crops
-
‘దేవా’.. ఒక్క మోటారు!
సాక్షి, హైదరాబాద్: ఒక్క మోటార్పై 50 వేల నుంచి 65 వేల ఎకరాల్లోని పంటల మనుగడ ఆధారపడి ఉంది. దేవాదుల ప్రాజెక్టు కింద ప్రస్తుత యాసంగిలో సాగు చేస్తున్న ఈ పంటలు మరో రెండు వారాల్లో చేతికొచ్చే దశలో ఉండగా, తీవ్ర నీటి కొరత కారణంగా ఎండిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించింది. దేవాదుల ప్రాజెక్టు మూడో దశ కింద దేవన్నపేట వద్ద కొత్తగా నిర్మించిన పంప్హౌస్లో ఒక్కొక్కటి 31 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మూడు మోటార్లుండగా.. కనీసం ఓ మోటారునైనా యుద్ధప్రాతిపదికన వినియోగంలోకి తేవడం ద్వారా ఆ పంటలకు గోదావరి జలాలను మళ్లించడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది.ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి గత 10 రోజులుగా అక్కడే ఉండి పంప్హౌస్ను సిద్ధం చేసే పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 18న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి కడియం శ్రీహరిలు.. మోటార్ను ఆన్ చేసి నీటిని విడుదల చేసేందుకు పంప్హౌస్ వద్దకు చేరుకున్నారు. అర్ధరాత్రి వరకు నిరీక్షించినా సాంకేతిక సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తిరిగి వచ్చేశారు.ఇవి ఆస్ట్రియాకి చెందిన ఆండ్రీజ్ కంపెనీ మోటార్లు కావడంతో ఆ దేశం నుంచి సాంకేతిక నిపుణులు పంప్హౌస్కు చేరుకుని సాంకేతిక అడ్డంకులు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం నాటికి మోటారు సిద్ధం చేసి ధర్మసాగర్ రిజర్వాయర్లోకి నీళ్లను ఎత్తిపోసేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తామని నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ తాజాగా మంత్రి ఉత్తమ్కు సమాచారమిచ్చింది. అదే జరిగితే ధర్మసాగర్లో నిల్వలు పెరిగి అక్కడి నుంచి ఇతర రిజర్వాయర్లకు నీటిని తరలించి స్టేషన్ఘన్పూర్, హుస్నాబాద్, వరంగల్ వెస్ట్, వర్ధన్నపేట, పరకాల ప్రాంతంలోని పంటలకు సరఫరా చేసేందుకు అవకాశం కలగనుంది. 800 క్యూసెక్కులు సరఫరా చేస్తేనే.. దేవాదుల ఎత్తిపోతల కింద 1,28,280 ఎకరాల్లో ఆరుతడి, 70,350 ఎకరాల్లో వరి కలుపుకుని మొత్తం 1,98,630 ఎకరాలకు నీరు అందించాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల కింద రాష్ట్రంలో సాగుచేస్తున్న పంటలకు సరిపడా నీళ్లు అందుతుండగా, దేవాదుల ప్రాజెక్టు కిందే తీవ్రమైన నీటి కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో దేవన్నపేట పంప్హౌస్లోని ఒక మోటార్ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చి 800 క్యూసెక్కులను నీటిని సరఫరా చేయగలిగితే అంత మేరకు పంటలను రక్షించుకోగలుగుతామని ప్రభుత్వం భావిస్తోంది. ప్రమాదాలు నివారించే పనుల వల్లే ఆలస్యం పంప్హౌస్ నిర్మాణం చాలా రోజుల కిందే పూర్తికాగా, రక్షణ చర్యల్లో భాగంగా పైపులకు సిమెంట్ ఇన్కేసింగ్ పనులు చేయాలని నిపుణులు సూచించారు. పంప్హౌస్ లోతు ఎక్కువగా ఉండడంతో నీళ్లు వెనక్కి తన్ని వచ్చినప్పుడు ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని గుర్తించడంతో ఈ సిఫారసు చేశారు. గత రెండు నెలలుగా ఈ పనులు జరుగుతుండగా, ఇప్పటికే రెండు మోటార్లకు సంబంధించిన పనులు పూర్తయ్యాయి. ఇందులో ఒక మోటార్ను తక్షణమే వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యేల నుంచి కూడా ఒత్తిడి పెరిగింది. మూడో దశ పూర్తైతే ..రైతు దశ తిరిగినట్టే..! సమ్మక్కసాగర్ బరాజ్ బ్యాక్వాటర్ నుంచి దేవాదుల ఎత్తిపోతల పథకం నీళ్లను తరలించనుండగా, ప్రస్తుతం సమ్మక్కసాగర్లో 2.5 టీఎంసీల నిల్వలున్నాయి. రోజూ 1500 క్యూసెక్కుల వరద వస్తోంది. దేవాదుల తొలిదశ కింద 5.18 టీఎంసీలు, రెండో దశ కింద 7.25 టీఎంసీలు, మూడో దశ కింద 25.75 టీఎంసీలు కలిపి మొత్తం 38.16 టీఎంసీల నీళ్లను ఎత్తిపోసి మొత్తం 5.57 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంది. ఇప్పటికే తొలి రెండు దశల పనులు పూర్తయ్యాయి. మూడో దశ కూడా పూర్తైతే ప్రాజెక్టు కింద ఆయకట్టు రైతు దశ తిరగనుంది. -
మన్యంలో.. గజ ఘీంకారం..!
పాలకొండ రూరల్/భామిని: మన్యం జిల్లాలో గజరాజుల ఘీంకారాలు నిత్యకృత్యమయ్యాయి. వీటి సంచారంతో ప్రజలు తమ ప్రాణాలు, పంటలు, ఆస్తులు కాపాడుకునేందుకు శ్రమిస్తున్నారు. అడవుల రూపు కోల్పోతుండడంతో ఏనుగుల మనుగడ కష్టమై జనావాసాల వైపు దూసుకు వస్తున్నాయి. ఆహారం కోసం పంట పొలాల వైపు వచ్చేస్తున్నాయి. దీంతో సాగు పొలాలను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. ఫలితం దక్కడం లేదు. మరోవైపు ఆస్తులు, ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఎన్నికల ముందు ఏనుగుల తరలింపుపై కూటమి నేతలు స్పష్టమైన హామీలిచ్చి...నేడు వాటిని మరవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి పరీవాహక ప్రాంతాల వెంబడి గజరాజులు గుంపులుగా సంచరిస్తున్నాయి. వీటిని కట్టడి చేసే క్రమంలో అధికారిక యత్నాలు ఆశించిన ఫలితం ఇవ్వడం లేదు. దీంతో బాధిత గ్రామాల ప్రజలు తమకు పరిహారం వద్దు.. శాశ్వత పరిష్కారం కావాలని అటు ప్రజాప్రతినిధులను, ఇటు అధికారులను కోరుతున్నారు. గ్రామాల్లో కునుకు కరువు జిల్లాలో సువిశాలంగా విస్తరించి ఉన్న ఏజెన్సీ, నాగావళి, వంశధార, జంఝావతి నదీతీర పరివాహక ప్రాంతాల వెంబడి గజరాజుల గుంపులు తిష్ట వేసాయి. పాలకొండ నియోజకవర్గంలో భామిని, సీతంపేట పరిసరాల్లో నాలుగు ఏనుగులు సంచరిస్తూ పంటలు ధ్వంసం చేస్తున్నాయి. పార్వతీపురం రెవెన్యూ సబ్ డివిజన్ పరిధిలో కురుపాం, కొమరాడ, గరుగుబిల్లి, జియ్యమ్మవలస మండలాల్లో నిత్యం సంచరిస్తున్న ఏడు ఏనుగుల గుంపు అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రైతులు సేద్యం చేస్తున్న అరటి, బొప్పాయి, మొక్కజొన్న, చెరకు, వరి, పామాయిల్, కర్బూజ, మామిడి, జీడి పంటలతో పాటు ఇతర ఆహార, వాణిజ్య పంటలను నాశనం చేస్తున్నాయి. జిల్లా పరిధిలో సుమారు 3,500 ఎకరాల మేర పంటలు ఏనుగుల సంచారంతో తీవ్రంగా దెబ్బతింటున్నాయి. రూ.కోట్లలో నష్టం సంభవిస్తున్నా... ఇందుకు సంబంధించిన పరిహారం నేటికీ అందించలేదు.కుంకీ ఏనుగులు ఎక్కడ? ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏనుగుల సమస్యను అధిగమించేందుకు తాము కట్టిబడి ఉన్నామని కూటమి నాయకులు బహిరంగ సభల్లో వెల్లడించారు. ప్రస్తుత డిప్యుటీ సీఎం పవన్కల్యాణ్ నాడు కుంకీ ఏనుగులు తీసుకువస్తామన్నారు. వాటి సహాయంతో ఈ ప్రాంతాల్లో సంచరిస్తున్న ఏనుగుల గుంపులు తరలింపునకు చర్యలు చేపడతామన్నారు. నేటికీ ఆ దిశగా అడుగులు పడటం లేదు. పార్వతీపురం మండలం డోకిశిల పంచాయతీ జంతి కొండ వద్ద ఎలిఫ్యాంట్ జోన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసినా అది కూడా కార్యరూపం దాల్చలేదు. దీంతో ప్రభుత్వ పెద్దల హామీలపై బాధితుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.మరణ మృదంగం గజరాజుల సంచారంతో గడిచిన కొద్ది సంవత్సరాల్లో 13 మంది మృత్యువాత పడ్డారు. 12 పశువులు మృతి చెందినట్టు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. వీటితో పాటు వ్యవసాయ బోర్లు, పంపు షెడ్లు, పరికరాలను, డ్రిప్ పైపులను నాశనం చేసాయి.ఏనుగులు మళ్లీ వచ్చేశాయ్...జియ్యమ్మవలస: మండలంలోని జోగిరాజుపేట, బట్లబద్ర, కన్నపుదొరవలస, వెంకటరాజపురం పరిసర ప్రాంతాలలోకి గురువారం సాయంత్రం ఏనుగులు మళ్లీ వచ్చాయి. రాత్రి పూట పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీ సిబ్బంది సూచించారు. ప్రస్తుతం జోగిరాజు పేట వద్ద ఉన్నాయని, రాత్రి సమయానికి బిత్రపాడు, బాసంగి తదితర పంట పొలాలలోకి వచ్చే అవకాశముందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.పరిహారం వద్దు.. శాశ్వత పరిష్కారం కావాలి... ఇటీవల పాలకొండ నియోజకవర్గం భామిని మండలం ఘ నసర వద్ద ఏనుగుల కారణంగా రైతులు నష్టపోయిన పంటలను అంచనా వేసేందుకు వచ్చిన అటవీ శాఖ అధికారుల వద్ద బాధిత రైతులు తీవ్రంగా స్పందించారు. తరచూ న ష్టాల అంచనాలు నమోదు చేయడం తప్ప చేసేదీ ఏమీ లే దంటూ నినాదాలు చేసారు. తమకు పరిహారం వద్దని, శాశ్వ త పరిష్కారం చూపాలని అధికారులను, ఎమ్మెల్యే జయకృష్ణను చుట్టుముట్టారు. బైఠాయించి నిరసన తెలిపారు.రెండెకరాల్లో జొన్న పంట నాశనం నా సొంత భూమితో పాటు మరో ఎకరా భూమిని కౌలుకు తీసుకుని రెండెకరాల్లో మొక్కజొన్న సేద్యం చేపట్టాను. అప్పులు చేసి మదుపులు పెట్టాను. కుటుంబమంతా కష్టపడ్డాం. కీలక దశలో ఏనుగుల గుంపు దాడి చేయటంతో పూర్తిగా పంట నష్టపోయాను. నష్టపోయిన పంటను చూసేందుకు పొలంకు వెళ్లాలన్నా భయం వేస్తుంది. ఏ క్షణం ఏనుగులు దాడి చేస్తాయోనని బిక్కుబిక్కుమంటున్నాం. నష్ట పరిహారాలు ఎందుకు? ఈ ప్రాంతం నుంచి వాటిని తరలిస్తే మేలు. – వలరౌతు లక్ష్మీనారాయణ, రైతు, ఘనసర, భామిని మండలం నిరంతరం నిఘా ఏనుగుల కదిలికలపై మా సిబ్బంది నిరంతరం దృష్టి సారిస్తున్నారు. అవి సంచరించే పరిసరాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. ఏనుగుల పునరావాస కేంద్రం ఏర్పాటుకు గుచ్చిమి వద్ద ఏర్పాట్లు చేపట్టనున్నాం. ఇందుకు సంబంధించి శాఖాపరమైన అనుమతులు వచ్చాయి. రూ.5 కోట్లతో సోలార్ కంచె, ట్రెంచులు, వెదురు వనాలు, నీటి సంపులు, ఇతర వసతులు ఏనుగుల కోసం సిద్ధం చేయాలని నిర్ణయించాం. తొలి దశలో రూ.కోటి నిధులుతో పనులు చేపడతాం. పంట నష్టాలకు సంబంధించి దాదాపు మూడు వేల మంది రైతులకు రూ.45లక్షలు వరకు జమ చేశాం. రెండు మూడు రోజుల్లో సదరు రైతుల ఖాతాకు ఈ మొత్తాలు పూర్తిగా జమ కాబడతాయి. కుంకీ ఏనుగులను తీసుకువచ్చే విధంగా అడుగులు పడుతున్నాయి. – జీపీఏ ప్రసూన, అటివీ శాఖాధికారిణి -
Mahakumbh Mela 2025: పర్యావరణం బాబా..ఏకంగా తల పైనే పంటలు పండిస్తున్నాడు..!
ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్న ఈ మహా కుంభమేళ(Mahakumbh Mela 2025)లో రకరకాల బాబాలు దర్శనమిచ్చి ఆశ్చర్యపరుస్తున్నారు. పావురం బాబా నుంచి, ఇంజనీర్ బాబాల వరకు అందరిది ఒక్కో నేపథ్యం కానీ వాందర్నీ ఒకచోట చేర్చింది ఈ ఆధ్యాత్మికతే. ఈ కుంభమేళాలో కొందరి బాబాల బ్యాగ్రౌండ్ ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయి. ఇంకొందరూ అందరి హితం కోరేలా జీవనం సాగిస్తున్నారు. అలాంటి కోవకు చెందిన మరో బాబా ఈ మహాకుంభమేళలో హైలెట్గా నిలిచాడు. పర్యావరణ స్ప్రుహ కలిగించేలా అతడి ఆహార్యం ఎలా ఉందే చూస్తే కంగుతింటారు.ఈ పర్యావరణ బాబా పేరు అనాజ్ వాలే బాబా(Anaaj Wale Baba). ఈయన ఉత్తరప్రదేశ్లోని సోన్భద్రకు చెందిన బాబా. పర్యావరణం కోసం ఎంతమంది పాటుపడ్డారు. కానీ ఈ బాబా అత్యంత విభిన్నమైన శైలిలో పాటుపడుతూ..అందరి దృష్టిని ఆకర్షించాడు. అతను పంటలనే(crops) ఏకంగా తన తల(Head)పై పండిస్తున్నాడు. మిల్లెట్లు, గోధుమలు, పప్పుధాన్యాలు, బఠానీల(wheat, millet, gram, and peas)తో సహా చాలా రకాల పంటలను తలపై పండించాడట. ఈ అసాధారణ ప్రయత్నాన్ని గత ఐదేళ్లు నుంచి చేస్తున్నట్లు తెలిపాడు ఆ బాబా. కేవలం అటవీ నిర్మూలనపై అవగాహన పెంచడం, పచ్చదనాన్ని ప్రోత్సహించడమే తన అసాధారణ ప్రయత్నం వెనుకున్న లక్ష్యమని అన్నారు అనాజ్ వాలే బాబా. చెట్లు నరకడం వల్ల యావత్తు ప్రపంచంపై ఎలాంటి ప్రభావితం చూపుతుందో తెలియడంతో ఇలా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. తన అసాధారణ విధానమైన పనితో ప్రజలు ప్రభావితమై మరిన్ని మొక్కలు నాటి పచ్చదనంతో కళకళలాడేలా చేస్తారనేది తన ఆశ అని అన్నారు. ఈ కారణాల రీత్యా మహా కుంభమేళా కోసం కిలా ఘాట్ సమీపంలో ఉంటున్న ఈ అనాబ్ వాలే బాబా అందరి దృష్టిని ఆకర్షించేలా హైలెట్గా నిలిచారు. ఈ కుంభమేళాకి వచ్చే సందర్శకులు అతడి అసాధారణమైన ప్రయత్నానికి ఫిదా అవ్వడమే గాక ఆశ్చర్యపోతున్నారు. అంకితభావంతో తలపై మొక్కలను పెంచుతున్నారు. క్రమతప్పకుండా వాటికి నీళ్లు పోసి వాటి బాగోగులు చూస్తుంటారా బాబా. ఆయన దీన్ని హఠ యోగతో మిళితమైన పర్యావరణ కార్యకర్తగా చెబుతుంటాడు. ఒకరకంగా ఇది ఆధ్యాత్మిక, పర్యావరణ బాధ్యతల మధ్య సామరస్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ మేళా ముగినిస తర్వాత కూడా ఈ అనాజ్ వాలే బాబా సోన్భద్రకు తిరిగి వచ్చి అటవీకరణ, పర్యావరణంతో ఈ పుడమి కళకళలాడేలా ప్రోత్సహించే లక్ష్యాన్ని కొనసాగించాలనుకుంటున్నట్లు తెలిపారు.కాగా, ఈ మహా కుంభమేళాలో సామాజిక పర్యావరణ విలువలను ప్రోత్సహించేలా ఇతర ముఖ్యమైన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. జనవరి 13న మొదలైన ఈ కుంభమేళా, ఫిబ్రబరి 26,2025తో పూర్తవనుంది. గంగా, యమునా, సరస్వతి నదుల సంగమ స్థలమైన ఈ పవిత్ర ప్రదేశంలో సాన్నాలు చేస్తే పాపాలు పోతాయనేది భక్తుల ప్రగాఢ నమ్మకం.(చదవండి: 'ఇంజనీర్ బాబా': ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఫోటోగ్రఫీ వదిలి మరీ..) -
పంటలకు వానలా నీళ్లు!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: కాలువలు, బోరు బావుల పైప్లైన్లు వంటివి సాంప్రదాయ సాగునీటి పద్ధతులు... డ్రిప్లు, స్పింక్లర్లు.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సూక్ష్మ సేద్య విధానాలు.. కానీ ఇందుకు భిన్నంగా పంటలపై వాన కురిసినట్టుగా, అవసరానికి తగినట్టే నీళ్లు అందేలా ‘పివోట్ లీనియర్ ఇరిగేషన్’విధానాన్ని ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు అవలంబిస్తున్నారు. విదేశాల్లో వినియోగిస్తున్న ఈ సాంకేతికతను మన దేశంలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. పరిశోధనల్లో భాగంగా సాగు చేస్తున్న పంటలకు ఈ విధానంలో నీళ్లు అందిస్తున్నారు. మొత్తం పొలమంతా కాకుండా... కావాల్సిన చోట మాత్రమే, అనుకున్న సమయంలో పంటలకు వర్షంలా నీళ్లు అందించగలగడం దీని ప్రత్యేకత.తక్కువ ఎత్తులో పెరిగే పంటలకు..ప్రస్తుతం ఇక్రిశాట్లో వేరుశనగ, శనగ కొత్తవంగడాలపై పరిశోధనల కోసం సాగు చేస్తున్న వ్యవసాయ క్షేత్రాల్లో ఈ‘సెంట్రల్ పివోట్ లీనియర్ ఇరిగేషన్’విధానం ద్వారా నీటిని అందిస్తున్నారు. ఇలా తక్కువ ఎత్తుండేపంటల సాగుకు ఈ విధానంతో ఎంతో ప్రయోజనం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మీటరుకన్నా తక్కువ ఎత్తుతోనే పండే పంటలకు ఎక్కువ మేలు అని పేర్కొంటున్నారు. భారీ విస్తీర్ణంలో పంటలు వేసే భూకమతాలు, ఒకేచోట వందల ఎకరాల్లో ఒకేతరహా పంటలు సాగుచేసే భారీ వ్యవసాయ క్షేత్రాల్లో ఈ విధానాన్ని వినియోగిస్తుంటారని చెబుతున్నారు. యంత్రాలతో కూడిన పద్ధతిలో కేవలం ఒకరిద్దరు వ్యక్తులతోనే వందల ఎకరాలకు సాగునీటిని అందించవచ్చని వివరిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లోని భారీ వ్యవసాయ క్షేత్రాల్లో పివోట్లీనియర్ ఇరిగేషన్ విధానం ఎక్కువగా వినియోగిస్తున్నారని చెబుతున్నారు.ప్రయోజనాలు ఎన్నెన్నో...ఈ విధానంలో పంటలకు సాగునీరు అందించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ విధానంలో విద్యుత్ వినియోగం కూడా తక్కువని, నీటి వృథాను తగ్గిస్తుందని.. తక్కువ నీటి వనరులతో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయవచ్చని వివరించారు. నీటిని పారించే కూలీల అవసరం ఉండదని.. నేల కోతకు గురికావడం వంటి నష్టాలు కూడా ఉండవని వెల్లడించారు. పంటల అవశేషాలు తిరిగి మట్టిలో కలసి కుళ్లిపోవడానికి ఈ విధానం వీలు కలి్పస్తుందని, తద్వారా ఎరువుల వినియోగం తక్కువగా ఉంటుందని వివరించారు.⇒ పొలంలో కొన్ని పదుల నుంచి వందల మీటర్ల వరకు దూరంలో రెండు భారీ రోలర్లు, వాటి మధ్య పైపులతో అనుసంధానం ఉంటుంది. ఆ పైపులకు కింద వేలాడుతున్నట్టుగా సన్నని పైపులు ఉంటాయి. వీటి చివరన నాజిల్స్ ఉంటాయి.⇒ పొలంలోని బోరు/ మోటార్ ద్వారా వచ్చే నీటిని పైపుల ద్వారా రోలర్ల మధ్యలో ఉన్న ప్రధాన పైప్లైన్కు అనుసంధానం చేస్తారు. దీనితో బోరు/మోటార్ నుంచి వచ్చే నీరు.. రెండు రోలర్ల మధ్యలో ఉన్న పైపులు, వాటికి వేలాడే సన్నని పైపుల ద్వారా ప్రయాణిస్తుంది. నాజిల్స్ నుంచి వర్షంలా పంటలపై నీరు కురుస్తుంది.⇒ ఈ రోలర్లు పొలం పొడవునా నిర్దేశించిన వేగంలో ముందుకు, వెనక్కి కదులుతూ ఉంటాయి. ఈ క్రమంలో పంటపై వర్షంలా నీరు పడుతూ ఉంటుంది.⇒ రోలర్లను రిమోట్ ద్వారా నడపవచ్చు. లేదా కంప్యూటర్, సెల్ఫోన్ ద్వారా కూడా ఆపరేట్ చేయవచ్చు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటకు ఎంత పరిమాణంలో నీటిని అందించాలన్నది నియంత్రించవచ్చు.‘పివోట్ లీనియర్ ఇరిగేషన్’విధానం ఇదీ..⇒ కావాలనుకున్న చోట ఎక్కువగా, లేకుంటే తక్కువగా నీటిని వర్షంలా కురిపించవచ్చు. వేర్వేరు పంటలను పక్కపక్కనే సాగు చేస్తున్న చోట ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.⇒ వ్యవసాయ క్షేత్రం విస్తీర్ణాన్ని బట్టి, ఏర్పాటు చేసుకునే పరికరాలను దీనికి అయ్యే ఖర్చు ఆధారపడి ఉంటుందని ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చిన్న, సన్నకారు రైతులు కాకుండా.. సమష్టి వ్యవసాయం చేసేందుకు ఈ విధానం మేలని పేర్కొంటున్నారు. -
రైతు ఖాతాల్లోకి రూ. 530 కోట్ల సన్నాల బోనస్
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ సీజన్లో సన్నాలు పండించిన రైతులకు రూ. 500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన సత్ఫలితాన్నే ఇస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో సన్నధాన్యం పంట గణనీయంగా పెరిగింది. రైతులు తమ తిండి అవసరాల కోసం మిగిల్చుకున్న సన్న ధాన్యం పోను... కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 18.07 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) సన్నాలను విక్రయించారు. సన్నాలు విక్రయించిన రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం ఇప్పటివరకు రూ.530 కోట్లను బోనస్ రూపంలో జమచేసింది.మరో రూ.373 కోట్లను కొద్దిరోజుల్లోనే జమ చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించింది. ఇప్పటివరకు 3,24,338 మంది రైతులు సన్నాలను విక్రయించినట్లు పౌరసరఫరా శాఖ వర్గాలు తెలిపాయి. ఈ రైతులకు క్వింటాలుకు మద్దతు ధర రూ.2,320తోపాటు రూ.500 బోనస్ కలిపి 2,820 ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రబీ (యాసంగి)లో సన్నాల సాగు పెంచేందుకు రైతులు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. వచ్చే సంక్రాంతి వరకు ఖరీఫ్ సీజన్ కొనుగోళ్లు ఉంటాయని భావిస్తున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలకు మరో 2 ఎల్ఎంటీల సన్న ధాన్యం వచ్చే అవకాశం ఉంది. 46 ఎల్ఎంటీల సేకరణ: రాష్ట్రంలో హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో 7,624 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 46,02,099 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. ఇందులో సన్న రకం 18.07 ఎల్ఎంటీ కాగా, దొడ్డు రకం 27.95 ఎల్ఎంటీ. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో కొనుగోళ్ల ప్రక్రియ ముగింపు దశకు చేరుకోగా, ఖమ్మం, మహబూబ్నగర్, వరంగల్, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో ఇంకా కొనుగోళ్లు సాగుతున్నాయి.సంక్రాంతి వరకు మరో 10 ఎల్ఎంటీల వరకు ధాన్యాన్ని సేకరించే అవకాశం ఉన్నట్లు పౌరసరఫరాల సంస్థ అధికారులు అంచనా వేస్తున్నారు. బోనస్తో సంబంధం లేకుండా... ఇప్పటివరకు కొనుగోలు చేసిన 46.02 ఎల్ఎంటీ ధాన్యానికి రూ.10,675.15 కోట్లు చెల్లించాల్సి ఉండగా, రూ.9,890.46 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమచేశారు. ఇంకా రూ.784.69 కోట్లు రైతుల ఖాతాల్లోకి చేరాల్సి ఉంది. అధిక ధరకు విక్రయించిన రైతులు రాష్ట్రంలో ఈసారి అత్యధికంగా కోటీ 50 లక్షల మెట్రిక్ టన్ను ల మేర ధాన్యం దిగుబడి అయినట్లు ప్రభుత్వం చెపుతోంది. 91 ఎల్ఎంటీలు కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేసింది. నాణ్యమైన రకాలకు చెందిన బియ్యాన్ని ఇప్పుడే క్వింటాలుకు రూ. 6వేల వరకు విక్రయిస్తున్నారు. ధాన్యం విక్రయాల్లో ఇప్పటివరకు అత్యధికంగా నిజామాబాద్ జిల్లా నుంచి 4,90,906 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విక్రయించారు.తరువాత స్థానంలో కామారెడ్డి జిల్లాలో 4,36,979 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విక్రయించారు. ఈ రెండు జిల్లాల్లోనే (ఉమ్మడి నిజామాబాద్) ఏకంగా 9.27 ఎల్ఎంటీల ధాన్యం కొనుగోలు చేయడం గమనార్హం. రాష్ట్రంలో కొనుగోలు చేసిన ధాన్యంలో 20 శాతానికి పైగా ఇక్కడి నుంచే కావడం విశేషం. తరువాత స్థానాల్లో ఉమ్మడి నల్లగొండ, కరీంనగర్, మెదక్, వరంగల్ జిల్లాలు ఉన్నాయి. అత్యల్పంగా కేవలం 1951 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే విక్రయించి ఆదిలాబాద్ ఆఖరి స్థానంలో నిలిచింది.ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లు ఇలా...సన్నరకం ధాన్యం: 18.07 ఎల్ఎంటీ దొడ్డు రకం: 27.95 ఎల్ఎంటీ సన్నధాన్యం విక్రయించిన రైతులు: 3,24,338 దొడ్డు రకం విక్రయించిన రైతులు: 5,39,494 మొత్తం ధాన్యం విలువ: రూ. 10,675.15 కోట్లు రైతులకు చెల్లించిన మొత్తం: రూ. 9,890.46 కోట్లు సన్న ధాన్యానికి చెల్లించాల్సిన బోనస్: రూ. 903.63 కోట్లు చెల్లించిన మొత్తం: రూ. 529.99 కోట్లు -
6 జిల్లాల్లో శీతల గాలులు: పంటలను ఇలా రక్షించుకుందాం!
తెలంగాణా రాష్ట్రంలో వచ్చే రెండు రోజు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని, ఉదయపు వేళల్లో దట్టంగా పొగమంచు ఆవరించే అవకాశం ఉందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయ వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డా. పి. లీలారాణి ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వివిధ పంటలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రైతులు ఈ కింది సూచనలు పాటించాలని డా. పి. లీలారాణి సూచించారు.వరి: తెలంగాణా జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాలలో 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. చలి ప్రభావంతో యాసంగి నారుమడుల్లో నారు ఎదగక పోవచ్చు. ఆకులు పసుపు, ఎరుపు రంగుల్లోకి మారవచ్చు. కొన్నిసార్లు నారు చనిపోవచ్చు. అందువల్ల రైతులు కొన్ని రక్షణ చర్యలు చేపట్టాలి. నారుమళ్ళపై ఇనుప చువ్వలు లేదా వెదురు కర్రలతో ఊతమిచ్చి పైన పలుచని పాలిథిన్ షీట్ లేదా ఖాళీ యూరియా బస్తాలతో తయారు చేసిన పట్టాలతో సాయంత్రం పూట కప్పి, మరుసటి రోజు ఉదయాన్నే తీసివేయాలి. రాత్రి వేళల్లో నారుమడిలో నీరు నిండుగా ఉంచి తెల్లవారుజామున తీసివేసి, కొత్త నీరు పెట్టాలి. ∙200 చదరపు మీటరు విస్తీర్ణం గల నారుమడికి ఆఖరి దుక్కిలో 2 క్వింటాళ్లు బాగా చివికిన కోళ్ళు లేదా గొర్రెల ఎరువు వేయాలి. విత్తే సమయంలో 1 కిలో నత్రజని, 1కిలో భాస్వరం, 1 కిలో పొటాషియం ఇచ్చే రసాయనిక ఎరువులు వేయాలి. వరి నారుమళ్ళలో జింక్ ధాతువు లోపం నివారణకు 2 గ్రా. జింక్ సల్ఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.వరుసగా వరి పంట పండించే భూముల్లో ప్రతి మూడు పైర్లకు ఒకసారి లేదా ప్రతి యాసంగిలో దమ్ములో ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్ వేయాలి. చలి వాతావరణం, పొగమంచు వరిని అగ్గి తెగులు ఆశించటానికి అనుకూలం. పొలంలో, పొలంగట్లపైన ఉండే గడ్డి కలుపు మొక్కలు అగ్గి తెగులను వ్యాప్తి చేస్తాయి. కాబట్టి, పొలం గట్లపై కలుపు లేకుండా చూసుకోవాలి. వరి నారుమళ్ళలో అగ్గి తెగులు గమనిస్తే, నివారణకు 0.5 గ్రా. ట్రైసైక్లాజోల్ లేదా 1.5 మి.లీ. ఐసోప్రొథైయోలిన్ లేదా 2.5 మి.లీ. కాసుగామైసిన్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొక్కజొన్న: చలి వల్ల మొక్కజొన్నలో భాస్వరం లోపించి ఆకులు ఊదా రంగులోకి మారుతాయి. భాస్వరం లోప లక్షణాలు గమనించినట్లైతే నివారణకు 10 గ్రా. 19–19–19 లేదా డి.ఎ.పి మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.మిరప : ప్రస్తుత చలి వాతావరణం మిరపను బూడిద తెగులు ఆశించటానికి అనుకూలం. నివారణకు, 3గ్రా. నీటిలో కరిగే గంధకం లేదా 1 మి.లీ. అజాక్సిస్ట్రోబిన్ లేదా 2.5గ్రా. టేబుకొనజోల్ + గంధకం లేదా 1.5గ్రా. కార్బండజిమ్ + మాంకోజేబ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.మామిడి: ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మామిడిలో తేనెమంచు పురుగు, బూడిద తెగులు ఆశించటానికి అనుకూలం. నివారణకు, 0.3గ్రా. డైనోటేఫురాన్ + 1గ్రా. కార్బండజిమ్ + 2.5 మి.లీ. వేపనూనె లేదా 0.5 గ్రా. థయోమిథాక్సామ్ + 2 మి.లీ. హెక్సాకొనజోల్ + 2.5 మి.లి వేప నూనె మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కుసుమ: నవంబర్లో విత్తుకున్న కుసుమ పంటకు పేనుబంక ఆశించే అవకాశం ఉంది. నివారణకు 2 మి.లీ. డైమిథోయెట్ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. -
నేలలపై శ్రద్ధ పెట్టాలి!
2024 అంతర్జాతీయ భూముల దినోత్సవం (డిసెంబర్ 5) సందర్భంగా ‘మట్టి గణాంకాల సేకరణ, పర్యవేక్షణ, నిర్వహణ’పై దృష్టిని కేంద్రీకరించాలని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) ప్రపంచ దేశాల ప్రభుత్వాలకు పిలుపునిచ్చింది.‘మన కాళ్ల కింద ఉన్న నేల ఒక జీవవ్యవస్థ. అనేక జాతుల మనోహరమైన మొక్కలు, జంతుజాలానికి నిలయం. మనకు పోషకాహారంతో పాటు స్వచ్ఛమైన నీరు, జీవవైవిధ్యాన్ని అందిస్తున్న నేలలపై శ్రద్ధ పెట్టి పరిరక్షించుకోవటానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాల’ని ప్రముఖ నేలల నిపుణుడు డాక్టర్ వి. రామ్మూర్తి సూచించారు. బెంగళూరులోని నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ లాండ్ యూజ్ ప్లానింగ్ (ఐసిఎఆర్ అనుబంధం)ప్రాంతీయ కార్యాలయం అధిపతిగా ప్రధాన శాస్త్రవేత్త (వ్యవసాయం)గా ఆయన వ్యవహరిస్తున్నారు.దక్షిణాది రాష్ట్రాల్లో నేలల బాగోగులపై అధ్యయనం చేసి, విధాన నిర్ణేతలకు తగు సూచనలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోని అనేక మండలాల్లో నేలల స్థితిగతులపై తమ సంస్థ జరిపిన అధ్యయనంలో వెల్లడైన విషయాలను ఆయన ‘సాక్షి సాగుబడి’కి వెల్లడించారు. 2 రాష్ట్రాల్లో నేలలపై అధ్యయనంతెలంగాణలోని గజ్వేల్, ఇంద్రవెల్లి, మహబూబ్నగర్ రూరల్ మండలాల్లో.. ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ జిల్లా రాయచోటి, తొండూరు మండలాల్లో, అనంతపురం జిల్లా కదిరి, ఓబుల దేవర చెరువు(ఓడిసి) మండలాల్లోని నేలల స్థితిగతులపై నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ లాండ్ యూజ్ ప్లానింగ్ తరఫున అధ్యయనం చేశామని డా. రామ్మూర్తి తెలిపారు. భూమి స్థితిగతులను తెలుసుకోవడానికి అది ఏ రకం భూమి? మట్టి ఎంత లోతుంది? వంటి వివరాలతో పాటు భూసారాన్ని అంచనా వేయటానికి సేంద్రియ కర్బనం ఆయా నేలల్లో ఎంత శాతం ఉందో మట్టి పరీక్షల ద్వారా నిర్థారణ చేస్తారు. సేంద్రియ కర్బనాన్ని మూడు స్థాయిల్లో (తక్కువ – 0.50% లోపు, మధ్యస్థం – 0.50–0.75% మధ్య, అధికం – 0.75% కన్నా ఎక్కువ) లెక్కిస్తారు. సేంద్రియ కర్బనం తెలంగాణ నేలలతో పోల్చితే రాయలసీమ నేలల్లో తక్కువగా ఉందని డా. రామ్మూర్తి అన్నారు. ఈ తేడాలకు కారణం ప్రకృతి వైపరీత్యాలు, వర్షపాతం, సాగు పద్ధతి కారణాలని తెలిపారు. మహబూబ్నగర్ రూరల్ మండలంలోని పరీక్షలు నిర్వహించిన సాగు భూముల్లో 100% నేలల్లో సేంద్రియ కర్బన శాతం అధికంగా (అంటే.. 0.75% కన్నా ఎక్కువగా) ఉండటం విశేషం. అనంతపురం జిల్లా ఇనగలూరు పంచాయతీలోని 46.29% సాగు భూముల్లో సేంద్రియ కర్బనం తక్కువగా, 35.26% భూముల్లో మధ్యస్థంగా, 18.45% భూముల్లో అధికంగా ఉందని వెల్లడైందన్నారు (పూర్తి వివరాలు పట్టికలో). వరి, పత్తి, మిర్చికి రసాయనాల వాడకం ఎక్కువవరి, పత్తి, మిర్చి పంటలకు రసాయనిక ఎరువులు మరీ ఎక్కువగా వేస్తున్నారు. ఎంత అవసరమో గమనించకుండా పక్క రైతును చూసి వేస్తున్నారు. పురుగుమందుల పిచికారీ కూడా అంతే. పశువుల ఎరువు, పచ్చిరొట్ట ఎరువులను చాలా మంది రైతులు వాడటం లేదు. అదే పంటను ప్రతి ఏటా సాగు చేస్తున్నారు. అందుకే సేంద్రియ కర్బనం అడుగంటుతోందని డా. రామ్మూర్తి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, రైతులు ఇప్పటికైనా జాగ్రత్తపడి సేంద్రియ కర్బనాన్ని అన్ని సాగు భూముల్లోనూ 0.7 శాతానికి పెంచుకోకపోతే భూములు సాగు యోగ్యం కాకుండా పోతాయని హెచ్చరిస్తున్నారాయన.΄పొటెన్షియల్ క్రాప్ జోన్లు ఆయా భూముల స్వభావం, భూసార పరిస్థితులు, ఆప్రాంత వాతావరణం, వర్షపాతం, అక్కడి ప్రజల ఆసక్తి, మార్కెట్ స్థితిగతులపై 20 ఏళ్ల క్రితం నాటి నుంచి సమాచారం సేకరించి విశ్లేషించామని డా. రామ్మూర్తి చెప్పారు. ఈ సమాచారంతో శాస్త్రీయంగా ΄పొటెన్షియల్ క్రాప్ జోన్స్ నివేదికలు ఇస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్లో పత్తి, వరి, జొన్న, వేరుశనగ పంటలకు ఏయే జిల్లాలో ఎన్ని హెక్టార్ల భూమిలో ‘చాలా బాగా, ఒక మాదిరిగా, కొంతమేరకు’ ఆయా పంటల సాగుకు అనువుగా ఉన్నాయో చెప్పామన్నారు.అన్ని మండలాల్లో మట్టిని అధ్యయనం చేయాలిభూమిపై మన జీవితం ఆరోగ్యకరమైన నేలలపై ఆధారపడి ఉంటుంది. మన పాదాల కింద ఉన్న నేల ఒక జీవవ్యవస్థ. అనేక మనోహరమైన మొక్కలు, చెట్లు, జంతువులకు నిలయం. మట్టి మనకు పోషకాహారాన్ని, స్వచ్ఛమైన నీటిని, జీవవైవిధ్యాన్ని అందిస్తుంది. ప్రతి జిల్లాలో అన్ని మండలాల్లోని ΄పొలాల్లో మట్టి పరీక్షలు చేసి, అధ్యయనం చేయాలి. మన మట్టిలో వుండే పోషకాలు ఏమిటి? మట్టిలోని జీవరాశి ఏమేమి ఉన్నాయి? ఏమేమి లేవు? కాలక్రమంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి? సాగు భూములు బాగుండాలంటే వాటిని ఎలా నిర్వహించుకోవాలి? అనే విషయాలపై పాలకులు శ్రద్ధ చూపాలి.ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ్రపోత్సాహమిస్తే మట్టి ఎలా ఉందో పరీక్షించి ఎక్కువగా ఎరువులు వేయకుండా నివారించటంతో పాటు పంటల మార్పిడి,‡మట్టిని పంటలతో కప్పి ఉంచటం వంటి భూసంరక్షణ పద్ధతులపై రైతులకు చైతన్యం కలిగిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సుసంపన్న సాంస్కృతిక జీవనానికి, ఆరోగ్యకరమైన జీవనానికి కూడా మట్టి మూలాధారం. మట్టి ద్వారానే 95% ఆహారం మనకు వస్తోంది. ఇందులో 18 సూక్ష్మ,స్థూల పోషకాంశాలు ఉంటాయి. వీటిలో 15 పోషకాంశాలను నేల నుంచి మిగతా మూడిటిని వాతావరణం నుంచి మనం ΄పొందుతున్నాం. ఈ స్పృహతో సాగు నేలల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి. – డాక్టర్ వి. రామ్మూర్తి (94803 15146), అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త (వ్యవసాయం),్ర పాంతీయ కార్యాలయం, ఐసిఎఆర్– నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ లాండ్ యూజ్ ప్లానింగ్, బెంగళూరుఅవును..! మీరు చదివింది, ఈ ఫొటోలో చూస్తోంది.. నిజమే! మన పుచ్చ తోటల్లో పాదులు నేలపై పరచుకొని ఉంటాయి. పుచ్చ కాయలు నేలపైనే పెరుగుతాయి కదా. సౌతాఫ్రికాలో ఒక కంపెనీ పాలీహౌస్లలో పుచ్చ పాదులు నిలువుగా ఎగబాగుకుతున్నాయి. పుచ్చ కాయలు వాటికి వేలాడుతున్నాయి. ట్రెల్లిస్ పద్ధతిలో పెరిగే టొమాటోల మాదిరిగా ఈ పుచ్చకాయలు వేలాడుతున్నాయి కదూ.. కాండీ బాల్ సీడ్లెస్ పుచ్చకాయలు కిలో నుంచి కిలోన్నర వరకు బరువు పెరుగుతాయి. అదేమాదిరిగా కిలో బరువు పెరిగే స్మైల్ మెలన్స్ (ఇదో రకం కర్బూజ) పండ్లను కూడా నిలువు తోటల్లో పెంచుతున్నారు. టొమాటోలు వంటి కాయలు బరువు తక్కువగా ఉంటాయి కాబట్టి తీగజాతి మొక్కలు మొయ్యగలుగుతాయి.అయితే, ఇలాంటి నిలువు తోటలో పుచ్చకాయలు, కర్బూజ కాయల బరువు మొక్కలకు భారం కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లాస్టిక్ నెట్ కవర్లతో కాయలను ప్లాస్టిక్ వైర్లకు కట్టేస్తున్నారు. ‘నిలువు తోటలో పెరిగిన పుచ్చకాయలను మేం త్వరలోనే అమ్మకానికి పెట్టబోతున్నాం. సౌతాఫ్రికా మార్కెట్లో మేమే ఫస్ట్’ అంటున్నారు ఆ కంపెనీ ప్రతినిధి ఫ్రాంకోయిస్ ఫౌరీ. పాలీహౌస్లు, నెట్హౌస్లలో, మేడపై ఇంటిపంటల్లో ట్రెల్లిస్ పుచ్చ, కర్బూజ సాగు సాధ్యమే అని గ్రహించాలి!12 నుంచి విశాఖ ఆర్గానిక్ మేళాగో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, ఏపీ రైతు సాధికార సంస్థ, ప్రకృతి వ్యవసాయదారుల సేవాల సంఘం సంయుక్తంగా డిసెంబర్ 12 నుంచి 15వ తేదీ వరకు విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 5వ విశాఖ ఆర్గానిక్ మేళా నిర్వహించనున్నాయి. రైతులు, ప్రకృతి/ సేంద్రియ వ్యవసాయదారులు, ఆహారోత్పత్తుల ఉత్పత్తిదారుల, వినియోగదారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. 12న ఉ. 10 గంటలకుప్రారంభోత్సవంతో పాటు సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారుల సమ్మేళనం ఉంటుంది. 13న ఉ. 10 గం.కు ఆరోగ్య అవగాహన సదస్సు, 14న ఆహారప్రాసెసింగ్పై సదస్సు, 15 సేంద్రియ ఇంటిపంటలు/ మిద్దె తోటల సదస్సు, ముగింపు సమావేశం జరుగుతాయి. అందరూ ఆహ్వానితులే. ఇతర వివరాలకు.. 78934 56163, 91001 86522. -
నిర్మల్ పల్లెల్లో ‘ఇథనాల్’ మంట
నిర్మల్/దిలావర్పూర్: తమ పచ్చని పంటపొలాల్లో ఇథనాల్ చిచ్చు పెట్టొద్దంటూ నిర్మల్ జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు కొన్ని నెలలుగా చేపడుతున్న నిరసన మంగళవారం తీవ్రరూపు దాల్చింది. దిలావర్పూర్ మండలంలోని దిలావర్పూర్–గుండంపల్లి గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే తొలగించాలన్న తమ డిమాండ్ను అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఆయా గ్రామాల ప్రజల సహనం నశించింది. బంద్ పాటించడంతోపాటు దిలావర్పూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద 61వ నంబర్ జాతీయ రహదారిపై ఒక్కసారిగా వందలాది మంది నిరసనకారులు రాస్తారోకోకు దిగారు. నిర్మల్–భైంసా మార్గంలో దాదాపు 12 గంటలపాటు రోడ్డుపై బైఠాయించారు. దీంతో హైవేపై కొన్ని గంటలపాటు తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి.ఆర్డీవో నచ్చజెప్పినా..: నిరసనకారులు రోడ్డుపైనే మధ్యాహ్నం, రాత్రి వంటావార్పు చేసుకోవడంతోపాటు సాయంత్రం నుంచి అక్కడే చలిమంటలు వేసుకున్నారు. వారికి నచ్చజెప్పేందుకు మధ్యాహ్నం 3 గంటల వేళ నిర్మల్ ఆర్డీవో రత్నకల్యాణి రాగా ఆమెను నిరసనకారులు అడ్డుకున్నారు. 20 మంది గ్రామస్తులను కలెక్టరేట్కు తీసుకెళ్లి కలెక్టర్తో మాట్లాడిస్తానని చెప్పినా వారు ససేమిరా అన్నారు. గతంలో తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. అందుకే కలెక్టరే తమ వద్దకు రావాలంటూ ఆమెను ఘెరావ్ చేశారు. దీంతో ఆమె రాత్రి 9:30 గంటల వరకు వాహనంలోనే కూర్చుండి పోయారు. చివరకు జిల్లా ఎస్పీ జానకీ షర్మిల స్వయంగా రోప్పార్టీ పోలీసులతో వచ్చి అడ్డుగా కూర్చున్న మహిళలను బలవంతంగా పక్కకు తప్పించి ఆర్డీఓను వాహనంలో నుంచి బయటకు తీసుకొచ్చారు. దీంతో కోపోద్రిక్తులైన నిరసనకారులు ఆర్డీవో వాహనాన్ని బోల్తా పడేసి దానిపై చలిమంటల్లోని కర్రలను విసిరేశారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో లక్ష్మణచాంద మండల ఎస్సై సుమలత గాయపడ్డారు. మరోవైపు కొన్ని గంటలపాటు వాహనంలో కూర్చుండిపోయిన ఆర్డీఓ సైతం అనారోగ్యానికి గురైనట్లు తెలిసింది.చేతిలో ప్లకార్డులు, పురుగుమందు డబ్బాలుమాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి ‘కనబడుట లేదు..’ అంటూ వారి ఫొటోలతో కూడిన ప్లకార్డులను నిరసనకారులు ప్రదర్శించారు. అలాగే కొందరు మహిళలు పురుగుల మందు డబ్బాలు తీసుకొచ్చి ఇప్పటికైనా ఫ్యాక్టరీని తీసేయకపోతే తమకు అవే దిక్కంటూ చూపించారు.300 మంది పోలీసుల మోహరింపు..నిరసనకారులు బంద్తోపాటు ఆందోళన చేయొచ్చన్న సమాచారంతో నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దకు మంగళవారం వేకువ జామునే నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డితోపాటు జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, దాదాపు 300 మంది పోలీసు బలగాలను పంపించారు. రోజంతా రాస్తారోకో చేస్తున్నంత సేపు శాంతియుతంగానే ఉండాలని, ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తమ సిబ్బందిని ఆదేశించారు. రాత్రిపూట ఆందోళనకారులను అడ్డుకునేందుకు నిజామాబాద్ జిల్లా నుంచీ బలగాలను రప్పించారు.సీఎంవోకు నివేదిక పంపాం: కలెక్టర్నిర్మల్ చైన్గేట్: ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ఆందోళనపై ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక పంపినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ ఓ ప్రకటనలో తెలిపారు. వారి ఆవేదనను సీఎంవోకు నివేదించినట్లు వివరించారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు.ఆది నుంచి వద్దంటూనే..దిలావర్పూర్–గుండపల్లి గ్రామాల మధ్య శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్వాటర్కు సమీపంలో దాదాపు 40ఎకరాల్లో పీఎంకే గ్రూప్ ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ప్రహరీతోపాటు దాదాపు నిర్మాణాలన్నీ పూర్తయ్యాయి. రూ. వందల కోట్ల పెట్టుబడితో పెడుతున్న తమ ఫ్యాక్టరీ జీరో పొల్యూషన్తో కూడినదని నిర్వాహకులు చెబుతున్నారు. కానీ సమీపంలోని దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాలు తొలి నుంచీ ఈ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. గతేడాది సైతం ఈ గ్రామాలు చేపట్టిన పరిశ్రమ ముట్టడి ఉద్రిక్తంగా సాగింది. రైతులపై పోలీసులు లాఠీచార్జి చేసే వరకూ పరిస్థితి వెళ్లింది. నాటి నుంచి ఆయా గ్రామస్తులు దీక్షలు, నిరసనలు కొనసాగిస్తున్నారు. తాజాగా దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాలతో పాటు సమీపంలోని సముందర్పల్లి, కాండ్లి, టెంబరేణి, లోలం గ్రామాలూ ఆందోళనలో భాగమయ్యాయి. -
రైతు లాభాలకు పంట మార్పిడి ఊతం!
వ్యవసాయం ఆశల జూదమంటారు. సకాలంలో వానలు కురవకపోవడం మొదలుకొని వాతావరణ మార్పులు, నకిలీ విత్తనాలు, ఎరువుల కొరత.. ఇలా రకరకాల కారణాలు రైతును దెబ్బతీయవచ్చు. అయితే ఇవేవీ రైతు నియంత్రణలో ఉన్న అంశాలు కావు. కానీ.. రైతులు తమ చేతుల్లో ఉన్నవీ సక్రమంగా చేసుకోకపోవడంతో కూడా నష్టపోతున్నాడని అంటున్నారు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ జి.పద్మజ. పైగా ఈ విషయం గురించి తెలియని వారు ఉండరని, ఆచరణలో పెట్టకపోవడం వల్ల రైతులు కనీసం 25 శాతం పంట దిగుబడిని నష్టపోతున్నాడని చెబుతున్నారు. ఏంటా విషయం. దిగుబడి నాలుగో వంతు పెరిగే మార్గమేది? ఒక్క ముక్కలో చెప్పాలంటే... పంట మార్పిడి!అంతేనా అని అనుకోకండి.. రైతు ఆదాయాన్ని పెంచుకునేందుకు పంట మార్పిడి అద్భుతమైన సాధనం. పైగా రసాయనిక ఎరువుల ధాటికి నానాటికీ తీసికట్టుగా మారుతున్న నేల సారానికి టానిక్గానూ పనిచేస్తుంది ఇది. దురదృష్టం ఏమిటంటే.. ఇన్ని లాభాలు ఉన్నప్పటికీ మన మన రైతన్నలు పంట మార్పిడిని సీరియస్గా తీసుకోవడం లేదని అంటున్నారు డాక్టర్ జి.పద్మజ. ఈ నేపథ్యంలో అసలు పంట మార్పిడి వల్ల కలిగే లాభాలను ఇంకోసారి తరచి చూద్దాం...భూసారం, దిగుబడులు పెరుగుతాయి..వరి, మొక్కజొన్న, పత్తి వంటి వాణిజ్య పంటలు మట్టిలోని పోషకాలను తగ్గిస్తూంటాయి. దీనివల్ల ఏటికేడాదీ దిగుబడి కూడా తగ్గుతూంటుంది. అయితే.. పంటలను మార్చి మార్చి వేసుకోవడం అది కూడా మట్టిలో నత్రజనిని చేర్చగల వాటిని వేసుకోవడం ద్వారా పోషకాలను మళ్లీ భర్తీ చేసుకోవచ్చు. తద్వారా నేల సారం పెరుగుతుంది. దిగుబడులు కూడా ఎక్కువవుతాయి. ఉదాహరణకు.. వేరుశనగ, పప్పుధాన్యాల పంటలు మట్టిలో నత్రజనిని పెంచుతాయి. ఫలితంగా వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు నేల నుంచే తగినంత నత్రజని అందుతుంది. కృత్రిమంగా అందించాల్సిన అవసరం తగ్గుతుంది కూడా. పంట మార్పిడి చేసుకోవడం వల్ల దిగుబడి సుమారు 25 శాతం వరకూ పెరుగుతుందని పరిశోధనలు చెబుతూండగా.. వరి, మొక్కజొన్న, కాయధాన్యాల విషయంలో ఈ పెరుగుదల 20 శాతమని ఇప్పటికే స్పష్టమైంది. మార్పిడులు ఇలా...వరి వేసిన తరువాత మినుములు లేదా నువ్వుల్లాంటి నూనెగింజల సాగు చేయడం మేలు. దీనివల్ల నేలలో నత్రజని మోతాదు పెరగడమే కాకుండా.. చీడపీడల బెడద కూడా తగ్గుతుంది. మొక్కజొన్న పంటను వేరుశనగ లేదా కాయగూర పంటలతో మార్పిడి చేసుకోవడం మేలు. ఒకవేళ ప్రధాన పంటగా వేరు శనగ వేస్తూంటే.. తరువాతి పంటగా మొక్కజొన్న వేసుకోవచ్చు. ఇది నేలలో సేంద్రీయ పదార్థం మోతాదులను కూడా పెంచుతుంది. పత్తి పంటకు మార్పిడిగా పెసలు వేస్తే చీడపీడల బెడద తగ్గుతుంది. నేలలో నత్రజని మోతాదు ఎక్కువ అవుతుంది. ప్రధాన పంటల సాగు తరువాత కాయధాన్యాలను సాగు చేయడం.. వ్యర్థాలను మళ్లీ నేలలో కలిపేస్తే మేలు కలిగించే సూక్ష్మజీవులు కూడా ఎక్కువవుతాయి. వేర్వేరు పంటల సాగు వల్ల రైతు ఆదాయమూ పెరుగుతుంది. రైతుకు ఎంతవరకూ లాభం...?పంట మార్పిడిని తగు విధంగా అమలు చేస్తే రైతు ఆదాయం 15 నుంచి 20 శాతం ఎక్కువ అవుతుంది. ఒక సంవత్సరంలో వేర్వేరు పంటలు సాగు చేస్తారు కాబట్టి మార్కెట్ రిస్క్ తక్కువ అవుతుంది. పైగా ఎక్కువ డిమాండ్ ఉన్న, ఆదాయం అందించే కూరగాయల్లాంటివి సాగు చేసుకునే వీలేర్పడుతుంది. పైగా పంట మార్పిడి వల్ల నేలలో నత్రజని మోతాదు ఎక్కువై ఇన్పుట్ ఖర్చులు 10 - 15 శాతం వరకూ తగ్గుతాయి. అంటే రసాయన ఎరువులు, క్రిమి, కీటకనాశినుల వాడకం తగ్గుతుందని అర్థం. పంటలు మార్చి మార్చి సాగు చేయడం వల్ల చీడపీడలకు అవకాశాలూ తగ్గుతాయి. ఒకే రకమైన పంట సాగు చేస్తూంటే చీడపీడలు కూడా వాటికి అలవాటు పడిపోతాయి కాబట్టి సమస్య ఎక్కువవుతుంది. ఉదాహరణకు వరికి సోకే కాండం తొలుచు పురుగు కాయధాన్యాల మొక్కలపై జీవించలేదు. వరి తరువాత ఈ కాయధాన్యాల సాగు చేస్తే సహజసిద్ధంగా చీడపీడల సమస్య తగ్గిపోతుంది. దేశంలో వ్యవసాయంపైనే ఆధారపడిన అరవైశాతం గ్రామీణుల జీవనోపాధి అవకాశాలను పెంచేందుకు, ఆహార భద్రతకు పంట మార్పిడి అన్నది ఎంతో ఉపయోగపడుతుంది. భూసారం, దిగుబడులు పెంచే పంటమార్పిడి గ్రామీణ స్థాయిలో ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమయ్యేందుకు తద్వారా ఉపాధి అవకాశాలను పెంచేందుకు కారణమవుతుంది. ఆసక్తి లేదు ఎందుకు?తెలుగు రాష్ట్రాల్లో రైతులు పంటమార్పిడిపై అంతగా ఆసక్తి చూపకపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. మొదటిది పంట మార్పిడి వల్ల వచ్చే ప్రయోజనాలపై అవగాహన లేకపోవడమైతే.. రెండోది పంట మార్పిడి ప్రయోజనాలపై తగిన ప్రచారం లేకపోవడం. వ్యవసాయ, హార్టికల్చర్ విస్తరణాధికారులు ఇతర బాధ్యతలు నిర్వర్తించరావడం వల్ల వారు రైతులకు పూర్తిగా అందుబాటులో లేకుండా పోయారు. ఇక మూడో కారణం మార్కెట్, ఆర్థిక పరిమితులు. పంటల మార్పిడి వల్ల వేర్వేరు పంటల విత్తనాలు, ఎరువులు, కొన్నిసార్లు వ్యవసాయ పరికరాల అవసరమూ ఏర్పడుతుంది. ఇవి రైతులపై కొంత ఆర్థిక భారం మోపే అవకాశం ఉంటుంది. పైగా అన్ని రకాల పంటలకు మద్దతు ధర లభించని నేపథ్యంలో రైతులు పంట మార్పిడిపై ఆసక్తి చూపడం లేదు. చివరగా.. ఒకే రకమైన పంటలు వేయడం (మోనోక్రాపింగ్) అనే సంప్రదాయానికి రైతులు గుడ్ బై చెప్పాలి. రిస్క్ తక్కువన్న అంచనాతో అప్పటివరకూ ఇతరులు పాటిస్తున్న పద్ధతులను గుడ్డిగా అనుసరించడం వల్ల పంట మార్పిడికి ధైర్యం చేయలేకపోతున్నారు. గ్రామస్థులంతా మూకుమ్మడిగా పంట మార్పిడి తీర్మానం చేసుకుని ఆచరిస్తే బహుళ ప్రయోజనాలు కలుగుతాయి.చేయాల్సింది ఇది...రైతులందరూ పంట మార్పిడిని యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరమెంతైనా ఉంది. అలాగే పైలెట్ ప్రోగ్రామ్తోపాటు డెమాన్స్ట్రేషన్ల ద్వారా వ్యవసాయ అధికారులు పంట మార్పిడి లాభాలు రైతుకు అర్థమయ్యేలా వివరించాలి. సీజన్ను బట్టి మారిపోయే పంటలకు తగ్గట్టుగా నాణ్యమైన విత్తనాలు రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. కాయధాన్యాలు, పప్పుధాన్యాలతోపాటు నూనెగింజల పంటల విత్తనాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అంతేకాకుండా.. మద్దతు ధరలు దక్కేలా చూడటం. మార్కెట్ ఒడిదుడుకులను వీలైనంత మేరకు తగ్గించడం ద్వారా రైతులు పంట మార్పిడిపై ఆసక్తి చూపేలా చేయాలి. చివరగా..విధానపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా పంటల మార్పిడి అనేది దేశంలో లక్షలాది రైతు కుటుంబాల ఆదాయాన్ని పెంచే, ఆహార భద్రత కల్పించే సాధనంగా మారుతుంది!తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం...తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో వరి, మొక్కజొన్న, వేరుశనగ, పత్తి పంటల సాగు ఎక్కువ. ఒక్క తెలంగాణలోనే సుమారు 65 లక్షల ఎకరాల్లో వరి పండిస్తూండగా వార్షిక దిగుబడి కోటీ అరవై లక్షల టన్నుల వరకూ ఉంది. అలాగే తెలంగాణలో మొక్కజొన్న సాగు 28 లక్షల ఎకరాల్లోనూ, వేరుశనగ దాదాపు అరవై వేల ఎకరాల్లోనూ సాగులో ఉంది. రైతులందరూ పంట మార్పిడి చేపట్టడం ద్వారా దిగుబడులు పెరగడంతోపాటు సాగునీటిపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. -
వంటింటి వ్యర్థాలతో ఇంట్లోనే కంపోస్ట్ ఎరువు తయారీ ఎలా?
వంట గదిలో కూరగాయలు, పండ్ల తొక్కలు, వ్యర్థాల నుండి ఇంట్లోనే తయారు చేసుకోగలిగే కంపోస్ట్ ఎరువు ఇంటిపంట మొక్కలకు సులభంగా, త్వరగా పోషకాలను అందిస్తుంది. అంతేకాదు, ఇది అద్భుతమైన ఎరువు కూడా.మూత ఉండే డస్ట్ బిన్కు చుట్టూ బెజ్జాలు పెట్టి గాలి పారాడేలా (ఎరేటెడ్ బిన్) చేస్తే చాలు. అందులో వంటగది వ్యర్థాలను ప్రతి రోజూ వేస్తూ ఉండాలి. వారానికోసారి ఆ చెత్తపైన కాస్త మట్టిని చల్లి, కదిలియ తిప్పండి. తడి వ్యర్థాలతోపాటు కొన్ని ఎండిన ఆకులు లేదా చిత్రిక పట్టిన చెక్క వ్యర్థాలు వంటివి కూడా కలపాలి. తడి, పొడి చెత్త కలిపి వేయాలి. కొంచెం శ్రద్ధ, తగుమాత్రం తేమ ఉండేలా చూసుకుంటూ ఉంటే వాసన, పురుగులు రాకుండా చూసుకోవచ్చు. గాలి తగులుతూ ఉండే బిన్లో చేసిన కం΄ోస్టు కాబట్టి దీన్ని ఏరోబిక్ హోమ్ కంపోస్టు అంటున్నాం. వంటింటి వ్యర్థాలను, ఎండు ఆకులను మున్సిపాలిటీ వాళ్లకు ఇవ్వకుండా.. వాటితో ఇంటి దగ్గరే మనం తయారు చేసే కం΄ోస్టు వల్ల భూగోళాన్ని వేడెక్కించే కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. ప్రతి కిలో కం΄ోస్టుకు 3.8 కిలోల ఉద్గారాల విడుదలను నిరోధించిన వాళ్లం అవుతాం. ఈ పని మన భూమికి మంచిది!ఇదీ చదవండి: హెల్దీ సంచోక్స్ : లాభాలు అన్నీ ఇన్నీ కావు! -
ఆరు పంటలకు ‘మద్దతు’
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రైతన్నలకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర సర్కారు తీపి కబురు అందించింది. 2025–26 మార్కెటింగ్ సీజన్కు గాను ఆరు పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) పెంచుతూ కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ఉద్యోగులకు కరువు భత్యాన్ని(డీఏ) మరో 3 శాతం పెంచింది. దీంతో మొత్తం డీఏ 53 శాతానికి చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాలపై కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమైంది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. గోధుమలు, ఆవాలు, మైసూరు పప్పు, శనగలు, పొద్దుతిరుగుడు గింజలు, బార్లీ పంటలకు మద్దతు ధర పెంచినట్లు తెలిపారు. రబీ పంట సీజన్కు సంబం«ధించి నాన్–యూరియా ఎరువులకు రూ.24,475 కోట్ల రాయితీ ఇస్తున్నట్లు వివరించారు. రైతుల ఆదాయం పెంచడమే ధ్యేయంగా ‘పీఎం అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్’కు రూ.35 వేల కోట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు వివరించారు. పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు త్వరలో జరగబోయే పలు రాష్ట్రాల అసెబ్లీ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. నరేంద్ర మోదీ పాలనలో రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయని చెప్పారు. మోదీ ప్రభుత్వం పట్ల రైతన్నలు సానుకూలంగా ఉన్నారని వివరించారు. రూ.2,642 కోట్లతో చేపట్టనున్న వారణాసి–పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ(డీడీయూ) మల్టీ–ట్రాకింగ్ పాజెక్టుకు కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఈ ప్రాజెక్టులో భాగంగా వారణాసిలో గంగా నదిపై రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి నిర్మించనున్నట్లు తెలిపారు. రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ఆరు రకాల రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్టు చేశారు. కనీస మద్దతు ధర పెంచినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. రైతాంగం సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు దీపావళి కానుక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. వారికి కరువు భత్యం 3 శాతం పెంచుతూ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ పెంపు ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందన్నారు. దీనికారణంగా కేంద్ర ఖజానాపై రూ.9,448 కోట్ల భారం పడనుందని వెల్లడించారు. డీఏ పెంపుతో దాదాపు కోటి మందికిపైగా ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం పొందుతారని చెప్పారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో డీఏ 4 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వచి్చంది. ప్రస్తుతం దేశంలో 49.18 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 64.89 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. -
జన్యు మార్పిడి పంటలతో ప్రజారోగ్యానికి ముప్పు
సాక్షి, హైదరాబాద్: జన్యు మార్పిడి పంటల మూలంగా ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి ప్రమాదం వాటిల్లుతుందని దక్షిణాది రాష్ట్రాల రైతు సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ చైర్మన్ సుంకేట అన్వే‹Ùరెడ్డి అధ్యక్షతన జన్యు మార్పిడి పంటలపై దక్షిణాది రాష్ట్రాల రైతు సంఘం నాయకులతో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ జాతీయ నాయకులు కోదండరెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు, రైతు స్వరాజ వేదిక సంఘం ప్రతినిధులు కవిత, కె.రవి, తమిళనాడు రైతు సంఘం ప్రతినిధులు పీఎన్ పాండ్యన్, సుందర విమల నందన్, కర్ణాటక రైతు సంఘం ప్రతినిధి బాలకృష్ణన్, కేరళ రైతు సంఘం ప్రతినిధులు కేవీ బిజు, ఉష, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రతినిధి శ్రీనివాస్రెడ్డి, తెలంగాణ రైతు సంఘం నాయకులు సాగర్, భారతీయ కిసాన్ సంఘం ప్రతినిధి శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాదాపు 40 రైతు సంఘాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.మన ఆహారం, వ్యవసాయంలో జన్యు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించవద్దని వారు కోరారు. ప్రజలందరితో, వివిధ వర్గాలతో, ప్రత్యేకంగా రైతులు, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి జన్యుమార్పిడి పంటలపై జాతీయ విధానాన్ని రూపొందించాలని భారత ప్రభుత్వానికి ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన దరిమిలా ఈ సదస్సు జరిగింది.ఈ జన్యు మార్పిడి విత్తనాల వలన రైతు విత్తన స్వాతంత్రం కోల్పోవడంతో పాటు విత్తనం కార్పొరేట్ రంగాల చేతుల్లోకి వెళ్తుందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై దేశవ్యాప్తంగా రైతులతోపాటు వినియోగదారులను సైతం కలుపుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి జన్యు మార్పిడి పంటల ఆలోచన విధానానికి స్వస్తి పలికేలా ముందుకు సాగుతామని నిర్ణయించారు. స్వావలంబన, ఆరి్థక నష్టాలు, రైతుల పైన భారం, పర్యావరణ విధ్వంసం కలిగించే జన్యుమార్పిడి పంటలను అనుమతించబోమని ఏకగ్రీవంగా తీర్మానించారు. -
చపాటా మిర్చికి త్వరలో జీఐ ట్యాగ్!
సాక్షి, సిద్దిపేట: ఒక ప్రాంతంలో పండించే పంటలకు, ఉత్పత్తులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) లభిస్తే అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం లభిస్తుంది. రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పటివరకు రాష్ట్రానికి చెందిన 17 రకాల ఉత్పత్తులు జీఐ గుర్తింపు పొందాయి. మరిన్ని ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ కోసం కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం కసరత్తు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో త్వరలో వరంగల్ చపాటా మిర్చికి జీఐ గుర్తింపు లభించే అవకాశం ఉంది. వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూగెం, సూర్యాపేట తదితర ప్రాంతాల్లో చపాటా మిర్చిని పండిస్తున్నారు.సుమారు 7 వేల ఎకరాల్లో దీని సాగు జరుగుతోంది. పంటను వరంగల్, ఖమ్మం, గుజరాత్, ముంబై, ఆహ్మదాబాద్ మార్కెట్లకు తరలించి అక్కడి నుంచి వియత్నాం, థాయ్లాండ్, మలేషియా, ఇంగ్లండ్, అమెరికా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఆహారంలో కృత్రిమ రంగును నిషేధించిన దేశాల్లో ఈ చపాటా మిర్చికి ఎక్కువ డిమాండ్ ఉంది. కృత్రిమ రంగులకు ప్రత్యామ్నాయంగా ఈ చపాటా మిర్చిని ఉపయోగిస్తారు. ఇందులో నుంచి ఓల్యూరోసిస్ అనే ఎరుపు రంగు ద్రావణాన్ని తీసి ఫుడ్ కలర్గా వినియోగిస్తారు. మన దగ్గర వీటిని ఎక్కువగా పచ్చళ్ల తయారీలో వినియోగిస్తారు.తిమ్మంపేట చిల్లి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ నర్సంపేట, వరంగల్, కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఈ పంటకు జీఐ ట్యాగ్ కోసం 2022లో దరఖాస్తు చేశాయి. ఎంత మంది రైతులు దీనిని పండిస్తున్నారు. దీని వలన లాభాలు తెలుపుతూ పలు అంశాలతో కూడిన నివేదికను చెన్నైలోని జీఐ కార్యాలయంలో అందజేశారు. ఈ క్రమంలో ఈ నెలలో రైతులతో చెన్నైలో జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. సాగు విధానం, ఉపయోగాలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తి అయితే చపాటా మిర్చికి జీఐ ట్యాగ్ లభించే అవకాశం ఉంది. సాధారణ మిర్చిని క్వింటాల్ రూ.8 వేల నుంచి రూ.18 వేల వరకు విక్రయిస్తుండగా..చపాటా మిర్చి రూ.30 వేల నుంచి 35 వేలు పలుకుతుంది.మరికొన్ని పంటలకు కూడా..⇒ ఆర్మూరు పసుపునకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దీనికి జీఐ ట్యాగ్ సాధించేందుకు తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఇందుకు నాబార్డు సహకరిస్తోంది. దశాబ్దాలుగా ఈ ప్రాంత రైతులు ప్రధాన పంటగా పసుపును సాగు చేస్తున్నారు. జీఐ ట్యాగ్ పొందితే ఎగుమతులు పెరిగే అవకాశాలున్నాయి. అధిక ధరలు పలకడంతో రైతులకు ఆర్థికంగా లబ్ధి చేకూరనుంది. ఇక రాష్ట్రంలోనే మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ సీతాఫలాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచి ఇతర జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలకు, ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేస్తుంటారు. దీనికి జీఐ ట్యాగ్ కోసం కూడా ఉద్యాన వర్సిటీ కసరసత్తును ప్రారంభించింది. వర్సిటీ శాస్త్రవేత్తలు దీనిపై ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. అలాగే కొల్లాపూర్ మామిడి, జగిత్యాల పొడుగు బీరకాయలు, నల్లగొండ పచ్చడి దోసకాయలు, నిజామాబాద్ గుత్తి బీరకాయలు సైతం జీఐ గుర్తింపు కోసం దరఖాస్తు ప్రక్రియలో ఉన్నాయి. ప్లాంట్ అథారిటీలో నల్లగొండ పచ్చడి దోసకాయను నమోదు చేయించేందుకు ఉద్యాన వర్సిటీ దరఖాస్తు చేయించింది. నమోదు జరిగితే ఈ దోసకాయకు చట్టబద్ధమైన రక్షణ ఉంటుంది.జీఐ ట్యాగ్ ఉన్న 17 ఉత్పత్తులివే..పోచంపల్లి ఇక్కత్, కరీంనగర్ ఫిలిగ్రీ, గద్వాల చీరలు, నిర్మల్ బొమ్మలు, చేర్యాల నకాశి కళ, నిర్మల్ ఫర్నిచర్, నారాయణపేట చీరలు, పుట్టపాక తేలియా రుమాలు, గొల్లభామ చీరలు, ఆదిలాబాద్ డోక్రా ఇత్తడి బొమ్మలు, వరంగల్ డర్రీస్, నిర్మల్ చిత్రాలు, తాండూరు కందిపప్పు, పాతబస్తీ లక్కగాజులు, హైదరాబాద్ హలీం, పెంబర్తి మెటల్ క్రాఫ్ట్, బంగినపల్లి మామిడి ఉన్నాయి.ఎన్నో ప్రయోజనాలుజీఐ ట్యాగ్తో పంటల ఎగుమతులు పెరిగేందుకు, అధిక ధరలు లభించేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా రైతులకు మేలు జరుగుతుంది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఉత్పత్తులకు డిమాండ్ పెరగడంతో పాటు ఆర్థిక వృద్ధికి తోడ్పతుంది. ఈ ఉత్పత్తులను ఇతరులు అనధికారికంగా ఉపయోగించడాన్ని నిరోధిస్తుంది. – నీరజ ప్రభాకర్, వీసీ, తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం -
అన్నదాతలకు అపార నష్టం
సాక్షి, అమరావతి: కనీవినీ ఎరుగని రీతిలో కురిసిన భారీ వర్షాలకు కృష్ణా నది, బుడమేరుకు పోటెత్తిన వరదలు తోడవటంతో రైతుల ఆశలన్నీ గల్లంతయ్యాయి. గడచిన 10 రోజులుగా లక్షలాది ఎకరాల్లో పంటలన్నీ ముంపు నీటిలో చిక్కుకోవడంతో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు విలవిల్లాడిపోతున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 16 జిల్లాల పరిధిలో 5.03 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. 4,53,845 ఎకరాల్లో వ్యవసాయ, 12 జిల్లాల పరిధిలో 49,340 ఎకరాల్లో ఉద్యాన పంటలు ముంపునకు గురైనట్టు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 365 మండలాల్లో 2,475 గ్రామాల పరిధిలో 2.50 లక్షల మంది రైతులు ముంపు ప్రభావానికి గురైనట్టుగా లెక్కతేల్చారు.వరి పంటకు ఎనలేని నష్టంకృష్ణా నదీ పరివాహక ప్రాంతాలైన ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అత్యధిక విస్తీర్ణంలో పంటలకు అపారమైన నష్టం వాటిల్లినట్టు గుర్తించారు. ఆయా జిల్లాల్లో వరి పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అత్యధికంగా 3.50 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతినగా.. ఆ తర్వాత పత్తి, మొక్కజొన్న, అపరాలు, చిరుధాన్యాలు, మిరప, అరటి, పసుపు, కంద, నిమ్మ, కూరగాయలు, ఉల్లి, ఆయిల్పామ్, బొప్పాయి, పూలు, కొబ్బరి తదితర పంటలు దెబ్బతిన్నాయి. ఇసుక మేటలు వేయడం ద్వారా 525 ఎకరాల్లో పంటలు దెబ్బతినగా.. కృష్ణా జిల్లాలో 140 ఎకరాల్లో మల్బరీ తోటలకు నష్టం వాటిల్లింది. పాడి, మత్స్య రైతులకు తీవ్ర నష్టంఓ మత్స్యకారుడు మృతి చెందగా.. 83 బోట్లు పూర్తిగాను, 202 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నట్టు మత్స్య శాఖ గుర్తించింది. 349 మోటర్ బోట్లు పూర్తిగా దెబ్బతినగా.. 2,440 వలలు ధ్వంసమయ్యాయి. 10వేల హెక్టార్లలో ఫిష్ సీడ్ ఫామ్స్, ఇసుక మేటలు వేయడం వల్ల 18 వేల హెక్టార్లలో చేపల చెరువులు దెబ్బతిన్నాయి. పశు సంవర్ధక శాఖకు సంబంధించి 10 జిల్లాల పరిధిలో 116 పశువులు, 340 మేకలు, గొర్రెలు, 5 ఎద్దులు, 32 దూడలతో పాటు 71,639 కోళ్లు చనిపోగా, 92 పశువుల షెడ్లు కూలిపోయినట్టు లెక్కతేల్చారు. అత్యధికంగా కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, ఏలూరు జిల్లాల పరిధిలోని 73 మండలాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ జిల్లాల పరిధిలో 46,826 పశువులపై తీవ్ర ప్రభావం చూపింది. వ్యవసాయ పంటలకు రూ.301.35 కోట్ల నష్టంఎస్డీఆర్ ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్) నిబంధనల ప్రకారం ప్రాథమికంగా వ్యవసాయ పంటలకు రూ.301.35 కోట్లు, ఉద్యాన పంటలకు, రూ.40.97 కోట్లు, మత్స్య శాఖకు రూ.141.90 కోట్లు, సెరీ కల్చర్కు రూ.2.68 కోట్లు, పశు సంవర్ధక శాఖకు రూ.66.60 నష్టం వాటిల్లినట్టు లెక్కతేల్చారు. కాగా.. తుది నష్టం అంచనాలకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈ నెల 10వ తేదీలోగా పంట నష్టం అంచనాలు రూపొందించి, 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సోషల్ ఆడిట్ కింద రైతు సేవా కేంద్రా(ఆర్బీకే)ల్లో జాబితాలు ప్రదర్శించనున్నారు. 18న తుది అంచనాల జాబితాలను ప్రదర్శిస్తారు. -
Heavy Rains: వరద విధ్వంసం
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: మూడు రోజుల పాటు కురిసిన కుండపోత వానలు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాయి. వందల గ్రామాలకు వెళ్లే రహదారులు కొట్టుకుపోయాయి. అనేక చోట్ల చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయి. లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఏకబిగిన కురిసిన వానలతో జనావాసాల్లోకి వరదలు పోటెత్తడంతో వేలాది ఇళ్లు నీటమునిగాయి. సామగ్రి, నిత్యావసరాలు పాడైపోయాయి. ద్విచక్రవాహనాలు, కార్లు దెబ్బతిన్నాయి. సోమవారం మధ్యాహ్నం సమయానికి వర్షాలు తగ్గుముఖం పట్టినా.. వరదలు ఇంకా తగ్గలేదు. ఈ క్రమంలో పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఖమ్మం జిల్లాలో తొలిసారిగా డ్రోన్ల సాయంతో వరదలో చిక్కుకున్న ప్రజలకు ఆహార పొట్లాలను అందించారు. భారీ వర్షాలతో ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లో ఎక్కువ నష్టం జరిగింది. సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కలసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. జిల్లాల ఇన్చార్జి మంత్రులు తమ జిల్లాల్లో పర్యటిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 110 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి.. 4వేల మందిని వాటిలోకి తరలించారు. ఖమ్మం సర్వం మున్నేరార్పణం భారీ వరదలతో ఖమ్మం జిల్లాలోని మున్నేరు పరీవాహక ప్రాంతం అల్లకల్లోలమైంది. వరద తాకిడితో పదులకొద్దీ ఇళ్లు నేలమట్టం అయ్యాయి. వందలాది ఇళ్ల పైకప్పులు, గోడలు కూలిపోయాయి. ఇళ్లలో ఉన్న వస్తువులతోపాటు ద్విచక్ర వాహనాలు, కార్లు కూడా కొట్టుకుపోయాయి. ఒక్కసారిగా వచ్చిన వరదతో లోతట్టు ప్రాంత ప్రజలు కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు చేరారు. ఖమ్మం నగరంతోపాటు పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మంరూరల్ మండల పరిధిలో ఇళ్లు దెబ్బతిన్నాయి. ఫ్రిడ్జ్లు, టీవీలు, ఇతర ఎల్రక్టానిక్ సామాగ్రి తడిసి దెబ్బతిన్నాయి. ఖమ్మంలోని మోతీనగర్లో ఓ కుటుంబం దాచుకున్న బంగారం, డబ్బులు వరదనీటిలో కొట్టుకుపోయాయి. ఎఫ్సీఐ గోడౌన్ వద్ద 250కిపైగా లారీలు నీట మునిగిపోయాయి. ఒక్కో లారీ మరమ్మతుకు రూ.లక్షకుపైగా ఖర్చవుతుందని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జిల్లాలోని ఆకేరు వాగు పొంగి తిరుమలాయపాలెం మండలాన్ని ముంచెత్తింది. పాలేరు వరదతో కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఖమ్మం నగరంలో రామన్నపేట, వెంకటేశ్వరనగర్, పద్మావతినగర్, సారథినగర్, మామిళ్లగూడెం, బొక్కలగడ్డ, కాల్వొడ్డు, నయాబజార్, మంచికంటి నగర్, మోతీనగర్, పెద్దమ్మతల్లిగుడి రోడ్డు, ప్రకాశ్నగర్, దంసలాపురం కాలనీ.. ఖమ్మంరూరల్ మండలంలోని పోలేపల్లి, సాయిగణే‹Ùనగర్, కరుణగిరి, పెద్దతండా ప్రాంతాలు, చింతకాని, ముదిగొండ, మదిర, ఎర్రుపాలెం మండలాల్లోని పలు గ్రామాల్లో తీవ్ర నష్టం జరిగింది. మున్నేరు వరద తగ్గడంతో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. రోడ్లపై ఉన్న బురదను తొలగిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులు ఇళ్లకు చేరుకొని అన్నీ శుభ్రం చేసుకుంటున్నారు. యంత్రాంగం విఫలమవడంతోనే.. మున్నేరు వరద విషయంలో ప్రజలను అప్రమత్తం చేయడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. గత ఏడాది కూడా జూలై 26 అర్ధరాత్రి నుంచి రెండు రోజుల పాటు మున్నేరు పరీవాహక ప్రాంతాన్ని వరద ముంచింది. ఆ సమయంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ, పునరావాస కేంద్రాలకు తరలించారు. కానీ ఈసారి అదే తరహాలో మున్నేరుకు భారీ వరద వస్తున్నా.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడంలో విఫలమయ్యారని స్థానికులు మండిపడుతున్నారు. జల విలయంలోనే మహబూబాబాద్! భారీ వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో, అందులోనూ మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విధ్వంసం జరిగింది. నెల్లికుదురు మండలం రావిరాల మొదలుకొని వందలాది గ్రామాలు నీట మునిగాయి. చాలా గ్రామాల చుట్టూ ఇంకా వరద కొనసాగుతుండటంతో జలదిగ్బంధంలోనే ఉండిపోయాయి. ప్రజలు ఇళ్లలో తడిసిపోయిన సామగ్రిని చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తేరుకొని తొగరాయ్రి, కూచిపూడి గ్రామాలు సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో అంతర గంగ వరదతో కకావికలమైన తొగర్రాయి, కూచిపూడి గ్రామాలు సోమవారం కూడా తేరుకోలేదు. ఆ రెండు గ్రామాలు 70శాతానికిపైగా మునగడంతో.. ప్రజలు నిత్యవసర వస్తువులతోపాటు పంట పొలాలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయారు. తొగýర్రాయి, కూచిపూడి, గణపవరంలలో వెయ్యికి పైగా వ్యవసాయ మోటార్లు కొట్టుకుపోయినట్టు రైతులు వాపోతున్నారు. కోదాడ మండలంలో తీవ్రంగా నష్టపోయిన తొగర్రాయి, కూచిపూడి గ్రామాలను ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి సోమవారం సందర్శించారు. ప్రభుత్వం నుంచి తగిన పరిహారం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. మిగిలింది కట్టుబట్టలే! ఈ ఫొటోలో కనిపిస్తున్నది సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం నారాయణపురం చెరువు పక్కన ఉన్న మోహనరావు ఇల్లు. ఇంటి ముందు ఎయిర్ కంప్రెషర్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. శనివారం సాయంత్రం భారీ వర్షాలతో చెరువు కట్ట తెగడంతో నీరంతా ఒక్కసారిగా ముంచెత్తింది. మోహన్రావు, ఆయన భార్య, ఇద్దరు కుమారులు దూరంగా పరుగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు. కానీ ఇల్లు దెబ్బతిన్నది, సామగ్రి అంతా కొట్టుకుపోయింది. తమకు కట్టుబట్టలే మిగిలాయని మోహనరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ ఇల్లు చూసినా ఇదే దుస్థితి మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల గ్రామంలో వరద బీభత్సానికి అన్ని ఇళ్లలో బియ్యం, నిత్యావసరాలు, ఇతర సామగ్రి అంతా తడిసి పాడైపోయాయి. ‘‘తినడానికి తిండి గింజలు లేకుండా పోయి బతకలేని పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం ఆదుకుని నిరుపేద కుటుంబాలను చేరదీయాలి’’ అని గ్రామానికి చెందిన రాస యాకన్న ఆవేదన కోరుతున్నాడు. తడిసిపోయిన బియ్యాన్ని బయటపడేస్తూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఫారంలో ఒక్క కోడీ మిగల్లేదు.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో బెజ్జం సమ్మయ్య, ఎస్కే అమీర్ కలిసి కోళ్లఫారం నడుపుతున్నారు. ఆదివారం భారీ వర్షంతో ఫారంలోకి వరద ముంచెత్తింది. ఒక్కటీ మిగలకుండా రెండున్నర వేల కోళ్లు మృతి చెందాయి. ‘‘ఒక్కో కోడి కేజీన్నర బరువుదాకా పెరిగింది. నాలుగైదు రోజుల్లో కంపెనీ వారికి అప్పగించాల్సి ఉంది. అలాంటిది నోటిదాకా వచ్చిన కూడును వరద లాగేసింది..’’ అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పొలాల నిండా.. కంకర, ఇసుక మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం వెంకటగిరి రోడ్డుకు సమీపంలోని వరిచేన్లలో వేసిన కంకర, ఇసుక మేటలివి. ఇటీవల ఇక్కడ రోడ్డు పనులు ప్రారంభించారు. దానికోసం తెచ్చిన కంకర, ఇసుక అంతా వరదకు కొట్టుకొచ్చి పొలాల్లో చేరింది. తిరిగి పొలాన్ని బాగు చేసుకోవాలంటే చాలా ఖర్చవుతుందని రైతులు వాపోతున్నారు. -
లక్షల ఎకరాల్లోని పంటలు వరదలోనే...
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో కుండపోత వర్షాలు, వరదలకు లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. రెండు మూడు రోజులుగా పంటలన్నీ నీళ్లలోనే నానుతున్నాయి. అన్ని జిల్లాల్లో కలిపి 15 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు నీటమునిగినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. అందులో 4.15 లక్షల ఎకరాల మేర నష్టం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. పంట నష్టం జరిగిన రైతులకు ఎకరాకు రూ. 10 వేల చొప్పున నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో త్వరలో పూర్తిస్థాయి నష్టాన్ని అంచనా వేస్తామని అధికారులు అంటున్నారు. వరి రైతు విలవిల.. వరదల వల్ల వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, కంది సహా ఇతరత్రా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వర్షాల దెబ్బకు అధికంగా మహబూబాబాద్, ములుగు, ఖమ్మం, నల్లగొండ, నాగర్కర్నూలు, మహబూబ్నగర్, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం జిల్లాల్లో పంటలు నీటమునిగాయి. నాట్ల దశలోనే వరి ఉండటంతో రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లనుంది. పెరగనున్న చీడపీడల బెడద.. ఆధిక వర్షాల వల్ల వివిధ పంటల్లో కొన్ని రకాల చీడపీడల ఉధృతి అధికంగా ఉంటుందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న వరి, పత్తి, మొక్కజొన్న, సోయాచిక్కుడు, కంది, పెసర, మినుము వంటి పంటల్లో ప్రస్తుతం ఉన్న దశలో కొన్ని రకాల చీడపీడలు ఆశించే అవకాశం ఉందన్నారు. వరి పంట పసుపు రంగులోకి మారుతుందని.. కొనల నుంచి తెల్లటి చారలు ఏర్పడతాయన్నారు. అలాగే పత్తిలో పచ్చ దోమ అధికమవుతుందని.. ఎండు తెగులు కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉందన్నారు. సోయా చిక్కుడు పంట కాత దశలో ఉన్నందున వేరుకుళ్ల, ఎండు తెగులు ఆశించే అవకాశం, కాయలుపై పక్షి కన్ను తెగులు, ఆకులపై కొన్ని రకాల శిలీంద్రాల వల్ల ఆకుమచ్చ తెగులు ఆశించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వివిధ జిల్లాల్లో వరద నష్టం ఇలా.. ⇒ ఖమ్మం జిల్లాలో ఆకేరు, పాలేరు పొంగిపొర్లడం, మున్నేరు, వైరాకు భారీ వరద పోటెత్తడంతో వేలాది ఇళ్లు నీట మునిగాయి. కొన్ని ఇళ్లు కూలాయి. 37,716 మంది రైతులకు చెందిన 57,410 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. జిల్లాలో మొత్తం రూ. 11,99,65,000 వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. జిల్లావ్యాప్తంగా 38 చెరువులు ఉప్పొంగాయి. 180 వరకు చేపల చెరువులు పొంగిపొర్లాయి. దీంతో సుమారు రూ. 4.20 కోట్ల విలువైన 3,500 టన్నుల మత్య్స సంపదకు నష్టం జరిగింది. ఏదులాపురం సెక్షన్లో 11 కేవీ టవర్, 1,935 స్తంభాలు దెబ్బతిన్నాయి. నాలుగు సబ్స్టేషన్లలో నీరు నిలిచింది. ⇒ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 60 వేల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలు దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. మహబూబాబాద్ జిల్లాలో 78, జనగామలో 8, వరంగల్లో 2, జయశంకర్ భూపాలపల్లిలో 8, ములుగులో 6, హనుమకొండలో 2 చెరువులు కలిపి మొత్తం 104 చెరువులకు గండ్లు పడ్డాయి. ⇒ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వరదల్లో చిక్కుకొని ఇద్దరు మరణించగా వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా ప్రకారమే నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 22,344 ఎకరాల్లో వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. సూర్యాపేట జిల్లాలో 23 చోట్ల రోడ్లు తెగిపోగా, 35 రోడ్లు దెబ్బతిన్నాయి. మరో 15 చెరువుల కట్టలు తెగిపోయినట్లు జిల్లా యంత్రాంగం గుర్తించింది. ⇒ ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా 7,746 ఎకరాల్లో వరి, పత్తి, వేరుశనగ తదితర పంటలకు నష్టం వాటిల్లింది. సుమారు 140 వరకు ఇళ్ల ధ్వంసమవగా 10 ప్రాంతాల్లో రోడ్లు కోతకు గురయ్యాయి. ⇒ ఉమ్మడి మెదక్ జిల్లాలో సుమారు 2 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. కాలువలకు గండి పడింది. అక్కడక్కడ కుంటల కట్టలు తెగిపోయాయి. గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 4 ఎకరాల్లో ఇసుక మేటలు నాకు 13 ఎకరాలు పొలం ఉంది. మరో 16 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. మొత్తం వరి సాగు చేశా. ఇప్పటికే ఎకరానికి రూ. 20 వేల చొప్పున పెట్టుబడి పెట్టా. భారీ వర్షాల కారణంగా పోతిరేణికుంట చెరువు నీరంతా 4 ఎకరాల పొలాన్ని ముంచెత్తడంతో ఇసుక మేటలు వేశాయి. కొన్నిచోట్ల పొలం కోతకు గురైంది. – దేవరం ప్రభాకర్రెడ్డి, రైతు, హుజూర్నగర్, సూర్యాపేట జిల్లాదిగుబడి బాగా వస్తుందనుకుంటే.. ఇసుక మేటలు వేసిన పొలం మధ్య నిలబడిన ఈయన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటకు చెందిన రైతు బేతమల్ల రమేశ్. బంధం చెరువు కింద 2.20 ఎకరాల్లో వరి సాగుచేశాడు. అప్పు తెచ్చి రూ. 80 వేల పెట్టుబడి పెట్టాడు. 40 రోజుల క్రితం నాట్లు వేయగా చేను ఏపుగా పెరిగింది. ఈసారి దిగుబడి బాగా వస్తుందని సంబురపడ్డాడు. కానీ భారీ వర్షాలతో బంధం చెరువుకు గండిపడి రమేశ్ పొలాన్ని ముంచెత్తింది. ఇసుకమేటలతో నిండిన తన పొలాన్ని చూసి రమేశ్ కన్నీటిపర్యంతమయ్యాడు. ఇప్పుడు ఇంకెక్కడి నుంచి అప్పు తేవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.రూ. 40 వేలు ఆకేరు పాలు ఈ రైతు పేరు రమావత్ శ్రీను. తిరుమలాయపాలెం మండలం రమణా తండాకు చెందిన ఈయన రూ. 40 వేల పెట్టుబడి ఖర్చుతో 2 ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. జూన్ ప్రారంభంలోనే పత్తి గింజలు నాటగా పత్తి ప్రస్తుతం కాత దశలో ఉంది. మరో పంట నెలలో చేతికి అందుతుందని శ్రీను అనుకుంటుండగా ఆదివారం ఆకేరు వాగు ముంచెత్తడంతో చేనును ముంచెత్తింది. వరద తగ్గాక సోమవారం వెళ్లే సరికి పత్తి చేనులోని మొక్కలన్నీ నేలవాలి నామరూపాల్లేకుండా పోయాయి. దీంతో ఏం చేయాలో పాలుపోక శ్రీను కన్నీరుమున్నీరవుతున్నాడు. -
మేలు చేసే కొత్త వంగడాలు
సాక్షి, అమరావతి: ఆధునిక బయో టెక్నాలజీ ద్వారా ఆహార పంటల పోషక నాణ్యతను మెరుగుపర్చే బయో ఫోర్టీఫైడ్ పంటలకు ప్రాముఖ్యత, ప్రాబల్యం పెరుగుతోంది. మొక్కల పెరుగుదల సమయంలోనే పంటలలో పోషక స్థాయిలను పెంచడం లక్ష్యంగా శాస్త్రవేత్తలు కొత్త వంగడాలను అభివృద్ధి చేస్తున్నారు. దేశంలోని అగ్రో ఎకలాజికల్ జోన్స్కు అవసరమైన బయో ఫోర్టీఫైడ్ పంట రకాలను ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విడుదల చేసారు.వ్యాధులు, తెగుళ్లను తట్టుకుంటూ అధిక దిగుబడినిచ్చే ఈ రకాలు అన్నదాతల పాలిట వరంగా మారనున్నాయి. వీటిలో వ్యవసాయ పంటల్లో 69 రకాలు, ఉద్యాన పంటల్లో 40 రకాలు ఉన్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్)తోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ విశ్వ విద్యాలయాలు అభివృద్ధి చేసిన రకాలు ఉన్నాయి. వీటిలో 34 రకాల వంగడాలు తెలుగు రాష్ట్రాల్లో సాగుకు అనువైనవి ఉన్నాయి. ఈ వంగడాల్లో 3 ఆంధ్రప్రదేశ్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసినవి కాగా, 5 రకాలు తెలంగాణ రాష్ట్రానికి చెందినవి.జన్యుపరమైన లోపాలకు దూరంగా.. నూతన వంగడాలకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రస్తుతం వినియోగంలో ఉన్న వంగడాలతో పోలిస్తే ఈ కొత్త రకాలలో జన్యు పరమైన లోపాలు లేవని నిర్ధారించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం తట్టుకోగలవు. ఎరువులకు మెరుగైన రీతిలో స్పందిస్తాయి. తెగుళ్లు, వ్యాధులను సమర్ధంగా ఎదుర్కొంటాయి. పంట నాణ్యతతో పాటు ముందుగానే పరిపక్వం చెందుతాయి. అధిక పోషక విలువలతో అధిక ఆహార ఉత్పత్తిని, ఉత్పాదకతను కలిగి ఉండాయి.ఫలితంగా వీటి సాగు ద్వారా పర్యావరణ పరిరక్షణతో కూడిన వ్యవసాయం చేసేందుకు దోహద పడతాయని, వ్యవసాయ యోగ్యం కాని భూములు సైతం సాగులోకి తెచ్చేందుకు ఊతమిస్తాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ వంగడాలు పూర్తి స్థాయిలో రైతులకు అందుబాటులోకి రావాలంటే కనీసం మూడేళ్లు పడుతుందని చెబుతున్నారు. జాతీయ స్థాయిలో విడుదలైన వంగడాల్లో 34 రకాలు తెలుగు రాష్ట్రాలలో సాగుకు అనువైనవి. వీటిలో తెలుగు రాష్ట్రాల నుంచి విడుదలైన 8 రకాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన మరో 26 రకాలు ఉన్నాయి. -
సాగు ఢమాల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం పంటల సాగు గణనీయంగా పడిపోయింది. రాష్ట్రమంతా వర్షాలు పూర్తి స్థాయిలో పడకపోవడం, చెరువులు, కుంటలు నిండకపోవడం, ఇటీవలి కాలం వరకు జలాశయాల్లో తగినంత నీరు లేకపోవడం..తదితర కారణాలతో పంటల సాగు విస్తీర్ణం భారీగా పడిపోయిందని వ్యవసాయశాఖ వర్గాలు విశ్లేíÙస్తున్నాయి. గత ఏడాది వానాకాలంలో ఇదే సమయానికి సాగైన పంటలతో పోలిస్తే, ఈసారి ఏకంగా 15.30 లక్షల ఎకరాల మేరకు సాగు తగ్గిపోయింది. ఈ వానాకాలం సీజన్లో 1.34 కోట్ల ఎకరాల్లో పంటల సాగు జరుగుతుందని పంటల ప్రణాళికలో వ్యవసాయశాఖ అంచనా వేసింది.అత్యధికంగా 66 లక్షల ఎకరాల్లో వరి, 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని పేర్కొంది. కానీ ఆశించిన స్థాయిలో సాగు జరగక పోవడం ఆందోళన కలిగిస్తోంది. రైతుభరోసా కింద పెట్టుబడి సాయం ఇవ్వకపోవడం, రుణమాఫీకి ముందు పంట రుణాలు ఇవ్వకపోవడం వంటి కారణాలు కూడా సాగు తగ్గడానికి కారణాలుగా రైతు సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. అలాగే కొందరు రైతులు భూముల్ని కౌలుకు ఇవ్వకుండా వదిలేశారన్న చర్చ కూడా జరుగుతోంది. కౌలు రైతులకు పెట్టుబడి సాయం చేస్తే, తమకు రైతు భరోసా రాదని కొందరు రైతులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 8.79 లక్షల ఎకరాల మేర తగ్గిన వరి గతేడాది వానాకాలం సీజన్ ఇదే సమయానికి అన్ని పంటలు కలిపి 99.89 లక్షల (దాదాపు కోటి) ఎకరాల్లో సాగయ్యాయి. కానీ ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 84.59 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు వేసినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంటే సాగు విస్తీర్ణం ఏకంగా 15.29 లక్షల ఎకరాల్లో విస్తీర్ణం తగ్గిందని వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా వరి, పత్తి సాగు గణనీయంగా పడిపోయింది.గతేడాది వానాకాలంలో ఇదే సమయానికి 34.37 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడగా, ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 25.58 లక్షల ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. అంటే గతేడాదితో పోలిస్తే 8.79 లక్షల ఎకరాలు తగ్గింది. దీనిని బట్టి చూస్తే పంటల ప్రణాళిక ప్రకారం ఈ సీజన్లో 66 లక్షల ఎకరాల్లో సాగు సాధ్యమయ్యేలా కని్పంచడం లేదు. వరికి రూ.500 బోనస్ కేవలం సన్నాలకే ఇస్తామని ప్రభుత్వం చెప్పడం, ఆ వరి రకాల పేర్లను మొన్నమొన్నటి వరకు బహిరంగపరచకపోవడం, ఇప్పుడు వాటిని రైతులకు అందుబాటులో ఉంచకపోవడం తదితర కారణాలు ఏమైనా రైతులను గందరగోళపరిచాయా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. గతేడాది వానాకాలంలో 65 లక్షల ఎకరాల్లో వరి సాగవడం గమనార్హం. పత్తి సాగూ తగ్గింది.. పత్తి విషయానికొస్తే.. గతేడాది ఇదే సమయానికి 44.32 లక్షల ఎకరాల్లో సాగవగా, ఈసారి కేవలం 41.65 లక్షల ఎకరాలకే పరిమితమైంది. అంటే 2.67 లక్షల ఎకరాల మేర విస్తీర్ణం తగ్గిందన్నమాట. వాస్తవానికి పత్తి సాగును 60 లక్షల ఎకరాలకు పెంచాలని, వీలైతే 70 లక్షల ఎకరాలకు పెంచినా మంచిదేనన్న అభిప్రాయంతో వ్యవసాయ శాఖ ఉంది. ఆ మేరకు ప్రణాళికలు వేసుకుంది.కానీ కీలకమైన సమయంలో రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచడంలో విఫలమైంది. అనేకమంది రైతులు విత్తనాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు గతేడాది పత్తి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకోవడంతో రైతులు ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉండిపోయారని వ్యవసాయశాఖ వర్గాలు అంటున్నాయి. ఇక గతేడాదితో పోలిస్తే మొక్కజొన్న సాగు 93,635 ఎకరాల్లో, కంది 35,176 ఎకరాల్లో, సోయాబీన్ 72,744 ఎకరాల్లో తగ్గింది. వనపర్తి జిల్లాలో 20.59 శాతమే సాగు రాష్ట్రంలో అత్యంత తక్కువగా వనపర్తి జిల్లాలో 20.59 శాతమే పంటలు సాగయ్యాయి. సూర్యాపేట జిల్లాలో 32.02 శాతం, ములుగు జిల్లాలో 32.57 శాతం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 41.67 శాతం, రంగారెడ్డి జిల్లాలో 44.89 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయని వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో అత్యంత ఎక్కువగా పంటల సాగు నమోదు కావడం గమనార్హం. ఆ జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 5,62,098 ఎకరాలు కాగా, 5,63,481 ఎకరాల్లో సాగైంది. జిల్లాల వారీగా వరి, పత్తి సాగు ఇలా.. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వరి నాట్లు ఊపందుకోలేదు. నల్లగొండ జిల్లాలో గతేడాది ఇదే సమయానికి 2.54 లక్షల ఎకరాల్లో నాట్లు పడగా, ఇప్పుడు కేవలం 79,085 ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. సూర్యాపేట జిల్లాలో గతేడాది ఇదే సమయానికి 1.87 లక్షల ఎకరాల్లో నాట్లు పడగా, 97,087 ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో గతేడాది 2.21 లక్షల ఎకరాల్లో నాట్లు పడగా, ఇప్పుడు కేవలం 1.50 లక్షల ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. మెదక్ జిల్లాలో గతేడాది 2.49 లక్షల ఎకరాల్లో నాట్లు పడగా, ఇప్పుడు కేవలం 1.22 లక్షల ఎకరాల్లోనే పడ్డాయి.ఇదేవిధంగా కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, మహబూబాబాద్, భూపాలపల్లి, జనగాం, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో నాట్లు గణనీయంగా తగ్గాయి. ఇక పత్తి నల్లగొండ జిల్లాలో గతేడాది ఇదే సమయానికి 5.86 లక్షల ఎకరాల్లో సాగైతే, ఈ ఏడాది ఇప్పటివరకు 5.22 లక్షల ఎకరాలకే పరిమితమైంది. నాగర్కర్నూలు జిల్లాలో గతేడాది 2.41 లక్షల ఎకరాల్లో సాగైతే, ఇప్పుడు 1.89 లక్షల ఎకరాలకే పరిమితమైంది. నారాయణపేట జిల్లాలో గతేడాది 2.02 లక్షల ఎకరాల్లో సాగవగా, ఇప్పుడు 1.65 లక్షల ఎకరాలకే పరిమితమైంది. జనగామలో గతేడాది ఇదే సమయానికి 1.35 లక్షల ఎకరాల్లో సాగవగా, ఇప్పుడు కేవలం 97,225 ఎకరాల్లోనే సాగైంది. సంగారెడ్డి, పెద్దపల్లి, నిర్మల్ తదితర జిల్లాల్లోనూ పత్తి సాగు తగ్గింది. వర్షాల కోసం చూస్తున్నా.. నాకు నాలుగున్నర ఎకరాల సొంత పొలం ఉంది. ఏటా మరో 20 ఎకరాలు కౌలుకు తీసుకుంటా. నాలుగున్నర ఎకరాల్లో మెట్ట పంటలు వేసి మిగతా 20 ఎకరాల్లో వరి సాగు చేస్తా. అయితే ముసురు వర్షాలకు కారణంగా ఇప్పటివరకు మూడెకరాల్లోనే వరి నాట్లు వేశా. మిగిలిన 17 ఎకరాల సాగుపై ఎటూ తోచడం లేదు. ప్రస్తుతానికైతే మరో పదెకరాల వరకు నారుమడి సిద్ధం చేసుకున్నా. కానీ ఇదే పరిస్థితి ఆగస్టు నెలాఖరు వరకు ఉంటే వేసిన మూడెకరాల వరి కూడా పండదు. అందుకే భారీ వర్షాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నాం. – మల్లు వెంకటేశ్వర్రెడ్డి, మాచన్పల్లి, మహబూబ్నగర్ జిల్లా 15,131చెరువులు ఖాళీరాష్ట్రంలో 34,716 చెరువులు, కుంటలున్నాయి. అందులో 3,247 చెరువులు ఇటీవలి వర్షాలతో అలుగు పోస్తున్నాయి. 6,735 చెరువులు నిండుగా నీటితో కళకళలాడుతున్నాయి. 3,438 చెరువుల్లో 50 నుంచి 75% నీటి నిల్వలున్నాయి. 6,165 చెరువుల్లో మాత్రం 25 నుంచి 50% మాత్రమే నీరు చేరింది. 15,131 చెరువుల్లో నీటి నిల్వలు ఇంకా 25% లోపలే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ 61.34 శాతం చెరువుల్లో 50% కంటే తక్కువగానే నీటినిల్వలున్నాయి. -
మద్దతు ధర టీడీపీ, జేడీ(యూ)కేనా?
సాక్షి, న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధర కల్పించి, రైతన్నలకు న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు గురువారం పార్లమెంట్ ఆవరణలో ప్రదర్శన చేపట్టారు. తృణమూల్ కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్), శివసేన (ఉద్ధవ్) తదితర పార్టీల సభ్యులు పార్లమెంట్ మకర ద్వారం మెట్లపై గుమికూడారు. ఉల్లిపాయలు, కూరగాయల దండలను మెడపై ధరించి కేంద్ర ప్రభుత్వ తీరు పట్ల నిరసన వ్యక్తం చేశారు. ‘పంటలకు కనీస మద్దతు ధర కల్పించండి’, ‘రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోండి’ అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. శివసేన(ఉద్ధవ్) ఎంపీ ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ... ‘‘తెలుగుదేశం పార్టీ, జేడీ(యూ)లకు బీజేపీ ప్రభుత్వం కనీస మద్దతు ధర(స్పెషల్ ప్యాకేజీ) అందించింది. అదే తరహాలో రైతులకు కూడా కనీస మద్దతు ధర అందించాలి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ సమానమేనని గుర్తించుకోవాలి. రైతులు దేశంలో ప్రధాన వాటాదార్లు. అందుకే వారికి మద్దతు ప్రకటిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. మహారాష్ట్ర నుంచి విదేశాలకు ఉల్లిపాయల ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేయాలని కేంద్రానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులకు న్యాయం జరిగేలా చూడడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. -
'ఇండ్ గ్యాప్' సాగు బాట.. రసాయనాల్లేని పంట!
రసాయనిక అవశేషాలు లేని నాణ్యమైన పంట దిగుబడులు పండించి ప్రజారోగ్యానికి పెద్దపీట వేసే దిశగా ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఇండియా గుడ్ అగ్రికల్చర్ ్రపాక్టీసెస్ (ఐ.జి.ఎ.పి.– ఇండ్ గ్యాప్) మంచి ఫలితాలనిస్తున్నాయి. అనేక మంది రైతులు గ్యాప్ పద్దతులకు అనుగుణంగా ఆహార పంటలు పండించేందుకు ఆసక్తి చూపుతున్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని దశల వారీగా తగ్గిస్తూ, రసాయనిక అవశేషాల్లేని నాణ్యమైన, అధిక పంట దిగుబడుల ఉత్పత్తి సాధించటం ఇండ్ గ్యాప్ పద్ధతిలో ముఖ్యమైన అంశం.తుంగభద్ర సేంద్రియ వ్యవసాయ ధాన్య విత్తన రైతుల పరస్పర సహాయ సహకార సంఘంలో సభ్యులైన రైతులు గ్యాప్ పద్ధతులను ఆచరిస్తూ ఆదర్శంగా నిలిచారు. 2023–24లో కర్నూలు జిల్లాలోని సీ.బెలగల్ మండలం కొండాపురం (రంగాపురం), గుండ్రేవుల గ్రామాల్లోని 50 మంది రైతులు ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నారు. గ్యాప్ పద్ధతులనుపాటిస్తూ బీపీటీ 5204 రకం వరి పంటను సాగు చేశారు. రైతులు ఒక్కొక్కరు అరెకరం నుంచి మూడు ఎకరాల వరకు మొత్తం 24.09 హెక్టార్లలో గ్యాప్ పద్దతులకు అనుగుణంగా వరి పండించారు.గ్యాప్ నిబంధనల ప్రకారం వరి సాగు పూర్తిగా వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో జరిగింది. 10–15 రోజులకోసారి డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమాన్ని గ్రామంలో నిర్వహించి రైతులకు గ్యాప్ పద్దతులపై అవగాహన కల్పించారు. కర్నూలు ఏడీఏ సాలురెడ్డి, సి.బెలగల్ ఏవో మల్లేష్ యాదవ్, జిల్లా వనరుల కేంద్రం అధికారులు ప్రతి పొలంబడికి వెళ్లి పంటలను పరిశీలించి రైతులకు సూచనలు ఇస్తూ వచ్చారు.కొండాపురం, గుండ్రేవుల గ్రామాల్లోని 50 మంది రైతుల్లో ప్రతి రైతు 100 శాతం గ్యాప్ పద్దతులుపాటించారు. నాట్లకు ముందు సామూహికంగా పచ్చి రొట్ట ఎరువు పంట సాగు చేసి, పూత దశలో పొలంలో కలిపి దున్నేశారు. ఎకరాకు 3–4 టన్నుల పశువుల ఎరువు వేసుకున్నారు. కొందరు రైతులు వేపచెక్క, వర్మీ కంపోస్టు కలిపి వేసుకున్నారు. పురుగుల బెడదను తగ్గించుకునేందుకు ఎకరాకు 5–6 లింగాకర్షక బుట్టలు, జిగురు అట్టలు ఏర్పాటు చేసుకున్నారు. సాధారణంగా రసాయనిక వ్యవసాయం చేసే రైతులు ఈ ్రపాంతంలో ఎకరానికి 6–8 బస్తాల రసాయనిక ఎరువులు వేస్తూ ఉంటారు.గ్యాప్ పద్ధతిలో 4 బస్తాల వరకు రసాయనిక ఎరువులు, అనుమతించిన కొన్ని పురుగుమందులను తగు మోతాదులో మాత్రమే ఉపయోగిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. పంట సాగు కాలంలో ఏపీ ఆర్గానిక్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ అధికారుల బృందం మూడు దఫాలు పరిశీలించింది. వరి కోతలు పూర్తి కాగానే మూడు శ్యాంపుల్స్ సేకరించి గుంటూరులోని వ్యవసాయ శాఖ ల్యాబ్కు పంపారు. అక్కడ జరిపిన పరీక్షల్లో రసాయనిక అవశేషాల ప్రభావం జీరో ఉన్నట్లు స్పష్టం కావడంతో సర్టిఫికేషన్ అథారిటీ ఈ సొసైటీ రైతులకు ఉమ్మడిగా ఇండ్ గ్యాప్ సర్టిఫికెట్ను 2024 జనవరిలో జారీ చేసింది. ఆ తర్వాత రైతులు వరి ధాన్యాన్ని మిల్లింగ్ చేయించి బియ్యాన్ని మంచి ధరకు అమ్ముకున్నారు.దిగుబడితో పాటు ధరా ఎక్కువే!అతిగా రసాయన ఎరువులు, పురుగు మందులు వాడి ధాన్యం పండించిన రైతులు బియ్యం క్వింటాలు రూ.5,500 ప్రకారం విక్రయించుకుంటే, ఇండ్ గ్యాప్ సర్టిఫికెట్ పొందిన సహకార సంఘం రైతుల బియ్యానికి రూ.7,000 ధర లభించింది. మామూలుగా అయితే వరి సాగులో ఎకరాకు సగటున రూ. 45 వేల వరకు పెట్టుబడి వ్యయం అవుతుంది. ఇండ్ గ్యాప్ పద్ధతిలో ఖర్చు రూ.28 వేలు మాత్రమే. సగటున ఎకరాకు ధాన్యం దిగుబడి 2.51 క్వింటాళ్లు అదనంగా వచ్చింది. మొత్తం 50 మంది రైతులు 24.09 హెక్టార్లలో 102.9 టన్నుల దిగుబడి సాధించి రూ. 71 లక్షల ఆదాయం పొందారు. సాధారణ రసాయనిక వ్యవసాయ రైతులతో పోల్చితే ఇది రూ. 14.4 లక్షల అధికం కావటం విశేషం. ఈ స్ఫూర్తితో తుంగభద్ర సహకార సంఘం రైతులు ఈ ఏడాది కూడా గ్యాప్ పద్ధతిలోనే వరి సాగు కొనసాస్తున్నారు. – గవిని శ్రీనివాసులు, సాక్షి, కర్నూలు (అగ్రికల్చర్)నికరాదాయం పెరిగింది..8 ఎకరాల వ్యవసాయం చేస్తున్నా. నేను 2.75 ఎకరాల్లో ఇండ్ గ్యాప్ పద్ధతిలో వరి సాగు చేశాను. మిగతా పొలంలో పత్తి, ఉల్లి, మొక్కజొన్న పంటలు సాధారణ పద్ధతిలోనే పండిస్తున్నాను. సుస్థిర వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్తల సూచనలు చాలా ఏళ్లుగాపాటిస్తుండటంతో గ్యాప్ పద్ధతిని అనుసరించటం నాకు సులువైంది.వేప చెక్కను ఎక్కువగా వినియోగించడం, గో ఆధారిత పద్దతులుపాటించడం వల్ల పంట భూముల్లో సూక్ష్మ జీవులు విశేషంగా అభివృద్ది చెంది వరి పంట ఎదుగుదలకు తోడ్పడుతున్నాయి. కెమికల్స్ వాసన లేకుండా వరి పండించాను.మామూలుగా అయితే ఎకరాకు వరి సాగులో రూ.45–50 వేల వరకు పెట్టుబడి వ్యయం వస్తుంది. గ్యాప్ పద్ధతులుపాటించడం వల్ల ఎకరాకు రూ.28 వేలు చొప్పున 2.75 ఎకరాల్లో రూ. 77 వేలు ఖర్చయింది. 41 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చింది. మిల్లింగ్ చేయగా 27 క్వింటాళ్ల బియ్యం వచ్చాయి. కర్నూలు తీసుకెళ్లి క్వింటా రూ.7,000కు అమ్మాను. క్వింటాకు రూ. వంద రవాణా ఖర్చు వచ్చింది. రూ.1.09 లక్షల నికరాదాయం వచ్చింది. మా సంఘంలోని 50 మంది రైతుల్లో క్వింటా బియ్యం రూ.7,500కి అమ్మిన వాళ్లూ కొందరు ఉన్నారు. ఈ ఏడాది కూడా గ్యాప్ పద్ధతిలోనే వరి సాగు చేస్తున్నాం. – పి.మధుసూదన్రెడ్డి (94900 96333), రైతు, కొండాపురం, సీ.బెలగల్ మండలం, కర్నూలు జిల్లాఇండ్ గ్యాప్ సర్టిఫికేషన్కు శ్రీకారం..ఇండ్ గ్యాప్ పద్ధతుల్లో పండించిన ఆహారోత్పత్తులకు దేశంగానే కాదు, అంతర్జాతీయంగా కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. మన దేశంలో అమలయ్యే గ్యాప్ పద్ధతులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(క్యు.సి.ఐ.) ‘ఇండ్ గ్యాప్’ సర్టిఫికేషన్ను అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం 2023–24 ఖరీఫ్ నుంచి ఏపీ రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల ధృవీకరణ సంస్థ ద్వారా ఈ ఇండ్ గ్యాప్ సర్టిఫికేషన్ వ్యవస్థ రైతులకు దేశంలోనే తొలిగా అందుబాటులోకి తెచ్చింది. 2023–24లో ఏపీలోని ప్రతి జిల్లాలో పైలెట్ ్రపాజెక్టు కింద ఒక పంటను గ్యాప్ పద్ధతిలో పొలంబడిలో భాగంగా సాగు చేయించడం విశేషం.ఈ సదుపాయాన్ని ఉపయోగించుకున్న అనేక సహకార సంఘాలు, ఎఫ్.పి.సి.లు వ్యవసాయ శాఖ పొలంబడి కార్యక్రమం ద్వారా ఇండ్ గ్యాప్ పద్ధతులను అనుసరించి లబ్ధిపొందటం విశేషం. విత్తన ధృవీకరణ సంస్థ ద్వారా ఉత్పత్తులపై పరీక్షలు చేయించి రైతులకు ఈ సర్టిఫికేషన్ ఇస్తారు. తద్వారా రైతులు మంచి మార్కెట్ ధరకు విక్రయించి మంచి నికరాదాయాన్ని పొందుతున్నారు. దిగుబడులపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా క్రమంగా కెమికల్ వాడకాన్ని తగ్గిస్తూ.. అదే సమయంలో సేంద్రియం వైపు మళ్లే విధంగా రైతుల్లో అవగాహన కల్పించడం గమనార్హం.ఇవి చదవండి: పిల్లల నుంచి పోషణ కోసం.. తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించవచ్చా? -
ప్రిస్కిప్షన్ లేకుండానే పురుగుమందులు!
గ్లైపోసేట్ కలుపు మందును బీజీ–3 పత్తి పంటలో కలుపు నివారణకు ఉపయోగిస్తారు. వాస్తవానికి బీజీ–3 పత్తి విత్తనంపై నిషేధముంది. కానీ అనేకమంది రైతులు దీనిని సాగు చేయడంతో పాటు గ్లైపోసేట్ను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఎరువులు, పురుగు మందు దుకాణాల్లో అందుబాటులో ఉండటంతో అవగాహన లేకుండానే రైతులు దాన్ని కొంటున్నారు. కొందరు రైతులు వరిలో పెరిగే కలుపు నివారణకు కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. గతంలో ఒక రైతు అలాగే వరిలో కలుపు నివారణకు ఉపయోగిస్తే పంట మొత్తం మాడిపోయింది.సాక్షి, హైదరాబాద్: మనం ఏదైనా అనారోగ్యానికి గురైనప్పుడు డాక్టర్ ప్రిస్కిప్షన్ (మందుల చిట్టీ) ఆధారంగానే మందులు వాడుతుంటాం. కానీ వ్యవసాయం చేసే రైతులు పంటలకు వచి్చన చీడపీడలను వదిలించేందుకు తమ ఇష్టారాజ్యంగా పురుగు మందులు వాడేస్తున్నారు. దీంతో పంటలు విషతుల్యమవుతున్నాయి. మోతాదుకు మించి వాడటంతో ఆయా పంటలు వినియోగిస్తున్న మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. మరోవైపు పంటల్ని కొత్త కొత్త చీడపీడలు ఆశిస్తున్నాయి.వ్యవసాయాధికారులు ప్రిస్క్రిప్షన్ రాసిస్తేనే రైతులకు దుకాణాదారులు పురుగు మందులు విక్రయించాలనే నిబంధన రాష్ట్రంలో బేఖాతర్ అవుతోంది. దీంతో రాష్ట్రంలో విచ్చలవిడిగా పురుగు మందుల విక్రయాలు జరుగుతున్నాయి. వ్యవసాయాధికారుల పర్యవేక్షణ లోపంతో పరిస్థితి ఇష్టారాజ్యంగా మారింది. భారీగా సాగు..పురుగుమందుల వినియోగం తెలంగాణలో వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, పప్పు ధాన్యాల పంటలు ఎక్కువగా సాగవుతుంటాయి. వానాకాలంలో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.29 కోట్ల ఎకరాలు. అందులో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.48 లక్షల ఎకరాలు కాగా, వరి సాధారణ సాగు విసీర్తం 57.18 లక్షల ఎకరాలు. ఇక పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 8.52 లక్షల ఎకరాలు, మొక్కజొన్న సాధారణ సాగు విసీర్ణం 6.09 లక్షల ఎకరాలు, సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 4.29 లక్షల ఎకరాలుగా ఉంది.లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగు చేస్తున్న రైతాంగం..వాటిని కాపాడుకునేందుకు పెద్ద ఎత్తున ఎరువులు, పురుగు మందులు వినియోగిస్తున్నారు. ఒక్క వానాకాలం సీజన్కే అన్ని రకాల ఎరువులూ కలిపి 24.40 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమని నిర్ధారించారు. అందులో యూరియానే 10.40 లక్షల మెట్రిక్ టన్నులు ఉండటం గమనార్హం. వీటికితోడు భారీగా పురుగుమందుల వినియోగంతో పంటలు విషతుల్యమవుతున్నాయి. ఎకరానికి 360 కిలోల పురుగు మందుల వినియోగం! నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ తాజా అధ్యయన నివేదిక ‘భారత వ్యవసాయ పరిస్థితి’ప్రకారం పంజాబ్, హరియాణ తర్వాత తెలంగాణలోనే అత్యధికంగా పురుగు మందులు వినియోగిస్తున్నారు. అంటే పురుగుమందుల వాడకంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉందన్నమాట. పంజాబ్లో రైతులు ఎకరానికి 500 కిలోలు, హరియాణలో 440 కిలోలు పురుగు మందులు వినియోగిస్తుండగా, తెలంగాణలో 360 కిలోల పురుగు మందులు ఉపయోగిస్తున్నారని నివేదిక తెలిపింది. ఆరు జిల్లాల్లో ఎక్కువ గతంలో వ్యవసాయ శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో క్రిమి సంహారక రసాయనాల వినియోగం అత్యధికంగా ఉంది. వరి, పత్తి, కంది పంటలకు ఎక్కువగా క్రిమి సంహారక రసాయనాలు వినియోగిస్తున్నట్లు తేలింది. రైతులు దుకాణాదారుల వద్దకు వెళ్లడం.. వారు ఏది ఎంత వాడమంటే అంత వాడుతున్న పరిస్థితి నెలకొంది. వాస్తవానికి భూసార పరీక్షలు నిర్వహించి, వ్యవసాయాధికారుల సూచనలకు అనుగుణంగా ఎరువులు, పురుగుమందుల వాడకం ఉండాలి. నిజానికి పంటలను చీడపీడలు పట్టిపీడిస్తుంటే వ్యవసాయశాఖ అధికారులు వాటిని పరిశీలించి ఏ మందులు వాడాలో సూచిస్తూ మందుల చిట్టీ (ప్రిస్కిప్షన్) రాయాలి. కానీ అవేవీ జరగడంలేదు.ఆరోగ్యంపై ప్రభావం రసాయన పురుగుమందులను విచ్చలవిడిగా వినియోగించిన పంటలు మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. గ్లైపోసేట్ను ఎక్కువగా ఉపయోగిస్తే క్యాన్సర్ సోకే ప్రమాదముంది. ఆ మందు చల్లినచోట చుట్టుపక్కల పంటలపైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది. పశువులు, పక్షులపై ప్రభావం చూపి జీవవైవిధ్యానికి నష్టం వాటిల్లుతుంది. ఇతరత్రా మందులు వాడిన పంటలు తినడం వల్ల కూడా దీర్ఘకాలంలో అనారోగ్యానికి గురయ్యేందుకు అవకాశం ఉంటుంది.అయినా ఏళ్లుగా మూసపద్ధతి సాగుకు అలవాటు పడిన రైతులు మోతాదుకు మించి ఎరువులు, పురుగు మందులు వాడుతున్నారని, మోతాదుకు మించి రసాయన ఎరువులు, పురుగు మందులు వాడటం వల్ల తెగుళ్లు నశించకపోగా ఏటా కొత్తవి పుట్టుకొస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి భూమిని, వాతావరణాన్ని కలుíÙతం చేయడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులపైనా ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని వారు పేర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో రైతులు ప్రాణాలు కూడా కోల్పోతున్నారని తెలిపారు. -
ఏలూరు జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్స్..రైతులకు భారీ నష్టం
-
గడ్డినే కాదు, జీవులనూ చంపుతుంది!
ఒక ఉత్పత్తి గురించి అనేక దేశాలు గోస పడుతున్నాయి. అయినా దాని మీద శాశ్వత నిషేధం విధించడం లేదు. కలుపు సంహారక సమ్మేళనం గ్లైఫోసేట్ (గడ్డి మందు) వల్ల పర్యావరణం మీద, వ్యవసాయ కార్మికుల మీద, గ్రామీణ ప్రజల ఆరోగ్యం మీద దుష్ప్రభావాలు పెరుగుతున్నాయి. నేరుగా క్యాన్సర్ కలుగజేసే దీన్ని ఆహార పంటల క్షేత్రాలలో వినియోగించడం చాలా ప్రమాదకరం. దీన్ని పిచికారీ చేసిన పంట వ్యర్థాలను తిని గొర్రెలు, మేకలు, ఇతర పశువులు కూడా చనిపోయాయి. అయినా దీన్ని వినియోగం ఆపడం, ఉత్పత్తిని నిలిపివేయడం, అడ్డుకోవడం సవాలుతో కూడుకున్నదని స్పష్టమవుతోంది. వివిధ దేశాల రాజకీయ సంకల్పం పెద్ద కంపెనీల గణనీయమైన లాబీయింగ్ శక్తి ముందు దిగదుడుపే అని అర్థమవుతోంది.2015లో గ్లైలఫోసేట్ నిషేధాన్ని ఆమోదించి, అమలుచేసిన మొట్టమొదటి దేశం శ్రీలంక. కానీ ఈ నిషేధాన్ని 2018లో పాక్షికంగా మార్చవలసి వచ్చింది. 2022లో పూర్తిగా ఉపసంహరించబడింది. 2014లో ఒక స్థానిక శాస్త్రవేత్త గ్లైలఫోసేట్ వలన ‘క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆఫ్ అన్నోన్ ఆరిజిన్’ వస్తున్నదని పరిశోధించి చెప్పిన దరిమిలా శ్రీలంక నాయకత్వం దీని మీద దృష్టి పెట్టింది. 2015లో ఎన్నికైన మైత్రిపాల సిరిసేన ప్రభుత్వం ఈ నిషేధాన్ని ఆమోదించింది. ఈ నిషేధం అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బౌద్ధ సన్యాసి రథనా థెరో మద్దతు కొరకు ఇచ్చిన వాగ్దానం. కానీ తర్వాత నిషేధంలో వెనక్కి తగ్గడం, తరువాత పూర్తిగా ఎత్తి వేయడం జరిగింది. ఈ లాబీయింగ్ వెనుక అమెరికా ప్రభుత్వం, బేయర్ కంపెనీ (అప్పట్లో మోన్శాంటో) ఉన్నదని అందరికీ తెలుసు. డిసెంబర్ 2023లో, నెలల తరబడి తర్జనభర్జనల తర్వాత, ఐరోపా కూటమి దేశాలలో కొన్ని నిషేధించాలని కోరినా, దీని లైసెన్స్ను పునరుద్ధరించాలని యూరోపియన్ కమిషన్ నిర్ణయించింది. మరో పదేళ్లపాటు వినియోగాన్ని ఆమోదించింది. ఆస్ట్రియా, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, బెల్జియం, లక్సెంబర్గ్, జర్మనీ వంటి కొన్ని యూరప్ దేశాలు కొన్ని ప్రాంతాల్లో, ఇళ్లల్లో దీని వాడకంపై పాక్షిక నిషేధాలనో, పరిమితులనో విధిస్తున్నాయి.గ్లైఫోసేట్ ఒక రసాయన ఉత్పత్తి. ఇదివరకు మోన్శాంటో, తరువాత దానిని కొన్న బేయర్ కంపెనీ అంతర్జాతీయ గుత్తాధిపత్య కంపెనీ. చాలా శక్తిమంతమైన ఐరోపా కూటమి కూడా ఈ కంపెనీ ఒత్తిడికి తలొగ్గి జీవరాశికి, మానవాళికి ప్రమాదకరంగా పరిణమించిన గ్లైఫో సేట్ వాడకం ఆపలేకపోయింది. సాంకేతిక, మార్కెట్, నియంత్రణ వ్యవస్థల మధ్య ఏర్పడిన ఒక సంక్లిష్టమైన పరస్పర అవగాహన వల్ల ఆధునిక వ్యవసాయంలో గ్లైఫోసేట్కు ప్రోత్సాహం లభించిందని ఒక ఆధ్యయనం చెబుతున్నది. ఇందులో 4 కీలక విషయాలు ఇమిడి ఉన్నాయి. (1) జన్యుమార్పు పంటల మీద ఉపయోగం కోసం గ్లైఫో సేట్ వినియోగం; (2) కొత్త వ్యవసాయ వినియోగాలను ప్రోత్సహించడం ద్వార ప్రపంచవ్యాప్త సాధారణ గ్లైఫోసేట్ మార్కెట్ పెరుగుదల; (3) గ్లైఫోసేట్ వాడకంతో మిళితం చేసే డిజిటల్ వ్యవసాయం, జీనోమ్ ఎడిటింగ్ వంటి కొత్త సాంకేతిక ప్రోత్సాహం; (4) కార్పొరేట్ మార్కెట్ శక్తి పెరుగుదల వల్ల వ్యవసాయ పరిశోధన కార్యక్రమాల్లో ప్రభుత్వ పెట్టుబడి తగ్గి హెర్బిసైడ్ రహిత కలుపు నియంత్రణ మీద పరిశోధనలు ఆగిపోవడం.మన దేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో ప్రభుత్వాలు ఆ మధ్య వరుసగా ఒక మూడు సంవత్సరాలు దీనిమీద 60 రోజులు పాటు నిషేధం ప్రకటించాయి. ఈ తాత్కాలిక నిషేధం ఉద్దేశ్యం చట్టవిరుద్ధమైన, హెర్బిసైడ్–తట్టుకునే బీటీ పత్తి విత్తనాలను ఉపయోగించకుండా అరికట్టడానికి అని చెప్పారు. ఈ తాత్కాలిక నిషేధం కూడా కాగితాలకే పరిమితం అయ్యింది. ఆ పరిమిత నిషేధ కాలంలో కూడా బహిరంగంగానే అమ్మకాలు జరిగాయి. పురుగు మందుల నియంత్రణ చట్టం, 1968 ప్రకారం రాష్ట్రాలు విష రసాయనాలను 60 రోజుల వరకు మాత్రమే నిషేధించవచ్చు. కేంద్ర ప్రభు త్వానికి మాత్రమే శాశ్వతంగా నిషేధించే అధికారం ఉంది. వివిధ రాష్ట్రాలు కోరినా కేంద్రం నిషేధం గురించి స్పందించడం లేదు. కేరళ, సిక్కిం రాష్ట్రాలు మాత్రం కొన్ని అధికరణలను ఉపయోగించి శాశ్వత నిషేధం విధించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కేంద్రానికి రాసి మిన్నకున్నాయి. ఇతర విషయాలలో అధ్యయనాలకు బృందాలను పంపే రాష్ట్రాలు మరి కేరళ, సిక్కిం ఎట్లా సాధించాయో తెలుసు కునే ప్రయత్నం చేయలేదు.2019–21 మధ్య స్వదేశీ జాగరణ్ మంచ్ అవగాహన కార్య క్రమాలు చేపట్టి, గ్లైఫోసేట్ను పూర్తిగా నిషేధించాలని కోరుతూ రెండు లక్షల మంది సంతకాలతో కూడిన మెమోరాండంను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రికి సమర్పించింది. స్వదేశీ జాగరణ్ మంచ్ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ. అనేక విషయాలలో ఆర్ఎస్ఎస్ అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్నదని ఆరోపణ ఎదురుకుంటున్న కేంద్ర ప్రభుత్వం, గ్లైఫోసేట్ మీద మాత్రం ఆ సంస్థ కోరిన నిషేధం విధించలేకపోతున్నది. రాజకీయ ఒత్తిడులలో ఉండే అధికార క్రమం ఇక్కడ స్పష్టంగా కనపడుతున్నది. అక్టోబర్ 2020లో, పెస్టిసైడ్ యాక్షన్ నెట్వర్క్ ఇండియా మరియు పాన్ ఆసియా పసిఫిక్ సంయుక్తంగా ‘స్టేట్ ఆఫ్ గ్లైఫోసేట్ యూజ్ ఇన్ ఇండియా’ నివేదికను విడుదల చేశాయి. దీని వాడకం విచ్చలవిడిగా ఉందని నివేదించాయి. దీని వల్ల పర్యావరణం మీద, వ్యవసాయ కార్మికుల మీద, గ్రామీణ ప్రజల ఆరోగ్యం మీద దుష్ప్ర భావాలు పెరుగుతున్నాయని పేర్కొంది. నేరుగా క్యాన్సర్ కలుగజేసే దీన్ని ఆహార పంటల క్షేత్రాలలో వినియోగించడం ప్రమాదకరం.ప్రజల నుంచి, సంస్థల నుంచి వచ్చిన ఒత్తిడుల నేపథ్యంలో నిషేధించకుండా కేంద్ర ప్రభుత్వం 2020లో కొన్ని ఆంక్షలు ప్రకటించింది. దీని ప్రకారం పెస్ట్ కంట్రోల్ ఆపరేటర్ల ద్వారా తప్ప ఏ వ్యక్తి కూడా దీన్ని పిచికారీ చేయరాదు. అంటే సాధారణ రైతులు ఉప యోగించరాదు. కేవలం రసాయన పిచికారి చేసే సంస్థల ద్వారానే ఉపయోగించాలని కొత్త నిబంధన తెచ్చింది. తదుపరి కంపెనీ నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గి ఈ ఆంక్షలను సవరించారు. శిక్షణ పొందిన వారు ఎవరైనా ఉపయోగించవచ్చు అని చెప్పారు. ఆ శిక్షణ ఇవ్వడానికి ఒక కేంద్ర పరిశోధన సంస్థకు అప్పజెప్పితే వారు కొన్ని ఆన్లైన్ తరగతులు నిర్వహించి ఒక సర్టిఫికెట్ ఇస్తున్నారు.రైతులలో పూర్తి అవగాహన లేకపోవడం, పురుగుమందు / విత్తన కంపెనీల మార్కెట్ మాయాజాలం, కొరవడిన ప్రభుత్వ నియంత్రణ వంటి కారణాల వల్ల, రైతులు దీన్ని వాడుతున్నారు. రైతులు తాము కొన్నవి గ్లైఫోసేట్ తట్టుకునే విత్తనాలు అనుకుని, కాయ కాసిన తరుణంలో, గడ్డిని తొలగించటానికి దీన్ని వాడటం వల్ల, మొత్తం పంట మాడిపోయి నష్టపోయిన ఉదంతాలు ఉన్నాయి. దీని వాడకం మీద ఆంక్షలు ఉండడంతో, ప్రభుత్వం నుంచి పరిహారం కోరే అవకాశం కూడా లేకుండా పోయింది. గ్లైఫోసేట్ పిచికారీ చేసిన గడ్డి అని తెలియక దాన్ని నోట్లో పెట్టుకున్న ఒక అమ్మాయి చనిపోయింది. అనేక విధాలుగా గ్రామాలలో అమాయకులు ఈ విష రసాయనాల బారిన పడి అనారోగ్యం పాలవుతున్నారు. పంట ఎండపెట్టడానికి ఓపిక లేని రైతులు పంట కోతకోచ్చే సమయానికి దీన్ని వాడు తున్నారు. దాని వల్ల మొక్క మాడుతుంది, చచ్చిపోతుంది. అట్లాంటి పంట వ్యర్థాలు విషపూరితం అవుతాయి. దీన్ని పిచికారీ చేసిన పంట వ్యర్థాల్నితిని గొర్రెలు, మేకలు, ఇతర పశువులు కూడా చనిపోయాయి.క్యాన్సర్ ప్రమాదాల గురించి వినియోగదారులను హెచ్చరించడంలో కంపెనీ విఫలమైందని పేర్కొంటూ మో¯Œ శాంటో (ఇప్పుడు బేయర్ యాజమాన్యంలో ఉంది)తో సహా గ్లైఫోసేట్తో సంబంధం ఉన్న రౌండప్ తయారీదారులపై అమెరికాలో వేలకొద్దీ కోర్టు వ్యాజ్యాలు దాఖలైనాయి. 2019 నాటికి ఇవి 42,700. ఇతర దేశంలో గ్లైఫోసేట్ మీద ఈగ వాలితే అమెరికా ప్రభుత్వం వాలిపోతుంది. అదే అమెరికాలో వేల కొద్ది వ్యాజ్యాలను ఆ కంపెనీ ఎదుర్కుంటున్నది.మానవాళికి, జీవకోటికి ప్రమాదకరంగా పరిణమించిన ఈ వ్యాపార వస్తువును నిషేధించలేని పాలనా వ్యవస్థలను, అందులోని లోపాలను అధ్యయనం చేయాలి. ఒక వ్యాపార వస్తువుని నియంత్రించలేని దేశాధినేతల బలహీనతలు ఇక్కడే తేలిపోతున్నవి. ప్రజా రోగ్యాన్ని దెబ్బ తీస్తూ, పర్యావరణానికి దీర్ఘకాల హాని చేసే రసాయనాల నియంత్రణ మీద ఒక వైపు అంతర్జాతీయ చర్చలు జరుగు తుంటే మన దేశంలో మాత్రం ఏ చర్యా లేదు. ఇది మారాలి. ఈ పరిస్థితి మారాలంటే మన రాజకీయం మారాలి. డా‘‘ దొంతి నరసింహా రెడ్డి వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు -
46 లక్షల ఎకరాల్లో పంటల సాగు
సాక్షి, హైదరాబాద్: వానాకాలం పంటల సాగును ఈ సారి పెద్ద ఎత్తున చేపడుతున్నారు. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇప్పుడు అధికంగా పంటలు వేస్తున్నారు. గత సంవత్సరం వానాకాలంలో ఇదే సమయానికి 25.79 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా, ఈ సీజన్లో బుధవారం నాటికి 46.85 లక్షల ఎకరాల్లో పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ ఏడాది వానాకాలం అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 35.76 శాతం విస్తీర్ణంలో పంటలు వేశారు. ఇప్పటివరకు వేసిన పంటల్లో అత్యధికంగా పత్తి ఏకంగా 33.81 లక్షల ఎకరాల్లో సాగైంది. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.48 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 66.97 శాతం వేశారు. ఈ ఏడాది పత్తిని 60 లక్షల ఎకరాల్లో పండించాలని చేయాలని ప్రభుత్వం రైతులకు పిలుపునిచ్చింది. కాగా, వరి సాధారణ సాగు విసీర్తం 57.18 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 1.71 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. అంటే మూడు శాతానికే పరిమితమైంది. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 8.52 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.81 లక్షల ఎకరాల్లో వేశారు. అందులో ఒక్క కంది పంటనే 2.37 లక్షల ఎకరాలు కావడం గమనార్హం. మొక్కజొన్న సాధారణ సాగు విసీర్ణం 6.09 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 1.92 లక్షల ఎకరాలు సాగైంది. సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 4.29 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.55 లక్షల ఎకరాల్లో పంట వేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 99.96 శాతం.. ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో పంటల సాగు నమోదైంది. ఇప్పటివరకు సాగైన జిల్లాల్లో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలోనే నమోదు కావడం విశేషం. ఈ జిల్లా సాధారణ పంటల సాగు విస్తీర్ణం 5,62,594 ఎకరాలు కాగా, 5,62,386 ఎకరాల్లో సాగైంది. అంటే 99.96 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. ఇంత తక్కువ కాలంలో ఇంత సాగు కావడం విశేషం. అత్యంత తక్కువగా వనపర్తి జిల్లాలో కేవలం 8.16 శాతం విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో ఆయా ప్రాంతాలను బట్టి సాధారణం, అధికం, అత్యధిక వర్షపాతం నమోదైందని వ్యవసాయశాఖ తెలిపింది. 17 జిల్లాల్లో అధికం నుంచి అత్యధిక వర్షపాతం నమోదైందని పేర్కొంది. నారాయణపేట, నాగర్కర్నూలు, వనపర్తి, గద్వాల, నల్లగొండ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక హైదరాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, మహబూబాబాద్, జనగాం, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, వికారాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఏ జిల్లాలోనూ లోటు వర్షపాతం నమోదు కాలేదని వ్యవసాయ శాఖ తెలిపింది. -
17 లక్షల ఎకరాల్లో సాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 19 వరకు 17 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పత్తి 15.60 లక్షల ఎకరాలు, కంది 76 వేల ఎకరాల్లో సాగయిందని చెప్పారు. రానున్న రోజుల్లో వరినాట్లు, ఆరుతడి పంటల సాగు ఊపందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం సచివాలయంలో వానాకాలం పంటల సాగు, ఎరువుల నిల్వ, సరఫరాపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎరువుల సరఫరా పారదర్శకంగా జరగాలని, ఎవరైనా నిబంధనలు అతిక్రమించి అమ్మకాలు చేస్తే కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేయాలని, అదే విధంగా విక్రయాలను పరిశీలించాలని సూచించారు. 10.40 ఎల్ఎంటీల యూరియా కేటాయింపు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 10.40 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) యూరియా, 2.40 ఎల్ఎంటీల డీఏపీ, 10.00 ఎల్ఎంటీల కాంప్లెక్స్ , 0.60 ఎల్ఎంటీల ఎంవోపీ ఎరువులు కేటాయించిందని మంత్రి తెలిపారు. జూలై చివరి నాటికి 5.65 ఎల్ఎంటీల యూరియా అవసరం కాగా ఇప్పటికే 8.35 ఎల్ఎంటీల యూరియా, అలాగే 1.57 ఎల్ఎంటీల డీఏపీ, 1.30 ఎల్ఎంటీల కాంప్లెక్స్, 0.38 ఎల్ఎంటీల ఎంవోపీ అందుబాటులో తెచ్చామన్నారు. 1.07 ఎల్ఎంటీల యూరియా, 0.54 ఎల్ఎంటీల డీఏపీ, 1.06 ఎల్ఎంటీల కాంప్లెక్స్ ఎరువులను రైతులు కొనుగోలు చేశారని మంత్రికి అధికారులు వివరించారు. ఆగస్టు వరకు సరిపడా ఎరువుల కోసం కేంద్ర మంత్రికి లేఖఆగస్టు నెల వరకు సరిపడా ఎరువులను వీలైనంత త్వరగా రాష్ట్రానికి సరఫరా చేయాలని కోరుతూ కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ మంత్రి జేపీ నడ్డాకు మంత్రి లేఖ రాశారు. వానాకాలం పంటలు తెలంగాణలో ముందుగా ప్రారంభమవుతాయని, దానికి తగ్గట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చే రెండు నెలలకు సరిపడా ఎరువులను ముందుగానే తెప్పించి రైతులకు అందుబాటులో ఉంచేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందని తెలిపారు. రాష్ట్ర కేటాయింపుల ప్రకారం ఆగస్టు నెల వరకు కేటాయించిన డీఏపీ, ఇతర ఎరువులను వెంటనే సరఫరా చేసేలా తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. -
చేనుకుచేవ.. రైతుకు రొక్కం..బయోచార్!
పిఠాపురం: గత కొన్నేళ్లుగా మోతాదుకు మించి వాడుతున్న రసాయనిక ఎరువులు, పురుగు మందులతో భూమి తన సహజ గుణాలను కోల్పోయింది. దీంతో ఆశించిన నాణ్యమైన ఉత్పత్తులను అందించలేక, క్రమంగా చౌడుబారుతోంది. మొక్కలకు ఉపయోగపడే సూక్ష్మజీవులు భూమిలో అంతరించిపోతున్నాయి. తద్వారా భూమి సారాన్ని కోల్పోయి నిస్తేజంగా మారి, నాణ్యమైన పంటలు పండే అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఈ సమస్య నుంచి రైతులను ఆదుకోవడానికి పూర్వం వాడుకలో ఉండే బయోచార్ను (బయో అంటే జీవం.. చార్ అంటే బొగ్గు) మళ్లీ వాడుకలోకి తీసుకు రావడానికి ప్రకృతి వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.బయోచార్తో ఇదీ మేలు... వాస్తవానికి 1850 నుంచే ఈ పద్ధతి వినియోగంలో ఉన్నప్పటికీ కాలక్రమంలో మరుగున పడిపోయింది. ఎలాంటి ఎరువునైనా మొక్కలు గ్రహించి మంచి దిగుబడి రావడానికి బయోచార్ ఒక మంచి ఔషధంగా పని చేస్తుంది. ఆమ్ల గుణాలున్న మట్టి పీహెచ్ స్థితిని సాధారణ స్థాయికి తీసుకుని రావడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. సహజంగా మనం ఎన్ని ఎరువులు వేసినా, వాటిలో మొక్కకు 30 నుంచి 40 శాతం మాత్రమే అందుతాయి. పంటలకు వేసే ఎరువుల్లో బయోచార్ను కలపడం ద్వారా వంద శాతం ఎరువులను మొక్కలు గ్రహించే అవకాశముంటుంది. మట్టిలో తేమ శాతాన్ని క్రమబద్దీకరించి, తగిన తేమ అందేలా చేయడంలో దీనికి మించింది మరొకటి లేదు. మొక్కలకు పోషకాలు అందని చోట ఇది ఉ్రత్పేరకంగా పని చేసి, మొక్కలకు పోషకాలు అందేలా చేస్తుంది. ముఖ్యమైన సూక్ష్మజీవుల సంఖ్యను పెంచుతుంది. నేలలో రసాయనాల గాఢతను తగ్గించి, సహజంగా మార్చుతుంది. ఉపయోగించే విధానం... కర్ర బొగ్గు 50 కేజీలు, చివికిన పశువుల పెంట 50 కేజీలు, రసాయనాలు వాడని అడవి మట్టి లేదా పుట్ట మట్టి 10 కేజీలు తీసుకుని, 8 నుంచి 10 లీటర్ల నీరు, రెండు కేజీల బెల్లం కరిగించి తీసుకోవాలి. దీంతో పాటు ద్రవ జీవామృతాన్ని నేరుగా దీనిలో కలపాలి. వీటన్నిటినీ బాగా కలియబెట్టి వారం పది రోజుల పాటు ఒక డబ్బాలో వేసి నీడలో పెట్టాలి. రోజుకోసారి కలుపుతూ ఉండాలి. లోపల గాలి తగిలే విధంగా గోనె సంచి మూత పెట్టి ఉంచుకోవాలి. పది రోజుల తరువాత బయోచార్ తయారవుతుంది. దీన్ని వరి దమ్ములో వేసుకోవాలి, ఉద్యాన పంటల్లో మొక్కల మొదళ్ల చుట్టూ పళ్లెం కట్టి దానిలో బయోచార్ను వేసి మట్టితో కప్పివేయాలి. దీనివల్ల పంట నాణ్యత పెరుగుతుంది.బయోచార్ తయారీ ఇలా.. బహిరంగంగా కాల్చడం » రెండు మీటర్ల పొడవు, ఒక మీటరు లోతున గొయ్యి తవి్వ, దానిలో వృక్ష వ్యర్థాలను వేసి, ఒకసారి మంట మండిన తరువాత దాన్ని పచ్చటి ఆకులతో కప్పి బయటి నుంచి ఆమ్లజని అందకుండా చేయాలి. తద్వారా రెండు రోజులకు బయోచార్ తయారవుతుంది. » స్థానికంగా లభ్యమయ్యే వృక్ష వ్యర్థాలను, నిరుపయోగంగా పడి ఉండే కట్టెలను కాల్చడానికి వీలుగా గుల్ల తయారీ బట్టీల మాదిరిగా అర్ధచంద్రాకారంలో బట్టీలను తయారు చేసుకోవాలి. ఆ బట్టీల్లో వృక్ష వ్యర్థాలు వేసి, కాల్చి రెండు రోజుల తరువాత తీసుకుంటే బయోచార్ సిద్ధమవుతుంది. నాణ్యత, దిగుబడి పెరిగాయి... రెండేళ్లుగా బయోచార్ ద్వారా నువ్వులు, వేరుశనగ, ఆకుకూరలు పండిస్తున్నాను. దీన్ని వేయక ముందు పంటలు నాసిరకంగా ఉత్పత్తయ్యేవి. బయోచార్ వాడటం మొదలు పెట్టాక పంటల నాణ్యతతో పాటు దిగుబడి బాగా పెరిగింది. నేల సారవంతంగా మారి వర్షాభావ పరిస్థితులను తట్టుకుని, మొక్కలు జీవంతో ఉంటున్నాయి. తేమ తగ్గిపోకుండా ఉంచడంలో ఇది చాలా బాగా పని చేస్తోంది. భూమిలో కార్బన్ శాతం పెరగడానికి ఇది బాగా ఉపయోగపడుతోంది. – దుర్గాప్రసాద్, ఫార్మసీ సైంటిస్టు, రైతు, బలభద్రపురం, జగ్గంపేట మండలం, కాకినాడ జిల్లా బయోచార్తో మంచి ఫలితాలు.. మా పొలంలో ఆరేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. గత ఏడాది ప్రకృతి వ్యవసాయ అధికారులు బయోచార్ గురించి వివరించడంతో దీన్ని ఉపయోగించడం ప్రారంభించాం. దీనివల్ల పంటలకు నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. తడులు తక్కువగా పెట్టినా ఇబ్బంది ఉండటం లేదు. పంటలు గతంలో కంటే ఆశాజనకంగా, నాణ్యతగా వస్తున్నాయి. ఎరువుల వాడకమూ తగ్గింది. కూరగాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉంటున్నాయి. మొక్కల పెరుగుదల చాలా బాగుంది. – ఎం.మల్లీశ్వరి, రైతు, ఒమ్మంగి, ప్రత్తిపాడు మండలం, కాకినాడ జిల్లా ప్రయోగాత్మకంగా చేపట్టాం... బయోచార్ విధానాన్ని గత ఏడాది నుంచి జిల్లాలో ప్రయోగాత్మకంగా ఆచరణలోకి తెచ్చాం. ఈ ఏడాది 1,500 ఎకరాల్లో ఈ విధానంలో సాగు చేయాలని నిర్ణయించాం. ఇప్పటి వరకూ 50 ఎకరాల్లో 60 మంది రైతులు ఈ విధానంలో సాగు చేపట్టారు. ప్రస్తుత ఖరీఫ్లో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ ఈ విధానం అమలుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. దీన్ని ఒకసారి ఉపయోగిస్తే కనీసం 60 నుంచి 80 రోజుల పాటు పంటలకు పోషకాలను అందిస్తుంది. ఎనిమిదేళ్లపాటు ఫలితం ఉంటుంది. ఎరువుల వాడకం 60 నుంచి 70 శాతం తగ్గిపోతుంది. నీటి ఎద్దడి ఉన్నా పంటలు నష్టపోకుండా దిగుబడులు ఇస్తాయి. – ఎలియాజర్, ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారి, కాకినాడ కమిటీతో బయోచార్ పంటల సాగు... బయోచార్తో లాభాలను జిల్లాలోని రైతులకు తెలియజేస్తున్నాం. 2024 రబీలో 19 మంది రైతు శాస్త్రవేత్తలతో బయోచార్ తయారు చేయించి, పొలాల్లో వేయించి, ఆ పొలాల పరిస్థితిని అంచనా వేశాం. ఈ ఏడాది ఖరీఫ్, వచ్చే రబీలో 19 మంది రైతు మెంబర్లతో దీన్ని తయారు చేయించి, వారి పొలాల్లో వేయించి, పంటల తీరును ఇతర రైతులకు తెలియజేసేవిధంగా అవగాహన కల్పించాం. ఎక్కువ మంది రైతులు ఈ విధానంలో పంటలు సాగు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. – రేష్మ సోమ, జిల్లా పాయింట్ పర్సన్, ప్రాజెక్టు లింక్ అసోసియేట్, కాకినాడ -
Telangana Rains Photos: తెలంగాణలో అకాల వర్షం కారణంగా ఆవేదనలో అన్నదాత (ఫొటోలు)
-
సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు
కడెం(ఖానాపూర్): రబీ సీజన్లో సాగు చేసిన పంటలకు నీరందించాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు ఆందోళన చేపట్టారు. నిర్మల్ జిల్లాలోని సదర్మాట్ కాలువకు నీటిని విడుదల చేయాలని కడెం మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన రైతులు నచ్చన్ఎల్లాపూర్ వద్ద నిర్మల్–మంచిర్యాల ప్రధాన రహదారిపై గురువారం బైఠాయించారు. వారం రోజులుగా సదర్మాట్ కాలువకు నీటిని విడుదల చేయకపోవడంతో కడెం మండలంలోని లింగాపూర్, మాసాయిపేట్, నచ్చన్ఎల్లాపూర్, పెద్దూర్తండా, చిట్యాల్, ధర్మాజీపేట్, తదితర గ్రామాల్లోని సుమారు 13 వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని వారితో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. రైతులు ఆందోళన చెందవద్దు: ఎమ్మెల్యే వెడ్మ సదర్మాట్ రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, కాలువ నీళ్లు వస్తాయ ని రైతులు ఆందోళన చెందవద్దని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ హామీ ఇచ్చారు. సదర్మాట్ చివరి ఆయకట్టు వరకు నీటిని విడుదల చేయాలని ఈఎన్సీ నుంచి ఎస్ఈకి గురువారమే ఆదేశాలు వచ్చాయని ఆయన వెల్లడించారు. -
భగీరథ ప్రయత్నం!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఆరుగాలం శ్రమించి వేసుకున్న పంటలను కాపాడుకొనేందుకు రైతులు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. కళ్ల ముందే ఎండిపోతున్న పంటలను బతికించుకొనేందుకు రూ.లక్షలు వెచ్చిస్తున్నారు. కరువు కారణంగా భూగర్భ జలాలు అడుగంటి బోర్లు వట్టిపోవడంతో పంటలను ఎలాగైనా కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. నాగార్జునసాగర్ ఆయకట్టులో ఇప్పటికే వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు నష్టపోగా సాగర్ బ్యాక్ వాటర్ కింద సాగు చేసుకుంటున్న రైతులు పంటలను కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా బత్తాయి, మామిడి వంటి పండ్ల తోటలతోపాటు వేరుశనగ, వరి పంటలను బతికించుకొనేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. ముఖ్యంగా సాగర్ జలాశయం డెడ్ స్టోరేజికి చేరడంతో బ్యాక్ వాటర్ కిలోమీటర్ల మేర తగ్గిపోయింది. దీంతో నల్లగొండ జిల్లా పీఏ పల్లి మండలంలోని నంభాపురం, పెద్దగట్టు, పుట్టంగండి తదితర ప్రాంతాల్లో గిరిజన రైతులు పంటకు నీరందించేందుకు కిలోమీటర్ల పొడవునా పైపులైన్లు వేసుకొని మోటార్లు పెట్టి నీటిని తరలిస్తున్నారు. పెద్దవూర మండలం పాత్తితండా, పర్వేదుల తదితర గ్రామాల రైతులు పదుల సంఖ్యలో సాగర్ వెనుక జలాశయంలోని లోతట్టు ప్రాంతాల్లో కొద్దిపాటి నీళ్లు ఉన్న ప్రదేశాలకు దూరంగా బావులు తవ్వి అక్కడి నుంచి 7–8 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేసుకుంటున్నారు. పంటల కోసం తంటాలు పడుతున్నాం పంటలు ఎండిపోకుండా నానా తంటాలు పడుతున్నాం. అప్పులు చేసి మరీ పంటలను కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్నాం. నాగార్జునసాగర్ జలాశయం డెడ్ స్టోరేజికి చేరడంతో బ్యాక్ వాటర్ నుంచి పంటలకు నీటిని అందించేందుకు కిలోమీటర్ల పొడవునా పైప్లైన్లు వేస్తున్నాం. – రమావత్ పత్తి, నంభాపురం -
ఆశలు..అడుగంటి.. గణనీయంగా పడిపోయిన భూగర్భ జలమట్టాలు
సాక్షి ప్రతినిధులు మహబూబ్నగర్/ కరీంనగర్/ ఖమ్మం: రాష్ట్రంలో ఎండలు మండిపోతుండటం, భూగర్భ జలాలు అడుగంటడంతో పలు జిల్లాల్లో పంటలు ఎండి పోతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. నీటి కొరత మామిడి లాంటి పంటల దిగుబడిపై ప్రభావం చూపిస్తోందని రైతులు చెబుతున్నారు. అప్పులు చేసి వివిధ రకాల పంటలు సాగు చేసిన రైతులు పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేకపోవడంతో లబోదిబోమంటున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్లో బోర్లు వట్టి పోవడంతో నీరందక ఇప్పటివరకు లక్షకు పైగా ఎకరాల్లో పంటలు ఎండినట్లు అంచనా. ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా మండే ఎండలు,అడుగంటిన భూగర్భ జలాలతో పంటలు ఎండిపోతున్నాయి. నిజానికి 2022–23 యాసంగిలో మొత్తం 5,15,375 ఎకరాల్లో పంటలు సాగైతే ఈ ఏడాది 3,55,827 ఎకరాల్లోనే సాగు చేశారు. పాలేరు రిజర్వాయర్ పరిధిలోని పాత కాల్వ కింద కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో సుమారు5 వేలకు పైగా ఎకరాల్లో వరి ఎండింది. భగీరథ ప్రయత్నం చేసినా.. ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామానికి చెందిన శీలం విష్ణు ఈ ఏడాది యాసంగిలో వైరా నది కింద11 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేశాడు. మరో 20 రోజుల్లో వరి చేతికి అందనుండగా వైరా రిజర్వాయర్లో నీటిమట్టం తగ్గిపోయింది. దీంతో వైరా నదిలో పొక్లెయినర్తో గుంతలు తవ్విం చి మోటారు ద్వారా పైరుకు నీరందించే ప్రయత్నం చేశాడు. అయినా ఫలితం లేక 80 శాతం మేర పంట ఎండిపోయింది. పెట్టిన పెట్టుబడి అంతా నేల పాలైందని విష్ణు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రధానంగావరి పంటపై రైతాంగం ఆధారపడుతుంది.పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో ఈసారి మార్చి 31 వరకు వేసంగి పంటకు నీరందింది. కానీ గతేడాదితో పోలిస్తే ఆశించినంత మేరకు అందలేదు. ఫలితంగా వేలాది ఎకరాల్లో వరి ఎండిపోయింది. పలుచోట్ల పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. కరీంనగర్ జిల్లాలో దాదాపు 25వేల ఎకరాల వరకు వరి పంట సాగునీరు అందక ఎండిపోయిందని అనధికారిక అంచనా. పెద్దపల్లి జిల్లాలో ఎండలు దంచికొడుతుండటంతో చెరువులు, బావులు వట్టిపోతున్నాయి. మంథని, ముత్తరాం, రామగిరి, కాల్వ శ్రీరాంపూర్, ఓదెలా మండలాల్లో సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. వీర్నాపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో మాత్రం కొంతమేర వరి పంట ఎండిపోయింది. ఇక జగిత్యాల జిల్లాలో ప్రధాన సాగునీటి ప్రాజెక్ట్ అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కింద కాలువ ఆయకట్టు చివరి భూములకు నీరందక జిల్లావ్యాప్తంగా దాదాపు 10 వేల ఎకరాల వరకు పొలాలు ఎండిపోయాయి. ఈనిన వరి ఎండిపోయింది.. ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు లకావత్శ్రీనివాస్. ఊరు సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్మండలం సేవాలాల్ తండా. యాసంగిలోమూడెకరాల్లో వరి పంట వేశాడు. 3 బోరు బావులు నమ్ముకుని పంట సాగు చేస్తే భూగర్భజలాలు కాస్తా అడుగంటిపోయాయి. దీంతో బోర్లు వట్టిపోయి 3 ఎకరాల్లో ఈనిన పంటఎండిపోయింది. ఇటీవల రూ.లక్ష వెచ్చించి550 ఫీట్ల లోతులో బోరు వేయించాడు.కానీ నీళ్లు పడక పోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నాడు. బకెట్తో నీళ్లు పోస్తూ.. ఈమె రైతు బోయ అంజమ్మ.నారాయణపేట జిల్లా మరికల్ మండలంఅప్పంపల్లికి చెందిన ఈమె పదేళ్లుగా కూరగాయల సాగు చేస్తోంది. ఈ ఏడాది అరఎకరంలో బెండతో పాటు ఇతర కూరగాయలు సాగు చేసింది. ఎండల తీవ్రత కారణంగా బోర్లల్లో నీటిమట్టం దాదాపుగా అడుగంటి పోయింది. వచ్చే కొద్దిపాటి నీటిని బిందెలు,బకెట్ల ద్వారా పోస్తూ పంటలు కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. 5 బోర్లువేశాడు మక్తల్ మండలం ఉప్పర్పల్లికి చెందిన రవీందర్రెడ్డికి 4 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.ఈ యాసంగిలో బోరుబావి కింద రెండు ఎకరాల్లో వరి, మిగతా మిరప తోట సాగు చేశాడు.భూగర్భజలాలు అడుగంటడంతో సుమారు రూ.1.20 లక్షలు వెచ్చించి ఐదు బోర్లు వేశాడు. రెండింటిలో నీరు పడలేదు. మూడింటిలో అంతంత మాత్రంగా నీరు పడింది. మిరపతోటకు నీరు సక్రమంగాఅందకపోవడంతో రూ.40 వేల వ్యయంతో స్ప్రింక్లర్లు వేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. చేసిన అప్పు ఎలా తీర్చాలని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
‘కరువు’ సాగు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి. కాలువల ద్వారా సాగునీటి సరఫరా అందడం లేదు. బోర్లు, బావుల్లో నీళ్లు అడుగంటిపోయాయి. దీనితో చాలాచోట్ల సాగునీటికి కొరత ఏర్పడింది. దీనితో ముఖ్యంగా వరి పంట దెబ్బతింటోంది. పొట్టదశకు వచ్చిన వరి ఎండిపోతుంటే రైతులు ఆందోళన పడుతున్నారు. ఎలాగోలా పంటను కాపాడుకోవడానికి ట్యాంకర్లతో నీటిని తెచ్చి పొలాల్లో పోస్తున్నారు. ఇలా చేయలేనివారు కన్నీటితో పంటలను అలాగే వదిలేస్తున్నారు. పశువుల మేతకు వినియోగిస్తున్నారు. కొందరు రైతులు ఎండిన పంటలకు ఆవేదనతో నిప్పు పెడుతున్నారు. మూడో వంతు పంటలకు దెబ్బ వర్షాభావంతో కృష్ణానది పరీవాహక ప్రాంతంలోని రిజర్వాయర్లు నిండలేదు. దీనితో యాసంగి సీజన్లో ప్రాజెక్టుల నుంచి సాగుకు నీటిని విడుదల చేయలేదు. దీనికితోడు భూగర్భజలాలు పడిపోవడం మరింత కష్టం తెచ్చిపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 లక్షల ఎకరాల్లో వరి పంట ఎండిపోయిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మిగతా పంటలనూ కలుపుకొంటే యాసంగిలో సాగుచేసిన పంటల్లో దాదాపు 30 శాతం మేర ఎండిపోయాయని పేర్కొంటున్నారు. దీనితో గ్రామాల్లో రైతులతోపాటు కూలీలకు కూడా పనులు లేకుండా పోయాయి. ఉపాధి హామీ పనులే జీవనాధారంగా మారాయి. ఇది కరువు పరిస్థితేనని వ్యవసాయశాఖ వర్గాలు అంటున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం దీనిని కరువుగా భావించడం లేదని పేర్కొంటున్నాయి. అడుగంటిన భూగర్భ జలాలు.. గత ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలో భూగర్భ జలాలు సగటున 7.34 మీటర్ల లోతులో ఉండగా.. ఈసారి ఫిబ్రవరి నాటికి 8.70 మీటర్ల లోతుకు పడిపోయాయి. కామారెడ్డి జిల్లాలో 10.64 మీటర్ల లోతు నుంచి.. ఈసారి 12.92 మీటర్ల లోతుకు తగ్గిపోయాయి. ఖమ్మం జిల్లాలో 5.11 మీటర్ల నుంచి 6.22 మీటర్ల లోతుకు.. మేడ్చల్ జిల్లాలో 8.97 మీటర్ల నుంచి 11.45 మీటర్ల లోతుకు.. నాగర్కర్నూల్ జిల్లాలో 6.57 మీటర్ల నుంచి 9.52 మీటర్ల లోతుకు పడిపోయాయి. మహబూబ్నగర్, నల్లగొండ, వికారాబాద్ జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మహబూబ్నగర్ జిల్లాలో 6.93 మీటర్ల నుంచి ఏకంగా 10.19 మీటర్ల లోతుకు.. నల్లగొండ జిల్లాలో 6.15 మీటర్ల నుంచి 10.86 మీటర్ల లోతుకు.. వికారాబాద్ జిల్లాలో 13.07 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయాయి. తగ్గిన పంటల సాగు విస్తీర్ణం సాగు నీటి వసతులు తగ్గడంతో గతేడాదితో పోలిస్తే ఈసారి యాసంగి సీజన్లో రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. గత యాసంగిలో 72.58 లక్షల ఎకరాల్లో పంటలు వేయగా.. ఈసారి 66.30 లక్షల ఎకరాలకే పరిమితమయ్యాయి. సుమారు 6.28 లక్షల ఎకరాలు తగ్గినట్లు వ్యవసాయశాఖ తేలి్చ, ప్రభుత్వానికి నివేదిక కూడా అందజేసింది. గత యాసంగిలో 56.44 లక్షల ఎకరాల్లో వరి సాగైతే.. ఈసారి 50.69 లక్షల ఎకరాలకే పరిమితమైంది. అంటే 5.75 లక్షల ఎకరాల సాగు తగ్గింది. పప్పుధాన్యాల సాగు గత యాసంగిలో 4.33 లక్షల ఎకరాలు అయితే.. ఇప్పుడు 3.18 లక్షల ఎకరాలకు తగ్గింది. ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏది? ఒకవైపు పంటల సాగు విస్తీర్ణం తగ్గడం, మరోవైపు వేసిన పంటలు ఎండిపోతుండటం ఆందోళనకరంగా మారింది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా వ్యవసాయశాఖ స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంటలు ఎండిపోతుంటే ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేయడంలో వ్యవసాయ శాఖ విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. కనీసం తమకు భరోసా కల్పించే ప్రయత్నాలైనా చేయడం లేదని రైతులు మండిపడుతున్నారు. పంట నష్టంపై సర్వే చేయడంలోనూ నిర్లక్ష్యం వహిస్తోందని.. సర్వే చేసి కరువు తీవ్రతను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తే.. పరిహారమో, సాయమో అందే పరిస్థితి ఉండేదని వాపోతున్నారు. మూడు జిల్లాల్లో ‘సాగు’ గోస! ► ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో యాసంగి కింద ప్రధానంగా వరి, మొక్కజొన్న, జొన్న, వేరుశనగ, ఇతర పంటలు సాగు చేశారు. మొత్తం 7,25,345 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఇందులో వరి 4,71,047 ఎకరాల్లో సాగైనట్లు అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. కానీ సాగునీరు అందక, బోర్లు వట్టిపోవడంతో ఇప్పటివరకు సుమారు 88,752 ఎకరాల్లో వరి, 2,605 ఎకరాల్లో వేరుశనగ, మొక్కజొన్న పంటలు ఎండిపోయినట్టు ప్రాథమిక అంచనా. ► ఖమ్మం జిల్లాలో గత నాలుగేళ్లుగా యాసంగిలో మూడు లక్షల ఎకరాలకుపైగా పంటలు సాగవుతున్నాయి. నాగార్జునసాగర్ జలాలు అందుబాటులో ఉండటంతోపాటు బోర్లు, బావులు, చెరువుల కింద సాగు కొనసాగింది. కానీ ఈసారి కృష్ణా పరీవాహకంలో వర్షాభావంతో సాగర్ నిండలేదు. పంటల సాగుకు జలాలు విడుదల కాలేదు. దీనితో వరి, ఇతర పంటల సాగు తగ్గింది. చాలా మంది చెరువులు, బోర్లపై ఆధారపడి పంటలు వేశారు. దీంతో ఈ ఏడాది సాగు 1,47,389 ఎకరాలకే పరిమితమైంది. ఇందులో వరి 80,025 ఎకరాల్లో, మొక్కజొన్న 57,342 ఎకరాల్లో వేశారు. సాగైన చోట కూడా పంటలు ఎండిపోతున్నాయి. ► ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని మండలాల్లో పంటలు ఎండిపోతున్నాయి. నాగార్జునసాగర్, ఏఎమ్మార్పీ కాల్వల కింద ఏడాది నుంచి సాగునీరు అందలేదు. భూగర్భ జలాలు అడుగంటడంతో వందల సంఖ్యలో బోర్లలో నీరు రావడం లేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు లక్ష ఎకరాల్లో వరి ఎండిపోయినట్టు అంచనా. పంటలను కాపాడుకోవడానికి రైతులు నానా యాతనా పడుతున్నా ప్రయోజనం ఉండటం లేదు. కొన్ని గ్రామాల్లో చేసేదేమీ లేక పొలాలను పశువుల మేతకు వదిలేస్తున్నారు. పంట పశువుల మేతకు వదలాల్సి వచ్చింది నాకు ఊరు చెరువు వెనకాల రెండెకరాల పొలం ఉంది. యాసంగిలో వరిసాగు చేసేందుకు చెరువు నుంచి నీరు వదలడం లేదు. దీనితో జనవరిలో పొలంలో బోరు వేయించాను. నీరు బాగానే పడటంతో నా రెండెకరాలకు తోడు మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేశా. కానీ నెలన్నర రోజుల్లో బోరు ఎండిపోయింది. పంటను దక్కించుకునేందుకు 400 అడుగుల లోతుతో మరో బోరు వేయించా. అందులోనూ నీరు అడుగంటింది. దీనితో మరో రెండు బోర్లు వేయించినా ఫలితం లేకపోయింది. పొలం ఎండిపోవడంతో పశువుల మేతకు వదిలిపెట్టా. నాలుగు బోర్లు, పంట పెట్టుబడికి ఏడు లక్షలదాకా అప్పులు అయ్యాయి. ప్రభుత్వమే ఆదుకోవాలి. – చిన్నయ్య, రైతు, గాధిర్యాల్ గ్రామం, మహమ్మదాబాద్ మండలం, మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వం ఆదుకోవాలి నందిగామ బ్రాంచి కెనాల్ కింద రెండెకరాల వరి వేశా. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో సాగునీరు అందక ఎండిపోయింది. మునుపెన్నడూ లేనంతగా నష్టపోయాను. ప్రభుత్వం ఆదుకోవాలి. – మల్లెబోయిన సైదులు, రైతు, భైరవనిపల్లి గ్రామం, నేలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లా నాలుగెకరాల పంటంతా ఎండి పోయింది నాకున్న నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశాను. సుమారు రూ.లక్ష వరకు పెట్టుబడి అయింది. ఉన్న ఒక్క బోరులో నీళ్లు అడుగంటాయి. నీళ్లు సరిపోక పంటంతా ఎండిపోయింది. ఎస్సారెస్పీ నీళ్లు కూడా వచ్చే పరిస్థితి లేక పంటను వదలివేసిన. – ధరావతు సోమాని, రైతు, పాశ్చ్యానాయక్ తండ, చివ్వెంల మండలం, సూర్యాపేట జిల్లా రెండు బోర్లూ అడుగంటాయి రెండున్నర ఎకరాల భూమిలో వరి వేశాను. ఉన్న రెండు బోర్లలో నీళ్లు అడుగంటాయి. 15 రోజులైతే పంట చేతికి వస్తుందనుకున్న సమయంలో పొలం ఎండిపోయింది. పంటకు పెట్టిన రూ.50 వేలు పెట్టుబడి నష్టపోయాను. – దొంతినేని జగన్రావు, వెంకటాద్రిపాలెం, తిప్పర్తి మండలం, నల్లగొండ జిల్లా -
రైతును మరిచి రాజకీయమా?
కాంగ్రెస్ ప్రభుత్వ ఖడ్గం మొదటి వేటు రైతన్న మీదనే పడ్డది. ఘనత వహించిన కాంగ్రెస్ సోకాల్డ్ ప్రజా పాలనలో రైతన్నల బతుకులు గాలిలో దీపాలు అయిపోయినయి. రాష్ట్రంలో ఎక్కడికి పోయినా అన్నదాతల ఆక్రందనలు, ఆర్తనాదాలే వినిపిస్తున్నయి. మొన్నటి దాకా పొలాల్లో నీళ్లు పారితే, ఇప్పుడు రైతుల కళ్లల్లో కన్నీళ్లు కారుతున్నయి. మూడు నెలల్లోనే పరిస్థితి ఎందుకు తలకిందులైంది? బీఆర్ఎస్ పరిపాలనలో ఆత్మవిశ్వాసంతో మెరిసి పోయిన రైతన్నల ముఖాల్లో ఎందుకు ఇప్పుడు నిస్సహాయత, ఆందోళన కనిపిస్తున్నది? అటు ఎండిపోయి దెబ్బతిన్న పంటలకు, ఇటు వడగండ్లతో నష్టపోయినపంటకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలి. ఆరు గ్యారెంటీల్లో చెప్పిన 13 అంశాలను చిత్తశుద్ధితో త్వరగా అమలు చేయాలి. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్న బాధలు ఒకవైపు, కొద్దోగొప్పో పండిన పంట వడగండ్ల వానకు సర్వనాశనమై పోయిన ఘోష మరొకవైపు... రైతన్న బతుకు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా అయిపోయింది. వడ గండ్ల వాన దెబ్బకు రాష్ట్రంలో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయంటే పరిస్థితి తీవ్రతను అంచనా వేయొచ్చు. నేల రాలిన పంటను చూసి రైతులు భోరుభోరున ఏడుస్తున్న దృశ్యాలు హృదయాలను కలచి వేస్తున్నాయి. అంత దుఃఖంలోనూ కేసీఆర్ ఉండగా, మా పరి స్థితి ఇంత అగాథంగా లేకుండేనని చెబుతూ మరి కంటతడి పెట్టుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వంలో చలనమే లేదు. ఏమీ జరగనట్లుగానే ఎన్నికల ప్రచారాల్లో, రాజకీయ ప్రసంగాలను దట్టించి కొడుతున్నరు కాంగ్రెస్ పాలకులు. రైతు గుండె చీరుకపోయి విలవిల లాడుతుంటే, ముఖ్యమంత్రి గారు మాత్రం పక్క పార్టీ నాయకుల చేరికల మీద పూర్తి దృష్టిని కేంద్రీకరించారు. ప్రాజెక్టుల గేట్లు ఎత్తే సౌభాగ్యం లేని సర్కారు, పార్టీ గేట్లు ఎత్తి నాయకులను చేర్చుకుంటున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో తాగునీరు గతిలేక మహిళలు ఖాళీ బిందెల ప్రదర్శనలు చేశారు. ముఖ్యమంత్రి అటువైపు తొంగి చూసిన పాపాన కూడా పోలేదు. పేగులు మెడలో వేసుకుంటా అనే రాక్షస వ్యాఖ్యలే తప్ప, పొలాలకు నీళ్లు మలుపుతా, ప్రజల గొంతు తడుపుతా అనే మానవీయ వ్యాఖ్యలు ఈ ముఖ్యమంత్రి నోటి వెంట రావడం లేదు. రైతులు విధిలేని పరిస్థితుల్లో వేల రూపాయలు ఖర్చు పెట్టి ట్యాంకర్లతో పొలాలకు నీళ్లు పెట్టుకుంటున్నరు. సాగునీళ్లు లేక,కరెంట్ సరిగా రాక రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంట ఎండిపోయింది. ఎండిన పంట చేలల్లో పశువులను మేపుతున్న దీనస్థితి కనిపిస్తున్నది. తెలంగాణ పల్లెల్లో మాయమైన బోరు బండ్లు మళ్లా దర్శనమిస్తున్నవి. పూడిక తీసే క్రేన్లకు గిరాకీ పెరిగింది. లో ఓల్టేజీ కరెంట్తో మోటార్లు కాలిపోతున్నయి. ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతు న్నయి. మోటారు వైండింగ్ మెకానిక్ల షాపులు కళకళలాడుతుంటే, మునుపటి కాంగ్రెస్ రాజ్యం మళ్లా కళ్లకు కడుతున్నది. బీఆర్ఎస్ పరి పాలనలో ఎండాకాలంలో సైతం చెరువు, చెక్ డ్యాంకులు మత్తళ్లుదుంకిన మంచిరోజులను ప్రజలు పదే పదే గుర్తు చేసుకుంటున్నరు. ఆ రోజు నిండుగా పారిన కాల్వలు ఈ రోజు ఎండిపోయి ఎక్కిరిస్తు న్నయి. బీఆర్ఎస్ 24 గంటల కరెంట్తో రైతు ఇంట్ల కాలు మీద కాలేసుకొని కూర్చొన్నా పొలం పారింది. నేడు అర్ధరాత్రి కరెంట్ పెట్టేందుకు బాయి కాడికి పోవాల్సిన బాధ మళ్లా మొదలైంది. బీఆర్ఎస్ పరిపాలనలో రైతులు నిరందిగ ఉన్నరు. ఇప్పుడు కరెంట్ కోత మల్లా ఒక సమస్యగా వ్యవసాయం వాకిట్లో నిలిచింది. బీఆర్ఎస్ పరిపాల నలో స్థిరపడ్డ వ్యవసాయం కాంగ్రెస్ పుణ్యమా అని మెల్లమెల్లగా చెదిరిపోతున్నది. ఇప్పటి వరకు అందుతున్న లెక్కల ప్రకారం,కాంగ్రెస్ తెచ్చిన ఇందిరమ్మ రాజ్యం మూడు నెలల వ్యవధిలో 180 మంది రైతుల ఉసురు తీసింది. ఇటీవల కురిసిన వడగండ్ల వాన పంట నష్టాన్ని అంచనా వేసే పని కూడా కాంగ్రెస్ ఇప్పటికీ ప్రారంభించలేదు. అదే పనిగా బీఆర్ఎస్ వెంట పడితే, అప్పుడు సోయి తెచ్చుకొని అయిష్టంగానే ఎకరాకు రూ. 10 వేల పంట నష్టపరిహారం ఇస్తామని గాలి మాటలు చెబుతున్నరు. అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9న ఒకే విడతలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి, అధికారానికి రాగానే మాట మార్చారు. వంద రోజులు దాటినా రుణమాఫీ ఊసెత్తకుండా కాలం గడిపేస్తు న్నారు. నమ్మి రుణాలు తెచ్చుకున్న రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. రైతు బంధును రైతు భరోసాగా మార్చి, ఎకరాకు ఇచ్చే పెట్టుబడిని రూ. 15 వేలకు పెంచుతామని బడాయిలు చెప్పిన ప్రభుత్వం, పెంచడం మాట అటుంచి అసలు పెట్టుబడి సాయం ఇప్ప టికీ ఎంతోమంది ఖాతాల్లో జమ చేయనేలేదు. పెంచేదెప్పుడో చెప్పడం లేదు. రైతు బంధు సాయాన్ని కౌలు రైతులకు కూడా అంది స్తామని అబద్ధపు హామీలు గుప్పించారు. అసలు ఇప్పటి వరకు కౌలు రైతులను ఎలా గుర్తిస్తారో, వాళ్లకు పెట్టుబడి సాయం ఏ విధంగా చేస్తారో మార్గదర్శకాలు రూపొందించే పనికి కూడా పూనుకోవడం లేదు. ఇగ రైతులను, కౌలు రైతులను మోసగించిన కాంగ్రెస్ పార్టీ, రైతు కూలీలను మాత్రం విడిచి పెడుతుందా? వాళ్లకు ఇచ్చిన హామీకి అదే గతి పట్టిచ్చింది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే వ్యవ సాయ కూలీలకు 12 వేలు అందించే పథకం ప్రారంభిస్తామని చెప్పి, ఆ పథకం అమలు గురించిన ప్రస్తావన కూడా చేయడం లేదు. అంటే రైతు కూలీలకు ఇచ్చిన హామీకి కూడా ఎగనామం పెట్టిందనే అను మానాలకు తావిస్తున్నారు. ఈ పథకం అమలు కోసం బడ్జెట్లో కేటాయింపులే లేకపోవడం ఈ అనుమానాలను మరింత బలపర్చు తుంది. రాతపూర్వకంగా ఇచ్చిన గ్యారెంటీలకే దిక్కు లేకుండాపోతుంటే, పంట నష్టం పదివేలు ఇస్తాననే నోటి మాటకు విలువె క్కడిది? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే విధంగా అకాల వర్షాలతోపంట నష్టపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా పంటలు దెబ్బతిన్న ఊర్లు పర్యటించారు. అప్పటికప్పుడు ఎకరాకు రూ. 10 వేల నష్టపరిహారాన్ని ప్రకటించి, వేగంగా అమలు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అటువంటి ప్రయత్నమేది కనిపించడం లేదు. అసలు కాంగ్రెస్ అంటేనే ఒక చెడగొట్టు వాన లాంటిదని రైతులు మాట్లాడుకుంటున్నరు. సమైక్య పాలనలో విధ్వంసమైపోయిన తెలంగాణ వ్యవసా యాన్ని తిరిగి నిలబెట్టడానికి బీఆర్ఎస్ ఎంతో శ్రమించింది. పదేండ్లలో వ్యవసాయాన్ని పండుగగా మార్చింది. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించింది. 24 గంటలు నాణ్యమైన ఉచిత కరెంట్ సరఫరా చేసింది. కొత్త ప్రాజెక్టులు నిర్మించి నీటిని ఎత్తిపోసి చెరువులు, కుంటలు నింపింది. భారీ రిజర్వాయర్లు నిర్మించి నిండుగా నింపింది. వాగుల్లోకి, వంకల్లోకి నీళ్లు వదిలితే భూగర్భ జలాలు మిక్కుటంగా పెరిగినయి. దుక్కి దున్ని నాటిన నుంచి పంట కొనుగోళ్ల దాకా అడుగడుగునా రైతుకు అండగా నిలిచింది. రైతు బంధుతో పెట్టుబడికి పైకమిచ్చింది. పండిన పంటనంతా మద్దతు ధరనిచ్చి కొనుగోలు చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీన్ రివర్సై పోయింది.ఎండాకాలం రాకముందే చెరువులు ఎండిపోయినయి. భూగర్భ జలాలు పడిపోయినయి. బోర్లు ఎత్తి పోయినయి. రైతు బతుకు దిగ జారడం మొదలైంది. ఇదీ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పు. మార్పు మార్పు అని చెప్పి రైతుల బతుకుల్లో మంట పెట్టిన్రు. రైతులు హాహాకారాలు చేస్తుంటే, భ్రష్ట రాజకీయాలతో పొద్దు పుచ్చడం ప్రమాదకరం. కాంగ్రెస్ ప్రభుత్వ నైజాన్ని ప్రజలు గుర్తిస్తు న్నారు. ఆదిలోనే హంసపాదులా తయారైన విధానాన్ని తిట్టుకుంటున్నారు. ఇకనైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళ్లు తెరవాలి. అటు ఎండి పోయి దెబ్బతిన్న పంటలకు, ఇటు వడగండ్లతో నష్టపోయిన పంటకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలి. చిత్తశుద్ధితో ఆరు గ్యారెంటీల్లో చెప్పిన 13 అంశాలను త్వరగా అమలు చేయాలి. ధైర్యం కోల్పో తున్న రైతు గుండెల్లో భరోసాను నింపాలి. రాక్షస వ్యాఖ్యలు చేయడం మాని రైతులను రక్షించుకునే విధానాన్ని చేపట్టాలి. లేని పక్షంలో తెలంగాణ రైతాంగం ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ మరొక మహోద్య మానికి శ్రీకారం చుట్టడం ఖాయం. - వ్యాసకర్త మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే -తన్నీరు హరీశ్ రావు -
‘గ్యాప్’ పంటలకు ధరహాసం
సాక్షి, అమరావతి: మంచి వ్యవసాయ పద్ధతులు (గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్–గ్యాప్) సర్టిఫికేషన్ రైతులకు రెట్టింపు కంటే ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ పండించిన పంటలకు మార్కెట్లో ప్రీమియం ధర లభిస్తోంది. పంట ఉత్పత్తుల్ని నచ్చినచోట నచ్చిన వారికి అమ్ముకునే వెసులుబాటు లభించడంతో రైతుల ఆనందం అవధులు దాటుతోంది. నాణ్యమైన ధ్రువీకరణ వ్యవస్థ ఏర్పాటు సమగ్ర పంట నిర్వహణ పద్ధతుల్ని పాటించడం ద్వారా సాగు వ్యయాన్ని నియంత్రిస్తూ నాణ్యమైన ఉత్పాదకతను పెంచాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లుగా కృషి చేస్తోంది. ఇందుకోసం పొలం బడులు, తోట బడులæను నిర్వహిస్తూ ఉత్తమ యాజమాన్య పద్ధతుల్ని రైతుల ముంగిటకు చేరుస్తోంది. ఫలితంగా సాగు వ్యయం 6 నుంచి 17 శాతం ఆదా అవుతుండగా.. దిగుబడులు 9 నుంచి 20 శాతం పెరిగి రైతులకు గణనీయమైన ఆదాయాన్ని ఇస్తోంది. పంట ఉత్పత్తుల నాణ్యతను ధ్రువీకరించేందుకు వీలుగా దేశంలోనే తొలిసారి రాష్ట్ర ప్రభుత్వం ఏపీ స్టేట్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీకి అనుబంధంగా ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీని ఏర్పాటు చేసింది. తొలి దశలో పొలం బడులు, తోట బడుల ద్వారా నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్న రైతులకు గ్యాప్ సర్టిఫికేషన్, రెండో దశలో సేంద్రియ సాగు పద్ధతుల్లో పండించే ఉత్పత్తులకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ జారీ చేయాలని సంకల్పించింది. క్వాలిటీ కౌన్సిల్ గుర్తింపుతో గ్యాప్ సర్టిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న అవగాహనా ఒప్పందం మేరకు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీకి ఇండి గ్యాప్ సర్టిఫికేషన్ జారీ చేసేందుకు వీలుగా దేశంలోనే తొలి అక్రిడిటేషన్ జారీ చేసింది. సర్టిఫికేషన్ పొందేందుకు సాగులో అనుసరించాల్సిన పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు మండల వ్యవసాయ అధికారులను టెక్నికల్ అడ్వైజర్లుగా, వ్యవసాయ, ఉద్యాన సహాయకులను ఫీల్డ్ ఆఫీసర్లుగా, తనిఖీలు చేసేందుకు అగ్రికల్చర్ డిప్లమో చేసిన వారిని ఇంటర్నెల్ ఇన్స్పెక్టర్స్గా ప్రభుత్వం నియమించింది. సర్టిఫికేషన్ జారీ కోసం అనుసరించాల్సిన పద్ధతులపై అధికారులు, సిబ్బందికి రైతులు పాటించాల్సిన ప్రమాణాలపై ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో), భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) సౌజన్యంతో శిక్షణ ఇచ్చారు. క్వింటాల్కు రూ.7,500 లభించింది రెండెకరాల్లో వేరుశనగ సాగు చేశా. మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి తగిన మోతాదులో ఎరువులు వినియోగించాను. ఒకే ఒక్కసారి పురుగు మందులు పిచికారీ చేశాను. ఎకరాకు రూ.19,400 పెట్టుబడి అయ్యింది. రెండెకరాలకు 14 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. గ్యాప్ సర్టిఫికేషన్తో వేరుశనగ క్వింటాల్కు రూ.7,500 చొప్పున ధర లభించింది. పెట్టుబడి పోగా రూ.66 వేల నికర ఆదాయం వచ్చింది. – బి.రామ్మోహన్, ఎం.వేముల, అన్నమయ్య జిల్లా నంద్యాల జిల్లా డోన్ మండలం ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన ఎస్.లక్ష్మీదేవి నాలుగేళ్లుగా పొలంబడుల ద్వారా ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ నాణ్యమైన పంటల్ని పండిస్తోంది. ఖరీఫ్–2023 సీజన్లో రెండెకరాల్లో కొర్రలు సాగు చేసింది. ఇండి గ్యాప్ సర్టిఫికేషన్ కోసం శాస్త్రవేత్తలు, అధికారులు సూచించిన మేలైన యాజమాన్య పద్ధతుల్ని పాటించింది. వర్షాభావ పరిస్థితుల ప్రభావం వల్ల ఎకరాకు 4 క్వింటాళ్ల చొప్పున మాత్రమే దిగుబడులొచ్చాయి. కానీ.. ఈమె గ్యాప్ సర్టిఫికేషన్ పొందటం వల్ల క్వింటాల్ కొర్రలకు రూ.7 వేలకు పైగా ధర లభించిందని సంతోషంతో చెబుతోంది. ఇప్పటికే 1,673 మంది రైతులకు లబ్ధి ఖరీఫ్ సీజన్లో జిల్లాకు 250 ఎకరాల చొప్పున 20 జిల్లాలో గ్యాప్ క్లస్టర్స్ ఎంపిక చేశారు. ఆయా క్లస్టర్లలో 990 ఎకరాల్లో వరి, కొర్రలు, రాగులు, వేరుశనగ వంటి వ్యవసాయ.. 2,534 ఎకరాల్లో మామిడి, అరటి, పసుపు, మిరప, కూరగాయల వంటి ఉద్యాన పంటలను గుర్తించారు. 1,673 మంది రైతులతో రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేశారు. ఇండిగ్యాప్ సరి్టఫికేషన్కు అనుసరించాల్సిన విధి విధానాలు, ఆహార ప్రమాణాలపై కృషి గ్యాప్ ప్లాట్ఫామ్ ద్వారా ఎంపిక చేసిన రైతులకు శిక్షణ ఇచ్చారు. నాణ్యత పర్యవేక్షణకు సాంకేతిక బృందం ద్వారా దశల వారీగా తనిఖీలు, అంతర్గత ఆడిట్ నిర్వహించారు. సేకరించిన నమూనాలను పరీక్షించి పురుగు మందుల అవశేషాల గరిష్ట పరిమితికి లోబడి ఉన్నట్టుగా నిర్ధారించిన పంట ఉత్పత్తులకు ఇండి గ్యాప్ సర్టిఫికేషన్ జారీ చేశారు. సర్టిఫికేషన్ పొందిన రైతులు వారి పంట ఉత్పత్తులను మార్కెట్ ధరల కంటే మిన్నగా ప్రీమియం ధరకు విక్రయించుకుని అదనపు ఆదాయాన్ని ఆర్జించగలిగారు. గ్యాప్ సర్టిఫికేషన్తో వ్యాపారులూ పోటీపడి రైతు క్షేత్రాల నుంచే కొనుగోలు చేయడంతో కోతకొచ్చిన పంట ఉత్పత్తులను కనీస మద్దతు ధరల కంటే అధిక ధరలకు రైతులు అమ్ముకోగలిగారు. కొర్రలకు మద్దతు ధర రూ.2,500 ఉండగా.. గ్యాప్ సర్టిఫికేషన్ పొందిన రైతులు క్వింటాల్ కొర్రల్ని ధర రూ.7 వేలకు అమ్ముకోగలిగారు. వరి ధాన్యానికి మద్దతు ధర రూ.2,203 కాగా.. రైతులు రూ.4 వేలకు పైగా పొందగలిగారు. వేరుశనగ మద్దతు ధర రూ.5,850 ఉండగా.. గ్యాప్ సర్టిఫికేషన్తో రూ.8,300కు పైగా ధర లభించింది. రాగుల మద్దతు ధర క్వింటాల్కు రూ.3,846 ఉండగా.. సర్టిఫికేషన్ పొందిన రైతులు క్వింటాల్కు రూ.5 వేలకు పైగా ధర పొందగలిగారు. -
వచ్చే ఖరీఫ్ నుంచి పంటలకు బీమా
ఖలీల్వాడి/నిజామాబాద్ /కామారెడ్డి నెట్వర్క్: వచ్చే ఖరీఫ్ నుంచి పంటలకు బీమా అమలు చేస్తామని, ప్రీమియం డబ్బులను ప్రభుత్వమే చెల్లిస్తుందని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గురు వారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వడగళ్ల వానలతో పంటలు దెబ్బ తిన్న రైతులను ఆదుకుంటామన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 40 వేల ఎకరాల వరకు నష్టం జరిగిందన్నారు. అధికారులు సర్వే పూర్తి చేసిన తర్వాత ఎకరానికి రూ.10 వేలు నష్ట పరిహారం అందిస్తామన్నారు. బీఆర్ఎస్ పదేళ్లు ఆధికారంలో ఉన్నా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రుణమాఫీ, మహిళలకు జీరో వడ్డీ, దళితులకు మూడెకరాల పంపిణీ వంటి హామీలు ఇచ్చి అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా పథకాలను అందించడానికి సిద్ధంగా ఉందన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే బీఆర్ఎస్ సర్కార్ రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసిందని విమర్శించారు. వీటికి రూ.60 వేల కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తోందన్నారు. దీనికోసం మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మహా అయితే ఒక సీటు రావొచ్చునని అన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అ«ధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, ఎన్డీసీసీబీ చైర్మన్ రమేశ్రెడ్డి పాల్గొన్నారు. రైతులు అధైర్యపడవద్దు : వడగళ్ల వానలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు అధైర్య పడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఆయన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కొండూర్, పెద్దవాల్గోట్ గ్రామాలు, కామారెడ్డి జిల్లాలోని దోమకొండ మండలం లింగుపల్లి, భిక్కనూరు మండలం అంతంపల్లి, లక్ష్మీదేవునిపల్లి, జంగంపల్లి, బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామాల్లో పర్యటించారు. వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. మంత్రి వెంట రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ, ఎమ్మెల్యే భూపతిరెడ్డి తదితరులు ఉన్నారు. -
దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి
ముస్తాబాద్/గంభీరావుపేట(సిరిసిల్ల): వడగళ్లు, ఇతర ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతిన్న పంటలకు రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని, ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో సర్వేలు, సమీక్షలు, నివేదికల పేరుతో కాలయాపన చేయొద్దన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట, ముస్తాబాద్, పోతుగల్, గన్నెవారిపల్లెల్లో ఇటీవల వడగళ్లు, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను బండి సంజయ్ బుధవారం పరిశీలించి, రైతులను ఓదార్చారు. గత ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని అమలుచేసి ఉంటే ఇప్పుడు అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడేవారు కాదని అభిప్రాయపడ్డారు. పంటల బీమా పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందన్నారు. ఎకరానికి రూ.10 వేలు ఇస్తామని మోసం చేసిందని ఆరోపించారు. ఇప్పుడయినా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేయకుండా నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి రూ.25 వేల పరిహారం చెల్లించాలని కోరారు. ఎన్నికల కోడ్ వచ్చిందన్న కారణం చెప్పకుండా.. రైతులను ఆదుకునేందుకు ఎన్నికల కమిషన్తో మాట్లాడి సాయం చేయాలని సూచించారు. కాగా, ఈ ప్రభుత్వమైనా ఫసల్బీమాను అమలు చేస్తుందో.. లేదో చెప్పాలని కోరారు. కౌలు రైతులకు రూ.12 వేల సాయంపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, ధాన్యానికి క్వింటాల్కు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యుత్ స్తంభం కూలి మృతిచెందిన ముస్తాబాద్కు చెందిన రైతు ఎల్సాని ఎల్లయ్య కుటుంబాన్ని పరామర్శించి, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సిరిసిల్ల బీజేపీ ఇన్చార్జి రాణిరుద్రమ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మట్ట వెంకటేశ్వర్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపి, పలువురు స్థానిక నేతలు బండి సంజయ్ వెంట ఉన్నారు. -
దద్దరిల్లిన సరిహద్దులు
చండీగఢ్: పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, వ్యవసాయ రుణాల రద్దుతో సహా ఇతర డిమాండ్లపై రైతు సంఘాలు, కేంద్ర మంత్రుల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో రైతులు మళ్లీ పోరుబాట పట్టారు. రెండు రోజుల విరామం తర్వాత బుధవారం నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సమస్యలు పరిష్కారం అయ్యేదాకా తమ పోరాటం ఆగదని తేలి్చచెప్పారు. రైతులు, పోలీసుల మధ్య ఘర్షణలతో పంజాబ్–హరియాణా సరిహద్దులోని శంభు, ఖనౌరీ బోర్డర్ పాయింట్లు దద్దరిల్లిపోయాయి. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ సంఖ్యలో ట్రాక్టర్ ట్రాలీలు, మినీ వ్యాన్లు, జేసీబీలపై నిరసనకారులు తరలివచ్చారు. సరిహద్దుల్లో వేలాది మంది గుమికూడారు. రక్షణ వలయాన్ని ఛేదించుకొని ముందుకు దూసుకెళ్లడానికి ప్రయతి్నంచారు. వాహనాలతో బారీకేడ్లను ధ్వంసం చేసే ప్రమాదం ఉందని పోలీసులు అనుమానించారు. నిరసనకారులను చెదరగొట్టడానికి హరియాణా పోలీసులు డ్రోన్తో బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. శంభు బోర్డర్ పాయింట్ వద్ద బుధవారం మూడుసార్లు బాష్పవాయువు ప్రయోగం చోటుచేసుకుంది. డ్రోన్ కెమెరాలతో పోలీసులు నిఘా పెంచారు. ఖనౌరీలోనూ రైతుల ఆందోళన కొనసాగింది. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఢిల్లీ వెళ్లడానికి తమను అనుమతించడానికి డిమాండ్ చేశారు. పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి, వారిని చెదరగొట్టారు. బాష్పవాయువు ప్రభావం నుంచి తప్పించుకోవడానికి చాలామంది రైతులు మాసు్కలు, కళ్లద్దాలు ధరించారు. -
fact check: అండగా ఉన్నా ఆర్తనాదాలే..
సాక్షి, అమరావతి: వంద అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలని పెద్దలంటారు. దీనినే స్ఫూర్తిగా తీసుకున్న రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఇదే సిద్ధాంతంతో లక్షలాది అబద్ధాలు ఆడైనా సరే సీఎం వైఎస్ జగన్ను గద్దె దించాలని కంకణం కట్టుకున్నాయి. అందుకే నిత్యం ఉన్నవీ లేనివీ పోగేసి ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేస్తున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం మీద నిరంతరం దుమ్మెత్తి పోస్తున్న ఈనాడు దినపత్రిక కథనాల్లోని అంశాలనే తీసుకుని కొన్ని రాజకీయ పార్టీలు పాచిపోయిన ఆరోపణలనే చేస్తున్నాయి. తాజాగా.. రైతుల మద్దతు ధర విషయంలోనూ వాటి రంకెలు తారాస్థాయికి చేరాయి. రైతులకు అడుగడుగునా అండగా ఉన్నా విపక్షాల ఆర్తనాదాలు మామూలుగా లేవు. ఎందుకంటే.. రైతుకు తాను పండించిన ప్రతీ పంటకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) దక్కేలా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తుంటే వాస్తవాలు తెలుసుకోకుండా విపక్షాలు విమర్శించడం విడ్డూరంగా ఉంది. వాస్తవానికి.. మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను 99.5 శాతం తుచ తప్పకుండా అమలుచేస్తున్న ప్రభుత్వంపై నిరంతరం బురద జల్లుతూ ఈనాడు అబద్ధాలను అచ్చేస్తోంది. ఈ క్షుద్ర పత్రిక రాసిన అంశాలనే పట్టుకుని కొందరు అవగాహన, అర్థంపర్థంలేకుండా అదే పనిగా ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలపై ‘ఫ్యాక్ట్చెక్’ ఏమిటంటే.. మార్కెట్లో జోక్యంతో రైతులకు మేలు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేయడమే కాదు సీఎం యాప్ ద్వారా మార్కెట్ ధరలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మద్దతు ధర దక్కేలా సీఎం జగన్ సర్కారు చేస్తోంది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద వ్యాపారులతో పోటీపడి కొనుగోలు చేయడం ద్వారా రైతులకు మద్దతు ధర దక్కేలా చేసింది. పొగాకు, పత్తితో జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, మొక్కజొన్న, కందులు, పెసలు, మినుములు, వేరుశనగ, పసుపు, ఉల్లి, టమాటా తదితర పంట ఉత్పత్తులకు మద్దతు ధర దక్కని ప్రతీసారి మార్కెట్లో జోక్యం చేసుకుని కొనుగోలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తోంది. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించని మిర్చి, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలు, అరటి, చీనీ వంటి పంటలకు దేశంలో మద్దతు ధర ప్రకటించడమే కాదు..ఆ ధరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తగ్గకుండా చూసింది. ఉదా.. మిరపకు రూ.7వేలు, పసుపుకు రూ.6,850, ఉల్లికి రూ.770, చిరుధాన్యాలకు రూ.2,500, అరటికి రూ.800, బత్తాయికి రూ.1,400 వచ్చేలా చూస్తోంది. మద్దతు ధర కల్పనకు పంచసూత్రాలు.. మద్దతు ధర కల్పించే విషయంలో ధాన్యంతో సహా పంట ఉత్పత్తులను ఆర్బీకేల ద్వారానే రైతుల నుంచి మాత్రమే కొనేలా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ తీసుకోవటం, కొనుగోళ్లలో చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యమివ్వడం, నాణ్యతకు పెద్దపీట వేయడం, నేరుగా రైతు ఖాతాల్లోకే నగదు జమ అనే పంచ సూత్రాలను నిక్కచ్చిగా అమలుచేస్తూ విప్లవాత్మక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికింది. ఇలా ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల ఫలితంగా ప్రస్తుతం వ్యవసాయ, వాణిజ్య పంట ఉత్పత్తులకు మార్కెట్లో ఎమ్మెస్పీకి మించి ధరలు పలుకుతున్నాయి. దీంతో ఈ ఏడాది కొనుగోలు చేయాల్సిన అవసరం పెద్దగా కన్పించడంలేదు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా ఈ 57 నెలల్లో ధరలు పడిపోయినపుడు ఈ రకమైన భరోసా ఇవ్వడంతో మార్కెట్లో ధరలు స్థిరపడ్డాయి. చంద్రబాబు హయాంలో రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ ఐదేళ్లలో ఏ ఒక్క బడ్జెట్లోనూ పైసా కూడా ప్రత్యేకంగా కేటాయించిన పాపాన పోలేదు. గతంలో అరకొరగా ధాన్యం సేకరణ.. నిజానికి.. ధాన్యం కొనుగోలు ప్రక్రియ గతంలో సేకరణ కేంద్రాలకే పరిమితం అయ్యేది. అవికూడా అరకొరగానే ఉండేవి. దీన్ని పూర్తిగా మారుస్తూ నేరుగా ఫాంగేట్ వద్దే ఆర్బీకేల పర్యవేక్షణలో రైతుల భాగస్వామ్యంతో ధాన్యం కొనుగోలు ఈ ప్రభుత్వంలో హయాంలోనే జరుగుతోంది. రైస్మిల్లు ఎంపికలో మిల్లర్లను సంప్రదించాల్సిన అవసరంలేకుండా చేసింది. కొనుగోలు కేంద్రం వారే బ్యాంకు గ్యారంటీ లభ్యత, ధాన్యం రకం, మిల్లు లక్ష్యము, మిల్లు దూరం వంటి అంశాల ఆధారంగా ఆటోమేటిక్ పద్ధతిలో ఎంపిక చేసి రవాణా చేస్తోంది. బాబు కంటే రెట్టింపు కొనుగోలు.. ఇక పంట ఉత్పత్తుల కొనుగోలు విషయానికి వస్తే టీడీపీ తన ఐదేళ్లలో 3.74 లక్షల మంది రైతుల నుంచి రూ.3,322 కోట్ల విలువైన 9 లక్షల టన్నుల ఉత్పత్తులు కొనుగోలు చేస్తే.. సీఎం వైఎస్ జగన్ హయాంలోని ఈ 57 నెలల్లో 6.18 లక్షల మంది రైతుల నుంచి రూ.7,757.87 కోట్ల విలువైన 21.61 లక్షల టన్నుల ఉత్పత్తులు కొనుగోలు చేసింది. అంటే.. రెట్టింపు కన్నా అధికం. చరిత్రలో ఎన్నడూలేని విధంగా రూ.139.90 కోట్ల విలువైన పొగాకుతో పాటు రూ.1,789 కోట్ల విలువైన పత్తిని సైతం ఈ ప్రభుత్వం కొనుగోలు చేసింది. పోనీ ధాన్యం రైతులకైనా చంద్రబాబు మేలు చేశాడా అంటే అదీలేదు. టీడీపీ ఐదేళ్లలో 17.94 లక్షల మంది రైతుల నుంచి రూ.40,237 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే, ఈ 57 నెలల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం రైతు క్షేత్రాల నుంచి ఆర్బీకేల ద్వారా 37.34 లక్షల మంది రైతుల నుంచి 3.38 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు రూ.65 వేల కోట్లు చెల్లించింది. టీడీపీ హయాంలో ధాన్యం, ఇతర పంటల కొనుగోలుకు రూ.43,559 కోట్లు వెచ్చిస్తే, ఈ ప్రభుత్వం ఈ 57 నెలల్లో ఏకంగా రూ.72,445 కోట్లు ఖర్చుచేసింది. అంటే.. సగటున ఏడాదికి చంద్రబాబు హయాంలో రూ.8,711 కోట్లు వెచ్చిస్తే, జగన్ ప్రభుత్వం ఏటా సగటున రూ.16,099 కోట్లు వెచ్చించింది. అంటే.. బాబు ఐదేళ్లతో పోలిస్తే ఈ 57 నెలల్లో రెట్టింపు విలువైన పంట ఉత్పత్తులను వైఎస్ జగన్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ‘జీఎల్టీ’ భరిస్తున్న ఏకైక ప్రభుత్వం.. మరోవైపు.. ధాన్యం కొనుగోలు సందర్భంగా రైతు పొలం నుంచే నేరుగా కొనుగోలుకు అయ్యే జీఎల్టీ (గన్నీ బ్యాగ్లు, లేబర్, ట్రాన్స్పోర్టు) ఖర్చులను ప్రభుత్వమే భరిస్తోంది. ధాన్యం కొనుగోలు సందర్భంలో టన్నుకు రూ.2,523 (గోనె సంచులకు రూ.1,750, కూలీలకు రూ.220, రవాణా ఛార్జీలకు రూ.468తో పాటు ఒకసారి వాడిన గోనె సంచులకు రూ.85), ఇతర పంట ఉత్పత్తుల సేకరణ సందర్భంలో క్వింటాకు రూ.418 చొప్పున భరిస్తోంది. ఇక గోనె సంచుల, హమాలీ, రవాణా చార్జీలకు సంబందించి 2022–23 పంట కాలానికి 15,74,285 మంది రైతుల ఖాతాలకు రూ.237.11 కోట్లు జమచేయగా, ఖరీఫ్ 2023–24 పంట కాలానికి సంబంధించి ఇప్పటివరకు 6,83,825 మంది రైతుల ఖాతాలకు రూ.91.47 కోట్లు జమచేశారు. గతంలో ఈ పరిస్థితిలేదు. ఇలా గోతాలు, కూలీలు, రవాణా ఖర్చుల (జీఎల్టీ) రూపంలో ఎకరాకు రూ.10 వేల వరకు ప్రభుత్వమే భరిస్తోంది. కానీ, గతంలో రైతులకు గోనె సంచులను సమకూర్చే పనిని గతంలో మిల్లర్లకు వదిలేసేవారు. అవి సరిపడా దొరక్క రైతులు చాలా ఇబ్బందులు పడేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక దీనికి చెక్ పెట్టింది. ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, పీఎస్ఏలు రైతులకు గోనె సంచులను సమకూరుస్తున్నాయి. పైగా.. సేకరించిన ధాన్యాన్ని గతంలో రవాణా అనేది గందరగోళంగా ఉండేది. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందుల్లేవు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కొన్ని ఏజెన్సీలను, రవాణాదారులను నియమించింది. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సజావుగా కొనుగోలు చేసిన ధాన్యం రవాణా కొనసాగుతోంది. ఇంత చేస్తున్నా దీన్ని మొక్కుబడిగా కొనుగోలు, నామమాత్రపు కొనుగోలు అంటారా? ధరల స్థిరీకరణ ద్వారా మద్దతు ధర కల్పన విషయంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తుంటే వాస్తవాలు తెలుసుకోకుండా విపక్షాలు విమర్శించడం విడ్డూరంగా ఉంది. -
Fact Check: ధీమాగా 'బీమా'
సాక్షి, అమరావతి: చంద్రబాబు ఎగ్గొట్టిన పాత బకాయిలను సైతం చెల్లించి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తుంటే ఈనాడు రామోజీ మాత్రం పరిహారం చెల్లింపుల్లో కోతలు విధించారంటూ అబద్ధాలను అచ్చేశారు. నిజంగానే పరిహారం భారాన్ని తగ్గించుకోవాలనుకుంటే గత సర్కారు ఎగ్గొట్టిన పాత బకాయిలతో సహా ప్రభుత్వం ఎందుకు చెల్లిస్తుంది? రైతులపై పైసా భారం పడకుండా దేశానికే ఆదర్శంగా పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలియదా? ఆరోపణ: గతంలో స్వచ్ఛందంగా చేరేవారు.. వాస్తవం: 2016 నుంచి అమలవుతున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎం ఎఫ్బీవై)లో చేరాలంటే నోటిఫై చేసిన పంటలకు రుణం తీసుకున్నప్పుడు తప్పనిసరిగా ప్రీమియం వసూలు చేసే వారు. ఇష్టపూర్వకంగా చేరాలంటే ప్రీమియం చెల్లింపులు తలకు మించిన భారంగా పరిణవిుంచాయి. నమోదు ప్రక్రియ సంక్లిష్టంగా ఉండటంతో మెజార్టీ రైతులకు పంటల బీమా అందని ద్రాక్షగా మారింది. మంజూరైన పరిహారం రుణ ఖాతాలకు సర్దుబాటు చేయడంతో సరిపుచ్చడంతో నష్టపోయిన రైతుకు భరోసా లభించేది కాదు. పైగా ఏనాడూ ఖరీఫ్ సీజన్ పరిహారాన్ని మరుసటి ఏడాది ఆగస్టు లోపు చెల్లించిన దాఖలాలు లేవు. ఆరోపణ: రైతులకు భారంగా ఉచిత పంటల బీమా వాస్తవం: పంటల బీమా అన్నదాతలకు గుదిబండ కాకూడదన్న సంకల్పంతో డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఖరీఫ్ 2019 సీజన్ కోసం కేవలం రూపాయి మాత్రమే ప్రీమియంతో పథకాన్ని అమలు చేయగా రైతుల వాటా రూ.468 కోట్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.503 కోట్లు కలిపి మొత్తం రూ.971 కోట్లను తానే భరిస్తూ బీమా కంపెనీలకు చెల్లించింది. అవగాహన లేనందున కొద్దిమంది రైతులు బీమా పరిధిలోకి రాలేదని గుర్తించిన ప్రభుత్వం 2020 ఖరీఫ్ నుంచి పైసా కూడా భారం పడకుండా పూర్తిగా ఉచితంగా పంటల బీమాను వర్తింప చేసింది. ఇందుకు పీఎంఎఫ్బీవై నిబంధనలు అడ్డంకిగా మారడంతో ఆ పథకం నుంచి బయటకొచ్చి 2020–21, 2021–22 సీజన్లలో సొంతంగానే బీమా పరిహారం చెల్లించింది. 2022–23 నుంచి పీఎం ఎఫ్బీవైతో అనుసంధానించి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తోంది. ఆరోపణ: 2022–23 ఖరీఫ్లో కోతలు ఎందుకు విధించారు? వాస్తవం: దేశంలో ఏ కంపెనీ అయినా ఒక జిల్లాలో కనీసం 5 వేల ఎకరాల్లో సాగయ్యే నోటిఫైడ్ పంటలకు మాత్రమే బీమాను వర్తింప చేస్తున్నాయి. ఇలా ఖరీఫ్–2022–23లో 21, రబీ 2023–24లో 17 పంటలను నోటిఫై చేశారు. గతేడాది అక్టోబర్ 31 నాటికి ఈ – క్రాప్ ప్రాథమిక డేటా ఆధారంగా ఖరీఫ్ 2022లో తొలుత 34.70 లక్షల మంది రైతులు సాగు చేసిన 70.80 లక్షల ఎకరాల్లోని పంటల వివరాలను కేంద్రానికి పంపగా డూప్లికేషన్, సాంకేతిక కారణాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత ఈ – కేవైసీ ప్రామాణికంగా 33.02 లక్షల మంది రైతులు సాగు చేసిన 68.20 లక్షల ఎకరాల పంటల వివరాలను డిసెంబర్లో తిరిగి కేంద్రానికి పంపారు. ఇప్పటివరకు 64.60 లక్షల ఎకరాల్లో పంటలు, 29.3 లక్షల మంది రైతుల వివరాలను నేషనల్ క్రాప్ ఇన్స్రూెన్స్ పోర్టల్లో అప్లోడ్ చేశారు. ఆరోపణ: కప్ క్యాప్ మోడల్తో రైతులకు అన్యాయం.. వాస్తవం: పరిహారం తగ్గిన సందర్భాలలో అధిక ప్రీమియం వసూలు ద్వారా బీమా కంపెనీలు భారీగా ప్రయోజనం పొందుతున్నాయనే విమర్శల నేపథ్యంలో ప్రీమియం రేట్లను హేతుబద్ధీకరించగా కేంద్రం సూచించిన ఫార్మాట్లలో విజయవంతమైన కప్ అండ్ క్యాప్ (80–110 మోడల్ను 2023–24 సీజన్ నుంచి దిగుబడి ఆధారిత పంటల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఖరీఫ్ సీజన్లో 9 క్లస్టర్ల పరిధిలో దిగుబడి ఆధారిత పంటలకు ఈ విధానం అమలు చేస్తోంది. 110 శాతం కన్నా ఎక్కువ నష్టం సంభవిస్తే ఆ మేరకు సొంతంగా భరిస్తూ అదనపు పరిహారాన్ని రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే జమ చేస్తుంది. పరిహారం చెల్లింపులో ఎలాంటి కోతలు ఉండవు. మరోవైపు వాతావరణ ఆధారిత పధకానికి పాత పద్ధతిలోనే టెండర్లను ఖరారు చేశారు. దేశవ్యాప్తంగా అత్యల్ప ప్రీమియం రేట్లకు టెండర్లను ఖరారు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడం విడ్డూరం. ఆరోపణః గతంలో ఘనంగా పంటల బీమా.. వాస్తవం: టీడీపీ హయాంలో 2016–18 మధ్య పీఎంఎఫ్బీవై పథకంలో చేరిన 74 లక్షల మంది రైతులు తమ వాటాగా రూ.871.26 కోట్ల ప్రీమియం చెల్లించగా 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్ల పరిహారం లభించింది. అయితే గత నాలుగున్నరేళ్లలో రైతులపై పైసా భారం పడకుండా 54,48,344 మందికి రూ.7,802.05 కోట్ల పరిహారాన్ని జమ చేశారు. టీడీపీ హయాంతో పోలిస్తే 23.63 లక్షల మంది రైతులు, రూ.4,390.85 కోట్లు అదనంగా లబ్ధి పొందారు. అంతేకాకుండా చంద్రబాబు 6.19 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టిన రూ.715.84 కోట్ల పంటల బీమా పరిహారాన్ని సైతం చెల్లించి రైతుల పట్ల సీఎం జగన్ తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. టీడీపీ హయాంలో 2.32 కోట్ల ఎకరాలకు బీమా కవరేజ్ కల్పిస్తే గత నాలుగున్నరేళ్లలో 3.98 కోట్ల ఎకరాలకు బీమా కవరేజ్ వర్తించింది. నాడు 74.40 లక్షల మందికి బీమా రక్షణ కల్పిస్తే నేడు 1.71 కోట్ల మందికి బీమా రక్షణ దక్కుతోంది. అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్న ఉచిత పంటల బీమా పథకాన్ని పలు సందర్భాల్లో కేంద్రంతో పాటు అంతర్జాతీయ సంస్థలు సైతం ప్రశంసిస్తుంటే ఈనాడు రామోజీ భరించలేకపోతున్నారు! -
fact check: పంటల‘కేసీ’ కళ్లెట్టుకు సూడు..
కేసీ కెనాల్ ఆయకట్టు పరిధిలో సాగు చేసిన పంటలు ఎండిపోకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను జల వనరుల శాఖ ఇంజినీర్లు పక్కాగా అమలు చేస్తున్నారు. ఇది చూసిన పచ్చ పత్రిక ఈనాడు తట్టుకోలేక నీటి తడులపై తప్పుడు కథనాన్ని ప్రచురించింది. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా కేసీ రైతులు రికార్డు స్థాయిలో పంటలు పండించడం, కర్షకులు ఆనందంగా ఉండడాన్ని ఓర్వలేని రామోజీ తన అక్కసు వెళ్లగక్కారు. శ్రీశైలం నీళ్లు అమ్ముకుంటున్నారంటూ కి‘రాత’కానికి దిగారు. కర్నూలు సిటీ/ఆళ్లగడ్డ: ఈ ఏడాది దేశ వ్యాప్తంగా వర్షాభావం నెలకొంది. ఫలితంగా శ్రీశైలం ప్రాజెక్టులో నీటి లభ్యత తక్కువగా ఉంది. దీంతో అప్రమత్తమైన జలవనరుల శాఖ అధికారులు కేసీ కెనాల్ పరిధిలోని ఉమ్మడి కర్నూలు, కడప జిల్లాల్లోని 2.65 లక్షల ఎకరాల ఆయకట్టులో వరికి బదులు ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. సాగు నీటి సలహా మండలి సమావేశంలోనూ తీర్మానం చేశారు. ఆ మేరకు గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించారు. దీంతో రైతులూ ఆరుతడి పంటలను సాగు చేశారు. ఆ తరువాత సెప్టెంబరు, నవంబరు నెల చివరి వారాల్లో కొంత మేర వర్షాలు పడ్డాయి. దీంతో నవంబరు నెల 25న మరోసారి సాగు నీటి సలహా మండలి సమావేశం నిర్వహించి కేసీ కెనాల్కు డిసెంబరు 15 వరకు నీటిని ఇవ్వాలని తీర్మానించారు. రైతులు కలెక్టర్, ప్రజాప్రతినిధులను కలిసి శ్రీశైలంలో లెవెల్ పర్మిట్ చేసేంత వరకు నీటిని ఇవ్వాలని కోరారు. దీంతో నంద్యాల కలెక్టర్, జేసీ ఆదేశాల మేరకు వారాబందీ ప్రకారం నీరు విడుదల చేస్తున్నారు. నీరు వృథా కాకుండా జలవనరుల శాఖ అధికారులు రాత్రీపగలు కెనాల్పై గస్తీ కాసి ప్రతి ఎకరాకూ నీరు అందించారు. మంచి దిగుబడులు రావడంతో రైతులు సంబరపడ్డారు. జలవనరుల శాఖ ఇంజినీర్లను సన్మానిస్తున్నారు. అన్నీ తప్పుడు రాతలే రామోజీ పచ్చ పత్రిక బడా వాణిజ్య రైతులతో కుమ్మక్కై రబీలోని మిరప పంటకు నీటిని అమ్ముకుంటున్నారని కథనం వండివార్చింది. ఇదంతా అవాస్తవం. కేసీ కెనాల్ పరిధిలో మిరప సాగుచేసిన రైతుల్లో బడా రైతులు లేరు. ఒకరికి మాత్రమే పది ఎకరాలు ఉంది. మిగిలిన వారందరూ ఎకరా, ఎకరన్నర ఉన్న సన్నకారు రైతులే. కానీ అనధికారికంగా 20 వేల ఎకరాల్లో సాగు చేశారంటూ తప్పుడు గణాంకాలు ప్రచురించింది. ఇకపోతే పోతిరెడ్డిపాడు నుంచి తీసుకునే నీటిలో 5 టీఎంసీలు కేసీ కెనాల్కు తీసుకోవచ్చు. ప్రస్తుతం అక్కడి నుంచి తీసుకునేందుకు అవకాశం లేకపోవడంతోనే ముచ్చుమర్రి నుంచి నీటిని తీసుకుంటుంటే ఈనాడు తప్పుడు రాతలు రాసింది. ‘‘నీటి కేటాయింపులు లేవు. రైతులకు నీరు ఎలా ఇస్తారు? రైతులకు అన్యాయం జరుగుతుందనేలా విషపు కథనాన్ని కక్కింది. రైతుల నుంచి వసూళ్ళు చేసిన సొమ్ము రాష్ట్ర స్థాయి అధికారికి చేరిందంటూ అవాస్తవాలతో పైత్యం ఒలకబోసింది. దీనిపై ఇంజినీరింగ్ వర్గాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అది ముమ్మాటికీ తప్పుడు కథనమే ఉయ్యాలవాడ: శ్రీశైలం నుంచి ఎస్సార్బీసీ కేసీ కెనాల్కు వచ్చే సాగు నీటికి రైతులు డబ్బులు ఇచ్చారని ఈనాడులో వచ్చిన వార్తా కథనాన్ని వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు బుడ్డా చంద్రమోహన్రెడ్డి, ఆళ్లగడ్డ మార్కెట్యార్డ్ డైరెక్టర్ గజ్జెల క్రిష్ణారెడ్డి, మాజీ గ్రామ సర్పంచ్ ఆరికట్ల శివరామక్రిష్ణారెడ్డి రైతులతో కలిసి తీవ్రంగా ఖండించారు. సోమవారం స్థానిక ఎంపీపీ బుడ్డా భాగ్యమ్మ ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రైతుల అభ్యర్థన మేరకు రాష్ట్ర సాగునీటి జలవనరుల సలహాదారులు గంగుల ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి ప్రభుత్వం, అధికారులతో మాట్లాడి నీరు విడుదల చేయించారని పేర్కొన్నారు. అనంతరం ప్రధాన రహదారిపై రైతులు ఈనాడు ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. ఈనాడుది తప్పుడు కథనం కేసీ కెనాల్ పరిధిలో కర్నూలు, కడప జిల్లాల్లో 2.65 లక్షల ఎకరాల్లో ఆయకట్టు ఉంది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్లో 97 వేల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఆగస్టు, డిసెంబర్ నెలల్లో నిర్వహించిన ఐఏబీ సమావేశాల్లో డిసెంబర్ 15 వరకు నీటిని అందించాలని తీర్మానం జరిగింది. రైతుల విన్నపం మేరకు శ్రీశైలంలో లెవెల్ పర్మిట్ చేసేంత వరకు నీటి విడుదలకు చర్యలు తీసుకున్నాం. ముచ్చుమర్రి ద్వారా వారాబందీ ప్రకారం రాత్రి, పగలు గస్తీకాసి నీరు అందిస్తుంటే ఇంజినీర్లు డబ్బులు వసూలు చేశారంటూ తప్పుడు కథనం రాయడం బాధాకరం. – వి.తిరుమలేశ్వర రెడ్డి, కేసీ ఈఈ సాగునీరు కొనుక్కొనే దుస్థితి లేదు సాగునీటి కోసం అధికారులకు లంచాలిచ్చి కొనుక్కొనే దుస్థితి రైతుకు దాపురించలేదు. వర్షాభావంలోనూ మా పంటలకు నీరు ఇచ్చేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుకు వచ్చి పంటలు పండేలా చర్యలు తీసుకున్నారు. అలాగే వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ముందస్తుగా కుంటలను నింపుకునేందుకు కేసీ కెనాల్కి నీరు వదిలారు. – రామాంజనేయరెడ్డి, రైతు, గుండుపాపల చివరి పంటలకు సాగునీరు ఇచ్చారు ప్రభుత్వం రైతులకు సాగునీరు ఇచ్చి ఆదుకుందనే చెప్పాలి. ఎందుకంటే జలాశయాల్లో నీరు అంతంత మాత్రమే. అయినా మా పంటలు ఎండకూడదనే ఉద్దేశంతోనే వారాబందీగా నీరు అందించారు. ప్రస్తుతం చివరి ఆయకట్టు పంటలకు సాగునీరు అందింది. – వాసుడు, రైతు, చాకరాజువేముల -
శాస్త్రీయ వ్యవసాయ ప్రణాళిక ఏది?
గత ప్రభుత్వం వ్యవసాయ ప్రణాళికలను తయారు చేయకుండా రైతుల ఇష్టా నిష్టాలపై వ్యవసాయ ఉత్ప త్తులను సాగించింది. అంత కుముందు ఉన్న వ్యవసాయ ప్రణాళికలను 2021 –22 నుండి పూర్తిగా ఎత్తి వేసింది. మార్కెట్ ధరలను బట్టి రైతులు పంటలు పండించడమే తప్ప ప్రణాళికా బద్ధంగా వ్యవసాయ ఉత్పత్తి జరగలేదు. వ్యవసాయ ప్రణాళిక ద్వారా రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు చేయాలని జరిపిన ఆందోళనలు ప్రభుత్వం పట్టించుకోలేదు. వరి, పత్తి పంటలకు ఇచ్చిన ప్రాధాన్యం ఇతర పంటలకు ఇవ్వలేదు. రాష్ట్రంలో సాగుభూమి 163 లక్షల ఎకరాలు కాగా, వాస్తవంగా సాగుచేసింది 123 లక్షల ఎకరాలు మాత్రమే. అందులో యాసంగి 70 లక్షల ఎకరాలు మాత్రమే సాగయింది. అనగా వానాకాలం, యాసంగి కలిసి 200 లక్షల ఎకరాలు మాత్రమే సాగయింది. చాలామంది రైతులు చవిటి భూములలో కూడా పత్తి లాంటి పంటలు వేసి నష్టపోతున్నారు. ఏ భూమిలో ఏ పంటలు వేయాలన్నది భూసార పరీక్షలు నిర్వహించి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించాలి. భూసార పరీక్షలు జరిపి రైతులకు ‘సాయిల్ హెల్త్ కార్డు’ ఇవ్వాలి. భూసార పరీక్షలు జరపడం గత పదేళ్లుగా అమలు చేయనందున రైతులు తమకు తోచిన పంటలు పండిస్తున్నారు. పప్పులు, నూనెలు, ముతకధాన్యాల ఉత్పత్తులు హెచ్చుతగ్గులకు గురవు తున్నాయి. ముతక ధాన్యాల ఉప ఉత్పత్తులు (రాగులు, సజ్జలు, కొర్రలు, జొన్నలు) దిగుమతులు చేసుకుంటున్నాము. ఒకవైపున జనాభా 1.9 శాతం పెరుగుతుండగా వ్యవసాయ భూమి విస్తీర్ణం తగ్గుతున్నది. పెరుగు తున్న జనాభాకు అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకతలు నిరంతరం పెరగాలి. ఇందుకుపంటల పరిశోధనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలి. 2014 తర్వాత నుంచి వ్యవసాయ పరిశోధనా ఫలితాలను కూడా దిగుమతి చేసు కున్నాము. మోన్శాంటో, డ్యూపాంట్, కార్గిల్, సింజెంటా, బేయర్ లాంటి సంస్థలు వ్యవసాయ పరిశోధనలు చేసి లాభాలు సంపాదిస్తున్నాయి. రాష్ట్ర వాతావారణానికి అనుకూలంగా ప్రాంతీయంగా వ్యవసాయ పరిశోధనలు జరగాలి. ఇతర దేశాలలోని పరిశోధనా ఫలితాలను వినియోగించడం ద్వారాపంటల ఉత్పత్తులు దెబ్బతిని రైతులు నష్ట పోతు న్నారు. ప్రతి మూడువేల ఎకరాలకు ఒక ఏఈఓను (వ్యవసాయ విస్తరణాధికారి) నియమించాలని రైతులు ఆందోళన నిర్వహించారు. అయినప్పటికీ నేటికీ తగినంతమంది వ్యవసాయ అధికారులను గత ప్రభుత్వం నియమించలేదు. హార్టికల్చర్ శాఖలో 2179 పోస్టులకు గాను 901 ఖాళీగా ఉన్నాయి. వ్యవసాయ శాఖలో 2,800 పోస్టులు ఖాళీలున్నాయి. రాష్ట్రంలో 1,167 గోదాముల ద్వారా 24.74 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సౌకర్యాన్ని కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 2014 వరకు 710 గోదాములలో 7.39 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం మాత్రమే ఉంది. ఆ తర్వాత ప్రకటించిన 457 గోదాముల నిర్మాణం నేటికీ పూర్తికాలేదు. వ్యవసాయ ఉత్పత్తులను గ్రేడింగ్ చేసి బాక్సులు లేదా సంచులలో నింపి గోదాములలో నిల్వ చేయాలి. వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేసి అదనపు ఆదాయం వచ్చేవిధంగా ప్రణాళికను రూపొందించి ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలి. వ్యవసాయ ప్రణాళికలో పంట రుణాలుఅత్యంత కీలకమైనవి. రిజర్వు బ్యాంకు ఆదేశాల ప్రకారం బ్యాంకుల వాణిజ్య వ్యాపారంలో 40 శాతం వ్యవసాయ రంగానికి రుణాలివ్వాలి. అందులో 18 శాతం పంటరుణాలు ఇవ్వాలి. అందుకు తగినవిధంగా ప్రతి ఏటా మే నెలలో వ్యవసాయ రుణ ప్రణాళికను తయారుచేయాలి. కానీ వ్యవసాయ శాఖ ఆగస్టులో రుణప్రణాళికను విడుదల చేస్తున్నది. వ్యవసాయ బడ్జెట్ తగినంత కేటాయించకపోవడం వల్ల వ్యవసాయా భివృద్ధికి, నూతన టెక్నాలజీని వినియోగించడానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. 2023–24లో రూ. 18,370 కోట్లు కేటాయింపులు చూపారు. కానీఇందులో రైతుబంధు రూ. 11,704 కోట్లు, రైతు బీమా రూ. 1,167 కోట్లు, వ్యవసాయ రుణమాఫీ రూ. 4,692 కోట్లు, మ్తొతం రూ. 17,565 కోట్లు కేటాయించారు. ఈ పథకా లను మినహాయిస్తే వ్యవసాయానికి కేటాయించింది రూ. 807 కోట్లు మాత్రమే. వ్యవసాయ ప్రణాళికను శాస్త్రీయంగా రూపొందించడం వలన వ్యవసాయ ఉత్పత్తులు పెరగడానికి రాష్ట్రంలో వాతావరణ అనుకూలత ఉంది. సమ శీతోష్ణ వాతావరణం వలన రాష్ట్రంలో విత్తనోత్పత్తితో పాటు వాణిజ్య పంటలకు, హార్టికల్చర్ పంటలకు అవకాశాలున్నాయి. వాతావరణాన్ని బట్టిపంటలు పండించేందుకు తగిన శిక్షణనివ్వాలి. ప్రభుత్వ రంగంలోని పరిశోధనా కేంద్రాలకు శాస్త్ర వేత్తలను, నిధులను కేటాయించి అధికోత్పత్తికి దోహదం చేయాలి. - వ్యాసకర్త రైతుసంఘం తెలంగాణ ఉపాధ్యక్షులు - సారంపల్లి మల్లారెడ్డి -
రబీలోనూ ప్రత్యామ్నాయ పంటలు
సాక్షి, అమరావతి : రబీ సీజన్లోనూ నెలకొన్న వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ సన్నద్ధమైంది. సీజన్లో నెలకొన్న బెట్ట పరిస్థితులకనుగుణంగా అవసరమైన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలుచేసేందుకు కార్యాచరణ సిద్ధంచేసింది. సీజన్ ఆరంభమై నెలన్నర రోజులైన నేపథ్యంలో.. రబీసాగు లక్ష్యం 55.96 లక్షల ఎకరాలుగా కాగా, ఇందుకు 3,64,372 క్వింటాళ్ల విత్తనం అవసరమని వ్యవసాయ శాఖ ఇండెంట్ పెట్టింది. దీంతో 3,78,200 టన్నులను ఆర్బీకేల్లో పొజిషన్ చేయగా, ఇప్పటివరకు 2,49,647 క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేశారు. ప్రధానంగా 2.45 లక్షల క్వింటాళ్ల శనగ, 3,500 క్వింటాళ్ల వేరుశనగ, 500 క్వింటాళ్ల చొప్పున వరి, పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేశారు. గతేడాది ఇదే సమయానికి 10.81 లక్షల ఎకరాల్లో పంటలు సాగుకాగా.. ఈ ఏడాది ఇప్పటివరకు 8.5 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికపై వ్యవసాయ శాఖ దృష్టిసారించింది. ఇప్పటికే ఆ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సీజన్లో నెలకొన్న వాతావరణ పరిస్థితులను ప్రతీ 15 రోజులకోసారి సమీక్షిస్తూ తదనుగుణంగా ముందుకు సాగాలని నిర్ణయించారు. అలాగే, అచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సిఫార్సులకనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను రూపొందించారు. గోదావరి ప్రాజెక్టు కింద సాగునీరు గోదావరిలో పుష్కలంగా నీరుండడంతో ఈ ప్రాజెక్టు పరిధిలో వ్యవసాయ, ఆక్వా అవసరాలకు తగినంత నీరివ్వనున్నారు. ఐఏబీ–డీఏఏబీ సమావేశంలో ఏ మేరకు సాగునీరు ఉందో అంచనావేస్తూ ఎంత విస్తీర్ణంలో సాగుకు నీరు ఇవ్వగలమో రైతులకు ముందుగానే చెబుతున్నారు. సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల మేరకు కాలువల కింద నీటి సరఫరాను నిలిపివేసే తేదీలపై ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం కల్పింస్తున్నారు. ఇక శివారు ప్రాంతాల్లో (టెయిల్ ఎండ్ ఏరియాస్) సాధ్యమైనంత త్వరగా నాట్లు వేసుకునేలా అవగాహన కల్పింంచడంతో పాటు నీటి యాజమాన్య పద్ధతులు విధిగా పాటించేలా రైతులను అప్రమత్తం చేయనున్నారు. గోదావరి డెల్టా పరిధిలో వెదజల్లు సాగును ప్రోత్సహించడంతో పాటు అత్యధిక నీటి వినియోగమయ్యే పంటల్లో ఒకటైన మొక్కజొన్న సాగును కాలువల కింద ప్రోత్సహించకూడదని నిర్ణయించారు. వరికి ప్రత్యామ్నాయంగా అపరాలు బాపట్ల, పల్నాడు, కర్నూలు జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో ఐఏబీ, డీఏఏబీ సమావేశాలను సంయుక్తంగా నిర్వహించనున్నారు. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం మెట్ట ప్రాంతాల్లో వరికి ప్రత్యామ్నాయంగా అపరాల సాగును, కాలువల ఎగువ ప్రాంతాల్లో అపరాలతో పాటు మొక్కజొన్న సాగును ప్రోత్సహిస్తారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకనుగుణంగా 14 జిల్లాల పరిధిలో కనీసం 60వేల ఎకరాల్లో కంటిజెంట్ ప్లానింగ్ అమలుచేస్తారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు కోసం 6,229 క్వింటాళ్ల విత్తనం అవసరమని గుర్తించారు. వీటిని సబ్సిడీపై రైతులకు అందించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఆర్బీకే స్థాయిలో విస్తృత ప్రచారం స్వల్పకాలంలో చేతికొచ్చే పంటల సాగును ప్రోత్సహించేలా రూపొందించిన ఈ కార్యాచరణను ఆర్బీకేల ద్వారా కరపత్రాలు, వాల్ పోస్టర్లతో ప్రచారం చేస్తున్నారు. అంతేకాక.. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికనుగుణంగా సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులకు సంబంధించి శాస్త్రవేత్తల సలహాలు, సూచనలతో కూడిన చిన్నపాటి వీడియో, ఆడియో సందేశాలతో రైతులకు అవగాహన కల్పింస్తున్నారు. -
వాస్తవ రూపంలో ‘దున్నేవాడిదే భూమి’
‘ఎవరెన్ని చెప్పినా పేద ప్రజల ప్రయోజనాలకు మాత్రం రక్షణ లేదు. మన ప్రభుత్వం నమ్రతతో ఈ సత్యాన్ని అంగీకరించి తీరాలి’ అని ఒకప్పుడు కఠోర సత్యం చెప్పారు మహాత్మా గాంధీ. కానీ స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా కూడా ఆ ధోరణిలో మార్పు రాలేదు. తరాలుగా పేద ప్రజలు కాయకష్టం చేసి సంపద సృష్టిస్తున్నారు. అలాంటి పేద ప్రజలకు నిర్ణయాధికారం లేదు. వారి యాజమాన్య హక్కులకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రాణం పోశారు. అసైన్డ్ భూముల మీద వారికి పూర్తి హక్కులు కల్పించడం ఒక చారిత్రక నిర్ణయం. దశాబ్దాలుగా పోరాటాల రూపంలో వెల్లడైన పేదల కాంక్షలకు నేటి ఈ నిర్ణయం అంతిమ విజయంగా భావించుకోవాలి. ‘‘కోట్లాది దేశ ప్రజలకు ఆహార పంటలు అందించే రైతులకన్నా దేశంలోని పెట్టుబడి దారులకే ప్రభుత్వాలు సర్వ సౌకర్యాలు కల్గిస్తున్నాయి. ఇది కంటికి కన్పించే నగ్న సత్యం. నేను పెట్టుబడిదారులకు వ్యతిరేకిని కాదు. నిజం చెప్పాలంటే, నేను ఒక పెట్టుబడిదారుడికి చెందిన ఇంట్లోనే ఉంటు న్నాను. కానీ పెక్కుమంది పెట్టుబడిదారుల వైఖరి ఎలా ఉంటుందో నాకు తెలుసు. ప్రభుత్వాలు మాత్రం తాము పేద ప్రజలకు చేయవలసిందంతా చేస్తున్నామని పైకి చెప్పొచ్చుగాక. ఆ మాటకొస్తే వలస పాలకు లైన బ్రిటిష్ వాళ్ళు కూడా అలాగే చెబుతూండేవాళ్లు. అసలు సత్యం ఏమంటే – ఎవరెన్ని చెప్పినా పేద ప్రజల ప్రయోజనాలకు మాత్రం రక్షణ లేదు. మన ప్రభుత్వం నమ్రతతో ఈ సత్యాన్ని అంగీకరించి తీరాలి. అంతేగాదు, ఏ ప్రయివేట్ ఆస్తి అయినా సరే, అది సిగ్గుఎగ్గూ లేకుండా దొంగిలించిన ఆస్తిగానే నేను పరిగణిస్తాను. ఎవరైనా సరే తన కాయకష్టం ద్వారా సంపాదించని ఆస్తి, లేదా బతుకుతెరువుకు అవసర మైన కనీస శ్రమ ఫలితంగా దక్కని సొమ్ము... సిగ్గూ ఎగ్గూ లేని సంపా దన అవుతుంది.’’ – మహాత్మా గాంధీ (11.12.1947). వి. రామ్మూర్తి ‘హిందూ’ పత్రిక తరఫున ఎడిటర్గా సంకలనం చేసి ‘కస్తూరి అండ్ సన్స్ లిమిటెడ్ (చెన్నై) తరఫున 2003లో ప్రచురించిన గ్రంథం నుంచి. తరాలుగా పేద ప్రజలు కాయకష్టం చేసి సంపద సృష్టిస్తున్నారు.ఆ బడుగు, బలహీన వర్గాలకు చెందిన హక్కులను మొట్టమొదటి సారిగా సాధికారికంగా క్రోడీకరించి... ‘దున్నేవాడిదే భూమి’ అన్న దశాబ్దాల వామపక్ష ఉద్యమాల స్ఫూర్తిని కొలది రోజుల నాడు ఆచరణలోకి తెచ్చారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. పేద ప్రజల సాగు హక్కులకు ప్రాణం పోశారు. దీనితో పది రకాల వ్యాఖ్యా నాల ద్వారా పేదల భూమి హక్కులను, సాగు హక్కులను తారు మారు చేసే మోతుబరుల ప్రయత్నాలకు స్వస్తి పలికారు. రాష్ట్రంలో మరే ప్రభుత్వం వచ్చినా, దీన్ని చెదరగొట్టే ప్రయత్నాలు చెల్లవు. ఆ ప్రయత్నాల్ని తిప్పికొట్టే శక్తినిచ్చేదే ఈ ముందడుగు. వామపక్షాలు దశాబ్దాల తరబడిగా ఆంధ్ర, తెలంగాణలలో కౌలు దారీ చట్టాల కోసం చేస్తూ వచ్చిన పోరాటాలతో సాధించిన పాక్షిక విజయాలకు... నేటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు అసైన్డ్ భూములపై హక్కులు ఇచ్చిన తీరు భూ చరిత్రలో అంతిమ విజయంగా భావించుకోవాలి. పేదలకు ఈ యాజమాన్య హక్కులు రావడం వలన వారు అవసరం అయితే తమ భూమిని విక్రయించుకోవచ్చు. ఇక, ఇంతకుపూర్వం కౌలు రైతులకు రుణాలు పొందే అర్హత కార్డులు ఉండేవి కావు. ఈ కార్డులు లేకనే బ్యాంకులు రుణాలివ్వలేదు. ఎంతసేపూ భూములకు పట్టాలున్న రైతుల్నే గుర్తిస్తారు. కౌలు రైతులను గుర్తించేది లేదన్న వైఖరిని కేసీఆర్ లాంటి నాయకులు కనబరిచారు. ఏదైనా ఇంట్లో అద్దెకు ఉంటే, ఆ ఇంటిపై హక్కు అతనికి ఇవ్వగలమా అని కూడా ప్రశ్నించారు. కానీ ఒకప్పుడు వై.ఎస్. రాజ శేఖర రెడ్డి ముఖ్యమంత్రిత్వంలో నాలుగు లక్షల మందికి పైగా కౌలు రైతులు రుణ అర్హత కార్డులు పొందారు. తద్వారా అనేకమంది బ్యాంకు రుణాలు పొందగలిగారు. కౌలుదారులకు విధిగా వర్తించాల్సిన రక్షణ చట్టాల కోసం సుదీర్ఘ పోరాటాలు జరిగిన చరిత్ర ఉంది. ఆంధ్ర–తెలంగాణ వామపక్ష నాయకులు ఆ యా ప్రాంతాలలో విడివిడిగానూ, ఉమ్మడి గానూ కలిసి పోరాటం జరిపారు. చండ్రరాజేశ్వర్రావు, చలసాని వాసుదేవరావు, రావి నారాయణరెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి, మగ్దుం మొహియుద్దీన్, బద్దం ఎల్లారెడ్డి, ఎస్వీకే ప్రసాద్– సుగుణ దంపతులు లాంటివాళ్లు ఇందులో ఉన్నారు. ఉభయ రాష్ట్రాల చరిత్రలో తొలి భూపోరాటాలు, పాక్షిక విజయాలన్నీ వామపక్షాల నేతృత్వంలోనే సాధ్యమయ్యాయి. ఒక్క ముక్కలో, పాత ఫ్యూడల్ శక్తులకు ముగుదాడు వేసి సాధించిన విజయాలన్నీ వామపక్షాలు బలంగా ఉన్నప్పటివే. అవి ఎప్పుడు బలహీనపడ్డాయో అప్పటినుంచీ పటిష్ఠమైన పార్టీగా ఉమ్మడి వామపక్షాల మాట గతకాలపు ‘ముచ్చట’గానే మిగిలి పోయింది. కానీ ప్రస్తుత దశ వేరు. కార్పొరేట్ శక్తుల చేతిలో దేశం నడుస్తున్నది. చాలక, వారి ఆధ్వర్యంలో ప్రసార మాధ్యమాలు కూడా లొంగిపోతున్నాయి. దేశీయ, విదేశీయ ఆశ్రిత పెట్టుబడుల పెత్తనం స్వతంత్ర భారత రాజ్యాంగ మౌలిక లక్ష్యాలను పాతి పెట్టింది. ఈ దుఃస్థితిని కనిపెట్టిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్, ‘రానున్న రోజుల్లో ప్రజలు పార్లమెంట్ను కూల్చేస్తా’రని ముందుగానే హెచ్చరించారు. గత పదేళ్లుగా ప్రతియేటా భారత పరిశోధనా సంస్థ ‘ఏడీఆర్’ నివేదికలు విషాద వాస్తవాన్ని చెబుతున్నాయి. అటు పార్లమెంట్ సభ్యులలో (అన్ని రకాల పార్టీల వాళ్ళు), ఇటు రాష్ట్రాల శాసన సభ్యులలో, మంత్రులలో ఎంత భారీ స్థాయిలో అవినీతి పేరుకు పోయిందో, సవరణకు వీలుకాని స్థాయిలో అవినీతి ఎలా రాజ్య మేలుతోందో ఏడీఆర్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అందుకే మన పాలకుల్ని ఉద్దేశించి ఒక మహాకవి ఇలా హెచ్చరించాడు:‘విజ్ఞానం వికసించదు విదేశాలు తిరిగొస్తేనే పరిణతమతి ప్రసరించదు పురాణాలు తిరగేస్తేనే!’ ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాకులు abkprasad2006@yahoo.co.in -
Andhra Pradesh: లంక భూములు గట్టెక్కాయి
మా తాత నుంచి నాకు అర ఎకరం పొలం వచ్చింది. కాగితాలు లేకపోవడంతో ఆ భూమిపై మాకు ఎలాంటి హక్కు లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. ఇందుకోసం చాలా డబ్బు ఖర్చు చేశాం. జగన్ ప్రభుత్వం వచ్చాక పైసా ఖర్చు లేకుండా మా భూమికి పట్టా ఇస్తున్నారు. ఆయనకు రుణపడి ఉంటాం. – తోడేటి నాంచారయ్య, చింతల్లంక, కొల్లూరు మండలం, బాపట్ల జిల్లా ((బాపట్ల జిల్లా కొల్లూరు, భట్టిప్రోలు నుంచి సాక్షి ప్రతినిధి బి.ఫణికుమార్)): ఇది నిన్న, మొన్నటిది కాదు.. కొన్ని దశాబ్దాలు, తరాల సమస్య. గోదావరి, కృష్ణా నదుల పరీవాహక ప్రాంతాల్లో లంక భూములను సాగు చేసుకుంటున్న రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఏడాదికి మూడు పంటలు పండే ఈ భూములు ఎంతో విలువైనవి. అయితే వాటికి కాగితాలు, పాస్ బుక్లు లేకపోవడంతో రైతులు చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. వ్యవసాయ రుణాలు, రైతులకు అందే ఇతర ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు లభించేవి కావు. తమ సమస్యను పరిష్కరించాలని రైతులు దశాబ్దాల నుంచి ప్రజాప్రతినిధులను, అధికారులను కలుస్తూనే ఉన్నారు. అయితే ప్రయోజనం శూన్యం. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక లంక రైతుల సమస్యపై దృష్టి సారించింది. మొత్తం 8 జిల్లాల్లో ఏకంగా 9,062 ఎకరాలకు పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ప్రభుత్వ నిర్ణయంతో 17,768 మంది లబ్ధిదారుల కుటుంబాల్లో వెలుగులు ప్రసరించనున్నాయి. వీరు సాగుచేసుకుంటున్న భూములకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 17న పట్టాలివ్వనున్నారు. సాక్షి బృందం బాపట్ల జిల్లా కొల్లూరు, భట్టిప్రోలు మండల్లాలోని దోనేపూడి, జువ్వలపాలెం, సుగ్గునలంక, చింతల్లంక, చిలుమూరు లంక, వెల్లటూరు, పెదపులివర్రు, పెదలంక, ఓలేరు తదితర లంక గ్రామాల్లో పర్యటించినప్పుడు అక్కడి రైతులు ఇన్నేళ్లుగా తాము పడిన బాధలను పంచుకున్నారు. తమ జీవితకాలంలో ఈ సమస్య పరిష్కారమవుతుందని అనుకోలేదని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దీన్ని సులువుగా పరిష్కరించారని కొనియాడారు. ఆయన మేలును మరిచిపోలేమని భావోద్వేగానికి గురయ్యారు. దళితులంటే ఆయనకు ఎంత అభిమానమో లంక భూముల సమస్య పరిష్కారంలోనే అర్థమవుతోందని కన్నీటి పర్యంతమయ్యారు. కాగా ఒక్క కొల్లూరు మండలంలోనే 710 మంది రైతులకు 295 ఎకరాలకు సంబంధించి సీఎం వైఎస్ జగన్ పట్టాలు అందించనున్నారు. లంక భూముల కథ ఇది.. కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో ఒండ్రు మట్టి ఒక చోటకు చేరడంతో ఏర్పడ్డ సారవంతమైన భూములే.. లంక భూములు. కృష్ణా, ఎనీ్టఆర్, బాపట్ల, పల్నాడు, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో తరతరాలుగా రైతులు వాటిని సాగు చేసుకుంటున్నారు. అయితే ఈ భూములకు సంబంధించి వేలాది మంది రైతులకు పట్టాలు లేవు. తమకు పట్టాలు ఇవ్వాలని కొన్ని దశాబ్దాలుగా అక్కడి రైతులు ప్రభుత్వాలను కోరుతూ వచ్చారు. అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షణలు చేసినా ఫలితం శూన్యం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి సమస్యను సానుకూలంగా పరిష్కరించేందుకు సిద్ధమైంది. వివాదాల్లేకుండా సాగు చేసుకుంటున్న అర్హులకు పట్టాలు ఇచ్చేందుకు వీలుగా లంక భూముల అసైన్డ్ నిబంధనలు సవరించింది. ఈ భూములను మూడు కేటగిరీలుగా గతంలోనే విభజించింది. గట్టుకు దగ్గరగా ఉండి వరద వచ్చినా కొట్టుకుపోని భూమిని ఏ కేటగిరీగా, ఏ కేటగిరీకి ఆనుకుని కొంత నదిలోకి ఉన్న భూమిని బి కేటగిరీగా, ఏ, బీ కేటగిరీకి ఆనుకుని వరదలు వస్తే పూర్తిగా మునిగిపోయే భూమిని సీ కేటగిరీగా వర్గీకరించింది. ఏ, బీ కేటగిరీ భూములకు పట్టాలు, సీ కేటగిరీ భూములకు లీజు పట్టాలు ఇవ్వనుంది. మా ఇంటికి వెలుగు తెచ్చారు.. 50 ఏళ్లకు ముందు నుంచి ఎకరం భూమిని లంకలో సాగు చేసుకుంటున్నాం. కానీ కాగితాల్లో మాత్రం అది మా భూమి కాదని ఉంది. దానిపై కనీసం బ్యాంకు రుణం ఇమ్మన్నా ఇచ్చేవారు కాదు. ప్రజాప్రతినిధులను, అధికారులను ఎన్నోసార్లు కలిసి న్యాయం చేయాలని అడిగినా పట్టించుకోలేదు. ఇప్పుడు జగనన్న వచ్చాక మా ఇంటికి వెలుగు తెచ్చారు. మా భూమికి పట్టా ఇస్తున్నారు. – తోడేటి రత్నాకరరావు, చింతల్లంక, కొల్లూరు మండలం, బాపట్ల జిల్లా నాలాంటి ఎంతోమంది కష్టాలను తీర్చారు.. నాకున్న ఎకరం భూమికి కాగితాలు, పాస్బుక్లు ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు జగనన్న నా భూమికి పట్టా ఇస్తున్నారు.. ఎంతో ఆనందంగా ఉంది. లంకల్లో నాలాంటి ఎంతో మంది కష్టాలను తీరుస్తున్నారు. ఆయన మేలు మర్చిపోలేం – ఈపూరి ఏబేలు, చింతల్లంక, కొల్లూరు మండలం, బాపట్ల జిల్లా ఎప్పటికీ మా బాధ తీరదనుకున్నాం.. మేం సాగు చేసుకుంటున్న లంక భూములంటే అందరూ చిన్నచూపు చూసేవారు. ఎంతో విలువైన భూమి ఉన్నా దానికి కాగితాలు లేవు. ఎప్పటికీ మా బాధ తీరదనుకున్నాం. జగన్ సీఎం అయ్యాకే లంక భూముల సమస్యపై దృష్టి పెట్టారు. ఆయన వచ్చినప్పటి నుంచి మా సమస్య పరిష్కారమవుతుందనే నమ్మకం ఉండేది. మేం ఆశించినట్లుగానే ఎవరూ చేయని పనిని ఆయన చేసి మాకు న్యాయం చేశారు. – బొజ్జా రమేశ్, వెల్లటూరు, భట్టిప్రోలు మండలం, బాపట్ల జిల్లా పేదల దేవుడినని నిరూపించారు.. మేం జీవించి ఉండగా ఈ సమస్య పరిష్కారమవుతుందని అనుకోలేదు. ఇంత క్లిష్టమైన సమస్యను సీఎం జగన్ చాలా తేలిగ్గా పరిష్కరించారు. లంక భూములకు దారి చూపించి తాను పేదల దేవుడినని నిరూపించారు. – ఏలూరి శేషగిరిరావు, వెల్లటూరు, భట్టిప్రోలు మండలం, బాపట్ల జిల్లా -
వ్యర్థాలూ ఆదాయ మార్గం కావాలి!
పంట వ్యర్థాలను సేకరించే శ్రమను తీసుకోవాలంటే రైతులకు ఒక ప్రేరణ అవసరం. అన్ని రకాల వ్యవసాయ వ్యర్థాలూ ఎరువులను ఉత్పత్తి చేయడానికి అనువైనవి. దీని నుంచే వచ్చే ఘన ఎరువు స్వయంగా ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న సేంద్రియ ఎరువు. ఇందులో వెలువడే మీథేన్ను వెంటనే వాడుకునే వీలుగా వేరే చోటికి పైపుల ద్వారా తరలించాలంటే, దానిలోని ఇతర వాయువులను శుభ్రం చేయాల్సి ఉంటుంది. ప్రతి ప్రాంతంలో లభించే పంట అవశేషాలు, ఇతర వ్యవసాయ వ్యర్థాల పరిమాణంపై ప్రభుత్వం నమ్మదగిన అంచనాలతో ముందుకు వస్తే, వ్యవస్థాపకులు తగిన పరిమాణాలలో బయోడైజెస్టర్లను ప్లాన్ చేయవచ్చు. అప్పుడు కాలుష్యానికి కారణమయ్యేలా పంట వ్యర్థాలను వృథాగా కాల్చే పనివుండదు. ప్రభుత్వ సీనియర్ అధికారులు కచ్చితంగా క్వాంటమ్ కణాలకు చాలా భిన్నమైనవారు. అయినప్పటికీ, కణాలకూ, అధికారులకూ ఒక సారూప్యమైన గుణం ఉంటుంది. గమనించినప్పుడు స్థితి మార్చుకోవడం! పరిశీలనకుసంబంధించిన తక్షణ చర్యే మార్పును ప్రేరేపిస్తుంది. ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం పంట అవశేషాల దహనానికి స్వస్తి చెప్పాలని ఉత్తర భారత రాష్ట్రాల అధికారులను ఆదేశించినందున, అది ఎలా చేయాలో వారికే వదిలేస్తే, మనం ఎంతో కొంత చర్యను ఆశించవచ్చు. తదుపరి పంటను వేయడానికి తమ పొలాల్లోని పంట అవశేషాలను తొలగించాల్సిన రైతులతో విభేదాలు లేకుండా కోర్టు ఆదేశాలపై ఎలా చర్య తీసుకోవాలనే విషయంపై ఇక్కడ కొన్ని సూచనలు ఉన్నాయి. ప్రపంచంలోని ఐదు అత్యంత కాలుష్య నగరాలలో నాలుగు దక్షిణాసియా నగరాలే. అవి: లాహోర్, ఢిల్లీ, ముంబై, ఢాకా. భారత దేశం, పాకిస్తాన్ సరిహద్దుకు ఇరువైపులా ధాన్యాన్ని వేరుచేసిన తర్వాత పొలాల్లో మిగిలినదాన్ని తగుల బెట్టే ఆచారం సమస్యలకు కారణం అవుతోంది. వాస్తవానికి, గాలిలో సాంద్రతలో ఈ మసి గరిష్ఠంగా 40 శాతం వరకు ఉంటుంది. దీంతో గాలి వేగాన్ని తగ్గించే వాతావరణం ఏర్పడడం వల్ల, కురుస్తున్న వర్షాన్ని అరికట్టడం వల్ల ఈ కాలుష్య కారకాలు చాలాకాలం పాటు అలా గాలిలో నిలిచివుంటాయి. ఇది గాలి నాణ్యతను గణనీయంగా క్షీణింపజేస్తుంది. వాహనాల పొగ, నిర్మాణపరమైన పనుల వల్ల ఏర్పడే దుమ్ము కాలుష్య కారకాలలో ఎక్కువ భాగంగా ఉంటున్నాయి. ఈ కాలుష్య మూలాలను అరికట్టడం చాలా కష్టం. వాహనాల కాలుష్యాన్ని తొల గించాలంటే, శిలాజ ఇంధనాలను వినియోగించే అంతర్గత దహన యంత్రాల స్థానంలో వాహనాలకు విద్యుచ్ఛక్తిని ఇవ్వాల్సి ఉంటుంది. శుభ్రపర్చిన ఇంధనాలు, మెరుగైన ఇంజన్లు తాత్కాలికంగా సహాయ పడతాయి. కాలుష్య కారక వాహనాలను శుభ్రపరిచి వాటిని మార్చే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే దీనికి సమయం పడుతుంది. రోడ్డుపై నుండి వాహనాలు వెలువరించే ధూళిని ఎలా తగ్గించవచ్చు అంటే... అన్ని రోడ్ల పక్కన బహిర్గతమైన నేల, బహిరంగ ప్రదేశాలను కప్పడానికి గడ్డిని నాటడం ద్వారా. వెంటనే మొదటి గాలికే దుమ్మును దులిపే రకం చెట్లను కాకుండా, ఆ దుమ్మును నిలుపుకోగలిగే పచ్చద నాన్ని నాటడం కూడా మేలుచేస్తుంది. అయితే ఎడారి నేల మీదుగా వీచే గాలుల ద్వారా కొట్టుకువచ్చే దుమ్మును తగ్గించడానికి చేయ గలిగేది తక్కువ. నగరాల్లో జరిగే నిర్మాణ పనుల్లో దాని స్థానిక రూపంలోని పొడి సిమెంట్ను కాకుండా ముందే కలిపిన కాంక్రీట్ను మాత్రమే ఉపయో గించేట్టు చేయాలి. కాంక్రీట్ కలపడం కూడా బహిరంగంగా కాకుండా పరివేష్టిత ప్రదేశాలలో జరగాలని పట్టుబట్టడం ద్వారా చాలావరకు నిర్మాణాల పరమైన ధూళిని అరికట్టవచ్చు. ఇవి అవసరమైన చర్యలు. సంపూర్ణంగా ఆచరణీయమైనవి. అలాగని 19వ శతాబ్దానికి చెంది నట్లుగా ఇంకా పంట అవశేషాలను తగులబెట్టడం కొనసాగాలని అర్థం కాదు. ఆ అలవాటు అంతరించిపోవాలి. కానీ ఎలా? పంట వ్యర్థాలు, అలాగే అన్ని రకాల వ్యవసాయ వ్యర్థాలు, జీవ జీర్ణక్రియలో చిక్కుకున్న శక్తిని విడుదల చేయడానికీ, ఎరువులను ఉత్పత్తి చేయడానికీ అనువైనవి. నీటి ఆవిరి, కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్, పేడనీళ్లతో కలిపిన మొక్కల అవశేషాలు మీథేన్గా కుళ్లిపోతాయి. దీని నుండి అవసరమైతే ఘన ఎరువులను తీయవచ్చు. దీనికిదే స్వయంగా ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న సేంద్రియ ఎరువు. ఇందులో వెలువడే మీథేన్ను వెంటనే వాడుకునే వీలుగా వేరే చోటికి పైపుల ద్వారా తరలించాలంటే, దానిలోని ఇతర వాయువు లను శుభ్రం చేయాల్సి ఉంటుంది. బయోగ్యాస్ ప్లాంట్లను నిర్మించడం, వాటిని నిర్వహించడం అనేవి వ్యవసాయానికి భిన్నమైన కార్యకలాపాలు. బయోగ్యాస్ ప్లాంట్ నిర్వాహకులు కొనుగోలు చేయగలిగిన పంట అవశేషాలను కుప్పలుగా సేకరించడానికి రెతుకు ఒక ప్రేరణ అవసరం. పంట వ్యర్థా లను వదిలించుకోవడానికి ఒక మార్గం ఏమిటంటే, హ్యాపీ సీడర్ అనే యంత్రాన్ని ఉపయోగించడం. ఇది పొలాల నుండి వ్యర్థాలను అటు తీస్తూనే, ఇటు తదుపరి పంట విత్తనాలను నాటుతుంది. ఆ వ్యర్థాలను పొలంలోనే నశించేట్టు చేస్తుంది. అయితే ఈ పరికరం విస్తృతమైన కొనుగోలుకు లేదా అద్దెకు నోచుకోలేదు. తదుపరి పంటను నాటడా నికి ఉన్న విరామం చాలా స్వల్పం. రైతులందరికీ ఆ వ్యవధిలో పని చేయడానికి సరిపడా హ్యాపీ సీడర్లు అందుబాటులో లేవు. బయోగ్యాసును ఉత్పత్తి చేసే శక్తిమంతమైన కొత్త పరిశ్రమకు ముడి పదార్థంగా ఈ పంట అవశేషాలను అందించడమే మేలైన ప్రత్యామ్నాయంగా కనబడుతోంది. దీనిద్వారా రైతులు తమ పంట అవశేషాలను విక్రయించడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందు తారు. పైగా సింథటిక్ ఎరువుల ధరతో పోల్చదగిన ధరకు సేంద్రియ ఎరువులు అందుబాటులో ఉంటాయి. కానీ పంట అవశేషాలు అనేవి చురుకైన కాలుష్య కారకాల నుండి అదనపు వ్యవసాయ ఆదాయానికి పనికొచ్చే ప్రయోజనకరమైన ప్రవాహంగా మారడం దానంతటదే జరగదు. దానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. బయోడైజెస్టర్లు వివిధ స్థాయుల సాంకేతిక అధునాతనత్వంతో రావచ్చు. ఇది ఎక్కువగా ముడి పదార్థంగా ఉపయోగించే వివిధ రకాల సేంద్రియ పదార్థాల ముందస్తు చికిత్సపై ఆధారపడి ఉంటుంది. ఒక భారతీయ బహుళజాతి సంస్థ బయోగ్యాస్ కోసం పెద్ద ప్రణాళికలను కలిగి ఉంది. బహుశా అధునాతన బయోగ్యాస్ ప్లాంట్లను నిర్మించి సరఫరా చేస్తుంది. ఇది ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో చెరకు పంట వ్యర్థాలను నిర్వహిస్తోంది. ప్రతి ప్రాంతంలో లభించే పంట అవశేషాలు, ఇతర వ్యవసాయ వ్యర్థాల పరిమాణంపై ప్రభుత్వం నమ్మదVýæ్గ అంచనాలతో ముందుకు వస్తే, వ్యవస్థాపకులు తగిన పరిమాణాలలో బయోడైజెస్టర్లను ప్లాన్ చేయవచ్చు. ఈ ప్రక్రియ పట్ల కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు బాగా ఆలో చించి సబ్సిడీతో బలం చేకూర్చినప్పటికీ, ప్లాంట్లను నిర్మించడం, గ్యాçసు కోసం పైప్లైన్ నెట్వర్క్ వేయడం, గ్యాసును ఎలా ఉపయోగించాలో నిర్ణయించడం వంటి వాటికి కాస్త సమయం పడుతుంది. అయితే ఇప్పుడు పంట వ్యర్థాలను తగలబెట్టడం ఆపేయాలని కోర్టు ఆదేశం. దీని వల్ల మంటలను ఎలాగైనా ఆర్పడానికి పోలీసులను ఉపయోగించాలనే ఆలోచన కలిగించవచ్చు. ఇది ఓటర్లుగా కూడా ఉన్న రైతుల్లో భిన్నమైన మంటలను రేకెత్తిస్తుంది. అందువల్ల పంట వ్యర్థాలను సేకరించడం, నిల్వ చేయడమే సరైన పరిష్కారం. వ్యర్థా లను బయటకు తీయడానికి, రవాణా చేయడానికి రైతులకు అయ్యే ఖర్చును భరించడానికి ఒక సేకరణ ఏజెన్సీ సరిపోతుంది. భాక్రానంగల్ డ్యామ్ నిర్మిస్తున్నప్పుడు, దాని నిర్మాణానికి చెల్లించాల్సిన పన్ను గురించి రైతులు నిరసన వ్యక్తం చేసినప్పుడు, రాజకీయ నాయకులు, సీనియర్ అధికారులు ఆ ప్రాంతాన్ని రైతులు సందర్శించేలా చూశారు. తమ ముందు రూపుదిద్దుకుంటున్న ఆధునిక అద్భుతాన్ని స్వయంగా చూసేందుకు రైతులను ప్రాజెక్ట్ స్థలానికి తీసుకెళ్లారు. ప్రతాప్ సింగ్ ౖకైరోన్(పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి), అప్పటి వ్యవసాయ కార్యదర్శి ఆర్ఎస్ రంధావా, అప్పటి శాఖ డైరెక్టర్ డాక్టర్ అర్జున్ సింగ్ వంటి వారు గ్రామీణ ప్రాంతాలలో పర్యటించారు. రైతులు మరింత ఆహా రాన్ని పండించాలనీ, మార్పునకు ఏజెంట్లుగా ఉండాలనీ కోరారు. నేడు పంజాబ్లోని రాజకీయ, పరిపాలనా నాయకులు మార్పుకు ఏజెంట్లుగా మారడానికి అవకాశం ఉంది. అయితే వారు ఈ సంద ర్భానికి తగినట్టుగా ప్రవర్తించగలరా అనేది ప్రశ్న. టి.కె. అరుణ్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, కాలమిస్ట్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఒక్క రోజులోనే మార్కెట్కు 6వేళ క్వింటాళ్ల వరి ధాన్యం
జనగామ: వానాకాలం సీజన్లో ముందస్తు సాగు చేసిన వరి ‘కోతలు’ ముమ్మరంగా సాగుతున్నాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు మార్కెట్ బాట పట్టారు. దీంతో రికార్డు స్థాయిలో వస్తున్న ధాన్యం రాశులతో జనగామ వ్యవసాయ మార్కెట్ నిండి పోతున్నది. గురువారం ఒక్కరోజే ఆరువేల క్వింటాళ్లకు పైగా ధాన్యం కొనుగోలు చేశారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు రూ.500 తక్కువగా వ్యాపారులు కొనుగోలు చేస్తుండడంతో మరో రూ.200 పెచేలా చూడాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో వానాకాలం సీజన్ 1.72 లక్షల ఎకరా ల్లో వరి సాగు చేశారు. ఏటా ఈ సీజన్లో కత్తెర సాగుతో పాటు రెగ్యులర్ పంట వేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. సెప్టెంబర్ రెండవ వారం వరకు కత్తెర కోతలు పూర్తి కాగా.. ప్రస్తుతం ముంద స్తు నాట్లు వేసిన రైతులు వరి కోతలు ప్రారంభించారు. ధాన్యంతో జనగామ మార్కెట్కు ఉదయం వచ్చిన రైతులు, సాయంత్రాని ఇంటికి వెళ్లేలా పాలకమండలి, అధికారులు చర్యలు చేపట్టారు. రోజూ ఉదయం 5 నుంచి 10 గంటల వరకు సరుకును లోనికి అనుమతిస్తూ.. మధ్యాహ్నం రెండు గంటల వరకు మార్కెట్ గేటు మూసి వేస్తున్నారు. ఎంట్రీ చేసిన సరుకుకు ఈ–నామ్లో టోకెన్ కేటాయించి గేట్ ఎంట్రీ వద్ద లాట్ నంబర్ ఇస్తున్నారు. ఉద యం బిడ్డింగ్ మొదలైన తర్వాత ఆలస్యంగా వచ్చిన ధాన్యం వాహనాలను అనుమతించి మరుసటి రోజు కొనుగోలు చేస్తున్నారు. 43 లక్షల క్వింటాళ్ల ధాన్యం వానాకాలం సీజన్లో 43 లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సీజన్లో ప్రభుత్వం 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతుండగా.. ప్రస్తుతం ప్రైవేటు మార్కెట్లో కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. 2023–24 సంవత్సరం కేంద్ర ప్రభుత్వం వరి పంటకు కనీస మద్దతు ధర ఏ–గ్రేడ్ రూ.2,203, సాధారణ గ్రేడ్కు రూ.2,183 ప్రకటించింది. కత్తెర, ముందస్తు సాగు చేసిన వరి కోతలు మొదలై మార్కెట్లోకి పెద్ద ఎత్తున సరుకు వస్తున్నప్పటికీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు నేటికి ప్రారంభం కాలేదు. దీంతో మార్కెట్లో ప్రైవేట్ వ్యాపారులు మద్దతు ధరకు సుమారు రూ.500 తక్కువగా కొనుగోలు చేస్తున్నారు. తేమ అధికంగా ఉండడం వల్లే ధర ఇవ్వలేక పోతున్నామని వ్యాపారులు చెబుతున్నారు. 56వేల క్వింటాళ్ల కొనుగోళ్లు ఈ ఏడాది ఆగస్టు 30 నుంచి గురువారం వరకు జనగామ వ్యవసాయ మార్కెట్లో 1,262 మంది రైతుల వద్ద 56,074(85,169 బ్యాగులు) క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. క్వింటాకు ధర గరిష్టంగా రూ.2,079, రూ.1,961, రూ.1,859, కనిష్టంగా రూ.1,911, 1,720, రూ,1,609, రూ.1,405, మోడల్ ప్రైజ్ రూ.1,899, రూ.1,913, రూ.1,779, రూ.1,889 ధర పలికింది. ధర తక్కువగా వచ్చింది పదెకరాల్లో వరి సాగు చేసినం. పెట్టుబడికి రూ.2.50లక్షలు ఖర్చయింది. ముందుగా నాట్లు వేసిన ఆరు ఎకరాల్లో కోతలు పూర్తి చేసినం. 180 బస్తాల దిగుబడి రాగా జనగామ మార్కెట్కు వచ్చినం. ప్రభుత్వ మద్దతు ధరకంటే.. తక్కువగా కొనుగోలు చేశారు. సరుకు పచ్చిగా ఉందని క్వింటాకు రూ.1,765 మాత్రమే ధర ఇచ్చారు. విధిలేక అమ్ముకున్నాం. ధర మరో రూ.150 ఎక్కువ వస్తే బాగుండేది. శ్రమకు ఫలితం రావడం లేదు. – బాలోతు కళమ్మ, మహిళా రైతు, పెద్దపహాడ్(ఎర్రకుంటతండా) కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి ఐదెకరాల్లో వరి సాగు చేస్తే రెండు ఎకరాల్లో కోతలు పూర్తయ్యా యి. 90 బస్తాల దిగుబడి రాగా మార్కెట్కు తెచ్చిన. క్వింటాకు రూ.1,708 ధర పెట్టిండ్లు. రూ.1,800 ఇవ్వాలని కొట్లాడినా ఫలితంలేదు. ధాన్యానికి సరైన ధర రావాలంటే ప్రభుత్వం వెంట నే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. – భూక్యా సరక్రూ, రైతు, మచ్చుపహాడ్, నర్మెట ధర పడిపోకుండా చూస్తున్నాం.. మార్కెట్కు వచ్చిన ప్రతి గింజకు మంచి ధర వచ్చేలా చూస్తున్నాం. ఈ–నామ్ పద్ధతిలో విక్రయాలు జరుగుతున్నాయి. ఎక్కువగా పచ్చి సరుకు రావడంతో ధర పడిపోకుండా చూస్తున్నాం. ఏ ఒక్క రైతుకు నష్టం జరగకుండా పర్యవేక్షిస్తున్నం. – బాల్దె సిద్ధిలింగం, మార్కెట్ చైర్మన్ -
కాంగ్రెస్, బీజేపీలను పాతర పెట్టాలి
గజ్వేల్: ‘పీసీసీ అంటేనే పేమెంట్ కలెక్షన్ సెంటర్. బీజేపీని నమ్ముకుంటే అధోగతే. ఈ రెండు పార్టీలను పాతాళంలో పాతర పెట్టాలి. ఉచిత కరెంటు, మూడు పంటలు, ధాన్యపు రాశులు కావాలంటే కేసీఆర్ వెంటే నడవాలి..’ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో రూ.540 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీల తీరుపై మండిపడ్డారు. గత కాంగ్రెస్ హయాంలో ఎరువులు, విత్తనాల కోసం చెప్పులతో క్యూలు కట్టిన రోజులు రైతులు నేటికీ మరిచిపోలేదన్నారు. కరెంట్ సక్రమంగా రాక పంటలు ఎండిపోయి అన్నదాతలు అప్పుల పాలయ్యారని హరీశ్రావు విమర్శించారు. తప్పుదారి కాంగ్రెస్కు ఓటేస్తే ఉచిత కరెంట్ ఆగమైతదని రైతులు గుర్తించారని చెప్పారు. బీజేపీ వల్ల కూడా రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. కేసీఆర్ రైతే రాజు అనే సిద్ధాంతాన్ని నమ్ముకొని ముందుకు సాగటం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. కేసీఆర్ గజ్వేల్తో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని, ఆయన గజ్వేల్లోనే ఉండాలనుకుంటే రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ కానుకగా అందించే బాధ్యత ఇక్కడి ప్రజలపై ఉందని చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు కేసీఆర్ గృహలక్ష్మి పథకం కింద 10 వేల ఇళ్లను మంజూరు చేశారని ప్రకటించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ (టీఎస్ఎఫ్డీసీ) చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజాశర్మ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్కు పలు సంఘాల మద్దతు గజ్వేల్ నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడోసారి పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు పలు సంఘాలు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించాయి. గజ్వేల్ ఆర్యవైశ్య సంఘం, కుమ్మరి సంఘం, రైస్మిల్లర్స్ అసోసియేషన్, పద్మశాలి సంఘాలు ఈ మేరకు చేసిన తీర్మానాలను మంత్రి హరీశ్రావుకు అందించాయి. -
మరింత మంది రైతన్నలకు లబ్ధి
సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నదాతలకు అన్ని విధాలుగా అండదండలు అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే ఆదర్శవంతంగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకంలో మరింత మంది రైతులకు మేలు చేకూర్చేలా మరిన్ని సంస్కరణలు తెచ్చారు. నోటిఫై చేసిన పంటలు ఏ కేటగిరీ కింద సాగైనా ఒకే రీతిలో బీమా రక్షణ కల్పించేలా చర్యలు చేపట్టారు. మరో వైపు కొన్ని జిల్లాల్లో పెరిగిన సాగు విస్తీర్ణాన్నిబట్టి కొత్త పంటలను బీమా పరిధిలోకి తెచ్చారు. ఈ మేరకు మార్గదర్శకాల్లో మార్పులు చేయడమే కాకుండా, ప్రస్తుత వ్యవసాయ సీజన్ నుంచే అమల్లోకి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతులపై పైసా భారం పడకుండా ఈ క్రాప్లో నమోదే ప్రామాణికంగా నోటిఫై చేసిన పంటలకు యూనివర్సల్ బీమా కవరేజ్ను కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఒక సీజన్కు సంబంధించిన బీమా పరిహారాన్ని మరుసటి ఏడాది అదే సీజన్ ప్రారంభానికి ముందే చెల్లిస్తోంది. ఇలా 2019లో శ్రీకారం చుట్టిన ఈ పథకం ద్వారా గడిచిన 4 ఏళ్లలో 54.48 లక్షల మంది రైతులకు రూ.7,802.05 కోట్ల పరిహారం చెల్లించింది. పరిహారం లెక్కింపులో పారదర్శకత కోసమే సాధారణంగా ఇరిగేటెడ్, నాన్ ఇరిగేటెడ్ కేటగిరీల్లో పంటలు సాగవుతుంటాయి. పూర్వం నుంచి ఇరిగేటెడ్ (నీటి వసతి కల్గిన) విభాగంలో సాగయ్యే పంటలను దిగుబడి ఆధారితంగా, నాన్ ఇరిగేటెడ్ (వర్షాధారం) కేటగిరిలో సాగయ్యే పంటలను వాతావరణ ఆధారితంగా పరిగణనలోకి తీసుకొని బీమా కవరేజ్ కల్పిస్తున్నారు. దిగుబడి ఆధారిత పంటలకు వాస్తవ, హామీ దిగుబడిలోని వ్యత్యాసాల ఆధారంగా, వాతావరణ ఆధారిత పంటలకు ప్రతికూల, సాధారణ వాతావరణ పరిస్థితుల్లోని వ్యత్యాసాలను బట్టి బీమా పరిహారం లెక్కిస్తారు. స్థానికంగా ఉండే నీటి వసతినిబట్టి కొన్ని జిల్లాల్లో ఒకే పంట రెండు కేటగిరిల్లోనూ సాగవుతుంటుంది. దీంతో ఒకే జిల్లాలో ఒకే పంటకు సాగయ్యే విధానాన్ని బట్టి రెండు విధాలుగా బీమా కవరేజ్ కల్పిస్తూ నోటిఫై చేయాల్సి వచ్చేది. ఫలితంగా పక్క పక్క సర్వే నంబర్లలో సాగయ్యే ఒకే పంటకు ఒకే పంట కాలంలో కొంత వాతావరణ, మరికొంత దిగుబడి ఆధారంగా లెక్కించి పరిహారం చెల్లించాల్సి వచ్చేది. ఫలితంగా జరిగిన పంట నష్టం ఒకటే అయినా, పరిహారంలో వ్యత్యాసాలు ఉండేవి. ఉదాహరణకు నోటిఫైడ్ జిల్లాల్లో ప్రధానంగా పత్తి, వేరుశనగ పంటలు 95 శాతం విస్తీర్ణంలో వర్షాధారం, 5 శాతం నీటి వసతి కింద, మిరప 85 శాతం నీటి వసతి, 15 శాతం వర్షాధారం కింద సాగవడం వలన ఒక్కో ప్రాంతంలో ఒక్కో రీతిలో పరిహారం ఉండేది. ఖరీఫ్లో నోటిఫై చేసిన పసుపు పంటకు కృష్ణా జిల్లాలో వాతావరణ ఆధారంగా, అల్లూరి సీతారామరాజు, వైఎస్సార్ జిల్లాల్లో దిగుబడి ఆధారంగా పరిగణించేవారు. ఇలా మిరప, పత్తి, పసుపు, జొన్న, వేరుశనగ వంటి పంటల విషయంలో పూర్వం నుంచి రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పరిహారం లెక్కింపు, పంపిణీలో అసమానతలు తొలగించడమే లక్ష్యంగా పంటల బీమా మార్గదర్శకాల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఇక నుంచి నోటిఫై చేసిన జిల్లాల్లో ఖరీఫ్లో మిరప, పసుపు జొన్న పంటలు ఏ కేటగిరీ కింద సాగైనా పూర్తిగా దిగుబడి ఆధారంగానే పరిగణిస్తారు. పత్తి, వేరుశనగ పంటలను పూర్తిగా వాతావరణ ఆధారితంగా పరిగణిస్తారు. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో విస్తారంగా సాగవుతున్న ఆముదం పంటను కొత్తగా పంటల బీమా పరిధిలోకి తెచ్చారు. నోటిఫైడ్ జిల్లాల్లో దానిమ్మ, బత్తాయి, నిమ్మ, జీడిమామిడి పంటలను వాతావరణ ఆధారిత బీమా పరిధిలోకి తీసుకొచ్చారు. నాటిన మూడో ఏడాది నుంచి దానిమ్మకు, నాలుగో ఏడాది నుంచి బత్తాయి పంటకు ఖరీఫ్లోనూ, మూడో ఏడాది నుంచి జీడిమామిడి, నాలుగో ఏడాది నుంచి నిమ్మ తోటలకు రబీలోనూ బీమా రక్షణ కల్పిస్తారు. 2023–24 సీజన్ కోసం నోటిఫికేషన్ జారీ వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక తొలి ఏడాది పీఎంఎఫ్బీవైతో కలిసి బీమా పథకం అమలు చేయగా, యూనివర్సల్ కవరేజ్కు కేంద్రం విముఖత చూపడంతో ఆ తర్వాత రెండేళ్ల పాటు కంపెనీలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే పరిహారం చెల్లించింది. ఈ క్రాప్ ప్రామాణికంగా యూనివర్సల్ కవరేజ్కు కేంద్రం దిగి రావడంతో 2022–23 సీజన్ నుంచి దిగుబడి ఆధారిత పంటలకు పీఎంఎఫ్బీవైతో అనుసంధానించి వైఎస్సార్ ఉచిత పంటల బీమా అమలు చేస్తోంది. వాతావరణ ఆధారిత పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా బీమా రక్షణ కల్పిస్తోంది. 2023–24 సీజన్ కోసం దేశంలోనే అత్యల్ప ప్రీమియంతో బీమా కవరేజ్కు ముందుకొచ్చిన కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. జిల్లాలవారీగా కవరేజ్ కల్పించే కంపెనీలతో పాటు నోటిఫైడ్ పంటల వివరాలతో ఇటీవలే నోటిఫికేషన్ జారీ చేసింది. ఖరీఫ్–2023లో 15 పంటలకు దిగుబడి ఆధారంగా, 6 పంటలకు వాతావారణ ఆధారంగా, రబీ 2023–24లో 13 పంటలకు దిగుబడి ఆధారంగా, 4 పంటలకు వాతావరణ ఆధారంగా నోటిఫికేషన్ జారీ చేసింది. దిగుబడి ఆధారిత పంటలకు ఖరీఫ్లో గ్రామం, మండల, జిల్లా యూనిట్గా బీమా కవరేజ్ కల్పిస్తుండగా, వాతావరణ ఆధారిత పంటలకు మాత్రం మండలం యూనిట్గా బీమా కవరేజ్ కల్పిస్తున్నారు. అసమానతలకు తావులేకుండా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పంటల బీమా లెక్కింపు, పరిహారం చెల్లింపుల్లో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు పంటల బీమా మార్గదర్శకాల్లో కీలకమైన మార్పులు తీసుకొచ్చాం. నీటి వసతి, వర్షాధారం ప్రాతిపదికన కాకుండా ఇక నుంచి పూర్తిగా వాతావరణ, దిగుబడి ఆధారంగానే పంటలకు బీమా రక్షణ ఉంటుంది. నోటిఫై చేసిన జిల్లాల్లో నోటిఫై చేసిన పంటలు నష్టపోయే రైతులకు ఒకే రీతిలో పరిహారం దక్కు తుంది. లెక్కింపులో, చెల్లింపుల్లో ఎలాంటి అసమానతలు ఉండవు. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
పంటలకు ‘డ్రైస్పెల్’ దెబ్బ!
సాక్షి, హైదరాబాద్: నెల రోజులుగా చినుకు జాడలేక, ఎండలు పెరిగిపోయి రాష్ట్రవ్యాప్తంగా పంటలు ఎండిపోతున్నాయి. తొలుత రుతుపవనాల ఆలస్యం, తర్వాత జూలై భారీ వర్షాలు, మళ్లీ ఆగస్టులో డ్రైస్పెల్తో పంటల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టులో 63శాతం వరకు లోటు వర్షపాతం నమోదైంది. పలుచోట్ల కరువు ఛాయలు కూడా నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి వానాకాలం పంటలు గట్టెక్కుతాయా అన్న సందేహాలు ముసురుకుంటున్నాయి. ముఖ్యంగా ఈసారి ఆరుతడి పంటలు ఆగమవుతాయన్న ఆందోళన రైతులు, వ్యవసాయ అధికారుల్లో కనిపిస్తోంది. మొక్కజొన్న, పత్తికి నష్టం! వానలు పడటంలో ఎక్కువ విరామం రావడం మొ క్కజొన్నపై ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే పంట ఎండిపోతోంది. అధిక ఉష్ణోగ్రతలతో చీడపీడల దాడి పెరిగింది. అనేకచోట్ల మొక్కజొన్నపై కత్తెర పురుగు దాడిచేస్తోందని వ్యవసాయశాఖ బుధవా రం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. పత్తిలో పేనుబంక, రసం పీల్చే పురుగుల దాడి పెరిగిందని.. వరిపై కాండం తొలుచు పురుగు, అగ్గి తెగులు, కాండం కుళ్లు తెగులు, ఆకు ముడత తెగుళ్లు వస్తు న్నాయని హెచ్చరించింది. ఎండల కారణంగా సో యాబీన్ పంట ఎండిపోతోందని అధికారులు చెప్తున్నారు. వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే పత్తి, మొక్కజొన్న పంటలు చేతికి రావడం కష్టమేనని.. దిగుబడులు పడిపోతాయని అంటున్నారు. వరి ఫుల్.. పప్పులు డల్ రాష్ట్రంలో ఈసారి వానాకాలం పంటల సాగు విస్తీర్ణం కోటి ఎకరాలు దాటింది. సీజన్ సాధారణ సాగు విస్తీర్ణం ఆగస్టు చివరినాటికి 1.24 కోట్ల ఎకరాలుకాగా.. ఈసారి ఇప్పటివరకు 1.16 కోట్ల ఎకరాల్లో (93.61 శాతం) పంటలు సాగయ్యాయి. వరి సాధారణ సాగు విస్తీర్ణం 49.86 లక్షల ఎకరాలైతే.. ఈసారి ఇప్పటివరకు 55.90 లక్షల ఎకరాల్లో (112.12 శాతం) నాట్లు పడ్డాయి. గత నెల భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో వరిసాగు జోష్ పెరిగింది. మరోవైపు రాష్ట్రంలో పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 9.43 లక్షల ఎకరాలుకాగా.. ఇప్పటివరకు 5.32 లక్షల ఎకరాల్లో (56.39%) మాత్రమే సాగయ్యాయి. ఇక మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 7.13 లక్షల ఎకరాలైతే.. ఇప్పటివరకు 5.21 లక్షల ఎకరాల్లో సాగైంది. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.59 లక్షల ఎకరాలుకాగా.. ఇప్పటివరకు 44.70 లక్షల ఎకరాల్లో (88.36 శాతం) వేశారు. వాస్తవంగా ఈ ఏడాది 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయించాలని వ్యవసాయశాఖ భావించింది. ఈ మేరకు రైతులకు పిలుపునిచ్చింది. కానీ సకాలంలో రుతుపవనాలు రాకపోవడం, కీలకమైన జూన్ నెల, జూలై రెండో వారం వరకు వర్షాలు లేకపోవడంతో అదను దాటిపోయింది. పంటలను కాపాడుకోవాలి: వ్యవసాయ వర్సిటీ జిల్లాల్లో నీటి వసతి గల రైతులు పత్తి, మొక్కజొన్న, కంది, సోయాచిక్కుడు వంటి పంటలకు నీటి తడులివ్వాలి. పూతదశలో ఉన్న మొక్కజొన్న పంటకు జీవసంరక్షక నీటి తడి ఇవ్వాలి. ప్రస్తుతం వరి పంట పిలక దశ నుంచి అంకురం దశలో ఉంది. కాండం తొలుచు పురు గు, అగ్గి తెగులు కలగచేసే కారకాలు కలుపు మొక్కలపై నివసించి వరి పంటను ఆశిస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వరిలో ఆకు నల్లి ఆశించే అవకాశం ఉంది. పత్తి పంట పూత నుంచి కాయ అభివృద్ధి దశలో ఉంది. ఈ పంటలో పేనుబంక, రసం పీల్చే పురుగుల నివారణకు ప్లునికామిడ్ 0.4 గ్రాములను లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. మొక్కజొన్న పంట మోకాలి ఎత్తు దశ నుంచి కంకి ఏర్పడే దశల్లో ఉంది. మొక్కజొన్న లో కత్తెర పురుగు ఆశిస్తోంది. నివారణకు 0.4 మి.లీ.క్లోరంట్రానిలిప్రోల్ లేదా 0.5 మి.లీ. స్పైనటోరంను లీటరు నీటికి కలిపి ఆకు సుడుల లోపల పిచికారి చేయాలి. రాష్ట్రంలో సోయా పంట పూత నుంచి పిందె, కాయ అభివృద్ధి దశలో ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పంటలో పెంకు పురుగు, కాండం ఈగ ఆశించేందుకు కారణమవుతాయి. ముందు జాగ్రత్తగా పురుగులు ఆశించకుండా 0.4 మి.లీ. థయోమిథాక్సిం లాంగ్డా సైలోత్రిన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. -
ఎందుకంత తొందర రామోజీ!?
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి తెలిపారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రాంతాల్లో ఇప్పటికే ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను అమలుచేస్తున్నామని చెప్పారు. అంతేకాక.. అన్నదాతలకు రైతుభరోసా సాయాన్ని అందజేయడంతోపాటు 60వేల క్వింటాళ్ల విత్తనాలను ఆర్బీకేల్లో పొజిషన్ కూడా చేశామన్నారు. డిమాండ్ మేరకు మరిన్ని విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లుచేస్తున్నామని ఆయన చెప్పారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రైతులను భయభ్రాంతులకు గురిచేసేలా ఈనాడులో వస్తున్న కథనాలపై ఆయన మండిపడ్డారు. గతంలో ఎన్నడూలేని విధంగా రైతు సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అహరహం శ్రమిస్తున్నారని చెప్పారు. ఎన్నో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతో రైతులకు ముఖ్యమంత్రి అండగా నిలుస్తుంటే ఎల్లో మీడియా ఓర్వలేక విషం కక్కుతోందన్నారు. సాధారణంగా ఖరీఫ్ సీజన్ సెప్టెంబర్ నెలాఖరు వరకు ఉంటుందని, ఆ మాత్రం అవగాహన లేకపోతే ఎలా అని రామోజీని కాకాణి ప్రశ్నించారు. ఆగస్టు నెలాఖరులోగా ఆశించిన స్థాయిలో వర్షాలు పడితే విత్తుకోవాలని రైతులు ఎదురుచూస్తున్నారని మంత్రి చెప్పారు. ఆ దిశగా ఆర్బీకేల ద్వారా అవగాహన కూడా కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో రైతులు ఆర్బీకేల ద్వారా విత్తనాలు తీసుకుంటున్నారని మంత్రి చెప్పారు. వచ్చే నెలాఖరు తర్వాత సమీక్ష.. మరోవైపు.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఖరీఫ్ సీజన్లో నెలకొన్న వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులకు తగిన ఆదేశాలు జారీచేస్తున్నారని.. ఈ విషయంలో ఇప్పటికే సమీక్ష కూడా నిర్వహించారని ఆయన గుర్తుచేశారు. ఈ విషయం రామోజీకి తెలియకపోవచ్చని.. ఎందుకంటే ఆయన నిత్యం చంద్రబాబు పల్లకీ మోయటంలో మునిగితేలుతున్నారని ఎద్దేవా చేశారు. ఇక సెప్టెంబర్ నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతున్నప్పటికీ ఇంతలోనే రైతులకు లేని బాధ మీకెందుకని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. సెప్టెంబర్ నెలాఖరు తర్వాత పూర్తిస్థాయిలో పరిస్థితిని సమీక్షించి ఆ తర్వాత రైతులను ఆదుకునేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. నిజానికి.. చంద్రబాబు, కరువు కవల పిల్లలని, టీడీపీ ఐదేళ్లూ కరువు విలయతాండవం చేసిన విషయాన్ని మంత్రి కాకాణి గుర్తుచేశారు. చంద్రబాబు హయాంలో ఏటా కరువు మండలాలు ప్రకటించినా ఏ ఒక్క ఏడాది రైతులకు పైసా కూడా పరిహారం ఇవ్వలేదని.. అయినా ఏనాడు ఈనాడు సింగిల్ కాలమ్ వార్త కూడా రాసిన పాపాన పోలేదన్నారు. రైతులకు రూ.2,558 కోట్లు ఎగ్గొట్టిన బాబు ఐదేళ్లలో 24.80 లక్షల మంది రైతులకు రూ.2,558 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ (పంట నష్టపరిహారం) బకాయిలు ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైపరీత్యాల వేళ జరిగే పంట నష్టపరిహారాన్ని ఆ సీజన్ ముగియకుండానే ఇస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని కాకాణి చెప్పారు. అలాగే, ఇప్పటివరకు 22.74 లక్షల మంది రైతులకు రూ.1,965 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అందించామన్నారు. ఇక టీడీపీ ఐదేళ్లలో 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్ల బీమా పరిహారం ఇస్తే.. ఈ నాలుగేళ్లలో రైతులపై పైసా భారం పడకుండా 54.48 లక్షల మందికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.7,802 కోట్ల బీమా పరిహారం చెల్లించిందన్నారు. ఈ నాలుగేళ్లలో రైతులకు ప్రత్యేకంగా రూ.1,70,769 కోట్ల లబ్ధిచేకూర్చిన ప్రభుత్వంపై బురద జల్లడం మానుకోవాలని మంత్రి కాకాణి హితవు పలికారు. -
కష్టాల కడలిలో ‘గోదావరి’ రైతులు
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు రాష్ట్రంలోని గోదావరి పరీవాహక ప్రాంత రైతులను నిండా ముంచాయి. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో వరిపైర్లు వరదల తీవ్రతకు కొట్టుకుపోవడంతోపాటు పొలాలు కోతకు గురై ఇసుక మేటలు వేశాయి. చాలాచోట్ల పొలాల్లోనే విద్యుత్ తీగలు, స్తంభాలు పడిపోగా ట్రాన్స్ఫార్మర్లు వరదలో మునిగాయి. సుమారు లక్షన్నర ఎకరాల్లో పంటలు దెబ్బతినగా ఇసుక మేటలు తొలగించలేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. వరదలకు ములుగు, జేఎస్ భూపాలపల్లి జిల్లాల్లో 22 మంది గల్లంతవగా ఇంకా ముగ్గురి ఆచూకీ లభించలేదు. తేలని నష్టపరిహారం లెక్కలు... వరదల్లో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రూ. 10 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించినా ఆ ప్రకియ ఇంకా కార్యరూపం దాల్చలేదు. కేంద్ర, రాష్ట్ర బృందాలు ఐదు రోజులపాటు క్షేత్రస్థాయిలో పర్యటించినా అధికారికంగా నష్టాలను తేల్చలేదు. పంట నష్టం 33 శాతంపైన ఉంటేనే వరద నష్టం అంచనా వేస్తామని మండలస్థాయి అధికారులు చెబుతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. దీంతో నాట్ల దశలో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం వర్తించదన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణవ్యాప్తంగా సుమారు రూ. 2,400 కోట్ల మేర నష్టం ఉంటుందని ప్రాథమిక అంచనా కాగా.. గోదావరి పరీవాహక ప్రాంతాల్లోనే రూ. 1,000 కోట్లపైన నష్టం ఉంటుందని చెబుతున్నారు. ఇంత నష్టం జరిగినా అధికారులు మార్గదర్శకాలతో మల్లగుల్లాలు పడుతుండగా ఏం చేయాలో తెలియక రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అయినోళ్ల కోసం కళ్లలో వత్తులు వేసుకొని... బండ్ల సారయ్య–సారమ్మ... సారయ్య తల్లి రాజమ్మ... ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం బూరుగుపేటకు చెందిన ఈ ముగ్గురిని వరద మింగేసింది. జూలై 27న కురిసిన అతిభారీ వర్షంతో మారేడుగొండ చెరువుకు గండిపడి వరద ప్రవాహానికి సారయ్య ఇల్లు కొట్టుకుపోయింది. ఇంట్లో ఉన్న సారయ్య, సారమ్మ, రాజమ్మ గల్లంతయ్యారు. వారికి కొంతదూరంలో నివసించే సారయ్య కొడుకు, కోడలు ఇద్దరు పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. వరద తగ్గాక సారయ్య మృతదేహం లభించినప్పటికీ అత్తా కోడళ్లయిన రాజమ్మ, సారమ్మల ఆచూకీ ఇంకా లభించలేదు. దీంతో ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంది. వరదలతో ఆగమయ్యాం.. నాలుగు ఎకరాల్లో ఇసుకమేటలు వేసినా ఇప్పటివరకు ఒక్క అధికారి కూడా మా ముఖం చూడలేదు. వరదలతో ఆగమయ్యాం. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. – కొక్కిరాల తిరుపతిరావు, రైతు, పరకాల ఈ ఫొటోలోని యువరైతు పేరు కూతురు భూపాల్రెడ్డి. హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన ఈయనకు చలివాగు వంతెన సమీపంలో 2.26 ఎకరాల పొలం ఉంది. ఈసారి సన్నరకం నారు అలికి సాగుకు సిద్ధపడుతున్న సమయంలో చలివాగు ప్రవాహానికి కొట్టుకుపోయి పొలమంతా ఇసుకమేటలు వేసింది. దీంతో రూ. లక్ష నష్టం వాటిల్లిందని ఆవేదన చెందుతున్నాడు. భూపాలపల్లి జిల్లా మోరంచపల్లికి చెందిన ఈ రైతు పేరు శ్రీపతి తిరుపతి. రెండెకరాల సాగుభూమిలో భారీగా ఇసుక మేటలు వేసింది. ఇసుక మేటను తీయాలంటే కనీసం రూ. 20 వేల ఆదనపు ఖర్చయ్యేలా ఉంది. తన చేతిలో చిల్లిగవ్వ కూడా లేనందున పంట వదిలేయడం తప్ప వేరే మార్గం లేదంటున్నాడు. ఈయన పేరు చల్ల రవీందర్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్ల గ్రామానికి చెందిన రైతు. మానేరు వరద ఉధృతికి ఆయన మూడెకరాల పొలంలో పూర్తిగా ఇసుక మేటలు వేసింది. ఇప్పటికే పొలం దున్నడానికి రూ.10 వేల వరకు ఖర్చు చేశాడు. ప్రభుత్వం తక్షణమే పంట నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నాడు. -
రైతులేమైనా బిక్షగాళ్లా..?
శంకరపట్నం (మానకొండూర్)/రామడుగు(చొప్పదండి): భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కల్వల ప్రాజెక్ట్ గండిని పరిశీలించారు. గండి పడటానికి దారితీసిన కారణాలను డీఈ కవితను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు కింద ఎనిమిదేళ్లలో తెలంగాణకు రూ.3వేల కోట్ల సాయం చేసిందన్నారు. అయితే అందులో సగం నిధులను దారిమళ్లించారని ఆరోపించారు. సీఎం కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే ఈ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 30 వేల ఎకరాలు, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 7వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తెలిపారు. రోడ్లు, కల్వర్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయని, 50 ఏళ్లనాటి కల్వల ప్రాజెక్ట్కు గండిపడితే అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించలేదని మండిపడ్డారు. ‘రైతు లేమైనా భిక్షగాళ్లు అనుకుంటున్నవా? ప్రతీసారి చేయిచాచి సాయం చేయాలని అడుక్కోవాలా? వారిని ఆదుకోని ప్రభుత్వం ఉంటే ఎంత? ఊడితే ఎంత’అని ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. కాగా, ఆగ మేఘాలపై ఆర్టీసీ బిల్లును పంపి గవర్నర్ సంతకం చేయలేదంటే ఎలా? ఆ బిల్లులో ఏమైనా లోపాలు ఉన్నాయా? న్యాయపరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అని పరిశీలన చేయకుండానే సంతకం పెట్టమంటే ఎలా? అని సంజయ్ ప్రశ్నించారు. నివేదికలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్రం.. భారీవర్షాలతో దెబ్బతిన్న పంటలు, రోడ్లు, ఆస్తి నష్టాలు తెలుసుకునేందుకు కేంద్రబృందం పరిశీలనకు వస్తే ప్రభుత్వం నివేదికలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉందని బండి సంజయ్ విమర్శించారు. -
వర్షం తక్కువున్న జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లోటు వర్షపాతం ఉన్న జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు కంటింజెన్సీ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా. కేఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు, వ్యవసాయం, పశువుల గ్రాసం తదితర అంశాలపై ఆయన శనివారం వ్యవసాయ, పశు సంవర్థక, మత్స్య, ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖల అధికారులతో సమీక్షించారు. ఆరు జిల్లాల్లోని 130 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైందని, ఈ జిల్లాల్లో ఆగస్టులో కూడా వర్షాలు తక్కువ ఉంటే ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు సిద్ధం చేయాలని సీఎస్ ఆదేశించారు. అధిక వర్షాల కారణంగా వరి నారు దెబ్బతిన్న రైతులకు స్వల్పకాలంలో దిగుబడినిచ్చే విత్తనాలు సరఫరా చేయాలని చెప్పారు. రాష్ట్రంలో వర్షాలు, వ్యవసాయంపై వ్యవసాయ, పశు సంవర్థక, మత్స్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో ఖరీఫ్ లో మొత్తం 34.39 లక్షల హెక్టార్లు సాధారణ విస్తీర్ణం కాగా ఇప్పటివరకు 9.22 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు వేశారని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో సాధారణంకంటే 20 నుండి 50 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. కృష్ణా జిల్లాలో 60 శాతం పైగా అధిక వర్షపాతం నమోదైందని చెప్పారు. అంబేడ్కర్ కోనసీమ,పశ్చిమ గోదావరి, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో 20 నుండి 59 మిల్లీ మీటర్ల తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. వర్షపాతం తక్కువున్న జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటల కోసం సుమారు 10 వేల క్వింటాళ్ల మినుము, పెసర, కంది, ఉలవ, జొన్న, పొద్దుతిరుగుడు, వేరుశనగ తదితర విత్తనాలను ఏపీ సీడ్స్ వద్ద సిద్ధంగా ఉంచామని చెప్పారు. అధిక వర్షాలతో వరి నారు మడులు దెబ్బతిన్న రైతులకు స్వల్ప కాలంలో పంట దిగుబడినిచ్చే ఎంటీయూ 1010, 1121,1153, బీపీటీ 5204, ఎన్ఎల్ఆర్ 34449 వరి విత్తనాలను సుమారు 30 వేల క్వింటాళ్లు సిద్ధం చేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ సీహెచ్ హరికిరణ్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా. బి.ఆర్.అంబేద్కర్, పశు సంవర్థక శాఖ సంచాలకులు అమరేంద్ర కుమార్, ఏపీ సీడ్స్ ఎండీ శేఖర్ బాబు, మత్స్య శాఖ అదనపు సంచాలకులు డా. అంజలి, ఉద్యాన శాఖ అదనపు సంచాలకులు బాలాజీ నాయక్, వెంకటేశ్వర్లు తదితర అధికారులుపాల్గొన్నారు. -
పది లక్షల ఎకరాలు మునక
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో వానాకాలం పంటలు వరద ముంపునకు గురయ్యాయి. మొలక దశలో ఉన్న వివిధ పంటలు దెబ్బతిన్నాయి. 10.76లక్షల ఎకరాల్లో నేరుగా నీటి ముంపునకు గురికాగా, మరో 4 లక్షల ఎకరాలు అధిక వర్షాల తాకిడితో మొలక స్థాయిలో ఉన్న పంటలు, వరి నార్లకు నష్టం జరిగింది. ఇలా 16 లక్షలకు పైగా ఎకరాలపై వర్షాల ప్రభావం పడిందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నాట్లు వేసిన నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ,ములుగు, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో వరి పొలాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి.ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ సమీప ప్రాంతాల్లో గత 20 రోజుల క్రితం వేసిన వరి నాట్లు నీటమునిగాయి. సూర్యాపేట జిల్లా కిష్టాపురం, మౌగిలాయకోట, శాంతినగర్, లక్కవరం, గోండ్రియాల, కొత్తగూడెం తదితర గ్రామాల్లో కూడా వరి నాట్లు ముంపునకు గురయ్యాయి. ఖమ్మం జిల్లాలోని జక్కపల్లి, సిద్దెపల్లి, రామచంద్రపురం, పైనంపల్లి, బుద్దారం తదితర గ్రామాల్లో పంటలపై కూడా వరద ప్రభావం పడింది. ఆదిలాబాద్ , ఆసిఫాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలతో పాటు భద్రాద్రి జిల్లా చర్ల, వాజేడు, వెంకటాపురం తదితర ప్రాంతాల్లో పంటలకు తీవ్రంగా నష్టం జరిగింది. గోదావరి నది రెండు వైపులా ఉప్పొంగి కిలోమీటరు నుంచి రెండు కిలోమీటర్ల మేర పంటలను ముంచెత్తుకుంటూ పారింది. అనేక ప్రాంతాల్లో ఒక్క పంట కూడా పనికి వచ్చే పరిస్థితి లేదని క్షేత్రస్థాయి అధికారులు అంటున్నారు. పత్తిపై అధిక ప్రభావం ఈ సీజన్లో ఇప్పటివరకు 40.73లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యింది. కాగా వర్షాల ప్రభావం ఎక్కువగా ఈ పంటపైనే పడినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్, మంచిర్యా ల, కరీంనగర్, హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పత్తి పంటపై తీవ్ర ప్రభావం పడింది. తాజాగా వేసి న పత్తి విత్తనాలు వర్షాలకు మొలకెత్త కుండానే భూమిలోనే మురిగిపోయాయి. ఇక మొలక స్థాయి లో ఉన్న పత్తి నీటిలో మునిగి దెబ్బతింది. వరినాట్లు కూడా నీట మునిగాయి. ఇప్పటివరకు 15.63లక్షల ఎకరాల్లో వరినాట్లు పడగా.. వీటిలో 5లక్షలకు పైగా ఎకరాల్లో నీరు చేరిందని అధికా రులు చెబుతున్నారు. వరి నార్లు మొత్తం దెబ్బతిన్నాయని, మళ్లీ నార్లు పోసుకోవాల్సిందేనని రైతు లు అంటున్నారు. ఇక సోయాబీన్ సాగు ఇప్పటివరకు 4.14లక్షల ఎకరాల్లో సాగు చేయగా.. ఆదిలా బాద్ జిల్లాలో ఈ పంటపై ఎక్కువ ప్రభావం పడినట్లు తెలుస్తోంది. పొలాలను ముంచేసిన గుర్రపుడెక్క భూదాన్పోచంపల్లి: భారీ వర్షాలతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి చెరువు నిండి అలుగుపోస్తోంది. ఈ చెరువులోని గుర్రపు డెక్క కూడా కొట్టుకువచ్చి వరి పొలాలను కమ్మేసింది. దీనితో పోచంపల్లిలో 30ఎకరాలు, పిలాయిపల్లిలో 2ఎకరాల వరికి నష్టం జరిగింది. -
జోరుగా వాన..ఫుల్లుగా సాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంటల సాగు ఊపందుకుంది. జోరుగా కురు స్తున్న వర్షాలతో రైతులు వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్నారు. బుధవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 68.80 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ప్రభు త్వానికి నివేదిక సమర్పించింది. ఇప్పటివరకు పత్తి 40.73 లక్షల ఎకరాల్లో సాగు కాగా, 15.63 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. ఇక సోయాబీన్ 4.14 లక్షల ఎకరాల్లో, కంది 3.82 లక్షల ఎకరాల్లో, మొక్కజొన్న 3.62 లక్షల ఎకరాల్లో సాగైంది. జిల్లాల వారీగా పంటల సాగును పరిశీలిస్తే 6.83 లక్షల ఎకరాలతో నల్లగొండ జిల్లా తొలి స్థానంలో నిలువగా 5.65 లక్షల ఎకరాలతో ఆదిలాబాద్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. సంగారెడ్డి జిల్లాలో 4.69 లక్షల ఎకరాల్లో, వికారాబాద్ జిల్లాలో 4.24 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఆలస్యమైనా గత ఏడాది సాగుతో సమానంగా గతేడాది సమృద్ధిగా వర్షాలు కురవడంతో రికార్డు స్థాయిలో 1.36 కోట్ల ఎకరాల్లో పంటలు సాగ య్యాయి. ఆలస్యమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తా రమైన వర్షాలు కురుస్తుండడంతో వ్యవ సాయ పనులు ముమ్మరంగా సాగుతు న్నాయి. ఈ వానా కాలం సాగు కూడా గతేడాది వానాకాలం సాగుతో పోటీ పడు తోంది. గతేడాది ఈ సమయం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 68.90 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా, ఈ సీజన్లో దాదాపు సమానంగా 68.80 లక్షల ఎకరాల్లో పంటలు సాగవడం గమనార్హం. గతేడాది ఇదే సమయానికి వరి 11.11 లక్షల ఎకరాల్లో సాగైతే, ఈ సీజన్లో ఇప్పటికే 4.52 లక్షల ఎకరాలు అధికంగా 15.63 లక్షల ఎకరాల్లో సాగైంది. పత్తి గతేడాది ఈ సమ యానికి 44.53 లక్షల ఎకరాల్లో సాగైతే ప్రస్తుతం ఈ పంట 40.73 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్లోనూ సాగుకు ఢోకా లేదని, రికార్డు స్థాయిలో సాగవడం ఖాయమని అధికారులు అంటున్నారు. వచ్చే నెల మొదటి వారం వరకు కూడా పత్తి సాగు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. వానలు తగ్గి భూమి కాస్తంత పొడిగా మారిన తర్వాత పత్తి సాగు చేయవచ్చని చెబుతున్నారు. వానలు తగ్గాక వరి నాట్లు కూడా పుంజుకోనున్నాయి. -
57.24 లక్షల ఎకరాల్లో పంటల సాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం సీజన్లో ఇప్పటివరకు 57.24 లక్షల ఎకరాల్లో పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ సీజన్ సాధారణ సాగు విస్తీర్ణం 1.24 కోట్ల ఎకరాలు కాగా, 46.06 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. వాస్తవంగా గతేడాది వానాకాలం సీజన్లో ఇదే సమయానికి 53.66 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అంతకంటే ఇప్పుడు ఎక్కువ సాగు కావడం విశేషం. ఇటీవల వర్షాలు పుంజుకోవడంతో వ్యవసాయ పంటల సాగు ఊపు మీద ఉంది. కాగా, పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.59 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 37.98 లక్షల ఎకరాల్లో (75.07%) సాగైంది. ఇక వరి సాధారణ సాగు విస్తీర్ణం 49.86 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 7.94 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 9.43 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.04 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 4.13 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.05 లక్షల ఎకరాల్లో (98.21%) సాగైంది. మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 7.13 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 3 లక్షల ఎకరాల్లో సాగైంది. ఆదిలాబాద్ జిల్లాల్లో 103 శాతం... రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా పంటలు సాగయ్యాయి. ఆ జిల్లాలో ఏకంగా 103.81 శాతం విస్తీర్ణంలో పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 91.55 శాతం, వికారాబాద్ జిల్లాలో 74.30 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. అత్యంత తక్కువగా వనపర్తి జిల్లాలో కేవలం 3.93 శాతం విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయి. కాగా, రాష్ట్రంలో సంగారెడ్డి, సిద్ధిపేట, వికారాబాద్ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మహబూబ్నగర్, మహబూబాబాద్, ఖమ్మం, నాగర్కర్నూలు, వనపర్తి, సూర్యాపేట, జోగుళాంబ జిల్లాల్లో వర్షపాతం తక్కువ నమోదైంది. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని వ్యవసాయశాఖ వెల్లడించింది. జూన్లో 44 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, జూలైలో ఇప్పటివరకు 34.32శాతం అధిక వర్షపాతం నమోదైందని వెల్లడించింది. అందుబాటులో ఎరువులు, విత్తనాలు: నిరంజన్ రెడ్డి ఆలస్యమైనా వర్షాలు సాగుకు సహకరిస్తున్నాయని, ఆశాజనకంగా వ్యవసాయం సాగవుతోందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.. సచివాలయంలో బుధవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి నిరంజన్రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, ప్రత్యేక కమిషనర్ హన్మంతు కొండిబ పాల్గొన్నారు. మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది కొత్తగా వచ్చిన ఐదు జిల్లాలతో కలిపి 2.30 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు లక్ష్యంగా నిర్ణయించామని తెలిపారు. -
వరి విత్తనరకాలు, పంటకాలం, నారుపోసే సమయం
వరిసాగుకు సంబంధించి పంట కాలాన్ని ముందుకు జరిపే క్రమంలో ఏఏ రకాల విత్తనాలతో నార్లు పోసుకోవచ్చని, వాటి పంట కాలం తదితర వివరాలను సిద్దిపేట జిల్లా తోర్నాల ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త సీహెచ్.పల్లవి వివరించారు. ● దీర్ఘకాలిక రకాలు: పంటకాలం 140 రోజులపైనే. ఇందులో ప్రధానమైన వరి విత్తన రకాలు వరంగల్ 44 (సిద్ది), కంపాసాగర్ 2874, సాంబమసూరి. మే 25 నుంచి జూన్ 5వ తేదీ వరకు నార్లు పోసుకోవాలి ● మధ్యకాలిక రకాలు: పంటకాలం 135 రోజులు. ఇందులో ప్రధానమైన రకాలు రాజేంద్రనగర్ 2458 (కృష్ణ), వరంగల్ 32100 (వరంగల్ సన్నాలు), వరంగల్ 915, జగిత్యాల 384, పొలాస ప్రభ, జగిత్యాల 28545, జగిత్యాల 27356, వరంగల్ 1487 జూన్ 15వ తేదీ వరకు నార్లు పోసుకోవాలి ● స్వల్పకాలిక రకాలు : పటకాలం 120 నుంచి 125 రోజులు. ఇందులో ప్రధానమైనవి సన్న రకాలైన కునారం–1638, వరంగల్ 962. రాజేంద్రనగర్–21278, రాజేంద్రనగర్– 15048 (తెలంగాణ సోనా), దొడ్డురకాల్లో కునారం–118 (కూనారం సన్నాలు), జగిత్యాల – 24423, జగిత్యాల – 18047 (బతుకమ్మ), రాజేంద్రనగర్–29325, మారుటేరు–1010 (కాటన్ దొర సన్నాలు). ● వానాకాలం వరిపంటకు జూన్ 25 లోపు నారు పోసుకుంటే...అక్టోబర్ మూడో వారం నుంచి నవంబరు మొదటి వారంలోపు కోతలు పూర్తి చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా మళ్లీ యాసంగిలో వరి ఆరుతడి పంటలను సకాలంలో సాగు చేసుకోవడానికి వీలవుతుంది. ఇక యాసంగిలో వరి సాగుకు స్వల్పకాలిక రకాలను ఎంచుకొని నవంబర్ 15 నుంచి 20వతేదీలోపు విత్తుకుంటే మార్చి నెలాఖరు నుంచి ఏప్రిల్ మొదట్లో పంట కోతకు వస్తుంది. తద్వారా వర్షాల నష్టం నుంచి మనం పంటను కాపాడుకోవచ్చు. -
ముందస్తు వరిసాగే మేలు
నీటివసతి ఉంటేనే... వానాకాలంలో వరిసాగును ముందుకు జరపాలంటే నీటివసతి తప్పనిసరి. బోరు,బావుల కింద సేద్యం చేసేచోట సాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ పంటసాగు కాలం ముందుకు జరిపినా ముందుగానే రైతులు బోరు,బావుల ద్వారా నార్లు పోసుకుంటారు. ప్రాజెక్టులు, కాల్వలు, లిఫ్ట్ ఇరిగేషన్, చెరువుల ద్వారా వరిసాగు చేసే చోటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రైతులు నార్లు పోసుకోవాలన్నా, వాటిని పెంచాలన్నా, ఆయా సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో సాగునీటి విడుదల తేదీలను కూడా ముందుకు జరపాలి. ఇంకా చేయాల్సినవి... ● పంటకాలం ముందుకు జరిపే క్రమంలో రైతులకు సబ్సిడీపై అందజేసే విత్తనాలు కూడా ముందుగానే రైతులు చేరేలా చూడాలి. ● నార్లు పోసే నాటి నుంచి నాట్లు వేసే వరకు అవసరమైన ఎరువులు కూడా ముందుగా అందుబాటులో ఉంచాలి. ● రైతులకు పెట్టుబడి అవసరాలు ఉంటాయి. బ్యాంకుల నుంచి అందే కొత్త రుణాలు, రుణాల రెన్యూవల్, రైతుబంధు కింద ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం కూడా రైతులకు ముందస్తుగా అందాలి. ● పంటకాలం ముందుకు జరపాలన్న ప్రతిపాదనలు ● రోహిణి కార్తె నుంచి నార్లు పోసుకోవడం పాత పద్ధతే సాక్షి, సంగారెడ్డి డెస్క్ : యాసంగిలో కురుస్తున్న అకాల వర్షాలు, వడగండ్ల వానల కారణంగా వరిపంటకు తీవ్రనష్టం వాటిల్లుతోంది. ముఖ్యంగా మార్చి నుంచి మే నెల వరకు కురిసే వర్షాల కారణంగా ధాన్యం దిగుబడి బాగా తగ్గుతోంది. చేతికొచ్చే కొద్దిపాటి పంటలోనూ నాణ్యత లోపిస్తోంది. యాసంగిలో వరిసాగుచేసే రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వరిసాగుకు సంబంధించి పంటకాలాన్ని ముందుకు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో అకాల వర్షాల నుంచి రైతులు బయటపడొచ్చు. దీనిపై వ్యవసాయశాఖ, వ్యవసాయ శాస్త్రవేత్తలు కసరత్తు చేస్తున్నారు. ● సాధారణంగా అయితే వానాకాలం వరిసాగుకు సంబంధించి జూలైలో నార్లు పోసి ఆగస్టు వరకూ నాట్లు వేస్తారు. ● యాసంగిలో అయితే డిసెంబర్లో నార్లు పోసి జనవరి, ఫిబ్రవరి నెలల్లో నాట్లు వేస్తారు. యాసంగిలో సాగు చేసిన వరిపంట మే నెలలో కోతకు వస్తుంది. ● వానాకాలం సీజన్లో అయితే అక్టోబర్లో, యాసంగి సీజన్లో అయితే మార్చి రెండోవారం నుంచి ఏప్రిల్ నెల వరకు అకాలవర్షాలు కురుస్తాయి. దీంతో రైతులకు నష్టం జరుగుతోంది. ● ప్రకృతి వైపరీత్యాల బారిన రైతులు పడకుండా ఉండేందుకు, వరి పంటను కాపాడుకోవడానికి ఒకటే మార్గం ఉంది. అదే పంటసాగును ఒక నెలరోజులు ముందుకు జరపడమే. ● వానకాలంసాగుకు సంబంధించి జూన్లో నార్లు పోసుకొని జూలై నాటికి నాట్లు పూర్తి చేయాలి. ● యాసంగిలో అయితే నవంబర్లో నార్లు పోసి డిసెంబర్లో నాట్లు పూర్తి చేయాలి. ● వానాకాలంలో 140 రోజులు అంతకన్నా ఎక్కువ సమయం గల దీర్ఘకాలిక రకాల సాగుకు మే 25 నుంచి జూన్ 5లోగా నారు పోసుకోవాలి. ● 130 నుంచి 135 రోజుల వ్యవధిగల మధ్యకాలిక రకాల సాగులో జూన్ 15 వరకు నారు పోయాలి. ● 120 నుంచి 125 రోజుల వ్యవధి గల స్వల్పకాలిక రకాల సాగుకు జూన్ 25 వరకు నారు పోసుకోవాలి. ● సాగు చేసేది ఎలాంటి రకాలైనా సరే జూలై నెల వరకు వానాకాలంలో వరినాట్లు పూర్తికావాలి. ● వానాకాలం వరికోత అక్టోబర్ 3వ వారంనుంచి నవంబర్ మొదటివారం లోపు పూర్తి చేయాలి. ● యాసంగిలో నవంబర్ 20వ తేదీలోపు నారు పోసుకోవాలి. ● పంటకాలం ముందుకు జరిపితే వానాకాలం వరికోతలు నవంబర్ మొదటి వారంలోపు పూర్తవుతాయి. అయితే యాసంగి నారు కోసం ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. ● రైతులు వానాకాలం సాగు సమయంలోనే ముందు జాగ్రత్తగా యాసంగి నారు కోసం ఒక చిన్న మడిని వదిలేసుకుంటే బాగుంటుంది. దీంతో వానాకాలం పంటలు కాస్త ఆలస్యమైనా వదిలేసిన మడిలో యాసంగి కోసం సరైన సమయంలో నారు పోసుకొనే వీలుంటుంది. ముందు నారు పోస్తే పంటకు బలం హుస్నాబాద్ మండలం గాంధీనగర్కు చెందిన రైతు రాంగోపాల్రావు 15 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. గత ఏడాది వానాకాలంలో వరి సాగు చేయడంతో పాటు యాసంగి మిర్చి సాగు చేస్తే మంచి లాభాలు వచ్చాయి. ఈ వానాకాలం 15 ఎకరాల్లో వరిసాగు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సందర్భంగా రాంగోపాల్రావు మాట్లాడుతూ వ్యవసాయ పంటలు ప్రారంభానికి రోహిణి, ఆరుద్ర కార్తెలే అనుకూలం. ఈ రెండు కారెల్లో విత్తనం వేస్తే పంట బలంగా వస్తుంది. ఒకేసారి 15 ఎకరాల far వేయాలంటే కూలీల కొరత ఉంది. అందుకే 15 రోజుల గడువు తీసుకొని మూడు దఫాలుగా నారు పోశాను. యాసంగిలో కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానల కారణంగా మెదక్ జిల్లాలో 32,884 ఎకరాల్లో, సిద్దిపేట జిల్లాలో 53 వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు. అయితే పూర్తిస్థాయిలో పంటనష్టం నమోదు ఎక్కడా జరగలేదని రైతులు, రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. -
కోటిన్నర ఎకరాల్లో పంటల సాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే వానాకాలం సీజన్కు సంబంధించి వ్యవసాయ శాఖ పంటల ప్రణాళికను ఖరారు చేసింది. ఇందులో భాగంగా కోటిన్నర ఎకరాల్లో పంటలు సాగయ్యేలా చూడాలని నిర్ణయించింది. అత్యధికంగా 60 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలని ప్రతిపాదించింది. ఇక 55 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలని వ్యవసాయశాఖ రైతులకు పిలుపునిచ్చింది. కంది, మొక్కజొన్న 8 లక్షల ఎకరాల చొప్పున, సోయాబీన్ 5 లక్షల ఎకరాలు, పెసర లక్ష ఎకరాలు, మినుములు 50 వేల ఎకరాల్లో సాగును ప్రతిపాదించారు. మొత్తం సాగుకు ప్రతిపాదించిన కోటిన్నర ఎకరాల్లో 10 లక్షల ఎకరాలు ఉద్యాన పంటలున్నాయని వ్యవసాయ శాఖ తెలిపింది. గతేడాది 1.46 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని వెల్లడించింది. 18.47 లక్షల క్వింటాళ్ల విత్తనాలు.. ఉద్యాన పంటలను మినహాయించి చూస్తే 1.40 కోట్ల ఎకరాల్లో ఆహార, వాణిజ్య పంటలు సాగవుతాయి. అందుకోసం 18.47 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని వ్యవసాయశాఖ పేర్కొంది. విత్తనాలకు కొరత లేదని, 1.82 కోట్ల ఎకరాలకు సరిపడా 22.50 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. అకాల వర్షాల నుంచి బయటపడేలా ముందస్తు నాట్లు.. ఈ ఏడాది యాసంగిలో రెండు దఫాలు పెద్ద ఎత్తున అకాల వర్షాలు రావడంతో లక్షలాది ఎకరాల పంటలకు నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో వానాకాలం, యాసంగి సీజన్లను ముందుకు జరపడం వల్ల నష్టాన్ని నివారించవచ్చని భావిస్తున్న ప్రభుత్వం ఆ మేరకు చర్యలు చేపట్టింది. సీజన్ను ముందుకు జరపడంతో పాటు తక్కువ కాలపరిమితి కలిగిన విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని, అకాల వర్షాలు, వడగళ్లను తట్టుకునే రకా లను రైతులకు ఇవ్వాలని నిర్ణయించింది. ఎక్కువ సమయం తీసుకునే పంట రకాలను ప్రోత్సహించకూడదని ప్రభుత్వం భావిస్తోంది. 135 రోజుల మధ్యస్థం, 125 రోజుల తక్కువ కాలపరిమితి వెరైటీలను రైతులు వేసుకోవాలని సూచించింది. కాగా, ఐదు రకాల మధ్యస్థ కాల పరిమితి కలిగిన వరి వంగడాలు, స్వల్పకాలిక వ్యవధి కలిగిన 10 రకాల వరి వెరైటీలను వేసుకోవాలని రైతులకు సూచించింది. వానాకాలంలో జూన్ 10–20వ తేదీల మధ్య నారు వేయాలని చెప్పింది. ఈ మార్పులవల్ల ఇబ్బందులు ఉండవని పేర్కొంది. అలాగే యాసంగిలో స్వల్పకాలిక రకాలను మాత్రం వేయాలని స్పష్టం చేసింది. వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేయాలని సూచించింది. యాసంగిలో నవంబర్ 15 నుంచి డిసెంబర్ 10 మధ్య నార్లను పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేసింది. -
కాపు కాసే ‘మ్యాపింగ్’! రాష్ట్రంలో వడగళ్లు పడే అవకాశమున్నది ఇక్కడే!
అకాల వర్షాలు, వడగళ్లు రైతులను నిండా ముంచాయి. ఆరుగాలం కష్టించి పండించి, కోతకు వచ్చిన పంటంతా ఒక్క వానకు దెబ్బతిన్నది. ఇప్పుడేకాదు గత రెండేళ్లలోనూ పలు ప్రాంతాల్లో వడగళ్లకు పంటలు నాశనమయ్యాయి. ఈ క్రమంలో పంట నష్టం నివారణపై వ్యవసాయ విశ్వవిద్యాలయం కసరత్తు చేసింది. క్షేత్రస్థాయి సమాచారం, ఉపగ్రహ చిత్రాలు, ఇతర సాంకేతిక ఆధారాల సాయంతో.. రాష్ట్రవ్యాప్తంగా వడగళ్లు, తీవ్ర ఈదురుగాలులకు ఆస్కారమున్న ప్రాంతాలను గుర్తించింది. ఆ ప్రాంతాల్లో పంట సీజన్ను ముందుకు జరపడం, వడగళ్లు, ఈదురుగాలులను తట్టుకునే రకాల వరిని వేయడం వంటివి చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వడగళ్లు, తీవ్రస్థాయిలో ఈదురుగాలుల ప్రభావం ఉండే ప్రాంతాలను ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాల యం మ్యాపింగ్ చేసింది. జిల్లాలు, వాటిలోని మండలాల వారీగా ఎక్కడెక్కడ వడగళ్ల వాన, ఈదురుగాలులకు ఎక్కువ అవకాశం ఉందో గుర్తించింది. ఈ వివరాలతోపాటు ఆయా చోట్ల చేపట్టాల్సిన చ ర్యలను సూచిస్తూ.. తాజాగా ప్రభుత్వానికి ఒక నివేదిక అందించింది. వడగళ్లు, ఈదురుగాలుల వల్ల ఈ ఏడాది రాష్ట్రంలో భారీగా పంటలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన వడగళ్ల వానలు, ఈదురుగాలులకు 12 లక్షల ఎకరాలకుపైగా పంటలకు నష్టం జరిగినట్టు అంచనా. ఇందులోనూ వరి భారీగా దెబ్బతిన్నది. మొక్కలు నేలకొరగడంతోపాటు గింజలు రాలిపోయాయి. ఈ నేపథ్యంలో అకాల వర్షాల నష్టాన్ని తప్పించుకునేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. అన్ని అంశాలను క్రోడీకరించి.. ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం వడగళ్ల ప్రాంతాలను మ్యాపింగ్ చేసింది. కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాల నుంచి వచ్చిన సమాచారం ఒకవైపు.. ఉపగ్రహ చిత్రాలు, సెన్సర్లు, డ్రోన్ల సాయంతో వర్సిటీ అగ్రో క్లైమెట్ రీసెర్చ్ సెంటర్ ఈ మ్యాపింగ్ చేపట్టింది. గత కొన్నేళ్ల లెక్కలను పరిగణనలోకి తీసుకొంది. ఏయే జిల్లాల్లో, ఏయే మండలాల్లో వడగళ్లకు ఎక్కువ ఆస్కారం ఉందన్నది గుర్తించింది. ఈ మేరకు ‘గ్రౌండ్ ట్రూత్ డేటా’తో నివేదికను రూపొందించింది. ఆయా ప్రాంతాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించింది. ఈ ప్రాంతాల్లోని గ్రామాల్లో రైతుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. గతేడాది కంటే అధికంగా వడగళ్ల వానలు 2022లో రెండు నెలల్లో మొత్తంగా 11 రోజులు మాత్రమే వడగళ్ల వానలు కురిశాయి. అదే ఈ ఏడాది మార్చిలో ఐదు రోజులు.. ఏప్రిల్లో 15 రోజులు, మేలో ఇప్పటివరకు రెండు రోజులు వడగళ్లు పడ్డాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 11 సార్లు (మార్చిలో 4, ఏప్రిల్లో 7) వడగళ్ల వానలు పడ్డాయి. ఆదిలాబాద్ జిల్లాలో 9 సార్లు (మార్చిలో 3, ఏప్రిల్లో 4, మేలో 2), నల్గొండ జిల్లాలో 5 సార్లు (మార్చిలో 4, ఏప్రిల్లో 1), నిజామాబాద్ జిల్లాలో రెండు (మార్చిలో 1, ఏప్రిల్లో 1), మహబూబాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల జిల్లాల్లో మార్చి నెలలో ఒకసారి.. వరంగల్, జనగామ జిల్లాల్లో ఏప్రిల్ నెలలో ఒకసారి వడగళ్ల వానలు కురిశాయి. ఇక చాలా చోట్ల ఈదురుగాలుల తీవ్రత కనిపించింది. సీజన్ ముందుకు.. వడగళ్లు తట్టుకునే రకాలు.. రాష్ట్రంలో పంటల సీజన్ను కాస్త ముందుకు జరపాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో.. దీనికి అనుగుణంగా ముందుకు సాగడంపై వ్యవసాయ విశ్వవిద్యాలయం పలు సూచనలు చేసింది. ఏటా మే నెలాఖరు, జూన్ తొలివారం నాటికే వానాకాలం వరిసాగు జరిగేలా రైతులను ప్రోత్సహించాలని.. సెప్టెంబర్ నెలాఖరు, అక్టోబర్ నెల ప్రారంభానికే వానాకాలం పంట చేతికి వస్తుందని పేర్కొంది. దీనితో అక్టోబర్లో వచ్చే అకాల వర్షాల ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉందని సూచించింది. వానాకాలం వరి కోతలు పూర్తికాగానే అక్టోబర్ తొలివారంలోనే యాసంగి వరి సాగు ప్రారంభిస్తే.. ఫిబ్రవరి నెలాఖరు, మార్చి ప్రారంభం నాటికే పంట చేతికి వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసింది. దీనితో మార్చి నెల మధ్య నుంచి మొదలయ్యే అకాల వర్షాల నుంచి పంటను కాపాడుకునే వీలుంటుందని తెలిపింది. నేరుగా వరి గింజలు వెదజల్లే పద్ధతి పాటించాలని సూచించింది. ఇది సాధ్యంకాకపోతే వడగళ్లను, ఈదురుగాలులను తట్టుకునే వంగడాలను రైతులకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఇప్పటికే వరిలో జేజీఎల్–24423 రకాన్ని రైతులకు అందుబాటులో ఉంచింది. మరో ఏడు వంగడాలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు సాతున్నాయి. ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ వడగళ్ల ప్రమాదం? వ్యవసాయ విశ్వవిద్యాలయం రాష్ట్రవ్యాప్తంగా వడగళ్లు పడే ప్రాంతాలను గుర్తించింది. వీటిని జిల్లాలు, మండలాల వారీగా మ్యాపింగ్ చేస్తోంది. పలు జిల్లాలకు సంబంధించి మ్యాపింగ్ పూర్తయింది. మరికొన్నింటికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందని విశ్వవిద్యాలయం వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటివరకు మ్యాపింగ్ పూర్తయిన జిల్లాలకు సంబంధించి వడగళ్ల ప్రభావిత ప్రాంతాలివీ.. ► ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి, కూసుమంచి, బోనకల్, రఘునాథపాలెం, ఖమ్మం రూరల్, ముదిగొండ, ఎర్రుపాలెం మండలాలు. ► భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం, భద్రాచలం, గుండాల, టేకులపల్లి, బూర్గంపాడు, దమ్మపేట, పినపాక, ఇల్లెందు, టేకులపల్లి, అశ్వారావుపేట, దమ్మపేట, పాల్వంచ మండలాలు. ► నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని నవీపేట్, మాక్లూర్, నిజామాబాద్ రూరల్, డిచ్పల్లి, సిరికొండ, ధర్పల్లి, పిట్లం, బిచ్కుంద, మద్దూర్, దోమకొండ, ఎల్లారెడ్డి మండలాలు. ► ఆదిలాబాద్ జిల్లాలో బోథ్, ఇచ్చోడ, సిరికొండ, నేరడిగొండ, బజార్ హత్నూర్, తలమడుగు, జైనథ్ మండలాలు. ► మంచిర్యాల జిల్లాలో దండేపల్లి మండలం. ► మహబూబాబాద్ జిల్లాలోని పెద్ద వంగర, దంతాలపల్లి, తొర్రూరు, గూడూరు మండలాలు. ► వరంగల్ జిల్లాలోని నర్సంపేట, ఖానాపురం, నల్లబెల్లి, వర్ధన్నపేట, నెక్కొండ మండలాలు. ► జనగామ జిల్లాలో బచ్చన్నపేట, నర్మెట్ట, జనగామ, లింగాల ఘన్పూర్ మండలాలు. ► నల్లగొండ జిల్లాలో గుర్రంపోడు, మర్రిగూడ, నాంపల్లి, చండూరు, శాలిగౌరారం, మునుగోడు, కనగల్, నల్లగొండ, కట్టంగూరు, డిండి, దేవరకొండ, చందపేట, ఉట్కూరు, నకిరేకల్ మండలాలు. ► సిద్దిపేట జిల్లాలో చిన్నకోడూరు, నంగనూరు, దౌలతాబాద్, రాయపోలు, జగదేవ్పూర్, హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి, గజ్వేల్, కొండపాక, నారాయణపేట, మిరుదొడ్డి, కొమురవెల్లి, దుబ్బాక, తొగుట, మద్దూరు, సిద్దిపేట రూరల్, చేర్యాల మండలాలు. ► మహబూబ్నగర్ జిల్లాలో గండీడ్, హన్వాడ, బాలానగర్ మండలాలు. ► రంగారెడ్డి జిల్లాలో పరిగి, చేవెళ్ల, మొయినాబాద్ మండలాలు. ► వికారాబాద్ జిల్లా తాండూరు, పెద్దేముల్, కోటపల్లి, బషీరాబాద్ మండలాలు. -
అకాల కష్టం అండగా ఉందాం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన అన్నదాతలకు పూర్తి స్థాయిలో అండగా నిలవాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. పంట నష్టపోయిన రైతుల్లో ఏ ఒక్కరికీ పరిహారం అందలేదన్న మాటే రాకూడదని, పంటలు కొనుగోలు చేయడం లేదన్న మాట ఎక్కడా వినిపించకూడదని స్పష్టం చేశారు. రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతోపాటు రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను ముమ్మరంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్దేశించారు. ఆర్బీకేల స్థాయిలో నిశితంగా పర్యవేక్షణ జరగాలని స్పష్టం చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై గురువారం ఉదయం క్యాంపు కార్యాలయంలో సమీక్షించిన సీఎం జగన్ అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. సచివాలయాల్లో రైతుల జాబితాలు వర్షాల వల్ల పంటలు సహా ఇతర నష్టాలకు సంబంధించి గ్రామ సచివాలయాల స్థాయిలోనే ఎప్పటికప్పుడు వివరాలను సేకరించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత నష్టపోయిన రైతుల జాబితాలను సామాజిక తనిఖీల కోసం సచివాలయాల్లో ప్రదర్శించాలని సూచించారు. తద్వారా ఎవరైనా మిగిలిపోతే వెంటనే అధికారుల దృష్టికి తెచ్చేందుకు వీలుంటుందన్నారు. వేగంగా రబీ ధాన్యం కొనుగోలు రబీ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. పంటను కొనుగోలు చేయడం లేదన్న మాట ఎక్కడా వినిపించకూడదని స్పష్టం చేశారు. ఫిర్యాదులకు ట్రోల్ ఫ్రీ నెంబర్ రైతులకు ఏమైనా ఇబ్బందులుంటే ఫిర్యాదు చేసేందుకు ట్రోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు చేపట్టాలన్నారు. రైతన్నల ముఖంలో చిరునవ్వు కనిపించేలా అధికారుల చర్యలు ఉండాలని స్పష్టం చేశారు. రానున్న రోజులకు సంబంధించి వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు వివరాలు తెప్పించుకుంటూ వర్ష ప్రభావిత ప్రాంతాలపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతి జిల్లాకు వ్యవసాయ శాస్త్రవేత్త రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి సమీక్షలో అధికారులు వివరించారు. రబీ ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా సాగుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే 4.75 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. పంట కోతలు పూర్తి కాని ప్రాంతాల్లో ఏం చేయాలన్న అంశంపై రైతులకు సూచనలు చేస్తున్నట్లు తెలిపారు. పంటలు కోసిన చోట పనలు తడిస్తే ఉప్పు ద్రావణం చల్లడం లాంటి విధానాలను పాటించడంపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రతి జిల్లాకు ఒక వ్యవసాయ శాస్త్రవేత్తను అందుబాటులో ఉంచి స్థానిక అధికారుల ద్వారా రైతులకు అవగాహన కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ధాన్యం భద్రంగా గోడౌన్లకు తరలింపు వివిధ కొనుగోలు కేంద్రాలు, ఆర్బీకేలు, రైతుల వద్ద ఉన్న ధాన్యం నిల్వలను భద్రంగా ప్రభుత్వ భవనాలు, గోడౌన్లలోకి తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు ఊపందుకున్నట్లు చెప్పారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్స్ తెరిచామని, యంత్రాంగం అంతా అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. -
ఆఖరి ఆయకట్టు అంతేనా?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: నాగార్జునసాగర్ చివరి ఆయకట్టు ఎండిపోతోంది. జలవనరుల శాఖ అధికారుల ప్రణాళికా లోపంతో ఆఖరి ఆయకట్టుకు నీరు చేరక సత్తుపల్లి, వైరా, మధిర ప్రాంతాల్లో వరి, మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయి. ఇంకో నెలన్నరలో పంటలు చేతికి రావాల్సి ఉన్న వేళ ఈ పరిస్థితితో రైతుల్లో ఆందోళన నెలకొంది. సాగర్ జలాలు వస్తాయని.. ఖమ్మం జిల్లాలో 2,54,270 ఎకరాల సాగర్ ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టు పరిధిలో యాసంగిలో 2,23,545 ఎకరాల సాగుకు 33.61 టీఎంసీల నీరు అవసరమని అధికారులు లెక్కలు వేశారు. గత ఏడాది డిసెంబర్ 15నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 14 వరకు మొత్తం 29.067 టీఎంసీల నీటిని వారబంధీ విధానంలో విడుదలకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇక ఐడీసీ స్కీమ్స్ కింద 1.880 టీఎంసీలు, భక్తరామదాసు, వైరా ప్రాజెక్టు నుంచి 2.663 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని భావించారు. కానీ ఇటీవల పాలేరుకు ఇన్ఫ్లో భారీగా తగ్గడంతో చివరి ఆయకట్టు భూములకు సరిగ్గా నీరు అందక పంటలు ఎండిపోతుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. బోనకల్ బ్రాంచి కెనాల్, సిరిపురం మేజర్ కాల్వ పరిధిలో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. నీటి కోసం ఎదురుచూపులు.. పాలేరు జలాశయంలో నీరు లేకపోవడంతో దిగువకు నీటి విడుదల సాఫీగా సాగడం లేదు. తల్లాడ మండలం సిరిపురం మేజర్ కాల్వ పరిధి తల్లాడ, రేజర్ల, కొత్త వెంకటగిరి గ్రామాల ఆయకట్టుకు సాగర్ జలాలు అందక రైతులు ఈనెల 11న ఆందోళనకు దిగారు. అలాగే, బోనకల్ బ్రాంచి కెనాల్ పరిధిలోని 500 ఎకరాల మేర పంట దెబ్బతిన్నది. ఏప్రిల్ వరకు నీరందిస్తామని ఫిబ్రవరిలోనే చేతులెత్తేశారు.. తల్లాడ మండలం గాంధీనగర్ తండాకు చెందిన భూక్యా లక్ష్మి యాసంగిలో రెండున్నర ఎకరాలు రూ.50వేలకు కౌలుకు తీసుకుంది. తెలగవరం సబ్ మైనర్, సిరిపురం ఎన్నెస్పీ మేజర్ కాల్వ కింద రేజర్లలో 75 రోజుల క్రితం వరి నాట్లు వేయగా, నెల రోజులుగా నీరు రావడం లేదు. దీంతో వరి మొత్తం ఎండిపోగా.. వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న లక్ష్మి, ఆమె భర్త తమను ఆదుకునే వారెవరని ప్రశ్నిస్తున్నారు. ఏప్రిల్ వరకు నీరందిస్తామన్న అధికారులు ఫిబ్రవరిలోనే ఇవ్వకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. పరిహారం అందించాల్సిందే... బోనకల్ మండలం ఆళ్లపాడుకు చెందిన రైతు బొమ్మగాని సాంబయ్య ఐదెకరాలు కౌలుకు తీసుకుని మొక్కజొన్న సాగు చేశాడు. ఆయన భార్య పుస్తెలతాడు తాకట్టు పెట్టి రూ.2 లక్షల మేర పెట్టుబడి పెట్టాడు. కంకి దశలో ఉండగా సాగర్ జలాలు అందక పంట ఎండిపోయింది. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఆళ్లపాడు మైనర్కు నీరు విడుదల చేయలేదని.. ఎండిపోయిన మొక్కజొన్న పంట సర్వే చేయించి పరిహారం అందించాలని సాంబయ్య కోరుతున్నాడు. ప్రణాళికా లోపం.. ఏప్రిల్ వరకు నీటి సరఫరా ఉంటుందని అధికారులు ప్రకటించడంతో రైతులు పంటల సాగు చేపట్టారు. కానీ నాగార్జునసాగర్ ప్రాజెక్టు అధికారుల ప్రణాళికా లోపంతో ఫిబ్రవరిలోనే నీటి కటకట ఏర్పడింది. అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తే చివరి ఆయకట్టుకు కూడా కొంత మేర నీరు అందేది. ప్రస్తుతం పాలేరుకు ఇన్ఫ్లో తగ్గగా.. ఇటీవల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ జలవనరుల సలహా మండలి సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. ఆ మేరకు ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో 5వేల క్యూసెక్కులను పాలేరు రిజర్వాయర్కు విడుదల చేస్తామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చినా పూర్తిగా నెరవేరలేదు. ఒకటి, రెండు రోజులకే ఇన్ఫ్లో తగ్గడంతో పాలేరు రిజర్వాయర్లో నీటిమట్టం మళ్లీ 16 అడుగులకు చేరింది. -
70 ఎకరాలు 30 పంటలు.. హైదరాబాద్ నగరానికి ఏడాది పొడవునా
ప్రకృతి వ్యవసాయదారుడిగా మారిన బ్యాంకింగ్ నిపుణుడు ఇమ్మానేని రంగప్రసాద్ తన పొలాన్ని ఉద్యాన పంటల జీవవైవిధ్య క్షేత్రంగా మార్చేశారు. నాగర్కర్నూల్ జిల్లా చారగొండ మండలం జూపల్లె గ్రామపరిసరాల్లో 70 ఎకరాల భూమిని నాలుగేళ్ల క్రితం కొనుగోలు చేసి ‘ఐఫార్మస్’ పేరుతో అభివృద్ధి చేశారు. 30 రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల చెట్లతో పాటు నాటుకోళ్లు, ఆవుల పెంపకం చేపట్టారు. పూర్తిగా ప్రకృతి సేద్య పద్ధతుల్లోనే సాగు చేస్తున్నారు. హైదరాబాద్ నగరానికి ఏడాది పొడవునా అమృతాహారాన్ని అందించడమే లక్ష్యమంటున్న రంగప్రసాద్ కృషిపై కథనం. హైదరాబాద్కు చెందిన ఇమ్మనేని రంగప్రసాద్ బ్యాంకింగ్ నిపుణుడు. డా. కిరణ్మయి మైక్రోబయాలజిస్టు. ఈ దంపతులకు సేంద్రియ/ప్రకృతి సేద్యం అంటే మక్కువ. ఈ మక్కువతోనే హైదరాబాద్కు వంద కిలోమీటర్ల దూరంలో సమీకృత సేంద్రియ ఉద్యాన పంటల క్షేత్రానికి ఎంతో శ్రమించి రూపుకల్పన చేశారు. ఏడాది పొ డవునా రసాయనిక అవశేషాల్లేని చాలా రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, నాటు కోడిగుడ్లను నగరవాసులకు అందించాలని సంకల్పించారు. నాగర్కర్నూల్ జిల్లా చారగొండ మండలం జూపల్లె గ్రామపరిసరాల్లో 70 ఎకరాల భూమిని నాలుగేళ్ల క్రితం కొనుగోలు చేసి ‘ఐఫార్మ్స్’ పేరుతో జీవవైవిధ్య ఉద్యాన క్షేత్రంగా అభివృద్ధి చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల కాలువను అనుకొని ఉండటంతో ఈ క్షేత్రానికి సాగు నీటి కొరత లేదు. తెలంగాణ గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం నేత ఎమ్మెస్ సుబ్రహ్మణ్యం రాజు సూచనలు, సలహాలతో ఈ క్షేత్రం మెరుగైన ఉత్పాదకత సాధిస్తుండటం విశేషం. దేశ విదేశీ రకాలెన్నో... అనేక రకాల నేలలు, ఎత్తుపల్లాలతో కూడిన ఈ పొ లాన్ని అనేక విభాగాలుగా విభజించి, ఒక్కో విభాగంలో ఒక్కో రకం ప్రధాన పంటలను, వాటి మధ్య అనేక అంతర పంటలను సాగు చేస్తున్నారు. ఏడాది పొ డవునా దిగుబడులు తీసుకునేందుకు వీలుగా వారానికోసారి ఆకుకూరలు, 15 రోజులకోసారి కూరగాయ మొక్కలు నాటుతూ (స్టాగ్గర్డ్ ప్లాం టేషన్ చేస్తూ) ప్రణాళికాబద్ధంగా సాగు చేస్తున్నారు. క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, క్యాబేజి, కాళీఫ్లవర్ వంటి పంటలు 15 రోజులకోసారి విత్తుతున్నారు. కాకర, బీర, సొర, టమాటో, బెండ వంటి పంటలను నెలకోసారి విత్తుతున్నారు. ఐఫార్మ్స్లో ఆరుబయట ఎత్తు మడులపై పెరుగుతున్న కసూరి మేతి, ఎర్ర ముల్లంగి, దిల్, గ్రీన్ లెట్యూస్, రెడ్ లెట్యూస్, పర్పుల్ కార్న్, బేబీ కార్న్, మిక్స్డ్ కలర్ కార్న్.. వంటి విదేశీ జాతుల కూరగాయలు వినియోగదారులను, సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. రోగనిరోధక శక్తిని పెంచే నల్ల కంది, సుగంధ పసుపు, మామిడి అల్లం వంటి పంటలు కూడా ఈ క్షేత్రంలో సాగవుతున్నాయి. అంతర పంటలు.. మొరంగడ్డ తీగతో మల్చింగ్... మామిడి, జామ, సీతాఫలం, బొ΄్పాయి తదితర పండ్ల మొక్కల మొదళ్లలో మొరంగడ్డ (చిలగడదుంప) తీగ ముక్కలను నాటడం ద్వారా కలుపును నివారించడమే కాకుండా సజీవ ఆచ్ఛాదన కల్పిస్తుండటం మరో విశేషం. తీగ ముక్క నాటిన ఆరు నెలల్లో చిలగడదుంపలను తవ్వి వినియోగదారులకు అందిస్తూ ఆదాయం కూడా పొ ందుతున్నారు. పండ్ల తోటల్లో ఖరీఫ్లో, రబీలో కూడా అంతర పంటలను సాగు చేస్తున్నారు సజీవ ఆచ్ఛాదన, కలుపు నివారణ, అదనపు ఆదాయం.. అంతర పంటల ద్వారా ఈ మూడు ప్రయోజనాలు సాధిస్తున్నారు. జామ తోటలో మొక్కల మధ్య చిలగడదుంప, సాళ్ల మధ్య వేరుశనగ వేశారు. వేరుశనగలతో వంట నూనె ఉత్పత్తి చేయడానికి ఎద్దు గానుగను ఏర్పాటు చేసుకుంటున్నామని రంగప్రసాద్ తెలిపారు. శాశ్వత పందిరికి దొండ తీగలు పాకించి.. పందిరి కింద సాళ్ల మధ్య ఖాళీలో వెల్లుల్లి, ఆకుకూరలు సాగు చేస్తున్నారు. బొ΄్పాయి తోట మధ్యలో 9 రకాల తులసి రకాలను పెంచుతున్నారు. సీతాఫలంలో బాలానగర్, ఎన్ఎంకె గోల్డ్, రామాఫలం, లక్ష్మణఫలం రకాలు నాటారు. ఈ నాలుగూ ఒకేసారి కాపునకు రావు. ఒకటి పూర్తయ్యాక మరొకటి ఫలాలనిస్తాయి. ఎటు చూసినా 10 అడుగుల దూరంలో మామిడి మొక్కలు నాటారు. మధ్యలో ఖరీఫ్లో కంది, రబీలో చిలగడదుంప సాగు చేస్తున్నారు. అందరూ ఎక్కువగా ఇష్టపడే బేనిషాన్, హిమాయత్ మొక్కలు పెట్టాం. ఎక్కడెక్కడి నుంచో అరుదైన రకాలను సైతం తెచ్చి అన్నీ కలిపి 70 రకాలను నాటామని రంగప్రసాద్ తెలిపారు. భవిఫ్యత్తులో అన్ని రకాల మామిడి పండ్లతో కూడిన బుట్టలను ప్రజలకు సరఫరా చేయనున్నట్లు సుబ్రమణ్యరాజు తెలిపారు. ఒకసారి విత్తితే.. వరుసగా రెండు పంటలు! ఆకుపచ్చ క్యాబేజీ, ఎరుపు బ్రోకలీ వంటి కొత్తరకం పంటలను ఐఫార్మ్స్లో పండిస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే.. ఒకే మొక్కకు రెండు సార్లు దిగుబడి తీస్తున్నారు. ఒక పంట తీసుకున్న తర్వాత అదే మొక్క నుంచే 50 రోజుల్లో కార్శి(రటూన్ క్రాప్) పంట తీస్తున్నారు. గో ఆధారిత ప్రకృతి సేద్య నిపుణులు సుబ్రహ్మణ్యం రాజు పర్యవేక్షణలో ఈ ప్రయోగాత్మక సాగు జరుగుతోంది. ఆయన ఏమంటున్నారంటే.. మొదటి పంటగా క్యాబేజీ, బ్రోకలీ కోసిన తర్వాత మొక్కలను అలాగే ఉంచి, ఎప్పటిలాగే క్రమం తప్పకుండా నీరు ఇవ్వాలి. 2 వారాల్లో కొత్త పిలకలు వస్తాయి. పెద్దదాన్ని ఉంచి, మిగిలినవన్నీ తీసివేయండి. 400–500 గ్రాముల క్యాబేజీ, బ్రోకలీ కావాలంటే రెండు రెమ్మలు ఉంచండి. ప్రతి పది రోజులకు పంచగవ్య, ఫిష్ అమినో యాసిడ్, ఆవు మూత్రం పిచికారీ చేయడం ద్వారా పోషకాహారం ఇవ్వండి. పంట కాలంలో మూడు సార్లు పిచికారీ చేయాలి. రెండో పంట కోసం 40–50 రోజుల వరకు వేచి ఉండండి. ఈ కార్శి పంట వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. రెండో పంటకు బెడ్ తయారీ అవసరం లేదు. అదనపు శ్రమ లేదు. తక్కువ కలుపు. తక్కువ వ్యవధి. కాబట్టి చాలా తక్కువ ఖర్చు. సీజన్ లో కన్నా ధర ఎక్కువగా వస్తుంది. నాటు కోళ్లు సమీకృత సేద్యం ద్వారానే ఉత్తమ ఫలితలు వస్తాయని రంగప్రసాద్ నమ్మిక. 35 దేశీ ఆవులతో కూడిన గోశాల ఈ క్షేత్రంలో ఉంది. సుమారు 400 నాటుకోళ్ల ఫారాన్ని నెలకొల్పారు. నాటు కోళ్లతో పాటు గిన్నెకోళ్లు, టర్కీ కోళ్లు, అసీల్ తదితర జాతుల కోళ్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆరోగ్యదాయకన రీతిలో ఆరుబయట తిరుగుతూ పెరిగేలా కోళ్లకు ఏర్పాట్లు చేశారు. నాటు కోడి గుడ్లను కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో పాటు అందించాలన్నదే రంగప్రసాద్ లక్ష్యం. సంతృప్తికర∙ఉత్పాదకత పశువుల ఎరువు, కోళ్ల ఎరువు, జీవన ఎరువులు, జీవన పురుగుమందులను అవసరాన్ని బట్టి వాడుతున్నారు. తద్వారా పోషకలోపాలు లేకుండా, చీడపీడల బెడద లేకుండా.. సంతృప్తికరమైన రీతిలో పంటల ఉత్పాదకత సాధిస్తున్నట్లు సుబ్రహ్మణ్య రాజు(76598 55588) వివరించారు. హైదరాబాద్లోని ఆర్గానిక్ షాపులకు అందించడంతో పాటు ఎంపికచేసుకున్న గేటెడ్ కమ్యూనిటీలకు స్వయంగా తీసుకెళ్లి వారానికోసారి తమ సేంద్రియ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు రంగప్రసాద్. సేంద్రియ ఆహారోత్పత్తులను నేరుగా పొ లం నుంచి పొ ందగోరే గేటెడ్ కమ్యూనిటీలు, నివాస సముదాయాల సంక్షేమ సంఘాలు ఉచితంగా తమ క్షేత్రాన్ని సందర్శించవచ్చని సమీకృత సేంద్రియ సాగుదారుడు రంగప్రసాద్(98851 22544) ఆహ్వానిస్తున్నారు. - నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
96 శాతం ఈ–క్రాప్ నమోదు
సాక్షి, అమరావతి: రబీసాగు చివరి దశకు చేరుకుంటోంది. ఈసారి సాగుతో పాటు ఈ–క్రాప్ నమోదు, ఈ–కేవైసీ నమోదు ప్రక్రియ కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే సాగైన విస్తీర్ణంలో 96 శాతం ఈ–క్రాప్ నమోదు పూర్తికాగా, ఈ–కేవైసీ 55 శాతం పూర్తయింది. ఈ నెల 20వ తేదీలోగా 100 శాతం పంటల నమోదుతోపాటు ఈ–కేవైసీ పూర్తిచేయాలనే లక్ష్యంతో వ్యవసాయశాఖ ముందుకెళ్తోంది. గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని రబీసీజన్ నుంచి ఈ–క్రాప్ నమోదులో పలు సంస్కరణలు తీసుకొచ్చింది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) సౌజన్యంతో రూపొందించిన యాప్ ద్వారా డిసెంబర్ 8వ తేదీన ఈ–క్రాప్ నమోదుకు శ్రీకారం చుట్టారు. రెవెన్యూ గ్రామాల వారీగా వెబ్ల్యాండ్ డేటాతోపాటు పంట సాగుహక్కుపత్రాల (సీసీఆర్సీ) డేటా ఆధారంగా ఈ–క్రాపింగ్ చేస్తున్నారు. దీంతోపాటు సమాంతరంగా రైతుల వేలిముద్రలు (ఈ–కేవైసీ) తీసుకుంటున్నారు. అవకతవకలకు ఆస్కారం లేకుండా.. గతేడాది డిసెంబర్లో విరుచుకుపడిన మాండూస్ తుపాన్ వల్ల దెబ్బతిన్న పంటల స్థానే రెండోసారి విత్తుకున్న పంటల వివరాలను స్థానిక వ్యవసాయాధికారి ధ్రువీకరణతో నమోదు చేస్తున్నారు. ప్రైవేటు విత్తన కంపెనీల కోసం విత్తనోత్పత్తికి సాగుచేసే పంటల వివరాలను సర్వే నంబర్ల వారీగా నమోదు చేస్తున్నారు. ఆయా సర్వే నంబర్లలో సాగైన పంటను కొనుగోలు చేయడానికి వీల్లేకుండా ఈ మార్పుచేశారు. సీజన్లో ఒకసారి పంట నమోదైన తర్వాత సాగుకాలం ముగిసేవరకు రెండోసారి పంట నమోదు కాకుండా లాకింగ్ సిస్టమ్ తీసుకొచ్చారు. ‘ఈ–ఫిష్’ ద్వారా ఆక్వా సాగవుతున్నట్టుగా గుర్తించిన సర్వే నంబర్లను ఈసారి ఈ–క్రాప్లో బ్లాక్ చేశారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఈ–క్రాప్, ఈ–కేవైసీ నమోదుతోపాటు మండల వ్యవసాయాధికారుల నుంచి కలెక్టర్ల వరకు ర్యాండమ్గా చెక్ చేస్తున్నారు. గతంలో ఈ–క్రాప్, ఈ–కేవైసీ ప్రక్రియలు పూర్తయిన తర్వాత ఈ తనిఖీలు చేసేవారు. మండల, డివిజన్, జిల్లాస్థాయిల్లో తనిఖీ కోసం ఎంపికచేసిన పంట వివరాలను సైతం కమిషనరేట్ నుంచే జిల్లాలకు పంపిస్తున్నారు. ఆ మేరకు ర్యాండమ్గా తనిఖీచేసి క్షేత్రస్థాయిలో గుర్తించిన లోటుపాట్లను సరిదిద్దుకునేలా మార్పుచేశారు. ప్రతి 15 రోజులకోసారి ర్యాండమ్గా చెక్ చేస్తున్నారు. ఈ–క్రాప్ నమోదు కాగానే రైతుల మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్లు, ఈ–కేవైసీ పూర్తికాగానే భౌతిక రసీదులు ఇస్తున్నారు. 43.62 లక్షల ఎకరాల్లో పంటల నమోదు రబీ సీజన్లో సాధారణ సాగువిస్తీర్ణం 57.30 లక్షల ఎకరాలుకాగా ఈ ఏడాది 58 లక్షల ఎకరాల సాగు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 45.31 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇప్పటివరకు 43.62 లక్షల ఎకరాల్లో సాగైన పంటల వివరాలను నమోదు చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20వ తేదీలోగా ఈ–క్రాప్ నమోదు, ఈ–కేవైసీ నూరుశాతం పూర్తిచేసి, సామాజిక తనిఖీల్లో భాగంగా 28వ తేదీ వరకు ఆర్బీకేల్లో ప్రదర్శనకు ఉంచనున్నారు. రైతుల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాత మార్చి 7వ తేదీన తుది జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. -
Telangana: కోతుల బెడద మార్చిన పంట విధానం
తెలంగాణ రాష్ట్రంలో కోతుల బెడదతో ఏటా వేలకోట్ల విలువగల పంటలకు నష్టం వాటిల్లుతోంది. కోతులకు భయపడి రైతులు కొన్ని పంటలు వేయడం లేదు. ముఖ్యంగా వేరుశనగ, మొక్కజొన్న వంటి పంటలూ, కొన్ని చోట్ల వరిపంటలు కూడా వేయడం లేదు. పండ్ల తోటలు, కూరగాయల పంటల సంగతి ఇక చెప్పవలసిన పనే లేదు. పంట పూర్తిగా కోతకు రాకముందే కోతుల మందలు వచ్చి నాశనం చేస్తున్నాయి. రాష్ట్రంలో కోతులవల్ల ఏకంగా పంటల విధానమే మారిపోయిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఊహించవచ్చు. వరి, పత్తి మినహా మరే పంట పండించే పరిస్థితి లేదు. పప్పుధాన్యాలు, నూనెగింజలు కోతుల బెడదతో విస్తీర్ణం తగ్గాయి. కోతులు ఏడాదికి 2 లేదా 3 పిల్లలకు జన్మనిస్తాయి. అందువల్ల వీటి సంఖ్య వేగంగా పెరుగు తోంది. ఆహారం కొరకు మందలు మందలుగా వచ్చి ఎంతకైనా తెగబడతాయి. ఇంట్లో దూరి ఆహార వస్తువు లతోపాటు ఇతర వస్తువులను కూడా నాశనం చేస్తున్నాయి. మనుషులపై దాడిచేసి, గోళ్ళతో గీకి, పండ్లతో కొరికి గాయపరుస్తున్నాయి. వీటితో గాయాలపాలైన వారు కోలుకోవడం ఖర్చుతో కూడిన పని. రాష్ట్ర ప్రభుత్వం నిర్మల్లో కోతుల రక్షణ కేంద్రం ఏర్పాటుచేసి వాటి పుట్టుకను నియం త్రిస్తున్నామని ప్రకటించింది. కానీ ఇప్పుడు ఆ కేంద్రం పనిచేయడం లేదు. సర్వే చేసి రూ. 2.25 కోట్లు వ్యయం చేసి కోతులను పట్టుకొని వాటికి పిల్లలు పుట్టకుండా స్టెరిలైజ్ చేస్తున్నామనీ, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, నిర్మల్, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో ల్యాబ్స్ ఏర్పాటు చేస్తామనీ అటవీశాఖా మంత్రి చెప్పారు. కోతులను అడవుల్లోకి పంపడానికి పండ్ల చెట్లను నాటుతామనీ, తద్వారా వీటి బాధను తగ్గిస్తామనీ 2017 నవంబర్లో ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. కానీ ఇది ఆచరణలోకి రాలేదు. కోతులు హైదరాబాద్లో అనేక ఇండ్లల్లోకి దూరి నష్టాలు కలిగి స్తున్నాయి. ముఖ్యంగా స్లవ్ు ఏరియాల్లో పేదల ఇండ్లల్లో తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. వీటిద్వారా కొత్త జబ్బులు కూడా ప్రజలకు సోకు తున్నాయి. ఒక సర్వేలో 50 శాతం కోతులకు జబ్బులున్నాయనీ, అవి గ్రామాల్లో, పట్టణాల్లో తిరగడం ద్వారా ఆ జబ్బులు మనుషులకు వ్యాపింప చేస్తున్నాయనీ తేలింది. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కోతుల బెడదను నివారించడనికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించలేదు. రోడ్లపక్కన చెట్లునాటడం, గ్రామాల్లో హరితహారం పేరుతో చెట్లు నాట డానికి వందలకోట్లు ఖర్చు చేస్తున్నారు. ఆ నాటిన చెట్లు కూడా ఎందుకూ ఉపయోగం కానివి. అవి ఎలాంటి కాయలుగానీ, పండ్లుగానీ చివరకు పూలుగానీ ఇచ్చేవికావు. వీటివల్ల కోతులు వెళ్తాయని ప్రభుత్వం చేస్తున్న ప్రచారం హాస్యాస్పదంగా వుంది. రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో అడవులున్నాయి. ఈ అడవుల్లో 40 శాతం భూమిలో ఎలాంటి చెట్లు చేమా లేవు. విలువైన టేకు, నల్లమద్ది లాంటి చెట్లను నరికివేసి స్మగ్లర్లు పట్టణాలకు అమ్ముకున్నారు. అడవిలో ఉన్న విప్ప, తునికి, అడవి మామిడి, పరికి, ఉసిరికాయల చెట్లు వంటి వాటిని పూర్తిగా లేకుండా చేశారు. కోతులకే గాక ఏ అడవి జంతువులకూ ఆహారం దొరకకుండా చేశారు. అందువల్ల అడవి పందులు, చివరికి చిరుతపులులు కూడా గ్రామాల్లోకి వస్తున్నాయి. దశాబ్దం క్రితంవరకు ఏ అడవి జంతువులు గ్రామాల్లోకి రాలేదు. కోతులపై పరిశోధ నలు చేసే పేరుతో, వాటి రక్తం సేకరించే పేరుతో కొన్ని ప్రైవేటు కంపెనీలు అడవుల్లో కోతులను పట్టి మందలకు మందలు పట్టణా లకు తెచ్చారు. ఇక్కడ పరిశోధన జరిగిన తర్వాత వాటిని తిరిగి అడవుల్లో విడిచిపెట్టమని చెప్పినప్పుడు... వాటిని తీసుకెళ్లే వ్యక్తులు అడవిదాకా వెళ్లకుండానే, గ్రామాల్లోనే విడిచిపెట్టారు. అవి సంతాన వృద్ధి చేసుకొని గ్రామాలు వదిలిపెట్టకుండా వుంటున్నాయి. ఇది రైతులకు, గ్రామస్థులకు శాపంగా మారింది. (క్లిక్: డియాగేట్కు గుమ్మడికాయ కడదాం!) రైతులు ధైర్యంగా వచ్చే వానాకాలం నాటికి అన్ని రకాల పంటలు వేసేవిధంగా అవకాశం కల్పించాలంటే కోతులు, పందుల బెడదను పూర్తిగా నివారించాలి. ఆ హామీ ప్రభుత్వం ఇవ్వాలి. కోతుల బెడదతో ప్రాథమిక రంగమైన వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింటున్నది. ఇందువల్ల మొత్తం పారిశ్రామిక, సేవారంగాలు దెబ్బతింటాయన్న ఆర్థిక సూత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. (క్లిక్: ఆహార స్వావలంబన విధాన దిశగా...) - సారంపల్లి మల్లారెడ్డి ఉపాధ్యక్షులు, అఖిల భారత కిసాన్ సభ -
కోత కష్టం.. ఆగితే నష్టం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం పంటలు కోత దశకు వచ్చాయి. అనేకచోట్ల వరి, మొక్కజొన్న, సోయాబీన్ కోతలు, పత్తితీత మొదలైంది. ఇలాంటి సమయంలో కురుస్తున్న వర్షాలు రైతులకు ఆందోళన కలిగిస్తున్నాయి. వానాకాలం ప్రారంభదశలో సాగును దెబ్బతీసిన వర్షాలు, తీరా పంటలు చేతికొచ్చే దశలోనూ వెంటాడుతున్నాయి. వర్షాల వల్ల కోతదశలో ఉన్న పంటలు పాడవుతున్నాయి. వాటిని కోయడం కూడా సమస్యగానే మారుతోంది. కోయకుండా పొలాల్లో ఉంచడం వల్ల వరి ధాన్యం రంగు మారుతోంది. కొన్నిచోట్ల కోతకొచ్చిన సోయాబీన్ను రైతులు చేలల్లోనే వదిలేస్తున్నారు. ఇక పత్తి పరిస్థితి ఘోరంగా మారింది. తీత దశల తడిసిపోతుండటంతో పంటదెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. ఈపంటను మొదటి నుంచీ వర్షాలు వెంటాడుతూనే ఉన్నాయి. జూలై నుంచి వర్షాలు మొదలుకాగా అప్పటి నుంచి లక్షలాది ఎకరాల్లో పత్తి పాడైపోయింది. దీంతో ఈసారి పత్తి దిగుబడి గణనీయంగా తగ్గుతుందని అంటున్నారు. సీజన్ మొదట్లోనూ సమస్యలు ఈ ఏడాది వానాకాలంలో 1.43 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా (ఆల్టైం రికార్డు) 1.36 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వరి సాగు లక్ష్యం 45 లక్షల ఎకరాలు కాగా, రికార్డు స్థాయిలో 64.54 లక్షల ఎకరాల్లో సాగైంది. పత్తి సాగు లక్ష్యం 70 లక్షల ఎకరాలు కాగా, 50 లక్షల ఎకరాలకే పరిమితమైంది. వర్షాలతో పత్తి సాగు తగ్గింది. జూలై, ఆగస్టుల్లో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరి నార్లు కొట్టుకు పోయాయి. సరఫరా కాని యంత్రాలు... రైతులకు వరికోత మిషన్లు అందించడంలో వ్యవసాయ శాఖ విఫలమైంది. ఈ ఏడాది బడ్జెట్లో వ్యవసాయ యంత్రాలకు రూ.500 కోట్లు కేటాయించినా యంత్రాలు సరఫరా కాలేదు. ఇప్పుడు వరినాటు యంత్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అనుకున్నారు. దీంతో కంపెనీలు 5 వేల వరికోత యంత్రాలను సిద్ధం చేశాయి. ఒక్కో యంత్రం ధర కంపెనీని బట్టి రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. అయితే ఈ యంత్రాలను సబ్సిడీపై రైతులకు అందజేసేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంలో వ్యవసాయశాఖ విఫలమయ్యింది. ఓలా, ఉబర్ మాదిరి వ్యవసాయానికి సంబంధించిన భారీ కోత యంత్రాలు బుక్ చేసుకుంటే అద్దెకు పంపించేలా కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని వ్యవసాయ శాఖ గతంలో చెప్పినా ఆచరణకు నోచుకోలేదు. వరి కోత యంత్రాల కొరత ప్రస్తుతం పలు ప్రాంతాల్లో పంటలు కోతకు సిద్ధమయ్యాయి. ఇప్పుడు కూడా వర్షాలు కురుస్తుండటంతో.. ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్గర్, నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో వేలాది ఎకరాల్లో చేతికొచ్చిన పంట తడిసిపోతోందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు వరికోత యంత్రాలు లేకపోవడం సమస్యగా మారింది. వరి రికార్డు స్థాయిలో సాగవడంతో కోత యంత్రాలకు కొరత ఏర్పడుతోంది. చేలల్లోనే సోయా.. మొక్కజొన్న మొలకలు ఆదిలాబాద్ జిల్లాలో కోతకు వచ్చిన సోయా పంటను చేలల్లోనే వదిలేస్తున్నారు. పత్తి తీసే దశకు రాగా వానలకు తడిసి ముద్దయిపోతోంది. కొన్నిచోట్ల తీత మొదలైంది. అక్కడక్కడ కొనుగోళ్లు జరుగుతున్నాయి. కానీ వానల కారణంగా అంతరాయం కలుగుతోంది. జగిత్యాల జిల్లాలో వరి కోతలు ప్రారంభం కాలేదు. కానీ వర్షాలతో భూమి తేమగా మారడంతో పాటు కాలువల ద్వారా నీటిని వదులుతుండటం, వ్యవసాయ బావుల్లో నుండి నీరు ఉబికి వస్తుండటం ఇబ్బందికరంగా మారింది. టైర్ కోత యంత్రాలు (హార్వెస్టర్లు) నడిచే పరిస్థితి లేకుండా పోయింది. చైన్ హార్వేస్టర్లు సరిపడా లేవు. ఇక వర్షాల్లో పత్తి తీస్తే ఆరబెట్టడం కష్టం. కాబట్టి ఉష్ణోగ్రతలు పెరిగేవరకు తీసే పరిస్థితి కనిపించడంలేదు. దిగుబడి కూడా గణనీయంగా తగ్గే పరిస్థితి కన్పిస్తోంది. మొక్కజొన్న పంట కోతకు రావడంతో కంకుల బూరు తీసి ఆరబెడుతున్నారు. వర్షాలకు తడవడంతో మొలకలు వస్తున్నాయి. వరి ఎక్కువగా సాగయ్యే నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం కోతలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 20 శాతం కోతలు పూర్తయ్యాయి. అయితే వర్షాల కారణంగా కోతలు ఆలస్యం అవుతున్నాయి. కోసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు ఇబ్బందులెదురవుతున్నాయి. రోడ్లు, కళ్లాల్లో అరబెట్టిన ధాన్యం తడుస్తోంది. కోత కోయని పంట పొలాల్లోనే నేలకొరుగుతోంది. సోయా, మొక్కజొన్న పంటల కోత మాత్రం పూర్తయ్యింది. అధిక వర్షాల వల్ల పత్తిలో ఎదుగుదల లోపించిందని రైతులు చెబుతున్నారు. వరి కోసే పరిస్థితి లేదు నేను నాలుగు ఎకరాల్లో వరి వేశా. ప్రస్తుతం పంట కోతకు వచ్చింది. కానీ కోయించలేని పరిస్థితి నెలకొంది. జూలై నుండి ఇప్పటివరకు కురిసిన వర్షాల కారణంగా పొలమంతా నీరు పైకి ఉబికి వస్తోంది. టైర్ హార్వెస్టర్లు నడిచే పరిస్థితి లేదు. చైన్ హార్వెస్టర్లు లేవు. ఒకవేళ దొరికినా గంటకు రూ.3,500 వరకు కిరాయి ఇవ్వాల్సి వస్తుంది. ఏం చేయాలో అర్ధం కావడం లేదు. – బందెల మల్లయ్య, చల్గల్, జగిత్యాల రూరల్ మండలం -
ముందే మద్దతు ధర.. సీజన్ ప్రారంభంలోనే ప్రకటన
కడప అగ్రికల్చర్: ఏ పంట సాగు చేసుకుంటే లాభదా యకంతోపాటు గిట్టుబాటు అవుతుందనే విషయాన్ని రైతులకు తెలిసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకు గాను ఖరీఫ్ సాగుకు ముందే మద్దతు ధర ప్రకటించింది. గతేడాది కూడా సీజన్కు ముందుగానే పంటల వారీగా కనీస మద్దతు ధర ఖరారు చేసింది. కేంద్ర ప్రభుత్వం జాబితాను రాష్ట్రాలకు అందజేస్తూ రైతుల్లో అవగాహన కల్పించాలని సూచించింది. పంటల వారీగా రైతులు సాగుకు పెడుతున్న పెట్టుబడులు, వస్తున్న దిగుబడులు, మార్కెట్లో పలుకుతున్న ధరలు, అన్నదాతకు లభిస్తున్న నికరాదాయం తదితర అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏటా మినియం సపోర్టు ప్రైసెస్(ఎంఎస్సీ) ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా 17 పంటలకు మద్దతు ధరను ప్రకటించి రైతులకు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. 20 రకాల పంటలకు గాను 17 రకాలకు ప్రకటన ఖరీఫ్నకు సంబంధించి జిల్లాలో సాగయ్యే 20 రకాల పంటలకు గాను ఈ ఏడాది 17 రకాలకు మద్దతు ధర(ఎంఎస్పీ)ని ప్రకటించింది. జిల్లాలో ప్రధానంగా వరి, వేరుశనగ, పొద్దుతిరుగుడు, పత్తి, పసుపు, మిరపతోపాటు పలు రకాల పంటలకు మద్దతు ధరను ప్రకటించారు. ఇందులో వరిధాన్యంపై రూ.100, జొన్నలు 232, సజ్జలు 100, రాగులు 201, కందులు, వేరుశనగ 300, పత్తి 335, మినుములు 300, పెసలు 480, సోయాబీన్ 350, సన్ఫ్లవర్పై రూ.385 మేర ధరను పెంచారు. ఆర్బీకే ద్వారా.. పంట చేతికొచ్చిన సమయంలో బహిరంగ మార్కెట్లో ఎంఎస్పీ కన్నా తక్కువ ధరలు ఉంటే.. వరి, వేరుశనగ, కంది, పసుపులతోపాటు పలు పంటలను ఆర్బీకే వేదికగా కోనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది. ఇందులో వ్యవసాయ, మార్కెటింగ్ సహకారంతో మార్క్ఫెడ్, నాఫెడ్, ఏపీ సీడ్స్, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తదితర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన నోడల్ ఏజెన్సీల ద్వారా కొనుగోళ్లు చేసి సకాలంలో రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. గతేడాది వరి, పసుపు కొనుగోలు గతేడాది ఖరీఫ్, రబీ సీజన్లో జిల్లాలో వరి, పసుపు కొనుగోలు చేశారు. రైతులకు డబ్బులను కూడా ఆన్లైన్ ద్వారా ఖాతాలకు జమ చేశారు. చాలా పంటలకు మద్దుతు ధర రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కూడా చాలా పంటలకు మద్దతు ధర ప్రకటించింది. బహిరంగ మార్కెట్లో ధర తక్కువగా ఉన్నప్పుడు ప్రభుత్వం కల్పించుకుని సంబంధిత గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేస్తోంది. గిట్టుబాధ ధర కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – హిమశైల, ఏడీ, మార్కెటింగ్ శాఖ, వైఎస్సార్ జిల్లా -
రైతు వేసిన కొత్త ఎత్తు.. ఉస్కో ఉస్కో.. అదిగోరా కోతి.. ఇదంతా ఏంటీ?
