శ్రీకాకుళం పాతబస్టాండ్:ఖజానాశాఖలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఖజానా శాఖ ద్వారా చెల్లించే వివిధ చెల్లింపులను ఈ పేమెంట్ ద్వారా చెల్లించేందుకు సర్వం సిద్దం చేశారు. వచ్చే నెల నుంచి ఉద్యోగుల జీతాలు నేరుగా వారి ఖాతాల్లో జమకానున్నాయి. ఇంతవరకు ఉద్యోగుల జీతాలు ముందుగా ట్రెజరీలో సంబంధిత అధికారులు అందజేసిన వివరాల ప్రకారం ఖజానాశాఖ అధికారులు బ్యాంకులకు ఖాతాల వారీగా జమ చేసేలా నివేదికలు అందజేసేవారు. ఇక నుంచి ఈ పేమెంట్ విధానంలో ఆ ప్రక్రియ ఉండదు. నేరుగా ఖజానా శాఖ నుంచి ఉద్యోగి బ్యాంకు ఖాతాలో వారి జీతం తదితర నగదు జమ కానుంది. ఈ పేమెంట్ విధానం అంటే ఎలక్ట్రానిక్ చెల్లింపులు ఈ విధానం కార్పొరేట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ విధానం ద్వారా జరుగుతుంది. ఇలా ఉద్యోగుల జీతాలు చెల్లింపులు చేయడం వల్ల ఖజానా శాఖ నుంచి నేరుగా ఉద్యోగి ఖాతాలోనికి జమ అవుతుంది. బ్యాంకుకు ప్రభుత్వం చెల్లించాల్సిన నిర్వహణ ఖర్చులు మిగలనున్నాయి.
ఈ పేమెంట్ ద్వారా ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, పదవీ విరమణ చేసిన తరువాత వారికి వచ్చే ప్రయోజనాల నగదు, ఆర్జిత సెలవులు, ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన విద్యుత్ బిల్లులు, టెలిఫోన్, కార్యాలయ నిర్వహణా ఖర్చులు వంటివి చెల్లింపులు జరుగుతాయి. పంచాయతీలకు సంబంధించిన బిల్లులు పంచాయతీల్లో పనిచేస్తున్న సిబ్బంది జీతభత్యాలు, పంచాయతీల అభివృద్దికి సంబంధించిన పన్నుల బిల్లులు, పీడీ అకౌంట్కు సంబంధించిన బిల్లులు ఈ పేమెంట్ ద్వారా చెల్లింపులు జరగవు. ఇవి ఎప్పటిలానే బ్యాంకుల ద్వారా చెల్లింపులు నిర్వహిస్తారు. ఈ మేరకు ఈ నెల 2న విశాఖపట్నంలో మూడు జిల్లాలకు చెందిన సబ్ ట్రెజరీ అధికారులుగా గణాంక అధికారులతో ఈపేమెంట్పై శిక్షణలు కూడా ఉన్నతాధికారులు అందజేశారు.
జిల్లా ఖజానాశాఖ కార్యాలయంతో పాటు 14 సబ్ట్రెజరీ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు కలిపి 30వేలకు పైనే ఉన్నారు. పెన్షన్దారులు ఉన్నారు. వీరందరికీ ఈపేమెంట్ ద్వారా జీతాలు చెల్లింపులు జరుగుతున్నాయి. అయితే జిల్లాలో నాలుగు సబ్ట్రెజరీల్లో డాటాఎంట్రీ ఆపరేటర్లు లేరు. ఆమదాలవలస, రణస్థలం, కొత్తూరు, కోటబొమ్మాళి ఉపఖజానా కార్యాలయాల్లో డీఏవోలు లేక సిబ్బందే నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మిగిలిన ఉప ఖజానాకార్యాలయాల్లో 11 మంది ఔట్సోర్సింగ్ విధానంలో డాటాఎంట్రీ ఆపరేటర్లు ఉన్నారు. ఈపేమెంట్ ప్రభుత్వం తప్పనిసరి చేసినప్పటికీ సిబ్బంది కొరత వేధిస్తోంది.
ఈ పేమెంట్ ద్వారా ఉద్యోగుల జీతాలు
Published Fri, Aug 8 2014 2:22 AM
Advertisement
Advertisement
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
డిఫరెంట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న కమల్..
నేడు సచివాలయంలో బాధ్యతలు చేపట్టనున్న చంద్రాబాబు
దేవర ముంగిట దుల్కర్, రవితేజ..
పాఠ్యపుస్తకాలు వెనక్కి తీసుకోండి.. తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు
తిరుగులేని రోహిత్ సేన.. సూపర్ 8 లోకి టీమిండియా..
ప్రపంచంలోనే నంబర్ వన్ యూట్యూబ్ ఛానల్ ఇదే..!
దేశంలోకి ఎయిర్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయ్..ఛార్జీలు ఎంతో తెలుసా..?
విప్రోకు భారీ కాంట్రాక్ట్.. వేల కోట్ల అమెరికన్ డీల్
హ్యాపీ మూమెంట్స్: హార్దిక్ పాండ్యా అలా.. నటాషా ఇలా! (ఫొటోలు)
ఒక ఫ్లాట్ అక్షరాలా రూ.100 కోట్లు.. ఎవరు కొన్నారో తెలుసా..?
తప్పక చదవండి
- బీజేపీతో ఇబ్బందులకు గురయ్యా: మహువా మొయిత్రా
- జూన్ 13 : స్పెషాల్టీ ఏంటో తెలిస్తే, వావ్..! అనాల్సిందే!
- నా నంబర్ ఇదే.. సినిమా నచ్చకపోతే కాల్ చేయండి: అజయ్ ఘోష్
- T20 WC: పాకిస్తాన్కు ‘శుభవార్త’.. కానీ ఆ గండం దాటితేనే!
- YS Jagan: ఎమ్మెల్సీలతో ముగిసిన భేటీ
- సిమ్ కార్డు, వై-ఫై కనెక్షన్ లేకపోయినా మెసేజ్లు పంపాలా..?
- జీ-7 సమ్మిట్: బైడెన్తో ప్రధాని మోదీ ప్రత్యేక భేటీ!
- తన కొడుకుని బస్సులో ఎక్కించుకోలేదని మహిళ ఏం చేసిందంటే ?
- కేంద్రమంత్రులుగా కిషన్రెడ్డి, బండి సంజయ్ బాధ్యతల స్వీకరణ
- Kuwait: భారతీయ మృతులపై నో క్లారిటీ: విదేశాంగ శాఖ
Advertisement