాయకులతో కలసి భైఠాయించి నిరసన వ్యక్తంచేసింది. తనకు న్యాయం జరిగే వరకూ పోరాడుతానని పేర్కొంది. కార్యక్రమంలో బాధితురాలితో పాటు తల్లి, కేవీపీఎస్ నాయకులు అన్నమయ్య, రమణ, రాము, జ్యోతమ్మ, మధు తదితరులు పాల్గొన్నారు. హిందూపురం రూరల్ సీఐ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. అబ్బాయిని పిలిపించి విచారిస్తే అతను ఒప్పుకోవడం లేదన్నారు. బాధితురాలు రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. (చదవండి: అప్పు కట్టకుంటే.. జైలుశిక్ష ) -
పురం’పై వైఎస్సార్ సీపీ జెండా ఎగరాలి
హిందూపురం: ‘చౌళూరు రామకృష్ణారెడ్డికి వైఎస్ రాజశేఖర్రెడ్డి అంటే ఎనలేని గౌరవం. జగనన్న అంటే అపార అభిమానం. అందుకే కెనడాలో చదువుకున్న ఆయన, మంచి ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. హిందూపురంలో వైఎస్సార్ సీపీ జెండా కట్టి పార్టీకి పునాదులు వేశారు. పురంలో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేయాలన్నదే ఆయన ఆశయం. అందువల్ల కార్యకర్తలంతా కలిసి 2024లో హిందూపురంలో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేసి ఆయనకు ఆత్మకుశాంతి కలిగించాలి’ అని చౌళూరు సతీమణి జ్యోత్స్న, సోదరి మధుమతి, బావ నాగభూషణంరెడ్డి, ఇతర కుటుంబసభ్యులు పిలుపునిచ్చారు. శుక్రవారం హిందూపురంలోని ఈడిగ ఫంక్షన్హాలులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రామకృష్ణారెడ్డి సంతాపసభ జరిగింది. ముందుగా రామకృష్ణారెడ్డి చిత్రపటానికి కుటుంబీకులతో పాటు ఏపీ ఆగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘని, మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్రెడ్డి పార్టీ ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులరి్పంచి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం రామకృష్ణారెడ్డి సతీమణి, సోదరి, ఇతర కుటుంబీకులు మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై తమకు పూర్తిగా నమ్మకం ఉందని, తప్పకుండా న్యాయం జరుగుతుందన్న దృఢ విశ్వాసం ఉందన్నారు. దోషులు ఎంతటివారైనా వారికి శిక్షపడాలన్నారు. ఐక్యంగా పోరాడదాం.. చౌళూరు హత్య కేసులో అనుమానాలు ఉన్నాయని ఏపీ అగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్ అన్నారు. ఆయన ఇంటి ముందే చౌళూరును దారుణంగా హత్య చేశారంటే, హంతకుల వెనుక ఎవరో పెద్దలున్నారనిపిస్తోందన్నారు. హత్య కేసులోని అనుమానితుల్లో కొందరిని ఎందుకు అరెస్టు చేయడం లేదన్నారు. రామకృష్ణారెడ్డి ఏ ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చారో, ఎందుకోసం కష్టపడ్డారో దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఇకపై పిడికిలి బిగించి అందరం ఒక్కటై రానున్న ఎన్నికల్లో పార్టీని గెలిపించినప్పుడే రామకృష్ణారెడ్డి ఆత్మకుశాంతి, నిజమైన నివాళి అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బలరామిరెడ్డి, ఎంపీపీ పురుషోత్తంరెడ్డి, రత్నమ్మ, మార్కెట్ యార్డు చైర్మన్ కొండూరు మల్లికార్జున, కౌన్సిలర్లు ఆసీఫ్వుల్లా, రామచంద్రా, షాజియా, డైరెక్టర్లు లక్ష్మీనారాయణ, జనార్దన్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు కొటిపి హనుమంతరెడ్డి, నాగరాజు, హబీబ్, చంద్ర, మహేశ్, దాదు, నక్కలపల్లి శ్రీరాములు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. (చదవండి: చౌళూరు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది ) -
చౌళూరు హత్యకేసు దర్యాప్తు ముమ్మరం
హిందూపురం: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి హత్యకేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఇప్పటికే నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు హంతకుల కోసం వేట సాగిస్తున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు కర్ణాటకలోను గాలిస్తున్నాయి. హత్య జరిగిన ప్రదేశంలో అనుమానమున్న వస్తువులు, వేలిముద్రలను క్లూస్ టీం సేకరించింది. తనిఖీల్లో వేటకొడవలి పిడి కూడా దొరికింది. సంఘటన జరిగిన వెంటనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. చౌళూరు గ్రామానికే చెందిన నేరచరిత్ర కలిగిన వరుణ్ అలియాస్ మంజు పాత్ర ఉందేమోనన్న కోణంలోను దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రామకృష్ణారెడ్డి హత్య జరిగినప్పటి నుంచి వరుణ్ అజ్ఞ్తాంలోకి వెళ్లిపోయాడు. రామకృష్ణారెడ్డి వ్యాపార, ఆర్థిక లావాదేవీలు, రాజకీయ విభేదాలు, ధాబా పునరుద్ధరణ విషయంలో తలెత్తిన సమస్యలు తదితర అంశాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇది సుపారీ హత్యనా అనే కోణంలోను దర్యాప్తు సాగిస్తున్నారు. ఇటీవల రామకృష్ణారెడ్డి రాజకీయంగానే కాకుండా బెంగళూరులో వ్యాపారపరంగాను కొంత బిజీగా ఉంటూ వచ్చారు. తన ధాబా వద్ద బార్ ఏర్పాటు చేసేందుకు పనులు చేపడుతున్నారు. ఈ విషయంలో ఆయనకు వరుణ్తో గొడవ జరిగిందని స్థానికులు చెబుతున్నారు. బార్ కూడా ప్రారంభిస్తే రామకృష్ణారెడ్డి ఆర్థికంగా మరింత బలంగా తయారవుతారన్న కక్షతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనే విషయంపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యులు మాత్రం రాజకీయంగా వ్యతిరేకులే హత్యకు కారణమని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైతే స్పష్టమైన కారణాలేవీ తెలియడంలేదు. సమగ్ర దర్యాప్తు కొనసాగించి నిజాలు తేలుస్తామని పోలీసులు చెబుతున్నారు. రూరల్ సీఐ, ఎస్ఐలపై శాఖాపరమైన చర్యలు హిందూపురం అప్గ్రేడ్ రూరల్ పోలీసుస్టేషన్ సీఐ జి.టి.నాయుడు, ఎస్ఐ కరీంలను వీఆర్కు పంపుతూ ఎస్పీ రాహుల్దేవ్ సింగ్ ఉత్తర్వులిచ్చారు. చౌళూరు రామకృష్ణారెడ్డి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు తెలిపినా రక్షణ కల్పించలేదన్న కారణంతో వీరిపై చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. విచారణాధికారిగా టూటౌన్ సీఐ వెంకటేశ్వర్లును నియమించారు. ఆయన రూరల్ స్టేషన్ ఇన్చార్జ్గాను వ్యవహరిస్తారు. -
సత్యసాయి జిల్లా : హిందూపురంలో వైఎస్ఆర్ సీపీ నేత హత్య
-
Sri Sathya Sai District: వైఎస్సార్సీపీ నేత దారుణ హత్య
హిందూపురం: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు శనివారం రాత్రి చౌళూరు గ్రామంలోని ఆయన ఇంటి వద్ద వేట కొడవళ్లతో నరికి చంపారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. రామకృష్ణారెడ్డి ఏపీ సరిహద్దుల్లో కర్ణాటకలోని తన దాబా వద్ద శనివారం రాత్రి పని ముగించుకుని రాత్రి 9 గంటల సమయంలో కారులో ఇంటికి వచ్చారు. ఇంటి వద్ద కారు దిగుతున్న సమయంలో అప్పటికే మొఖానికి మాస్క్లు ధరించి కాపు కాచి ఉన్న ముగ్గురు నలుగురు ఒక్కసారిగా వేట కొడవళ్లతో దాడి చేశారు. తల, గొంతు, చేతులు, కాళ్లపై దారుణంగా నరికి పారిపోయారు. రామకృష్ణారెడ్డి అరుపులు విన్న స్థానికులు పరుగు పరుగున అక్కడికి వచ్చారు. ఇంటి ముందు పడి ఉన్న రామకృష్ణారెడ్డిని ఆయన కారులోనే హిందూపురం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారిం చారు. విషయం తెలుసుకున్న వన్టౌన్ సీఐ ఇస్మాయిల్, రూరల్ సీఐ జీటీ నాయుడు ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. రామకృష్ణారెడ్డి హత్య వార్త తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, చౌళూరు గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. చౌళూరు రామకృష్ణారెడ్డి వైఎస్సార్సీపీ పార్టీ ఆవిర్భావం నుంచి నియోజకవర్గంలో పార్టీ కోసం కృషి చేశారు. హిందూపురం మండలంలో మంచి పట్టు ఉన్న నాయకుడు. ఆయన భార్య, కుమారుడు ప్రస్తుతం బెంగళూరులో ఉన్నట్లు బంధువులు తెలిపారు. ఆయన మృతి సమాచారాన్ని వారికి అందించారు. ఆయన తల్లి, బంధువులు, గ్రామస్తుల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. రామకృష్ణారెడ్డి హత్యను వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. హత్య విషయం తెలిసిన వెంటనే పార్టీ నేతలు, కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకొన్నారు. దుండగులను వెంటనే పట్టుకోవాలి: ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ చౌళూరు రామకృష్ణారెడ్డి దారుణ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ చెప్పారు. వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు దారుణ హత్యకు గురికావడం తీవ్ర దిగ్బ్రాంతి కలిగించిందన్నారు. ఆయన పార్టీ కోసం చేసిన సేవలు మరవలేనివని, ఆయన లేని లోటు పూడ్చలేనిదని అన్నారు. హత్య విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్సీ రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, జిల్లా ఎస్పీ రాహుల్దేవ్ సింగ్తో ఫోన్లో మాట్లాడి ఈ హత్యకు పాల్పడిన దుండగులను వెంటనే పట్టుకోవాలని కోరారు. హత్యకు కారణాలపై సమగ్ర దర్యాప్తు జరిపి, దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హిందూపురం నియోజకవర్గంలో కక్ష సాధింపు హత్యల సంస్కృతి లేదని, ఈ ఘటనకు కారణమైన వారిని ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. -
లక్షల రూపాయలున్న బ్యాగు రైల్వే స్టేషన్లో మర్చిపోయాడు.. తిరిగి వచ్చేసరికి
హిందూపురం (సత్యసాయి జిల్లా): రూ. లక్షల డబ్బున్న బ్యాగును ఓ వ్యక్తి మరిచి వెళ్లిపోయాడు. కొంతసేపటి తర్వాత తేరుకుని మళ్లీ అక్కడకు చేరుకున్నాడు. బ్యాగు కనిపించకపోవడంతో లబోదిబోమంటూ రైల్వే పోలీసులను ఆశ్రయించగా, బ్యాగును తిరిగి ఆయనకు అప్పగించారు. ఆర్పీఎఫ్ ఎస్ఐ కెంపరాజు తెలిపిన మేరకు.. గుజరాత్ రాష్ట్రం సూరత్ పట్టణానికి చెందిన బిపిన్ చంద్ర చంపక్ లాల్ జరీవాలా హిందూపురం పట్టణంలోని పట్టుచీరల వ్యాపారులతో జరీ వ్యాపారం చేసేవాడు. వ్యాపార లావాదేవీల నిమిత్తం రెండు రోజుల క్రితం హిందూపురం వచ్చాడు. (చదవండి: హనీ ట్రాప్.. యువకులకు యువతి వల.. వీడియో కాల్స్ రికార్డ్ చేసి..) స్థానిక వ్యాపారుల ద్వారా రూ.6,15,900 సేకరించాడు. తిరిగి వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్న బిపిన్ చంద్ర.. ఇంకా పని పూర్తి కాకపోవడంతో దాన్ని రద్దు చేసుకునేందుకు శనివారం స్థానిక రైల్వేస్టేషన్కు వచ్చాడు. వెంట తెచ్చుకున్న బ్యాగును అక్కడే మర్చిపోయి హడావుడిగా వెళ్లిపోయాడు. బ్యాగును గుర్తించిన స్టేషన్ సిబ్బంది శ్రీకాంత్దాస్, రామచంద్ర ఆర్పీఎఫ్ పోలీసుస్టేషన్లో అప్పగించారు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న బిపిన్ చంద్ర రైల్వే పోలీసులతో గోడు వెళ్లబోసు కున్నాడు. అతడి వద్ద వివరాలు, బిల్లులను పరిశీలించిన పోలీసులు డబ్బున్న బ్యాగును తిరిగి అప్పగించేశారు. (చదవండి: విషాదం.. డ్రైనేజీ శుభ్రం చేసేందుకు దిగి ముగ్గురు మృతి) -
బాలయ్యా... గుర్తున్నామా!
సాక్షి, పుట్టపర్తి: హిందూపురం నియోజకవర్గం...టీడీపీకి అండగా ఉన్న ప్రాంతం. నందమూరి తారక రామారావుతో పాటు ఆయన తనయులు హరికృష్ణ, బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. నందమూరి బాలకృష్ణ హిందూపురంలో రెండోసారి విజయం సాధించి ప్రస్తుత అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే తమను ఇంతలా ఆదరిస్తున్న హిందూపురం వాసుల గురించి మాత్రం బాలయ్య పట్టించుకోవడం లేదు. సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటూ నియోజకవర్గానికి చుట్టపుచూపుగా వచ్చి వెళ్తున్నారు. గత 8 నెలల కాలంలో బాలకృష్ణ ఒకట్రెండు సార్లు మాత్రమే హిందూపురంలో కనిపించారు. అది కూడా గృహ ప్రవేశాలు, వివాహాల్లో హాజరయ్యేందుకు వచ్చారు. అంతేకానీ ప్రజలు ఎలా ఉన్నారు.. నమ్మి ఓట్లేసిన ప్రజల యోగ క్షేమాల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ నేపథ్యంలో రెండు రోజుల పర్యటన కోసం బాలకృష్ణ బుధవారం హిందూపురం వస్తుండగా...జనం ఇన్నాళ్లకు గుర్తొచ్చామా? అని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ హయాంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై అప్పటి సీఎం చంద్రబాబు వివక్ష చూపించారు. నిధులు విడుదల చేయకుండా ఇబ్బందులు పెట్టారు. అయితే ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం ప్రాంతాలు, కులాలు, మతాలు, పారీ్టలు చూడకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందేలా జనరంజక పాలన సాగిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతాల అభివృద్ధికీ నిధులు కేటాయిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఈ క్రమంలో హిందూపురం నుంచి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్నా.. ప్రభుత్వం ఈ ప్రాంతంపై ఎలాంటి వివక్ష చూపలేదు. అన్ని రకాల సంక్షేమ పథకాలు, అన్ని వర్గాల వారికి అందజేస్తున్నారు. దీనికి తోడు ప్రజలకు ఎలాంటి కష్టమొచ్చినా.. పార్టీ చూడకుండా.. ఎమ్మెల్సీ ఇక్బాల్ సాయం చేస్తున్నారు. దీంతో బాలకృష్ణతో జనానికి పనిలేకుండా పోయింది. గత ఆరు నెలల్లో బాలకృష్ణ ఇలా.... జనవరిలో ఓసారి కూడా హిందూపురం రాలేదు. ఫిబ్రవరి 3,4 తేదీల్లో హిందూపురం జిల్లా సాధన పేరుతో ధర్నా చేసేందుకు వచ్చారు. మార్చి 27వ తేదీన హిందూపురంలో ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏప్రిల్లో ఒక్కసారి కూడా హిందూపురం సందర్శించలేదు. మే 27వ తేదీన హిందూపురం విచ్చేసి ఓ వివాహానికి హాజరయ్యారు. జూన్ 2వ తేదీన హిందూపురంలో ఓ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. జూలైలో హిందూపురంలో పర్యటించలేదు. తాజాగా 17, 18 తేదీల్లో పర్యటించేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. బాలకృష్ణ స్థానిక వ్యవహారాలన్నీ పీఏ (వ్యక్తిగత కార్యదర్శి)కి అప్పగించారు. వారు ఎలా చెబితే అలా డైలాగులు చెప్పేసి వెళ్లిపోతారు. కనీసం పార్టీ కార్యకర్తలెవరో కూడా తెలియని పరిస్థితి. ఎవరైనా అభిమానంతో దగ్గరకు పోయినా లాగి లెంపకాయ కొట్టడం అలవాటు చేసుకున్నారు. దీంతో ఆయన దగ్గరకు వెళ్లే సాహసం ఎవరూ చేయడం లేదు. పోనీ ఆయన పీఏలనైనా నమ్ముకుందామంటే... గత టీడీపీ హయాంలో అప్పటి పీఏ శేఖర్ పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం పీఏగా వ్యవహరిస్తున్న బాలాజీ హైటెక్ పద్ధతిలో జూదం ఆడుతూ పోలీసులకు గత మార్చి 21వ తేదీన పట్టుబడ్డాడు. ఇలా బాలకృష్ణ అందుబాటులో లేక, ఆయన పీఏలు పట్టించుకోకపోవడంతో జనం ఎమ్మెల్యే గురించే మరచిపోయారు. ఈ చిత్రంలో ఎమ్మెల్సీ ఇక్బాల్ పరామర్శిస్తున్న వ్యక్తి పేరు తిమ్మారెడ్డి. ఎన్టీఆర్ వీరాభిమాని. మొదటి నుంచీ టీడీపీలో క్రియాశీలక కార్యకర్త. గత ఏడాది తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. ఏళ్లుగా పారీ్టకి సేవ చేసినా టీడీపీ నేతలు గానీ, స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణగానీ తిమ్మారెడ్డి గురించి పట్టించుకోలేదు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ 2021 మే 5వ తేదీన తిమ్మారెడ్డి ఇంటికే వెళ్లి పరామర్శించారు. వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం చేశారు. అంతేకాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.2,70,000 మంజూరు చేయించారు. ప్రస్తుతం తిమ్మారెడ్డి ఆరోగ్యంగా ఉన్నారు. లేపాక్షికి చెందిన ఓ టీడీపీ కార్యకర్తకు ఇటీవల ఓ పెద్ద కష్టం వచ్చింది. సాయం కోసం బాలకృష్ణను సంప్రదించాలని చూడగా ఆయన అందుబాటులో లేరు. ఎమ్మెల్యే పీఏను కలిస్తే చీదరించుకున్నారు. ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తే తన పరిస్థితి ఇలా అయ్యిందని సదరు కార్యకర్త మనస్తాపం చెందారు. చివరకు విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ ఇక్బాల్ అతన్ని పిలిపించుకుని విషయం ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి సదరు కార్యకర్తకు అండగా నిలిచారు. ...ఇలా టీడీపీ నాయకులు, కార్యకర్తలే కాదు. హిందూపురం వాసులంతా బాలయ్య అందుబాటులో లేక ఇబ్బంది పడ్డారు. అయితే అధికార వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పారీ్టలకు అతీతంగా పథకాలు అమలు చేయడంతో పాటు ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల అభివృద్ధికీ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుండటంతో జనంతో పాటు టీడీపీ నేతలూ ఇప్పుడు ఆ పార్టీ వెంట నడుస్తున్నారు. అందువల్లే హిందూపురం వాసులు కూడా బాలయ్యతో తమకేం పెద్దగా పనిలేదంటున్నారు. (చదవండి: వారంతా చంద్రబాబుతో చేతులు కలిపారు: ఎంపీ గోరంట్ల మాధవ్) -
అసైన్డ్ భూమిపై ‘పచ్చ’ గద్దలు.. కోట్లు దండుకున్న ‘తమ్ముళ్లు’
ఇది హిందూపురం 14వ వార్డు పరిధిలోని సడ్లపల్లి పొలం సర్వేనంబర్ 433/11లోని 2.17 ఎకరాల స్థలం. దీనికి 1957 ప్రాంతంలో నల్లోడు అనే వ్యక్తి పేరిట డీ పట్టా మంజూరైంది. ఇది ప్రస్తుతం పట్టణంలో కలిసిపోయింది. ప్రస్తుతం అక్కడ సెంటు రూ.10 లక్షలకు పైగా పలుకుతోంది. 2012లో ఈ భూమిపై కన్నేసిన టీడీపీ నేతలు... పత్రాలు పుట్టించారు. ప్లాట్లుగా వేసి సెంటు రూ.6 లక్షల చొప్పున 58 మందికి విక్రయించారు. కానీ నల్లోడు వంశీయులు తాతల కాలం నాటి తమ భూమికి అక్రమ పట్టా పుట్టించి అమ్ముకుని తమకు అన్యాయం చేశారని న్యాయపోరాటం చేస్తున్నారు. చదవండి: ఆ విషయంలో టీడీపీ ఎందుకు మౌనం దాల్చింది? హిందూపురం(శ్రీసత్యసాయి జిల్లా): భూమిలేని నిరుపేదలకు ప్రభుత్వం డీ–ఫారం పట్టా మంజూరు చేస్తుంది. పట్టా పొందిన వ్యక్తి, ఆ తర్వాత వారి వంశీయులు సదరు భూమిని సాగు చేసుకుని జీవనం సాగించవచ్చు. అంతేకానీ ఇతరులకు విక్రయించే వీలు లేదు. ఈ విషయాన్ని 1977 పీఓటీ యాక్ట్ స్పష్టంగా చెబుతోంది. కానీ హిందూపురంలో డీ–ఫారం పట్టా ఉన్న 2.17 ఎకరాల భూమి తెలుగు తమ్ముళ్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. కనీసం డీ–ఫారం పట్టా పొందిన వ్యక్తి వంశీయులకు కూడా తెలియకుండానే ఆ స్థలం ప్లాట్లుగా మారి ‘తమ్ముళ్ల’కు రూ. కోట్లు కురిపించింది. కొనుగోలు చేసినట్లు పత్రాలు సృష్టించి.. సడ్లపల్లి పొలం సర్వేనంబర్ 433/1లోని 26.84 ఎకరాలను 1957లో ప్రభుత్వం లేబర్ యూనియన్ అధ్యక్షుడు కదిరప్ప పేరిట డీ–ఫారం పట్టా ఇచ్చింది. అతను సంఘంలోని సభ్యులకు ఎకరా, రెండెకరాల చొప్పున కేటాయించి పట్టాలిప్పించాడు. ఈ క్రమంలో 433/11లో 2.17 ఎకరాల భూమిని దళితుడైన నల్లోడు పేరిట ప్రభుత్వం డీ–ఫారం పట్టా మంజూరు చేసింది. ఈ భూమిని 2012లో నల్లోడు వంశీయులైన కొల్లప్ప, పెద్దసింహప్ప, చిన్న నరసింహప్ప నుంచి తాము కొనుగోలు చేసినట్లు కృష్ణయ్య, కాంతమ్మ మరికొందరు పత్రాలు సృష్టించుకున్నారు. ఆ తర్వాత కృష్ణయ్య 2012లో టీడీపీ నాయకులు మంగేష్, పురుషోత్తంరెడ్డికి విక్రయించారు. రూ.కోట్లు పలికే భూమిని కన్వర్షన్ చేయకుండానే టీడీపీ నాయకుడు మంగేష్ ప్లాట్లు వేసి విక్రయాలు సాగించేశారు. సెంటు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల చొప్పున 58 ప్లాట్లు విక్రయించారు. అసైన్డ్ ల్యాండ్ స్వాధీన ప్రక్రియలో భాగంగా బోర్డు పాతుతున్న రెవెన్యూ సిబ్బంది న్యాయం కోసం పోరాటం.. వాస్తవానికి ఆ భూమి పొందిన నల్లోడు అవివాహితుడు. అతను తన అన్న న్యాతప్పతో కలిసి ఉండేవాడు. అతని తదనంతరం ఈ భూమి వారసత్వంగా న్యాతప్ప కుమారులైన కొల్లప్ప తదితరులకు చెందాల్సి ఉంది. కానీ కొల్లప్పతో పాటు అతని అన్నదమ్ములు మృతి చెందిన తర్వాత వారి నుంచి ఆ భూమిని కొనుగోలు చేసినట్లు టీడీపీ నాయకులు పత్రాలు సృష్టించారు. దీనిపై కొల్లప్ప కుమారుడు సూరి అ«ధికారులకు ఫిర్యాదు చేశారు. తమ భూమికి కృష్ణయ్య, కాంతమ్మ, రమేష్ మరికొందరు పేరుతో పత్రాలు సృష్టించి టీడీపీ నాయకులు మంగేష్, పురుషోత్తంరెడ్డి పేరిట రిజిస్టర్ చేసుకున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని న్యాయ పోరాటం చేస్తున్నారు. మా భూమిని లాక్కున్నారు మా ముత్తాత కాలం నుంచి హక్కుగా వస్తున్న 2.17 ఎకరాల భూమిని టీడీపీ నేతలు కబ్జా చేశారు. తప్పుడు పత్రాలు సృష్టించుకుని ప్లాట్లుగా మార్చి విక్రయించారు. న్యాయం చేయాలని 2013 సంవత్సరం నుంచీ అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. కానీ అప్పటి అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో కబ్జా దారులు దర్జాగా లేఅవుట్వేసి స్థలాలు అమ్ముకుంటున్నారు. ఇప్పటికైనా మాకు న్యాయంచేసి ఆ భూమిని మా కుటుంబసభ్యులకు అప్పగించాలి. – సూరి, కొల్లప్ప కుమారుడు, హిందూపురం స్థలాన్ని స్వాధీనం చేసుకుంటున్నాం సర్వేనంబర్ 433/11లోని 2.17 ఎకరాలను అసైన్డ్ల్యాండ్గా గుర్తించాం. సాగుచేసుకుని జీవనం సాగించేందుకు గతంలో నల్లోడు అనే వ్యక్తికి డీపట్టా మంజూరైంది. ఆ తర్వాత వారి వంశీయులు ఎవరూ భూమిని సాగు చేయలేదు. ప్రస్తుతం పట్టణ నడిబొడ్డున ఉన్న ఆ స్థలానికి విలువ పెరిగింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సంబంధిత వారికి రీజెండర్ నోటీసులు జారీ చేసి స్థలాన్ని స్వాదీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభించాం. ఆ స్థలంలో ఎవరూ ప్రవేశించడానికి వీలులేదని బోర్డు నాటించాం. – శ్రీనివాసులు, తహసీల్దార్, హిందూపురం -
భార్య, అత్తపై కత్తితో దాడి
హిందూపురం: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య, అత్తపై కత్తితో దాడి చేసిన ఘటన ఆదివారం హిందూపురంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. స్థానిక మోడల్ కాలనీకి చెందిన శ్రావణ్, గౌతమి దంపతులు. ఆరేళ్ల క్రితం వివాహమైన వీరికి నాలుగేళ్ల బాబు ఉన్నాడు. కొంత కాలంగా భార్య ప్రవర్తనపై అనుమానాలు పెంచుకున్న శ్రావణ్ తరచూ ఆమెతో గొడవపడేవాడు. ఈ విషయంగా పలుమార్లు పోలీసు స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. కౌన్సెలింగ్తో దంపతుల మధ్య విభేదాలను పోలీసులు దూరం చేస్తూ వచ్చారు. అయినా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. చివరకు దంపతులిద్దరూ విడాకుల కోసం న్యాయస్థానం మెట్టు ఎక్కారు. ఈ క్రమంలోనే తల్లి సుశీలమ్మ వద్దకు గౌతమి చేరుకుంది. ఆదివారం తన కొడుకును తనకిచ్చేయాలంటూ అత్తారింటికి వెళ్లి శ్రావణ్ గొడవపడ్డాడు. వాదన శ్రుతి మించడంతో తమ్ముడు నవీన్తో కలిసి కత్తితో శ్రావణ్ దాడి చేసి, పారిపోయాడు. ఘటనలో గౌతమి, ఆమె తల్లి సుశీలమ్మ గాయపడ్డారు. గాయపడ్డ ఇద్దరినీ బంధువులు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై రెండో పట్టణ సీఐ సూర్యనారాయణ కేసు నమోదు చేశారు. (చదవండి: ఆడియో వైరల్: బండ బూతులు తిట్టుకున్న టీడీపీ నాయకులు ) -
ఇదేం సినిమా అనుకున్నావా? బాలకృష్ణ రాజీనామా ఇంకెప్పుడు?
హిందూపురం టౌన్(అనంతపురం జిల్లా): హిందూపురం జిల్లా కేంద్రం అంశాన్ని మూడు గంటల సినిమా అనుకున్నావా అంటూ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై రాజకీయ పార్టీల ఐక్యవేదిక నాయకులు మండిపడ్డారు. స్థానిక ప్రెస్క్లబ్లో సోమవారం రాజకీయ పార్టీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు శ్యామ్, శ్రీరాములు, శ్రీనివాసులు, మున్నా, రవి మాట్లాడుతూ 1983 నుంచి ఏకధాటిగా హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులే ఎమ్మెల్యేగా గెలుస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఇలా నందమూరి వంశాన్నే హిందూపురం ప్రజలు గెలుపిస్తున్నా హిందూపురం ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. చదవండి: ఏబీ వెంకటేశ్వరరావుకు మెమో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం హిందూపురం జిల్లా కోసం అవసరమైతే రాజీనామా చేస్తానన్న బాలకృష్ణ ఇంకెప్పుడు చేస్తారని, ఇంకెప్పుడు పోరాడతారని విమర్శించారు. బాలకృష్ణకు సినిమా షూటింగులు తప్ప ఏ మాత్రం హిందూపురం అభివృద్ధి పట్టలేదన్నారు. చుట్టపు చూపుగా తెలంగాణ నుంచి వచ్చి పోయే బాలకృష్ణకు హిందూపురం ప్రజల సమస్యలు ఏం తెలుస్తాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎన్టీఆర్, చంద్రబాబులు ఎందుకు హిందూపురాన్ని జిల్లా చేయలేకపోయారో చెప్పాలన్నారు. టీడీపీ పార్టీతో పాటు ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురానికి ద్రోహం చేసి ప్రజలను మోసగించారని విమర్శించారు. హిందూపురంలోని ప్రభుత్వ జిల్లా కార్యాలయాలను పుట్టపర్తికి తరలిస్తున్నారని, ఈ చర్యలను మానుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు నాగార్జున, మల్లికార్జున, నారాయణ, నాజీమ్ బాషా, హరికుమార్, కలీం, నూర్ మహమ్మద్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. -
అలా వచ్చారు.. ఇలా వెళ్లారు
హిందూపురం: ఎమ్మెల్యే బాలకృష్ణ ఆదివారం హైదరాబాద్ నుంచి హిందూపురం వచ్చారు. పట్టణంలోని ఓ ఫంక్షన్లో నిర్వహించిన టీడీపీ నాయకుడి కుమార్తె పెళ్లికి హాజరయ్యారు. భోజనం చేసిన తర్వాత సరాసరి హైదరాబాద్కు బయలు దేరి వెళ్లిపోయారు. ఏదైనా మాట్లాడతారేమోనని మీడియా సభ్యులంతా ఎదురు చూసినా ఎమ్మెల్యే బాలకృష్ణ మాత్రం ముఖం చాటేశారు. బయటపడ్డ విబేధాలు పెళ్లి కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటనలో టీడీపీలో ఉన్న వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఫంక్షన్ హాల్లోని ఓ గదిలో బాలయ్య భోజనం చేస్తున్నారు. ఇదే సమయంలో అక్కడున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొర్లకుంట అంజినప్పతో పాటు పట్టణ అధ్యక్షుడు డీఈ రమేష్లను బయటకు వెళ్లిపోవాలని బాలకృష్ణ పర్సన్ పీఏ, కోఆర్డినేటర్ శ్రీనివాసరావు ఆదేశించారు. దీంతో వారు ఆయనపై రుసరుసలాడుతూ బయటకు వచ్చేశారు. అయితే ఫంక్షన్ హాల్ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే బాలకృష్ణ బయటకు వచ్చి కారు ఎక్కారు. అదే సయమంలో శ్రీనివాసరావుపై టీడీపీ నాయకుడు కొల్లకుంట అంజి çనిప్పులు చెరిగారు. ‘నీవు వచ్చినప్పుటి నుంచే పార్టీ నాశనం అవుతోంది... బయట వారి పెత్తనం ఇక్కడేంటి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో శ్రీనివాసరావు, అంజిల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ ఉన్న నాయకులు నాగరాజు, మరికొందరు శ్రీనివాసరావుకు సర్దిచెప్పి పక్కకు తీసుకెళ్లిపోయారు. తేదీ ఖరారు చేయండి.. రాజీమానా చేస్తా హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలంటూ హైకోర్టులో వాజ్యం వేసినట్లు అఖిలపక్ష కన్వీనర్ బాలాజీ మనోహార్ ఎమ్మెల్యే బాలకృష్ణకు తెలిపారు. జిల్లా కేంద్రం కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు కదా ఆ విషయంపై స్పందించాలని కోరారు. అఖిలపక్షం నేతలు తేదీ ఖరారు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పినట్లు బాలాజీ మనోహర్ తెలిపారు. -
రాజకీయ ఉనికి కోసమే బాలకృష్ణ మౌనదీక్ష: మంత్రి శంకర్నారాయణ
సాక్షి, అనంతపురం: రాజకీయ ఉనికి కోసమే బాలకృష్ణ మౌనదీక్ష చేస్తున్నారని మంత్రి శంకర్నారాయణ దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడానికే దీక్ష అంటూ మంత్రి నిప్పులు చెరిగారు. హిందూపురం అభివృద్ధికి బాలకృష్ణ ఏనాడు కృషి చేయలేదన్నారు. చదవండి: సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపిన ముద్రగడ హిందూపురానికి బాలకృష్ణ చుట్టపు చూపుగా వస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు హిందూపురం అభివృద్ధి గుర్తులేదా? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ విశిష్టతను గుర్తించిన ఘనత సీఎం వైఎస్ జగన్దేనని.. విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెట్టి గౌరవించారని మంత్రి శంకర్నారాయణ అన్నారు. -
ఎక్కడయ్యా.... బుల్ బుల్ బాలయ్యా ?
-
కొడిగట్టిన నవ‘దీపం’
అనంతపూర్: ప్రమాదవశాత్తు నీటిలో పడిన బాలుడిని కాపాడబోయి ఓ పండుటాకు రాలిపోయింది. ఉజ్వల భవిష్యత్తు ఉన్న ‘నవదీపం’ కొడిగట్టకుండా ప్రాణాలకు తెగింన వృద్ధుడి సాహసమూ గంగ పాలైంది. పెన్నమ్మ ఒడిలో రెండు నిండు ప్రాణాలు శాశ్వతంగా నిద్రపోయాయి. చౌళరు శోకసంద్రమైంది. వివరాలు.. హిందూపురం మండలం చౌళరుకు చెందిన తలారి నరసింహప్ప కువరుడు నవదీప్ (10) స్థానిక ప్రాథమిక పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం పాఠశాల నుం ఇంటికి చేరుకున్న బాలుడు.. తోటి స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని పెన్నానదిలో ఆడుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ నీటి గుంతలో పడి పోయాడు. ఆ సమయంలో చిన్నారులు గట్టిగా కేకలు వేయడంతో అక్కడికి దగ్గరలోనే ఉన్న వృద్ధుడు నరసింహమూర్తి (65) అప్రమత్తమై వెంటనే నీటిలో దిగాడు. నీటిలోపల బాలుడి కోసం గాలిస్త ఊపిరి ఆడక అతను విగతజీవిగా మారాడు. అప్పటికే చిన్నారుల నుంచి సమాచారం అందుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున పెన్నానదికి చేరుకుని నీటిలో గాలింపు చేపట్టారు. కాసేపటికి వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న హిందూపురం రరల్ పోలీసులు, అగ్నివపక సిబ్బంది, గజ ఈతగాళ్లు అక్కడికి చేరుకుని నీటి గుంతలో గాలింపు చేపట్టారు. రాత్రి 7.30 గంటలకు బాలుడి మృతదేహాన్ని వెలికి తీశారు. ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు నెలకొన్నాయి. వృద్ధుడి సాహసం వృథా కావడంపై పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. బాలుడి మృతదేహం కనిపించగానే కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. -
పెళ్లయిన నెలరోజులకే.. నవవధువు ఆత్మహత్య
సాక్షి, హిందూపురం: నవవధువు ఆత్మహత్య కలకలం రేపింది. అదనపు కట్నం కోసం మెట్టినింటి వారి నుంచి వేధింపులు పెరిగిపోవడంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడిందని పుట్టింటి వారు ఆరోపిస్తున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు... హిందూపురం రైల్వే రోడ్డు ప్రాంతంలో నివాసముంటున్న వెంకటేష్, లక్ష్మిదేవి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు హిందూపురంలోనే వివాహం చేశారు. రెండో కుమార్తె పల్లవి(28)ని పామిడిలో ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్న మల్లికార్జునకు ఇచ్చి ఆగస్ట్ 27న పెళ్లి చేశారు. పెళ్లి సమయంలో కట్నం కింద రూ.లక్ష నగదు, మరో రూ.లక్ష విలువ చేసే బంగారు నగలు అందజేశారు. కోటి ఆశలతో మెట్టినింటికి వెళ్లిన పల్లవిని కొద్దిరోజులకే అదనపు కట్నం కోసం భర్త, అత్త వేధించడం మొదలు పెట్టారు. రోజురోజుకూ వేధింపులు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం పల్లవిని భర్త హిందూపురం తీసుకొచ్చి వదిలి వెళ్లాడు. అదనపు కట్నం ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో మానసికంగా కుంగిపోయిన పల్లవి శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వెళ్లాక ఇంట్లోనే ఫ్యాన్కు ఉరివేసుకుంది. చదవండి: (మానసిక వికలాంగుడిపై లైంగిక దాడి) కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులకు పల్లవి విగతజీవిగా కనిపించింది. భర్త, అత్త వేధింపులు భరించలేకే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు లక్ష్మిదేవి, వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్రీనివాసులు, డీఎస్పీ రమ్య, వన్టౌన్ సీఐ బాలమద్దిలేటి ఆస్పత్రికి వెళ్లి నవ వధువు మృతదేహాన్ని పరిశీలించారు. -
భారత క్రికెట్ జట్టు (దివ్యాంగుల) కెప్టెన్గా వసంతకుమార్
హిందూపురం టౌన్: టీమిండియా దివ్యాంగుల క్రికెట్ టీ-20 జట్టు కెప్టెన్గా హిందూపురానికి చెందిన వై.వసంతకుమార్ ఎంపికయ్యాడు. సోమవారం హైదరాబాద్లో జరిగిన బోర్డ్ ఆఫ్ డిజేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ (బీడీసీఏ) సమావేశంలో సెప్టెంబర్లో దేశంలోని వివిధ స్టేడియాల్లో జరగనున్న ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ టెస్ట్, వన్డే, టీ-20 క్రికెట్ టోరీ్నలకు సంబంధించి జట్లను ప్రకటించారు. మూడు ఫార్మెట్లలోనూ వసంత కుమార్కు ప్రాతిని«ధ్యం దక్కింది. అలాగే టీ-20 జట్టు కెపె్టన్గా ఎంపికయ్యాడు. -
నాకు అప్పగించిన పదవికి వన్నెతెచ్చేలా పనిచేస్తా : మహాలక్ష్మి శ్రీనివాస్
-
విషాదం: రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య
సాక్షి, అనంతపురం: హిందూపురంలో విషాదం చోటుచేసుకుంది. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను లేపాక్షి మండలం కోడిపల్లికి చెందిన దంపతులు గిరిష్, స్వాతిగా గుర్తించారు. పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చంద్రబాబు ఆదేశాలను ధిక్కరించిన టీడీపీ నేతలు
-
హిజ్రాతో దోస్తీ, రూ.3 లక్షలు తీసుకుని దారుణం
హిందూపురం(అనంతపురం): పట్టణ సమీపంలోని కొట్నూరు జాతీయ రహదారిపై ట్రాన్స్జెండర్ నిహారిక (35) శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురైంది. హిందూపురం ఒకటో పట్టణ సీఐ బాలమద్దిలేటి సమాచారం మేరకు.. పరిగి మండలం యర్రగుంటపల్లి చెందిన ట్రాన్స్జెండర్ నిహారిక.. హిందూపురంలోని ఇందిరమ్మ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని భిక్షాటనతో జీవనం సాగిస్తోంది. కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన రాజశేఖర్ ఆమెతో చనువుగా ఉంటూ వచ్చాడు. ఈ క్రమంలోనే నిహారిక తాను దాచుకున్న రూ. 3లక్షలను రాజశేఖర్కు అందజేసింది. శుక్రవారం రాత్రి కొట్నూరు జాతీయ రహదారిపై రాజశేఖర్, నిహారిక కలిసి మద్యం సేవించి, ఘర్షణ పడ్డారు. ఆ సమయంలో కత్తితో నిహారిక గొంతును రాజశేఖర్ కోసేశాడు. అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు శనివారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు సీఐ బాలమద్దిలేటి తెలిపారు. చదవండి: ఘోరం: అందరూ చూస్తుండగానే... యువకుడి నగ్న వీడియోలు రికార్డు చేసి.. -
పోలింగ్ కేంద్రంలో బాలయ్య హంగామా
సాక్షి, హిందూపురం: ఓటేసేందుకు అనంతపురం జిల్లా హిందూపురం రెండో వార్డు చౌడేశ్వరీకాలనీలోని పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన బాలయ్య, ఆయన సతీమణి వసుంధరలు హంగామా చేశారు. క్యూలో నుంచుని ఓటర్లకు నమస్కారాలు చేస్తూ, నవ్వుతూ పలకరిస్తూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు యత్నించారు. మీడియాకు ఫోజులిస్తూ అక్కడి ఓటర్లు, పోలీస్, పోలింగ్ సిబ్బందితో మాట్లాడటం గమనార్హం. ఓటు వేసి అక్కడి పోలింగ్ సిబ్బందిని పలకరించి వారితో ఫొటోలు దిగారు. చదవండి: (కార్యకర్త చెంప చెళ్లుమనిపించిన జేసీ) -
రాత్రి మందు తాగి.. పగలు ప్రజల్ని కొట్టడం
సాక్షి, అనంతపురం: టీడీపీ అభిమానిపై ఎమ్మెల్యే బాలకృష్ణ చేయి చేసుకోవడాన్ని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఖండించారు. శనివారం అనంతపురంలోని 25వ డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహాలక్ష్మి శ్రీనివాస్కు మద్దతుగా గోరంట్ల మాధవ్, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య ప్రచారం నిర్వహించారు. ఎంపీ మాధవ్ మాట్లాడుతూ.. రాత్రి మందు తాగడం.. పగలు ప్రజలను కొట్టడం ఎమ్మెల్యే బాలకృష్ణకు మామూలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి ఓటేసిన పాపానికి అభిమానులు శిక్ష అనుభవించాలా అని ప్రశ్నించారు. చదవండి: (మరోసారి అభిమాని చెంప ఛెళ్లుమనిపించిన బాలయ్య) -
మరోసారి అభిమాని చెంప ఛెళ్లుమనిపించిన బాలయ్య
సాక్షి, హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ ఎప్పుడు ఎలా ఉంటాడోనని అభిమానులు, నాయకులు బెంబేలెత్తుతున్నారు. ఆయన పక్కన నిల్చోవాలన్నా వణికిపోతున్నారు. ఇప్పటికే ఆయన చేతిదెబ్బ రుచి చూసిన, బూతులు తిట్టించుకున్న వాళ్లు కోకొల్లలు. తాజాగా ఓ అభిమాన ఫొటోగ్రాఫర్ ఉత్సాహంతో ఫొటో తీయడంతో బాలయ్య అతని చెంప ఛెళ్లుమనిపించాడు. ఈ ఘటన శనివారం హిందూపురంలోని 9వ వార్డు లక్ష్మీపురంలో చోటు చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహిస్తున్న బాలకృష్ణ అభ్యర్థి ఇంట్లోకి వెళ్లగా.. స్థానికులు ఫొటోలు తీసుకుంటున్నారు. ఎండ వేడిమికి తోడు, ప్రచారంలో జనం కూడా పెద్దగా లేకపోవడంతో చిర్రెత్తిన బాలయ్య.. ఓ అభిమాని ఫొటో క్లిక్మనిపించడంతో సహనం కోల్పోయాడు. ఫొటోలు తీయవద్దు అన్నానా.. అంటూ చెంప మీద కొట్టారు. అభ్యర్థి కుటుంబసభ్యులు అందరినీ బయటకు పంపుతుండగా.. ‘ఏయ్ ఫొటో ఎరేజ్ చెయ్..’అంటూ మరోసారి అతనిపై చేయి చేసుకున్నాడు. ఎన్నికల సమయంలో వ్యతిరేకత వస్తుందని గ్రహించిన టీడీపీ నేతలు అతడిని సముదాయించి తిరిగి బాలకృష్ణతో ఫొటో తీయించి పంపడం కొసమెరుపు. చదవండి: కన్నెత్తి చూడని జనం.. బాలయ్య చిర్రుబుర్రు ఏయ్.. నవ్వకండి.. చిర్రెత్తిన బాలయ్య -
మరోసారి చెంప చెళ్లుమనిపించిన బాలయ్య
-
కన్నెత్తి చూడని జనం.. బాలయ్య చిర్రుబుర్రు
హిందూపురం(అనంతపురం జిల్లా): ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రచారానికి స్పందన కరువైంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రెండు రోజులుగా ఆయన హిందూపురంలోనే మకాం వేసి వీధుల వెంట తిరిగి ప్రచారం చేస్తున్నా జనం కన్నెత్తి చూడటం లేదు. శుక్రవారం బాలకృష్ణ పలు వీధుల్లో ప్రచార రథం ఎక్కి కలియతిరిగినా జనం లేకపోవడంతో రూట్మ్యాప్ సరిగా లేదని స్థానిక నేతలపై చిర్రుబుర్రులాడారు. బాలయ్య మానసిక స్థితి తెలిసిన సీనియర్ నాయకులు మనకెందుకులే అన్నట్లు దగ్గరకు వెళ్లకుండా జాగ్రత్తపడ్డారు. చదవండి: ఏయ్.. నవ్వకండి.. చిర్రెత్తిన బాలయ్య చంద్రబాబుకు భారీ షాక్.. గో బ్యాక్ అంటూ నిరసన -
ఏయ్.. నవ్వకండి.. చిర్రెత్తిన బాలయ్య
-
ఏయ్.. నవ్వకండి.. చిర్రెత్తిన బాలయ్య
హిందూపురం: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందూపురం వచ్చిన ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ సారి టీడీపీ నాయకులపైనే తన దుడుకుతనాన్ని ప్రదర్శించారు. గురువారం సుగూరు ఆలయం వద్ద మీడియాతో మాట్లాడుతుండగా... ఆయన హావభావాలు చూసిన టీడీపీ నేతలతో పాటు ప్రజలు ఫక్కున నవ్వారు. దీనిపై బాలయ్య సీరియస్ అయ్యారు. బాలయ్య ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘యువత చెడిపోతున్నారు. చాలా పొద్దెక్కే వరకు పడుకోవడం.. రాత్రయితే బండ్లేసుకుని అదో రకంగా రోడ్లలో స్ట్రీట్ లైట్లు చూసుకుంటూ.. ఆ.. చుక్కలు లెక్కెడుతూ.. వీళ్లలా పోవడం ఏదో ఢీ కొట్టడం.. (ఈ సమయంలో ఆకాశంలో చూస్తూ చేతులు గాలిలో ఊపుతూ ఊగుతూ మాట్లాడడం చూసిన హిందూపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి, స్థానిక నేతలు, ప్రజలు ఫక్కున నవ్వారు). ఏయ్.. నవ్వకండి.. (బీకే పార్థసారథి వైపు వేలు చూపిస్తూ) ఇట్స్ ఏ సీరియస్ మ్యాటర్(సీరియస్ అంటూ టీడీసీ నేతలు కోరస్ పలికారు). నాకు తెలుసు.. చాలా మంది అలా తయారవుతున్నారు. సో.. జాగ్రత్తగా ఉండు(వేలు చూపిస్తూ) మనుషులు... మనుషులుగా చూస్తే.. లేదా విప్లవమే. నేనూ చాలా చదివాను. రిమ్యాగ్జన్స్, ఫ్రెంచ్ రెవల్యూషన్స్.. ఆ... ఇవన్నీ కూడా. అలాంటి పరిస్థితి తీసుకురావద్దు. ఏం జరిగిందో అప్పుడు రొట్టె చేతిలో పట్టుకుని వెళ్లి.. ప్యాలెస్.. హూ ఇజ్ ద సిక్సిటిన్త్.. ఆ... మహరాజునే బయటకు లాక్కొచ్చి.. తీసుకొచ్చి.. (తల నిలువుగా ఆడిస్తూ.. ) జాగ్రత్తగా ఉండండి. ఆ పరిస్థితి తీసుకురావద్దు. హెచ్చరిస్తున్నా.’’ చదవండి: ఎమ్మెల్యే బాలకృష్ణకు చేదు అనుభవం మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్కు బిగుస్తోన్న ఉచ్చు -
ఎమ్మెల్యే బాలకృష్ణకు చేదు అనుభవం
సాక్షి, అనంతపురం: హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. బాలకృష్ణ చేపట్టిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జనం లేక రోడ్ షో వెలవెలబోయింది. రోడ్ షోలకు ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో బాలయ్య అసహనానికి గురయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే బాలకృష్ణకు ఘోర పరాభవం ఎదురైంది. హిందూపురం నియోజకవర్గంలో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. హిందూపురంలోని 38 స్థానాల్లో 30 చోట్ల వైఎస్సార్ సీపీ మద్దతుదారుల విజయం సాధించిన సంగతి తెలిసిందే. చదవండి: మున్సిపాలిటీల్లోనూ పంచాయతీ ఫలితాలే.. టీడీపీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్కు ఎదురుదెబ్బ -
గంజాయి స్మగ్లింగ్ కేసులో హిందూపురం సీఐ!
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ గంజాయి స్మగ్లింగ్ కేసులో హిందూపురం టూటౌన్ లా అండ్ ఆర్డర్ సీఐ శ్రీరామ్ పేరు బయటపడింది. అనంతపురం జిల్లా ఏఆర్ కానిస్టేబుల్ మోహన్ కృష్ణ ఉప్పల్ నల్ల చెరువు ప్రాంతంలో ఇటీవల రెండు కిలోల గంజాయితో పట్టుబడ్డాడు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టిక్కర్ ఉన్న కారుతో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న మోహన్ కృష్ణతో పాటు మరో ఇద్దరిని ఉప్పల్ ఆబ్కారీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ శ్రీరామ్ పాత్రపై విచారణ జరుపుతున్నామని ఆబ్కారీ పోలీసులు తెలిపారు. కానిస్టేబుల్ మోహన్ కృష్ణతో సీఐకి ఉన్న సంబంధాలపై ఆబ్కారీ ఆరా పోలీసులు ఆరా తీస్తున్నారు. కానిస్టేబుల్ మోహన్ కృష్ణని వారం రోజుల కస్టడీకి కోర్టు అనుమతి కోరారు. గతంలో సీఐ, కానిస్టేబుల్ కలిసి గంజాయి స్మగ్లింగ్ చేసినట్టు ఆరోపణలు రావడంతో.. సీఐ శ్రీరాంపై అనంతపురం రేంజ్ డీజీఐ బదిలీ వేటు వేశారు. -
అపరిమిత డేటా… 30 రోజులు ఉచితం
విజయవాడ : జియో ఫైబర్ తన హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలను ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు పట్టణాలకు విస్తరించింది. తెనాలి, హిందూపూర్, బొబ్బిలి లలో ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 26 పట్టణాల్లో జియో ఫైబర్ హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు అయ్యింది. ఇప్పటికే విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, ఏలూరు, ఒంగోలు, విజయనగరం, శ్రీకాకుళం తదితర పట్టణాల్లో వినియోగదారులు జియో ఫైబర్ సేవలను ఆస్వాదిస్తున్నారు. ఈ సందర్భంగా జియో ఆంధ్రప్రదేశ్ సీఈఓ మండపల్లి మహేష్ కుమార్ మాట్లాడుతూ, ‘మొబైల్ కనెక్టివిటీ పరంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే జియో వేగంగా , విస్తృతంగా దూసుకువెళ్లి నెంబర్ వన్ ఆపరేటర్ గా నిలిచింది. ఇదే పరుగును బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ రంగంలో కూడా కొనసాగించి జియో ఫైబర్ను ఈ పట్టణాల్లో ప్రతీ ఇంటికి తీసుకెళ్లి, ఆ ఇంట్లో ప్రతీ ఒక్కరికీ డిజిటల్ ప్రపంచాన్ని పరిచయం చేయాలనుకుంటున్నాం’ అని అన్నారు. 'నయే ఇండియా కా నయా జోష్' పేరుతో జియో సరికొత్త ప్లాన్స్ ప్రకటించింది. ఈ ప్లాన్స్ రూ.399 నుంచి ప్రారంభమౌతాయి. అపరిమిత డేటా వాడుకోవచ్చు. అంతేకాదు... 150 ఎంబీపీఎస్ స్పీడ్తో 30 రోజుల ఉచిత ట్రయల్ కూడా ఆఫర్ చేస్తోంది. 4కే సెట్ టాప్ బాక్స్ ఉచితం. కొత్త యూజర్లకు 10 ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్ ఉచితం. 30 రోజుల ఫ్రీ ట్రయల్లో భాగంగా 10 ఓటీటీ యాప్స్ యాక్సెస్ చేయొచ్చు. వాయిస్ కాలింగ్ ఉచితం. ఒకవేళ 30 రోజుల్లో సర్వీస్ నచ్చకపోతే కనెక్షన్ వద్దని చెప్పొచ్చు. ఎలాంటి కండీషన్స్ ఉండవు. ఈ 30 రోజుల ఫ్రీ ట్రయల్ కొత్త కస్టమర్లకు మాత్రమే. ఇప్పటికే జియోఫైబర్ కస్టమర్లుగా ఉన్నవారికి కూడా లాయల్టీ బెనిఫిట్స్ లభిస్తాయి. కొత్త టారిఫ్ ప్లాన్స్ ప్రకారం ప్రస్తుత కస్టమర్లను అప్గ్రేడ్ చేసి ఆయా ప్రయోజనాలను అందిస్తారు. ఆసక్తిగల కస్టమర్లు ఇక్కడ తమను తాము నమోదు చేసుకోవచ్చు. https://www.jio.com/registration కొత్తగా ప్రకటించిన జియో ఫైబర్ 4 ప్లాన్ల వివరాలు ఇవిగో... Rs 399 Plan: జియోఫైబర్ రూ.399 ప్లాన్ తీసుకుంటే 30 ఎంబీపీఎస్ స్పీడ్తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. Rs 699 Plan: జియోఫైబర్ రూ.699 ప్లాన్ తీసుకుంటే 100 ఎంబీపీఎస్ స్పీడ్తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. Rs 999 Plan: జియోఫైబర్ రూ.999 ప్లాన్ తీసుకుంటే 150 ఎంబీపీఎస్ స్పీడ్తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రూ.1000 విలువైన 11 ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్స్ ఉచితం. Rs 1499 Plan: జియోఫైబర్ రూ.1499 ప్లాన్ తీసుకుంటే 300 ఎంబీపీఎస్ స్పీడ్తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రూ.1500 విలువైన 12 ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్స్ ఉచితం. -
ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య
కాళ్ల పారాణి ఆరకముందే అత్తింటి ఆరళ్లను మౌనంగా భరించాల్సి వచ్చింది. రోజులు గడుస్తున్నా మార్పు రాలేదు. చివరకు బిడ్డ పుట్టినా కఠిన హృదయాల్లో కనికరం లేకుండా పోయింది. దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ వివాహిత బుధవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అత్తింటి వారే హత్య చేశారంటూ బాధిత కుటుంబసభ్యులు ఆరోపించడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హిందూపురం : మడకశిరకు చెందిన అర్షియా (26) కోటి ఆశలతో వైద్య విద్య కళాశాలలో విద్యార్థిగా చేరింది. మరో రెండేళ్లలో కోర్సుపూర్తి అవుతుందనుకుంటున్న తరుణంలో హిందూపురం ఆర్టీసీ కాలనీకి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి నూరుల్లా పెళ్లి సంబంధం వచ్చింది. మంచి సంబంధమని నమ్మిన అర్షియా తల్లిదండ్రులు 2019 నవంబర్లో నూరుల్లాకు అర్షియానిచ్చి పెళ్లి చేశారు. ఆ సమయంలో కట్నకానుకల కింద రూ.5 లక్షలు, అర కిలో బంగారు నగలు అందజేశారు. 30 రోజులు గడవకుండానే... వివాహనంతరం భవిష్యత్తును అందంగా ఊహించుకుంటూ అత్తారింటిలో అడుగుపెట్టిన అర్షియా అంచనాలు తలకిందులయ్యాయి. ప్రతి విషయంలోనూ భర్తతో పాటు అత్తింటి వారు ఆమెను అనుమానిస్తూ వచ్చారు. నెలదాటకుండానే ఆమె గర్భం దాల్చింది. దీంతో నూరుల్లాలో అనుమానాలు బలపడుతూ వచ్చాయి. ఆమెపై వేధింపులు తారస్థాయికి చేరుకున్నాయి. అదనపు కట్నం కావాలని, కారు, స్థిరాస్తులు రాయించుకురమ్మంటూ భార్యతో గొడవపడుతూ వచ్చేవాడు. పుట్టినరోజే... మంగళవారం అర్షియాకు తల్లిదండ్రులు ఫోన్ చేసి, ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే అప్పటికే ఏం జరిగిందో ఏమో.. ఆమె ఫోన్లో సక్రమంగా మాట్లాడలేదు. తర్వాత ఫోన్ చేస్తానంటూ పెట్టేసింది. బుధవారం ఉదయాన్ని హిందూపురంలోని నింకంపల్లిలో ఉండే బంధువులు ఫోన్ చేసి అర్షియా లేవడం లేదంటూ ఫోన్ చేయడంతో ఆమె తల్లిదండ్రులు, సోదరులు హుటాహుటిన హిందూపురానికి చేరుకున్నారు. మంచంపై నిర్జీవంగా పడిఉన్న అర్షియాను చూసి చలించిపోయారు. ఏం జరిగిందని నూరుల్లాను నిలదీశారు. ఇంటి పైకప్పుకు ఆమె ఉరి వేసుకుందని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇరు కుటుంబసభ్యుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వన్టౌన్ పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి, ఇంటికి తాళాలు వేశారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ వంశీధర్గౌడ్, తహసీల్దార్ శ్రీనివాసులు, సీఐ బాలమద్దిలేటి.. ఇంటిని పరిశీలించి, విచారణ చేశారు. మాకు న్యాయం చేయండి ‘మా కుమార్తెను అనుమానంతో వేధించారు. అదనపు కట్నం కోసమే చంపేశారు.. మాకు న్యాయం చేయండి.. మరో ఆడకూతురు బలి కాకుండా కాపాడండి’ అంటూ డీఎస్పీ, తహసీల్దార్ ఎదుట అర్షియా తల్లి అక్తర్జాన్, అన్న ఇమ్రాన్ కన్నీంటి పర్యంతమయ్యారు. పెళ్లియిన నెలకే అతను అసలు రూపం చూపించాడని ఆరోపించారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, న్యాయం చేకూరుస్తామంటూ బాధితులకు పోలీసులు భరోసానిచ్చారు. -
తండ్రిపై దాడి
-
ప్రేమికుడు మిస్, అతని తండ్రిపై దాడి
సాక్షి, అనంతపురం: హిందూపురంలోని మోడల్ కాలనీలో మంగళవారం ఉదయం దారుణం జరిగింది. చెల్లిని ప్రేమిస్తున్నాడన్న అక్కసుతో అమ్మాయి అన్న కిరాతకంగా ప్రవర్తించాడు. అబ్బాయి తండ్రిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. వివరాలు.. కుటుంబంతో కలిసి చాంద్ బాషా మోడల్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. మంగళవారం ఉదయం అజకర్, అతని స్నేహితుడితో కలిసి చాంద్ బాషా ఇంటిపైకొచ్చి ఘర్షణకు దిగాడు. తన చెల్లితో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్న నీ కొడుకు సైపుల్లాను అంతం చేస్తానని కత్తి చేతబట్టి బెదిరింపులకు దిగాడు. అయితే, ఒకరికొకరు ఇష్టపడుతున్నన్న యువతీయువకులకు పెళ్లి చేద్దామని చాంద్ బాషా నచ్చజెప్నే యత్నం చేయడంతో అజకర్ కోపంతో రగలిపోయాడు. అదే సమయంలో ఇంట్లో సైపుల్లా కూడా లేకపోవడంతో చాంద్ బాషాపై, తన స్నేహితుడితో కలిసి అజకర్ కత్తితో దాడికి దిగాడు. చాంద్ బాషా చేతులు, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. (చదవండి: విషాదం: ప్రేమ జంట ఆత్మహత్య) -
రెచ్చిపోయిన మద్యం మాఫియా: ఎస్ఐపై దాడి
సాక్షి, అనంతపురం : హిందూపురంలో మద్యం మాఫియా రెచ్చిపోయింది. మద్యం అక్రమ విక్రయాలను అడ్డుకున్న ఎక్సైజ్ ఎస్సై సరోజతో సహా ముగ్గురు కానిస్టేబుళ్లపై మద్యం వ్యాపారులు దాడి చేశారు. కర్నాటక మద్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఎస్సై సరోజ ముగ్గురు కానిస్టేబుళ్లతో బోయపేటకు వెళ్లారు. పోలీసులను చూసిన మద్యం మాఫియా వారిపై ఒక్కసారిగా దాడికి దిగారు. ఎస్సై సరోజ ఫోన్ను లాక్కుని దాడికి దిగారు. ఈ దాడిలో ఎస్సైతో సహా ముగ్గురు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ కేసులో బోయపేటకు చెందిన రామాంజి, లక్ష్మినారాయణలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
చేతులేత్తి మొక్కుతా.. వదిలేయండి: ఎంపీ మాధవ్
సాక్షి, హిందూపురం: ‘మీకు చేతులేత్తి మొక్కుతా.. ద్విచక్రవాహనాలను స్టేషన్లో ఎండ పెట్టకుండా వదిలేయండి’ అంటూ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సీఐలు బాలమదిలేటి, మన్సూరుద్దీన్లతో అన్నారు. లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించారంటూ పోలీసులు భారీ ఎత్తున వాహనాలను సీజ్ చేసి పోలీసుస్టేషన్లలో ఉంచారు. అవి ఎండకు ఎండి వానకు తడిసి చెడిపోయే స్థితికి చేరుకున్నాయి. దీనిపై సాక్షిలో కథనం కూడా ప్రచురితమైంది. చదవండి: దశలవారీ మద్యనిషేధంపై కసరత్తు షురూ.. ఈ క్రమంలో గురువారం స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో జరిగిన బియ్యం పంపిణీ కార్యక్రమానికి హాజరైన పోలీసు అధికారులతో ఎంపీ మాట్లాడారు. ఆయా వాహనదారులకు కోర్టు ద్వారా స్టేషన్ జరిమానాలు విధించి వదిలేయాలని కోరారు. ఎక్కువ రోజులు ఎండ పడితే పెట్రోల్ ఉన్న వాహనాల నుంచి మంటలు ఎగిసి.. బెంగళూరు నగరంలో జరిగినట్లుగా ప్రమాదం చోటుచేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాహనాదారులకు ఇబ్బంది కలగకుండా ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ కూడా పోలీసులకు సూచించారు. చదవండి: 'ఆయన హయాంలో తట్ట మట్టి కూడా తీయలేదు' -
బాలయ్యా.. ఇదేందయ్యా!
