corporate schools
-
కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తయారైన ప్రభుత్వ పాఠశాలలు
-
స్కూళ్లల్లో దోపిడీ షురూ..! జోరుగా ముందస్తు అడ్మిషన్లు
సాక్షి, సిటీబ్యూరో: అప్పుడే ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో 2023–24 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు జోరందుకున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం ముగియక ముందే స్కూళ్ల యాజమాన్యాలు వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు మొదలు పెట్టాయి. ముందస్తు› ప్రవేశాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నిలువు దోపిడీ ప్రారంభమైంది. టెక్నో, ఈ టెక్నో, ఈ స్మార్ట్ అంటూ రకరకాల పేర్లతో అడ్మిషన్ల దందాకు దిగాయి.కొన్ని పాఠశాలలు ముందస్తు సీట్ బుక్ చేసుకుంటే ఫీజులో రా యితీ అని తల్లిదండ్రులను మభ్యపెడుతున్నారు. నిబంధనల ప్రకారం విద్యా సంవత్సరం ముగిశాక వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు చేసుకోవాల్సి ఉంటుంది. నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా కొనసాగుతున్నా విద్యాశాఖాధికారులు నిద్రమత్తులో జోగుతుండడం విమర్శలకు తావిస్తోంది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లలో తీవ్ర పోటీ సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లల్లో ప్రవేశాలకు తీవ్ర పోటీ నెలకొంది. ఎల్కేజీ, యూకేజీ సీట్లకు అధిక డిమాండ్ ఉండగా, అతర్వాత తరగతుల్లో సీట్ల ఖాళీలును బట్టి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఫీజులు, అడ్మిషన్ ఫీజు విషయం పక్కకు పెడితే ..అసలు సీటు దక్కడం అనే ప్రశ్నార్ధకంగా తయారైంది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కూడా ఆయా స్కూల్లో పూర్తయినట్లు తెలుస్తోంది. ఒక్కో దరఖాస్తుకు రూ. 1000 నుంచి 2 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఆయా స్కూల్స్లో సీట్లకు రెండింతలు దరఖాస్తులు రావడంతో ప్రతి సీట్కు తీవ్ర పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇష్టారాజ్యమే... కార్పొరేటు, ప్రైవేటు స్కూల్స్లో అడ్మిషన్ల ప్రక్రియ ఇష్టారాజ్యంగా తయారైంది. నిబంధనలు పాటించని యాజమాన్యాలపై విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోకపోవడంతో వారి ఆగడాలకు అడ్డూ..అదుపూ లేకుండా పోతోంది. నర్సరీ నుంచి పదవ తరగతి వరకూ ముందస్తు అడ్మిషన్లకు తెరలేపి.. అందిన కాడికి దండుకుంటున్నాయి. కేవలం నర్సరీకే రూ. 30 వేల నుంచి రూ. 50 వేల వరకూ ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రుల నడ్డి విరుస్తున్నారు. స్కూల్ యూనిఫాం, పుస్తకాలు ముడిపెట్టి ముందుగానే అడ్మిషన్ ఫీజు చేలిస్తేనే సీటు గ్యారంటì హామీ ఇవ్వడం పరిపాటిగా తయారైంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ విద్యా సంస్థ కూడా డొనేషన్లు వసూలు చేయకూడదు. కనిపించని నోటీసు బోర్డు తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ప్రైవేటు స్కూల్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. దీని ఆసరాగా తీసుకున్న కార్పొరేట్, ప్రై వేటు స్కూల్స్ యాజమాన్యాలు నిబంధనలకు నీళ్లొదిలేశాయి. నిబంధనల ప్రకారం పాఠశాలల్లో తాము వసూలు చేసే ఫీజు వివరాలను తరగతుల వారీగా నోటీసు బోర్డులో ఉం చాలి. కానీ, ఈ నిబంధన ఏ ఒక్క పాఠశాలలో కూడా అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ప్రైవేటు టీచర్లకు టార్గెట్ కార్పొరేట్, ప్రై వేటు స్కూళ్లలో అడ్మిషన్లకు యజమాన్యాలు ఆయా సూళ్లలో పనిచేస్తున్న టీచర్లకు సైతం టార్గెట్ పెడుతున్నాయి. ఒక్కొక్కరికి 10 నుంచి 15 అడ్మిషన్లు చేయించాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. టార్గెట్ పూర్తి చేయకుంటే వచ్చే విద్యాసంవత్సరంలో ఉద్యోగానికి ఎసరు తప్పని పరిస్థితి నెలకొంది. ఇదీ చదవండి: Andhra Pradesh: బోధనలో నవశకం -
ప్రాణాలు తీస్తున్న ఫీజులు
సాక్షి, హైదరాబాద్/సాక్షి, రంగారెడ్డి జిల్లా: అడ్డూ అదుపూ లేని కార్పొరేట్ కాలేజీల దోపిడీ, ధనదాహం విద్యార్థుల ప్రాణాల మీదకు తెస్తోంది. ఫీజులు చెల్లించలేని నిస్సహాయ పరిస్థితుల్లో, ప్రైవేటు కాలేజీల వేధింపులు భరించలేక, తల్లిదండ్రుల ఆవేదన చూడలేక బలవన్మరణాలకు, ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఫీజు చెల్లించలేదని ఇంటర్ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో శుక్రవారం హైదరాబాద్ రామాంతపూర్ నారాయణ కాలేజీలో ఓ విద్యార్థి నేత ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. మాదాపూర్లోని మరో కాలేజీలో కొన్ని నెలల క్రితం విద్యార్థి ఆందోళనకు దిగే వరకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం గమనార్హం. రంగారెడ్డి జిల్లాలో ఫీజు చెల్లించే వరకు క్లాసులకు రావొద్దంటూ ఓ విద్యార్థిని వేధించడంతో, విద్యార్థి తీవ్ర మానసిక వేదనకు గురై మీడియాను ఆశ్రయించాడు. ఇలాంటి సంఘటనలెన్నో జరుగుతున్నా ఇంటర్ బోర్డు కానీ, విద్యామంత్రిత్వ శాఖ కానీ స్పందించిన దాఖలాల్లేవని, కిందిస్థాయి సిబ్బంది మొదలు ఉన్నతాధికారుల వరకు ముడుపులు అందడం వల్లే కార్పొరేట్ కాలేజీల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి నిర్వహణ రాష్ట్రంలో 1,606 ప్రైవేటు కాలేజీలున్నాయి. వీటన్నింటికీ ఇంటర్ బోర్డు అనుబంధ గుర్తింపు (అఫ్లియేషన్) ఇస్తుంది. ఇప్పటివరకు 1480 కాలేజీలు అఫ్లియేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వీటిల్లో 643 కాలేజీలకు అనుమతులిచ్చారు. వీటిల్లో సింహభాగం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్న కార్పొరేట్ కాలేజీలే కావడం విశేషం. అఫ్లియేషన్ ఇచ్చేటప్పుడు అనేక అంశాలను ఇంటర్ బోర్డు పరిశీలించాల్సి ఉంటుంది. కాలేజీకి 8 వేల చదరపు అడుగుల స్థలం ఉండాలి. ఆటస్థలం తప్పనిసరి. లేబొరేటరీతో పాటు సెక్షన్కు ఇద్దరు అధ్యాపకులుండాలి. 9 సెక్షన్లకు మించి ఉండకూడదు. ప్రతి సెక్షన్లో 88 సీట్లు అనుమతిస్తారు. భవనానికి ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ ఉండాలి. కానీ చాలా కాలేజీలు ఈ నిబంధనలేవీ పట్టించుకోవడం లేదు. ఇష్టారాజ్యంగా అదనపు సెక్షన్లు నడుపుతున్నారు. ప్రాక్టికల్స్ చేయించిన పాపాన పోవడం లేదు. సైన్స్ గ్రూపులతో పాటు, ఆర్ట్స్, కామర్స్ గ్రూపులూ ఉండాలి. కానీ కార్పొరేట్ కాలేజీల్లో అసలీ గ్రూపులే ఉండటం లేదు. ఇక ఒకటీ అరా కాలేజీల్లో మినహా ఆటస్థలం అనేదే ఉండటం లేదు. కొన్ని కాలేజీలకు ఒకచోట పర్మిషన్ ఉంటే మరోచోట నిర్వహిస్తున్నారు. అరకొరగా ఉండే అధ్యాపక సిబ్బందికి అతి తక్కువ వేతనాలిస్తూ, ఫీజుల విషయంలో విద్యార్థుల్ని మానసిక ఒత్తిడికి గురిచేస్తూ అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. ఆలస్యమైతే అంతే.. ప్రైవేటు జూనియర్ కాలేజీల ఫీజులపై కచ్చితమైన చట్టం లేకపోవడం కార్పొరేట్ కాలేజీల పాలిట వరంగా మారింది. ఐఐటీ, నీట్ ఫౌండేషన్ అంటూ భారీయెత్తున ప్రచారంతో కాలేజీలు విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భవిష్యత్తుపై ఆశతో అనేక కష్టాలు పడుతూ ఆయా కాలేజీల్లో చేర్పిస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని కాలేజీలు ఫీజులు పిండేస్తున్నాయి. కాలేజీని బట్టి కనీస వార్షిక ఫీజు రూ.60 వేలుంటే, గరిష్టంగా రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. చేరిన వెంటనే ఫీజులో సగం కట్టాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. మిగతా మొత్తం రెండు నెలల్లో చెల్లించాలంటున్నారు. వారం రోజులు ఆలస్యమైనా విద్యార్థులకు నరకం చూపిస్తున్నారు. ఫీజు చెల్లించకపోతే క్లాసులో నిలబెడుతున్నారని, క్లాసు నుంచి బయటకు వెళ్లిపొమ్మంటూ అందరిలో అవమానిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులకు పదేపదే మెసేజ్లు పెడుతూ వేధిస్తున్నారు. క్లాసులకు హాజరుకానివ్వడం లేదు. చివరి అస్త్రంగా కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు.. ఉన్నత తరగతుల్లో చేరేందుకు అవసరమైన సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధింపులకు పాల్పడుతూ బలవంతపు వసూళ్లకు దిగుతున్నారు. ఆ సంస్థ గుర్తింపు రద్దు చేయాలి కార్పొరేట్ కాలేజీల ధన దాహం పేద విద్యార్థులకు శాపంగా మారింది. రామంతాపూర్ నారాయణ కాలేజీ ఉదంతమే దీనికి నిదర్శనం. చాలా కాలేజీలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయి. ఇంటర్ బోర్డు తక్షణమే స్పందించాలి. ఈ తరహా దుర్మార్గాలకు అడ్డుకట్ట వేయాలి. నారాయణ కాలేజీలో ఆత్మహత్య ప్రయత్నంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. నారాయణ సంస్థ గుర్తింపు రద్దు చేయాలి. – ప్రవీణ్రెడ్డి (ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి) రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నారాయణ సంస్థలతో పాటు ఇతర కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల కోసం విద్యార్థులను వేధించడం దారుణం. రామంతాపూర్ నారాయణ కళాశాల వేధింపులు విద్యార్థుల ప్రాణాల మీదకు తెచ్చాయి. వేధింపులకు పాల్పడుతున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతాం. ఇప్పటికైనా ప్రభుత్వం, ఇంటర్ బోర్డు అధికారులు.. కార్పొరేట్ కాలేజీల దోపిడీని అడ్డుకోవాలి. – టి. నాగరాజు (ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి) ముడుపుల ఆరోపణలపై విచారణ జరపాలి నారాయణ, చైతన్య కాలేజీలు నడిపే హాస్టళ్ళకు అనుమతుల్లేవని ఇంటర్ బోర్డే తేల్చి చెప్పింది. అయినా ఆ కాలేజీలు య«థేచ్ఛగా హాస్టళ్లు నడుపుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. బోర్డు అధికారులకు వారినుంచి ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలి. – మాచర్ల రామకృష్ణ గౌడ్ (తెలంగాణ ఇంటర్ విద్య పరిరక్షణ కమిటీ కన్వీనర్) చదవండి: అగ్గి రాజేసిన ఫీజు -
40 శాతం పెరిగే..
బాచుపల్లిలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో లలిత్ ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నాడు. ఫస్ట్క్లాస్లో చేరేప్పుడే ఏటా ఎంత ఫీజు పెరుగుతుందో అప్పుడే చెప్పారు. ఈ మేరకు ఏటా 25 శాతం పెరుగుదలతో తల్లిదండ్రులు ఫీజులు చెల్లిస్తున్నారు. 2019లో రూ.3.10 లక్షలు కట్టారు. 2020, 2021లో ఫీజులు పెంచలేదు. కానీ 2022లో ఏకంగా రూ.4.50 లక్షలు అన్నారు. రాష్ట్రంలోని బడ్జెట్ స్కూళ్ళలో 2019లో (కోవిడ్ కన్నా ముందు) కనిష్టంగా రూ.17 వేల నుంచి గరిష్టంగా రూ.33 వేల వరకూ వార్షిక ఫీజులున్నాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇప్పుడవి రూ.25 వేల నుంచి రూ.55 వేల వరకూ పెరిగాయి. ఎల్కేజీ నుంచి 6వ తరగతి వరకూ రూ. 25 వేలు, ఆ తర్వాత టెన్త్ వరకూ రూ.55 వేల వరకూ తీసుకుంటున్నారు. స్కూలును బట్టి ఫీజుల్లో హెచ్చుతగ్గులున్నాయి. సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు స్కూళ్లలో పెరిగిన ఫీజులు తల్లిదండ్రులను బెంబేలెత్తిస్తున్నాయి. ఓ మాదిరి బడ్జెట్ స్కూళ్ల నుంచి కార్పొరేట్ స్కూళ్ల వరకు ఫీజులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఫీజులు సగటున 40 శాతం మేర పెరిగినట్లు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. ఫీజులు, పుస్తకాలు, ఇతరత్రా ఖర్చులు కలిపి ఓ మాదిరి స్కూల్లో సగటున రూ.40 వేలు, కార్పొరేట్ స్కూలైతే రూ.4 లక్షల వరకు వార్షిక ఫీజు లేకుండా అడ్మిషన్ దొరికే పరిస్థితి లేదని అంటున్నారు. కోవిడ్ కాలంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకునేలా పాఠశాలలు ఫీజుల పెంపునకు శ్రీకారం చుట్టాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు డీజిల్ ధర పెరుగుదలను సాకుగా చూపిస్తూ బస్సు ఫీజుల్ని కొన్ని యాజమాన్యాలు రెట్టింపు చేశాయి. ఇక పుస్తకాలు, యూనిఫామ్లకయ్యే ఖర్చు వీటికి అదనం. కాగా జూన్ ఆరంభం నుంచి కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందే 50 శాతం మేర ఫీజులు కట్టేయాలంటూ స్కూళ్లు ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో తాము అప్పులు చేయాల్సి వస్తోందని కొందరు తల్లిదండ్రులు తెలిపారు. నియంత్రణ ఏదీ? ► ఫీజుల నియంత్రణకు 2016లో ఆచార్య తిరుపతి రావు కమిటీని ప్రభుత్వం నియమించింది. తెలంగాణ వ్యాప్తంగా 10,800 ప్రైవేటు స్కూళ్ళలో చదువుతున్న 32 లక్షల మంది విద్యార్థుల పరిస్థితిని ఈ కమిటీ పరిశీలించింది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమబెంగాల్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ సహా 15 రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ఫీజుల నియంత్రణకు తెచ్చిన చట్టాలను కమిటీ పరిశీలించి కొన్ని సిఫారసులు చేసింది. ► దీనిప్రకారం ప్రతి స్కూలు 10 శాతం లోపు ఫీజు పెంచుకోవచ్చు. ఈ పరిమితి దాటి ఫీజులు పెంచే స్కూళ్లు తాము చేసిన ఖర్చు (స్కూలు అభివృద్ధికి, సౌకర్యాల కల్పనకు) ప్రతి పైసాకు లెక్క చూపాలి. బ్యాంకు ద్వారా ఆన్లైన్ లావాదేవీలు జరిగినట్లు ఆధారాలు చూపాలి. వీటిని ఫీజుల రెగ్యులేటరీ కమిటీ పరిశీలిస్తుంది. అవకతవకలుంటే భారీ జరిమానాకు, అవసరమైతే స్కూలు గుర్తింపు రద్దుకు కమిటీ సిఫారసు చేస్తుంది. ► ఈ విధానం అమలు చేస్తే చాలా స్కూళ్ళు 10 శాతం లోబడే ఫీజులు పెంచే వీలుంది. 2018లో తిరుపతి రావు కమిటీ దీనికోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను తయారు చేసింది. దాదాపు 4,500 స్కూళ్ళు తమ ఖర్చులను ఆన్లైన్ ద్వారా చూపాయి. ఇవన్నీ 10 శాతానికి పైగా ఫీజులు పెంచుకునేందుకు అర్హత పొందాయి. అయితే ఈ విధానం ఆ తర్వాత కనుమరుగైంది. ► గత ఏడాది రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం తిరుపతిరావు కమిటీ సిఫారసులతో పాటు మరికొన్ని అంశాలను జోడించి ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చింది. కానీ ఇప్పటివరకు ఫీజుల నియంత్రణ దిశగా అడుగులు పడలేదు. దీంతో ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ బడుల వైపు మొగ్గు కోవిడ్ కారణంగా చితికిపోయిన కుటుంబాలుప్రస్తుత పరిస్థితుల్లో తమ పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లు మాన్పించి, ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేందుకు ఇష్టపడుతున్నాయి. పైగా సర్కారీ బడుల్లో ఈ ఏడాది నుంచి ఇంగ్లిష్ మీడియం కూడా అందుబాటులోకి వస్తుండం, కోవిడ్ కేసులు పెరిగి ప్రైవేటు స్కూళ్ళు మూతపడితే తాము కట్టే ఫీజులూ వృధా అవుతాయనే ఆలోచనతో ప్రభుత్వ స్కూళ్ళలో చేర్పిస్తున్నాయి. ఈ కారణంగా ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు ఇప్పటికే లక్ష దాటాయి. హైదరాబాద్లోని ఒక స్కూల్లో (ఐఏఎస్ ఫౌండేషన్ ప్రత్యేక స్కూలు) నిశాంత్ ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నాడు. 2019లో వార్షిక ఫీజు రూ. 3.50 లక్షలు ఉంది. ఇప్పుడే ఏకంగా రూ.4.10 లక్షలు కట్టమన్నారు. మొత్తం ఫీజు ఒకేసారి కడితే కొంత తగ్గిస్తామన్నారు. 2019లో డీజిల్ ధర లీటర్ రూ.68 ఉంది. ఇప్పుడు రూ.98 అయింది. పాఠశాల బస్సు ఫీజులు 2019లో దూరాన్ని బట్టి రూ.22 నుంచి రూ.48 వేల వరకూ ఉండగా.. ఇప్పుడివి రూ.28 వేల నుంచి రూ.58 వేల వరకూ పెరిగాయి. అప్పులు చేసే పరిస్థితిని నివారించాలి కరోనా నష్టాల పేరుతో ఈ సంవత్సరం ప్రైవేటు స్కూళ్ళు సగటున 40 శాతం మేర ఫీజులు పెంచాయి. డీజిల్ ధరలు పెరిగాయని బస్సు ఫీజులూ విపరీతంగా పెంచారు. పేద, మధ్య తరగతి వర్గాలు పిల్లల చదువు కోసం అప్పులు చేసే దారుణమైన పరిస్థితిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఫీజుల నియంత్రణకు కఠిన చట్టాలు తేవాలి. – టి.నాగరాజు (ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి) ఒకేసారి పెంచేశారు మా పిల్లాడి స్కూల్లో ఫీజు ఒకేసారి 40 శాతం పెంచారు. కోవిడ్ సమయంలో బకాయి పడిన మొత్తంతో పాటు ఈ ఏడాది ఫీజు సగం ఇప్పుడే కట్టమంటున్నారు. బతిమిలాడితే ఒక నెల గడువు ఇచ్చారు. ఫీజు కట్టడం కోసం అప్పు చేయాల్సిన పరిస్థితి ఉంది. – గుర్రం రామకృష్ణ (విద్యార్థి తండ్రి, మల్లెపల్లి, రఘునాథపాలెం మండలం, ఖమ్మం జిల్లా) -
ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులు 75 శాతం
సాక్షి, అమరావతి: స్కూల్ బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్లు (ఎఫ్సీ) రెన్యువల్ చేయించుకునే విషయంలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు నిరాసక్తంగా వ్యవహరిస్తున్నాయి. రాష్ట్రంలో 75 శాతం స్కూల్ బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకోలేదు. కరోనా పరిస్థితులతో దాదాపు ఏడాదిన్నర తరువాత పాఠశాలలను ఇటీవల పునఃప్రారంభించారు. గత ఏడాది కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు లాక్డౌన్ విధించడంతో స్కూల్ బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్లు రెన్యువల్ చేయించుకునే విషయంపై కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. కాగా, రెన్యువల్ గడువు అక్టోబర్ 31వ తేదీతో ముగియనుంది. కానీ ఇప్పటికీ చాలా యాజమాన్యాలు బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ల రెన్యువల్పై ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. కరోనా మూడో వేవ్ వస్తుందా, రాదా అనేదానిపై స్పష్టత వచ్చేవరకు ఈ విషయంలో వేచిచూసే ధోరణి అవలంభిస్తున్నాయి. 6,444 బస్సులకు ఎఫ్సీలు రాష్ట్రంలో మొత్తం 25,236 స్కూల్ బస్సులు ఉన్నాయి. కాగా వాటిలో సెప్టెంబర్ 30 నాటికి కేవలం 6,444 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్లు రెన్యువల్ చేయించారు. 18,792 బస్సులకు ఇంతవరకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు రెన్యువల్ చేయలేదు. ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందిన స్కూల్ బస్సుల వివరాలు జిల్లాల వారీగా ఇలా ఉన్నాయి. -
కార్పొరేట్ బడులెప్పుడు?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గతనెల 16 నుంచి స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు ప్రభుత్వం ఆదేశాలిచ్చినా ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలు వాటిని పట్టించుకోవడం లేదు. అక్కడక్కడా కొన్ని బడ్జెటరీ స్కూళ్లు, కాలేజీలు తప్ప కార్పొరేట్ సంస్థల్లో తరగతులను నిర్వహించడం లేదు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు పనిచేస్తున్నా ప్రైవేటు సంస్థలు మాత్రం పట్టించుకోవడం లేదు. కేవలం తమ విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాలు వినిపించి వాటినే తరగతులుగా చూపిస్తున్నాయి. కాలేజీలు, స్కూళ్లను తెరవకున్నా ఒక్కో విద్యార్థి వద్ద రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నాయి. సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రాష్ట్రంలో 16 వేల వరకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలుండగా వాటిలో 29,61,689 మంది విద్యార్థులున్నారు. 2,500కు పైగా ఉన్న ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో ఫస్టియర్, సెకండియర్ కలిపి 6 లక్షల మంది వరకు విద్యార్థులున్నారు. 90 శాతానికిపైగా సంస్థల్లో ఆన్లైన్ మంత్రాన్నే జపిస్తున్నారు. చాలా ప్రైవేటు యాజమాన్య పాఠశాలలను తెరవడం లేదు. కొన్నిచోట్ల తెరిచినా కొన్ని తరగతులకే పరిమితం చేస్తున్నారు. కార్పొరేట్ సంస్థలు ఆమేరకు కూడా స్కూళ్లు తెరవడం లేదు. ఆన్లైన్ పాఠాలంటూ విద్యార్థులనుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొన్ని సంస్థల్లో మాత్రం ఆన్లైన్ లైవ్ పాఠాలను ప్రారంభించారు. కొన్ని కాలేజీలు తమ సిబ్బందితో కొన్ని పాఠాలను ముందుగా రికార్డు చేయించి వాటినే విద్యార్థులకు వాట్సప్, ఇతర మార్గాల్లో పంపి చూసి చదువుకోండని చెబుతున్నాయి. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇతర పరికరాలున్న వారు పాఠాలను వినగలుగుతున్నా.. శారీరక, మానసిక ఇబ్బందులకు గురవుతున్నారు. చాలామంది విద్యార్థులు తరగతులు లేక, ఆన్లైన్లో వినే అవకాశాల్లేక ఇబ్బందులు పడుతున్నారు. ఫీజులు చెల్లిస్తేనే టీసీలు కరోనా సమయంలో ఆన్లైన్ పాఠాలు కూడా లేకపోవడంతో పలువురు విద్యార్థులు ఆయా సంస్థల్లో మానేసి వేరే సంస్థల్లో చేరాలనుకున్నా ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలు ససేమిరా అంటున్నాయి. తమకు పూర్తి ఫీజు చెల్లిస్తేనే టీసీలు ఇస్తామని చెబుతున్నాయి. అసలు స్కూళ్లు లేక, పాఠాలు లేనప్పుడు ఫీజులు ఎందుకు చెల్లించాలని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నాయి. వేతనాలకు ఎగనామం.. ఉద్యోగాలు తీసివేత కరోనా సమయంలో కాలేజీల్లో తరగతుల నిర్వహణ ఆగిపోవడంతో పలు ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలు సిబ్బందికి వేతనాలు ఇవ్వకుండా ఎగ్గొట్టాయి. వేతనాల గురించి ఒత్తిడి చేసిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. ఇప్పుడు ఆఫ్లైన్ తరగతుల నిర్వహణకు తగిన సిబ్బంది లేకపోవడంతో పలుసంస్థలు స్కూళ్లు తెరవకుండా కాలక్షేపం చేస్తున్నాయి. తొలగించిన సిబ్బందిని తిరిగి పిలిచినా వారు రావడానికి విముఖత చూపుతున్నారు. ఫలితంగా ఆయా సంస్థల్లో నిపుణులైన, అర్హతలు కలిగిన సిబ్బంది లేరు. దీంతో ఎలాంటి సామర్థ్యాలు లేనివారితోనే ఆయా సంస్థలు ఆన్లైన్ అంటూ నెట్టుకొస్తున్నాయి. ఆఫ్లైన్ తరగతులు నిర్వహిస్తే సిబ్బంది జీతభత్యాలతోపాటు నిర్వహణ ఖర్చులు కూడా ఉంటాయి. ఆన్లైన్ అయితే పెద్దగా జీతాలు చెల్లించాల్సిన అవసరం, నిర్వహణ ఖర్చులు లేకపోవడంతో ఎక్కువ సంస్థలు ప్రత్యక్ష తరగతులకు మొగ్గుచూపడం లేదు. ఫీజులు మాత్రం యథాతథంగానే వసూలు చేస్తున్నాయి. విద్యార్థులకు తమ పుస్తకాలు, ఇతర మెటీరియల్ను బలవంతంగా అంటగడుతున్నాయి. కరోనాలో అద్దెభవనాలు ఖాళీచేసిన సంస్థలు ప్రత్యక్ష తరగతులను నిర్వహించడానికి కోవిడ్ ప్రొటోకాల్ నిబంధనలు పాటించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. తరగతికి 20 మందికి మించకుండా ఉండాలని స్పష్టం చేసింది. పలు ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలు తమ విద్యాసంస్థలను అద్దె భవనాల్లో కొనసాగిస్తూ వస్తున్నాయి. కరోనా కారణంగా వాటికి అద్దెలు చెల్లించక ఖాళీ చేశాయి ఇప్పుడు ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు మళ్లీ ఆయా భవనాలను తీసుకోవాల్సి ఉంది. గతంలో అద్దె భవనాల్లో లెక్కకు మించి విద్యార్థులు కూర్చోబెట్టేవి. ఇప్పుడు కోవిడ్ నిబంధనలు పాటించాల్సి రావడంతో ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు స్వస్తి చెబుతున్నాయి. ర్యాంకులకోసం పరిమిత సంఖ్యలో విద్యార్థులకు పాఠాలు కొన్ని కార్పొరేట్ సంస్థలు తమ స్కూళ్లు, కాలేజీల్లో మెరిట్ విద్యార్థుల వరకు ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్నాయి. జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షల్లో ర్యాంకుల కోసం మెరిట్ విద్యార్థులను పరిమిత సంఖ్యలో రప్పించి ప్రత్యేక సిబ్బందితో పాఠాలు చెప్పిస్తున్నాయి. కేవలం ర్యాంకులు వచ్చాయని ప్రచారం చేసుకునే వ్యాపార దృక్పథంతోనే అవి వ్యవహరిస్తున్నాయి. -
‘కార్పొరేట్’కు దీటుగా..
కెరమెరి (ఆసిఫాబాద్): కడెర్ల రంగయ్య.. సావర్ఖెడా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 2010లో ప్రధానోపాధ్యాయుడిగా చేరారు. అదే గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకుని కుటుంబంతో సహా ఉంటున్నారు. పాఠశాలలో చేరినప్పుడు 48 మంది విద్యార్థులు ఉండేవారు. విద్యార్థుల తల్లిదండ్రులను ఒప్పించి చాలా మంది పిల్లలను సర్కారు బడిలో చేర్పించారు. దీంతో ప్రస్తుతం 280 విద్యార్థులు ఉన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లకు తీసిపోని స్కూల్ను తీర్చిదిద్దారు. ఈ పాఠశాలలో చదివిన 70 మంది విద్యార్థులు గురుకులాల్లో, ఆరుగురు చుక్కా రామయ్య ట్రస్ట్లో సీట్లు సాధించారు. ప్రొజెక్టర్ ద్వారా తరగతులు చెబుతారు. సావర్ఖెడాలో ఎఫ్ఎం సావర్ఖెడా కార్యక్రమాన్ని ప్రారంభించారు. గుడిలో మైక్ పెట్టి రోజూ పాఠాలు బోధిస్తున్నారు. ఘర్ బన్గయా విద్యాలయ, ప్రేయర్ ఎట్ చౌరస్తా వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రోజూ ఉదయం 9 గంటలకు ఇళ్లల్లోనే విద్యార్థులు నిల్చుని ప్రార్థన చేస్తుంటారు. గ్రామంలో మద్యపాన నిషేధం కోసం రంగయ్య ఒక రోజు నిరాహర దీక్ష చేపట్టి మద్యపాన నిషేధం అమలయ్యేలా చూశారు. డ్రాపౌట్లు తగ్గడంతో బాల్యవివాహాలు తగ్గాయి. రంగయ్య సతీమణి వీణ కూడా గ్రామంలో రెండేళ్ల పాటు విద్యార్థులకు ఉచితంగా విద్యా బోధన చేశారు. రంగయ్య కూతురు అక్షర అదే పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి చదువుకుంది. కుమారుడు అభిరాం ఇదే పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. డ్రాయింగ్ షీట్లపై పాఠాలు రాసి గ్రామంలోని ఇళ్ల గోడలపై అతికించారు రంగయ్య. ఉదయం లేవగానే విద్యార్థులు గోడపై ఉన్న పాఠాలను చదువుకుంటున్నారు. మరింత ఉత్సాహం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు, స్నేహితుల సహకారంతో ఈ అవార్డుకు ఎంపికయ్యాను. ఈ అవార్డు వారికే అంకితం. మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు ఈ అవార్డు ఎంతో దోహదపడుతుంది. – కడెర్ల రంగయ్య, ప్రధానోపాధ్యాయుడు -
ఇప్పుడు కూడా కార్పొరేట్ యాజమాన్యాల కక్కుర్తి..!
ప్రైవేటు ఉద్యోగి అయిన సురేశ్ కుమారుడు వర్షిత్. ఓ కార్పొరేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. వార్షిక ఫీజు రూ.77 వేలు. అందులో ఇప్పటికే రూ.35 వేలు కట్టేశారు. కరోనా ఎఫెక్ట్తో ఉద్యోగం కోల్పోయి ఇబ్బందులు పడుతున్నామని,ఫీజు తగ్గించాలని ప్రిన్సిపాల్ను కోరినా ప్రయోజనం లేదు. మొత్తం చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఫీజు కట్టకుంటే హాల్ టికెట్ ఇవ్వబోమని, పరీక్షలు రాయనివ్వమని అంటున్నారు. దీంతో ఏం చేయాలో అర్థంకాక సురేశ్ అప్పుల వేటలో పడ్డారు. సాక్షి, హైదరాబాద్: ఇంతటి కరోనా సమయం లోనూ రాష్ట్రంలోని కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల దోపిడీ కొనసాగుతోంది. ఏదో ఒకలా ఫీజులు వసూలు చేసేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. టెన్త్ పరీక్షలు రద్దయినా.. మిగతా తరగతులకు పరీక్షలు ఉంటాయని విద్యార్థుల తల్లిదండ్రులకు మెసేజీలు పెడుతున్నాయి. ఫీజులు పూర్తిగా కట్టాలని ఒత్తిడి తెస్తున్నాయి. ఫీజుల కోసం టీచర్లతో ఫోన్లు చేయించడం, వినకుంటే పరీక్షలు రాయనివ్వబోమని, పైతరగతికి పంపబోమని బెదిరించడం చేస్తున్నాయి. అసలే కరోనా ప్రభావంతో ఆదాయం తగ్గి, ఖర్చులు పెరిగి ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు.. చివరికి అప్పులు చేసైనా ఫీజులు కడుతున్నారు. మరోవైపు పలు కాలేజీలు ఇంటర్ విద్యార్థులకు జేఈఈ కోచింగ్ పేరిట ప్రత్యక్ష బోధనకు రావాలని ఒత్తిడి తెస్తున్నాయి. వినకుంటే తల్లిదండ్రులను వేధిస్తున్నాయి. ‘ఫీజు’ బాధలో లక్షల మంది తల్లిదండ్రులు కరోనా ఎఫెక్ట్, లాక్డౌన్ పరిస్థితులతో సుమారు లక్షన్నర వరకు ప్రైవేటు టీచర్లు, లెక్చరర్లు, మరో 2 లక్షల మంది వరకు ఇతర రంగాల వారు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు దూరమయ్యారు. కుటుంబం గడవటమే కష్టంగా మారిన పరిస్థితుల్లో వారు పిల్లల ఫీజుల కోసం తంటాలు పడాల్సి వస్తోంది. పరీక్షల తర్వాత టీసీ తీసుకునేప్పటి వరకు ఫీజుల సొమ్మంతా చెల్లిస్తామంటున్నా యాజమాన్యాలు ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు కడితేనే పిల్లలకు హాల్ టికెట్లు ఇస్తామని, పరీక్షలు రాయనిస్తామని అంటున్నాయి. టెన్త్ విద్యార్థులపైనా.. పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం పరీక్షలు రద్దు చేసింది. ఫార్మేటివ్ అసెస్మెంట్–1 (ఎఫ్ఏ) మార్కుల ఆధారంగా ఫైనల్ మార్కులు ఇచ్చే ఆలోచనలు చేస్తోంది. స్కూళ్లు ఇదే అదనుగా ఫీజు మొత్తం వసూలు చేసుకునే పనిలో పడ్డాయి. ఫీజులు కడితేనే ఎఫ్ఏ–1 మార్కులను ప్రభుత్వానికి పంపుతామని బెదిరిస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సిబ్బంది అంతంతే.. అయినా పూర్తి ఫీజులు రాష్ట్రంలో 1,586 ప్రైవేటు జూనియర్ కాలేజీలుంటే అందులో కార్పొరేట్ కాలేజీలే 700పైగా ఉన్నాయి. ప్రైవేటు స్కూళ్లు 10,807 ఉంటే.. అందులో 4 వేల వరకు బడా ప్రైవేటు స్కూళ్లు, మరో 2 వేల వరకు కార్పొరేట్ స్కూళ్లు, మిగతావి చిన్న పాఠశాలు. కాలేజీల్లో క్యాంపస్, బ్రాంచీని బట్టి రూ.50 వేల నుంచి రూ.1.85 లక్షల వరకు ఫీజు వసూలు చేస్తున్నాయి. స్కూళ్లలో రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నాయి. అయితే కరోనా కారణంగా.. చాలా స్కూళ్లు, కాలేజీలు 75 శాతం సిబ్బందిని తొలగించి, మిగతా 25 శాతం మందితోనే క్లాసులు చెప్తున్నాయి. ప్రత్యక్ష బోధన మొదలైనా వారిని తిరిగి విధుల్లోకి తీసుకోలేదు. ఈ 25 శాతం మంది సిబ్బందికి కూడా అరకొర వేతనాలే చెల్లిస్తున్నాయి. కానీ విద్యార్థుల నుంచి మాత్రం పూర్తి ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇంత జరుగుతున్న విద్యా శాఖ గానీ, ప్రభుత్వంగానీ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల నుంచి నెలవారీ ట్యూషన్ ఫీజులు తీసుకోవాలంటూ గతంలో జీవో 46 జారీ చేసినా.. అది అమలుకాలేదు. అసలు స్కూళ్లలో ఎందరు టీచర్లు ఉన్నారు, ఎందరిని తొలగించారు, ఆన్లైన్ బోధన ఎంత మంది చేశారు, విద్యార్థులకు ఏ మేర పాఠాలు జరుగుతున్నాయన్న దానిపై విద్యాశాఖ పట్టించుకున్న దాఖలాలు లేవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని బడా, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల్లో అడ్డగోలు ఫీజుల వసూళ్లపై ఇటు పాఠశాల విద్యా శాఖకు, అటు ఇంటర్ బోర్డుకు రోజూ పదుల సంఖ్యలో ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ఇప్పటికైనా ఫీజుల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని, తగిన చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. చదవండి: ఇసుక తోడేళ్ల రాక్షసం..కాపు కాసి కత్తిపోట్లు..! -
వేధించే స్కూళ్లకు పాఠం
సాక్షి, హైదారబాద్: ‘కారణం చెప్పకుండా పిల్లల్ని ఒక్కసారిగా చదువుకి దూరం చేస్తే.. తల్లిదండ్రుల మనసు ఎంత క్షోభిస్తుందో అర్థం చేసుకోండి’ అంటూ ఆమె చెమర్చిన కళ్లతో ప్రశ్నిస్తుంటే.. నగరంలో పలువురు తల్లిదండ్రుల కళ్లు తడిదేరాయి. ఎందరో మధ్యతరగతి పేరెంట్స్కి పిల్లల కోసం చదువు‘కొనే’ తమ కష్టాలు గుర్తొచ్చాయి కార్పొరేట్ స్కూళ్ల కాఠిన్యంపై ధ్వజమెత్తారు సినీ సెలబ్రిటీ జంట శివబాలాజీ, స్వప్నమాధురి దంపతులు. కొన్ని స్కూళ్ల యాజమాన్యాల నిర్వాకాలను తప్పనిసరి భరించే ఎందరో పేరెంట్స్కు భిన్నంగా సిటీలో తొలిసారిగా స్కూల్పై ఈ తరహా పోరాటం చేసిన పేరెంట్స్గా, స్కూల్ నుంచి తీసేసిన వందలాది మంది పిల్లలకు అండగా నిలిచారు.. తీసేసిన పిల్లల్ని తిరిగి చేర్చుకునేలా చేసి గెలిచారు. ఈ నేపథ్యంలో స్వప్నమాధురితో సంభాషించినప్పుడు.. పంచుకున్న విషయాలు ఆమె మాటల్లోనే.. ♦ప్రీ మిడ్టర్మ్ పరీక్షల కోసం రివిజన్స్ జరుగుతున్న సమయంలో.. స్కూల్లో ఎనిమిదేళ్లుగా చదువుతున్న మా పిల్లల్ని ఆకస్మికంగా ఆన్లైన్ క్లాసులకు దూరం చేశారు. కారణం ఏంటని ఫ్రంట్ ఆఫీస్ వాళ్లకి ఫోన్ చేసి అడిగాం. అకౌంట్ డిపార్ట్మెంట్ని కాంటాక్ట్ చేయమన్నారు. అక్కడ నుంచీ రిప్లై లేదు. ♦మన సైడ్ నుంచి ఏ తప్పు ఉండకూడదని కంటిన్యూగా ఫోన్స్ చేస్తున్నా ‘నో రెస్పాన్స్’.. ఫ్రంట్ ఆఫీస్కి కాల్ చేసి ఫోన్ చేసి, మెయిల్కి రిప్లై రావడం లేదంటే.. ఫీజు విషయమై ఉంటుందన్నారు. (శివ బాలాజీ ఫిర్యాదుపై హెచ్ఆర్సీ స్పందన) ♦ఏదైనా సరే మాకు చెప్పాలి కదా.. ఏదీ చెప్పకుండా సడెన్గా ఇలా చేయడం ఏమిటనడిగితే ప్రిన్సిపాల్తో మాట్లాడిస్తామని చెబుతూ వచ్చారు. అదీ జరగలేదు. ♦కొంత మంది తల్లిదండ్రులు గ్రూప్గా ఏర్పడి ఫీజులు తగ్గించమని అడగడం, ఆ గ్రూప్లో నేనూ ఉండటం వల్లే ఇలా చేశారని ఆ తర్వాత వారి స్పందన ద్వారా అర్థమైంది. ఫీజు తగ్గించమని అడగడం తప్పా? ♦కరోనా కారణంగా ప్రస్తుతం చాలా మంది ఆర్థిక పరిస్థితులు బాగోలేవు. ఆన్లైన్ క్లాసులంటే.. ల్యాప్ టాప్ కొనాలి. పనులు మానేసి కొన్ని గంటల పాటు సమయాన్ని పిల్లలతో గడపాలి.. ఇవన్నీ సమస్యలున్నాయి. కాబట్టి ఫీజు తగ్గించమని అడగడానికి వందల మంది పేరెంట్స్ కలిసి గ్రూప్గా ఏర్పడ్డారు. ♦ఆ గ్రూప్లో నన్నూ యాడ్ చేశారు. మేమైతే ఫస్ట్ టర్మ్ ఫీజు పూర్తిగా కట్టేశాం అయినా కానీ కట్టలేని వారి గురించీ ఆలోచించాలి కదా.. అందులోనూ వీరెవరూ మొత్తం ఫీజు కట్టం అనలేదు. కాస్త తగ్గించమన్నారంతే. ♦వాళ్లకు కనీసం రెస్పాన్స్ ఇవ్వాలి కదా? తగ్గిస్తున్నామనో.. తగ్గించమనో చెప్పాలి కదా? జూన్లో గ్రూప్ తరఫున మెయిల్ పెడితే ‘మీరు గ్రూప్గా అడిగితే అసలు మేం కన్సిడర్ చేయం’ అంటూ ఆగస్టు 12న రిప్లై వచ్చింది. ♦దాంతో పర్సనల్గా డైరెక్టర్, ప్రిన్సిపాల్ని అడ్రస్ చేస్తూ ఒక లెటర్ రాశాం. పేరెంట్స్ని తప్పుగా చూడవద్దు. ఈ సమస్య లేకపోతే ఎవరూ ఇలాంటి రిక్వెస్ట్ పెట్టేవారు కాదు అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశాం. ♦విచిత్రమేమిటంటే నేనేమీ నా పిల్లల ఫీజు విషయంలో తగ్గించాలని అడగలేదు. అయినా నా పిల్లలతో పాటు గ్రూప్లో ఉన్న వందలాది మంది పిల్లల్ని క్లాసులకు దూరం చేశారు. పైగా..‘మిగతా పేరెంట్స్ని ఫీజు కట్టకుండా ఆపుతున్నారు మీ మీద యాక్షన్ తీసుకుంటా’మంటూ మాకు మెయిల్ పెట్టారు. ♦నా పిల్లల్ని ఎందుకు తీశారు? కమ్యూనికేషన్ ఎందుకు బ్లాక్ చేసేశారు? మొత్తం ఫీజు కట్టేశాక కూడా నా తప్పు ఏమిటి? ఒక పేరెంట్గా నేను అడిగితే నా మీద పర్సనల్గా ఎందుకు యాక్షన్ తీసుకుంటామంటున్నారు? అంటూ ప్రశ్నలు అడిగితే రిప్లై లేదు. దాదాపు 3 వారాల పాటు చూసి ఇక వేరే గత్యంతరం లేక మానవ హక్కుల కమిషన్ని ఆశ్రయించాం. హక్కులేమీ లేవా? పిల్లలను స్కూల్లో చదివించే తల్లిదండ్రులకు తమకంటూ కొన్ని హక్కులు ఉంటాయి కదా. ‘మీ వైపు నుంచి ఈ తప్పు జరిగింది.. దాంతో మీ పిల్లల్ని తీసేస్తున్నాం’ అంటూ నోటిస్ ఇచ్చి దానికి స్పందించకపోతే అప్పుడు యాక్షన్ తీసుకోవచ్చు. ►అంతేగాని ఏకపక్షంగా చెప్పాపెట్టకుండా తీసేసి ఎందుకు అలా చేయాల్సి వచి్చందో కూడా సమాచారం ఇవ్వకపోతే ఎలా? ‘ఈ విషయంలో స్కూల్ తప్పేమీ లేదని తేలింది. స్వప్పమాధురి, శివబాలాజీ మీడియా పబ్లిసిటీ కోసమే డ్రామా ఆడుతున్నారు’ అంటూ మిగిలిన పేరెంట్స్ను తప్పుదారి పట్టించేలా స్కూల్ నుంచి మెయిల్స్ పెట్టారు. పిల్లల భవిష్యత్తో డ్రామాలు ఆడతామా? అంత అవసరం మాకేంటి? వదిలేది లేదు.. ప్రస్తుతం చాలా మంది తీసేసిన పిల్లల్ని తిరిగి క్లాసుల్లోకి తీసుకున్నారు. అయినప్పటికీ దీన్ని వదిలేది లేదు. మా పిల్లల్ని ఎందుకు తీసేశారు? మాకు కారణం కావాలి. మాకు నగరం నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి ఫోన్లు వస్తున్నాయి.. ఎందరో తల్లిదండ్రులు ఫోన్ చేస్తూ కరోనా నేపథ్యంలో తమ కష్టాలు, స్కూళ్ల యాజమాన్యాలతో తమకు ఏర్పడుతున్న సమస్యలు చెబుతున్నారు. వారందరికీ మనోధైర్యం ఇచ్చేలా హెచ్ఆర్సీ జడ్జిమెంట్ రావాలి. ప్రతి స్కూల్కి ఇదొక పాఠం అవ్వాలి. కష్టపడి పిల్లల్ని చదివించే పేరెంట్స్ని అవస్థలు పెట్టడం తప్పు అని స్కూల్స్ తెలుసుకోవాలి. -
‘కార్పొరేట్’ దందా!
దిల్సుఖ్నగర్కు చెందిన వర్షశ్రీ చైతన్యపురిలోని ఓ కార్పొరేట్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది. ప్రతిరోజు ఆన్ లైన్ క్లాస్లకు హాజరవుతోంది. రెండ్రోజుల క్రితం ఆన్ లైన్ క్లాస్ పూర్తయ్యే సమయంలో ‘స్కూల్లో మాడ్యూల్స్ అందుబాటులో ఉన్నాయి. ఒక్కో పుస్తకం రూ.1,500 డబ్బులు చెల్లించి వాటిని తీసుకొని ప్రాక్టీస్ చేసుకోవాలి’అని క్లాస్ టీచర్ సూచించారు. దీంతో మాడ్యూల్స్ కొనుగోలు చేసేందుకు వర్షశ్రీ తల్లిని ఒత్తిడి చేసి స్కూల్కు వెళ్లి మాడ్యూల్స్ కొనుగోలు చేసింది. సాక్షి, హైదరాబాద్ : కరోనా వేళ ప్రైవేటు పాఠశాలలు సరికొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టాయి. కోవిడ్–19 కారణంగా పాఠశాలలు మూత బడటంతో విద్యార్థులకు ఆన్ లైన్ లో బోధన సాగిస్తున్న యాజమాన్యాలు.. ఇప్పుడు అభ్యసనా కార్యక్రమాల కింద ప్రత్యేకంగా మాడ్యూల్స్ రూపొందించి విక్ర యిస్తున్నాయి. వాస్తవా నికి పాఠ్య పుస్తకాల్లో ఉన్న అంశాలనే ఇందులో ప్రస్తావించినప్ప టికీ.. ముఖ్యమైన అంశాలను వరుసగా చేర్చి పుస్తక రూపంలో మాడ్యూల్స్ పేరిట తీసుకు వస్తున్నాయి. కొన్ని పాఠశాలలు ఒక్కో సబ్జె క్టుకు ఒక్కో మాడ్యూల్ను రూపొందిం చగా... మరికొన్ని పాఠశాలలు లాంగ్వేజెస్ ను ఒక పుస్తకంగా, మిగతా సబ్జెక్టులను మరో పుస్త కంగా తీసుకువచ్చాయి. వీటి ధర లను రూ.1,500–3,000 వరకు నిర్ధేశించి విద్యా ర్థులకు అంటగడుతున్నాయి. హైస్కూల్ విద్యార్థులకే... ప్రస్తుతం పాఠశాలల్లో ఎక్కువగా హైస్కూల్ పిల్లలకే ఈ మాడ్యూల్స్ రూపొందించాయి. 8, 9, 10 తరగతుల విద్యార్థుల సబ్జెక్టుల ఆధారంగా ఈ స్పెషల్ బుక్స్ను అందు బాటులోకి తెచ్చారు. ఈ పుస్తకాలను పాఠశాల యాజమాన్యాలే ముద్రిస్తుండటంతో వారు నిర్ధేశించిన ధరలే అచ్చు రూపంలో వస్తున్నాయి. విద్యార్థులకు పాఠ్యాంశం అభ్యసన కార్యక్రమాల కోసం ప్రత్యేక ప్రాక్టీస్ మంచిదే అయినా.. ఇంతపెద్ద మొత్తంలో ధరలు నిర్ధేశించి దండుకోవడాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు తప్పుపడుతున్నారు. రూ.వంద కూడా వెలకట్టలేని పుస్తకాలపై వేల రూపాయలు డిమాండ్ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైౖ వేటు పాఠశాలలపై విద్యాశాఖ అజమాయిషీ కోల్పోతోందని, ఫలితంగా యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అన్నింటినీ వ్యాపార కోణంలో సాగిస్తున్నాయని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. -
ఆన్లైన్ పాఠాలతో ఒత్తిడి
సాక్షి, సిటీబ్యూరో: ప్రణీత్ పదో తరగతి స్టూడెంట్. చాలా చురుకైన విద్యార్థి. అతడు ఎక్కడ ఉంటే అక్కడ సందడిగా ఉంటుంది. కానీ కొద్ది రోజులుగా అతడు మౌనంగా ఉంటున్నాడు. ఇంట్లో ఎవరితోనూ మాట్లాడటం లేదు. సాధారణంగా ఉదయం ఆరింటికి నిద్రలేచి చక్కగా రెడీ అయి స్కూల్కు వెళ్లేవాడు. ఇప్పుడు ఉదయం 8 గంటలు దాటినా లేవలేకపోతున్నాడు. నిద్ర కళ్లతోనే కంప్యూటర్ ముందు కూర్చుని ఆన్లైన్ తరగతులకు హాజరవుతాడు. అతడి ప్రవర్తనలో వచ్చిన మార్పుతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. మానసిక నిపుణులను సంప్రదించారు. సహజమైన స్కూల్ వాతావరణానికి భిన్నంగా ఆన్లైన్ పాఠాలకు హాజరుకావడంతో తీవ్రమైన ఒత్తిడికి గురైనట్లు మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలా.. ఒక్క ప్రణీత్ మాత్రమే కాదు. చాలా మంది పిల్లలు ఇలాంటి మానసిక స్థితినే ఎదుర్కొంటున్నారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో ప్రైవేట్ స్కూళ్లు ప్రస్తుతం ఆన్లైన్ క్లాస్లను నిర్వహిస్తున్నాయి. కొన్ని స్కూళ్లలో ఒకటో తరగతి నుంచే ఈ బోధన కొనసాగుతుండగా మరికొన్ని స్కూళ్లు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా నెలకొన్న పరిస్థితులతో పిల్లల చదువులే కాకుండా విద్యాసంస్థల మనుగడ కూడా ఇప్పుడు ఆన్లైన్పై ఆధారపడి ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న కంప్యూటర్ పాఠాలు పిల్లలపై ఒత్తిడిని తీవ్రతరం చేస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోధనా పద్ధతిలో మార్పు అవసరమని సూచిస్తున్నారు. క్లాస్ రూమ్ తరహాకు భిన్నంగా ఇష్టాగోష్టి పద్ధతిలో ఆన్లైన్ విద్యాబోధన ఉండాలని అభిప్రాయడుతున్నారు. వికాసంపై వేటు.. ♦ ఆన్లైన్ క్లాసులతో పిల్లలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కంప్యూటర్కు అతుక్కుపోతున్నారు. కొంతమంది మొబైల్ ఫోన్లలో క్లాసులకు హాజరవుతున్నారు. దీంతో కేవలం ఒక డివైజ్పై దృష్టి సారించి గంటల తరబడి కూర్చోవడం వల్ల పిల్లల సృజనాత్మకత దెబ్బతింటుంది. ♦ చాలా మంది పిల్లలు కళ్లు పొడిబారడం, తలనొప్పి, వెన్నెముక నొప్పి వంటి శారీరక ఇబ్బందులకు గురవుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ♦ మెదడు తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది. ♦ కొత్త విషయాలను నేర్చుకొనే సామర్థ్యం దెబ్బతింటుంది. ♦చాలా మంది పిల్లలు కంప్యూటర్ ముందు కూర్చున్నప్పటికీ టీచర్లు చెప్పే పాఠాలను అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏకాగ్రత లోపిస్తుందని మానసిక వైద్యులు అభిప్రాయపడుతున్నారు. పిల్లల భాగస్వామ్యం తప్పనిసరి.. విశాలమైన తరగతి గదిలో తోటి విద్యార్థులతో కలిసి చదువుకొనే వాతావరణానికి భిన్నంగా నట్టింట్లో కంఫ్యూటర్, మొబైల్ ఫోన్, ట్యాప్ లాంటివి ముందేసుకొని టీచర్లు చెప్పే పాఠాలను వినడం, నేర్చుకోవడం పిల్లలకు ‘శిక్ష’గానే ఉంటుంది. కానీ కోవిడ్ కారణంగా అనివార్యంగా మారిన ఈ విద్యాబోధనను ‘చక్కటి శిక్షణ’గా మార్చేందుకు పిల్లల భాగస్వామ్యాన్ని పెంచడం తప్పనిసరి. ఇందుకోసం ‘టీచర్ పాఠం చెబుతుంటే పిల్లలు వినడం’ అనే పద్ధతికి భిన్నంగా ఏదైనా ఒక అంశంపై వీడియో పాఠాలను చూపించి ఆ తర్వాత దానిపై పిల్లలతో చర్చ నిర్వహిస్తే ఎక్కువగా నేర్చుకొంటారని, పిల్లల భాగస్వామ్యం పెరుగుతుందని పేర్కొంటున్నారు. మార్కులే ప్రామాణికం కాదు మార్కుల కోసమే చదివించడం అనే దృక్పథం నుంచి తల్లిదండ్రులు, విద్యాసంస్థలు మారాలి. పిల్లల్లో సృజనాత్మకతను, జిజ్ఞాసను పెంచేవిధంగా కొత్త విషయాలను తెలుసుకోవడంలో ఆసక్తి కలిగించే విధంగా విద్యాబోధన ఉంటే ఆన్లైన్ అయినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. తోటి విద్యార్థులు, టీచర్లతో కలిసి చదువుకోవడం అనే ఒక సమష్టి కార్యక్రమంగా విద్యాబోధన ఉండాలి. గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చోబెట్టడం సరైన విద్యావిధానం కాదు. – డాక్టర్ వీరేందర్, మానసిక వైద్య నిపుణులు -
ఆన్లైన్ విద్యతో లక్ష్యాలు నెరవేరేనా!
కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు మూతపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా ప్రభుత్వంతోపాటు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు విభిన్న మార్గాల్లో విద్యార్థులకు విద్యను అందిస్తున్నాయి. ప్రధానంగా ఆన్లైన్ బోధనపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ బోధన వల్ల ప్రయోజనం ఉండదని కొంతమంది చెబుతుండగా, మరికొందరు అదొక్కటే మార్గమంటున్నారు. సాక్షి, అమరావతి: కరోనాతో పాఠశాలలు మూతపడటంతో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు ఆన్లైన్ బాట పట్టాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విద్యా వారధి పథకం ద్వారా విద్యార్థులకు బోధనను అందిస్తోంది. ఇందులో భాగంగా దూరదర్శన్ సప్తగిరి చానెల్ ద్వారా వివిధ సబ్జెక్టుల పాఠాలను టీచర్లతో బోధిస్తోంది. మరోవైపు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు సెల్ఫోన్లు, ట్యాబ్లు, కంప్యూటర్ల ద్వారా విద్యా బోధన చేస్తున్నాయి. బోధన పేరుతో విద్యార్థులపై ఒత్తిడిని పెంచుతున్నాయి. అంతేకాకుండా ఫీజులను కూడా అధికంగా వసూలు చేస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మూడు మార్గాల్లో బోధన ► పిల్లలకు అనుగుణంగా హైటెక్, లోటెక్, నోటెక్ వినియోగించి బోధన సాగిస్తున్నాం. ఆన్లైన్లో మొత్తం సిలబస్ను, పాఠ్యపుస్తకాలను ఎన్సీఈఆర్టీ దీక్ష ప్లాట్ఫామ్లో పొందుపరిచాం. ► స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సు కింద వెబ్నార్ శిక్షణ నిర్వహిస్తున్నాం. టీచర్లు, పిల్లలకు అనుగుణంగా ‘అభ్యాస’ అనే యాప్ రూపొందించాం. ► లో టెక్నాలజీ ఉన్నవారు దూరదర్శన్, ఆకాశవాణిల ద్వారా పాఠాలు వినేలా చేస్తున్నాం. దూరదర్శన్ ద్వారా 1.80 లక్షల మంది విద్యార్థులు తమ అభ్యసనాన్ని కొనసాగిస్తున్నారు. ► 1 నుంచి 6 తరగతి వరకు ఉన్న పిల్లలకు విద్యావారధి కింద 18 లక్షల వర్క్ బుక్స్ అందించాం. నోటెక్ (టెక్నాలజీ అందుబాటులో లేనివారు) విద్యార్థులకు వాహనాలు, టీచర్ల ద్వారా బోధన చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బోధన ఇలా.. ► ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది పిల్లలు గ్రామీణ, నిరుపేద వర్గాలకు చెందిన వారే. దీంతో ప్రభుత్వం ఆయా విద్యార్థుల పరిస్థితులకు అనుగుణంగా బోధిస్తోంది. టెక్నాలజీ సౌకర్యం ఉన్నవారికి ఆన్లైన్లో పాఠ్యపుస్తకాలను అందుబాటులో ఉంచింది. ► మరికొందరికి టీవీలు, వీడియోల ద్వారా పాఠ్యాంశాలను అందిస్తోంది. ► డిజిటల్ (సెల్ఫోన్, ట్యాబ్, ల్యాప్టాప్, కంప్యూటర్) పరికరాలు లేని వారికి వర్క్ బుక్స్ అందించి వారికి వారానికి ఒకటి రెండు రోజులు స్కూళ్లలో టీచర్ల ద్వారా సందేహాలను నివృత్తి చేస్తోంది. కొంతవరకైనా స్కూళ్లు తెరవడం మంచిది ► సప్తగిరి చానెల్ ద్వారా బోధించడం, వర్క్ బుక్స్ ఇవ్వడం వల్ల విద్యా సంవత్సరానికి సంబంధించి కొంత గ్యాప్ పూడుతుంది. ► కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు డిజిటల్ బోధనతోపాటు పుస్తకాలను పంపిణీ చేస్తున్నాయి. ► మామూలు విద్యా సంవత్సరంలో కంటే ఎక్కువగా ఆన్లైన్లో బోధిస్తున్నాయి. ఈ అంశం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల పిల్లల మధ్య వ్యత్యాసాన్ని పెంచుతుంది. కాబట్టి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలి. ► పూర్తిగా కరోనా లేని ప్రాంతాలను గుర్తించి షిప్ట్ల పద్ధతిలో పాఠశాలలను నడపాలి. ► ఆన్లైన్ బోధనలతోపాటు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విధానం ఉండాలి. ► సిలబస్ను అవసరం మేరకు తగ్గించాలి. – జి.హృదయరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీటీఎఫ్ ఆన్లైన్ బోధన.. తరగతి బోధనకు ప్రత్యామ్నాయం కాలేదు ► పాఠశాలలు ప్రారంభమయ్యే అవకాశం లేదు కాబట్టి ఆన్లైన్ బోధన ద్వారా ఈ పరిస్థితిని అధిగమించవచ్చని కొన్ని ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఆన్లైన్ బోధన.. తరగతి బోధనకు ప్రత్యామ్నాయం కాలేదు. ఆన్లైన్ క్లాసుల కంటే ఉన్నంతలో టీవీ చానెల్ ద్వారా చెప్పడం వల్ల కొంత ఉపయోగం ఉంటుంది. – బాబుల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యూటీఎఫ్ ఆన్లైన్ బోధనతో ప్రయోజనం లేదు ► పాఠశాల విద్యకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయి. ► సరైన జాగ్రత్తలు తీసుకుని పాఠశాలలు తెరవాలి. మాస్కులు, గ్లౌజులు కచ్చితంగా పెట్టుకు రావాలని విద్యార్థులకు సూచించాలి. అవసరమైతే వాటిని ప్రభుత్వమే అందించాలి. ► ఆన్లైన్ బోధన వల్ల పూర్తి ప్రయోజనం లేదు. – కె.టి.శేఖర్, పేరెంట్, కాకినాడ -
బొటనవేలు తెగొద్దు!
అనగనగా ఒక ఏకలవ్యుడూ, అతని కుడిచేతి బొటనవేలు వృత్తాంతం తరతరాలుగా వింటున్నదే. భారతమంత వయ సున్న ఈ ప్రాచీన కథ ఇప్పుడు మరింత ప్రాసంగికతను సంత రించుకున్నట్టు కనిపిస్తున్నది. శ్రమజీవులకు చదువుసంధ్యలు నిషేధించిన అలిఖిత రాజ్యాంగపు వేల సంవత్సరాల ఏలు బడిలో.. ఎప్పుడో ఒక్కసారి, ఒక్కడే ఏకలవ్యుడు. అందరికీ చదువుకునే హక్కును ప్రసాదించిన వర్తమాన లిఖిత రాజ్యాంగ పాలనలో ఏటేటా సమానావకాశాల బొటనవేళ్లు తెగిపడుతున్న ఎందరెందరో అనేకలవ్యులు. సామాజిక అసమానత్వం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఇక్కడ వెనుకబడిన వారిలో అత్యధిక శాతం ప్రజలు ఆర్థికంగా వెనుకబడిపోయారు. ఆర్థిక అసమానత్వం ఇప్పుడు దినదిన ప్రవర్ధమానంగా వర్ధిల్లుతూనే ఉన్నది. వీటికి తోడుగా ఇప్పుడు డిజిటల్ అసమానత్వమనే నవీన యుగరీతి శిరమెత్తుతున్న ప్రమాదకర సంకేతాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే సాంఘి కంగా, ఆర్థికంగా వెనుకబడినవారే డిజిటల్ పరిజ్ఞానంలోనూ వెనుకబడతారు. ఒక సరికొత్త బానిస వ్యవస్థగా ఘనీభవిస్తారు. డిజిటల్ వేదికపై భాగ్యవంతుల పిల్లలతో సమానంగా అభాగ్య యువతకు కూడా అవకాశాలు కల్పిస్తే ఆగామి కాల పురోగామి దళంగా సాంఘిక, ఆర్థిక రంగాల్లోనూ వారు పైకి ఎగబాకుతారు. ‘డిజిటల్ డివైడ్’ను బద్దలుకొట్టడానికి ఇదే సరైన అదును. కరోనా మహమ్మారి ఏ ప్రపంచ దేశాన్నీ విడిచిపెట్టలేదు. ఏ జీవన రంగాన్నీ కటాక్షించలేదు. విద్యారంగం కూడా మినహా యింపు కాదు. మార్చి నెల నుంచి పిల్లలు బడిముఖం చూడలేదు. ఎప్పుడు చూడగలుగుతారో ఇదమిత్థంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఏదో అద్భుతం జరిగి తక్షణమే ఏ వ్యాక్సినో, ఔషధమో మార్కెట్లోకి ఓ నెల రోజుల్లోపల వస్తే సెప్టెంబర్ మాసం నుంచి పాఠశాలలు ప్రారంభం కావచ్చు. మరి అద్భుతం జరగకపోతే విద్యా సంవత్సరం ఏం కావాలి? ఒక సంవత్సరాన్ని కోల్పోవడమేనా? అకడమిక్ క్యాలెండర్ నుంచి 2020ని డిలీట్ చేయడమేనా? ఈ ప్రశ్నలు అన్ని దేశాల్లోనూ తలెత్తాయి. ఇందుకు సమాధానంగా ముందుకు వచ్చిందే ‘ఆన్లైన్’ విద్యావిధానం. ఆన్లైన్ విద్యాబోధనను అమలులోకి తేవాలంటే విద్యా ర్థులకు వాళ్ల ఇంటి దగ్గర ఒక కంప్యూటర్ ఉండాలి. లేదంటే ఒక ట్యాబ్ లేదా స్మార్ట్ఫోన్, ఎప్పుడూ ఎడతెగక పారే కరెంటు, తెప్పలుగా సిగ్నల్స్ నిండిన ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. విద్యార్థికి ఏకాంత భంగం కలుగకుండా ఒక ప్రత్యేక గది ఉంటే మరీ మంచిది. ఇక పాఠశాల వైపు నుంచి ఉపాధ్యాయుల సన్నద్ధత కూడా ముఖ్యం. ఆన్లైన్ మాధ్యమానికి అనుగుణంగా బోధనా ప్రణాళికను డిజైన్ చేసుకోవాలి. క్లాస్ రూమ్లో టీచర్ ఎదురుగా ఉన్నప్పుడు చచ్చినట్టు వినే పరిస్థితి ఇక్కడ ఉండదు. కనుక పాఠ్యాంశాన్ని ఆసక్తికరంగా చెప్పగలిగే సాధనాలను జోడించుకోవాలి. విద్యార్థుల సందేహాల నివృత్తికి అవకాశం ఉండదు. సాధారణ సందేహాలను ముందుగానే ఊహించి సమా ధానాలను పొందుపరిచేవిధంగా పాఠ్య ప్రణాళిక రూపొందాలి. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ బోధన జరగాలి. ఆన్లైన్ విద్యావిధానానికి విద్యార్థులూ, పాఠశాలలూ, ప్రభుత్వాలూ ఏమేరకు సన్నద్ధమై ఉన్నాయో చూడాలి. యునెస్కో లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దరిదాపు 150 కోట్లమంది విద్యార్థులపై కరోనా ప్రభావం పడింది. ఇందులో 83 కోట్లమందికి ఇంటి దగ్గర కంప్యూటర్ లేదు. 60 కోట్లమందికి ఇంటర్నెట్ సౌలభ్యం లేదు. ఆఫ్రికా ఖండంలోని సహారా ఎడారి ప్రాంత దేశాల్లో 90 శాతం మందికి కంప్యూటర్ అందుబాటులో లేదు. దాదాపు ఆరుకోట్ల మంది నివసించే ప్రాంతాలకు మొబైల్ నెట్వర్క్ కూడా లేదు. ఇక భారతదేశం విషయానికి వస్తే 2018 నాటి నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం 11 శాతం ఇళ్లలో కంప్యూటర్ ఉన్నది. 24 శాతం మందికి సొంత స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. పట్టణాల్లో 42 శాతం మందికి, గ్రామాల్లో నూటికి పదిహేను మందికి ఇంటర్నెట్ అందుబాటులో ఉన్నది. భార తీయ సమాజపు పైశ్రేణిలో ఉన్న 20 శాతం మంది గృహాల్లోనే 27.6 శాతం కంప్యూటర్లు ఉన్నాయి. 50.5 శాతం ఇంటర్నెట్ కనెక్షన్లు వీరికే ఉన్నాయి. అట్టడుగున ఉన్న 20 శాతం జనాభాకు 2.7 శాతం కంప్యూటర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అవి కూడా వృత్తి, ఉద్యోగాల రీత్యా అందుబాటులో ఉన్నవి మాత్రమే. 8.9 శాతం ఇంటర్నెట్ కనెక్షన్లు మాత్రమే అందు బాటులో ఉన్నాయి. ఈ డిజిటల్ డివైడ్లో అంతర్లీనంగా ఉన్న జెండర్ డివైడ్, రూరల్–అర్బన్ డివైడ్ మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఆన్లైన్ తరగతుల ప్రారంభానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కచ్చితమైన నిర్ణయాన్ని ఇంకా తీసుకోనేలేదు. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ఇంకా రూపొందించనే లేదు. ఈలోగానే ఆన్లైన్ బోధన పేరుతో ప్రైవేట్ స్కూళ్లు ప్రారంభించిన హడావుడితో సమాజంలో కల్లోలం బయల్దేరింది. కరోనా మహమ్మారి ఫలితంగా వేలాది చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడ్డాయి. పెద్ద పరిశ్రమలు– కార్పొరేట్ సంస్థలు సైతం ఎంతోమందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. ఉద్యోగా లున్నవారి జీతాల్లో కోత పడింది. ప్రభుత్వ ఉద్యోగులకు సైతం ఈ కోత తప్పలేదు. నిర్మాణ రంగం, హోటల్ పరిశ్రమ, వినోదరంగం, టూరిజం వగైరాలన్నీ స్తంభించిపోయాయి. లక్ష లాది కుటుంబాలు పెను సంక్షోభపు తుపాను ధాటికి విల విల్లాడుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో మూలిగే నక్కపై తాటిపండులాగా ఫీజులకోసం ప్రైవేట్ స్కూళ్ల నుంచి వచ్చి పడుతున్న హుకుమ్నామాలతో తల్లిదండ్రులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. అటు ప్రైవేట్ స్కూళ్ల దోపిడీకి ముడుపు కట్టలేక ఇటు పిల్లలను చదువులకు దూరం చేయలేక సతమత మవుతున్నారు. ఈ ప్రైవేట్ స్కూళ్లు హడావుడి చేస్తున్న ఆన్లైన్ చదువుల నాణ్యత ప్రమాణాలను తెలుసుకోవడానికి ప్రముఖ ఉపా ధ్యాయ సంఘం యు.టి.ఎఫ్. ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో భాగంగా ఆన్లైన్లో అభ్యసిస్తున్న తొమ్మిదివేల మంది విద్యార్థులను పలకరించింది. వీరిలో కేవలం 3.6 శాతం విద్యార్థులు మాత్రమే ఆన్లైన్ పాఠాలు అర్థమవుతున్నాయని చెప్పారు. 27.7 శాతం మంది కొంచెంకొంచెంగా అర్థమవు తున్నాయని చెప్పారు. 68.7 శాతం మంది ఏమాత్రం అర్థం కావడం లేదని చెప్పారు. ఆన్లైన్ బోధనా ప్రణాళిక మీద ఎటువంటి కసరత్తు ఈ పాఠశాలలు చేయలేదని సర్వే నిరూ పించింది. శవాలను పీక్కుతినే రాబందుల రెక్కల చప్పుడు లాగా ప్రైవేట్ స్కూళ్ల ఆన్లైన్ హడావుడి అంతా ఫీజులను పిండుకోవడంకోసమేనని తేలిపోయింది. దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలను అమలుచేయడం ప్రారంభించిన తర్వాత వైద్యరంగంలో ప్రవేశించినట్టుగానే విద్యారంగంలో కూడా వ్యాపార సంస్కృతి ప్రవేశించింది. క్రమంగా వ్యాపార సంస్కృతి పరిధిని కూడా దాటి మెజారిటీ ప్రైవేట్ విద్యాసంస్థలు సంపాదన పిచ్చిలో కూరుకుని పోయాయి. ప్రాథమిక విద్యను స్వయంగా నిర్వహించవలసిన ప్రభుత్వం ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడం ఇదే కాలంలో ఊపందుకుంది. మౌలిక వసతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసి పాఠశాలలను పాడుపెట్టడం, ఉపాధ్యాయులను బోధనేతర పనులకు నియోగించడం మొదలైన కారణాల ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా ప్రజల విశ్వాసాన్ని కోల్పో యాయి. ఈ వ్యాపార పాఠశాలల ప్రచార పటాటోపానికి జనం లొంగిపోయారు. సేవా దృక్పథంతో దశాబ్దాల పాటు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న సంప్రదాయ ప్రైవేట్ పాఠశా లలు కూడా ఈ వ్యాపార పాఠశాలల ప్రభ ముందు నిలవలేక పోయాయి. క్రైస్తవ మిషనరీలు స్థాపించిన విద్యాసంస్థలు, సేవా భావంతో ఏర్పాటైన ట్రస్టులు నిర్వహించే పాఠశాలలు, సరస్వతీ విద్యామందిరాలు ఎటువంటి వ్యాపార ధోరణి అవలంబించ కుండానే అత్యున్నత విద్యాప్రమాణాలను నెలకొల్పగలిగాయి. ఇప్పుడు కూడా కొందరు వ్యక్తులు, సంస్థలూ వ్యాపార ధోరణికి దూరంగా నడుపుతున్న విద్యాసంస్థలు లేకపోలేదు. కానీ వాటి సంఖ్య బహు స్వల్పం. మొత్తం ప్రైవేట్ స్కూళ్లలో తొంబై శాతానికి పైగా వ్యాపార సంస్థల సామ్రాజ్యమే. ఒక దశలో ఈ వ్యాపార పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలల్లో చేరేవారి సంఖ్యను కూడా దాటేసింది. దీంతో ఇవి మరింత చెలరేగిపోవడం ప్రారంభించాయి. కరోనా సంక్షోభ కాలంలో ట్యూషన్ ఫీజు కంటే ఒక్క పైసా ఎక్కువ వసూలు చేయరాదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ఆన్లైన్ క్లాసులకు ట్రాన్స్పోర్టు ఫీజును కూడా హైదరాబాద్లోని కొన్ని ప్రైవేట్ స్కూళ్లు వసూలు చేస్తున్న వార్తలు వెలుగుచూశాయి. ఈ వికృత క్రీడకు స్వస్తి చెప్పాలంటే ప్రాథమిక విద్యారంగంలో ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయడమే మార్గం. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన నాడు–నేడు కార్యక్రమం ఫలితంగా రాష్ట్రంలో ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు జోరందుకోనున్నది. తెలంగాణలో పెద్ద సంఖ్యలో ప్రారంభించిన గురుకుల పాఠశాలలు కూడా సత్ఫలి తాలను అందిస్తాయి. కరోనా సంక్షోభం మరికొన్ని మాసాలపాటు కొనసాగే అవ కాశాలు కనిపిస్తున్నందువలన విద్యా సంవత్సరాన్ని పరిరక్షిం చడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరలోనే ఆన్లైన్ చదు వులపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న సూచనల ప్రకారం, బహుశా గ్రీన్ సిగ్నల్ ఇవ్వవచ్చు. విద్యా సంవత్సరాన్ని పరిరక్షించడంతోపాటు పేద, మధ్యతరగతి వర్గాల విద్యార్థులు వివక్షకు గురికాకుండా చూడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వాలదే. ఆన్లైన్ బోధనా ప్రణాళిక ప్రభుత్వ–ప్రైవేట్ పాఠశాలలకు కామన్గా ఉండాలి. దానికి పూర్తి సన్నాహాలు ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే జరగాలి. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్థులు ఆన్లైన్ పాఠా లపై శ్రద్ధపెట్టలేరని నిపుణులు చెబుతున్నారు. ఆ వయసు పిల్లలు మొబైల్/ట్యాబ్లకు త్వరగా అడిక్ట్ అవడంతోపాటు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని చెబు తున్నారు. అందువల్ల ప్రాథమిక (1 నుంచి 5) విద్యార్థులకు రికార్డెడ్ పాఠాలను టీవీ చానళ్ల ద్వారా ప్రసారం చేయడం మేలు. ఇందుకోసం అందుబాటులో ఉన్న కొన్ని చానెళ్లను అద్దెకు తీసుకోవడమో, ఫైబర్నెట్వర్క్ను ఉపయోగించుకొని ఎడ్యుకేషన్ చానళ్లను ప్రారంభించడమో చేయవలసి ఉంటుంది. ఆపై తరగతుల విద్యార్థుల్లో స్తోమత లేని పిల్లలకు డిజిటల్ ఉపకరణాలను అందుబాటులో ఉంచే సమస్యను అధిగమిం చవలసి ఉంటుంది. లేనట్లయితే ఇప్పుడు ఏర్పడే డిజిటల్ అస మానతలు ముందు ముందు పరిష్కరించలేని స్థాయికి చేరు కుంటాయి. ఈ సంధి కాలాన్ని విద్యారంగంలో సంస్కరణల కోసం కూడా వినియోగిం చుకోవచ్చునని మరికొందరు నిపు ణులు సూచిస్తున్నారు. ఇప్పుడు మనం అనుసరిస్తున్న ఉపా ధ్యాయ కేంద్రక పాఠ్య ప్రణాళిక స్థానంలో విద్యార్థి కేంద్రక పాఠ్యప్రణాళికను ప్రవేశ పెట్టాలన్న సూచనలు వస్తున్నాయి. ఈ విధానం వలన విద్యార్థుల్లో సృజనశీలత పెరుగుతుందని చెబు తున్నారు. ఇప్పుడు ప్రారంభించే ఆన్లైన్ విధానాన్ని అవసర మైన మేరకు భవిష్యత్లో కొనసాగిస్తూనే, క్లాస్రూమ్లో సమష్టి విద్యాభ్యాసాన్ని కూడా కొనసాగించాలి. సమష్టి విధానం వల్ల ఏర్పడే ‘సోషల్ కేపిటల్’కు మరేదీ సాటిరాదు. వ్యాసకర్త: వర్ధెల్లి మురళి muralivardelli@yahoo.co.in -
రెండో తరగతికి లక్షపైనే...
బోడుప్పల్లోని సిద్ధార్థ స్కూల్లో తన కుమారుడిని రెండో తరగతిలో చేర్పించేందుకు ఓ వ్యక్తి వెళ్లాడు. క్లాసులు..టీచర్ల వివరాలు మాట్లాడిన తరువాత ఫీజు గురించి చెబితే అతని కళ్లు బైర్లు కమ్మాయి. రూ. లక్ష వరకు చెల్లించాలని చెప్పారు. అదేమని అడిగితే ఆన్లైన్ క్లాస్..ల్యాప్టాప్..బుక్స్..డ్రెస్.. ట్రాన్స్పోర్ట్ ఇలా కబుర్లు చెప్పారు. వామ్మో..ఇంకా మొదలే కాని స్కూలుకు ఇంత ఫీజా.. వద్దులే బాబూ అనుకొని సారథి హైస్కూల్కు వెళ్లాడు. అక్కడా అదే పరిస్థితి. ఉప్పల్లోని శ్రీచైతన్య స్కూల్లో విచారించాడు. రూ.38,500 చెప్పారు. ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం చెప్పింది కదా అని అడిగితే మాకేం తెలియదు సార్.. ఫీజు కట్టాల్సిందే అని నిర్లక్ష్యంగాసమాధానం ఇచ్చారు. డబ్బుచెల్లిస్తేనే ఆన్లైన్ క్లాసులతోచదువులు మొదలవుతాయి. సాక్షి, సిటీబ్యూరో (హైదరాబాద్): కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలు కరోనా కాలంలోనూ కనికరంలేకుండా ప్రవర్తిస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కుతూ ఫీజుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులపై జులం ప్రదర్శిస్తున్నాయి. విద్యాశాఖలో ఉన్న పర్యవేక్షణ లేమి ఈ విద్యా సంస్థలకు కలిసి వస్తోంది. ఆన్లైన్ క్లాసులు, అడ్మిషన్ల పేరుతో ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు యథేచ్ఛగా తమ దందా కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.46కు తూట్లు పొడుస్తున్న అనేక విద్యా సంస్థలు వివిధ రకాల పేర్లు చెప్పి అందినకాడికి ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఎవరైనా తల్లిదండ్రులు తాము నిర్దేశించిన ఫీజులు చెల్లించకపోతే ఆన్లైన్ క్లాసులకు సంబంధించిన యూజర్ ఐడీలు, పాస్వర్డ్స్ ఇవ్వమంటూ ఎస్సెమ్మెస్లు పంపించి బెదిరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో? ఎవరికి ఫిర్యాదు చేయాలో? అర్థం కాక తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. తాజా విద్యా సంవత్సరంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడం ఈ విద్యా సంస్థలకు కలిసి వచ్చే అంశంగా మారిపోయింది. దీంతో సొంత సిలబస్లో ఆన్లైన్ క్లాసుల్ని మొదలెట్టి, యథేచ్ఛగా కొనసాగించేస్తున్నాయి. ‘సాక్షి టీవీ’ నిఘాలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. (వారు కంపార్టుమెంటల్ పాస్) రెండో తరగతికి రూ.లక్షపైనే... బోడుప్పల్లోని సిద్ధార్థ స్కూల్ వ్యవహారం ప్రైవేట్ స్కూళ్ల వ్యవహారానికి ఓ మచ్చుతునక మాత్రమే. ఆ పాఠశాలకు రెండో తరగతిలో చేరే విద్యార్థి తండ్రిగా వెళ్లిన ‘సాక్షి’ ప్రతినిధికి అక్కడి ఉద్యోగులు చెప్పిన ఫీజుల లెక్క అవాక్కయ్యేలా ఉంది. అడ్మిషన్ మొదలుకొని వివిధ ఫీజుల కింద రూ.లక్ష డిమాండ్ చేశారు. ఆ ఫీజులో కాస్త తగ్గించమని కోరగా.. ఆ పాఠశాల ఉద్యోగుల నుంచి స్పందన కరువైంది. సమీపంలోని సారథి హైస్కూల్లోనూ రెండో తరగతి విద్యార్థికి స్కూలు ఫీజు కింద రూ.60 వేలు, యాక్టివిటీ ఫీజు కింద మరో రూ.40 వేలు కలిపి రూ.లక్షగా చెప్పారు. దీనికి అదనంగా రవాణా, పుస్తకాలు తదితరాలు అదనంగా ఉంటాయని ఉంటాయని స్పష్టం చేశారు. ఉప్పల్లోని శ్రీచైతన్య స్కూల్లో ట్యూషన్ ఫీజుగా రూ.31 వేలు, పుస్తకాలు, యూనిఫాం తదితరాలకు మరో రూ.7,500 చెల్లించాలని అక్కడి ఉద్యోగులు చెప్పారు. మిగిలిన రెండు స్కూళ్ల కంటే ఇక్కడ తక్కువే అయినా.. సామాన్యుడికి మాత్రం భారమే. కేవలం ఈ మూడే కాదు.. నరగంలోని దాదాపు ప్రతి ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్లోనూ ఫీజుల తీరుతెన్నులు ఇలానే ఉన్నాయి. పాత స్టూడెంట్స్ నుంచి మరోలా.. కొత్తగా చేరాలని భావించిన విద్యార్థుల నుంచి వసూళ్లు ఇలా ఉంటే.. ఇప్పటికే తమ విద్యార్థులుగా ఉన్న వారి నుంచి ఈ స్కూళ్లు మరోలా పిండుకుంటున్నాయి. దీనికోసం ఆన్లైన్ క్లాసుల పేరును వాడుకుంటున్నాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత విద్యా సంవత్సరంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయినప్పటికీ ఈ విద్యా సంస్థలు తమ సొంత సిలబస్తో ఆన్లైన్ క్లాసుల్ని మొదలెట్టేశాయి. ఫీజుల పేరుతో ప్రతి పైసా ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాయి. జరుగుతున్నవి ఆన్లైన్ క్లాసులే అయినప్పటికీ యాజమాన్యాలు మాత్రం ఫీజుల వసూళ్లలో తగ్గట్లేదు. ట్యూషన్ ఫీజు, బిల్డింగ్ ఫీజు, స్కూలు యూనిఫాం ఫీజు, స్కూలు డెవలప్మెంట్ ఫీజు, ట్రాన్స్పోర్ట్ ఫీజు... ఇలా అందినకాడికి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి దండుకుంటున్నాయి. ఇవి చాలవన్నట్లు ఆన్లైన్ క్లాసుల కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన ల్యాప్టాప్, ట్యాబ్లు తమ వద్దే కొనాలంటూ కొత్త మెలిక పెడుతున్నాయి. వీటిలో ఏ ఫీజు చెల్లించకపోయినా, పుస్తకాలు కొనకపోయినా ఆన్లైన్ క్లాసుల యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇవ్వమని, పరీక్షలు రాయనిచ్చేది లేదంటూ ఎస్సెమ్మెస్లు, ఫోన్కాల్స్ ద్వారా తల్లిదండ్రుల్ని బెదిరిస్తున్నాయి. వారి బాధలు వర్ణనాతీతం... నగరానికి ఎన్నో ఏళ్ల క్రితం వలసవచ్చిన బడుగుజీవులు ఎందరో ఉన్నారు. తమ పిల్లలు తమలా కాకుండా ఉన్నత విద్యను అభ్యసించాలన్నది వీరి కల. దీనికోసం కడుపుకట్టుకుని పిల్లల్ని సమీపంలో ఉన్న ప్రైవేట్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. ఇలాంటి వారు ప్రస్తుతం కరోనా కోరల్లో చిక్కుకుని ఉపాధి, ఆదాయం కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో మూలిగే నక్కపై తాటికాయ అన్నట్లు ప్రైవేట్ స్కూళ్ల వ్యవహారం మరో షాక్ ఇస్తోంది. ఇన్నాళ్లు ఏదో ఒక రకంగా ఫీజులు చెల్లిస్తూ వస్తున్నామని, ప్రస్తుత కరోనా పరిణామాలతో అది సాధ్యం కావట్లేదని వాపోతున్నారు. ఇదిలా ఉండగా.. తల్లిదండ్రులు వ్యయప్రయాసలకు ఓర్చినా.. ఆన్లైన్ క్లాసులు విద్యార్థులకు కొత్త సవాళ్లు విసురుతున్నాయి. టీచర్లు బోర్డు వైపు తిరిగి బోధిస్తున్న ఈ ఆన్లైన్ క్లాసులు విద్యార్థులకు అర్థం కావట్లేదు. వీరికి సందేహాలు వస్తే తీర్చే నాథులే కరువయ్యారు. ఈ ఇబ్బందులు అదనం... ఈ ఆన్లైన్ క్లాసుల కోసం గంటల తరబడి ఫోన్లు, ట్యాబ్స్, ల్యాప్టాప్స్ చూస్తున్న పిల్లల కళ్లు, వెన్నుముకలపై తీవ్ర ప్రభావం ఉంటోంది. అనేక మంది చిన్నారులు తల, నడుము నొప్పులతో బాధపడుతున్నారు. ఇంటర్నెట్లో ప్రవేశించినప్పుడు అనేక మంది చిన్నారులకు అశ్లీల సైట్ల పాప్అప్స్, బూతు బొమ్మలు కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఆ క్లాసులు జరిగినంత సేపూ తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు తమ పని మానుకుని పిల్లల వద్దే కూర్చోవాల్సి వస్తోంది. ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులకు భారం పెరుగుతోంది. వారికి కచ్చితంగా ఒక్కో ఫోన్ లేదా ట్యాబ్ సమకూర్చాల్సి వస్తోంది. ఒకే సమయంలో ఆన్లైన్ క్లాసులు కావడంతో ఇది తప్పట్లేదు. కూలినాలీ చేసుకుని జీవించే కుటుంబాల్లో కనీసం స్మార్ట్ ఫోన్ కూడా ఉండట్లేదు. దీంతో వీరి పిల్లలు విద్యకు దూరం కావాల్సి వస్తోంది. ఈ ట్యూషన్ ఫీ అంతా కట్టమంటున్నారు కరోనా కష్టకాలంలో స్కూళ్లలో ఫీజులు పెంచవద్దని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కేవలం ట్యూషన్ ఫీజు వసూలు చేయాలని ఆదేశించారు. కానీ విద్యా సంస్థలు మాత్రం లాస్ట్ ఇయర్ ఫీజు రూ.75 వేలను చెల్లించమంటున్నారు. దాన్ని ట్యూషన్ ఫీజు కింద చూపించి కట్టమని ఫోర్స్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఫీజు మొత్తాన్నే ఈ ఏడాది కూడా చెల్లించాలని.. అది కూడా తొమ్మిది వాయిదాల్లో కట్టాలంటున్నారు. ఈ విషయంలో ఎంత చెప్పినా స్కూల్ యాజమాన్యాలు రాజీపడటం లేదు. – ఓ విద్యార్థి తండ్రి ఈ క్లాసులు ఏం రీచ్ అవుతాయి? ప్రభుత్వం జస్ట్ జీవో ఇచ్చి వదిలేసింది.మానిటరింగ్ ఏంలేదు. స్కూల్ నుంచి మామూలుగా ఒత్తిడి ఉంటుంది. అప్పుడు ఉన్న ఫీజునే ఇప్పడు మంత్లీ పే చేయమంటున్నారు. ఈ విషయంలో స్కూల్ వాళ్లుడిమాండ్ చేస్తున్నారు. ఫస్ట్ రూ.20 వేలు, రూ.30 వేలు కట్టాలంటున్నారు. కడితేనే బుక్స్ అంటున్నారు. బుక్స్ లేకుండా క్లాసులు చెప్పడమేంటి.. వాళ్లు చెప్పినా ఏం రీచ్ అవుతుంది. అసలు నెక్ట్స్ క్లాసు బుక్స్ ఏం ఉంటాయోతెలియకుండా ఎలా..? అదేమంటే బుక్స్ లేకుండా క్లాసులు చెబుతున్నాం.. నోట్స్ ఫ్రిపేర్ చేయండని చెబుతున్నారు. – ఓ విద్యార్థి తల్లి ఛాన్స్ ఇవ్వడం లేదు.. ఆన్లైన్ క్లాసుల్లో టీచర్లు చెప్పేది ఏం అర్థం కావడం లేదు. డౌట్స్ అడుగుదామంటే అసలు ఛాన్స్ ఇవ్వడం లేదు. వాళ్ల మానాన వాళ్లు చెప్పుకుంటూ వెళ్లుతున్నారు. కానీ క్లాసు లాస్ట్లో చెబుతాంటున్నారు. ఏమీ ఉండటం లేదు. అర్థం కావడం లేదని చాలా చెప్పాం. కానీ క్లాసుకు టైమ్ అయిపోతుందని చెప్పుకుంటూ వెళ్తున్నారు. – ఓ విద్యార్థి పేరెంట్స్కు కష్టమే.. ఎల్కేజీ వాళ్లకు కూడా ఆన్లైన్ పాఠాలు చెబుతున్నారు. పెద్ద క్లాసు వాళ్లు అంటే వింటారు. కానీ చిన్నపిల్లలకు ఏం అర్థం అవుతుంది. వీళ్లకేమీ అర్థమవుతుంది. ఇది పేరెంట్స్కు చాలా బర్డెన్. చేసే పనులను మానుకుని పిల్లలతో పాటు కూర్చుకోవాల్సి వస్తుంది. స్క్రీన్ టైమ్ ఎక్కువ అవడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పాఠాలు మర్చిపోతారనే భయంతోనే ఆన్లైన్ క్లాసుల్లో కూర్చోపెట్టాల్సి వస్తుంది. – ఓ విద్యార్థి తల్లి బ్యాక్ పెయిన్ వస్తోంది ఆన్లైన్ క్లాసులతో పిల్లలకు బ్యాక్ పెయిన్ వస్తుంది. అంతేగాకుండా ఐ సైట్ ప్రాబ్లమ్ వస్తుంది. నాకు ముగ్గురు పిల్లలు. ముగ్గురికి డివైజ్ ఇవ్వాలంటే కొంచెం కష్టమే.. చిన్న పిల్లలకు క్లాసులంటే టూ మచ్. వాళ్లకి ఏం అర్థమవుతుంది. మేడమ్ ఫాస్ట్ ఫాస్ట్గా చెబుతున్నారు. నేను మళ్లీ చెప్పాల్సి వస్తుంది. - ఓ విద్యార్థిని తల్లి ఫోన్ లేక పాఠాలు సాగడం లేదు చేతన్బాగ్ స్కూల్లో మా అబ్బాయి టెన్త్ చదువుతున్నాడు. ఫోన్ ద్వారానే క్లాసులు జరుగుతున్నాయి. ఫోన్ తీసుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. ఫోన్ లేక పాఠాలు ఆగిపోయాయి. పక్కింటికి వెళ్లాలంటే.. కరోనా వల్ల ఎవరూ రానివ్వడం లేదు. ఇలా కాకుండా ప్రతి ఇంటికి టీవీ ఉంటుంది. దాన్లో చెబితే ఇంత టెన్షన్ ఉండదు కదా.. మరి మా పరిస్థితి ఏంటి..? – విద్యార్థి తల్లి, చేతన్బాగ్ -
ఫీ‘జులుం’పై కొరడా
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ క్లాసుల పేరుతో నిబంధనలకు విరు ద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ స్కూళ్లపై విద్యాశాఖ కొరడా ఝళిపి స్తోంది. జీవో నంబర్ 46కు విరుద్ధంగా హైదరాబాద్లోని పలు కార్పొరేట్ స్కూళ్లు ఫీజులు వసూలు చేస్తున్నాయని, విద్యా ర్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు విద్యాశాఖకు ఇటీవల భారీ సంఖ్యలో ఫిర్యా దులు అందాయి. దీంతో అధికారు లు గురువారం రంగంలోకి దిగారు. గత ఏడాది నిర్దేశించిన ట్యూషన్ ఫీజుకు మించి వసూలు చేస్తున్న పాఠశాలల్లో ఆకస్మిక తని ఖీలు చేశారు. హైదరాబాద్లో 11, రంగా రెడ్డిలో 13, మేడ్చల్ జిల్లాలో 6 కార్పొరేట్ పాఠ శాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఫీజు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. విద్యా సంవత్సరం మొదలు కాకున్నా.. గ్రేటర్ పరిధిలోని రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సుమారు ఏడు వేల ప్రైవేట్ స్కూళ్లు ఉన్నాయి. వాటిలో 15 లక్షల మంది విద్యార్థులు చదువు తున్నారు. 60% మంది విద్యార్థులు కేవలం ఇంటర్నేషనల్, కార్పొరేట్ స్కూళ్లలోనే చదువుతు న్నారు. దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి ఇంకా కొన సాగుతూనే ఉంది. ఇప్పటి వరకు విద్యా సంవత్సరం ప్రారంభం కాలేదు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందో లేదోకూడా ఇప్పటివరకు స్పష్టత లేదు. కానీ నగరంలోని పలు ఇంట ర్నేషనల్, కార్పొరేట్ స్కూళ్లు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తు న్నాయి. విద్యార్థుల సామర్థ్యా లను పరిగణనలోని తీసుకోకుండా ఎల్కేజీ విద్యార్థులకు కూడా ఆన్లైన్ తరగతులు చేపడుతున్నాయి. ఆన్లైన్లో క్లాసు వినాలంటే స్కూల్ యూనిఫారం ధరించాలనే నిబంధన కూడా విధించాయి. ఆన్లైన్ పాఠాల పేరుతో తమ వద్దే పుస్తకాలు సహా ల్యాప్ టాప్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను కొనుగోలు చేయాలని నిబంధన విధిస్తున్నాయి. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో.. ఫస్ట్ టర్మ్ ఫీజు చెల్లించాల్సిందిగా తల్లిదం డ్రులపై పాఠశాలల యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయి. కొన్ని స్కూళ్లయితే ఏకంగా స్నాక్స్, ట్రావెలింగ్, లైబ్రరీ, స్పోర్ట్స్ చార్జీలు కూడా వసూలు చేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ట్యూషన్ ఫీజు మినహా మరే ఇతర ఫీజులు వసూలు చేయవద్దని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇంటర్నేషనల్, కార్పొరేట్ స్కూళ్లు పట్టించుకోవడం లేదు. యథేచ్ఛగా వసూళ్లకు పాల్పడుతున్నాయి. ఇందుకు నిరాకరించిన తల్లిదండ్రులను అడ్మిషన్ క్యాన్సల్ చేస్తామని బెదిరిస్తున్నాయి. దీంతో కొంత మంది తల్లిదండ్రులు ఆయా యాజమాన్యాల ఒత్తిళ్లకు తలొగ్గి వారు అడిగినంత ఫీజులు చెల్లిస్తున్నారు. మరికొంత మంది విద్యాశాఖకు ఫిర్యాదు చేస్తుండటంతో అధికారులు స్పందించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తూ అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ స్కూళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు. ఆన్లైన్ తరగతులకు అనుమతి ఇవ్వలేదు ఆన్లైన్ తరగతులు నిర్వహించేందుకు హైదరాబాద్ జిల్లాలో ఏ ఒక్క స్కూల్కూ అనుమతి ఇవ్వలేదు. అధికారికంగా ఇప్పటివరకు విద్యా సంవత్సరం ప్రారంభం కాలేదు. ఆన్లైన్ తరగతుల పేరుతో ఎవరైనా తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. నిబంధనలు అతిక్రమించిన స్కూళ్లను సీజ్ చేయడానికి కూడా వెనుకాడం. – వెంకటనర్సమ్మ, డీఈఓ, హైదరాబాద్ -
కార్పొరేట్ స్కూళ్ల ఆన్లైన్ దందా
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ విసిరిన పంజాతో చిన్నారులు బడి అడుగులు మాని ఆన్లైన్ చదువుల బాట పట్టారు. దీనిని ఆసరాగా చేసుకున్న కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు పుస్తకాలు, స్టేషనరీతోపాటు ట్యాబ్స్, ల్యాప్ట్యాప్స్ సైతం తమ వద్దే కొనుగోలు చేయాలని తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తున్నాయి. తమ దగ్గర కొనుగోలు చేసిన ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లో తమ పాఠశాల, సిలబస్కు అనుగుణంగా ఉండే యాప్స్, పాఠాలు సులభంగా యాక్సెస్ చేసేందుకు అనువైన సాఫ్ట్వేర్ ఉంటుందని నమ్మిస్తున్నాయి. అయితే ఈ పరిణామం పలువురు విద్యార్థుల తల్లిదండ్రులకు భారంగా పరిణమిస్తోంది. (ఇంటర్లో గ్రేస్ మార్కులు) మీ పిల్లలు మార్కులు కోల్పోతారంటూ... ప్రవీణ్ కుమార్తె ఓ కార్పొరేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. ఇటీవల పాఠశాల యాజమాన్యం తమ వద్ద ట్యాబ్లెట్ కొనుగోలుచేయాలని, ఆరునెలల ఫీజును చెల్లించాలని అతనికి సందేశం పంపించింది. ఇక సుకుమార్ పిల్లలు సైతం మరో కార్పొరేట్ పాఠశాలలో 7,8 తరగతులు చదువుతున్నారు. వారి పాఠశాల యాజమాన్యం కూడా తమ వద్దే్ద ల్యాప్ట్యాప్, స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలని కబురు పంపింది. ఇలా పలు పాఠశాలల యాజమాన్యాలు ఎలక్ట్రానిక్ ఉపకరణాలను విధిగా తమ వద్ద కొనుగోలు చేయాల్సిందేనని తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నాయి. లేనిపక్షంలో మీ పిల్లలు గ్రేడ్లు, మార్కులు కోల్పోవాల్సి వస్తుందని..చదువులో వెనకబడతారని హెచ్చరికలు జారీచేస్తుండడం గమనార్హం. ఇదో తరహా వ్యాపారం.. ఇటీవల మనోహర్కు తన కుమార్తె 8వ తరగతి చదివే పాఠశాల నుంచి మెసేజ్ వచ్చింది. ట్యాబ్లెట్ ద్వారా విద్యార్థిని పాఠాలు వినేందుకు రూ.25 వేల ఫీజు చెల్లించాలని కోరింది. ఇందులో రూ.7500 ట్యాబ్లెట్ ఖర్చు అని పేర్కొంది. ఫీజు చెల్లించని పక్షంలో ట్యాబ్లెట్ ఇవ్వబోమని చెప్పింది. ఈ ట్యాబ్లెట్లో పాఠ్యాంశాలకు సంబంధించి ప్రీ లోడెడ్ కంటెంట్, అత్యుత్తమ సాఫ్ట్వేర్ ఉందని నమ్మించింది. ఈ ట్యాబ్లెట్ భవిష్యత్లో ఈ–ఎగ్జామ్స్ రాసేందుకు కూడా ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొనడం గమనార్హం. అంతటా అదే సీన్.. ప్రైవేటు పాఠశాలలే కాదు.. కేంద్రీయ విద్యాలయాలు సైతం ఇదే రీతిన ఎలక్ట్రానిక్ గ్యాడ్జట్ల వ్యాపారానికి తెరలేపడం గమనార్హం. ల్యాప్ట్యాప్లయితేనే మేలని..ఫోన్ల ద్వారా అయితే స్పష్టత ఉండదని కొన్ని పాఠశాలల యాజ మాన్యాలు చెబుతున్నాయి. పాఠశాలల నయా వ్యాపారంతో ఇద్దరు ముగురు పిల్లలున్న వారికి మూడు ల్యాప్ట్యాప్ లు కొనుగోలు చేయడం గగనమౌతోంది. తాజా ట్రెండ్ నేపథ్యంలో తెలంగాణా రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (టీఆర్ఎస్ఎంఏ) కూడా రంగంలోకి దిగింది. ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కొనుగోలు చేయాలనుకున్న తల్లిదండ్రులకు లోన్లు ఇప్పిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా... జిల్లా విద్యాశాఖ అధికారులు మాత్రం తమకు పాఠశాలల యాజమాన్యా లు చేస్తున్న ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల వ్యాపారంపై తమకు ఎ లాంటి ఫిర్యాదులు అందలేదని పేర్కొనడం గమనార్హం. -
సొమ్ములిస్తే మార్కులేస్తాం..
భీమవరం: కరోనా వైరస్ కొన్ని విద్యాసంస్థలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత చేయిస్తామంటూ కొన్ని కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థుల నుంచి పెద్ద మొత్తంలో సొమ్ములు గుంజుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలోని ఒక కార్పొరేట్ విద్యాసంస్థ తమ విద్యార్థుల నుంచి సొమ్ములు వసూలుకు సంబంధించి ఫోన్లో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోవిడ్–19 కారణంగా మార్చి 22వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. దీంతో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు బ్రేక్ పడింది. కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. 10వ తరగతి పరీక్షలను జూలై నెలలో నిర్వహిస్తామని ముందుగా ప్రకటించి ఆ మేరకు షెడ్యూల్ను కూడా విడుదల చేశారు. వైరస్ రోజురోజుకు విస్తరిస్తుండడంతో విద్యార్థులందరినీ ఒకచోట చేర్చి పరీక్షలు నిర్వహించడం వల్ల ఇబ్బందులు వస్తాయని భావించిన ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలను రద్దు చేసింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 50 వేల మంది పదో తరగతి విద్యార్థులు ఉండగా వీరిలో సుమారు 390 ప్రైవేటు హైసూ్కల్స్లో 17 వేల మందికి పైగా పదో తరగతి విద్యార్ధులున్నారు. సమ్మెటివ్ ఎస్సెస్మెంట్ పరీక్ష ఫలితాల ఆధారంగా గ్రేడ్ల నిర్ణయం పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించకపోవడంతో విద్యాశాఖ ఇంతకు ముందు విద్యార్థులకు నిర్వహించిన ఫార్మటివ్ ఎస్సెస్మెంట్(ఎఫ్ఏ), సమ్మెటివ్ ఎస్సెస్మెంట్(ఎస్ఏ) పరీక్షల మార్కులు ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్లు నిర్ణయించాలని ఆదేశాలిచ్చింది. కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు పదో తరగతి విద్యార్థుల నుంచి పెద్ద మొత్తంలో సొమ్ములు వసూలుచేసి ఎక్కువ మార్కులు వేయడానికి కార్యాచరణ రూపొందించినట్లు తెలిసింది. విద్యా సంవత్సరం ప్రారంభం అయిన నాటి నుంచి విద్యార్థులకు నాలుగు ఫార్మటీవ్ ఎస్సెస్మెంట్, ఒక సమ్మెటివ్ అస్సెస్మెంట్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ పరీక్షా ప్రశ్నాపత్రాలను ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులే తయారుచేస్తారు. అలాగే పరీక్షల అనంతరం వాటిని అక్కడి ఉపాధ్యాయులే వేల్యూయేషన్ చేసి మార్కులు వేస్తారు. వాటిని విద్యాశాఖ ఆన్లైన్ సీఎస్ఈ సైట్ను అప్లోడ్ చేస్తుంటారు. ప్రస్తుత విద్యాసంవత్సరం పూర్తిగా క్లాసులు జరగకపోవడంతో ఎఫ్ఏ పరీక్షలు మూడు నిర్వహించగా ఎస్ఏ పరీక్ష ఒకటి నిర్వహించారు. ఎస్ఏ పరీక్షలు నిర్వహించినా ఇంతవరకు వాటిని సీఎస్ఏ సైట్లో అప్లోడ్ చేయలేదని తెలిసింది. ఎఫ్ఏ, ఎస్ఏ పరీక్షల మార్కులు ఆధారంగా గ్రేడ్లు నిర్ణయించడంతో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు తమ విద్యార్థులకు ఫోన్లు చేసి గతంలో మీరు ఎఫ్ఏ పరీక్ష సరిగా రాయలేదని ప్రస్తుతం ఎస్ఏ పరీక్షలో అత్యధిక మార్కులు రాకుంటే మంచి గ్రేడ్ వచ్చే అవకాశం లేనందున సొమ్ములిస్తే మంచి మార్కులు వేస్తామంటూ బేరాలు పెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విధంగా ఒక్కొక్క విద్యార్ధి నుంచి రూ.5 వేలు నుంచి రూ.8 వేలు వరకు వసూలు చేస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా తెలిసింది. గతంలో రాసిన ఎస్ఏ పరీక్ష పత్రం స్థానంలో సొమ్ములు ఇచ్చిన విద్యార్థులతో మళ్లీ జవాబులు రాయించి పాతపేపర్ల స్థానంలో వీటిని పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సొమ్ముల వసూలుపై ఎవరికైనా ఫిర్యాదు చేస్తే తమ బిడ్డల భవిష్యత్తు పాడవుతందనే భయంతో తల్లిదండ్రులు నోరు మెదపడం లేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు భీమవరం ప్రాంతంలోని ఒక కార్పొరేట్ స్కూల్లో విద్యార్థుల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్నారనే ప్రచారంలో వాస్తవం లేదు. అక్కడ డీఐతో విచారణ చేయించాం. ఎక్కడైనా ఇటువంటి అవకతవకలకు పాల్పడితే ఆయా విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటాం. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించక పోవడంతో ఎఫ్ఏ, ఎస్ఏ పరీక్ష మార్కుల ఆధారంగానే విద్యార్థులకు గ్రేడ్ నిర్ణయించే అంశంపై ప్రభుత్వం ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. – సీవీ రేణుక, జిల్లా విద్యాశాఖాధికారిణి -
కార్పొరేట్ దోపిడీ అంతింత కాదయా!
నగరంలోని అన్నమయ్య సర్కిల్ సమీపంలో ఉన్న ఓ కార్పొరేట్ విద్యాసంస్థలో ఒకటో తరగతి చదువుతున్న విద్యారి్థ దగ్గర పుస్తకాల పేరుతో యాజమాన్యం రూ.6,200 వసూలు చేసింది. ప్రస్తుతం లాక్డౌన్ సమయంలో బుక్స్ వాడడం లేదు కదా అని ప్రశి్నస్తే ఆన్లైన్లో క్లాసులు వింటూ బుక్స్ ఉపయోగించాలని సమాధానమిచ్చారు. గత్యంతరం లేక తల్లిదండ్రులు డబ్బులు చెల్లించారు. మినీబైపాస్లో ఉన్న మరో కార్పొరేట్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి (ఒలంపియాడ్)కి ప్రమోషన్ పేరుతో రూ.5 వేలతో పాటు బుక్స్కు రూ.8,160 వసూలు చేశారు. అసలే కరోనా కష్టకాలంలో చేతిలో డబ్బులేకపోయినా అప్పు చేసి మరీ బుక్స్ కొనుగోలు చేయాల్సి వచ్చింది. అందులో టెక్ట్స్బుక్స్ లేవు. కేవలం నోట్ బుక్స్ పేరుతో వేలకు వేలు గుంజుతున్నారు. టెక్ట్స్ బుక్స్కు అదనం. సాక్షి, నెల్లూరు: కరోనా విపత్తుతో ప్రజలు అల్లల్లాడుతుంటే మరో వైపు కార్పొరేట్ విద్యా సంస్థలు దోపిడీలకు తెగబడుతున్నాయి. వీరి ఆగడాలకు కళ్లెం వేసేందుకు ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడతున్నా, జిల్లా విద్యాశాఖ అధికారుల అవినీతిని అడ్డం పెట్టుకుని కార్పొరేట్ విద్యా మాఫియా చెలరేగిపోతోంది. ►కరోనా కారణంగా తల్లిదండ్రులు ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి అరకొర వేతనాలతో బతుకు బండి లాగించడం కష్టంగా ఉన్న సమయంలో కార్పొరేట్ విద్యా సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ►నిబంధనలు ఉల్లంఘించి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసుల నిర్వహణ పేరుతో గతం కంటే అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ►ఆయా పాఠశాలల్లో పనిచేసే ప్రైవేట్ ఉపాధ్యాయులతో పాటు నాన్ టీచింగ్ స్టాఫ్కు కూడా అడ్మిషన్లకు టార్గెట్లు విధించి విద్యార్థులను చేరి్పంచే పని చేయిస్తున్నారు. ►విద్యార్థులను చేర్చుకొనే సమయంలో టెక్నో, ఈ టెక్నో, ఒలంపియాడ్ అంటూ ఆకర్షణీౖయెన పేర్లు చూపి గతేడాది మాదిరిగానే అధిక ఫీజులను వసూలు చేస్తున్నారు. ►కొత్త, పాత విద్యార్థులు తమ విద్యాసంస్థల్లోనే నోట్ బుక్లు, యూనిఫాం, షూస్, ఇతర మెటీరియల్ కొనాలని వేలకు వేలు గుంజుతున్నారు. టెక్ట్స్ బుక్స్కు మాత్రం అదనం. అనుమతి లేకున్నా.. జిల్లాలో 1,065 ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో 385 ప్రాథమిక, 287 ప్రాథమికోన్నత, 385 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 1.80 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటితో పాటు అనుమతి లేని మరో 500 ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు నిర్వహిస్తున్నారు. కరోనా మహమ్మరి విజృంభిస్తుంది. విద్యా సంస్థలకు లాక్డౌన్ అమలవుతున్న క్రమంలో పదో తగరతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దు చేశారు. ఈ తరుణంలో జిల్లాలోని పలు కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థుల కోసం వేట మొదలు పెట్టారు. ►ఐఐటీ ఒలంపియాడ్, టెక్నో, కాన్సెప్్ట, ఈ–టెక్నో, ఈ–శాస్త్ర, కాన్వెంట్, పబ్లిక్ స్కూల్ వంటి ఆకర్షణీమైన పేర్లతో నిర్వహిస్తున్న అధిక విద్యాలయాల్లో పాఠశాల విద్యాశాఖ నిబంధనలు పాటించడం లేదు. ►కనీస వసతులు కూడా లేకుండా అపార్ట్మెంట్లలో పాఠశాలలు, కళాశాలల నిర్వహణ చేస్తున్నారు. అనుమతులు ఒక చోట ఉంటే.. మరో చోట విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు. ►గత ప్రభుత్వ హయాంలో కార్పొరేట్ స్కూళ్ల మాఫియా ఆగడాలకు అంతులేకుండా పోయింది. వీరు నిర్ణయించిందే స్కూల్ ఫీజు. నిబంధనలకు విరుద్ధంగా నోట్ బుక్స్, యూనిఫాం, షూస్ విక్రయాలు నిరాటంకంగా జరుగుతున్నాయి. నోట్ బుక్స్ వ్యాపారమే రూ.100 కోట్లు! జిల్లాలో విద్యా సంస్థలు విద్యార్థుల చేత ఏటా కొనిపించే నోట్ బుక్స్ వ్యాపారం రూ.150 కోట్ల పైమాటే. ఒలంపియాడ్ స్థాయి పాఠశాలల్లో 6,7 తరగతులకు రూ.8,160, 8 నుంచి 10వ తరగతులకు రూ.8,800 వంతున వసూలు చేస్తున్నారు. ►ఇక ఈ–టెక్నో, టెక్నో స్థాయి విద్యా సంస్థలు 6, 7 తరగతులకు రూ.6,200, 8 నుంచి 10వ తరగతులకు రూ.6,750 లెక్కన ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ►ఆయా విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ప్రకారం వారి వద్ద వసూలు చేస్తున్న మొత్తాన్ని లెక్కిస్తే సుమారు రూ.100 కోట్ల పైమాటే ఉంటుంని అంచనా. యూనిఫాం, షూస్ వ్యాపారం డబుల్ ఆయా పాఠశాలల్లో చదివే పిల్లలు తమ యూనిఫాం మాత్రమే కొనాలని షరతులు పెడుతున్నాయి. ఇందు కోసం ఏటా ఒక్కొ విద్యారి్థకి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన సుమారు రూ.200 కోట్లు ఉంటుందని అంచనా. ఫీజుల గుంజుడు జిల్లాలో కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో అధికంగా ఫీజులను గుంజుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఐఐటీ ఒలంపియాడ్, టెక్నో, కాన్సెప్ట్, ఈ–టెక్నో, ఈ–శాస్త్ర, కాన్వెంట్, పబ్లిక్ స్కూల్ తదితర ఆకర్షణీయ పేర్లతో భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ►కొన్ని కార్పొరేట్ స్కూళ్లలో ఒలంపియాడ్ పేరుతో 6వ తరగతి చదివే విద్యారి్థకి రూ.80 వేలు వంతున వసూలు చేస్తున్నారు. ►ప్లేక్లాస్ చదివే విద్యార్థి నుంచి స్కూల్ను బట్టి రూ.20 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు ఫీజులు పిండుతున్నారు. ►ఆరో తరగతి విద్యార్థికి అయితే రూ.80 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. ►విద్యార్థి జాయిన్ చేసిన వారం రోజుల నుంచే అడ్మిషన్ నంబర్ కోసం 60 శాతం ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులపై తీవ్రంగా ఒత్తిడి పెంచుతున్నారు. ►సామాన్యులు సకాలంలో ఫీజులు చెల్లించకపోతే వారిని నానా రకాలుగా మాటలతో ఇబ్బందులు పెడుతున్న ఘటనలు ఉన్నాయి. పిల్లల భవిష్యత్ కోసం గత్యంతరం లేక కార్పొరేట్ మాఫియా ఒత్తిడితో అప్పులు తెచ్చి మరీ ఫీజులు చెల్లిస్తున్నారు. ఫీజులకు ప్రభుత్వం కళ్లెం వేస్తున్నా.. వివిధ రకాల పేర్లతో రూ.లక్షల్లో ఫీజులు దండుకుంటున్న కార్పొరేట్ విద్యా సంస్థల భరతం పట్టేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ►వసతులు ఏర్పాటు చేయకుండా నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా విద్యాసంస్థలు నిర్వహిస్తూ ఆగడాలకు పాల్పడుతున్న యాజమాన్యాలకు ముకుతాడు వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ►కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో వసతులు, వనరుల సమగ్ర సమాచారాన్ని ఫొటోలతో అన్లైన్లో అప్లోడ్ చేయాలని ఏపీ పాఠశాలల ఫీజు రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్ ఆదేశించింది. ►అయితే తమ బండారాలు బయట పడతాయన్న సాకుతో కార్పొరేట్ మాఫియా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తోంది. ►ప్రభుత్వం కార్పొరేట్పై చర్యలు తీసుకుంటుంటే జిల్లా విద్యాశాఖ అ«ధికారులు మాత్రం ఆ సెక్టార్కు దాసోహమై తనిఖీలు చేయడం మానేశారు. దీంతో ఆ విద్యాసంస్థల యాజమాన్యాలు మాత్రం తమ తీరును మార్చుకోకుండా యథావిధిగా దోపిడీ చేస్తున్నారు. అమలు కానీ నిబంధనలు పదో తరగతి లోపు విద్యార్థుల నుంచి ఏటా రూ.15 వేల వరకు ఫీజులు వసూలు చేసేందుకు అవకాశం ఉంది. పలు పాఠశాలల్లో రూ.80 వేలు కూడా వసూలు చేస్తున్నారు ►జీఓ నంబర్ 1 1984 ప్రకారం విద్యార్థులకు వసతులు క్రీడాప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలి ►జీఓ నంబర్ 88/2008 ప్రకారం 200 మంది విద్యార్థులు ఉంటే క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలి. అగ్ని ప్రమాదాల నుంచి నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలి. ►2009 విద్యాహక్కు చట్టాన్ని అనుసరించి ప్రైవేట్ విద్యాసంస్థల్లో 25 శాతం పేద విద్యార్థులకు ఉచిత విద్యనందించాలి. పుస్తకాలు అమ్మితే చర్యలు నెల్లూరు (టౌన్): కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు అమ్మితే చర్యలు తీసుకుంటామని డీఈఓ జనార్దనాచార్యులు ఒక ప్రకటనలో హెచ్చరించారు. కొంత మంది అమ్ముతున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు తమ దృష్టికి తీసుకు వచ్చారని చెప్పారు. ఈ ప్రభుత్వ ఉత్తర్వులను ఏ పాఠశాల యాజమాన్యమైన ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
కార్పొరేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు ముకుతాడు
సాక్షి, అమరావతి: అనుమతులకు భిన్నంగా, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల అక్రమాలకు ఇక అడ్డుకట్ట పడనుంది. ఈ మేరకు ప్రభుత్వం కాలేజీల్లో విద్యార్థుల సంఖ్యను పరిమితం చేయడంతో పాటు తగిన సదుపాయాలు ఉంటేనే అనుమతులు ఇచ్చేలా కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. అడ్మిషన్లను ఆన్లైన్లో నిర్వహించడం, ఫీజుల నియంత్రణ వంటి అనేక సంస్కరణలకు చర్యలు చేపట్టింది. అలాగే ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లూ నిబంధనల ప్రకారం నడిచేలా చర్యలు తీసుకుంటోంది. మరోపక్క జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లను కూడా ఆన్లైన్లో ఇంటర్బోర్డు నిర్వహించేలా చర్యలు చేపడుతోంది. దీంతో కాలేజీల అడ్డగోలు అడ్మిషన్లకు అడ్డుకట్ట పడుతుంది. ఒక్కో సెక్షన్లో 40 మందికి మాత్రమే జూనియర్ కాలేజీల్లో ప్రతి సెక్షన్లో 40 మందినే పరిమితం చేస్తూ ప్రభుత్వం ఈ నెల 13న జీఓ 23ను విడుదల చేసింది. గతంలోని జీఓలను సవరిస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ ఈ ఉత్తర్వులను విడుదల చేశారు. దీని ప్రకారం కాలేజీలో సెక్షన్కు 40 మంది చొప్పున కనిష్టంగా 4, సదుపాయాలను అనుసరించి గరిష్టంగా 9 సెక్షన్లకు అనుమతిస్తారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉండగా 2002 మే 13న జీఓ 12ని విడుదల చేసి ప్రతి సెక్షన్లో 88 మందిని చేర్చుకోవచ్చని అనుమతులిచ్చారు. దీంతో అనేక సమస్యలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో సెక్షన్ల వారీగా విద్యార్థుల సంఖ్యను పరిమితం చేస్తూ పాత జీఓను సవరించి ప్రభుత్వం తాజాగా జీఓను విడుదల చేసింది. మాధ్యమిక శిక్షా అభియాన్, సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిబంధనల ప్రకారం కూడా తరగతికి 40 మంది మాత్రమే ఉండాలన్న నిబంధనల ప్రకారం ఈ మార్పులు చేపట్టింది. – ప్రతి ప్రైవేట్ జూనియర్ కాలేజీకి సెక్షన్కు 40 మంది చొప్పున 4 సెక్షన్లను మంజూరు చేస్తారు. కనిష్టంగా 160 మంది విద్యార్థుల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. – భవనాలు, ఫ్యాకల్టీ, తరగతి గదులు, ల్యాబ్లు, ఇతర వసతి సదుపాయాలన్నీ కల్పిస్తే గరిష్టంగా సెక్షన్కు 40 మంది చొప్పున 9 సెక్షన్లకు అనుమతిస్తారు. – ఎంపీసీ, బైపీసీ మాత్రమే కాకుండా ఇక నుంచి తప్పనిసరిగా కామర్స్, ఆర్ట్స్ అండ్ హ్యూమానిటీస్ కోర్సులు కూడా నిర్వహించాలి. – నిబంధనల ప్రకారం అన్ని సదుపాయాలూ ఉంటేనే ఆన్లైన్ అనుమతి – ఇప్పటికే దీనిపై బోర్డు నోటిఫికేషన్ను కూడా విడుదల చేసి దరఖాస్తులను ఆన్లైన్లో అందించాలని స్పష్టం చేసింది. – ఇప్పటివరకు పలు కార్పొరేట్ జూనియర్ కాలేజీలు తమ ఇష్టానుసారం విద్యార్థులనుచేర్చుకోవడం, విద్యార్థులకు సరిపడ తరగతి గదులు లేకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి ప్రాథమిక సదుపాయాలు కూడా లేకుండానే కొనసాగుతూ వచ్చాయి. ఇకనుంచి వీటికి కళ్లెం పడనుంది. –నిబంధనల ప్రకారం అన్ని సదుపాయాలూ ఉంటేనే అన్లైన్ అనుమతి – రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ కోర్సులు నిర్వహించే కాలేజీల యాజమాన్యాలు తప్పనిసరిగా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలన్నిటినీ పాటించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అప్పుడే వాటికి ఇంటర్మీడియెట్బోర్డు 2020–21 అనుమతులు మంజూరు చేయనుంది. ఇప్పటికే దీనిపై బోర్డు సవివరమైన నోటిఫికేషన్ను కూడా విడుదల చేసి దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలని కాలేజీలకు సూచించింది. కాలేజీల ఏర్పాటు, అదనపు సెక్షన్లను నెలకొల్పడానికి ఉండాల్సిన సదుపాయాల గురించి స్పష్టంచేసింది. అందుకు సంబంధించిన అధికారిక డాక్యుమెంట్లను కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ఈ సదుపాయాలుండాల్సిందే: – ఆన్లైన్ దరఖాస్తు ఫారం ‘హెచ్టీటీపీఎస్://బీఐఈ.ఏపీ.జీఓఈ.ఐఎన్’లో పొందుపరిచిన ఇంటర్మీడియెట్బోర్డు దరఖాస్తుతో పాటు సదుపాయాలపై సంబంధిత డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలని స్పష్టంచేసింది. – కాలేజీ భవనం, తరగతి గదులు, ల్యాబ్లు, లైబ్రరీ, ఆటస్థలం తదితరాల ఫొటో ఇమేజ్లను జియో ట్యాగింగ్ ద్వారా అప్లోడ్ చేయాలి. – బోర్డు వాటన్నిటినీ పరిశీలించనుంది. వీటిని ప్రజలకు తెలిసేలా పబ్లిక్ డొమైన్లో ఉంచుతుంది. సదుపాయాలు లేనట్లుగా గుర్తిస్తే చర్యలు తీసుకుంటుంది. – అదనపు సెక్షన్లకు వీలుగా ఆర్సీసీ భవన వసతి, అదనపు తరగతులకు గదులు ఉండాల్సిందే. – భవనపు రిజిస్టర్డ్ లీజ్ డీడ్, సొంత భవనమైతే సంబంధిత రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు, ఆటస్థలం కూడా ఉండాలి. – అనుమతి ఉన్న భవన నిర్మాణ ప్లాన్, ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్, శానిటరీ, స్ట్రక్చరల్ సౌండ్నెస్ సర్టిఫికేట్లతో పాటు సంబంధిత అధికారవర్గాల నిరభ్యంతర పత్రాలను కాలేజీలు బోర్డు పరిశీలనకు సమర్పించాల్సి ఉంటుంది. – పార్కింగ్ స్థలం, బోధన, బోధనేతర సిబ్బంది వివరాలు, వారి అర్హతలకు సంబంధించిన వివరాలనూ సమర్పించాలి – బోర్డునుంచి ఎలాంటి అనుమతి లేకుండా యాజమాన్యాలు కొత్తగా ఎలాంటి సెక్షన్లను తెరిచేందుకు వీలులేకుండా చర్యలు చేపట్టారు. అడ్డగోలు ఫీజులకూ అడ్డుకట్ట: ప్రైవేట్ కాలేజీలు సాగిస్తున్న ఫీజుల దందాలకు కూడా ప్రభుత్వం అడ్డుకట్ట వేయనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జస్టిస్ ఆర్.కాంతారావు నేతృత్వంలోని ఈ కమిషన్ పాఠశాల విద్యలో ప్రమాణాల పెంపుతోపాటు, పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో నిబంధనల మేరకు సదుపాయాలుండేలా చర్యలు చేపట్టింది. స్కూళ్లు నిర్ణీత ఫీజులు మాత్రమే వసూలు చేసేలా కార్యాచరణ ప్రారంభించింది. ఇందుకు సంబంధించి మంగళవారం నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఫీజులను నిర్ధారించనుంది. ఇందుకోసం యాజమాన్యాలు తప్పనిసరిగా తమ వివరాలను కమిషన్కు సమర్పించాలి. లేకపోతే ఆ సంస్థలకు ఫీజు వసూలుకు అనుమతి ఉండదు. – అన్ని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు ఫీజుల ప్రతిపాదనలకు సంబంధించిన సమాచారాన్ని కమిషన్ వెబ్సైట్‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎస్ఈఆర్ఎంసీ.ఏపీ.జీఓవీ.ఐఎన్’ కు ఆన్లైన్ ద్వారా నిర్ణీత ఫార్మాట్లో షెడ్యూళ్లలో సమర్పించాలి. ఇందుకు జూన్ 9 వరకు గడువిచ్చారు. యాజమాన్యాల ప్రతిపాదనలు, ఇతర వివరాల ఆధారంగా ఫీజులను నిర్ణయిస్తారు. –మొదటి త్రైమాసికానికి సంబంధించిన ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలి. – అధిక ఫీజులు వసూలు చేసినా, కాలేజీలు, స్కూళ్లు తెరవకుండానే ఫీజులు వసూలు చేసినా చర్యలు తప్పవు. – ప్రతి ప్రయివేటు అన్ ఎయిడెడ్ స్కూలు, కాలేజీ తమ సంస్థల భవనాలు, తరగతి గదులు, ల్యాబ్లు ఇతర సదుపాయాలను జియో ట్యాగింగ్ యాప్ ద్వారా కమిషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. – కాలేజీ, పాఠశాల గుర్తింపు వివరాలు, సెక్షన్లు , బిల్డింగ్ వివరాలు , గత ఏడాది ఫీజుల వివరాలు , ఉద్యోగుల వివరాలు , కిచెన్ హాస్టల్ వివరాలు, వచ్చిన ఫీజులు. ఖర్చుల వివరాలు , ఇతర డాక్యుమెంట్లు అప్లోడ్ చేసేలా నిబంధనలు విధించారు. -
ఇంటర్నేషనల్ స్కూళ్లపై యమా క్రేజ్
సాక్షి, అమరావతి: గత దశాబ్దన్నర కాలంగా దేశీయ విద్యా రంగం కొత్త పుంతలు తొక్కుతూ సరికొత్త రూపు సంతరించుకుంటోంది. కాన్వెంట్లు పోయి కార్పొరేట్ స్కూళ్లు వచ్చాయి. ఇప్పుడు ఆ ట్రెండ్లోను మార్పులు చోటుచేసుకుంటున్నాయని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. తల్లిదండ్రులు ఇంటర్నేషనల్ స్కూళ్ల వైపు మొగ్గుచూపుతున్నారని ప్రముఖ సంస్థ ఐఎస్సీ(ఇంటర్నేషనల్ స్కూల్ కన్సల్టెన్సీ) తన తాజా నివేదికలో వెల్లడించింది. ఏడేళ్ల వ్యవధిలో దేశంలో ఇంటర్నేషనల్ స్కూళ్ల సంఖ్య రెండింతలవడమే అందుకు నిదర్శనమని పేర్కొంది. అలాగే ఇంటర్నేషనల్ స్కూళ్ల సంఖ్యలో మన దేశం ప్రపంచంలోనే రెండోస్థానంలో ఉందని, వాటి ట్యూషన్ ఫీజుల టర్నోవర్ ఏకంగా రూ.8,615 కోట్లకు చేరిందని వెల్లడించింది. అత్యున్నత స్థాయి విద్యా ప్రమాణాలు అందించాలనే తాపత్రయంతో ధనిక వర్గాలే కాకుండా ఎగువ మధ్యతరగతి వర్గాలు కూడా తమ పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. ఐఎస్సీ తాజా నివేదిక ప్రకారం ఇంటర్నేషనల్ స్కూళ్ల సంఖ్యలో చైనా మొదటి స్థానంలో నిలవగా.. మనం రెండో స్థానం దక్కించుకున్నాం. విదేశీ విద్యపై మోజుతోనే.. గత 15 ఏళ్లుగా ఉన్నత విద్య కోసం మన దేశం నుంచి విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో పాఠశాల విద్య కూడా ఇంటర్నేషనల్ సిలబస్లో ఉంటే మంచిదనే భావన తల్లిదండ్రుల్లో పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో 2012 నాటికి దేశంలో ప్రథమ శ్రేణి నగరాలకే పరిమితమైన ఇంటర్నేషనల్ స్కూళ్లు ఇప్పుడు చిన్న నగరాలకు కూడా విస్తరించాయి. ఇవి ఎక్కువగా కేంబ్రిడ్జ్ ప్రైమరీ, సెకండరీ, అడ్వాన్స్డ్ ప్రోగ్రాం కోర్సులు అందిస్తున్నాయి. అంతర్జాతీయంగా విశేష గుర్తింపున్న ‘ఇంటర్నేషనల్ జనరల్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్’ కోర్సులో పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో ఇంటర్నేషనల్ స్కూళ్లలో చదువుతున్న వారిలో 63.40 శాతం భారతీయులు కాగా మిగిలినవారు విదేశీయుల పిల్లలు. విదేశీ దౌత్యవేత్తలు, కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న విదేశీయుల పిల్లలు దాదాపు 36 శాతం ఉన్నారు. భారీగానే ఫీజులు మన దేశంలోని ఇంటర్నేషనల్ స్కూళ్లలో ఏడాదికి ఒక్కో విద్యార్థికి రూ. 2.87 లక్షల నుంచి రూ. 7.17 లక్షల వరకు ట్యూషన్ ఫీజుగా వసూలు చేస్తున్నారు. అయితే ఇతర దేశాలతో పోలిస్తే మన దగ్గర తక్కువేనని ఐఎస్సీ నివేదిక పేర్కొంటుంది. మన దేశంలో ఇంటర్నేషనల్ స్కూళ్ల సగటు వార్షిక ఫీజు రూ. 2.36 లక్షలు కాగా.. చైనాలోరూ. 11.29 లక్షలు, యూఏఈలో రూ. 5.79 లక్షలుగా ఉంది. మున్ముందు దేశంలో ఇంటర్నేషనల్ స్కూళ్ల ప్రాభవం మరింతగా పెరుగుతుందని ఐఎస్సీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐఎస్సీ 1994 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ స్కూళ్లకు సంబంధించిన డేటాను సేకరిస్తూ విశ్లేషిస్తోంది. -
అనుమతి లేకుండా టాలెంట్ టెస్ట్
సాక్షి, విజయనగరం క్రైమ్: విద్యాశాఖ నుంచి ఎటువంటి అనుమతుల్లేకుండా ఆకాష్, పిట్జీ వంటి కార్పొరేట్ విద్యాసంస్థలు టాలెంట్ టెస్ట్ నిర్వహించడం గందరగోళానికి దారితీసింది. పరీక్ష రాసేందుకు ఒక్కో విద్యార్థి నుంచి 500 రూపాయలను ఆన్లైన్ ద్వారా వసూలు చేశారు. ఐదో నుంచి పదో తరగతి విద్యార్థులకు జిల్లా కేంద్రంలో ఆదివారం పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. విశాఖకు చెందిన ఈ కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యాహక్కు చట్టం, బాలల హక్కులను తుంగలో తొక్కి పరీక్షలు నిర్వహిస్తున్నాయన్న విషయం తెలుసుకున్న జాతీయ మానవ హక్కుల సంఘ ప్రతినిధులు సత్తి అచ్చిరెడ్డి, తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. అక్కడ నుంచి జిల్లా విద్యాశాఖాధికారులతో ఫోన్లో మాట్లాడగా...పరీక్షల నిర్వహణకు ఎటువంటి అనుమతుల్లేవని చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ నాయకులు స్థానిక తోటపాలెంలో ఉన్న పరీక్ష కేంద్రమైన ఫోర్ ఎస్ డిగ్రీ కళాశాల వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. హాల్టికెట్ చూపిస్తున్న విద్యార్థి పరీక్ష నిర్వహిస్తున్న ఇన్విజిలేటర్లను ప్రశ్నించగా వారి వద్ద నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఎస్ఎఫ్ఐ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మానవహక్కుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. అచ్చిరెడ్డి మాట్లాడుతూ, అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఇదే తంతు జరుగుతున్నా ఏ ఒక్కరూ దీనిపై దృష్టి సారించకపోవడం విచారకరమన్నారు. కార్పొరేట్ మాయాజాలంలో పడి విద్యార్థుల భవిష్యత్, స్వేచ్ఛను హరించవద్దని తల్లిదండ్రులకు సూచించారు. కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల మేరకే ఎంట్రన్స్, మోడల్ టెస్ట్లు వంటివి నిర్వహించుకోవాలే తప్ప అధిక రుసుం వసూలు చేయకూడదన్నారు. విద్యాశాఖ, పోలీస్, ఎస్ఎఫ్ఐ సహకారంతో పరీక్షను నిలిపివేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సింహాద్రిస్వామి, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఫీజుల నియంత్రణ.. ఓ పదేళ్ల పాత మాట
హైదరాబాద్ నగరం నడిబొడ్డున మంచి పేరున్న ఓ ఇంజనీరింగ్ కాలేజీలో వార్షిక ఫీజు రూ.78 వేలు మాత్రమే. ఇక సాధారణ ఇంజనీరింగ్ కాలేజీలో అయితే కనీస వార్షిక ఫీజు రూ.35 వేలే. అదే నగరంలోని ఆ కాలేజీకి రెండు కిలోమీటర్ల పరిధిలోని ఓ కార్పొరేట్ స్కూల్లో పదో తరగతి చదివే విద్యార్థి వార్షిక ఫీజు రూ.85 వేలు. అంటే ఇంజనీరింగ్ కంటే పదో తరగతి చదివే విద్యార్థి ఫీజే ఎక్కువ. పోనీ విద్యార్థులకు సదుపాయాలు, టీచర్ల వేతనాల విషయంలో ఇంజనీరింగ్ కాలేజీకంటే ఎక్కువగానే కల్పిస్తున్నారా? అంటే అదీ చెప్పలేని పరిస్థితే. కనీసం స్కూల్లోని విద్యా ర్థులందరికీ నాణ్యమైన విద్య అందుతోందా? అంటే అదీ లేదు. మొన్నటి పదో తరగతి పరీక్షల్లో ఆ స్కూల్కు చెందిన చాలామంది విద్యార్థులు ఫెయిలయ్యారు. అందులో శ్రీవర్ధన్ అనే విద్యార్థి ఉన్నాడు. అతని తండ్రి రాజేందర్రెడ్డి ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసే ఉద్యోగి. వరంగల్ నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన తన కొడుకును కార్పొరేట్ స్కూల్లో చేర్చాడు. అప్పులు చేసి మరీ చదివించినా ఫలితం లేకుండా పోయింది. సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇలా అనేకమంది తండ్రులు తమ పిల్లలను బాగా చది వించాలన్న తపనతో కార్పొరేట్, పేరున్న ప్రైవేటు స్కూళ్లలో చేర్చి ఆర్థికంగా అప్పులపాలు అవుతున్నారు. రాష్ట్రంలో 10,526 ప్రైవేటు పాఠశాలలు ఉంటే అందులో 30,77,884 మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో 3,487 కార్పొరేట్, టాప్ పాఠశాలలు ఐఐటీ, ఒలంపియాడ్, టెక్నో, కాన్సెప్ట్, ఈ–టెక్నో, ఈ–శాస్త్ర, కాన్వెంట్, పబ్లిక్ స్కూల్ వంటి 62 రకరకాల పేర్లతో రూ.లక్షల్లో కేపిటేషన్ ఫీజులు, డొనేషన్లు వసూలు చేస్తున్నాయి. చివరకు నర్సరీ నుంచే ఐఏఎస్ పాఠాలు? అంటూ దోపిడీకి పాల్పడుతున్నాయి. ఈ తంతు ఏళ్ల తరబడి కొనసాగింది.. కొనసాగు తూనే ఉంది. ఎలాంటి శాస్త్రీయత లేకుండానే ఫీజులు వసూలు చేస్తున్నా స్కూల్ ఫీజుల నియంత్రణ ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. 25 శాతం ఫీజుల పెంపు.. ప్రభుత్వం వద్దన్నా రాష్ట్రంలో ప్రముఖ ప్రైవేటు పాఠశాలలు, కార్పొరేట్ స్కూళ్లు ఈసారి 25% వరకు ఫీజులను పెంచే శాయి. అయినా ఫీజుల నియంత్రణ రాష్ట్రంలో అమలుకు నోచుకోవడం లేదు. ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే కోర్టు కేసులు.. ఆ తర్వాత ఇష్టారాజ్యంగా పెంపు ఏటా ఇదే తంతు. పోనీ ఆ ఫీజుల వసూలు, పెంపులో ఏమైనా శాస్త్రీయత ఉంటుందా? అంటే అదీ లేదు. యాజమాన్యాల ఇష్టారాజ్యం కొనసాగుతున్నా అడ్డుకట్ట పడక తల్లిదండ్రులు వాపోతున్నారు. పిల్లలను బాగా చదివించాలన్న ఆశలతో అప్పులు చేసి మరీ ఫీజులను చెల్లించక తప్పడం లేదు. శాస్త్రీయత ఎక్కడ..? ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కాదు.. వాటి ఖరారులోనే శాస్త్రీయ విధానం లేదు. ప్రభుత్వాలు గత పదేళ్లుగా అనేక చర్యలు చేపట్టినా న్యాయ వివాదాల్లోనే అవన్నీ చిక్కుకున్నాయి. ఫీజులను కట్టడి చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉన్నా అధికారులు దానిని పక్కాగా చేపట్టేలా చేయడంలో విఫలం అవుతున్నారు. ఫలితంగా పలు సందర్భాల్లో వృత్తి విద్యా కాలేజీల తరహాలో ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసి పాఠశాలల ఫీజులను నియంత్రించాలని, యాజమాన్యాల ఆదాయ వ్యయాలను బట్టి ఫీజులను ఖరారు చేయాలనే ఆలోచన చేసినా, వాటిని పకడ్బందీగా చేయడంలో విఫలం కావడంతో ఆ ఉత్తర్వులు న్యాయ వివాదాల్లో చిక్కుకున్నాయి. ప్రతిసారీ ఏదో ఒక కారణంతో.. రాష్ట్రంలో ప్రైవేటు స్కూల్ ఫీజుల నియంత్రణ ఒక్కోసారి ఒక్కో కారణంతో ఆగిపోతోంది. 2009లో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం జీవో 91, 92లను జారీ చేసింది. దాని ప్రకారం జిల్లా స్థాయిలో జిల్లా ఫీజుల నియంత్రణ కమిటీలను (డీఎఫ్ఆర్సీ) ఏర్పాటు చేసి ఫీజులను ఖరారు చేయాలని పేర్కొంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఏటా గరిష్టంగా రూ.24 వేలు, ఉన్నత పాఠశాలల్లో రూ.30 వేలు ట్యూషన్ ఫీజును మాత్రమే వసూలు చేసుకోవచ్చని వెల్లడించింది. ఆ ఉత్తర్వులపై ప్రైవేటు పాఠశాలలు హైకోర్టును ఆశ్రయించాయి. డీఎఫ్ఆర్సీల ఏర్పాటు సరిగ్గా లేదని, జిల్లా స్థాయిలో ఫీజుల ఖరారు కుదరదని 2010లో హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో ప్రభుత్వం జీవో 41, 42లను జారీ చేసింది. అందులో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పట్టణ ప్రాంతాల్లో అయితే ఏడాదికి గరిష్టంగా రూ.9 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.7,800 వసూలు చేయాలని పేర్కొంది. ఉన్నత పాఠశాలల్లో పట్టణాల్లో రూ.12 వేలు, గ్రామాల్లో రూ.10,800లకు మించి వసూలు చేయవద్దని పేర్కొంది. అయితే ఆ జీవోపైనా 2016లో యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో వాటి అమలు ఆగిపోయింది. హైకోర్టులో పిల్.. ఆపై కమిటీ.. 2016లో ఫీజుల నియంత్రణపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తుంటే మీరేం చేస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. విద్యాశాఖ ఫీజుల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేసేందుకు అధికారుల కమటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదికను ప్రభుత్వానికి విద్యాశాఖ పంపించింది. ఆ తర్వాత ప్రభుత్వం మాజీ వైస్ చాన్స్లర్ తిరుపతిరావు నేతృత్వంలో కమిటీని 2017 మార్చిలో నియమించింది. ఆ కమిటీ కూడా పలు సిఫారసులు చేసింది. ప్రైవేటు స్కూళ్లు ఏటా ఫీజులను 10 శాతంలోపు పెంచుకోవచ్చని, అందుకు ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని కమిటీ నివేదించడంతో ప్రభుత్వం ఆ నివేదికను పక్కన పెట్టింది. దానిపై నిర్ణయం తీసుకునే వరకు ఫీజులను పెంచవద్దని 2018 ప్రారంభంలో ఉత్తర్వులు జారీ చేసింది. దానిపై యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో ఫీజుల నియంత్రణ ఆగిపోయింది. ఆదాయ వ్యయాలను బట్టి నిర్ణయించేలా? ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం పక్కా చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. పాఠశాలలు ఇష్టారాజ్యంగా కాకుండా పాఠశాలల ఆదాయ వ్యయాలను బట్టి ఫీజులను నిర్ణయించే వ్యవస్థను అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అప్పుడే ఫీజుల నిర్ణయం, వసూళ్లలో శాస్త్రీయత ఉంటుందని, ఆదాయ వ్యయాలను బట్టి ఫీజులు నిర్ణయిస్తే భారం కూడా తగ్గే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని పేర్కొంటున్నారు. -
అమ్మఒడి పథకం ఆమోదయోగ్యమే..
సాక్షి, చిత్తూరు : సీఎం జగన్ ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు స్కూల్స్ మేనేజ్మెంటు అసోసియేషన్ (అపుస్మా) జిల్లా సభ్యులు అన్నారు. మంగళవారం ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. కేవలం ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే అమ్మఒడి పథకం అమలు చేయాలనే కొందరి వాదన సరికాదన్నారు. పలు రంగాల్లో రాణిస్తున్న 90 శాతం మంది ప్రైవేటు స్కూళ్లల్లో చదువుకుని వచ్చిన వారే అని వెల్లడించారు. కూలీ పని చేసుకుని జీవనం సాగించే వారు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలను తాము కించపరచడం లేదని అభిప్రాయపడ్డారు. నిబంధనలు పాటించకుండ ఉన్న కార్పొరేట్ స్కూళ్లను అధికార యంత్రాంగం కట్టడి చేయాలని కోరారు. ప్రతి తల్లి ఖాతాలో రూ.15 వేలు ఏడాదికి జమచేస్తామని చెప్పడం హర్షణీయమన్నారు. సమావేశంలో సభ్యులు ఎస్ఎస్కే రాజా, గోపాలకృష్ణమూర్తి, తేజోమూర్తి, రమణ తదితరులు పాల్గొన్నారు. -
పిల్లలను చేర్చితేనే జీతాలు
గుంటూరు ఎడ్యుకేషన్: కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలకు హద్ధు అనేది లేకుండా పోతోంది. ప్రతి ఏటా విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందుగా అడ్మిషన్లు చేపట్టడం సాధారణమే అయినా ప్రస్తుతం కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల యాజమాన్యాలు అవలంభిస్తున్న తీరుతో బోధన, బోధనేతర సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకూ పాఠశాలలకు, జూన్ మొదటి వారం వరకూ జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులు ప్రకటించింది. అయితే గత విద్యాసంవత్సరం ముగిసి, సెలవులు మొదలైన ఏప్రిల్ 24 నుంచి ఉపాధ్యాయులతో పాటు అధ్యాపకులకు, బోధనేతర సిబ్బందికి సెలవులు ఇవ్వకుండా అడ్మిషన్ల పేరుతో ఇంటింటికీ పంపడం ప్రారంభించారు. బోధన, బోధనేతర సిబ్బందికి వారి స్థాయి, హోదాను బట్టి టార్గెట్లు విధించి, అడ్మిషన్ తెస్తేనే వేతనం, లేకపోతే చివాట్లు పెట్టే పద్ధతి ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది. ప్రభుత్వ రంగంలోని పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో బోధన, బోధనేతర వృత్తి చేపట్టాలనే లక్ష్యంతో బీఈడీ, డీఎడ్, ఎంఈడీ, ఎమ్మెస్సీ విద్యార్హతలు కలిగిన విద్యావంతులు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలను సాధించలేక, విధి లేని పరిస్థితుల్లో ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఉద్యోగాలను చేస్తున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో ఎంతటి పని భారాన్నైనా తట్టుకుని వెళుతుండగా, ఏడాదిలో 10 నెలలు సజావుగా సాగుతున్న పరిస్థితుల్లో వేసవి సెలవుల్లో వారికి గడ్డు కాలం ఎదురవుతోంది. మే నెలలో ఇచ్చిన టార్గెట్ ప్రకారం అడ్మిషన్లు చేసిన వారికే జూన్ నెలలో వేతనం ఇస్తామని కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు స్పష్టం చేయడంతో ఉపాధ్యాయులు, సిబ్బంది పరిస్థితి దిక్కుతోచని విధంగా మారింది. గుంటూరు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా క్యాంపస్లు కలిగి ఉన్న శ్రీ చైతన్య, నారాయణ, భాష్యం, ఎన్నారై అకడమీ తదితర కార్పొరేట్ విద్యాసంస్థల మధ్య నెలకొన్న తీవ్రమైన పోటీ నేపథ్యంలో ఆయా సంస్థల్లో పని చేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది అడ్మిషన్ల వేటలో సమిధలుగా మారుతున్నారు. మండు టెండల్లో ఇంటింటికీ తిరుగుతూ తల్లిదండ్రులకు తమ విద్యాసంస్థల ప్రగతి గురించి వివరించి, కరపత్రాలు, బ్రోచర్లు ఇచ్చి వస్తున్నారు. అడ్మిషన్ కోసం వెళ్లిన సమయంలో అడ్మిషన్ ఖరారు చేసేందుకు కొంత మొత్తం ఫీజును వసూలు చేసేందుకు తల్లిదండ్రుల కాళ్లా, వేళ్లా పడి ప్రాధేయపడాల్సి వస్తోంది. జిల్లా కేంద్రంతో పాటు తెనాలి, నరసరావుపేట, మంగళగిరి, సత్తెనపల్లి, బాపట్ల వంటి పట్టణాల్లోని ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు ఈ విధంగా అడ్మిషన్ల డ్రైవ్ నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయినులు అడ్మిషన్ల కోసం ఇంటింటికీ తిరుగుతూ భద్రత లేని ఉద్యోగం చేస్తున్నారు. ఎండల కారణంగా సాయంత్రం 7.00 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ సుదూర ప్రాంతాలకు సైతం వెళ్లి అడ్మిషన్లు కోసం ఇంటింటికీ తిరుగుతున్నారు. ఇటీవల గుంటూరు నుంచి చౌడవరం గ్రామానికి అడ్మిషన్ల కోసం వెళ్లిన ఓ ఉపాధ్యాయిని జాతీయ రహదారిపై ప్రమాదానికి గురై, ఆస్పత్రి పాలైంది. అడ్మిషన్ పేరుతో తెస్తున్న అధిక ఒత్తిడి భరించలేక నగరానికి చెందిన ఒక ఉపాధ్యాయుడు పక్షవాతానికి గురై మంచం పట్టారు. ఆయా క్యాంపస్లలో ప్రిన్సిపాళ్లు, డీన్లు, ఏజీఎం, డీజీఎంల వరకూ ఎవరి స్థాయిలో వారు అడ్మిషన్ల కోసం తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తుండటంతో సిబ్బంది ఉద్యోగం మానేస్తున్నారు. అడ్మిషన్ తెస్తేనే జీతం చెల్లిస్తామని, లేకుంటే లేదని బెదిరిస్తున్న సంఘటనలపై బయటకు చెప్పుకోలేక ఆందోళన చెందుతున్నారు. కార్పొరేట్ యాజమాన్యాల తీరుతో తీవ్ర కలత చెందుతున్న మధ్య తరగతి ఉద్యోగులు, ఉపాధ్యాయులు వేరే దారి లేక, ఒక్కో సారి తల్లిదండ్రులు పెడుతున్న చివాట్లను భరిస్తున్నారు. ఫిర్యాదు చేసినాపట్టించుకోవడం లేదు అడ్మిషన్లు చేస్తేనే జీతం, సెలవులు ఇస్తామని కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ఉపాధ్యాయులను వేధిస్తున్నాయి. ప్రస్తుతం మే నెల వేతనం చెల్లించే పరిస్థితులు లేవని కార్పొరేట్ స్కూళ్లలో పని చేస్తున్న టీచర్లు మా దృష్టికి తెచ్చారు. తీవ్రమైన పని ఒత్తిడితో భద్రత లేని ఉద్యోగాలను చేస్తుండగా, మరో వైపు అడ్మిషన్ల కోసం టార్గెట్లు విధించి వేధిస్తున్నారు. పీఆర్వోల చేత చేయించాల్సిన అడ్మిషన్లను బోధన, బోధనేతర సిబ్బందితో చేయిస్తున్నారు. కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల ఆగడాలపై గతంలో ధర్నాలు, ఆందోళనలు చేసి, అధికారులకు విజ్ఞప్తులు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు.– వానపల్లి సుభాని, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రైవేటు టీచర్స్, లెక్చరర్స్ యూనియన్ -
‘కార్పొరేట్’ గాలం!
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని భగీరథకాలనీకి చెందిన లావణ్య చదువులో మేటి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్న ఈ బాలిక ఈసారి పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 9.8 జీపీఏతో ఉత్తీర్ణత సాధించింది. మధ్యతరగతి కుటుంబానికి చెందినందున ప్రైవేట్ కాలేజీలో చదువుకునే ఆర్థికస్తోమత లేదు. ఇది తెలుసుకున్న ఓ వ్యక్తి లావణ్య తండ్రి కృష్ణకుమార్కు ఫోన్ చేసి ‘నేను హైదరాబాద్కు చెందిన ఓ కార్పొరేట్ కాలేజీ నుంచి మాట్లాడుతున్నాను. మీ కూతురిని మా కాలేజీలో చేర్పిస్తే చదువుకయ్యే ఖర్చునంతా మేమే భరిస్తాం..’ అని హామీ ఇచ్చారు. దీంతో కార్పొరేట్ చదువు ఉచితంగా అందుతుందనే ఉద్దేశంతో ఆ తండ్రి అందుకు అంగీకరించారు. ఇలా ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులందరికీ ఇలాంటి ఫోన్కాల్స్ వస్తూనే ఉన్నాయి. వారి ప్రతిభను తెలుసుకున్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు హైదరాబాద్కు చెందిన కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కాలేజీల ఏజెంట్లు విద్యార్థుల ఫోన్ నంబర్లు సేకరించి ఆయా కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకునేలా గాలం వేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: జిల్లాలో అప్పుడే ఇంట ర్మీడియెట్ అడ్మిషన్ల హడావుడి మొదలైంది. ప్రస్తుతం ఆయా కాలేజీల పోటాపోటీ ప్రచారాలు.. ఫోన్ కాల్స్తో అడ్మిషన్ల ప్రక్రియ ఊపందుకుంది. విద్య వ్యాపారంలో ట్రెండ్ మార్చిన కార్పొరేట్ కాలేజీలు వినూత్న పద్ధతిలో మొదలుపెట్టాయి. పదో తరగతి చదువుతున్న విద్యార్థుల వివరాలు స్థానిక పాఠశాలల నుంచి తెప్పించుకున్న కాలేజీ యాజమాన్యాలు.. అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తూ ఆకర్షించేందుకు శతవిధాలా యత్నిస్తున్నాయి. విద్యార్థుల ఇళ్లకు వెళ్లి అడ్మిషన్లు చేయించుకునేందుకు జిల్లాలో ప్రధాన పట్టణాలు, మండల కేంద్రాల్లో డిగ్రీ పూర్తి చేసిన కొందరిని నియమించుకున్నాయి. కొందరిని వేతనాల వారీగా, ఇంకొందరిని పర్సంటేజీల రూపంలో డబ్బు చెల్లిస్తున్నాయి. మరికొన్ని కాలేజీలైతే.. ఏకంగా తమ ఏజెంట్లకు ప్రచారకర్తల పదవులతో గుర్తింపు కార్డులూ జారీ చేసేశాయి. కేవలం ఉమ్మడి జిల్లా పరిధిలోని మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లా కేంద్రాల్లో బడా కాలేజీ యాజమాన్యాలు ఇప్పటికే పదుల సంఖ్యలో ఏజెంట్లను నియమించుకోవడం గమనార్హం. ఇప్పటికే రంగంలో దిగిన ఆయా కాలేజీల ఏజెంట్లు అడ్మిషన్లతో హోరెత్తిస్తున్నారు. ఈ విషయంలో లక్ష్యాలను నిర్దేశించుకుని.. విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యేలోగా వాటిని పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి 41,364 మంది విద్యార్థులు పాసయ్యారు. వీరిలో చాలావరకు ప్రైవేట్ కా>లేజీల వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 110 ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. జిల్లాకు చెందిన ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు గ్రూపుతో పాటు విద్యార్థులకు ఇచ్చే ఇతర పరీక్షల శిక్షణను బట్టి ఏడాది రూ. పది వేల నుంచి రూ.40వేల వరకు ఫీజు వసూలు చేస్తున్నాయి. పాలమూరు టు హైదరాబాద్! స్థానికంగా ఉన్న ప్రైవేట్ కాలేజీలే గాక హైదరాబాద్కు చెందిన పలు కార్పొరేట్ కాలేజీలు సైతం పాలమూరు జిల్లాపై దృష్టి సారించాయి. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను గుర్తించి వారిని తమ కాలేజీల్లో చేర్పించుకునేందుకు ఏజెంట్లను నియమించుకున్నాయి. మంచి ఫలితాలు సాధించిన వారికి ఉచిత విద్య, వసతి వల వేస్తున్నాయి. మిగతా విద్యార్థులకు వచ్చిన జీపీఏను బట్టి ఫీజు వసూలు చేస్తున్నాయి. సాధారణంగా ఎంపీసీ విద్యార్థులు ఎంసెట్, ఐఐటీ, ఏఐఈఈఈ, జేఈఈ, ఎన్ఈటీ, సీఏ కోర్సుల వైపు మొగ్గు చూపుతారు. బైపీసీ విద్యార్థులు బీ–ఫార్మసి, ఎంబీబీఎస్, బీయూఎంఎస్, కోర్సుల వైపు; ఎంపీసీ, సీఈసీ విద్యార్థులు సీఏ, సివిల్స్ కోసం యత్నిస్తుంటారు. వీరిలో సంబంధిత కోర్సులు.. వాటి కాలానికనుగుణంగా ఫీజు వసూలు చేస్తున్నాయి. ఇంటర్మీడియెట్లో కేవలం ఫస్టియర్ వరకే ఎంసెట్, ఐఐటీ ఎంట్రెన్స్ శిక్షణ తీసుకోవాలనుకుంటున్న విద్యార్థులను ‘ఇన్కేర్’ బ్యాచ్గా విభజించి రూ.1.05లక్షల నుంచి రూ. 1.4లక్షల వరకు ఫీజు నిర్ణయించుకున్నాయి. అదే జిల్లాకు చెందిన ప్రైవేట్ కాలేజీలయితే సాధారణ ఫీజుతోపాటు అదనంగా మరో రూ.40వేలు తీసుకుంటున్నాయి. వీరికి రెండో సంవత్సరంలో ఎలాంటి శిక్షణ ఉండదు. ఐఐటీ, ఏఐఈఈఈ ఎంట్రెన్స్ శిక్షణ తీసుకోవాలనుకుంటున్న విద్యార్థులను ‘స్పార్క్’ బ్యాచ్గా విభజించి ఫస్టియర్తో పాటు సెకండియర్ సగం విద్యా సంవత్సరం వరకు శిక్షణ ఇస్తారు. వీరి నుంచి హైదరాబాద్కు చెందిన కార్పొరేట్ కాలేజీలు ఏటా రూ.1.25లక్షలు, జిల్లాకు చెందిన కాలేజీలు రూ.50వేల వరకు ఫీజు వసూలు చేస్తున్నాయి. చదువులో వెనకబడిన వారిని రెగ్యులర్ బ్యాచ్గా విభజించి కేవలం వార్షిక పరీక్షలో పాస్ అయ్యేలా బోధిస్తారు. వీరి నుంచి కార్పొరేట్ కాలేజీలైతే రూ.60వేల నుంచి రూ.లక్ష.. జిల్లాకు చెందిన కాలేజీలు అదనంగా రూ.20వేల వరకు వసూలు చేస్తారు. మెరిట్ విద్యార్థులను ‘జూనియర్ ఫాస్ట్ ట్రాక్’ బ్యాచ్ కింద చేర్చి.. వారికి ఐఐటీ, ఏఐఈఈఈ, జేఈఈ, ఎన్ఈటీ ఎంట్రెన్స్కు శిక్షణ ఇస్తారు. వీరి నుంచి ఏటా రూ. 1.35లక్షల వరకు ఫీజు నిర్ణయించారు. రూ.5వేలకే సీటు బుకింగ్ నాణ్యమైన విద్య.. అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామంటూ పదో తరగతి విద్యార్థులు.. వారి తల్లిదండ్రులను ఆకర్షిస్తున్న హైదరాబాద్కు చెందిన కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలు రూ.ఐదు వేలకే అడ్మిషన్ ఖాయం చేసేస్తున్నాయి. టెన్త్ ఫలితాల్లో సాధించిన జీపీఏను బట్టి విద్యార్థులకు ఫీజు మినహాయింపు ఉంటుందని చెబుతున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ కాలేజీల్లో నాణ్యమైన విద్య అందకపోవడం.. చెప్పుకోదగ్గ కాలేజీలు లేకపోవడం.. తల్లిదండ్రులందరూ తమ పిల్లలను పెద్ద కాలేజీల్లో చదువు చెప్పించాలనే ఆశను ఆసరాగా చేసుకుని పలు కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఇలా గాలం వేస్తున్నాయి. కాలేజీలు పునఃప్రారంభమైన తర్వాత సీట్లు దొరుకుతాయో లేదోనని విద్యార్థుల తల్లిదండ్రులూ ఇప్పట్నుంచే సీట్లు ఖరారు చేసుకుంటున్నారు. కాగా, కార్పొరేట్ విద్యాసంస్థలు ఒక్కో ఏజెంట్కు ప్రతి అడ్మిషన్పై రూ.ఐదు వేల నుంచి రూ.పది వేల వరకు చెల్లిస్తున్నాయి. జిల్లాకు చెందిన ప్రైవేట్ కాలేజీలు మాత్రం రూ.2,500 నుంచి రూ.నాలుగు వేల వరకు (విద్యార్థులు చెల్లించే ఫీజును బట్టి) ఇస్తున్నాయి. -
టెన్త్ ఇంటర్నల్ మార్కుల్లో ప్రైవేట్ పడగ!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు సాక్షాత్తూ ప్రభుత్వమే కొమ్ముకాస్తోంది. ఫలితంగా ప్రతిఏటా ఉత్తీర్ణత శాతం, జీపీఏ పాయింట్లలో ఆయా సంస్థలే పైచేయి సాధిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు తగ్గుతున్నట్లు చూపించి, క్రమంగా వాటిని పూర్తిగా మూసివేసే దిశగా సర్కారు కుట్ర పన్నిందన్న విమర్శలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఉత్తీర్ణతా శాతం పెరుగుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అంతా అటువైపే మొగ్గు చూపుతున్నారు. దీనివెనుక కార్పొరేట్ శక్తుల కుట్ర దాగి ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రయోగాల్లేకున్నా పూర్తి మార్కులా? విద్యా హక్కు చట్టం ప్రకారం అన్ని పాఠశాలల్లో సమగ్ర నిరంతర మూల్యాంకన విధానాన్ని(సీసీఈ) అమలు చేయాలి. ఆంధ్రప్రదేశ్లో ఈ విధానాన్ని చాలాకాలం అమలుకు నోచుకోలేదు. చివరకు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆలస్యంగా అమల్లోకి తీసుకొచ్చారు. విద్యార్థులు పాఠశాలల్లో ప్రయోగాలు, ఇతర అంతర్గత కార్యక్రమాల్లో పాలుపంచుకొంటూ, అందులో సాధించే నైపుణ్యాల ఆధారంగా కొన్ని మార్కులు కేటాయించాలన్నది సీసీఈ విధానం లక్ష్యం. ఇందులో భాగంగా దీనికి 20 మార్కులు కేటాయిస్తున్నారు. వీటిని అంతర్గత(ఇంటర్నల్) మార్కులు అంటున్నారు. వార్షిక పరీక్షలోవిద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసి మిగతా 80 మార్కులు ఇవ్వాలి. ఇంటర్నల్ మార్కుల కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నాయని, ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు తమ విద్యార్థులకు పూర్తి మార్కులు వేసుకుంటున్నాయని విద్యారంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులతో ప్రయోగాలు, ఇతర కృత్యాలు చేపట్టకుండానే పూర్తి మార్కులు వేసేస్తున్నారు. దీంతో ఆయా స్కూళ్ల విద్యార్థులు ఉత్తీర్ణతలో ముందంజలో ఉండడమే కాకుండా మెరుగైన జీపీఏ పాయింట్లనూ దక్కించుకుంటున్నారు. పత్తా లేని పర్యవేక్షణ కమిటీ ఇంటర్నల్ మార్కులకు సంబంధించి చేపట్టే కార్యక్రమాలు, పిల్లల్లో నైపుణ్యాలను ఉపాధ్యాయులు ఏ మేరకు అంచనా వేస్తున్నారో పరిశీలించడానికి ఒక పర్యవేక్షణ కమిటీ ఉండాలి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. మండల విద్యాధికారులు, డిప్యూటీ విద్యాధికారుల పోస్టులు 80 శాతానికి పైగా ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం పనిచేస్తున్న అరకొర సిబ్బంది పాఠశాలల్లో సీసీఈ విధానం అమలును పట్టించుకోవడం లేదు. దాంతో ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. విద్యా వ్యాపారంలో భాగంగా తమ స్కూళ్ల ఉత్తీర్ణత శాతం, జీపీఏలను పెంచుకోవడానికి ఎలాంటి అంతర్గత కృత్యాలు చేపట్టకుండానే తమ విద్యార్థులకు ఇంటర్నల్ మార్కులను 20కి 20 పూర్తిగా కేటాయిస్తున్నాయి. వాటిని యథాతథంగా పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నాయి. 90 శాతానికి పైగా ప్రైవేట్ విద్యార్థులే.. 2014–15 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల్లో 10 జీపీఏ సాధించిన వారిలో 90 శాతానికి పైగా విద్యార్థులు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు చెందినవారే. 2018లో 6,04,527 మంది టెన్త్ పరీక్ష రాయగా, వీరిలో 5,71,175 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులు 2,29,405 మంది పరీక్ష రాయగా, 2,25,072 (98.11 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ మున్సిపల్ స్కూళ్లలో 90.40 శాతం, జెడ్పీ స్కూళ్లలో 92.57 శాతం, ఇతర ప్రభుత్వ స్కూళ్లలో 90.77 శాతం మాత్రమే ఉత్తీర్ణత నమోదైంది. 100 శాతం ఉత్తీర్ణత సాధించిన స్కూళ్లు 5,340 ఉండగా, ఇందులో ప్రైవేట్ స్కూళ్లు 3,125 ఉన్నాయి. మొత్తం 29,921 మంది 10 జీపీఏ సాధించగా, వీరిలో 26,475 మంది ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులే కావడం గమనార్హం. తూతూమంత్రంగా కమిటీ సీసీఈ విధానం దుర్వినియోగం అవుతోందని, తమిళనాడు, కర్ణాటక తరహాలో ఈ విధానంతో సంబంధం లేకుండా పరీక్షలు నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు, నిపుణులు పలుమార్లు సూచించినా ప్రభుత్వం తొలుత లెక్కచేయలేదు. చివరకు ఒత్తిడి పెరగడంతో అధికారులతో ఒక కమిటీని నియమించింది. ప్రభుత్వ పెద్దల సూచన మేరకే కమిటీ తన నివేదికను సమర్పించింది. దాంతో ఈ ఏడాది కూడా టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో సీసీఈ విధానాన్నే కొనసాగించారు. బడా కార్పొరేట్ విద్యా సంస్థల లాబీయింగే దీనికి కారణమని సమాచారం. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల అధినేతలు ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులుగా ముద్రపడ్డారు. దీంతో వారి చెప్పిందే వేదంగా మారింది. ఎప్పటిలాగే ఈసారి కూడా ఉత్తీర్ణత, జీపీఏ పాయింట్లలో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లే పైచేయి సాధించబోతున్నాయి. -
బాలుడిపై వార్డెన్ లైంగికదాడి
ఆదిలాబాద్రూరల్: మావల మండలంలోని మావల శివారు ప్రాంతంలోని ఓ కార్పొరేట్ స్కూల్లో చదువుతున్న బాలుడిపై అక్కడే విధులు నిర్వహిస్తున్న వార్డెన్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. మావల ఎస్సై ముజాహిద్ కథనం ప్రకారం..మావల శివారు ప్రాంతంలోని ఎస్ఆర్ ప్రైం కార్పొరేట్ స్కూల్ బాలుడిపై మంగళవారం రాత్రి అదే పాఠశాలలో రాత్రి విధుల్లో ఉన్న వార్డెన్ లైంగిక దాడి చేయగా విషయాన్ని బాలుడు తోటి విద్యార్థులకు, వసతి గృహాం నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లాడు. వారు స్పందించకపోవడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. శుక్రవారం పాఠశాలకు చేరుకున్న వారు జరిగిన విషయంపై ఆరా తీశారు. ఆగ్రహించిన పోషకులు పాఠశాల యాజమాన్యం తీరుపై మండిపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న మావల ఎస్సై పాఠశాలకు చేరుకొని జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. బాలుడి పోషకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కార్పొరేట్ కళాశాలల్లో కొరవడుతున్న పర్యవేక్షణ.. పిల్లల భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని కార్పొరేట్ కళాశాల నిర్వాహకులు ఎంత అడిగితే అంతా ఫీజులు చెల్లిస్తున్నా, తల్లిదండ్రులు ఇలాంటి సంఘటనపై ఆందోళన చెందుతున్నారు. నిర్వాహకుల పర్యవేక్షణ లోపంతో పాఠశాల, కళాశాలల్లో లైంగిక దాడులు జరుగుతున్నాయని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఎంతెంతదూరం..చాలా చాలా దూరం..
‘ఎంతెంత దూరం.. చాలా చాలా దూరం..’అని గతంలో గ్రామీణ ప్రాంతాల్లో పాట పాడుకుంటూ పిల్లలు ఆడుకునే వారు. ఓ చిన్నారి కళ్లు కనిపించకుండా గంతలు కడితే.. మరొకరు ఒక వస్తువును ఆ చుట్టు పక్కల దాచేస్తారు.ఆ తర్వాత కళ్లకు కట్టిన గంతలు విప్పుతారు.ఆ చిన్నారి ఈ పాట పాడుకుంటూ దాచినవస్తువును కనుక్కోవడానికి వెతుక్కుంటూ బయలు దేరుతుంది. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాల పరిస్థితీ అలాగే మారింది. అది ఎక్కడుందో వెతుక్కోవాల్సిన దుస్థితి. ►చంద్రబాబు హయాంలో భారంగా మారిన పాఠశాల విద్య ►రేషనలైజేషన్ పేరిట పెద్ద సంఖ్యలో పాఠశాలల మూత ►కార్పొరేట్ విద్యా సంస్థల కోసం ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్న సర్కారు ►వేలకు వేలు ఫీజులు భరించలేక చదువులకు దూరమవుతున్న పేద పిల్లలు ►నవరత్నాల్లోని ‘అమ్మ ఒడి’తో పిల్లల చదువులకు వైఎస్ జగన్ భరోసా ►పిల్లల్ని బడికి పంపించే ప్రతి తల్లికీ ఏడాదికి రూ.15 వేలు తమ చిన్నారుల చదువుకు ఆసరాగా ఉంటుందంటున్న తల్లిదండ్రులు రాష్ట్రంలో పాఠశాల విద్య సామాన్య, మధ్య తరగతి కుటుంబాల వారికి దూరం అవుతోంది. పిల్లలకు చదువు చెప్పించాలంటేనే తల్లిదండ్రులు బెంబేలెత్తుతున్నారు. ఎల్కేజీ, యూకేజీల్లో చేర్పించాలన్నా వేలకు వేలు ఫీజులు కట్టాల్సిందే. ప్రయివేటు, కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహించేలా చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తూ వస్తోంది. రేషనలైజేషన్ పేరిట మూసేయడమేగాక.. సరపడా టీచర్లను నియమించకుండా, మౌలిక సదుపాయాలు కల్పించకుండా ప్రభుత్వ పాఠశాలలను అధ్వానంగా మార్చింది. ఇక్కడ చదువుతున్న పేద పిల్లలకు సరైన విద్య అందించకుండా వారిని ప్రయివేటు వైపు వెళ్లేలా చేస్తోంది. క్రమేణా ప్రభుత్వ పాఠశాలలను మూత వేయించి వాటి స్థానే కార్పొరేట్ సంస్థలకు పెద్దపీట వేసేలా కార్యక్రమాలు చేస్తోంది. రేషనలైజేషన్ పేరిట స్కూళ్ల మూత నాలుగున్నరేళ్లుగా తెలుగుదేశం ప్రభుత్వం రేషనలైజేషన్ పేరిట దాదాపు ఐదు వేల పాఠశాలలను మూత వేయించింది. ఇందులో అత్యధికం ప్రాథమిక పాఠశాలలే. ప్రతి కిలోమీటర్కు ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక ప్రాథమికోన్నత పాఠశాల, ఐదు కిలోమీటర్లకు ఒక ఉన్నత పాఠశాల ఉండాలన్నది ప్రభుత్వ నిబంధన. ఒకటో తరగతిలో చేరే బాలబాలికలకు వయసు ఐదేళ్లు మాత్రమే ఉంటాయి కాబట్టి వారికి సమీపంలోనే స్కూలు ఉండాలి. కానీ చంద్రబాబు అధికారంలోకి రాగానే మూడు కిలోమీటర్లలో ఉన్న ప్రాథమిక పాఠశాలలన్నింటినీ విలీనం పేరిట ఒక్కటిగా చేసి.. మిగతా స్కూళ్లను మూసేయించారు. ఆయా స్కూళ్లలో తగినంత మంది విద్యార్థులు లేరన్న సాకుతో వాటిని మూయించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలున్న ప్రాంతాలు, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని స్కూళ్లు మూత పడటంతో అక్కడ చదువుతున్న వేలాది మంది పిల్లలకు పాఠశాలలు దూరమయ్యాయి. దగ్గరలోని ప్రయివేటు పాఠశాలలకు వెళ్లి చదువుకోవడానికి తగినంత ఆర్థిక స్తోమత లేక తల్లిదండ్రులు వారిని స్కూళ్లకు పంపడం మాన్పిస్తున్నారు. అంతే కాకుండా దాదాపు ఐదు వేలకు పైగా ప్రాథమికోన్నత పాఠశాలలను ప్రాథమిక పాఠశాలలుగా డీగ్రేడ్ చేశారు. అక్కడి 6, 7, 8 తరగతుల్లోని విద్యార్థులు దూరంలోని ఇతర స్కూళ్లకు వెళ్లలేక.. దగ్గరలోని ప్రయివేటు స్కూళ్లను ఆశ్రయించాల్సి వస్తోంది. 98 హైస్కూళ్లనూ రేషనలైజేషన్ పేరిట యూపీ స్కూళ్లుగా డీగ్రేడ్ చేశారు. తమ పిల్లలను చదువులు మాన్పించడం సరికాదని భావించే తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ ప్రయివేటు స్కూళ్లకు పంపిస్తున్నారు. ఆయా స్కూళ్లలో ఫీజుల భారం మోయలేక, అప్పులు కూడా దొరకని వారి పిల్లలు మధ్యలోనే చదువులకు స్వస్తి చెబుతున్నారు. ఒలింపిక్స్ నిర్వహిస్తారట.. పాఠశాలల్లో క్రీడా వసతులను మెరుగు పరచడం లేదు గానీ, అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తామని సీఎం ప్రకటించడం ఆశ్చర్యపరిచింది. తిరుపతిలో నిర్వహించిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో.. రాష్ట్రానికి చెందిన వారు నోబుల్ బహుమతి తెచ్కుకుంటే రూ.100 కోట్లు ఇస్తామని చంద్రబాబు ప్రకటించి అందరినీ విస్మయపరిచారు. పాఠశాలల్లో కనీస సదుపాయాలు కల్పించకుండా, ఉన్నత విద్యాసంస్థల్లో పరిశోధనలకు వీలుగా ల్యాబ్లు ఇతర సౌకర్యాలు కల్పించకుండా, బోధన, బోధనేతర సిబ్బందిని నియమించకుండా చంద్రబాబు ఇలా ప్రకటించడం ఆశ్చర్యపరిచింది. ఆ ధైర్యంతోనే పిల్లల్ని చదివిస్తున్నా.. నాకు ఇద్దరు పిల్లలు. పెద్దోడు కొండేటి సాయి 5వ తరగతి, చిన్నోడు కొండేటి నవీన్ 3వ తరగతి చదువుతున్నారు. నా భర్త నాలుగేళ్ల కిందట ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. నేను కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. కుటుంబ పోషణే కష్టంగా ఉన్న నాకు.. పిల్లల చదువులు పెనుభారంగా మారాయి. వారిని కూడా చదువు మాన్పించి పనులకు పంపితే తప్ప ఇల్లు గడవని పరిస్థితి. కానీ అమ్మ ఒడి పథకం ద్వారా జగనన్న ఆర్థికంగా చేయూతనిస్తే పిల్లల చదువులు ముందుకు సాగుతాయి. ఆ ఆశతోనే వారి చదువులను కొనసాగిస్తున్నాను. లేదంటే ఇప్పటికి మాన్పించేదాన్ని. జగనన్నపై నమ్మకం ఉంది మా గ్రామంలో ఎక్కువ మంది ఉపాధి కూలీలే. నాకు ముగ్గురు ఆడపిల్లలు. ఎంతో కష్టపడి వారిని చదివిస్తున్నా. జగనన్న ప్రకటించిన నవరత్నాలలోని అమ్మ ఒడి పథకం గురించి విన్నాక చాలా ధైర్యం వచ్చింది. ఎన్ని కష్టాలొచ్చినా పిల్లల చదువులను మాన్పించలేదు. అమ్మ ఒడి పథకంతో నా చిన్నారుల చదువులకు భరోసా దొరికిందని ధైర్యంగా వారిని బడికి పంపుతున్నాను. అన్న రాగానే వారి చదువుల బాధ్యతను తీసుకుంటాడన్న నమ్మకం ఉంది. నేను మళ్లీ చదువుకుంటాను.. మాది చాలా పేద కుటుంబం కావడంతో మా అమ్మానాన్న నన్ను చదివించలేకపోయారు. ఏడో తరగతిలోనే బడి మానేసి.. వారికి చేదోడువాదోడుగా ఉంటున్నా. నాన్న అప్పల్రాజు రోజూ ఇటుకల పనులకు, అమ్మ అప్పమ్మ కూలి పనులకు వెళుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. నాకు చదువుకుందామన్న కోరిక ఉన్నా ఆర్థిక పరిస్థితులు ఆ కోరికను తీర్చుకోనివ్వడం లేదు. జగనన్న ప్రకటించిన నవరత్నాల్లోని అమ్మ ఒడి పథకంతో ఎటువంటి ఆర్థిక ఇబ్బందుల్లేకుండా పిల్లల్ని చదివించుకోవచ్చని చెబుతున్నారు. పిల్లల్ని బడికి పంపితే ఏటా రూ.15,000 ఇస్తారని తెలిసి చాలా సంతోషం వేసింది. జగనన్న త్వరగా ముఖ్యమంత్రి అయ్యి.. నాలాంటి పేద పిల్లలను చదివించాలని కోరుకుంటున్నా. మాలాంటి పేదలకు ‘అమ్మ ఒడి’ వరం మేం నిరుపేద గిరిజనులం.. రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు మావి. మాకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె డిప్పల అప్పలమ్మను పేదరికం కారణంగా బడికి పంపలేకపోయాము. పనుల్లో మాకు చేదోడు వాదోడుగా ఉంటోంది. పారమ్మ ఒకటో తరగతి, అనిత రెండో తరగతి చదువుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలులోని ‘అమ్మ ఒడి’ పథకం అమలైతే.. మా పెద్ద బిడ్డను కూడా బడికి పంపిస్తాం. పిల్లలను బడికి పంపితే ఆర్థిక సాయం అందిస్తానని జగన్ చెబుతున్నారు. అదే జరిగితే కూలికెళితే తప్ప పూట గడవని మాలాంటి నిరుపేదలందరూ ఎంతో సంతోషిస్తారు. కార్పొరేట్లో ఫీజుల మోత కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజులపై నియంత్రణ లేకపోవడంతో ఆయా యాజమాన్యాలు ఇష్టానుసారం ఫీజులు పెంచేస్తున్నాయి. నగర, పట్టణ ప్రాంతాల్లోని స్కూళ్లే కాకుండా మండల స్థాయి స్కూళ్లలోనూ ఫీజులు భారంగా మారాయి. ఎల్కేజీ, యూకేజీ నుంచే వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కర్నూలు ఇలా పలు నగరాల్లోని కార్పొరేట్ స్కూళ్లు 30 వేల నుంచి లక్ష వరకు ఫీజుల కింద విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నాయి. ఇవి కాకుండా పుస్తకాలు, యూనిఫాంలు.. తదితరాల పేరిట వేలకొద్దీ డబ్బు వసూలు చేస్తున్నాయి. పుస్తకాలకు రూ.15 వేలు, యూనిఫాంకు రూ.7 వేలు, ఇతర సామగ్రి అంటూ మరో 2 వేలు దండుకుంటున్నాయి. ఈ ఫీజులు భరించలేని విద్యార్థుల తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకుంటూ, అప్పులు చేస్తున్నారు. చంద్రబాబు 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలు ►టీడీపీ అధికారంలోకొస్తే పేద పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తాం ►కాలేజీ విద్యార్థులకు ఐపాడ్లు, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యావిధానంలో మార్పులు చేస్తాం. ►ప్రతి కిలోమీటర్కు ఒక ఎలిమెంటరీ స్కూలు, మూడు కిలో మీటర్లకు ఒక యూపీ స్కూలు, ఐదు కిలోమీటర్లకో హైస్కూలు పెడతతాం (వాస్తవానికి ఉన్న స్కూళ్లను మూయించారు). ►ఏటా విద్యాసంవత్సరానికిమూడు నెలల ముందే డీఎస్సీనినిర్వహించి టీచర్లను నియమిస్తాం. ఇదీ బాబు ప్రభుత్వ నిర్వాకం ►పాఠశాలల్లో సదుపాయాల కల్పన పేరిట నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం విద్యాభివృద్ధి నిధులను తెలుగుదేశం నేతలకు పప్పు బెల్లాల కింద పంచిపెట్టింది. ►స్కూళ్లలో బయోమెట్రిక్ యంత్రాలు, హెచ్ఎంల నుంచి పైస్థాయి అధికారులకు ట్యాబ్ల పంపిణీ, పాఠశాలలకు ఫర్నీచర్ సరఫరా, మరుగుదొడ్ల నిర్మాణం.. ఇలా అన్ని వ్యవహారాల్లో భారీగా నిధులు దండుకున్నారు. ►నాలుగున్నరేళ్లలో సర్వశిక్ష అభియాన్ నిధులతో పాటు ఇటు బడ్జెట్ నిధులనూ ఇష్టానుసారంగా తమ వారికి కాంట్రాక్టుల పేరిట కట్టబెట్టిన ప్రభుత్వం.. తాజాగా హైబ్రిడ్యాన్యుటీ అంటూ కొత్త కమీషన్ల వ్యవహారానికి తెరలేపింది. రూ.4,800 కోట్లతో మౌలిక సదుపాయాల పేరిట కాంట్రాక్టులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ►ప్రభుత్వ స్కూళ్లను ప్రయివేటు, స్వచ్ఛంద, ఆధ్యాత్మిక సంస్థలకు అప్పగించి వారికి కోట్లాది రూపాయలు దోచిపెడుతోంది. ఈషా ఫౌండేషన్, రిషివేలీ, ప్రథమ్ తదితర సంస్థలకూ పాఠశాలలను అప్పగించింది. ఎవరి మార్గంలో బోధన చేయాలో అర్థంకాక టీచర్లు, ఏది నేర్చుకోవాలో తెలియక విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు. ►మధ్యాహ్న భోజన పథకంలో వివిధ సరకుల కొనుగోలు కాంట్రాక్టులను కేంద్రీకృతం చేసి.. కందిపప్పు తదితరాల కొనుగోలులో కోట్ల కొద్దీ ని«ధులను పక్కదారి పట్టిస్తున్నారు. కోడిగుడ్ల సరఫరాలో తెలుగుదేశం నేతలు కాంట్రాక్టర్లుగా మారి పిల్లల కడుపుకొడుతున్నారు. ►పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల పంపిణీలో అక్రమాలకు అంతే లేదు. ఆప్కో మాటున దుస్తుల పంపిణీలో టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారు. ►వాస్తవ పరిస్థితికి భిన్నంగా గణాంకాలు చూపిస్తూ విద్యాభివృద్ధిలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందంటూ అబద్ధాలు చెబుతోంది. ►విద్యాభివృద్ధిలో ముందంజలో ఉన్నామని చెప్పి.. రాష్ట్రానికి రావాల్సిన సర్వశిక్ష అభియాన్తో పాటు ఇతర నిధులకూ కేంద్రం కోతపెట్టడానికి కారణమయ్యారు. కొత్త చట్టాలతో మరింత ప్రమాదం కార్పొరేట్, ప్రయివేట్ సంస్థలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఏకంగా ఒక ప్రత్యేక చట్టాన్ని తెస్తోంది. సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఇండిపెండెంట్ స్కూల్స్ పేరిట తెస్తున్న ఈ చట్టంతో ఇక చదువులు మరింత భారంగా మారనున్నాయి. పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలు మాత్రమే పాఠశాలలు స్థాపించేలా నిబంధనలు పెట్టింది. ప్రభుత్వ పాఠశాలలను మూసేసి.. వాటి ఆస్తులను ప్రయివేటుకు అప్పగించేలా ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఇప్పటికే రేషనలైజేషన్ పేరిట మూతవేసిన స్కూళ్లలో 200 పాఠశాలలను బ్రిడ్జి ఇంటర్నేషనల్ సంస్థకు అప్పగించేందుకు ప్రభుత్వం ఒప్పందం కూడా చేసుకుంది. మీ పిల్లల చదువుకు నాదీ భరోసా తెలుగుదేశం ప్రభుత్వం గత నాలుగున్నరేళ్ల పాలనలోప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేయడమే కాకుండాపాఠశాల విద్యను భారంగా మార్చింది. ఆ భారం మోయలేక చదువులు మాన్పిస్తున్న నిరుపేద, మధ్యతరగతికుటుంబీకులు ఎంతో మంది నాకు కష్టాలు చెప్పుకున్నారు. అందుకే ప్రతి తల్లి తన పిల్లలను బడికి పంపితే చాలు. ఏ బడికి అయినా ఫరవాలేదు. ఏడాదికి రూ.15 వేలు ఇస్తాను.‘అమ్మ ఒడి’ పథకం కింద ఆ తల్లి ఖాతాలో జమ చేస్తాం.పేదింటి పిల్లల చదువులకు ఏ తల్లిదండ్రులూ భయపడాల్సిన అవసరం లేదు. సంవత్సరానికి రూ.15,000 – వైఎస్ జగన్ -
నో గ్రాంట్..
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలను పునః ప్రారంభించి రెండు నెలలు దాటినా నేటికీ ఈ ఏడాదికి సంబంధించి పాఠశాలల నిర్వహణకు నిధులను విడుదల చేయలేదు. గత ఏడాది ఖర్చు పెట్టకుండా ఉన్న రూ.10.80 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి తీసుకుంది. దీంతో పాఠాలు బోధించేందుకు సైతం చాక్పీస్లు లేక ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. నేటికీ అధిక శాతం పాఠశాలల్లో రిజిస్టర్లు నిర్వహించని పరిస్థితి. కొన్ని పాఠశాలల్లో విధిలేని పరిస్థితుల్లో ప్రధానోపాధ్యాయుల వేతనాల్లో నుంచి ఖర్చు చేస్తున్నారు. పాఠశాలల నిర్వహణకు ఎప్పుడో 2006లో ఇచ్చే గ్రాంట్లను నేటికీ ఇస్తోంది. ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోని పాలకులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెల్లూరు(టౌన్): ప్రభుత్వ పాఠశాలల్లో రిజిష్టర్ల నిర్వహణకు, బోధన సామగ్రి కోసం ఖర్చు చేసేందుకు ఇప్పటివరకు నిధులు రాకపోవడంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 3,425 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటిల్లో ప్రాథమిక 2,646, ప్రాథమికోన్నత 363, ఉన్నత 416 పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 3,34,609 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రతి ఏటా విద్యా సంవత్సర ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ నిధులను విడుదల చేస్తుంది. ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి ఒక్కో స్కూల్కు రూ.5వేలు, ప్రాథమికోన్నత పాఠశాలకు రూ.12వేలు, ఉన్నత పాఠశాలలకు రూ.7వేల వంతున నిధులను కేటాయిస్తుంది. ఈ నిధులతో పాఠశాలల్లో చాక్పీస్లు, స్కేళ్లు, డస్టర్లు, రిజిస్టర్లు, కాగితాలు తదితర వాటిని కొనుగోలు చేసేందుకు వినియోగిస్తారు. ఇంతే మొత్తాన్ని గత 2006వ సంవత్సరం నుంచి విడుదల చేస్తున్నారు. అదే విధంగా స్కూల్ నిర్వహణా గ్రాంటు కింద మూడు తరగతి గదులు ఉన్న పాఠశాలకు రూ.5వేలు, అంతకంటే ఎక్కువ తరగతి గదులు ఉన్న పాఠశాలలకు రూ.10వేలు వంతున నిధులు కేటాయిస్తున్నారు. ఈ నిధులతో మరుగుదొడ్ల, కుర్చీల రిపేర్లు, వాటర్పైపులు తదితర సమస్యల పరిష్కారం కోసం వినియోగించనున్నారు. దీంతో పాటు ప్రతి టీచర్కు రూ.5వేల చొప్పున నిధులును కేటాయించాల్సి ఉంది. వీటితో పాటు ప్రతి కాంప్లెక్స్కు రీసోర్స్ సెంటర్కు రూ. 22వేలు, మండల రీసోర్స్ సెంటర్కు రూ. 80వేలును కేటాయిస్తున్నారు. అయితే రెండేళ్లుగా టీచర్కు ఇచ్చే రూ.5వేల నిధులను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు ఏ మాత్రం సరిపోవడం లేదని ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. గ్రాంట్ను పెంచమని ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించినా పెడచెవిన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది రూ.10.80 కోట్ల నిధులు వెనక్కి ప్రతి ఏటా స్కూల్ గ్రాంట్ నిధులును ఆగస్టులోపు విడుదల చేయాల్సి ఉంది. గత ఏడాది కొన్ని పాఠశాలలకు అక్టోబర్, మరికొన్ని పాఠశాలలకు నవంబర్ నెలల్లో నిధులను విడుదల చేశారు. అయితే 2017–18కు సంబంధించి, అంతకంటే ముందు మిగిలి ఉన్న నిధుల్లో ఖర్చు చేయని రూ.10.80 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. పాఠశాలల నిర్వహణకు విడుదల చేసిన నిధులను సర్వశిక్ష అభియాన్ అధికారులు సకాలంలో ఖర్చు చేయడం లేదన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. పాఠశాలల అవసరాలకు ఇచ్చే నిధులను ఇతర వాటికి వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రాంట్ నిధులు వెనక్కి పోవడంతో చాక్పీస్లు, రిజిష్టర్, తెల్ల కాగితాలు ఏవైనా కొనాలన్నా, పాఠశాలల్లో మరమ్మతులు నిర్వహించాలన్నా, చీపుర్లు సైతం కొనాలన్నా ప్రధానోపాధ్యాయుల జేబుల నుంచి ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. మరుగుదొడ్లు నిర్వహణ ప్రైవేటు ఏజెన్సీలకు.. పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్వహణ ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దీనిపై విధి విధానాలను రూపొందించింది. త్వరలో దీనిపై ఉత్తర్వులు రానున్నట్లు సర్వశిక్ష అభియాన్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి దాకా ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 2015 విద్యా సంవత్సరం నుంచి నిధులు కేటాయిస్తుంది. ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే స్కావెంజర్లకు రూ.1500, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.2,500, ఉన్నత పాఠశాలల్లో రూ.4వేలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది నుంచి డీఆర్డీఏ ద్వార వేతనాలు అందజేసే వారు. ఈ విద్యా సంవత్సరం నుంచి డీఆర్డీఏ వేతనాలను నిలిపివేసింది. దీంతో సర్వశిక్ష అభియాన్, డీఆర్డీఏ అధికారుల మధ్య సమన్వయం లోపించింది. మాకు సంబంధం లేదని ఎస్ఎస్ఏ అధికారులు చెబుతుంటే, తమకు సంబంధం లేదని డీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. నిధులు దారి మళ్లించడం దారుణం బడ్జెట్ ద్వారా మంజూరైన నిధులను వెనక్కి తీసుకోవడం, దారి మళ్లించడం చాలా దారుణం. ప్రభుత్వం చర్యలతో పాఠశాలల నిర్వహణ చాలా ఇ బ్బందిగా మారింది. ఉపాధ్యాయుల జేబుల్లో నుం చి డబ్బులు తీసి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్కావెంజర్స్కు జీతాలు ఇవ్వకపోవడంతో వాళ్లు రావడం లేదు. పాఠశాలల్లో నిర్వహణ సరి గాలేదని విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులకు మెమోలు జారీ చేస్తున్నారు. దీనిని ఖండిస్తున్నాం. –మోహన్దాస్, రాష్ట్ర కౌన్సిలర్, ఏపీటీఎఫ్ ఈ ఏడాది నిధులు విడుదల కాలేదు పాఠశాలల నిర్వహణకు సంబంధించి ఇంకా నిధులు విడుదల కాలేదు. గత ఏడాది, అంతకు ముందు వివిధ పనులకు కేటాయించిన నిధులకు సంబంధించి ఖర్చు పెట్టకుండా మిగిలిన నిధులు రూ.10.80 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీజ్ చేసింది. పాఠశాలల నిర్వహణకు ఇబ్బందులు లేకుండా ఆయా హెచ్ఎంలు ఖర్చు పెడుతున్నారు. నిధులు వచ్చిన తరువాత వారికి తిరిగి ఇచ్చేస్తాం. –విశ్వనాథ్, ప్రాజెక్ట్ అధికారి, సర్వశిక్ష అభియాన్ -
ఫీ'జులుం' భరించలేం
ఓ కార్పొరేట్ స్కూల్ అయితే పుస్తకాలు, బ్యాగ్లు, బూట్లు కూడా వారి దగ్గరే కొనాలంటోంది.బయట మార్కెట్లో రూ.800 ఉన్న బ్యాగ్కు స్కూల్ లోగో తగిలించి ఏకంగా రూ.2,000కి అమ్ముతున్నారు. పుస్తకాల ధరలు అయితే మరీ దారుణం. అన్యాయంగా దోచుకుంటున్నారని తెలిసినా సరే.. చదువుకున్న వారు సైతం పిల్లల కోసం మాట్లాడకుండా వచ్చేస్తున్నారు. ‘రాజధాని అమరావతిలోని ఓ ప్రముఖ కార్పొరేట్ స్కూల్లో మా అబ్బాయి ఏడో తరగతి చదువుతున్నాడు. స్కూల్ ఫీజు కట్టడానికి వెళ్తే రూ.2,000 పెంచారు. మరో రూ.4,000 కడితే చిప్తో కూడిన పాఠాల సిలబస్ ఇస్తామన్నారు. దీని ద్వారా రోజూ చదవాల్సిన పాఠాలు, టెస్టులతో ఎప్పటికప్పుడు ఫెర్ఫామెన్స్ను మీకు తెలియజేస్తామన్నారు. అయితే.. ఏదైనా సబ్జెక్టులో వెనుకబడి ఉంటే ప్రత్యేక శిక్షణ ఇస్తారా అని అడిగితే అలాగేమీ ఉండదన్నారు. అయితే, చిప్ అక్కర్లేదు అని చెప్పి వచ్చేశాను. తీరా చూస్తే మా అబ్బాయిని ఏ1 గ్రూపు నుంచి ఏ4 గ్రూపులోకి మార్చారు. మర్నాడు స్కూల్కి వెళ్లి గ్రూపు ఎందుకు మార్చారు అని అడిగితే చిప్ తీసుకున్న వాళ్లని ఏ1, ఏ2 గ్రూపుల్లో.. చిప్ తీసుకోని వాళ్లని ఏ3, ఏ4ల్లోకి మార్చామన్నారు. మా అబ్బాయి మానసికంగా ఎక్కడ కుంగిపోతాడోనన్న ఉద్దేశంతో.. వాళ్లతో వాదించలేక రూ.4,000 కట్టి వచ్చేశాను.’ – కార్పొరేట్ స్కూళ్లలో పరిస్థితిపై ఇదీ ఓ విద్యార్థి తండ్రి ఆవేదన సాక్షి, అమరావతి : ఏటా ఏదో ఒక పేరు చెప్పి వేలకు వేలు ఫీజులు పెంచేసి.. తల్లిదండ్రులను పీల్చి పిప్పిచేస్తున్నారు. టెన్త్లోపు పిల్లలకు ఏటా ఏదో రూపంలో రూ.2,000 తక్కువ కాకుండా ఫీజులు పెంచేసి పిండేస్తున్నారు. అదే పెద్దస్థాయి కార్పొరేట్ స్కూళ్లలో అయితే ఈ మొత్తం రూ.5,000 పైనే దాటుతోంది. ఇంటర్కు వచ్చేసరికి ఈ దోపిడీ మరీ దారుణంగా ఉంటోంది. ఏటా కనీసం రూ.10,000 తక్కువ కాకుండా ఫీజులు పెంచేస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. డే స్కాలర్గా అయితే ఏడాదికి సుమారు లక్ష రూపాయలు అవుతుంటే అదే హాస్టల్లో ఉండి చదివిస్తే రూ.2.25 లక్షలు తక్కువ కావడంలేదని తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారు. ఇలా ఏటా ఫీజులు పెంచేస్తుండడంతో తల్లిదండ్రులు బడ్జెట్ సమకూర్చుకోలేక అప్పుల పాలవుతున్నారు. మరీ ఇంత దారుణమా? ఈ ఒక్క ఏడాదిలోనే ఇంటర్, స్కూల్ విద్యార్ధుల తల్లిదండ్రులు రూ.5,068 కోట్లు అదనంగా చెల్లించారంటే నమ్ముతారా? ఈ ఏడాది పెరిగిన ఫీజులపై ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశీలించగా పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. గతేడాదితో పోలిస్తే టెన్త్లోపు విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యా వ్యయం సగటున 18 శాతం పెరిగితే ఇంటర్ విద్యార్థులకు 27 శాతం వరకు పెరిగింది. ఫీజులతో పాటు ఈ ఏడాది పుస్తకాలు, రవాణా వ్యయం, యూనిఫాం, బూట్లు వంటి వాటి ధరలు భారీగా పెరిగిపోయాయి. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదివే వారికి ఫీజుల పెంపు లేకపోయినా పెరిగిన పుస్తకాలు, రవాణా, యూనిఫాం వంటి వాటివల్ల వారికి కూడా అదనపు ఖర్చులు తప్పడంలేదు. పాఠశాలల్లో.. ప్రతీ పాఠశాలలో గత ఏడాది ఫీజులు సగటున రూ.30,000 వరకు ఉండగా ఈ ఏడాది రూ.35,000 వరకు పెరిగాయి. అలాగే, పుస్తకాల వ్యయం రూ.3,200 నుంచి రూ.4,000 వరకు చేరుకున్నాయి. యూనిఫాం (మూడు జతలు) రూ.1,800 నుంచి రూ.2,750, బూట్లు (రెండు జతలు) రూ.3,000 నుంచి రూ.4,000కు పెరిగాయి. ఇక రవాణా, బ్యాగులు వంటి ఇతర ఖర్చులను లెక్కలోకి తీసుకుంటే గతేడాది కంటే రెట్టింపయ్యాయి. ఈ విధంగా చూస్తే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఒక్కో విద్యార్థిపై సగటున రూ.7,350 వరకు భారం పెరిగింది. అదే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ.2,350 వరకు ఖర్చు పెరిగినట్లు అంచనా. స్కూల్ విద్యార్థులపై పెరిగిన భారం రూ.3,167కోట్లు పైనే 2017–18 సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రంలో 69,61,058 మంది విద్యార్ధులు స్కూళ్లలో చదువుతున్నారు. ఇందులో ప్రైవేటు పాఠశాలల్లో సుమారు 30.62 లక్షల మంది చదువుతుంటే ప్రభుత్వ పాఠశాలల్లో 38.98 లక్షల మంది చదువుతున్నారు. ఈ లెక్కన చూస్తే ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్న తల్లిదండ్రులపై ఈ ఏడాది రూ.2,251.20 కోట్లు భారం పడినట్లు అంచనా. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్న వారికి రూ.916.2 కోట్లు అదనపు భారమైంది. ఈ విధంగా చూస్తే మొత్తం రూ.3,167.4 కోట్లు తక్కువ కాకుండా భారం పెరిగిందని లెక్కగా తేలింది. అదే పెద్దస్థాయి కార్పొరేట్ స్కూల్స్లో ఉన్న ఫీజులను లెక్కలోకి తీసుకుంటే ఈ మొత్తం పెరుగుతుందని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. కాలేజీల్లో... ప్రైవేట్ స్కూళ్ల వ్యవహారం ఇలా ఉంటే.. కార్పొరేట్ కాలేజీల తీరు మరోలా ఉంది. ల్యాప్టాప్లు, ట్యాబ్లు, ఆన్లైన్ టెస్టుల పేరుతో ఫీజులు గుంజడం ఎక్కువైందని తల్లిదండ్రులు వాపోతున్నారు. సామాన్య స్థాయి పైవేటు కాలేజీల్లో ఇంటర్మీడియట్ ఫీజులు గతేడాది పోలిస్తే సగటున రూ. 55,000 నుంచి రూ.65,000కు పెరిగాయి. అలాగే పుస్తకాలు, రవాణా, బ్యాగ్లు వంటి ఇతర ఖర్చులు తీసుకుంటే రూ.24,800 నుంచి రూ.36,200 పెరిగాయి. 2017–18 సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రంలో మొదటి, రెండవ సంవత్సరం చదువుతున్న ఇంటర్ విద్యార్థుల సంఖ్య 10,05,958గా ఉంది. ఇందులో ప్రైవేటు కాలేజీల్లో చదువుతున్న వారు సుమారుగా 7,54,530 గా ఉంటే ప్రభుత్వ కాలేజీల్లో 2,51,428 చదువుతున్నారు. ఇలా పెరిగిన ఖర్చులను లెక్కలోకి తీసుకుంటే ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న తల్లిదండ్రులపై ఈ ఏడాది సుమారు రూ.285 కోట్ల అదనపు భారం పడితే ప్రైవేటు కాలేజీల్లో చదువుతున్న వారు రూ.1,900.7 కోట్లు అదనంగా చెల్లించాల్సి వచ్చింది. ఇది కేవలం డేస్కాలర్స్ కింద పరిగణనలోకి తీసుకొని లెక్కిస్తేనే ఇలా ఉందని, అదే రెసిడెన్షియల్ విద్యార్థుల భారాన్ని కూడా తీసుకుంటే ఈ మొత్తం మూడు రెట్లు అవుతుందంటున్నారు. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు ఇలా వేల రూ. కోట్లు వసూలు చేస్తున్న నేపథ్యంలో విద్యా వ్యవస్థపై నియంత్రణ ఉండాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. -
సెలవుల వెనుక మతలబు!
42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలున్నాయని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు వ్యతిరేకించినా మే నెలలోనే జ్ఞానధార కార్యక్రమం నిర్వహించింది విద్యాశాఖ. ఇప్పుడు అదే విద్యాశాఖ 38 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా ప్రవేశపెట్టిన ఆంగ్ల మాధ్యమానికి పిల్లల తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభిస్తోన్న సమయంలో ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకోవడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యాశాఖ జారీ చేసిన సర్క్యులర్లో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు సెలవులు వర్తిస్తాయని పొందుపరచకపోవడం వెనుక వాటికి పరోక్షంగా మేలు చేసే ఉద్దేశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు సిటీ : వేసవి సెలవులు ముగిసి వారం క్రితమే పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. గత నెలతో పోల్చుకుంటే ఈ నెల మొదటి వారంలో మూడు రోజులు మినహా పెద్దగా వాతావరణంలో మార్పులు కూడా కనిపించలేదు. అయినా, విద్యాశాఖ ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని మూడు రోజులు (19, 20, 21 తేదీలు) సెలవులు ప్రకటించడంపై అన్ని వర్గాల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణంలో మార్పుతో రాష్ట్రంలోని సముద్ర తీరానికి సమీప ప్రాంతాల్లో పగలు వేడి తీవ్రత ఉంది. అయితే, ఈ వేడి ప్రమాదకరమని వాతావరణ శాఖ ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటించలేదు. అయినా, స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. గత 20 రోజుల్లో రాయలసీమ జిల్లాల్లో ఒక్క రోజు కూడా 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదు కాలేదని, మరి ఎందుకు సెలవులు ఇచ్చారో అర్థం కావడం లేదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. ప్రైవేట్కు మేలు చేసేందుకేనా? ఈ ఏడాది నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్య నుంచే ఆంగ్ల మాధ్యమం అమలు చేస్తున్నారు. దీనిపై ఉపాధ్యాయులు గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తుండటంతో అడ్మిషన్లు పెరుగుతున్నాయి. అదే సమయంలో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో అడ్మిషన్లు అనుకున్నంత స్థాయిలో కావడం లేదు. పరోక్షంగా వారికి మేలు చేయడం కోసమే సర్కారు స్కూళ్లకు ఆకస్మిక సెలవులు ఇచ్చారని ఉపాధ్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి .సెలవులు ప్రకటిస్తూ జారీ చేసిన సర్క్యులర్లో ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లకు సెలవులు వర్తిస్తాయని పొందుపరచక పోవడం అందులో భాగమేనని అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల పెరిగేలా ప్రోత్సహించాల్సిన విద్యాశాఖే అసంబద్ధ నిర్ణయాలతో అందుకు విరుద్ధంగా వ్యవహస్తోందని ఉపాధ్యాయులు, విద్యార్థులు మండిపడుతున్నారు. సెలవుల అధికారం కలెక్టర్లకు ఇవ్వాలి వాతావరణంలో వచ్చిన మార్పులతో రాష్ట్ర విద్యాశాఖ స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు అన్ని చోట్ల అలాగే ఉండవు. స్థానికంగా ఉండే పరిస్థితులకు తగ్గట్లు సెలవులు ఇచ్చే అధికారం కలెక్టర్లకు ఇవ్వాలి. స్కూళ్ల పునఃప్రారంభమైన వారం రోజులకు సెలవులు ఇవ్వడం ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లకు ఆటంకంగా మారుతోంది. – వి.కరుణానిధిమూర్తి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు -
పిల్లలను బడిలో చేర్పిస్తేనే జీతం..!
కందుకూరు రూరల్/నాగులుప్పలపాడు: పుట్టగొడుగుల్లా పుట్టకొస్తున్న కార్పొరేట్ పాఠశాలల్లో నీరుపేద చిరుద్యోగుల బతుకులు చిత్తవుతున్నాయి. జూన్ నెలలో ప్రారంభమయ్యే 2018–19 విద్యా సంవత్సరానికి గత నెల రోజుల నుంచే విద్యార్థుల అడ్మిషన్ల వేట మొదలు పెట్టాయి కార్పొరేట్ పాఠశాలలు. కార్పొరేట్ యాజమాన్యాలు పెట్టే నిబంధనలకు ఆ పాఠశాలల్లో పని చేయాలా... లేక బయటకు రావాలా అనే సందిగ్ధంతో ఉద్యోగులు సతమతమవుతున్నారు. జిల్లాలో దాదాపు 30 కార్పొరేట్ స్కూళ్లు ఉన్నాయి. వాటిలో 1500 మంది వరకు సిబ్బంది పనిచేస్తున్నారు. ఇచ్చిన టార్గెట్లు చేస్తేనే జీతాలు... కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు నెల రోజుల నుంచి ఆయా పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులను ఊళ్లోలోకి పంపించారు. ఓట్ల ప్రచారం, ఇంటింటి సర్వేలు చేసే వాళ్లలా ఉపాధ్యాయులు ప్రతి ఇంటికీ వెళ్లి మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు...ఏం చదువుతున్నారు..ఎక్కడ చదువుతున్నారు.. అని అడిగి వారిని తమ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను బతిమాలుకుంటున్నారు. ఒక సారి మా పాఠశాలలో వసతులు చూడండి... ఫీజులు చూడండి, రీజల్టు చూడండని ఏకరువు పెడుతున్నారు. కొందరు టీచర్లు వారి దగ్గర చదువుకునే పిల్లల్ని, వారి తల్లిదండ్రుల్ని కూడా వారి ఇళ్ల దగ్గర వారినో, బంధువుల పిల్లల్నో తమ స్కూల్లో చేర్చేలా చూడమంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఎలాగోలా వారికి ఇచ్చిన అడ్మిషన్ల టార్గెట్ పూర్తి చేస్తేనే మార్చి, ఏప్రిల్ నెలల జీతాలు ఇస్తామని కొన్ని కార్పొరేట్ పాఠశాలలు నిబంధనలు పెట్టాయి. ఒక్కొక్కరు 10 నుంచి 15 మంది పిల్లలను ఖచ్చితంగా పాఠశాలలో చేర్పిం చాలి. అలా చేర్పిస్తేనే జీతాలు ఇస్తారు. లేకపోతే జీతం రాదు. ఆ తర్వాత పాఠశాలలో ఉద్యోగం ఉంటుందో లేదో కూడా గ్యారంటీ లేదు. ఇప్పటికే కొందరికి జీతాలు నిలిపివేసినట్లు సమాచారం. ఆయా పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులకు వచ్చే అరకొర జీతాలు నిలిపేయడంతో పిల్లలను చేర్పించేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఆకర్షణలతో మోసపోతున్న తల్లిదండ్రులు పాఠశాలల గురించి చెప్పే ప్రత్యేకతలను విన్న తల్లిదండ్రులు ఆకర్షణకు లోనవుతున్నారు. ప్రభుత్వ, స్థానిక ప్రైవేటు పాఠశాలల కంటే కార్పొరేట్ స్కూల్లో ఆకర్షణీయమైన యూనిఫాం, విశాలమైన తరగతి గదులు, వేర్వేరుగా మరుగుదొడ్లు, పరిమితికి లోబడి విద్యార్థుల సంఖ్య, కరెంట్ పోతే జనరేటర్ సౌకర్యం, తక్కువ ఖర్చుతో బస్ సౌకర్యం, అర్హత, అనుభవం కలిగిన ఉపాధ్యాయులు, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ, రోజు వారి టెస్ట్లు, ప్రతి రోజులు స్టడీ అవర్లు, కంప్యూటర్, లైబ్రరీ, ల్యాబ్లు, ప్రతి పండగ సెలబ్రేషన్, ఆటల, పాటలతో పాటు కరాటే, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉపాధ్యాయులు బదిలీ అయితే అదే చోట బ్రాంచ్కు విద్యార్థుల బదిలీ సౌకర్యం కల్పిస్తామని కార్పొరేట్ స్కూళ్ల సిబ్బంది చెప్తారు. విద్యార్థులను పాఠశాలలో చేర్పించుకొని అడ్మిషన్ ఫీజు కట్టించుకునే వరకు కేవలం పాఠశాల ఫీజు మాత్రమే చెప్తారు. ఫీజు చెల్లించిన తర్వాత బస్ ఫీజు, యూనిఫాం ఫీజు, బుక్స్ ఫీజు అంటూ ముక్కుపిండి వసూళ్లు చేస్తున్నారు. కార్పొరేట్ పాఠశాలలు ఆన్లైన్లో ఫిక్స్ చేసిన ఫీజులని చెప్తున్నారు. అవి అన్ని బ్రాంచ్ల్లో ఒకటిగానే ఉంటాయి. వీటిని మార్చేందుకు వీలు కాదు. కచ్చితంగా ఆన్లైన్లో చూపించే ఫీజు చెల్లించాలి. ఇలా నిబంధనలు పెడతారు. అప్పుడు ముందుగా క్యాంపెన్లు తిరిగి పిల్లలను చేర్పిన ఉపాధ్యాయులపై తల్లిదండ్రుల ఒత్తిళ్లు పెరుగుతాయి. అప్పుడు అలా చెప్పారు.. ఇప్పుడు ఇలా చెప్తున్నారని గందరగోళ పరిస్థితులు ఎదురవుతున్నాయని కొందరు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా విద్యాశాఖాధికారులు కార్పొరేట్ కాలేజీలపై దృష్టిపెట్టి ఉపాధ్యాయులపై వేధింపులు నిరోధించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఉపాధ్యాయినుల పరిస్థితి మరింత దయనీయం: పిల్లల్ని చేర్చాలంటూ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు చేస్తున్న ఒత్తిడితో ఉపాధ్యాయులు సతమతమవుతున్నారు. మహిళా ఉపాధ్యాయినుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. కొం త మంది అయితే యాజమాన్యాల ఒత్తిడి భరించలేక 2 నెలల జీతం వదులుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. విద్యార్థుల అడ్మిషన్ పనిలో పడి చాలా చోట్ల ఏప్రిల్ నెలలో అసలు పాఠశాలలే జరగడం లేదు. ఇదిలా ఉంటే నాగులుప్పలపాడు మండల కేంద్రంలో ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులను చేర్చాలంటూ ఉపాధ్యాయులపై టార్గెట్ పెట్టి ఒత్తిడి చేస్తున్నారు. ఈ పాఠశాలలో పని చేస్తున్న మహిళా టీచర్లను రాత్రి 10 గంటల వరకు కూడా క్యాంపెయిన్ పేరుతో పాఠశాలలో ఉండమని చెప్పడం తరువాత వారిని లైంగికంగా వేధించడం మొదలైంది. పాఠశాల యాజమాన్యంలోని ఓ వ్యక్తి అక్కడ పనిచేస్తున్న ఒక మహిళా టీచర్ను కొంత కాలం నుంచి అర్ధరాత్రి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడటంతో పాటు పాఠశాలలో ఉన్న సమయంలో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో విసుగు చెందిన ఉపాధ్యాయురాలు ఫోన్ సంభాషణను రికార్డు చేసి తన బంధువులకు వినిపించి వారి సాయంతో లైంగిక వేధింపులపై అడిగేందుకు వెళ్లగా..మీకు చేతనైంది చేసుకోండని చెప్పి వారిపై దాడి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సంకోచించిన సదరు ఉపాధ్యాయురాలు చివరకు శుక్రవారం తన సర్టిఫికెట్లు, తనకు రావాల్సిన 3 నెలల జీతం ఇవ్వాలని యాజమాన్యాన్ని అడిగింది. అయినా సర్టిఫికెట్లు ఇవ్వం, జీతం ఇచ్చేది లేదు..దిక్కున్న చోట చెప్పుకో అంటూ తీవ్రమైన దుర్భాషలాడారని బాధితురాలు వాపోయింది. ఈ పాఠశాలలో మహిళా టీచర్లపై వేధింపులు ఇదేం కొత్త కాదు. గతంలో ఇలాంటి వేధింపులతో చాలా మంది టీచర్లు నోరు మెదపకుండా పాఠశాల మానివేశారు. ఇదే విషయమై నాగులుప్పలపాడు ఎంఈవో జి.శేషయ్యను వివరణ అడగగా> మండల కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలలో మహిళా టీచర్లపై వేధిస్తున్నారన్న విషయంలో తాను సీరియస్ గా స్పందిస్తానని యాజమాన్యం వైపు నుంచి ఇలాంటి చర్యలు ఉంటే వారిని ఏ మాత్రం ఉపేక్షించేది లేదన్నారు. మా దృష్టికి రాలేదు జీతాల సమస్య సాధారణంగా సంస్థాగతంగా జరుగుతుంది. విద్యార్థులను చేర్చాలంటూ ఒత్తిడి తేవడం సరికాదు. జీతాలు ఇవ్వకుండా నిలిపివేయడంపై ఎవరైనా రాతపూర్వకంగా ఫిర్యాదుచేస్తే తదుపరి చర్యలను చేపడతాం. -వీఎస్.సుబ్బారావు, జిల్లా విద్యాశాఖ అధికారి -
ర్యాంకుల గుట్టు
-
ఫీజులు పెంచొద్దు!
వనపర్తి విద్యావిభాగం : ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు పెంచొద్దని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆదేశాలు జారీచేసింది. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధికఫీజులు వసూలు చేస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించింది. ప్రైవేట్ పాఠశాలల్లో ఏటా పదిశాతం ఫీజులు పెంచుకోవచ్చని ఇచ్చిన తిరుపతిరావు కమిటీ నివేదిక పరిశీలనలోనే ఉందని తెలిపింది. ఫీజుల పెంపు విషయంలో ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు గతేడాది ఫీజులనే కొనసాగించాలని స్పష్టంగా ఆదేశించింది. నిబంధనలు తూచ్! జిల్లాలో ఉన్న 110ప్రైవేట్ పాఠశాలల్లో 50వేలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రైవేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. జిల్లా కేంద్రంలోనే టెక్నో, టాలెంట్, ఒలంపియాడ్ తదితర పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నారు. దీనికితోడు పాఠశాలలోనే పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, టై, బెల్ట్, బ్యాడ్జ్ల పేరుతో ఫీజుల భారం మోపుతున్నారు. తిరుపతిరావు కమిటీ నివేదికపై నిరసనలు కార్పోరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీ అరికట్టాలని పేరెంట్స్ కమిటీల పోరాటాలతో ప్రభుత్వం తిరుపతిరావు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పరిశీలన అనంతరం ప్రైవేట్ పాఠశాలలు ప్రతి సంవత్సరం 10శాతం ఫీజులు పెంచుకోవచ్చని ప్రభుత్వానికి నివేదించింది. ఇప్పటికే ఫీజుల భారంతో ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు తిరుపతిరావు కమిటీ నివేదికపై మండిపడుతున్నారు. తిరుపతిరావు కమిటీ నివేదికను అమలు చేయొద్దని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయ, విద్యార్థి, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోసారి ఆదేశాలు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు పెంచొద్దని ఇదివరకే ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని బుకాయిస్తున్నాయి. దీంతో తాజాగా ప్రభుత్వం మంగళవారం మరోసారి ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఫీజులు పెంచొద్దని గతేడాది వసూలుచేసిన పాత ఫీజుల ప్రకారం అడ్మిషన్లు తీసుకోవాలని సూచించింది. ఒకవేళ అధిక0గా వసూలు చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. -
కార్పొరేట్కే ప్రభుత్వ ప్రోత్సాహం
జగన్ను కలసిన ప్రయివేటు పాఠశాలల, కళాశాలల యాజమాన్య సంఘం సభ్యులు రాయచోటి రూరల్: రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలను ప్రోత్సహిస్తూ తమను వేధిస్తోందని ప్రయివేటు పాఠశాలల, కళాశాలల యాజమాన్యం సంఘం నేతలు జననేత దృష్టికి తెచ్చారు. ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డు హౌసింగ్ కాలనీ వద్ద వారు జగన్ను కలసి తమ సమస్యలను విన్నవించారు. ప్రయివేటు పాఠశాలలకు విద్యుత్ కనెక్షన్లు కమర్షియల్ కేటగిరి –2 నుంచి కేటగిరి–7కు మార్చాలని, ఫైర్ రెన్యువల్ను ప్రతి సంవత్సరం కాకుండా పదేళ్లుకోసారి చేసుకునేలా వెసలుబాటు కల్పించాలని చెప్పారు. వారి సమస్యలను విన్న జగన్..తాము అధికారంలోకి రాగానే అన్నింటిని పరిష్కరిస్తామన్నారు. -
ఆసక్తి చూపని విద్యార్థులు!
– 214 సీట్లకు 93 మంది హాజరు – ఇదీ కార్పొరేట్ విద్య పథకం దుస్థితి అనంతపురం ఎడ్యుకేషన్ : భర్తీ చేయాల్సిన సీట్లు 232. వచ్చిన దరఖాస్తులు 1960. చివరగా కౌన్సెలింగ్ హాజరైన విద్యార్థులు 93 మంది ... ఇదీ కార్పొరేట్ విద్య పథకం దుస్థితి. దీన్నిబట్టి చూస్తుంటే ఏడాదికి రూ.35 వేలు ఖర్చు చేసి ఉచితంగా చదివిస్తామంటే కూడా పిల్లలు ఆసక్తి చూపడం లేదనేది స్పష్టమవుతోంది. మరోవైపు ప్రభుత్వ అలసత్వం కారణంగానే ఈ దుస్థితి నెలకొందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. పిల్లలకు ఫీజు చెల్లించలేక చదువు మానేసిన కుటుంబాలు జిల్లాలో అనేకం. ఇలాంటి జిల్లాకు వరంగా మారిన కార్పొరేట్ విద్య పథకం చతికిల పడింది. 232 సీట్లు భర్తీ చేయాల్సి ఉండగా తొలివిడతా 214 సీట్ల ప్రవేశాలకు గురువారం స్థానిక ఎస్సీ నంబర్ 4 వసతి గృహంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆయా కళాశాలలకు విద్యార్థులను కేటాయిస్తూ ప్రవేశ పత్రాలు అందజేశారు. అయితే 214 సీట్లకు గానూ కేవలం 93 మంది మాత్రమే హాజరయ్యారంటే ఈ పథకం ఉపయోగం అర్థం చేసుకోవచ్చు. ఎస్సీ విద్యార్థులు 103 మందికి 56, మైనార్టీ విద్యార్థులు 15 మందికి 6, బీసీ విద్యార్థులు 54 మందికి 13, ఈబీసీ విద్యార్థులు 11 మందికి 4, ఎస్టీ విద్యార్థులు 28 మందికి 14 మంది హాజరయ్యారు. ఇక బీసీసీ విద్యార్థులు ముగ్గురికి కూడా ఒక్కరూ హాజరుకాలేదు. సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రోశన్న, బీసీ సంక్షేమశాఖ డీడీ రమాభార్గవి, గిరిజన సంక్షేమశాఖ జిల్లా అధికారి కొండలరావు, సాంఘిక సంక్షేమ జిల్లా అధికారి లక్ష్మానాయక్ తదితరులు కౌన్సెలింగ్లో పాల్గొన్నారు. ఆలస్యమే ప్రధాన కారణం : ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో చదివి పదో తరగతిలో బాగా ప్రతిభ చాటి ఆర్థిక ఇబ్బందిగా ఉన్న కుటుంబాలకు కార్పొరేట్ విద్య పథకం చాలా ఉపయోగకరం. అయితే ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల చాలామందికి ఉపయోగం లేకుండాపోయింది. ఈ పథకం ద్వారా ఏడాదికి రూ. 35 వేలు ఫీజు చెల్లించడంతో పాటు విద్యార్థి ఖర్చుకు రూ. 3 వేలు ప్రభుత్వమే చెల్లిస్తుంది. జూన్ 1 నుంచే ఇంటర్ ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. సరిగ్గా 35 రోజుల తర్వాత ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో ఇప్పటికే చాలామంది వారికి అనుకూలమైన కళాశాలల్లో అప్పుసప్పులు చేసి చేరిపోయారు. దీనికితోడు పేరుకు కార్పొరేట్ పథకం అని ఉన్నా...జాబితాలో అన్నీ లోకల్ కళాశాలల పేర్లే ఉండటం కూడా విద్యార్థులు చేరకపోవడానికి మరో కారణమంటూ విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. -
కార్పొ‘రేట్’ను కట్టడి చేయాల్సిందే
► విద్యావ్యాపారాన్ని నియంత్రించాల్సిందే ► రాజ్భవన్ ప్రభుత్వ పాఠశాల భవన ప్రారంభోత్సవంలో గవర్నర్ నరసింహన్ సాక్షి, హైదరాబాద్: విద్యను వ్యాపార వస్తువుగా మారుస్తున్న కార్పొరేట్ విద్యాలయాలను కట్టడి చేయాల్సిన అవసరముందని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. రూ.4.5 కోట్లతో రాజ్భవన్ స్టాఫ్ క్వార్టర్స్లో కొత్తగా నిర్మించిన మూడు అంతస్థుల ప్రభుత్వ స్కూల్ భవనాన్ని బుధవారం ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్లతో కలసి ఆయన ప్రారంభించారు. అనంతరం చిన్నారులకు గవర్నర్ దంపతులు నరసింహన్, విమలానరసింహన్ అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం తరగతి గదులన్నీ కలియ తిరిగారు. నరసింహన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పేదలకు మెరుగైన విద్యను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రాజ్భవన్ స్కూల్ను రాష్ట్రంలోనే రోల్ మోడల్గా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. రాజ్భవన్ స్కూల్ నిర్మాణంపై విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అభినందనీయమని అన్నారు. ఉపాధ్యాయులు యాంత్రికంగా పాఠాలు చెప్పి వెళ్లి పోవడం కాకుండా వారితో స్నేహభావంతో మెలగాలని సూచించారు. మెరుగైన ఫలితాలు సాధించి ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెంచాలని అన్నారు. పిల్లలకు పాఠాలు బోధించడం ఎంత ముఖ్యమో, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడమూ అంతే ముఖ్యమని చెప్పారు. గవర్నర్ చొరవతోనే... గవర్నర్ చొరవ తీసుకుని శిథిల భవనం స్థానంలో అత్యాధునిక పాఠశాల భవనాన్ని నిర్మింపజేశారని కడియం శ్రీహరి చెప్పారు. రాబోయో రోజుల్లో ఇక్కడ సీటు దొరకని పరిస్థితి నెలకొంటుందని అన్నారు. గత పాలకుల హయంలో విద్యావ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందని, ఇప్పుడిప్పుడే దానికి చికిత్స చేసి మెరుగుపరుస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో రూ.420 కోట్లతో మౌలిక వసతులు కల్పించడంతోపాటు 1061 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు నియోజకవర్గానికి ఒక గురుకులం చొప్పున స్థాపించి ఆదర్శవంతంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. రాజ్భవన్ స్కూలు ప్రత్యేకతలు ఇవే.. రాజ్భవన్లో పని చేసేఉద్యోగుల పిల్లల కోసం 1953లో రాజ్భవన్ ప్రభుత్వ ప్రాధమికోన్నత పాఠశాలను ఏర్పాటు చేశారు. తొలి ఎస్ఎస్సీ బ్యాచ్ 1963లో బయటికి వెళ్లింది. తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో ఉన్న స్కూలును పూర్తి స్థాయిలో ఇంగ్లిష్ మీడియం స్కూలుగా మార్చారు. ప్రస్తుతం ఇక్కడ ఒకటి నుంచి పదో తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. 754 మంది విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు. ప్రతి క్లాస్రూంలోనూ ఎల్సీడీ ప్రొజెక్టర్లు, అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్, 24 సీసీ కెమెరాలు, 20 బుక్ సెల్ప్లు, సురక్షిత మంచినీటి సరఫరా కోసం ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేశారు. ప్రయోగాల కోసం అత్యాధునిక ల్యాబ్ను అందుబాటులోకి తెచ్చారు. -
ఏకరూప దుస్తులు అందేనా?
కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను రూపొందించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని చెబుతున్న పాలకులు ఆ దిశగా అమలు చేసేది శూన్యంగానే కనిపిస్తుంది. పాఠశాలల పునఃప్రారంభం నాటికే ప్రైవేటు పాఠశాలలకు పోటీగా పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు అందిస్తామని ఏటా చెప్పే పాలకులు దాన్ని అమలు చేయడంలో శ్రద్ధ చూపడం లేదు. దీంతో ఏటా విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. రామభద్రపురం(బొబ్బిలి): పాఠశాలలకు మౌలిక వసతుల సంగతి పక్కన పెడితే కనీసం విద్యార్థులు ధరించే యూనిఫారాలు, చదివేందుకు పాఠ్య పుస్తకాలైనా సకాలంలో అందించాల్సి ఉంది. కానీ ఆ పని కూడా పాలకులు చేయడం లేదు. దీంతో పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. చివరకు వచ్చేసరికి ఆ నెపాన్ని వేరే రూపంలో ఉపాధ్యాయులపై నెడుతూ పాలకులు పబ్బం గడుపుతున్నారు. మరో పది రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు పాఠ్య పుస్తకాలుగాని, ఏకరూప దుస్తులుగాని మండల విద్యాశాఖ కార్యాలయాలకు చేరుకోలేదు. దీంతో అగమ్యగోచర పరిస్థితి నెలకొంది. ఏకరూప దుస్తుల విషయానికొస్తే గత విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యా సంవత్సరం ఆఖరిలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో విద్యార్థులకు పంపిణీ చేశారు. ఇదే పరిస్థితి ఈ ఏడాది కూడా తప్పేలా లేదు. జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలు 2199, ప్రాథమికోన్నత పాటశాలలు 240, ఉన్నత పాఠశాలలు 378 ఉన్నాయి. వీటిలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు రెండు లక్షల 17వేల మంది ఉన్నారు. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న పిల్లలకు మాత్రమే ఏకరూప దుస్తులు ప్రభుత్వం అందిస్తుంది. వీరు లక్షా 61 వేల ఉన్నారు. ఒక్కో విద్యార్థికి రెండు జతల చొప్పున మూడు లక్షల 22 వేల దుస్తులు అవసరం ఉంది. పాఠశాలలు తెరిచే సరికే వీటిని పంపిణీ చేయాల్సి ఉంది. నిబంధనల ప్రకారం ఆప్కో ద్వారా దుస్తులకు అవసరమైన క్లాత్ సరఫరా చేసి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు అప్పగించి వారి ద్వారానే స్థానికంగా ఉన్న దర్జీలతో దుస్తులు కుట్టించాలి. కానీ ప్రభుత్వం అలా చేయకుండా ప్రైవేటు సంస్థలకు ఆ బాధ్యత అప్పగించడంతో సకాలంలో ఏకరూప దుస్తులు అందడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.ఈ కారణంగానే విద్యార్థులకు దుస్తులు విద్యా సంవత్సరం ఆఖరిలో అందుతున్నాయని పేర్కొంటున్నారు. -
కార్పొరేట్ సంస్థలపై నియంత్రణ లేదు: కోదండరాం
హైదరాబాద్: రాష్ట్రంలో కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలపై ప్రభుత్వానికి నియంత్రణ లేదని జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. శనివారం రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ టీజేఏసీ ఆధ్వర్యంలో స్కూళ్లలో ఫీజుల దోపిడీపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకు రాజకీయ అండదండలు ఉండటంతో వాటిని సర్కారు నియంత్రించ లేకుండా పోతోందన్నారు. వీటి వల్ల చిన్నా చితకా విద్యా సంస్థలు కనుమరుగై పోతున్నాయన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్య అంటేనే ర్యాంకు అనే విధంగా పరిస్థితి తయారయిందని విమర్శించారు. ప్రభుత్వం ఫీజుల నియంత్రణకు సమగ్రమైన చట్టం చేయాలని సూచించారు. ప్రభుత్వం ఫీజుల పెంపుపై స్టడీ చేయాలనుకుంటే ముందుగా ఫీజులు పెంచరాదని అన్నారు. విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం విద్యాసంస్థలను బలోపేతం చేయాలని తెలిపారు. కార్యక్రమానికి న్యాయవాది రచనా రెడ్డి, వివిధ సంఘాల నాయకులు హాజరయ్యారు. -
అడ్మిషన్ ఫీజుల పేరుతో ప్రైవేట్ స్కూల్ దోపిడి
-
బాల్యంపై భారం
బంగారు భవితపై ఎన్నో ఆశలతో పాఠశాలకు వెళుతున్న చిన్నారులు రోగాల బారిన పడుతున్నారు. కార్పొరేట్ పాఠశాలలు నిబంధనలకు తిలోదకాలిచ్చి నాలుగు నుంచి ఆరు అంతస్తుల భవనాల్లో తరగతులు నిర్వహిస్తుండటమే దీనికి కారణం. అసలే వయసుకు మించిన పుస్తకాల బరువు మోయలేక ఆపసోపాలు పడుతున్న చిన్నారులు అంత బరువుతో అన్ని అంతస్తులు ఎక్కలేక ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తున్నారు. దీర్ఘకాల రోగాలకు గురవుతున్నారు. -
డీఈవో కార్యాలయం ముట్టడి
ఆదిలాబాద్: జిల్లాలో నిబంధనలు పాటించకుండా ఇష్టారితీనా నిర్వహిస్తున్న ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని ఏబీవీపీ నాయకులు ముట్టడించారు. ప్రైవేటు పాఠశాలలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కో కన్వీనర్ మనోజ్ పవార్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోనే ఎలాంటి అనుమతి లేకుండా పాఠశాలలు నిర్వహిస్తున్న డీఈవో పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జీవో నంబర్ 1కు విరుద్దంగా ఫీజుల వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, షూలు, బెల్టులు, తదిర వస్తువులను విక్రయిస్తు సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు. కాన్వెంట్, డీజీ, మాడల్, కాన్సెప్ట్, డిజిటల్ తదితర తోక పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్శించి వారి నుంచి వేలల్లో ఫీజులు దండుకుంటున్నారని అన్నారు. ఈ విషయం విద్యాశాఖ అధికారులకు తెలిసినప్పటికీ ‘మామూలు’గా తీసుకుంటున్నారని ఆరోపించారు. నిరసనలో ఆ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షాహజాది, జిల్లా నాయకులు రాజేష్, ప్రశాంత్, రవికాంత్, ప్రమోద్, నిఖిల్, సురేష్, కర్ణ, సర్వేష్, రత్నామాల పాల్గొన్నారు. -
'కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారు'
హైదరాబాద్: తెలంగాణలో చేయాల్సింది చేయకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై దుష్రచారం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు విమర్శించారు. హైదరాబాద్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కార్పొరేట్ స్కూళ్లతో టీఆర్ఎస్ ప్రభుత్వం కుమ్మక్కైందని ఆరోపించారు. ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ కేసీఆర్కు కనిపించడం లేదా అని సూటిగా ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని జలవివాదాలను పరిష్కరించుకోవాలని ఎమ్మెల్సీ రామచంద్రరావు సూచించారు. -
ఫీజులుం
ఫీజు నియంత్రణ లేక.. భారీగా దోపిడీ బెంబేలెత్తుతున్న పేద, మధ్య తరగతి జనం నిబంధనలకు విరుద్ధంగా ముందుగానే అడ్మిషన్లు పట్టించుకోని విద్యాశాఖ చిత్తూరు(గిరింపేట)/తిరుపతి ఎడ్యుకేషన్: ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు ఫీజుల రూపంలో దోపిడీకి తెరతీశాయి. ప్రైవేట్ పాఠశాలల్లో ఎల్కేజీ నుంచి పదో తరగతి వరకు రూ.10 వేలు నుంచి రూ.50 వేలు, పేరుపొందిన స్కూళ్లు అయితే రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి జిల్లాలో 1,187ప్రైవేట్ పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాలల్లో గత ఏడాది ఒకటి నుంచి పదో తరగతి వరకు దాదాపు 3.20 లక్షల మంది విద్యార్థులు చదువుకున్నారు. ఈ ఏడాది జూన్ 13వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం స్కూళ్లు ప్రారంభమైన తరువాతనే అడ్మిషన్లు ప్రారంభించాలి. అయితే అందుకు విరుద్ధంగా కొన్ని ప్రయివేటు విద్యాసంస్థలు నెల రోజుల ముందుగానే అడ్మిషన్లు ప్రారంభించాయి. కొన్ని పాఠశాలలైతే ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి గత విద్యాసంవత్సరంలోనే అడ్మిషన్లు చేశాయి. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ప్రైవేట్, కార్పొరేట్ హంగుల మాయలో పడి తమ పిల్లలను ఆ పాఠశాలల్లో చేర్పించడానికి ఆసక్తి కనబరుస్తుండడంతో అడ్మిషన్ల ప్రక్రియ ముందస్తుగానే చేపడుతున్నారు. పేర్లు ఆకర్షణీయం.. ఫీజులు ఆందోళనకరం స్కూలు పేరు ముందు, వెనుక ఎటువంటి పేర్లను తగిలించుకోకూడదన్న నిబంధనలున్నాయి. అయినా సినిమా టైటిల్స్లా ట్యాగ్లైన్లు, ఆకర్షణీయమైన పేర్లతో జిల్లాలో ఏటా కొత్త పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తునే ఉన్నాయి. ఇటీవల కాలంలో వందల సంఖ్యలో విద్యాసంస్థలు వెలిశాయి. ఇలాంటి స్కూళ్లపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. ధన, రాజకీయ బలం ఉండడంతో ఆయా పాఠశాలల జోలికి వెళ్లడానికి అధికారులు వెనుకడుగు వేస్తున్నారన్న విమర్శలున్నాయి. కళ్లెం ఏదీ ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు సంబంధించి వసూలు చేయాల్సిన ఫీజుల విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. ఎంత ఫీజు వసూలు చేయాలో పాఠశాలల యాజమాన్య కమిటీ నిర్ణయిస్తుంది. ఈ లొసుగును ఆసరాగా చేసుకుని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు అందినకాడికి దోచుకుంటోంది. కనిపించని యాజమాన్య కమిటీలు ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ప్రతి పాఠశాల్లో యాజమాన్య కమిటీని ఏర్పాటుచేసుకోవాలి. ఇందులో అధ్యక్ష, కార్యదర్శులుగా యాజమాన్యం ఉన్నా, హెచ్ఎం, టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు సభ్యులుగా ఉండాలి. ఇలా ఏర్పాటైన పాలకమండలి డీఈవో ఆమోదించాలి. కానీ నేటి ప్రైవేటు పాఠశాలల్లో ఎక్కడా కూడా పాలకమండలి కమిటీ కనిపించడం లేదు. నామమాత్రంగా ఆయా పాఠశాలల యాజమాన్యం, వారి బంధువుల పేర్లతో గవర్నెంగ్ బాడీ ఏర్పాటు చేసుకుని అధిక ఫీజులను వసూలు చేస్తోంది. మా దృష్టికి తీసుకురావాలి అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లైతే సంబంధిత ఎంఈవోల ద్వారా తమ దృష్టికి తీసుకురావాలి. అటువంటి విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటాం. తప్పనిసరిగా ఆయా పాఠశాలల్లో ఫీజుల వివరాలు, ఉపాధ్యాయ అర్హతలు డిస్ల్పే చేయాల్సిందే. నిబంధనలు పాటించకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవు. -కె.నాగేశ్వరరావు, జిల్లా విద్యాశాఖాధికారి -
పాఠశాల చదువు.. మోయలేని బరువు..
* ఏటా ఫీజులను పెంచేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు * ఈ సంవత్సరమూ 10 నుంచి 15 శాతం పెంపు * పరీక్షలు పూర్తవకుండానే వచ్చే సంవత్సరానికి అడ్మిషన్లు అమలాపురం : అర్హులైన వారికి.. ఉన్నత విద్య చదివే సందర్భంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఉంది. ఇంటర్, డిగ్రీలకు స్కాలర్ షిప్లున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లోనేకాదు.. ప్రైవేట్ కాలేజీల్లో విద్యార్థులకు సైతం ఇవి వర్తిస్తున్నాయి. ఆ వెసులుబాటు లేనిదల్లా పాఠశాల విద్యకే. పాఠశాల విద్య ప్రభుత్వ స్కూళ్లలో ఉచితం కాగా.. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఖరీదైన వ్యవహారంగా, సామాన్య, మధ్య తరగతి వర్గాలకు మోయలేని భారంగా మారిపోయింది. ఏటా పెంచినట్టే ప్రైవేట్ స్కూళ్లలో ఈ ఏడాది కూడా 10 నుంచి 15 శాతం ఫీజులు పెంచారు. జిల్లాలో మరో వారం రోజుల్లో పాఠశాలస్థాయి పరీక్షలు పూర్తికానున్నాయి. తరువాత వేసవి సెలవులు మొదలవుతారుు. జూన్ పది తరువాత పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు తెరవనున్నారు. ప్రైవేట్ స్కూళ్ల యజమానులు ఇంకా పరీక్షలు పూర్తి కాకపోరుునా వచ్చే విద్యా సంవత్సరానికి అప్పుడే అడ్మిషన్లు ఆరంభించారు. కొత్తవారిని చేర్చుకునేందుకు పెద్ద కసరత్తే చేస్తున్నారు. విద్యార్థులను గుర్తించి తమ పాఠశాలల్లో చేర్చేందుకు పీఆర్వోలనే కాదు చివరకు ఉపాధ్యాయులను కూడా రంగంలోకి దింపారు. పనిలో పనిగా టా పెంచినట్టే ఈ ఏడాది కూడా 10 నుంచి 15 శాతం ఫీజులు పెంచివేశారు. కార్పొరేట్ స్కూళ్లలో ఈ పెంపు మరింత ఎక్కువగా ఉంది. కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల వసూలు ఇలా.. నర్సరీ - యూకేజీ : రూ.19,000 నుంచి రూ.25,000 1 - 3 తరగతులు : రూ.20,000 నుంచి రూ.27,000 4 - 5 తరగతులు : రూ.23,000 నుంచి రూ.28,000 6 - 7 తరగతులు : రూ.25,000 నుంచి రూ.30,000 8 - 9 తరగతులు : రూ.27,000 నుంచి రూ.32,000 10వ తరగతి : రూ.29,000 నుంచి రూ.34,000 ఎన్నిరకాల బాదుళ్లో.. ఇవి కాకుండా కొత్తగా చే రే వారి నుంచి అడ్మిషన్ ఫీజుగా రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకూ వసూలు చేస్తున్నారు. బస్సు చార్జీలుగా 5 కిలోమీటర్లలోపు రూ.5 వేలు, అంతకుమించిన దూరానికి రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకూ వసూలు చేస్తున్నారు. ఇక పుస్తకాలు, యూనిఫాంల పేరుతో జరుగుతున్న దోపిడీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే యూకేజీ లోపు చదివే విద్యార్థికే రూ.30 వేలకు పైబడి అవుతుందంటే ప్రాథమిక విద్య ఎంత ఖరీదైన వ్యవహారంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఏటా ఫీజులు పెంచుతున్నా అడ్డుకోవాల్సిన విద్యాశాఖాధికారులు మిన్నకుండడంతో ప్రైవేట్ స్కూల్ యజమాన్యాల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. విద్యార్థులను చేర్చకుంటే ఇంక్రిమెంట్లు లేనట్టే.. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల యూజమాన్యాలు కొత్తగా విద్యార్థులను చేర్చే బాధ్యతను ఆ సంస్థల పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (పీఆర్వో)ల మీదనే కాక ఉపాధ్యాయులు మీద కూడా పెడుతున్నాయి. ఉపాధ్యాయులు ఒక్కొక్కరూ ఇద్దరు, ముగ్గురు విద్యార్థులను చేర్పించాలని లక్ష్యంగా నిర్ణయించారు. అలా చేర్చకుంటే ఇంక్రిమెంట్లను రద్దు చేస్తామని బెదిరిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని యాజమాన్యాలు వేసవి సెలవులు ఇచ్చేది లేదనడంతో ఉపాధ్యాయులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖాధికారులు ఫీజుల పెంపుపై స్పందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
విద్యార్థులను వీడియో తీసిన మహిళా టీచర్
హైదరాబాద్: కాసుల కక్కుర్తితో విలువలకు పాతర వేస్తున్న కార్పొరేట్ స్కూళ్లలో మరో బాగోతం వెలుగుచూసింది. తమ స్వలాభం కోసం విద్యార్థుల జీవితాలను ఫణంగా పెట్టేందుకు కార్పొరేట్ స్కూళ్లు వెనుకాడడం లేదు. బాలానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చిన ఘటన కార్పొరేట్ స్కూళ్ల మధ్య జరుగుతున్న అనారోగ్యకర, అనైతిక పోటీకి అద్దం పడుతోంది. 9వ తరగతి చదువుతున్న ఇద్దరు స్టూడెంట్స్ స్కూల్ టెరాస్ పై సన్నిహితంగా ఉండగా పక్కనే ఉన్న మరో పాఠశాలకు చెందిన మహిళా టీచర్ ఈ దృశ్యాన్ని తన మొబైల్ తో వీడియో తీసింది. దాన్ని ప్రిన్సిపాల్ కు చూపించింది. తమకు పోటీగా ఉన్న సదరు స్కూల్ కు చెడ్డపేరు తేవాలన్న ఆలోచనతో ఆయన ఈ వీడియోను వాట్సాప్ లో షేర్ చేశాడు. ఈ వీడియో విపరీతంగా సర్క్యూలేట్ అయి కొంతమంది మీడియా రిపోర్టర్లకు చేరింది. ఈ విషయాన్ని బయటకు రాకుండా చూడాలంటే తమకు డబ్బు ఇవ్వాలని వీడియోకు సంబంధించిన పాఠశాల యాజమాన్యాన్ని వారు బెదిరించారు. చివరకు విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు బాలికతో సన్నిహితంగా మెలగిన బాలుడు, వీడియో తీసిన టీచర్, దాన్ని షేర్ చేసిన ప్రిన్సిపాల్ పై కేసు నమోదు చేశారు. పాఠశాల యాజమ్యాన్ని బెదరించిన మీడియా రిపోర్టర్లపైనా దర్యాప్తు చేపట్టామని బాలానగర్ పోలీసు ఇన్స్ పెక్టర్ భిక్షపతి తెలిపారు. -
చిన్న చిన్న డబ్బాల్లా స్కూళ్లు
► నారాయణ, చైతన్య స్కూళ్లే నిదర్శనం ► ఆత్మహత్యలకు వ్యాయామ విద్య లేకపోవడమే కారణం ► అరగంట సమయం ఇస్తే నిరూపిస్తా ► అసెంబ్లీలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ చాలెంజ్ నెల్లూరు(స్టోన్హౌస్పేట) : ‘కార్పొరేట్ స్కూళ్లు, కళాశాలలు చిన్న చిన్న డబ్బాలాంటి అపార్ట్మెంట్స్లో నిర్వహిస్తున్నారు. వ్యాయామ విద్యకు ప్రాధాన్యత ఇవ్వకపోవటంతో వి ద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అదే విధం గా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అరగంట సమయం ఇస్తే ఆధారాలతో నిరూపిస్తా. సీఎం చంద్రబాబు సొంత నియోజక వర్గం కుప్పంలోనే 40 పాఠశాలల ఫొటోలను సైతం తెప్పిస్తా’ అని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్కుమార్యాదవ్ సవాల్ చేశారు. అసెం బ్లీలో సోమవారం ఇంటర్మీడియట్ విద్యా సవరణ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా అనిల్కుమార్యాదవ్ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. నారాయణ, చైతన్య విద్యాసంస్థల నిర్వహణపై విరుచుకుపడ్డారు. ఇంటర్తో పాటు ప్రైవేటు స్కూళ్ల నిర్వహణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. అన్ని పాఠశాలలకు మైదానాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కొన్ని పాఠశాలలు చిన్న చిన్న బిల్డింగ్లలో విద్యార్థులను పెట్టి ఒత్తిడికి గురిచేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారనే మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి మాటలను తప్పుబట్టారు. ముఖ్యమంత్రి 30 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిద్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలు ఎంత అధ్వానంగా ఉన్నాయో పరిశీలించాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితం మంత్రి నారాయణ నెల్లూరులో ఓ స్కూలును విజిట్ చేశారని, అక్కడ ఓ విద్యార్థిని బేసిక్స్ లేకుండా కార్పొరేట్ విద్యను ఎలా అందిస్తామని మంత్రిని ప్రశ్నించారని గుర్తుచేశారు. ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ పాఠశాలల్లో వసతులకల్పనకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
దిద్దుబాటు
► ప్రగతి దిశగా సర్కార్ బడులు! ► కార్పొరేట్కు దీటుగా.. చర్యలు ► సీబీఎస్ఈ తరహా విధానం అమలు ► ఒంటిపూట సెలవులు రద్దు ► మార్చి 21 నుంచి పై తరగతుల బోధన ► సమస్యలపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నంబర్: 1800 425 7462 ►విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళిక పాపన్నపేట: ప్రభుత్వ పాఠశాలలను ప్రగతి దిశగా పరుగులు తీయించేందుకు రాష్ట్ర సర్కార్ సమాయత్తమవుతోంది. కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతోంది. రోజు రోజుకు సర్కార్ బడుల్లో దిగజారుతున్న విద్యాప్రమాణాలను మెరుగు పర్చి సత్తా చాటేందుకు విద్యాశాఖ డెరైక్టరేట్ ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. మార్చి నెలలో నిర్వహించే ఒంటి పూట బడులను రద్దు చేసింది. మార్చి 14 లోగా పరీక్షలు పూర్తి చేసి 21 నుంచి పైతరగతుల బోధన చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఇక సీబీఎస్ఈ తరహా విధానం అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్ డీఈఓలను ఆదేశించారు. ఈ మేరకు మెదక్ డీఈఓ నజీమొద్దిన్ ఇటీవల సంగారెడ్డిలో జరిగిన ఎంఈఓల సమావేశంలో కొత్త ప్రణాళికను ప్రకటించారు. జిల్లాలో సుమారు 2,899 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇటీవల రాష్ట్ర అకాడమిక్ మానిటరింగ్ టీంలు నిర్వహించిన పరిశీలనలో సర్కార్ బడుల్లోని డొల్లతనం బయట పడింది. దీంతో ఉనికిని కాపాడుకుంటూ ప్రభుత్వ పాఠశాలలు సత్తాచాటేందుకు దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. సీబీఎస్ఈ తరహా విధానం అమలు పర్చేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించింది. ఈ మేరకు మార్చి నెలలో ఇచ్చే ఒంటి పూట సెలవులను రద్దు చేసింది. మార్చి 21 నుంచి ఎప్రిల్ 23 వరకు పైతరగతుల బోధన నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం 1 నుంచి 9 తరగతుల వరకు మార్చి 7 నుంచి 14వ తేదీలోగా వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఫార్మెటివ్ 4 పరీక్షలను ఫిబ్రవరి 28న నిర్వహించాల్సి ఉంటుంది. పదోతరగతికి జనవరి 31న నిర్వహించాలి. మార్చి 21 లోగా 9 వతరగతి వరకు ప్రొగ్రెస్ కార్డులు ఇవ్వాలి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 9 వరకు పదో తరగతి పరీక్షలుంటాయి. ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రకటిస్తారు. జూన్ 13న పాఠశాలలను పునఃప్రారంభిస్తారు.మైనారిటీ స్కూళ్లకు డిసెంబర్ 24 నుంచి 30 వరకు క్రిస్మస్ సెలవులు, ఇతర స్కూళ్లకు జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇస్తారు. ఫిర్యాదుల కోసం టోల్ఫ్రీ నంబర్ పాఠశాలకు సంబంధించిన ఫిర్యాదులను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేందుకు టోల్ ఫ్రీ నంబర్ 1800 425 7462ను పాఠశాల విద్యాడెరెక్టైరేట్ అందుబాటులోకి తెచ్చింది. ప్రతి పాఠశాలలో విధిగా ఈ నంబర్ బహిరంగంగా రాసి ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. -
ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై నియంత్రణ ఏదీ ?
- జెడ్పీ స్థాయి సంఘ - సమావేశంలో ప్రశ్నించిన - జెడ్పీటీసీ సభ్యుడు - కోరం లేక వాయిదా పడిన 3,6 స్టాండింగ్ కమిటీ సమావేశాలు చిత్తూరు(ఎడ్యుకేషన్) : ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లపై విద్యాశాఖ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని గుర్రంకొండ జెడ్పీటీసీ సభ్యుడు కురబలకోట రెడ్డిరాజ ఆవేదన వ్యక్తం చేశారు. జెడ్పీ మీటింగ్హాలులో గురువారం 1,7 మినహా మిగిలిన స్థాయి సంఘాల సమావేశం జెడ్పీ సీఈవో వేణుగోపాల్రెడ్డి పర్యవేక్షణలో జరిగింది. జెడ్పీ ఉపాధ్యక్షులు సుందరరామిరెడ్డి అధ్యక్షతన జరిగిన నాలుగో స్థాయి సంఘ సమావేశంలో జెడ్పీసీటీ సభ్యుడు రెడ్డిరాజ మాట్లాడుతూ ప్రైవేటు విద్యాసంస్థల్లో ఎల్కేజీ చదువుకు రూ.20నుంచి 30వేలు వసూలు చేస్తున్నా విద్యాశాఖ చూస్తూ ఊరుకోంటోందని విమర్శించారు. ప్రతిస్కూల్ నోటీసు బోర్డులోనూ కమి టీ నిర్దేశించిన ఫీజుల వివరాలను పొందుపరచాల్సి ఉన్నా ఏ ఒక్క పాఠశాల కూడా పాటించలేదని తెలిపారు. తమ స్కూళ్లలోనే పుస్తకాలు, నోటుపుస్తకాలు, యూనిఫాం దుస్తులు, షూలు కొనాలని ప్రైవేటు స్కూళ్లు నిర్బంధ వ్యాపారాలను చేపడుతున్నా చర్యలు శూన్యమన్నారు. గుర్తింపు లేని పాఠశాలలు కోకొల్లాలుగా నడుస్తున్నా చర్యలేవైనా తీసుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఉపాధ్యాయులు చాలా చోట్ల వ్యాపారాల్లో నిమగ్నమై స్కూళ్లకు సక్రమంగా వెళ్లడం లేదన్నారు. విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులు రావాలని ఆయన కోరారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీల్లో ప్రజాప్రతినిధులకు ప్రాతినిధ్యాన్ని కల్పిస్తారా..? రాజకీయ కమిటీలకే పరిమితమవుతా రా అని వడమాలపేట జెడ్పీటీసీ సభ్యు డు ధర్మయ్య ప్రశ్నించారు. కేవీబీపురంలో పాత పీహెచ్సీ భవనానికి మరమ్మతులు చేపట్టాలని జెడ్పీటీసీ సభ్యు లు వాణి డీఎంహెచ్వో కోటీశ్వరిని ప్రశ్నించారు. పారిశుద్ధ్య నిధులు గ్రా మ స్థాయిలో దుర్వినియోగమవుతున్నాయని జెడ్పీ ఉపాధ్యక్షుడు సుందరరామిరెడ్డి చెప్పారు. సత్యవేడు మండ లం మదనంబేడు హైస్కూల్లో మ ధ్యాహ్నభోజనం చేసే రెండు గ్రూపుల మధ్య వివాదాలు తారస్థాయికి చేరాయని, వాటిని పరిష్కరించాలని డీఈవోకు విన్నవించారు. పొలకల గ్రామంలో బ్యాంకు రుణాలను కట్టి రెండేళ్లు గడిచినా బ్యాంకు మేనేజర్ 59 గ్రూపులకు కొత్తగా రుణాలివ్వలేదని, ఇటీవల ఆందోళన చేసిన బాధిత మహిళలపై మేనేజర్ కేసులు బనాయించారని జెడ్పీటీసీ సభ్యురాలు లత తెలిపారు. సాక్షర భారత్ కేంద్రాలు జిల్లాలో ఎక్కడా సక్రమంగా నడపటంలేదని, వారిపై ఏమైనా చర్యలు తీసుకు న్నారా అని ఆమె సాక్షరభారత్ డీడీ ఉ మాదేవిని ప్రశ్నించారు. ఐదవ స్థాయి సంఘ సమావేశం కార్వేటినగరం జెడ్పీటీసీ సభ్యురాలు గీతయాదవ్ అధ్యక్షతన జరిగింది. 3, 6 స్థాయి సంఘాల సమావేశాలు కోరం లేకపోవడంతో శుక్రవారానికి వాయిదా వేశారు. -
ప్రతి విద్యార్థికి సెపరేటు
ఇద్దరు చిన్ననాటి మిత్రులుచాలా రోజుల తర్వాత కలుసుకున్నారు. మాటల్లో భాగంగా పిల్లల చదువుల గురించి చెప్పుకున్నారు. ఇద్దరు పిల్లలు ఒకే స్కూల్లో చదువుతున్నారని వారి మాటల్లో తెలిసింది.మా అబ్బాయి ‘అల్ఫా సెక్షన్’ అంటే, మా వాడు ‘స్టార్ బ్యాచ్’ సంవత్సరానికి లక్ష రూపాయలు చెల్లిస్తున్నా.. అని మరో మిత్రుడు గర్వంగా చెప్పాడు. ఇదీ కార్పొరేట్ పాఠశాలలుఅనుసరిస్తున్న విభజించు-చదివించు విద్యావిధానం. విభజించు.. చదివించు ఫీజుల ప్రాతిపాదికన విద్యార్థుల విభజన అధిక ఫీజులు చెల్లిస్తేనే ఉత్తమ విద్య కార్పొరేట్ విద్యాసంస్థల్లో విష సంస్కృతి విశాఖ ఎడ్యుకేషన్ : భారతదేశంలో బ్రిటిష్ గవర్నమెంటు ‘విభజించు..పాలించు’ విధానం అమలుచేసేదని విన్నాం. ఇప్పుడు కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ప్రత్యక్షంగా చూస్తున్నాం. పాఠశాలలో, కళాశాలలో చేరే విద్యార్థులను, వారు చెల్లించే ఫీజుల ఆధారంగా రకరకాల పేర్లతో సెక్షన్స్గా విభజిస్తున్నారు. ఎక్కువ ఫీజులు చెల్లించే వారికి ఒకలా, తక్కువ ఫీజులు చెల్లించే వారికి ఒకలా చదువులు చెబుతున్నారు. దీనివల్ల విద్యార్థుల్లో తెలియకుండానే ఓ వివక్ష భావం మొదలవుతుంది. కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలల్లో వేల సంఖ్యలో విద్యార్థులు ఉంటే కొంత మందిని వారి మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. మిగిలినవారు పాస్ అయినా అవ్వకున్నా పెద్ద ప్రమాదం లేదని ధోరణితో వ్యవహరిస్తున్నారు. కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్థుల ర్యాంకులు కాకుండా ఉత్తీర్ణత శాతం చూస్తే దారుణమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. బట్టీ పట్టి ఎలాగోలా ఇంటర్ గట్టెక్కి ఇంజినీరింగో...మరే కోర్సులో చేరితే కమ్యూనికేషన్, పర్సనల్ స్కిల్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రచారం ఘనం.. ప్రమాణాలు కనం విద్యావిధానంలో వచ్చిన మార్పులు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు వరంగా మారాయి. విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చేసి దోపిడీయే ధ్యేయంగా నడుస్తున్నాయి. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన విద్య అందిస్తామని చెబుతున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో కనీస సదుపాయాలు కానరావడం లేదు. చీకటి గుహలను తలపించే బిల్డింగ్లు, అగ్గిపెట్టిని తలపించే తరగతి గదులే దర్శనమిస్తున్నాయి. ఎక్కడ వెదికినా ప్రయోగశాలలు, క్రీడా మైదానాలు కనిపించడం లేదు. ఫైర్ తదితర భద్రతా చర్యలు పాటించడం లేదు. అలాగే ఇక్కడ ప్రమాణాలు లేని చదువుల వల్ల విద్యార్థులు తరువాత సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఫీజుల నియంత్రణ కమిటీలు ఉండాలి కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో నీరజా కమిటీ సూచించినట్లు ఫీజుల నియంత్రణకు ప్రత్యేక కమిటీలు ఉండాలి. కార్పొరేట్ విద్యాంస్థలు అవలంబిస్తున్న విధానం వల్ల విద్యావ్యవస్థ నాశనం అవుతుంది. మూస ధోరణిలో సాగుతున్న చదువుల వల్ల నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ లేక ఇంటర్వ్యూల్లో ఫెయిల్ అవుతున్నారు. ప్రస్తుతం నిరుద్యోగం పెరగడానికి కార్పొరేట్, ప్రైవేట్ విద్యావిధానమే కారణం. - వాసు, ఏబీవీపీ జిల్లా కన్వీనర్ యువత ఆలోచనలు క్షీణిస్తున్నాయి.. ప్రస్తుతం కార్పొరేట్ విద్యాసంస్థలు అవలంబిస్తున్న విద్యావిధానం వల్ల యువతరం ఆలోచనలు క్షీణిస్తున్నాయి. సామాజిక అంశాలపై కనీసం అవగాహన ఉండడం లేదు. ఒకప్పుడు సామాజిక సమస్యలపై ఎక్కువగా యువతరం పోరాటం చేసేవారు. ఇప్పుడు కాలేజీలు బంద్ అంటే సినిమాలకు వెళ్లడం, లేదంటే పార్క్ల్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విద్యాసంస్థల్లో ఒక్కో విద్యార్థిని ఒక్కోలా చూడడం..చేయడం ద్వారా ఎవరి వ్యక్తిగత విషయాలు వారే ఆలోచించుకుంటున్నారు. ఈ ధోరణి సమాజానికి మంచిది కాదు. - నరవ ప్రకాశరావు, విశ్రాంత అధ్యాపకులు -
కార్పొ‘రేటు’ మోత
ఏలూరు సిటీ :బడిగంటలు మోగటంతో విద్యార్థుల తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల పట్టీ చూస్తే గుండెలు గుభేల్మంటున్నాయి. ఏటా ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు పెంచుతూ పోవటంతో జేబులు ఖాళీ అవుతున్నాయి. విద్యా ఖర్చు మోతెక్కిపోతోంది. ఒక్క జూన్ నెలలోనే జిల్లాలో పిల్లల కోసం తల్లిదండ్రులు చేసే విద్యా ఖర్చు సుమారురూ.500 కోట్లు ఉం టుందని విద్యా నిపుణుల అంచనా. ఫీజులతోపాటు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, బుక్స్ బ్యాగ్, క్యారేజీ బ్యాగ్, బూట్లు, యూనిఫామ్, బస్సు రవాణాకు చెల్లించాల్సిన సొమ్ము అదనం. ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల క్రమబద్ధీకరణకు గతంలో ఓ కమిటీని నియమిస్తామని ప్రభుత్వం చెప్పినా ఆచరణలోకి రాలేదు. సర్కారు బడులు పిల్లల తల్లిదండ్రులను ఆర్షించలేకపోవటంతో సామాన్యులు సైతం ప్రైవేటు స్కూళ్లవైపే మొగ్గుచూపుతున్నారు. ఫీజులతో బాదేస్తున్నారు మారిన సామాజిక పరిస్థితుల్లో అప్పు చేసైనా తమ పిల్లలకు మంచి విద్య అందించాలని తల్లిదండ్రులు తపన పడుతున్నారు. దీనిని ఆసరా చేసుకుని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు భారీగా ఫీజులు పెంచేశాయి. ఒకప్పుడు ఎల్కేజీ, యూకేజీలకు ఏడాదికి రూ.3 వేలు ఫీజు ఉంటే ప్రస్తుతం రూ.12 వేలకు పైగా గుంజుతున్నారు. టెక్నో, ఇ-టెక్నో, ఐఐటీ ఫౌండేషన్ కోర్సులకు కూడా కలిపి ఫీజులు చెబితే కళ్లు తిరగాల్సిందే. ప్రాథమిక విద్యకే సాధారణంగా ఒక్కో విద్యార్థికి ఏటా సుమారు రూ.25 వేలు వెచ్చించాల్సి వస్తోంది. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో 2.30 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ప్రాథమిక స్థాయి విద్యార్థులు 56వేల 223 మంది, ప్రాథమికోన్నత స్థాయి విద్యార్థులు 80,822 మంది, హైస్కూల్ స్థాయి విద్యార్థులు 90వేల 520 మంది ఉన్నట్టు విద్యాశాఖ రికార్డులు చెబుతున్నాయి. ఒక్కో విద్యార్థి ఖర్చు సగటున రూ.25వేలు అనుకుంటే జిల్లాలో విద్యా ఖర్చు రూ.500 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్లో అయితే ప్రవేశ పరీక్ష నిర్వహించి పిల్లాడు చదువులో వెనుకబడి ఉన్నాడని, మంచి శిక్షణ ఇవ్వాలంటే అదనపు ఫీజులు చెల్లించాలంటూ గుంజుతున్నారు. -
కార్పొరేట్ పాఠశాలల్లో ఫర్నిచర్ ధ్వంసం
గుంతకల్: కార్పొరేట్ పాఠశాలల్లో అక్రమంగా పెద్ద ఎత్తున డొనేషన్లు వసూలు చేస్తున్నారంటూ ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు అనంతపురం జిల్లాలోని గుంతకల్ పట్టణంలో శుక్రవారం ఆందోళనకు దిగారు. పుస్తకాలను అధిక ధరలకు విద్యార్థులకు విక్రయిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రెండు కార్పొరేట్ పాఠశాలల్లోకి విద్యార్థి నాయకులు చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
గుర్తింపు లేని పాఠశాలల మూసివేత
ఏలూరు సిటీ : జిల్లాలో ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తోన్న ప్రైవేట్ పాఠశాలలను మూసివేస్తామని జిల్లా విద్యాధికారి డి.మధుసూదనరావు హెచ్చరించారు. జిల్లాలో విద్యాధికారులు గుర్తించిన విధంగా 10 ప్రైవేట్ పాఠశాలలకు అనుమతులు లేవన్నారు. ప్రభుత్వ అనుమతులు పొందేందుకు రెండు నెలల గడువు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదని, ఈ పాఠశాలలపై విద్యా చట్టం మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గుర్తింపు లేని స్కూల్స్ ఇవే భీమడోలు మండలం పోతునూరులోని శ్రీ విద్యాలయం ఇంగ్లిష్ మీడియం స్కూల్, దెందులూరు మండలం సత్రంపాడులోని అరవింద విద్యా నికేతన్ ఇంగ్లిష్ మీడియం స్కూల్, ఏలూరు రూరల్ సత్రంపాడులోని అరవింద కాన్వెంట్, కృష్ణవేణి స్కూల్, నరసాపురంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్, పెరవలి వీఎం రంగా పబ్లిక్ స్కూల్, తణుకులోని సాయిజ్యోతి కాన్వెంట్, శ్రీ వెంకటేశ్వర విద్యానికేతన్, ప్రగతి విద్యానికేతన్, తాడేపల్లిగూడెంలోని సెయింట్ థెరిస్సా ఇంగ్లిష్ మీడియం స్కూల్స్కు ప్రభుత్వ అనుమతులు లేవు. 15 వరకు పాఠశాలలు తెరిస్తే చర్యలు ఈ నెల 15 వరకు ప్రభుత్వ నిబంధనల మేరకు సెలవులుగా ప్రకటించామని, నిబంధనలు పాటించకుండా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని డీఈవో హెచ్చరించారు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు తరగతులు నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉందని, అలా ఏవైనా ఉంటే వాటిని మూసివేయించాలని మండల విద్యాధికారులను ఆదేశించారు. -
సరస్వతీ బిడ్డలం చదువు‘కొనలేం’..
వేలూ లక్షలు ఖర్చు పెట్టి కార్పొరేట్ స్కూళ్లలో ఖరీదుగా చదువు‘కొన’లేదు. మాసిపోయిన బెంచీలూ మసిబారిన గోడల నీడలో తప్ప. అడగకుండానే అన్నీ సమకూర్చే డాడీ, అడుగుకో ఆనందం కొనుక్కొచ్చే మమ్మీ అంటే తెలియదు. కాయకష్టంతో దోస్తీ చేసే అమ్మానాన్నలు తప్ప. అయినా ఈ చిన్నారులు చిన్నబోలేదు. చింత పడలేదు. పేదరికాన్ని మోస్తూనే ఉన్నారు. సరస్వతీ కటాక్షాన్ని సాధిస్తూనే ఉన్నారు. చెమట చిందిస్తూనే ఉన్నారు. చదువులో విజయాలు లిఖిస్తూనే ఉన్నారు. కాసింత ఆసరా దొరికితే... కాసింత ధైర్యం అందితే... ఈ పేదింటి రత్నాలు ఎన్నెన్ని కాంతులు విరజిమ్ముతాయో... మరెన్ని వెలుగులు ప్రసరిస్తాయో... విధి ‘రాత’ను మారుద్దామా? వీరి ‘రాత’కు తోడవుదామా? ఈ విద్యాకుసుమాలకు బాసటగా నిలవాలన్నా.. ఆర్థికంగా ఆదుకోవాలన్నా 9705347881, 9010234568 నెంబర్లలో సంప్రదించండి. స్పందించే హృదయం కోసం ఎదురుచూపులు పేదింట విద్యా కుసుమాలు విరబూశాయి. చదువుల తోటలో మార్కుల పంట పండిస్తున్నాయి. కూలి చేస్తేనే పూట గడిచే కుటుంబాలైనా.. చదువులో రాణిస్తున్నారు. ఆర్థిక సమస్యలు వెనక్కి లాగుతున్నా.. ఏమాత్రం నిరుత్సాహపడలేదు. సర్కారు బడులలో చదివినా... కార్పొరేట్ విద్యార్థులకు దీటుగా మార్కులు సాధించి... ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా విడుదలైన పదో తరగ తి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించి ఆదర్శంగా నిలిచారు. ఆర్థికంగా ఎవరైనా చేయూతనిస్తే... ఉన్నత చదువులు అభ్యసించి లక్ష్యాన్ని అందుకుంటామని చెబుతున్నారు. జీవితంలో నిలదొక్కుకున్నాక తమలాంటి పేద బిడ్డలకు బాసటగా నిలుస్తామని హామీ ఇస్తున్నారు. ఇస్త్రీ చేస్తూనే.. ముషీరాబాద్ : ప్రతిభకు పేదరికం అడ్డు కాదని నిరూపించింది రామ్నగర్కు చెందిన శ్రుతి. ఈ బాలిక టెన్త్లో 9.3 పాయింట్స్ సాధించింది. ఆంధ్ర మహిళా సభ బాలికల పాఠశాలలో పదో తరగతి చదివి...9.3 మార్కులతో పాఠశాల టాపర్గా నిలిచింది. రాంనగర్లోని గిరిశిఖర అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పని చేస్తున్న యాదగిరి, లక్ష్మీల రెండో సంతానం శ్రుతి. వీరిది వరంగల్ జిల్లా మద్దూర్ మండలం డెక్కల్. నాలుగేళ్ల క్రితం పిల్లల చదువు, బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి అపార్ట్మెంట్లో వాచ్మెన్గా బతుకు వెళ్లదీస్తున్నారు. శ్రుతి అక్క ఇంటర్ రెండో సంవత్సరం చదువుతుండగా, తమ్ముడు ఏడో తరగతి. వీరి ముగ్గురు స్కూల్ ఫీజులు, పుస్తకాలు, డ్రెస్లకే యాదగిరి కుటుంబం ఏటా దాదాపు రూ.లక్ష ఖర్చు చేస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో ప్రభుత్వ పాఠశాలలో తన విద్యాబ్యాసాన్ని కొనసాగించిందీ బాలిక. తల్లి అదే అపార్ట్మెంట్లో ఇస్త్రీ చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తోంది. సెలవుల్లో, తీరిక సమయంలో శ్రుతి కూడా అమ్మకు సాయపడుతూ ఉంటుంది. బాసర త్రిబుల్ ఐటీలో సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. పాలిటెక్నిక్ పరీక్ష కూడా రాస్తోంది. దాతలు సహకరిస్తే ఉన్నత చదువులు చదువుతానని చెబుతోంది. అమ్మకు సహాయంగా... గచ్చిబౌలి: శేరిలింగంపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో మొదటి స్థానంలో నిలిచింది నలందేశ్వరి. శ్రీకాకుళం జిల్లా వంగర మండలం కొత్తపేటకు చెందిన బురిడి శివనాయుడు, దమయంతి దంపతులు తమ ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకును తీసుకొని కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు.శేరిలింగంపల్లిలోని పాపిరెడ్డినగర్ కాలనీలో ఉంటున్నారు. శివనాయుడు వాచ్మెన్. దమయంతి రోడ్డు పక్కన డబ్బాలో కిరాణా సామాను అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. వీరి రెండోకూతురు నలందేశ్వరి 7 నుంచి పదోతరగతి వరకు స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో చదివింది. పదో తరగతిలో 9.8 శాతం మార్కులు సాధించింది. పాఠశాల ముగిసిన తరువాత నిత్యం మియాపూర్లోని పోతుకూచి సోమసుందర సోషల్ వెల్ఫేర్ అండ్ చారిటబుల్ ట్రస్టుకు వెళ్లి చదువుకునేది. ఇంజినీరింగ్ చేసి... కలెక్టర్ కావాలన్నదే తన లక్ష్యమని నలందేశ్వరి చెబుతోంది. సెలవుల్లో ఇంటి వద్ద ఉన్నప్పుడు కిరాణా డబ్బాలో ఉండి అమ్మకు సాయం చేసేదాన్నని చెప్పింది. ఉపాధ్యాయులు..పోతుకూచి సోమసుందర సోషల్ వెల్ఫేర్ అండ్ చారిటబుల్ ట్రస్టు సహకారం మరిచిపోలేనిదని తెలిపింది. సాయం చేస్తే...రాణిస్తా.. సికింద్రాబాద్: నిరుపేద కుటుంబంలో పుట్టి... ప్రభుత్వ పాఠశాలలో చదివి... పదో తరగతిలో 9.3 మార్కులు సాధించి కళాశాల విద్యను అభ్యసించడానికి ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది శాంతినగర్లోని శేషాపహడ్ మురికివాడకు చెందిన ఆర్.సుప్రజ. వరంగల్ జిల్లా నుంచి ఉపాధి కోసం నగరానికి వచ్చిన ఆర్.యేషోబు ఆటోడ్రైవర్. ఆయన భార్య రజిత ఇళ్లలో పనులు చేసుకుంటూ బతుకు బండిని లాగిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. వీరి పెద్దకుమార్తె ఆర్.సుప్రజ సమీపంలోని లాలాపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుకుంది. ఇటీవల వెల్లడించిన ఫలితాల్లో 9.3 మార్కులు సాధించింది. తల్లికి తోడుగా ఇళ్లలో పనులకు వెళుతూనే అత్యధిక మార్కులు సాధించింది సుప్రజ. తన తల్లిదండ్రుల ఆదాయం అంతంత మాత్రమేనని. తాను బాగా చదువుకుని మంచి ప్రభుత్వ ఉద్యోగం చేయాలన్న సంకల్పంతోనే 9.3 మార్కులు తెచ్చుకున్నానని తెలిపింది. తనను ఆదుకుని మంచి కళాశాలలో చదివించేవారు ఉంటే ఇంటర్లో సైతం మంచి మార్కులు సాధించి రికార్డు నెలకొల్పాలని ఉందని తెలిపింది. బాగా చదువుకుని టీచర్ ఉద్యోగం చేయాలన్నది తన ఆకాంక్ష గా సుప్రజ పేర్కొంది. నాన్న కల నెరవేరుస్తా... మూసాపేట: మూసాపేటకు చెందిన ఎమ్డీ వాజిద్ సనత్ నగర్లోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నారు. భార్య షాహిన్ గృహిణి. నెలకు రూ.8 వేల జీతంతో ఐదుగురు పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. అద్దె గదిలో నివాసం ఉంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. పంచశీల స్కూల్లో చదివిన చిన్న కుమార్తె ముస్కాన్ ఫాతిమా 9.8 మార్కులతో పాఠశాలటాపర్గా నిలిచింది. ‘నాన్న పదో తరగతి వరకే చదువుకున్నారు. ఇంట్లో ఒక డాక్టర్ ఉండాలన్న నాన్న కలను నిజం చేయడమే నా లక్ష్యం. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మంచి మార్కులు సాధించా’నని సంతోషం వ్యక్తం చేస్తోందీ బాలిక. అమ్మ కష్టమే ఆసరాగా... మెహిదీపట్నం: అటు తల్లి.. ఇటు గురువుల అంచనాలను అందుకుంటూ ప్రభుత్వ పాఠశాలలో చదివి... ఇంగ్లీషు మీడియంలో పదో తరగతిలో 9.8 జీపీఏ తెచ్చుకున్నాడు తాళ్లగడ్డకు చెందిన సాయి ఫణీంద్ర కుమార్. ఆది నుంచీ ప్రణాళికాబద్ధంగా చదువుతూ ఉత్తమ ఫలితాలు సాధించాడు. ఫణీంద్ర 11 ఏళ్ల వయసులోనే తండ్రి శంకర్ మరణించాడు.తల్లి దుర్గ సంరక్షణలో క్రమశిక్షణతో పెరిగాడు. మూడో తరగతి నుంచి కార్వాన్ కుల్సుంపూర ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ వచ్చాడు. ‘అమ్మ ఇళ్లలో పనులు చేస్తూ... ఏ లోటూ రాకుండా చూసుకొని చదివించింది. పాఠశాలలో ఉపాధ్యాయులు ‘నీకు మంచి ర్యాంక్ వస్తుందని... చదవాలని’ ప్రోత్సహించారు. నేను 9 జీపీఏ అంచనా వేశా. నాకు 9.8 రావడం పట్ల అమ్మతో పాటు గురువులంతా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో సివిల్ ఇంజినీర్ కావడమే నా కల’ అంటున్నాడీ బాలుడు. ఐఏఎస్ లక్ష్యం... కాటేదాన్: నిజామాబాద్ ప్రాంతానికి చెందిన దిలీప్ కుటుంబంతో కలసి నగరానికి వ లస వచ్చాడు. స్థానికంగా ఓ బ్యాటరీ ఫ్యాక్టరీలో డ్రైవర్గా పని చేస్తూ... అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆయనకు ఓ కూతురు, కుమారుడు సంతానం. కుమార్తె ప్రియాంక మైలార్దేవ్పల్లి ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివి.. 9 జీపీఏ సాధించింది. రాజేంద్రనగర్ మండలంలోనే టాపర్గా నిలిచింది. మంచి ఫలితాలు సాధించిన తమ కుమార్తెను ఉన్నత చదువులు చదివించేందుకు ప్రోత్సహిస్తానని తండ్రి దిలీప్ పేర్కొన్నాడు. కలెక్టర్ కావాలనేది తన లక్ష్యమని ప్రియాంక వివరించింది. చెరుకు బండే.. బతుకు బండీ రాయదుర్గం: చెరుకుబండి నడిస్తేనే వారి బతుకుబండి సాగుతుంది. వచ్చిన కొద్దిపాటి మొత్తంతో తన కూతురును చదివించి ఉత్తమ ఫలితాల సాధనకు ఆ తల్లిదండ్రులు కృషి చేశారు చిలుకూరు సమీపంలోని మేడిపల్లికి చెందిన నర్సింగరావు, విజయలక్ష్మి దంపతులు. తమ ముగ్గురు ఆడపిల్లలతో 13 ఏళ్ల క్రితం రాయదుర్గానికి వలస వచ్చారు. స్థానికంగా సీజన్లో చెరుకుబండి నడపడం, ఆ తర్వాత కూలీ పనులు చేస్తూ ఆ తల్లిదండ్రులు తమ బిడ్డలను చదివిస్తున్నారు. వీరి రెండో కూతురు సాయి ప్రసన్న పదో తరగతిలో 9.3 జీపీఏ సాధించింది. పేదింటి నుంచి వచ్చినా కష్టపడి చదివి ఆమె మంచి మార్కులు సాధించిందని స్థానిక నాగార్జున ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ భరత్ కుమార్ తెలిపారు. ముగ్గురు పిల్లలు నాగార్జున ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నారని, కరస్పాండెంట్ భరత్ కుమార్ పిల్లల ీఫీజుల విషయంలో అండగా నిలిచారని ఆ తల్లిదండ్రులు తెలిపారు. ఇంజినీర్ను కావాలన్నదే తన లక్ష్యమని సాయిప్రసన్న తెలిపింది. పాలు అమ్ముతూనే... కుత్బుల్లాపూర్ మండలం ప్రగతి నగర్లో వాచ్మెన్గా పనిచేసే శ్రీనివాస్, ఉదయ్లక్షి్ష్మల కుమారుడు నాగసతీష్. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివి... 9 జీపీఏ సాధించాడు. ఉదయం 5 గంటల నుంచి ఇంటింటికి తిరిగి పాల ప్యాకెట్లు వేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటూనే చదువు కొనసాగించాడా కుర్రాడు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి...శ్రద్ధగా చదివి మంచి మార్కులు సాధించాడు. ఇదిలా ఉండగా...తన ఉన్నత చదువులకు ఆర్థిక సాయం చేసేందుకు సినీ నటి రజిత ముందుకువచ్చారని నాగసతీష్ తెలిపాడు. ఇంటర్లో మంచి మార్కులు సాధించి...ఇంజినీర్ కావాలన్నదే తన లక్ష్యమని చెప్పాడు. ఇంజినీర్నవుతా.. మూసాపేట: మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తికి చెందిన శ్రీనివాస్గౌడ్, అంజమ్మ దంపతులు పదేళ్ల క్రితం హైదరాబాద్కు వలస వచ్చారు. కూకట్పల్లి ఆర్టీసి డిపో ఎదురుగా ఇండ్లీ బండి నడిపిస్తుంటారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. మూసాపేట డివిజన్ ప్రగతినగర్లోని శ్రీసాయి విద్యానికేతన్ స్కూల్లో చదివిన స్వప్న పదో తరగతిలో 9.5 పాయింట్స్ సాధించింది. ఈ దంపతుల ఇద్దరు కుమార్తెలు బీటెక్, డిప్లమో చదివిస్తున్నాడు. స్కూల్ టాపర్గా నిలిచిన చిన్న కుమార్తె స్వప్న ఇంజినీర్ను అవుతానని...తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకుంటానని చెబుతోందీ బాలిక. ఎంత కష్టం వచ్చినా ముగ్గురు కుమార్తెలను మంచిగా చదివిస్తానని, తను పడుతున్న కష్టం కూతుళ్లు పడకూడదని శ్రీనివాస్గౌడ్ అంటున్నారు. డాక్టర్ కావాలనుంది.. మలక్పేట: మలక్పేట్ సలీం నగర్లోని గురుకుల పాఠశాల విద్యార్థిని దావల యామిని పదో తరగతిలో 9 జీపీఏ సాధించింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దావల దుర్గారావు, సీతామహాలక్ష్మి దంపతులు జీవనోపాధి కోసం పదేళ్ల క్రితం నగరానికి వలస వచ్చారు. మన్సూరాబాద్లోని సాయినగర్ గుడిసెల్లో నివాసం ఉంటున్నారు. దుర్గారావు ప్లంబర్గా... సీతామహాలక్ష్మి గురుకుల పాఠశాలలో క్యాజువల్ లేబర్గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇంటి పనుల్లో తల్లికి తోడుగా ఉంటూనే చదువులో మంచి ప్రతిభ కనబరిచిందీ విద్యార్థిని. ఈ సందర్భంగా యామిని మాట్లాడుతూ.. మెడిసిన్ చదువుకుని... పేదలకు సేవచేసి ఉత్తమ డాక్టర్గా పేరు తెచ్చుకుంటానని తెలిపింది. మంచి మార్కులు సాధించేలా ప్రోత్సహించినతల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు రుణపడి ఉంటానని తెలిపింది. అమ్మ కష్టం వృథా కానివ్వను జగద్గిరిగుట్ట: జగద్గిరిగుట్ట శ్రీనివాస్నగర్లో ఉండే రజిత కుమార్తె ఉమ జగద్గిరిగుట్టలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివింది. పబ్లిక్ పరీక్షల్లో 9 జీపీఏ సాధించింది. ఉమ తండ్రి చిన్నప్పుడే మరణించడంతో తల్లి రజిత బిడ్డను కష్టపడి చదివించింది. వ చ్చిన అరకొర జీతంలో కుటుంబాన్ని పోషిస్తూ.. కొడుకు, కూతురును చదివిస్తోంది. తమ కూతురు చదువుకు ఎవరైనా దాతలు సహ కరించాలని రజిత కోరుతోంది. ఇంజినీర్ను కావడమే తన ధ్యేయమని.. తన తల్లి పడిన కష్టానికి ప్రతిఫలంగా... బాగా చదివి... సమాజానికి సేవ చేయాలని ఉందని ఉమ చెబుతోంది. -
బొమ్మలతో పాఠాలు
లెక్కకు మించి పుస్తకాలు... వాటితో కుస్తీలు... పట్టుపట్టి బట్టీ పట్టించే కార్పొరేట్ స్కూళ్లతో పిల్లల చదువు యాంత్రికమవుతోంది. విద్యపై ఆసక్తి పోయి... మార్కుల కోసం చదువుకోవడమే సరిపోతోంది. ఇది చిన్నారులపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందంటారు డాక్టర్ మధులిక. చదువంటే వారికి అర్థమయ్యేలా చెప్పడమేనంటారు. బోధనా పద్ధతుల్లో పీహెచ్డీ చేసిన మధులిక... పెయింటింగ్స్ ద్వారా టీచింగ్ చేస్తున్నారు. వీక్గా ఉన్న సబ్జెక్టుల్లో ఈ తరహా శిక్షణ ఇచ్చి వారిని బెస్ట్ స్టూడెంట్స్గా తీర్చిదిద్దుతున్న ఆమె ‘సిటీ ప్లస్’తో తన అనుభవాలు పంచుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే చాలామంది విద్యార్థులకు పన్నెండేళ్లకు కూడా ఏబీసీడీలు రావడం లేదు. వారికి ఇంగ్లిష్ భూతంలా కనిపిస్తుంది. అలాంటి వారికి ఏ పద్ధతిలో చెబితో అర్థమవుతుందనేది చాలా రోజులు ఆలోచించా. అధ్యయనం చేశా. చివరకు ఇలా పెయింటింగ్తో టీచింగ్ విధానాన్ని ఎంచుకున్నా. అథ్య అనే యన్జీవో స్థాపించి.. దాని ద్వారా ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ తరహా శిక్షణ ఇస్తున్నా. ఎవరెవరు ఏ సబ్జెక్టుల్లో బలహీనమో తెలుసుకొని... అందులో వారిని నిష్ణాతులను చేయడమే నా లక్ష్యం. స్కూల్లో ఏడేళ్లు చదివితే గానీ రాని ఇంగ్లిష్ను పెయింటింగ్స్ ద్వారా ఒక్క ఏడాదిలో నేర్పిస్తున్నాం. అలా నేర్చుకున్న విద్యార్థులు జనవరిలో గోవాలో జరిగే స్టోరీ ఆఫ్ లైట్ ప్రోగ్రామ్లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా వంద మంది శాస్త్రవేత్తలు పాల్గొంటారు. పదిహేను రకాలు... విద్యార్థులకు సులువుగా బోధించడం కోసమే 15 రకాల ఆర్ట్లు నేర్చుకున్నా. పెయింటింగ్స్ ద్వారా ఏ పాఠ్యాంశమైనా పిల్లలకు తేలికగా నేర్పించవచ్చని తెలుసుకున్నాను. ముఖ్యంగా ఇంగ్లిష్, సైన్స్, మ్యాథ్స్ వంటి సబ్జెక్టులకు ఈ తరహా బోధన బాగా ఉపయోగపడుతుంది. ఏటా 25 వేల మంది విద్యార్థులను మా అథ్య ద్వారా నిష్ణాతులుగా మార్చడానికి కృషి చేస్తున్నాం. ఇందు కోసం పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. అన్నింటి కంటే ముఖ్యంగా విద్యార్థులు ఎంతో ఆసక్తిగా, ఉత్సాహంగా పాఠాలు వింటున్నారు. ప్రస్తుతం కార్పొరేట్ స్కూళ్ల విద్యార్థులు విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారు. పాఠ్యాంశాలు చెప్పే విధానంలో మార్పు లేకపోవడంతో అయోమయంలో పడుతున్నారు. చెప్పింది అర్థంకాక బట్టీ విధానాన్ని అనుసరిస్తున్నారు. తీరా పరీక్షల సమయంలో గుర్తకురాక ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో నా వంతు కృషిగా... పెయింటింగ్స్ ద్వారా బోధిస్తున్నా. చిన్నారుల కేరింతలతో మాదాపూర్ హోటల్ నోవాటెల్ దద్దరిల్లింది. శనివారం ఇక్కడ నిర్వహించిన ‘కిడ్స్ కార్నివాల్’ విశేషంగా ఆకట్టుకుంది. ఫేస్ పెయింటింగ్, జంపింగ్, రన్నింగ్ తదితర అంశాల్లో బుడతలు ఉత్సాహంగా పోటీపడ్డారు. ఎవరికెవరూ తీసిపోనంతగా టాలెంట్ చూపి అదరగొట్టారు. చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా రకరకాల ఆటల్లో పార్టిసిపేట్ చేసి ఉల్లాసంగా గడిపారు. మాదాపూర్ -
మైండ్ గేమ్
గంపెడు పుస్తకాలు.. ఊపిరి సలపని క్లాసులు.. ఇంటికొస్తే అసైన్మెంట్ల పాట్లు.. కార్పొరేట్ స్కూళ్లు పెరిగిపోయాక విద్యార్థి దశ ఓ యాంత్రిక జీవనమైపోతోంది. ఇక మానసిక ఉల్లాసాన్నిచ్చి.. ఫిజికల్గా వ్యాయామాన్ని అందించే అవుట్డోర్ గేమ్స్కు తీరిక ఎక్కడుంటుంది! ఆపై చేతిలో మొబైల్స్, ట్యాబ్లు వచ్చి పడటంతో ఖాళీ దొరికితే వీడియో గేమ్లకే పరిమితమైపోతున్నారు చిన్నారులు. సొంతగా ఆలోచించి.. మెదడుకు పదును పెట్టే వెసులుబాటే ఉండటం లేదు వారికి. ఈ పరిణామాలను గమనించి.. పిల్లల్లో జనరల్ నాలెడ్జ్, ఆలోచనా శక్తిని పెంచేందుకు కృషి చేస్తున్నాయి నగరంలోని క్విజ్ క్లబ్లు. వాటిల్లో ‘కె-సర్కిల్, హైదరాబాద్ క్విజ్ క్లబ్’లు ముందున్నాయి. కాలేజీ విద్యార్థులూ వీటిల్లో భాగస్వాములవుతున్నారు. ‘కె’ అంటే నాలెడ్జ్. నాలెడ్జ్ కోసం తాపత్రయపడే కొంతమంది కలసి ఏర్పాటు చేసిందే కె-సర్కిల్ క్లబ్. ఈ క్లబ్ 42 ఏళ్లుగా వందల సంఖ్యలో క్విజ్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ క్లబ్ ఆరంభమైన నాటి నుంచి నగరంలో రెగ్యులర్గా వివిధ రకాల క్విజ్ యాక్టివిటీస్ నిర్వహిస్తోంది. కోటు వేసుకుని, గంభీరంగా ప్రశ్నలడిగే క్విజ్ మాస్టర్స్ ఇక్కడ కనిపించరు. బోర్డు మీద మార్కులతో ఉత్కంఠ కలిగించే వాతవరణమూ ఉండదు. కానీ అందరిలో క్విజ్ అంటే ఆసక్తి మాత్రం కామన్. ఔత్సాహికులెవరైనా ఈ క్విజ్ల్లో పాల్గొనవచ్చు. ఈ క్లబ్లో చేరవచ్చు. ఇందుకు ఎటువంటి ఎంట్రీ ఫామ్లు, రుసుములు అక్కర్లేదు. వారం వారం... ప్రతి శనివారం ఈ క్లబ్ ఆధ్వర్యంలో క్విజ్ కార్యక్రమాలు జరుగుతుంటాయి. సికింద్రాబాద్ వైఎంసీఏతో పాటు బంజారాహిల్స్ గోథెజెంత్రమ్, లామకాన్ వేదికలుగా వారాంతపు క్విజ్లు నిర్వహిస్తుంటారు. ఇవే కాకుండా ప్రతి నెలా క్విజ్ ఆఫ్ ది మంత్, అరే భాయ్ అనే స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేస్తారు. క్విజ్ ఆఫ్ ది మంత్ విన్నర్కు బహుమతులు అందచేస్తారు. అలాగే ‘అరే భాయ్’ క్విజ్ విజేతలకు ప్రతి నెలా వచ్చే పాయింట్స్ ఆధారంగా యాన్యువల్ విజేతకు స్పెషల్ ట్రోఫీ అందచేస్తారు. ఉన్నత తరగతి పిల్లలకు స్కూల్ క్విజ్లు, కాలేజ్ పిల్లలకు ఓపెన్ క్విజ్లు రెగ్యులర్గా నిర్వహిస్తున్నారు. ఏటా ఈ క్లబ్ నిర్వహించే ఓపెన్ క్విజ్లో వయోపరిమితి లేకుండా స్కూల్ పిల్లల నుంచి రిటైర్డ్ ఎంప్లాయీస్ వరకూ పాల్గొంటారు. ఇక రెగ్యులర్గా వీరు నిర్వహించే క్విజ్లలో స్కూల్ పిల్లలు మొదలు, ఐఐటీ విద్యార్థులు, సైంటిస్టులు, ఫైనాన్స్, టీచింగ్, సైన్స్, సినిమా, ఐటీ రంగాలకు చెందిన నిపుణులు కూడా పాల్గొంటుంటారు. ఈ క్విజ్లలో పార్టిసిపేట్ చేయటమే కాదు, క్విజ్ మాస్టర్గా కూడా వ్యవహరించడం చాలా తేలిక. కె-సర్కిల్ వెబ్సైట్లో క్విజ్ కార్యక్రమ తేదీలుంటాయి. ఆ పట్టికలో వివరాలు చేర్చితే సరిపోతుందంటారు ఈ క్లబ్ సభ్యులు అనుపమ్. హైదరాబాద్ క్విజ్ క్లబ్ ఎలక్ట్రానిక్ మీడియా ఎఫెక్టుతో పిల్లలు పుస్తకాలు చదవటం, చదివిన జ్ఞానాన్ని పంచుకోవటం, ఇంటరాక్షన్ ద్వారా వివిధ విషయాలు తెలుసుకోవటం లాంటి ప్రక్రియ పూర్తిగా తగ్గిపోయింది. ఇందుకు తగిన వాతావరణాన్ని కలిగించడానికి హైదరాబాద్ క్విజ్ క్లబ్ను ఏర్పాటు చేశారు శంకర్, నితి. ఈ క్లబ్ ఏర్పాటు చేసి ప్రతి నెలా వివిధ అంశాలపై క్విజ్లు నిర్వహిస్తున్నారు. ‘1900 నుంచి వరకు ప్రముఖులు, రాజకీయ పార్టీలు, నాయకులు, క్రీడలు.. ఇలా ఒక్కో అంశంపై క్విజ్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా పిల్లలు, పెద్దలు కలసి నాలెడ్జ్ షేర్ చేసుకునే అవకాశం కల్పించాలి. అదే ఆలోచనతో ముందుకు వెళుతున్నాం. అందులో ఫన్ కూడా ఉంటుంది. యాక్టివిటీస్కు ప్రవేశం ఉచితం’ అని శంకర్ చెప్పారు. -
పేదలకు విద్య... ‘క్లస్ట’తరమే!
రాజ్యాంగం హామీ ఇచ్చిన నిర్బందోచిత ప్రాథమిక విద్యకు తిలోదకాలిచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఏటా ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు పోటీలో దూసుకుపోతుంటే నోళ్లు వెళ్లబెడుతున్న సర్కారీ బడులు ప్రస్తుతం మనుగడనే కోల్పోయే దుస్థితి దాపురించింది. పాఠశాలల నిర్వహణ చేతకాక చేతులెత్తేసిన ప్రభుత్వం క్లస్టర్ స్కూళ్లంటూ పిల్లల జీవితాలతో మరో ప్రయోగం చేసి విద్యను పేదలకు అందనంత ఎత్తుకు తీసుకుపోయేందుకు సమాయత్తమవుతోంది. ఏలూరు సిటీ : ప్రాథమిక విద్యారంగం భారం మోయలేకపోతున్న ప్రభుత్వం దాన్ని వదిలించుకొనేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఏటా బడ్జెట్లో రూ. వేలకోట్లు కుమ్మరిస్తోన్నా ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయడంలో విఫలమౌతోన్న సర్కారు క్లస్టరు స్కూళ్లను ఏర్పాటు చేసి ఈ సమస్య నుంచి బయటపడాలని చూస్తోంది. సంక్షేమ వసతిగృహాలు, పాఠశాలల నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో ఈ రెండింటినీ ఒకేచోట నిర్విహ ంచేలా ఈ కొత్త వ్యవస్థను తెరపైకి తెస్తోంది. జిల్లాలో 500 క్లస్టర్ పాఠశాలల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. దీంతో భారీసంఖ్యలో స్కూళ్లను తగ్గించనుంది. పెలైట్ ప్రాజెక్టుగా ద్వారకాతిరుమల మండలంలో ఈ విధానం అమలు చేశారు. ఇక్కడ సుమారు 40 పాఠశాలలు మూతపడే పరిస్థితి ఏర్పడగా, ఉపాధ్యాయులు ఖాళీగా మిగలనున్నారు. మండలానికి 10 క్లస్టర్ స్కూళ్లు సంక్షేమ వసతి గృహాల్లో అవినీతి, నిర్లక్ష్యాన్ని తొలగించడం, ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేయడంలో భాగంగా క్లస్టర్ పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే జిల్లాలో చాలా మండలాల్లోని పాఠశాలలు విద్యార్థులు లేకుండానే నడుస్తున్నాయి. అలాంటిచోట్ల ముగ్గురు, నలుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు సమీకృత విద్యాసంస్థలను నెలకొల్పాలని ప్రభుత్వం ప్రణాళిక రచించింది. దీనిలో భాగంగానే జిల్లాలో 500 క్లస్టర్ పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు. మండలానికి 10 వరకు క్లస్టర్ స్కూల్స్ ఉంటాయి. అంటే రెండు నుంచి నాలుగు గ్రామాలకు ఒక క్లస్టర్ పాఠశాల ఉంటుంది. రెసిడెన్షియల్ తరహాలో ఏర్పా టు చేసే ఈ పాఠశాలల్లో బోధనతోపాటు భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. ఏఏ పాఠశాలల్లో విద్యార్థులు ఎంతమంది ఉన్నా రు? టీచర్లు ఎంతమంది పనిచేస్తున్నారు? అనే విషయాలపై విద్యాశాఖ, రాజీవ్ విద్యామిషన్ అధికారులు నివేదిక తయారు చేశారు. పేద వర్గాలకు విద్య దూరం సమీకృత పాఠశాలల ఏర్పాటుతో ప్రతి గ్రామంలోనూ ప్రభుత్వ పాఠశాల ఉండే అవకాశాలు కనుమరుగవుతాయి. దీంతో పిల్లలను దూరంగా పంపలేక, ఇంట్లో ఉంచుకోలేక పేద తల్లిదండ్రులు ఇబ్బంది పడతారని విద్యారంగ నిపుణులు అంటున్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్లో ఫలితాలు బాగున్నంత మాత్రాన అన్ని స్కూళ్లను అలా మార్చేస్తే కొత్త ఇబ్బం దులు తలెత్తుతాయంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం 2,600 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ప్రతి మండలంలో సుమారు 30 నుంచి 60 వరకు ప్రాథమిక పాఠశాలలు నడుస్తున్నాయి. క్రమేపీ వాటి సంఖ్య తగ్గుతూ వస్తుండగా క్లస్టర్ విధానంతో వాటి మనుగడ ప్రమాదంలో పడింది. అలాగే జిల్లాలో ఉన్న 151 సంక్షేమ హాస్టల్స్ ఈ స్కూళ్ల ఏర్పాటుతో కనుమరుగుకానున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్కు వరం ప్రతి విద్యార్థికీ భోజన, వసతితో కూడిన చదువు అందించేందుకు ఏర్పాటు చేయనున్న ఈ తరహా పాఠశాలలతో ఉపయోగం ఉన్నా... పేద వర్గాలకు నష్టం కూడా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా మండలానికి 10 క్లస్టర్ స్కూల్స్ ఏర్పాటు చేస్తే పిల్లలంతా ఎలాగూ అక్కడకు రారు. దీంతో ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు వరంలా మారుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కార్పొరేట్ విద్యాసంస్థల దెబ్బకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు కుదేలయ్యాయి. ఇక ఈ విధానంతో కార్పొరేట్ గుత్తాధిపత్యంలోకి ప్రాథమిక విద్య వెళ్లిపోతుందనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. విద్యకు పేదలను దూరం చేసే పథకం ఈ విధానం ద్వారా భారీఎత్తున ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేసినట్టే. పాఠశాలలు మూసివేస్తే అక్క డ లక్షలాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన భవంతులు, ఇతర విద్యా సామగ్రి ఏం చేస్తారు. ఇది ప్రాథమిక విద్యకు పేదలను దూరం చేసే పథకం మాత్రమే. స్కూళ్లలో సరిపడినంత మంది ఉపాధ్యాయులను నియమించాలి. అప్పుడే నాణ్యమైన విద్య అందుబాటులో ఉంటుంది. - గగ్గులోతు కృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీటీఎఫ్ 1938 సార్వత్రిక విద్యకు విఘాతం 1986లో ప్రవేశపెట్టిన అందరికీ విద్య విధానానికి తీవ్ర విఘాతం కలుగుతుంది. ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించి భారం లేకుండా చేసుకొనేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచించింది. మండలాన్ని యూనిట్గా కాకుండా ఒక గ్రామంలోని రెండు, మూడు స్కూళ్లను విలీనం చేస్తే ఉపయోగం ఉంటుంది. కానీ ఇలా రెండు, మూడు గ్రామాలకు ఒక పాఠశాల ఏర్పాటు చేస్తే కష్టాలు తప్పవు. ఈ నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలి. - షేక్సాబ్జీ, రాష్ట్ర కార్యదర్శి, యూటీఎఫ్ కార్పొరేట్కు సహకారమే గ్రామాల్లో ప్రభుత్వ స్కూళ్లు మూసివేయడం ద్వారా కార్పొరేట్ విద్యాసంస్థలకు పరోక్షంగా ప్రభుత్వమే సహకారం అంది స్తోంది. బస్పాస్లు అందించినంత మాత్రాన చిన్నారులు ఇతర గ్రామాలకు ఎలా వెళ్లగలరు? ప్రభుత్వం తమ బాధ్యత నుంచి తప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. క్లస్టర్ విధానం వల్ల డ్రాపవుట్స్ భారీగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. - పి.వెంకటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, పీఆర్టీయూ -
విలీనం తప్పదా!
- ప్రమాదంలో పాఠశాలల మనుగడ - విద్యార్థులు లేకపోవటమే కారణం - 272 ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 20 లోపే - 20 ఎయిడెడ్ పాఠశాలలదీ అదే పరిస్థితి ఏలూరు సిటీ : ప్రయివేట్, కార్పొరేట్ పాఠశాలలు దినదినాభివృద్ధి చెందుతుంటే సర్కారీ బడుల్లో రోజురోజుకూ విద్యార్థుల సంఖ్య పడిపోతోంది. కార్పొరేట్ స్కూల్స్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తామంటూ పాలకులు బీరాలు పలుకుతూనే ఉన్నారు. కనీస సౌకర్యాలులేక ప్రభుత్వ పాఠశాలలు తల్లిదండ్రుల మన్ననలు పొందలేకపోతున్నాయి. ప్రభుత్వం విద్యారంగంపై ఎన్నో నిధులు వెచ్చిస్తున్నా ఫలితం ఉండటం లేదనే విమర్శలు ఉన్నాయి. 20 మంది పిల్లలు కూడా లేని ప్రాథమిక పాఠశాలలు జిల్లాలో 272 ఉన్నాయి. భవిష్యత్తులో ఈ పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందనే సంకేతాలు వస్తున్నాయి. ఉన్నత పాఠశాలల స్థితి ఆశాజనకంగా ఉన్నా ప్రాథమిక పాఠశాలలు ఉసూరుమంటున్నాయి. నిపుణులైన బోధనా సిబ్బంది ఉన్నా విద్యార్థులు, తల్లిదండ్రులను ఆకట్టుకోలేక దిగాలుపడున్నాయి. ఎయిడెడ్ స్కూల్స్కూ ప్రమాద ఘంటికలు జిల్లాలోని పలు ఎయిడెడ్ పాఠశాలలకూ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కనీస సంఖ్యలో విద్యార్థులు లేకుండానే పాఠశాలలు నడుపుతున్నారు. జిల్లాలో సుమారు 20 ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలల్లో 20మంది పల్లలు కూడా లేకుండా నీరసించిపోతున్నాయి. చింతలపూడి, లింగపాలెం, ఉంగుటూరు, పెదపాడు, ఏలూరు రూరల్, ఉండి, ఆకివీడు, కాళ్ళ, భీమవరం ప్రాంతాల్లోని ఎయిడెడ్ స్కూల్స్ కొన్నింటిలో పిల్లలు లేరని విద్యాశాఖ నివేదికలో వెల్లడైంది. ఇప్పటికే ఎయిడెడ్ స్కూల్స్లో టీచర్ పోస్టుల భర్తీపై నిషేధం ఉండడంతో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. టీచర్లు లేక పాఠశాలలు సైతం డీలాపడుతున్నాయి. విలీనమే మార్గం ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలు లేరు. ప్రభుత్వ ఆదేశాలు రావటమే తరువాయి పిల్లలు లేని పాఠశాలలకు తాళాలు వేయటమే. రెండు, మూడు విలీనం చేసేస్తారు. నాలుగైదు సంవత్సరాలుగా ఇదేతంతు జరుగుతోంది. ఈ ఏడాది చూస్తే జిల్లాలో 20మందికంటే తక్కువ పిల్లలు ఉన్న ప్రాథమిక పాఠశాలలు 272ఉంటే, 30మంది కంటే తక్కువ ఉన్న పాఠశాలలు 165 వరకు ఉన్నాయి. ఈ జాబితాలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలే అధికంగా ఉన్నాయి. విద్యార్థులు ఎక్కువ ఉన్న పాఠశాలలకు సరిపడినంత మంది ఉపాధ్యాయులు లేకపోవటం, 10మంది పిల్లలకే ఇద్దరు ముగ్గురు టీచర్లు ఉన్న పరిస్థితీ ఉంది. విద్యకు దూరమౌతున్న గిరిజన చిన్నారులు జిల్లాలో గిరిజన సంక్షేమ పాఠశాలలు పరిస్థితి దారుణంగా ఉంది. గిరిజన ప్రాంతాల్లోని ప్రాథమిక పాఠశాలలు పిల్లలు లేక మూతపడే స్థితికి చేరుకున్నాయి. గత ఏడాది గిరిజన ప్రాంతాల్లో సుమారు 30 ప్రాథమిక పాఠశాలలను పిల్లలు లేని కారణంగా సమీప పాఠశాలల్లో విలీనం చేశారు. అంటే ఉన్న ఊరులో పాఠశాలకు వెళ్లే పిల్లలు పక్క ఊరికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ విద్యాసంవత్సరంలో పరిస్థితి పరిశీలిస్తే గిరిజన సంక్షేమ శాఖ యాజమాన్యంలోని 72 ప్రాథమిక పాఠశాలల్లో కనీసం 20మంది పిల్లలు కూడా లేరు. జీలుగుమిల్లి మండలంలో 15 ప్రాథమిక పాఠశాలలు, బుట్టాయిగూడెం మండలంలో 50, పోలవరం మండలంలో 19, గోపాలపురం మండలంలో 3, కొయ్యలగూడెం మండలంలో 4, జంగారెడ్డిగూడెం మండలంలో 3, టి.నరసాపురం మండలంలో 9 పాఠశాలలు ఈ జాబితాలో ఉన్నాయి. గిరిజన చిన్నారులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమౌతున్నారా? లేక గిరిజనులకు ప్రాథమిక విద్య దూరమౌతోందా? అనేది పరిశీలించాల్సి అంశం. ఇదే పరిస్థితి కొనసాగితే కొద్దికాలంలోనే ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు లేని పరిస్థితి ఏర్పడినా ఆశ్చర్యపోనక్కరలేదు. -
రేపు ప్రైవేట్ విద్యాసంస్థల బంద్
కర్నూలు(విద్య): అధిక ఫీజుల నియంత్రణ కోరుతూ ఈ నెల 20న జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల బంద్కు పిలుపునిచ్చినట్లు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.శ్రీనివాసులు, జి.చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం స్థానిక సీఆర్ భవన్లో ఏఐఎస్ఎఫ్ నగర కార్యవర్గ సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్ కళాశాలలు, పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను తుం గలో తొక్కి ధనార్జనే ద్యేయంగా విద్యార్థుల నుంచి ముక్కు పిండి వేలాది రూపాయల ఫీజులను వసూలు చేస్తున్నారని విమర్శించారు. పుస్తకాలు, పరీక్ష ఫీజులు, స్టేషనరీ, స్పోర్ట్స్, వెల్కమ్ పార్టీ, ఫేర్వెల్ పార్టీల పేర్లతో దోపిడీ చేస్తున్నారన్నారు. వీటికి వ్యతిరేకంగా ఈ నెల 20న చేపట్టనున్న బంద్ను విజయవంతం చేయాలని కోరారు. విద్యార్థినీ విద్యార్థులతో పా టు తల్లిదండ్రులు, పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో నగ ర కార్యదర్శి ఎం.మనోహర్, నాయకులు రాజశేఖర్, హరికృష్ణ, రాజు, మధు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలలే ముద్దు
గూడూరు టౌన్ : రాష్ర్ట ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పాఠశాలల్లో వసతులు కల్పిస్తోంది. చదువుతో పాటు యూనిఫాం, పుస్తకాలు అందజేయడంతో పాటు భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇందుకు భిన్నంగా ప్రైవేట్ పాఠశాలల్లో ఉంటోంది. అరకొర వసతులతో పాటు నైపుణ్యంలేని ఉపాధ్యాయులు ప్రైవేట్ పాఠశాలల్లో బోధిస్తున్నారు. అయినప్పటికీ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లోనే చేర్పించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీనికి కారణం ప్రభుత్వ ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పనిచేయకపోవడమే కారణమని పలువురు విమర్శిస్తున్నారు. తమ పిల్లలను ప్రయోజకులు చేయాలనే ఆకాంక్షను ఆసరాగా తీసుకున్న కార్పొరేట్ పాఠశాలలు ప్రత్యేకంగా పీఆర్ఓలను నియమించుకుని వారితో పాటు సిబ్బందిని ఇంటింటికి పంపుతున్నాయి. ‘మీ పిల్లలను మా పాఠశాలలో చేర్పించి తే మంచి భవిష్యత్ ఉంటుంది’ అని వారి తో తల్లిదండ్రులకు చెబుతూ ఒప్పిస్తూ పాఠశాలలో చేర్చుకుంటున్నారు. కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ ఉపాధ్యాయులు పోటీ పడకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కార్ బళ్లలో చేర్పిం చేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కాని అన్ని వసతులు ఉన్న ప్రభుత్వ పాఠశాలలే ముద్దు అనే విషయాన్ని అనేక ఫలితాలు నిరూపిస్తున్నాయి. ఉపాధ్యాయుల్లో సంకల్పం ఉంటే... ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో సంకల్పం ఉంటే పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించుకోవడం పెద్ద కష్టం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమాజంలో ఉపాధ్యాయులకు గౌరవ మర్యాదలతో పాటు వారి మాటలకు విలువ ఇస్తారు. వీరు తల్లిదండ్రులతో మాట్లాడితే వారి పిల్లలను కచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులున్నాయని అధికారులు, ఉపధ్యాయులు చెప్తున్నారే తప్ప ఆచరణలో మాత్రం ఎక్కువ మంది ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నారు. దీంతో సామాన్యులు కూడా అదే బాట పడుతున్నారు. ఉపాధ్యాయులే ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తుంటే ఇక తమ పిల్లలను ఆ పాఠశాలల్లో ఎలా చదివించాలని పలువురు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. గురువారం జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. విద్యాశాఖాధికారులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇప్పటికైనా విద్యార్థుల చేరికపై ప్రత్యేక దృష్టి సారించకపోతే ఈ ఏడాది కూడా మరిన్ని పాఠశాలలు మూతపడే అవకాశాలు ఉన్నాయి. -
బండ‘బడి’
కర్నూలు(విద్య), న్యూస్లైన్ : ‘ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల వసతులూ కల్పిస్తున్నాం.. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ఫలితాలు సాధిస్తాం’ అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోంది. దీంతో గదులు, ప్రహరీలు, క్రీడలకు మైదానం లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం కొన్ని పాఠశాలలకు గదులు మంజూరు చేసినా అధికారుల ఉదాసీనత, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఏళ్లు గడుస్తున్నా భవనాలు పూర్తి కావడం లేదు. జిల్లాలో 79 ప్రభుత్వ, 140 మునిసిపల్, 335 జిల్లా పరిషత్, 2,154 మండల పరిషత్, 1,003 ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. అందులో మంచినీటి సౌకర్యం లేని పాఠశాలల సంఖ్య 1450, మరుగుదొడ్లు లేని పాఠశాలలు 1380, వంటగదులు లేని పాఠశాలలు 1020, రక్షణ గోడలు లేని పాఠశాలలు 1010, ఆటస్థలాలు లేని పాఠశాలలు 1254, విద్యుత్ సౌకర్యం లేని పాఠశాలలు 890 ఉన్నాయి. ప్రహరీగోడలు, వాచ్మెన్ లేకపోవడంతో పాఠశాలలు రాత్రివేళల్లో అసాంఘిక కార్యక్రమాలకు నిలయాలు మారాయి. వంటగదులకు కేటాయించిన నిధులు సరిపోవడం లేదంటూ చాలా చోట్ల నిర్మాణాలు చేపట్టలేదు. ఆరుబయటే మధ్యాహ్న భోజనం వండుతుండటంతో క్రిమికీటకాలు పడే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తాగునీటి సౌకర్యం ఉన్నా ట్యాంకులు శుభ్రం చేయకపోవడం, నీటిసరఫరా సరిగ్గా లేకపోవడం, నిర్వహణ లోపంతో విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో కంప్యూటర్ విద్య మూలనపడింది. మరుగుదొడ్లు, మూత్రశాలలు లేకపోవడంతో బాలికల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధిక శాతం పాఠశాలల్లో మైదానాలు లేకపోవడంతో విద్యార్థులు ఆటపాటలకు దూరమవుతున్నారు. మరికొన్ని చోట్ల పాఠశాలల స్థలాలు ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. జిల్లాలోని పాఠశాలల్లో పరిస్థితి ఇదీ.. ఆదోని మండల పరిధిలోని మాంత్రికి గ్రామ ప్రాథమిక పాఠశాల గదుల నిర్మాణం అర్ధంతరంగా నిలిచిపోయింది. బల్లేకల్లు, పెద్దపెండేకల్లు, మదిరె గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలో గదుల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. ఆదోని మునిసిపల్ కమిషనర్ కార్యాలయం పక్కనే ఉన్న ఎన్ఎంహెచ్ స్కూల్లో విద్యార్థులకు తగ్గట్టుగా తరగతి గదులు లేవు. పట్టణంలోని అండర్పేట గర్ల్స్ హైస్కూల్కు ప్రహరీ లేకపోవడంతో చుట్టుపక్కల వారు పాఠశాల ఆవరణలోనే మల విసర్జన చేస్తున్నారు. దీంతో విద్యార్థులు నడిచేందుకు ఇబ్బందులు పడుతున్నారు. బనగానపల్లి మండలంలోని పసుపల, నందివర్గం, కైప, రామతీర్థం, ఇల్లూరు కొత్తపేట, పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాలలకు మరుగుదొడ్ల, తాగునీటి సౌకర్యాలు లేవు. నందివర్గం ఉన్నత పాఠశాల వద్ద ఇటీవలే మరుగుదొడ్లను నిర్మించినా, నాణ్యత లేక బీటలువారి నిరుపయోగంగా మారాయి. నందవరం, నందివర్గం, రామతీర్థం, ఇల్లూరు కొత్తపేట, టంగుటూరు, తిమ్మాపురం మరికొన్ని గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలల అదనపు గదుల నిర్మాణానికి నిధుల మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపినా బుట్టదాఖలయ్యాయి. డోన్పట్టణంలో కొత్తపేట, నెహ్రునగర్ కాలనీల్లోని జెడ్పీపాఠశాల్లో తరగతి గదులు లేక ఉన్న నాలుగు గదుల్లోనే క్లాసులు నడుపుతున్నారు. ప్యాపిలి జెడ్పీ బాలుర హైస్కూలు, చిన్నపూజర్ల, వెంగళాంపల్లె గ్రామాల్లో పాఠశాలలల్లో క్రీడామైదానాల కొరత ఉంది. -
కేంద్రీయ విద్యాలయాలకే డిమాండ్
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్లైన్: కార్పొరేట్ స్కూళ్ల కన్నా కేంద్రీయ విద్యాలయాలకే డిమాండ్ ఉందని రాష్ట్ర రెవెన్యూ శాఖామంత్రి ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. నాణ్యైమైన విద్య అందించడం వల్లే ఎక్కువ మంది కేంద్రీయ విద్యాలయాల వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఒంగోలులోని దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు సమీపంలో 9.26 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న కేంద్రీయ విద్యాలయ భవనాలకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులనుద్దేశించి రఘువీరారెడ్డి మాట్లాడారు. దేశంలోనే పేరు ప్రఖ్యాతి గాంచిన విద్యాలయంగా కేంద్రీయ విద్యాలయం పేరొందిందన్నారు. 2007లో 600 మంది పేద విద్యార్థులతో ప్రారంభించిన ఈ విద్యాలయంలో ప్రస్తుతం ఒక్కో సీటుకు పదిమంది పోటీ పడుతున్నారని చెప్పారు. విద్యార్థులను మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దే వాతావరణం కేంద్రీయ విద్యాలయంలో ఉందన్నారు. భవనాల నిర్మాణాలకు ప్రభుత్వం రూ. 18 కోట్లు ఖర్చు చేస్తోందని, జిల్లాకు అదనంగా మరో కేంద్రీయ విద్యాలయం మంజూరైనట్లు తెలిపారు. దీన్ని తాము ఖర్చుగా భావించడం లేదని, విద్యార్థులపై పెట్టుబడిగా భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 30 లక్షల మందికి నాణ్యమైన ఉచిత విద్య అందిస్తున్న ఘనత కేంద్రీయ విద్యాలయాలకే దక్కుతుందని రఘువీరా అన్నారు. ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశానికి గతంలో ఎంపీ కోటా కింద రెండు సీట్లు కేటాయించేవారని, ప్రస్తుతం ఆ సంఖ్య ఆరుకు పెంచారని తెలిపారు. కలెక్టర్ విజయకుమార్ మాట్లాడుతూ 5 ఎకరాల స్థలంలో కొత్త భవనాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. రెండో కేంద్రీయ విద్యాలయం కోసం మంగమూరు వద్ద స్థలాన్ని చూసినట్లు చెప్పారు. మూడో కేంద్రీయ విద్యాలయం మంజూరైతే మార్కాపురం డివిజన్లో ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం ఒంగోలులోని కేంద్రీయ విద్యాలయంలో 864 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. జిల్లా జడ్జి రాధాకృష్ణ మాట్లాడుతూ పాత గురుకులాలను గుర్తుకు తెచ్చేవిధంగా కేంద్రీయ విద్యాలయం ఉందన్నారు. కార్యక్రమంలో కొండపి శాసనసభ్యుడు జీవీ శేషు, కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ సీహెచ్ ప్రసాదరావు, డీఆర్డీఏ పీడీ పద్మజ, డీఈఓ రాజేశ్వరరావు, నగర పాలక సంస్థ కమిషనర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 12 తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణానికి 8 కోట్లు జిల్లాలో 12 తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణాలకు రూ. 8 కోట్లు విడుదల చేసినట్లు రెవెన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. ఆధునికీకరించిన కలెక్టర్ క్యాంపు కార్యాలయ భవనాన్ని మునిసిపల్ శాఖామంత్రి మానుగుంట మహీధర్రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం శాసనసభ్యులు, జిల్లా అధికారులను ఉద్దేశించి రఘువీరారెడ్డి మాట్లాడారు. రెండు మాసాల్లోనే క్యాంపు కార్యాలయాన్ని పూర్తిచేయడంపై కలెక్టర్ విజయకుమార్ను ప్రత్యేకంగా అభినందించారు. ఎన్నికల్లో లైఫ్ రిస్క్ తీసుకున్న కలెక్టర్ కలెక్టర్ విజయకుమార్ తొలి పోస్టింగ్ అనంతపురం జిల్లా పెనుకొండలో సబ్ కలెక్టర్గా చేశారని, 1997-1998లో జరిగిన ఎన్నికల్లో లైఫ్ రిస్క్ తీసుకొని విధులు నిర్వర్తించారని మంత్రి రఘువీరారెడ్డి అభినందించారు. రిగ్గింగ్ జరిగినట్లు గుర్తించి రాత్రికి రాత్రే 78 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించారని, బెదిరింపులు వచ్చినా వాటిని లెక్క చేయలేదన్నారు. సమావేశంలో శాసనమండలి సభ్యుడు జూపూడి ప్రభాకర్, శాసనసభ్యులు బీఎన్ విజయ్కుమార్, జీవీ శేషు, ఆమంచి కృష్ణమోహన్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, ఆదిమూలపు సురే శ్, జిల్లా జడ్జి రాధాకృష్ణ, ఎస్పీ ప్రమోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీ నిధులు పక్కదారి
మేడ్చల్, న్యూస్లైన్: ఆయన ఓ బడా నాయకుడు.. ఇంకేముందు ‘రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా’ అన్నట్లు నాయకుడు తలచుకుంటే జరగని పనేముంటుంది. మండలపరిధిలోని అత్వెల్లిలో ఉన్న ఓ రాజకీయ నేత భూమిలో కార్పొరేట్ పాఠశాల కోసం ఓ సంస్థ ముందుకొచ్చింది. నెలనెలా అద్దె వస్తుండటంతో నిబంధనలకు విరుద్ధంగా చకచకా మూడు నెలల్లో నిర్మాణం చేపట్టి పాఠశాలను ప్రారంభించారు. పాఠశాల పక్కనే ఓ బయోటెక్నిక్ కంపెనీ ఉంది. పాఠశాల నుంచి మురికి నీరు వెళ్లడానికి తన పొలం అడ్డుగా ఉండడంతో సదరు నాయకుడు తన పొలాల్లోకి రాకుండా డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని గ్రామ పంచాయతీపై ఒత్తిడి తెచ్చాడు. పాలక వర్గం లేకపోవడం (ఎన్నికల విషయం కోర్టులో ఉంది)తో పంచాయతీ అభివృద్ధి కమిటీ ఎస్సీ కాలనీ నుంచి వాగు వరకు మురికి కాలువ నిర్మాణానికి ప్రతిపాదించింది. వెంటనే అనుమతులు వచ్చాయి. ఎస్సీ కాలనీ నుంచి పనులు మొదలు పెట్టకుండా సదరు నాయకుడి పొలం నుంచి పాఠశాల దాటేంతవరకు దాదాపు రూ.8 లక్షల వెచ్చించి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పాఠశాల నుంచి వచ్చే మురికి నీటిని కాలువకు అనుసంధానం చేశారు. కింది భాగంలో కాలువను పూర్తి చేయకుండా హరిజనుల పొలాల్లోకి మురికి కాలువను అసంపూర్తిగా వదిలేశారు. పైభాగంలో ఎస్సీ కాలనీ మురుగు నీరు వెళ్లేందుకు కొత్తగా నిర్మించిన పైపులైన్కు అనుసంధానం చేయలేదు. దీంతో కాలనీ నుంచి వచ్చే మురికి నీరంతా బయోటెక్నిక్ కంపెనీ ఎదుట ఉన్న ప్లాట్లలోకి చేరి మురికి కూపంలా మారింది. ఎస్సీ కాలనీ నుంచి వాగు వరకు వేయాల్సిన మురికి కాలువను కేవలం నాయకుడికి చెందిన స్థలం వరకు మాత్రమే పూర్తి చేసి నిధులు లేవని అధికారులు చేతులు దులుపుకున్నారు. ఇబ్బందులు పడుతున్న రైతులు, కాలనీవాసులు నాయకుడి స్వార్థం కోసం పంచాయతీ అధికారులు అనాలోచితంగా డ్రైనేజీ నిర్మించడంతో ఎస్సీ కాలనీ ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాలనీకి సమీపంలో మురికి నీరు వదిలేయడంతో మురికి కూపంగా మారింది. దీంతో దోమల బెడద, దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. కాలువను పూర్తిగా నిర్మించకుండా ఎస్సీ పొలాల్లోకి మురికి నీరు వదిలేయడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. తప్పులు దొర్లాయి.: నర్సింహారెడ్డి, గ్రామ కార్యదర్శి అత్వెల్లి ఎస్సీ కాలనీ నుంచి వాగు వరకు మురికి కాలువ నిర్మించడంలో కొన్ని తప్పులు దొర్లాయి. ఇళ్ల నుంచి పనులు మొదలు పెట్టకుండా మధ్యలో మొదలు పెట్టడంతో డ్రైనేజీ సమస్య ఏర్పడింది. రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో ఏ పనీ సరిగా చేయలేకపోతున్నాం.