నేటి నుంచే డీఎస్సీ | DSC exams starts today | Sakshi
Sakshi News home page

నేటి నుంచే డీఎస్సీ

Published Sat, May 9 2015 3:56 AM | Last Updated on Fri, May 25 2018 5:44 PM

DSC exams starts today

- ఆర్టీసీ సమ్మెతో అభ్యర్థుల్లో ఉత్కంఠ

హైదరాబాద్:  ఉపాధ్యాయ నియామకాలకోసం ఉద్దేశించిన డీఎస్సీ-2014 (టెట్ కమ్ టెర్ట్) పరీక్షలు శనివారం నుంచి మొదలవనున్నాయి. వరుసగా మూడు రోజులపాటు జరిగే ఈ పరీక్షలకు పాఠశాల విద్యాశాఖ సకల ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో శుక్రవారం నాటి ఎంసెట్‌కు మాదిరిగానే ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేపట్టింది.

10,313 పోస్టులకోసం నిర్వహించే ఈ పరీక్షకు మొత్తం 4,20,702 మంది దరఖాస్తు చేయగా అందులో 3,97,294 మందికి హాల్‌టికెట్లు జారీ చేశారు. ఆన్‌లైన్ ద్వారా జారీచేసిన ఈ హాల్‌టికెట్లను 3,75,164 మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు.రాష్ట్రవ్యాప్తంగా 2,560 కేంద్రాల్ని ఏర్పాటుచేశారు. అయితే ఆర్టీసీ సమ్మెతో ఈ పరీక్షలకు ఎలా హాజరు కావాలని అభ్యర్థులు ఆవేదన చెం దుతున్నారు.

జూన్ ఒకటికల్లా ఫలితాలు :డీఎస్సీ పరీక్షలను షెడ్యూల్ ప్రకారం యధాతథంగా నిర్వహిస్తామని, ఫలితాల్ని జూన్ ఒకటి నాటికి విడుదల చేస్తామని రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement