బోర్డు తిప్పేసిన చిట్ఫండ్, ఫైనాన్స్ సంస్థలు | chitfund companies dupe people | Sakshi
Sakshi News home page

బోర్డు తిప్పేసిన చిట్ఫండ్, ఫైనాన్స్ సంస్థలు

Published Sat, Oct 18 2014 3:18 PM | Last Updated on Sat, Sep 2 2017 3:03 PM

chitfund companies dupe people

చిట్లు, ఫైనాన్స్ పేరుతో జరుగుతున్న మోసాలకు అడ్డులేకుండా పోతోంది. విజయవాడలోను, అనంతపురం జిల్లా ఉరవకొండలోను తాజాగా ఈ తరహా మోసాలు జరిగాయి. విజయవాడలో పది వేలకు లక్ష రూపాయలు, 5 వేలకు 50 వేల రూపాయలు చొప్పున ఇస్తామంటూ డిపాజిట్లు సేకరించిన ఉమమహేశ్వరి చిట్ఫండ్స్ సంస్థ అందరినీ మోసం చేసి బోర్డు తిప్పేసింది. భగత్సింగ్ నగర్ లాడర్ ఫంక్షన్ హాల్లో ఈ డిపాజిట్లు సేకరించారు. ప్రకటన చూసి మహిళలు వేల సంఖ్యలో డిపాజిట్లు సేకరించారు. తీరా బోర్డు తిప్పేయడంతో డిపాజిటర్లు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు అనంతపురం జిల్లా ఉరవకొండలో కూడా చిట్టీల పేరుతో కుచ్చుటోపీ పెట్టారు. బాబా చిట్ఫండ్స్ అనే సంస్థ కోటి రూపాయలకు పైగా టోకరా వేసి బోర్డు తిప్పేసింది. నిర్వాహకులు పరారైపోవడంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement