చింతకొమ్మదిన్నె (వైఎస్సార్ జిల్లా) : నారాయణ కళాశాలలో విద్యార్థినుల మృతిపై త్వరలోనే నిజానిజాలు వెల్లడవుతాయని డీఐజీ రమణ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన కడప సమీపంలోని కృష్ణాపురం వద్దనున్న నారాయణ జూనియర్ కళాశాలకు ఎస్పీ నవీన్ గులాటితో కలసి వెళ్లారు.
ఈ సందర్భంగా ఆయన విద్యార్థినులు మృతి చెందిన స్థలాన్ని పరిశీలించారు. కళాశాల యాజమాన్యం, హాస్టల్ సిబ్బంది నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విద్యార్థినుల మరణాలకు గల కారణాలు పోస్టుమార్టం నివేదిక అందిన అనంతరమే వెల్లడవుతాయని తెలిపారు.
నారాయణ కళాశాలలో డీఐజీ విచారణ
Published Tue, Aug 18 2015 4:22 PM | Last Updated on Fri, Nov 9 2018 4:51 PM
Advertisement
Advertisement