చీకటి పడితే ఏనుగుల బీభత్సం | elephants attack in srikakulam district | Sakshi
Sakshi News home page

చీకటి పడితే ఏనుగుల బీభత్సం

Published Sun, Aug 16 2015 5:34 PM | Last Updated on Sun, Sep 3 2017 7:33 AM

elephants attack in srikakulam district

ఎల్లందపేట (శ్రీకాకుళం): రాత్రి అయ్యిందంటే చాలు.. గజరాజులు గ్రామంలోకి చొరబడుతున్నాయి. దీంతో శ్రీకాకుళం జిల్లా ఎల్లందపేట మండలం జంబాడ గిరిజన గ్రామం ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ గిరిజన గ్రామంలోకి రాత్రి అయ్యిందంటే చాలు ఏనుగులు చొరబడుతూనే ఉన్నాయి.

తిరిగి తెల్లవారగానే కొండపై ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోతున్నాయి. గ్రామంలో పలు పంటలను నాశనం చేస్తుండటంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అటవీ అధికారులు వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement