కార్పొరేట్‌కే ప్రభుత్వ ప్రోత్సాహం | Colleges management community meet ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌కే ప్రభుత్వ ప్రోత్సాహం

Published Mon, Nov 13 2017 5:41 AM | Last Updated on Wed, Jul 25 2018 4:53 PM

Colleges management community meet ys jagan mohan reddy - Sakshi

జగన్‌ను కలసిన ప్రయివేటు పాఠశాలల, కళాశాలల యాజమాన్య సంఘం సభ్యులు 

రాయచోటి రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్‌ పాఠశాలలు, కళాశాలలను ప్రోత్సహిస్తూ తమను వేధిస్తోందని ప్రయివేటు పాఠశాలల, కళాశాలల యాజమాన్యం సంఘం నేతలు జననేత దృష్టికి తెచ్చారు. ప్రొద్దుటూరు బైపాస్‌ రోడ్డు హౌసింగ్‌ కాలనీ వద్ద వారు జగన్‌ను కలసి తమ సమస్యలను విన్నవించారు. ప్రయివేటు పాఠశాలలకు విద్యుత్‌ కనెక్షన్లు కమర్షియల్‌ కేటగిరి –2 నుంచి కేటగిరి–7కు మార్చాలని, ఫైర్‌ రెన్యువల్‌ను ప్రతి సంవత్సరం కాకుండా పదేళ్లుకోసారి చేసుకునేలా వెసలుబాటు కల్పించాలని చెప్పారు. వారి సమస్యలను విన్న జగన్‌..తాము అధికారంలోకి రాగానే అన్నింటిని పరిష్కరిస్తామన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement