వైఎస్ జగన్ను కలిసిన చీఫ్ విప్ కాల్వ | chief whip srinivasulu meets ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ను కలిసిన చీఫ్ విప్ కాల్వ

Published Mon, Sep 1 2014 11:35 AM | Last Updated on Sat, Aug 18 2018 5:15 PM

వైఎస్ జగన్ను కలిసిన చీఫ్ విప్ కాల్వ - Sakshi

వైఎస్ జగన్ను కలిసిన చీఫ్ విప్ కాల్వ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు కలిశారు. రాష్ట్ర విభజన అనంతర సమస్యలపై అసెంబ్లీలో 344 నిబంధన కింద టీడీపీ నోటీసుపై సభలో చర్చిద్దామని కాల్వ శ్రీనివాసులు కోరారు.

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చిద్దామని ఆయన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద ప్రస్తావించారు. అయితే, ఈ అంశం మీద సమగ్రంగా చర్చించాల్సి ఉంటుందని, హడావిడిగా చర్చ వద్దని వైఎస్ జగన్ అన్నారు. అందువల్ల మరో రోజు ఈ అంశంపై చర్చిద్దామని కాల్వ శ్రీనివాసులుకు వైఎస్ జగన్ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement