
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సర్వ దర్శనానికి 4 కాంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 7 గంటల సమయం, నడకదారి భక్తుల దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు సమయం పడుతోంది.
ఇదిలాఉండగా, ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 14 కంపార్ట్మెంట్లు నిండాయి. భక్తుల కోసం ఉచిత, రూ. 50, రూ. 100, రూ. 500 గదులు సులభంగా లభిస్తున్నాయి. భక్తులకు ఉచిత గదులు 79 ఖాళీగా ఉన్నాయి.
గదుల వివరాలు:
రూ. 50 గదులు 54,
రూ. 100 గదులు 190,
రూ. 500 గదులు 5 ఖాళీగా ఉన్నాయి.
గురువారం ప్రత్యేక సేవ - తిరుప్పావడ