సాక్షి, అమరావతి: విపత్కర పరిస్థితుల్లోనూ ‘పచ్చ’ నాయకులు తమ బుద్ధి చూపించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు లాక్డౌన్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ మాస్కులు, కూరగాయలు పంపిణీ పేరుతో యథేచ్ఛగా అందరి మధ్య తిరుగుతూ స్థానిక ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్థి, ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత లాక్డౌన్ అమల్లో ఉన్నా నిత్యం రైతుబజార్లు, మార్కెట్లు, ఇతర ప్రాంతాల్లో సంచరిస్తూ మాస్కుల పేరుతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో నిత్యావసర వస్తువుల బ్యాగులపై ఎమ్మెల్యే బాలకృష్ణ బొమ్మలు ముద్రించి పంచుతున్నారు. మచ్చుకు కొన్ని... విశాఖ టీడీపీ మేయర్ అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్న పీలా శ్రీనివాసరావు సరుకులు ఇస్తూ ఫొటోతో పాటు పాంప్లేట్ ఇస్తున్నారిలా.. చిత్తూరు జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి రాజశేఖర్ ఏకంగా చంద్రన్న కానుక సంచులు పంచుతున్నారిలా.. గుంటూరు జిల్లా గుజ్జనగండ్ల ప్రాంతంలో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర పార్టీ కండువాలు, జెండాలతో ప్రచారం చేస్తున్నారిలా.. -
కరోనాతో హిందూపూర్ వాసి మృతి
సాక్షి, అనంతపురం : కరోనా మహమ్మారికి ఆంధ్రప్రదేశ్లో మరొకరు మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య రెండుకు చేరింది. అనంతపురం జిల్లా హిందుపురానికి చెందిన ముస్తాక్ ఖాన్ (56) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు. ఈ మేరకు వైద్యులు అతని మరణాన్ని ధృవీకరించారు. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 164కి చేరింది. అలాగే పాజిటివ్ కేసులుగా నమోదైన వారిలో ఇప్పటి వరకు నలుగురు డిశ్చార్జ్ అయ్యారు. (ఏపీలో తొలి కరోనా మరణం) ఆ 16మందికి కరోనా లేదు కాగా ఢిల్లీలోని జమాత్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన 16మంది హిందూపూర్ వాసులకు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ అని వచ్చినట్లు వైద్య అధికారులు తెలిపారు. వారందర్నీ ఇదివరకే క్వారంటైన్కు తరలించిన విషయం తెలిసిందే. వీరందరికి నెగిటివ్ రావడంతో పట్టణ ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా హిందూపురంలో ఓ మహిళకు పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఆమె బంధువులు, ఆమెను కలిసిన 19మందికి కూడా వైద్య పరీక్షల కోసం నమూనాలను సేకరించి అనంతపురం పంపారు. వీరి ఫలితాలు తెలియాల్సి ఉంది. కాగా కృష్ణా జిల్లా విజయవాడలో తొలి కరోనా మరణం చోటు చేసుకుంది. ఢిల్లీ మత ప్రార్థనకు వెళ్లొచ్చిన యువకుడి నుంచి అతడి తండ్రికి కరోనా సోకడంతో ఆయన మృతి చెందిన విషయం తెలిసిందే. (ఏపీలో 164కు చేరిన కరోనా కేసులు) ఆ ఏడుగురికి కరోనా వైరస్ లేదు బత్తలపల్లి మండల కేంద్రం బత్తలపల్లికి చెందిన ఏడుగురు ముస్లిం మైనార్టీలు ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి రావడంతో కరోనా అనుమానిత లక్షణాలు ఉండచవ్చని క్వారంటైన్కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే వీరికి కోరనా వైరస్ సోకలేదని వైద్య పరీక్షల్లో తేలిందని తహసీల్దార్ ఖతిజిన్కుఫ్రా తెలిపారు. అయితే వీరు 15 రోజుల పాటు ఇంటిలోనే ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బయట తిరగరాదని సూచించారు. -
హిందూపురంలో విచ్చలవిడి నిర్మాణాలు
హిందూపురం: ‘మా వార్డులో రోడ్లు వేయండి.. డ్రెయినేజీ మరమ్మతులు చేపట్టండి. తాగునీటి పైపులు వేయించండి’ అంటూ వేడుకుంటున్న ప్రజలకు హిందూపురం మున్సిపాలిటీ అధికారులు నుంచి ఒకేఒక్క సమాధానం ఎదురవుతోంది. అదే మున్సిపాలిటీలో నిధులు లేవు! జిల్లా కేంద్రం తర్వాత అదేస్థాయిలో గుర్తింపు పొందిన హిందూపురం మున్సిపాలిటీకి స్థానిక ఆదాయ వనరులు భారీగా ఉన్నా.. వాటి పరిరక్షణలో అధికారుల్లో చిత్తశుద్ధి లోపించింది. ఫలితంగా ప్రభుత్వం అందించే నిధులపైనే ఆధారపడి మున్సిపాలిటీ అభివృద్ధిని తిరోగమన దిశలో నడిపిస్తూ వచ్చారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి కొందరు.. మాముళ్ల మత్తులో మరికొందరు అధికారులు హిందూపురం మున్సిపాలిటీ అభివృద్ధిని తుంగలో తొక్కారు. మున్సిపాలిటీకి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న టౌన్ ప్లానింగ్ విభాగం ఈ విషయంలో అగ్రస్థానంలో నిలిచింది. కంటి ముందే అడ్డగోలు నిర్మాణాలు పట్టణ పురపాలక కార్యాలయం పక్కనే రోడ్డుకు ఇరువైపులా వరుసగా ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా వేసిన షెడ్లు మున్సిపల్ అధికారుల వైఫల్యాలను ఎత్తి చూపుతున్నాయి. ఈ షెడ్లులో ఒక్కొక్కటి రూ. 6 వేలు చొప్పున అద్దెకు ఇచ్చారు. పట్టణ నడిబొడ్డున రద్దీ ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి. రైల్వే రోడ్డు లోని పల్లా రెసిడెన్షీ ప్రాంతం, వీడీ రోడ్డులోనూ వరుసగా పూర్తిగా వాణిజ్య సముదాయాల షెడ్లు వెలిశాయి. ఈ ప్రాంతాల్లో రోజూ రూ. లక్షల్లో వ్యాపారాలు సాగుతుంటాయి. లక్ష్మీ థియేటర్, ఆర్టీసీ బస్టాండ్, పట్టుగూళ్ల మార్కెట్ రోడ్డు, రహమత్పురం రోడ్డు, బెంగళూరు రోడ్డు, ఆర్పీజీటీ రోడ్డు ఇలా చెప్పుకుంటూ పోతే పట్టణం మొత్తం ఎలాంటి అనుమతులు లేకుండా వేసిన షెడ్లు దర్శనమిస్తున్నాయి. రోడ్డు పోరంబోకు స్థలాలను ఆక్రమించుకుని షెడ్లు వేసిన ప్రైవేట్ వ్యక్తులు మున్సిపాలిటీకి ఎలాంటి పన్నులు చెల్లించడం లేదు. ఈ అక్రమాలపై మున్సిపల్ అధికారులు దృష్టిసారించలేకపోతున్నారు. వాణిజ్య సముదాయాల నిర్మాణాలతో ఆదాయానికి గండి గత ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ హయాంలో పురం పరిస్థితులు పూర్తిగా క్షీణించిపోయాయి. పట్టణ టౌన్ ప్లానింగ్ విభాగంపై రాజకీయ నాయకులు పెత్తనం సాగిస్తూ వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు పోరంబోకు స్థలాలను సైతం ఆక్రమించుకుని విచ్ఛలవిడిగా వాణిజ్య సముదాయాల షెడ్లు వేసేశారు. నాలుగు వైపులా ఇనుప పట్టీలు ఏర్పాటు చేసి చుట్టూ రేకులు కప్పేసి గదులు గదులుగా దుకాణాలు సిద్ధం చేశారు. ఒక్కొదానికి నెలకు రూ. 5వేల నుంచి రూ. 15 వేల వరకూ అద్దెతో పాటు అడ్వాన్స్ కింద రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకూ వసూలు చేశారు. పట్టణం మొత్తం ఇలాంటి షెడ్లు కోకొల్లలుగా వెలిసాయి. వీటిలో ఏ ఒక్కదానికి టౌన్ ప్లానింగ్ అనుమతులు లేకపోవడం గమనార్హం. విచారణ అనంతరం చర్యలు చేపడతాం పట్టణంలో నిర్మించిన షెడ్లకు సంబంధించి కొన్నింటిపై పన్నులు వసూలు చేస్తున్నాం. మా దృష్టికి రాకుండా నిర్మాణమైన వాటిపై విచారణ చేపట్టి మున్సిపాల్టీకి చెల్లించాల్సిన అన్ని రకాల పన్నులను వారి నుంచి వసూలు చేస్తాం. పన్నులు చెల్లించని వాటిని తొలగింజేందుకు చర్యలు తీసుకుంటాం.– భవానీ ప్రసాద్,మున్సిపల్ కమిషనర్, హిందూపురం -
మనసున్న నేత ఇక్బాల్..
సాక్షి, హిందూపురం: వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. పక్షవాతంతో బాధపడుతున్న టీడీపీ నాయకుడికి ఆపన్నహస్తం అందించారు. అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన టీడీపీ కార్యకర్త తిమ్మారెడ్డి. ఆయనకు పక్షవాతం రావడంతో 4 నెలలుగా మంచానికే పరిమితమయ్యాడు. విషయం తెలుసుకున్న ఇక్బాల్ ఆదివారం తిమ్మారెడ్డి ఇంటికెళ్లి ఆయన్ను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. చికిత్సల కోసం ప్రభుత్వ పరంగా సాయం అందించేందుకు కృషి చేస్తానన్నారు. ఇక్బాల్ చొరవ చూసి టీడీపీ నేతలు ఆశ్చర్యపోయారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే బాలకృష్ణ తిమ్మారెడ్డిని పరామర్శించి ఎలాంటి సాయం అందించకుండా వెళ్లారని పెదవి విరుస్తున్నారు. (చదవండి: ఎమ్మెల్యే బాలకృష్ణకు నిరసన సెగ) -
బాలకృష్ణ గోబ్యాక్ అంటూ నినాదాలు
-
బాలకృష్ణకు సెగ.. ‘గోబ్యాక్’ నినాదాలు
సాక్షి, హిందూపురం: సొంత నియోజకవర్గంలో సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. అనంతపురం జిల్లా హిందూపురంలో బాలకృష్ణ కాన్వాయ్ను ప్రజాసంఘాల నేతలు గురువారం అడ్డుకున్నారు. అధికార వికేంద్రీకరణకు ఎందుకు అడ్డుపడుతున్నారంటూ వారు బాలకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమలో హైకోర్టును అడ్డుకుంటున్న బాలయ్య.. రాయలసీమ ద్రోహి అంటూ నినాదాలు చేశారు. బాలకృష్ణ గోబ్యాక్ అంటూ నినదించారు. -
సీఎం జగన్ కటౌట్పై పూలవర్షం
సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు, వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అన్ని చోట్ల కేక్లు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. జిల్లాలోని హిందూపురంలో వైఎస్సార్సీపీ శ్రేణులు జననేత సీఎం జగన్పై తమకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. నగరంలో ఏర్పాటు చేసిన 60 అడుగుల సీఎం వైఎస్ జగన్ కటౌట్పై హెలికాప్టర్ ద్వారా పులవర్షం కరిపించారు. అనంతరం భారీ కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అలాగే పేద విద్యార్థినీ, విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా బహుజన గాయకుడు ఏపూరి సోమన్న బృందంచే నిర్వహించిన హుషారు పాటల నృత్యలు ప్రజలను ఉత్తేజ పరిచాయి. హిందూపురం పార్లమెంట్ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు నవీన్ నిశ్చల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
సీఎం జగన్ కటౌట్పై పూలవర్షం
-
పోలీసు బూట్లను ముద్దాడిన మాధవ్