పిఠాపురం(కాకినాడ జిల్లా): ఆ పొలంలోకి వెళితే ఉస్కో ఉస్కో.. అదిగోరా కోతి.. అలా రా.. అలా రా...! అంటూ మనిషి కేకలు వినిపిస్తుంటాయి. అలాగని ఎంత వెతికినా ఒక్క మనిషీ కనిపించడు. తీరా చూస్తే అక్కడ ఒక కర్రకు కట్టిన లౌడ్ స్పీకర్ నుంచి ఆ కేకలు వినిపిస్తుంటాయి. ఇదంతా ఏంటా? అని అనుకుంటున్నారా! కోతుల నుంచి పంటలను రక్షించుకునేందుకు రైతులు వేసిన కొత్త ఎత్తు. గొల్లప్రోలు మండలం చెందుర్తిలో ఒక రైతు తన మొక్క జొన్న పంటకు రక్షణగా ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్. (అంతర చిత్రం) అరుపులకు భయపడి పొలానికి దూరంగా ఉన్న షెడ్ పైనే ఉండి పోయిన కోతులు ఇప్పటి వరకు రేకు డబ్బాలు, ఫ్యాన్లు వంటివి ఉపయోగించే రైతులు ప్రస్తుతం బ్యాటరీతో పని చేసే లౌడ్ స్పీకర్లను వాడుతూ తమ పంటలను రక్షించుకుంటున్నారు. ఇది చూసిన స్థానికులు ఔరా! అంటున్నారు. తాను పొలంలో ఉన్నంత సేపు చార్జింగ్ పెట్టి తాను ఇంటికి వెళ్లేటప్పుడు ఆన్ చేసి వదిలేస్తే మళ్లీ తాను తిరిగొచ్చే వరకు ఇది అరుస్తూ తన పంటను కాపాడుతోందంటున్నాడు రైతు. చదవండి: యువతిపై అత్యాచారం.. సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటపెడతానంటూ.. -
కిసాన్ డ్రోన్లపై కసరత్తు!
సాక్షి, విశాఖపట్నం: రానురాను వ్యవసాయానికి పెట్టుబడి పెరిగిపోతోంది. కూలీల కొరత కూడా అధికమవుతోంది. వీటన్నిటిని అధిగమించి సాగు చేయడం అన్నదాతకు తలకు మించిన భారమవుతోంది. ఇలా వ్యవసాయం గిట్టుబాటు కాక రైతాంగం ఎంతగానో సతమతమవుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయంలో యాంత్రీకరణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే రైతులకు వివిధ యంత్రాల పనిముట్లను రాయితీపై అందిస్తోంది. తాజాగా పంటలకు పురుగు మందులను పిచికారీ చేయడానికి కిసాన్ డ్రోన్లను అందుబాటులోకి తెస్తోంది. వీటిని రైతులకు సబ్సిడీపై సరఫరా చేయనుంది. ఇందుకోసం జిల్లాల వారీగా రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేల) పరిధిలో కొన్ని గ్రామాలను ఎంపిక చేసే ప్రక్రియ మొదలైంది. ఈ పనిని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు చేపట్టారు. ప్రాథమికంగా మండలానికి మూడు చొప్పున కిసాన్ డ్రోన్లను మంజూరు చేయనున్నారు. ఒకే పంట విస్తీర్ణం ఎక్కువగా ఉండే ప్రాంతాలను డ్రోన్ల వినియోగానికి వీలుగా ఉంటుందని భావించి అలాంటి వాటిని తొలుత ఎంపిక చేస్తున్నారు. కిసాన్ డ్రోన్లు మంజూరుకు నిబంధనల ప్రకారం ఐదుగురు రైతులు గ్రూపుగా ఏర్పడాల్సి ఉంటుంది. వీరిలో ఒకరు కనీసం పదో తరగతి/ఇంటర్మీడియట్ విద్యార్హతను కలిగి ఉండాలి. ఈయనకు డ్రోన్ వినియోగంలో శిక్షణ ఇస్తారు. శిక్షణ పొందిన రైతుకు సర్టిఫికెట్ కూడా ఇస్తారని విశాఖపట్నం జిల్లా వ్యవసాయ అధికారి కె.అప్పలస్వామి ‘సాక్షి’కి చెప్పారు. డ్రోన్లపై రైతులకు అవగాహన.. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో కొద్ది రోజుల నుంచి వ్యవసాయ శాఖ అధికారులు కిసాన్ డ్రోన్లపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి నెలా మొదటి శుక్రవారం ఆయా గ్రామాల్లో వీటితో ఒనగూరే ప్రయోజనాలను వారికి వివరిస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో పెందుర్తి, ఆనందపురం, భీమిలి, పద్మనాభం మండలాలు మినహా మిగిలినవి అర్బన్ ప్రాంతంలో ఉన్నాయి. వీటిలో పద్మనాభం మండలంలోనే అధికంగా పంటలు పండిస్తున్నారు. అందువల్ల విశాఖపట్నం జిల్లాలో పంటల సాగు తక్కువగానే జరుగుతోంది. దీంతో విశాఖ జిల్లాలో 57 ఆర్బీకేలున్నప్పటికీ ఇప్పటివరకు కిసాన్ డ్రోన్ల కోసం ఐదు గ్రూపులు మాత్రమే ముందుకు వచ్చాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 22 మండలాల్లో 66 రైతు గ్రూపులు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ అక్కడ గిరి ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో 38 గ్రామాలు కిసాన్ డ్రోన్ల మంజూరుకు అనువైనవని గుర్తించారు. అలాగే అనకాపల్లి జిల్లాలో 24 మండలాలకు గాను 72 గ్రామాలను ఇందుకు ఎంపిక చేసినట్టు ఆ జిల్లా వ్యవసాయ అధికారి లీలావతి చెప్పారు. రైతు గ్రూపుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియ నెలాఖరుకల్లా పూర్తి చేయాల్సి ఉంటుంది. వీరికి సెప్టెంబర్లో డ్రోన్ల వినియోగంపై శిక్షణ ఇస్తారు. శిక్షణ అయ్యాక డ్రోన్ల కొనుగోలుకు వీలవుతుంది. ఉద్యాన పంటలకు సైతం.. సాధారణంగా పంటలకు సోకిన తెగుళ్ల నివారణకు పురుగు మందులను స్ప్రేయర్లలో నింపి పంటపై స్ప్రే చేస్తారు. వ్యవసాయ పంటలతో పాటు ఉద్యాన పంటలకు సోకే తెగుళ్ల నివారణకు పురుగు మందులను ఈ డ్రోన్ల ద్వారా పిచికారి చేసేందుకు వీలుంది. డ్రోన్ల ద్వారా పిచికారి చేసే మందు నానో డోసుల్లో ఉంటుంది. దానిని తగిన మోతాదులో నింపి డ్రోన్లో ఉంచి వదిలితే పంటపై జెట్ స్పీడ్లో స్ప్రే చేసుకుంటూ వెళ్తుంది. డ్రోన్ ఖరీదు రూ.10 లక్షలు.. ఒక్కో కిసాన్ డ్రోన్ ఖరీదు సుమారు రూ.10 లక్షల వరకు ఉంటుంది. ఇందులో 40 శాతం ప్రభుత్వం రాయితీగా ఇస్తుంది. 50 శాతం సొమ్మును బ్యాంకుల ద్వారా రుణం లభిస్తుంది. మిగతా 10 శాతం సొమ్మును గ్రూపు రైతులు సమకూర్చుకోవలసి ఉంటుంది. పంటలకు పురుగు మందులు పిచికారీ చేసుకోదల్చుకున్న వారికి అద్దె ప్రాతిపదికన డ్రోన్లను ఇస్తారు. చాన్నాళ్లుగా పంటల చీడపీడల నివారణకు కూలీలతో పురుగు మందులను స్ప్రే చేయిస్తున్నారు. ఈ పనికి కూలీలు ముందుకు రాని పరిస్థితి ఉంది. దీంతో రైతులు అధిక మొత్తం చెల్లించాల్సి వస్తోంది. ఇది రైతుకు ఆర్థిక భారమవుతోంది. డ్రోన్లు అందుబాటులోకి వస్తే రైతులకు కూలీల బెడద తప్పుతుంది. ఆర్థిక భారం నుంచి ఉపశమనం కలుగుతుంది. -
ఆశాజనకంగా వంగ సాగు
రైల్వేకోడూరు: ప్రస్తుతం రైతులు ఆరుతడి, అంతర పంటలపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. నియోజకవర్గంలో వంగ పంటను సుమారు 130 ఎకరాలలో సాగుచేశారు. ఈ ఏడాది వంకాయలు కిలో రూ. 50 నుంచి రూ. 60 ధర పలకడంతో రైతులు ఆశాజనకంగా ఉన్నారు. ముఖ్యంగా రైతులు వంగ నారును అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె, బాకరాపేట నర్సరీల నుంచి సేకరించి నారుమడులలో పెంచుతారు. అనంతరం ఆధునిక వ్యవసాయ పద్ధతిలో దుక్కి దున్నిన పొలంలో వంగ నారుని నాటుతారు. సాధారణంగా ఎకరా వంగ సాగుకు 30 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎకరాకు సుమారు 10 నుంచి 13 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. అయితే గత ఏడాది వంగ కిలో 40 రూపాయలు ధర ఉండగా ప్రస్తుతం కిలో రూ. 50 నుంచి 60 రూపాయలు పలుకుతోంది. ఎకరానికి ఖర్చులు పోను రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తోందని రైతులు అంటున్నారు. ►ముఖ్యంగా వంగను ఎక్కువగా నల్లిపురుగు, బూడిదతెగులు, కాండం తొలుచు పురుగు, పచ్చ పురుగు అధికంగా ఆశిస్తాయి. వీటిని సకాలంలో క్రిమిసంహారక మందులు పిచికారీ చేసి పంటను కాపాడుకుంటే మంచి దిగుబడి సాధించవచ్చని రైతులు తెలుపుతున్నారు. ఈ ప్రాంతంలో పండించిన వంగ పంటను రైల్వేకోడూరు మార్కెట్లోను, తిరుపతి మార్కెట్కు తరలిస్తుంటారు. ఈ ఏడాది వంగసాగు ఆశాజనకంగా ఉందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
కాకినాడలో మియాజాకీ మామిడి.. అక్షరాలా ‘లక్ష’ రూపాయలు
పిఠాపురం: ‘కృషితో నాస్తి దుర్భిక్షమ్’ అన్నారు పెద్దలు. ఓ రైతు తన కృషితో అరుదైన పంటలు పండిస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి రకం ‘మియాజాకీ’ని పండించి ఔరా అనిపించాడు కాకినాడ జిల్లా, గొల్లప్రోలు మండలం, చేబ్రోలుకు చెందిన రైతు ఓదూరి నాగేశ్వరరావు. తనకున్న నాలుగెకరాల్లోనే వందకుపైగా రకాల పండ్ల జాతి మొక్కలను పెంచుతున్నాడు. అరటి పండులా తొక్క వలుచుకుతినే బనానా మామిడి, యాపిల్లా కనిపించే యాపిల్ మామిడి, నీలి రంగులో ఉండే బ్లూ మామిడి, టెంక లేని (సీడ్లెస్) మామిడి, 365 రోజులు కాపు కాసే మామిడితో పాటు కేజీ సీతాఫలం, అరటి సపోటా, పిక్క లేని (సీడ్లెస్) నేరేడు, తెల్ల నేరేడు, ఎర్ర పనస, స్ట్రాబెర్రీ జామ, హైబ్రిడ్ బాదం, అల్జీరా, పీనట్ బటర్ ఫ్రూట్ తదితర అరుదైన పండ్ల మొక్కలతో పాటు సంప్రదాయ కొబ్బరి, రేగు, జామ, సీతాఫలం, నేరేడు, సపోటా మొక్కలను తన తోటలో నాటి వాటి ఫలాలను పొందుతున్నాడు. పండ్ల మొక్కలతో పాటు కూరగాయలు, మసాలా దినుసుల సాగు కూడా చేపట్టాడు. ది కింగ్ ఆఫ్ మ్యాంగో మియాజాకీ రకానికి చెందిన మామిడిపండు ప్రపంచంలోనే అతి ఖరీదైన మామిడి పండుగా, కింగ్ ఆఫ్ మ్యాంగోగా గుర్తింపు పొందింది. జపాన్ దేశంలోని మియాజాకీ ప్రాంతంలో దీని మూలం ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. బయటకు సువాసనలు వెదజల్లుతూ, లోపల బంగారు ఛాయతో మెరిసిపోతూ ఉండటం దీని ప్రత్యేకత. అంతేగాక అత్యధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం, క్యాన్సర్ను నిరోధించడం, కొలెస్ట్రాల్ను తగ్గించడం, రోగనిరోధక శక్తి పెంచే గుణాలు ఉండటంతో పాటు చర్మసౌందర్యాన్ని పెంచే లక్షణాలు కూడా ఈ పండులో ఉండటంతో అత్యంత ఖరీదు పలుకుతోంది. ఇతర రకాలతో పోల్చితే కాపు కూడా తక్కువగా ఉంటుంది. దీంతో ఈ పండ్లకు అంతర్జాతీయ మార్కెట్లో కిలో రూ. 2.70 లక్షల వరకు పలుకుతుందని అధికారులు చెబుతున్నారు. తెల్ల నేరేడు మొక్కల పెంపకంపై మక్కువతో నా నాలుగెకరాల పొలం ఎర్ర రేగడి నేల కావడంతో మొక్కలకు అనుకూలంగా ఉంటుంది. మొక్కల పెంపకం అంటే నాకు చాలా ఇష్టం. నాలుగేళ్ల క్రితం అరుదైన మొక్కలు పెంచాలనే ఆలోచనతో వాటిని నాటడం ప్రారంభించాను. రూ. 9 లక్షల వరకూ ఖర్చు చేసి ఇప్పటి వరకు 100కు పైగా అరుదైన రకాల మొక్కలు నాటాను. కడియం నర్సరీల వారితో మాట్లాడి ఆ మొక్కలు తెప్పించుకునే వాడిని. నా కుమారుడి సహకారంతో తోటను చంటి పిల్లాడిగా చూసుకుంటున్నా. మియాజాకీ రకం మొక్కలు 20 నాటాను. వాటిలో ఒకటి ఒక కాయ కాసింది. దాని బరువు 380 గ్రాముల వరకు ఉంది. ఆన్లైన్లో పెడితే దాని ధర రూ. లక్షగా నిర్ణయించారు. మియాజాకీ మొక్కతో రైతు నాగేశ్వరరావు నాన్నకు తోడుగా నేను డిగ్రీ చదివాను. కంప్యూటర్ సాఫ్ట్వేర్ వర్క్ చేస్తాను. ఖాళీ సమయాల్లో తోటలో నాన్నకు సహాయం చేస్తుంటాను. అరుదైన రకాల మొక్కలు ఆన్లైన్ ద్వారా రప్పించి నాటుతుంటాను. వాటికి సేంద్రియ ఎరువులు ఉపయోగిస్తున్నాం. ఏమొక్కను ఎలా పెంచాలనేది ఇంటర్నెట్లో చూస్తాము. ఉద్యాన శాఖ వెబ్ సైట్ల ద్వారా కూడా మెళకువలు తెలుసుకుంటాం. పండ్లతో వ్యాపారం చేయాలనే ఆలోచన లేక పోయినప్పటికి ఆదాయం ఎక్కువగా వచ్చే రకాలు ఉండడంతో చాలా మంది ఆన్లైన్లో మమ్మల్ని సంప్రదిస్తున్నారు. ఫలాలను ఇస్తున్న మొక్కలను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. – ఓదూరి కిషోర్, చేబ్రోలు ఇక్కడ మియాజాకీ పండడం చాలా అరుదు మియాజాకీ రకం మామిడి పండటం చాలా అరుదు. ఇది చాలా విలువైనది. మన ప్రాంతంలో పండించడం ఇదే మొదటిసారి. నాగేశ్వరరావు తోటలో పండించే పంటలు అన్ని అరుదైనవే. తోటను పరిశీలించి ఇతర రైతులకు పరిచయం చేస్తాం. ఇలాంటి అరుదైన మొక్కలను నాగేశ్వరరావు పండించటం మాకే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మియాజాకీ పండించడం మిరాకిల్ గానే చెప్పవచ్చు. – శైలజ, ఉద్యాన శాఖ అధికారి, పిఠాపురం -
వరికి, పత్తికి ఎకరాకు రూ.40 వేల రుణం
సాక్షి, హైదరాబాద్: వరి, పత్తి, ఆయిల్పాం, మొక్కజొన్న, సోయాబీన్, మిర్చి తదితర పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ (రుణ పరిమితి) పెరిగింది. వచ్చే వ్యవసాయ సీజన్కు రుణ పరిమితిని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) ఖరారు చేసింది. రాష్ట్రంలో పండించే 120 రకాల పంటలకు 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఎంతెంత రుణాలు ఇవ్వాలన్న దానిపై టెస్కాబ్ భారీ కసరత్తు చేసింది. సాగు ఖర్చు, ఉత్పాదకత, నీటి వసతి ఆధారంగా రుణ నిర్ధారణ చేసింది. రుణ పరిమితి నివేదికను రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ)కి పంపిం చింది. తాము ఖరారు చేసినట్లుగా రైతులకు పంట రుణా లు ఇవ్వాలని సూచించింది. రాష్ట్రంలో అత్యధికంగా సాగు చేసే పత్తి, వరి పంటలకు ఎకరానికి రూ.40 వేలు ఖరారు చేసింది. సాగునీటి ప్రాజెక్టులు ఉన్నచోట వరికి గతేడాది రూ.34 వేల నుంచి రూ. 38 వేల వరకున్న పంట రుణా లను, ఈసారి రూ.36 వేల–రూ. 40 వేలకు పెంచింది. అంటే గతేడాది కంటే రూ.2 వేలు అధికంగా పెంచింది. శ్రీ పద్ధతిలో సాగు చేసే వరికి రూ.34 వేల నుంచి రూ. 36 వేలు ఖరారు చేసింది. గరిష్ట పరిమితి గతేడాదితో సమానంగా ఉంది. అలాగే వరి విత్తనోత్పత్తికి గతేడాది మాదిరిగానే రూ. 42 వేల నుంచి రూ.45 వేలుగా ఖరారు చేసింది. ఇక పత్తికి గతేడాది రుణ పరిమితి రూ.35 వేల నుంచి రూ. 38 వేలు ఉండగా, ఈసారి దాన్ని రూ.38 వేల నుంచి రూ.40 వేలకు పెంచింది. ఈసారి 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ పెరుగుదల రైతులకు ఉపయోగపడనుంది. ఆయిల్పామ్కు రూ. 42 వేల రుణం... ►ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈసారి ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనికోసం బడ్జెట్లో రూ. వెయ్యి కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆయిల్పామ్ రుణాన్ని పెంచాలని నిర్ణయించినట్లు టెస్కాబ్ వర్గాలు తెలిపాయి. గతేడాది ఆయిల్పామ్ పంటలు సాగు చేసే రైతులకు ఎకరానికి రూ.35 వేల నుంచి రూ.38 వేల వరకు రుణ పరిమితి ఉండగా, ఈసారి దాన్ని రూ.40 వేల నుంచి రూ.42 వేలకు పెంచడం గమనార్హం. ►సాగునీటి వసతి ఉన్నచోట మినుము పంటకు ఎకరాకు రూ. 18–21 వేలు, సాగునీటి వసతి లేని చోట 15–17వేలు ఖరారు చేశారు. సేంద్రియ విధానంలో పండించే మినుముకు 18–21 వేలు ఖరారు చేశారు. ►పెసరకు సాగునీటి వసతి ఉన్నచోట రూ.18–21 వేలు, సాగునీటి వసతి లేనిచోట రూ. 15–17 వేలు ఖరారు చేశారు. సేంద్రియ విధానంలో పండించే పెసరకు రూ. 18–21 వేలు నిర్దారించారు. ►శనగకు రూ. 22–24 వేలు చేశారు. ►సాగునీటి వసతి ఉన్న చోటమొక్కజొన్నకు రూ. 28–32 వేలు, నీటి వసతి లేని చోట రూ. 24–26 వేలు చేశారు. ►సాధారణ పద్ధతిలో పండించే కందికి సాగునీటి వసతి ప్రాంతాల్లో రూ.18–21 వేలు, సాగునీటి వసతి లేని చోట రూ.16–19 వేలు ఖరారు చేశారు. ఆర్గానిక్లో పండించే కందికి రూ. 18–21 వేలు ఖరారు చేశారు. ►సోయాబీన్కు రూ. 24 వేల నుంచి రూ. 26 వేలు ఇస్తారు. సోయా విత్తనోత్పత్తి రైతులకు రూ. 30 వేల నుంచి రూ. 32 వేల వరకు ఇస్తారు. ►మెడికల్, ఎరోమాటిక్ ప్లాంట్స్కు రూ. 37,500 నుంచి రూ. 42,500 వరకు ఇస్తారు. ►రూఫ్ గార్డెన్కు దశలవారీగా మొదటిసారి రూ. 28,500 నుంచి రూ. 31,500 వరకు ఇస్తారు. రెండో దశలో రూ.19 వేల నుంచి 21 వేలు, మూడోదశలో 9,500 నుంచి రూ. 10,500 వరకు ఇవ్వాలని నిర్ణయించారు. ►ఇక డ్రాగన్ ఫ్రూట్కు రూ. 65 వేల నుంచి రూ. 75 వేల వరకు ఇస్తారు. విత్తన రహిత ద్రాక్షకు రూ.1.25 లక్షల నుంచి రూ. 1.30 లక్షల రుణం ఇవ్వనున్నారు. ►పత్తి విత్తనాన్ని సాగు చేస్తే రూ.1.10 లక్షల నుంచి రూ.1.40 లక్షలకు ఖరారు చేశారు. ►పసుపు సాగుకు 75వేల నుంచి 80 వేల వరకు ఇస్తారు. ►ఉల్లిగడ్డ సాగుకు ఎకరానికి రూ.37 వేల నుంచి రూ.42 వేలు ఇస్తారు. -
పంటల వారీగా క్లస్టర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంటల వారీగా క్లస్టర్లను ప్రభుత్వం గుర్తించింది. ఏ పంట ఏ క్లస్టర్లలో అధికంగా సాగవుతుందో నిర్ధారించింది. గుర్తించిన క్లస్టర్లలో వచ్చే వానాకాలం సీజన్లో పంటలను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తారు. అవసరమైన విత్తనాలు, ఎరువులు ఇతరత్రా మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. పంట కోత అనంతరం క్లస్టర్ల ఆధారంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తారు. పంటలు శాస్త్రీయంగా సాగు కావాలన్నది క్లస్టర్ల నిర్ధారణలోని ప్రధాన ఉద్దేశం. దీనివల్ల రైతులకు బాగా ప్రయోజనం కలుగుతుందని సర్కారు భావిస్తోంది. ఈ నేపథ్యంలో క్లస్టర్ల ప్రకారం ఈసారి వానాకాలం పంటల ప్రణాళికను వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. రాష్ట్రంలో సాగయ్యే పత్తి, వరి, మొక్కజొన్న, కంది, సోయా బీన్తో పాటు పలు పంటలను ఏ జిల్లాలో ఎంత వేయాలనే ప్రణాళికలు సిద్ధం చేసింది. ఏ పంట ఎక్కువగా సాగవుతుందో దానిపై దృష్టి ఏ ప్రాంతంలో ఏ పంట ఎక్కువగా సాగవుతుందనే దాని ఆధారంగా ఆ పంట క్లస్టర్ను గుర్తించారు. ఒకవేళ రెండు ప్రధాన పంటలుంటే, వాటిల్లో ఏది 50 శాతం పైగా ఉందో దాన్ని ఆ పంట క్లస్టర్ (ఐదు వేల ఎకరాలు)గా నిర్ధారించారు. ఆ క్లస్టర్లో ఆ పంటపైనే ఎక్కువగా దృష్టి సారిస్తారు. రైతులకు కూడా ఆ ప్రధాన పంటపైనే అవగాహన కల్పిస్తారు. నిర్దిష్ట పంట క్లస్టర్లో అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తారు. రాష్ట్రంలో మొత్తం అన్ని ప్రధాన పంటలను 2,615 క్లస్టర్లుగా వ్యవసాయ శాఖ నిర్ణయించింది. అత్యధికంగా పత్తి పంటకు 1,081 క్లస్టర్లు, వరికి 1,064 , కందులకు 71, సోయాబీన్కు 21, మొక్కజొన్నకు 9 క్లస్టర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నాగర్కర్నూల్లో 142 పంట క్లస్టర్లు.. అత్యధికంగా నాగర్కర్నూల్లో 142 పంట క్లస్టర్లు, నల్లగొండ జిల్లాలో 140, ఖమ్మం జిల్లాలో 129, సిద్దిపేటలో 128 క్లస్టర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మేడ్చల్, ములుగు జిల్లాల్లో అత్యంత తక్కువగా 15 క్లస్టర్ల చొప్పున మాత్రమే ఉన్నాయి. ఒక్కో క్లస్టర్ 5 వేల ఎకరాల్లో ఉండగా, వాటిని పంటల వారీగా విభజించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పత్తి క్లస్టర్లే ఎక్కువ.. మొక్కజొన్న మూడు జిల్లాల్లోనే రాష్ట్రంలో గుర్తించిన క్లస్టర్లలో అత్యధికంగా పత్తి క్లస్టర్లే ఉన్నాయి. అయితే జగిత్యాల, కామారెడ్డి, మేడ్చల్, నిజామాబాద్, వనపర్తి జిల్లాల్లో పత్తి క్లస్టర్ ఒక్కటీ లేకపోవడం గమనార్హం. కాగా ఆ జిల్లాల్లో ఏ ఒక్కచోట కూడా అత్యధికంగా పత్తి సాగు కావడం లేదని దీనిని బట్టి తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో ఏకంగా 110 క్లస్టర్లలో పత్తి సాగు చేస్తారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో వరి క్లస్టర్ ఒక్కటీ లేకపోవడం గమనార్హం. అక్కడ 98 పత్తి క్లస్టర్లు ఉన్నాయి. ఇక నారాయణపేట సహా ఎనిమిది జిల్లాల్లో కంది క్లస్టర్లు, కామారెడ్డితో పాటు నాలుగు జిల్లాల్లో సోయాబీన్ క్లస్టర్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రధాన పంటల్లో మొక్కజొన్న ఒకటి అయినా.. కేవలం మూడు జిల్లాల్లోనే ఈ పంట క్లస్టర్లు ఉన్నాయి. 80 లక్షల ఎకరాల్లో పత్తి సాగు! రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే వానాకాలంలో పత్తి పంటను ఎక్కువగా ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. దాదాపు 80 లక్షల ఎకరాలకుపైగా పత్తి వేసేలా ప్రణాళికలు రచిస్తోంది. పత్తి పంటతో వచ్చే లాభాలు రైతులకు వివరించి ఎక్కువ సాగయ్యేలా చూడాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించింది. గత ఏడాది వానాకాలంలో వేసిన పత్తికి రికార్డు స్థాయిలో ధర పలికింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా పత్తినే ఎక్కువ వేయాలని రైతులకు సూచించాలని నిర్ణయించింది. ఒకవేళ మార్కెట్లో ధర పడిపోయినా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది. వరి సాగుపై గందరగోళం కొనసాగుతున్నందున రైతులు కూడా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
కరువు నేల పరవశం!
సాక్షి, సిద్దిపేట/గజ్వేల్: కరువు నేల పరవశిస్తోంది. పడావు పడ్డ భూముల్లో సిరుల పంటలు పండుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా దశాబ్దాల తండ్లాటను కాళేశ్వరం ప్రాజెక్టు తీర్చింది. మేడిగడ్డ బ్యారేజీ నుంచి సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ దాకా గోదావరి జలాలు ఉరకలు వేస్తున్నాయి. మండుటెండల్లోనూ చెరువులు నిండుగా కనిపిస్తున్నాయి. వర్షం వస్తేనే పారే కూడవెల్లి, హల్దీ వాగులు ఇప్పుడు కొత్త నడక నేర్చుకున్నాయి. ఇన్నాళ్లూ వలసలు పోయిన రైతులు.. తిరిగి సొంతూళ్లకు చేరుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ నుంచి మల్లన్నసాగర్ మీదుగా కొండపోచమ్మ రిజర్వాయర్ వరకు గ్రామాల్లో ‘సాక్షి’ నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనలో ఇలాంటి విశేషాలెన్నో బయటపడ్డాయి. ఈ అంశాలతో ప్రత్యేక కథనం.. సిద్దిపేట జిల్లా బూర్గుపల్లిలో గోదావరి జలాల డిస్ట్రిబ్యూటరీ కెనాల్ గోదావరి పరుగులతో.. మేడిగడ్డ బ్యారేజీ నుంచి లిఫ్ట్ చేసిన గోదావరి జలాలు.. వివిధ బ్యారేజీలు, రిజర్వాయర్ల మీదుగా రంగనాయసాగర్కు, అక్కడి నుంచి మల్లన్నసాగర్ మీదుగా కొండపోచమ్మసాగర్కు చేరుతున్నాయి. రంగనాయకసాగర్ నుంచి మల్లన్నసాగర్కు నీటిని 2.2 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్, 16.2 కిలోమీటర్ల టన్నెల్ ద్వారా తరలిస్తున్నారు. మల్లన్నసాగర్ నుంచి మెయిన్ కెనాల్ ద్వారా చెరువులను నింపుతున్నారు. దుబ్బాక కెనాల్ ద్వారా తొగుట, సిద్దిపేట అర్బన్, రూరల్ మండలాల పరిధిలోని 36 చెరువులకుగాను ఇప్పటికే 18 చెరువులు నిండి మత్తడి దూకుతున్నాయి. మరో 18 చెరువులు మూడు, నాలుగు రోజుల్లో నిండనున్నాయి. ఇక 32 చెక్ డ్యాంలకు గాను రెండు పూర్తిగా నిండగా, మరో 30 వారం రోజుల్లో నిండే అవకాశముంది. ఈ చెరువులు, చెక్ డ్యాంల నుంచి చిన్నకాల్వల ద్వారా పంటలకు సాగు నీరు అందుతోంది. చెరువులు నిండుగా ఉండటంతో పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. గతంలో ఎండకాలం మొదలవుతుందంటేనే బోర్లు,బావులు ఎండిపోయేవని.. ఇప్పుడు బాగా నీళ్లు ఉంటున్నాయని ఆయా గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండు పంటలతో.. ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఒక పంట పండటమే కష్టంగా ఉండేదని.. ఇప్పుడు గోదావరి నీళ్లు రావడంతో రెండు పంటలను సాగు చేస్తున్నామని స్థానిక రైతులు చెప్తున్నారు. రంగనాయకసాగర్ నుంచి మల్లన్నసాగర్ మధ్య ఉన్న 11 (ఇమాంబాద్, గాడిచర్లపల్లి, చిన్నగుండవెల్లి, బూర్గుపల్లి, ఎన్సాన్పల్లి, వెంకటాపూర్, తడ్కపల్లి, బండారుపల్లి, ఘన్పూర్, ఎల్లారెడ్డిపేట, తుక్కాపూర్) గ్రామాల్లో 2019–20 యాసంగిలో 6,134 ఎకరాల్లో సాగు జరగగా.. ఈసారి 9,389.25 ఎకరాలు సాగైంది. గతంలో కంటే దిగుబడి సైతం పెరిగిందని రైతులు అంటున్నారు. కొండపోచమ్మ దారిలో.. మల్లన్నసాగర్ నుంచి 23 కిలోమీటర్ల దూరంలోని కొండపోచమ్మ సాగర్ వరకు కాల్వల ద్వారా గోదావరి నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఈ కాల్వ వెంట ప్రధానంగా మంగోల్, తిప్పారం, రాంచంద్రాపూర్, కొడకండ్ల, రిమ్మనగూడ, దాతర్పల్లి, కోనాపూర్, అక్కారం, శ్రీగిరిపల్లి, అంగడికిష్టాపూర్, పాతూరు, పాములపర్తి, మర్కూక్ గ్రామాలు ఉన్నాయి. కొడకండ్ల బ్రిడ్జి వద్ద ఆనకట్ట కట్టి నీటిని వదులుతున్నారు. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సాగుకు నీళ్లు అందిస్తున్నారు. కూడవెల్లి, హల్దీకి కొత్త కళ గోదావరి జలాల పుణ్యామాని సిద్దిపేట జిల్లాలోని కూడవెల్లి, హల్దీవాగులు మండువేసవిలోనూ పరవళ్లు తొక్కుతున్నాయి. కూడవెల్లి వాగు గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లో 80 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుంది. ఈ వాగుపై మర్కుక్ మండలం ఎర్రవల్లి, నర్సన్నపేట, జగదేవ్పూర్, ఇటిక్యాల, అలిరాజపేట, తీగుల్, గజ్వేల్ మండలం అక్కారం, కొడకండ్ల, బూర్గుపల్లి, రిమ్మనగూడ సింగాటం, అహ్మదీపూర్ గ్రామాల పరిధిలో చెక్డ్యామ్లు, రాచకట్ట రిజర్వాయర్ ఉన్నాయి. కొన్నేళ్లుగా ఈ వాగు పరిధిలో భూగర్భ జలాలు పడిపోయి పంటలు ఎండిపోతూ వచ్చాయి. గతేడాది వేసవిలో కొండపోచమ్మ సాగర్ కాల్వ నుంచి నీటిని విడుదల చేయడంతో వాగు జలకళ సంతరించుకుంది. పంటలకు కష్టం తప్పింది. అదే తరహాలో ఈసారి ఈ నెల 19న నీటిని విడుదల చేశారు. ►గజ్వేల్, వర్గల్, తూప్రాన్, రామాయంపేట మండలాల మీదుగా ప్రవహించి మంజీరా నదిలో కలిసే మరో ప్రధాన వాగు హల్దీ. దీనిపై ఖాన్ చెరువు వద్ద జలాశయాన్ని నిర్మించారు. వేలూరు పుష్పల వాగు వద్ద, అంబర్పేట, నాచారం, యావాపూర్, కిష్టాపూర్, ఇస్లాంపూర్, నాగులపల్లి, తూప్రాన్, నాచారం, వేలూరు, తున్కిఖాల్సా తదితర ప్రదేశాల్లో 20 వరకు చెక్డ్యాంలను నిర్మించారు. వర్గల్ మండలం అవుసులోనిపల్లి వద్ద ఉన్న కొండపోచమ్మసాగర్ కాల్వ నుంచి నీటిని విడుదల చేయడంతో.. హల్దీవాగు జలకళను సంతరించుకుంది. ఇసొంటి రోజు వస్తదనుకోలే.. నాకు రెండున్నర ఎకరాల భూమి ఉంది. బోరు వేసుకొని వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేక బీడుగా వదిలేయాల్సి వచ్చింది. కొండపోచమ్మసాగర్ వచ్చాక మా బతుకు మారిపోయింది. పొలానికి కాల్వలతో నీళ్లు వస్తున్నయ్. ఎకరంలో స్వీట్కార్న్, మిగతా భూమిలో మిర్చి, టమాటా సాగు చేసిన. రూ.లక్షా 40 వేల దాకా ఆదాయం వస్తది. పంట మంచిగ పండితే బిడ్డ పెండ్లి చేయాలనుకుంటున్న. –దాసరి రాములు, రైతు గంగాపూర్, మర్కూక్ మండలం బోర్లలో నీళ్లు పెరుగుతున్నయ్ గతంలో ఎండాకాలం వస్తే బోర్లలో నీళ్లు ఉండేవి కాదు. కూరగాయలు పండించేవాళ్లం. నీళ్లు లేక తిప్పలయ్యేది. గత ఏడాది నుంచి ఆ బాధ పోయింది. బోర్లలో నీళ్లు పెరుగుతున్నయ్. నాకు ఆరున్నర ఎకరాల భూమి ఉంటే.. కాల్వ కోసం 3 ఎకరాలు తీసుకున్నరు. నా భూమి పోయినా నలుగురికి మంచి జరిగిందని అనుకున్నా. మిగిలిన భూమిలో బీన్స్,మిర్చి పంటలు సాగుచేస్తున్న. – అన్నెబోయిన కొండయ్య, రైతు,రామచంద్రాపూర్, జగదేవ్పూర్ మండలం ఇప్పుడు మొత్తం భూమి సాగు చేసుకుంటున్నా.. గతంలో ఎండాకాలంలో వ్యవసాయ బోరు పావు గంట నీళ్లు వస్తే.. మళ్లీ రెండు, మూడు గంటల పాటు నీళ్లు ఊరేదాకా బంద్ చేసేవాళ్లం. కాళేశ్వరం నీళ్లతో మా ఊరి చెరువు నింపుతుండటంతో భూగర్భ జలాలు పెరిగాయి. గతంలో రెండెకరాలకే నీళ్లు సరిపోయేవి కావు. ఇప్పుడు నాకున్న మొత్తం నాలుగు ఎకరాలు సాగు చేస్తున్నా. దిగుబడి కూడా పెరిగింది. – శంకర్, ఎన్సాన్పల్లి ఎన్నడూ ఇట్లా నీళ్లు చూడలే.. నేను 50 ఏండ్ల నుంచి వ్యవసాయం చేస్తున్న.. ఎన్నడూ ఇట్లా నీళ్లు చూడలే. రెండేళ్ల నుంచి సాగునీటికి కరువే లేదు. మా భూమిలో ఉన్న బావి, బోరు ఎండకాలం వస్తుందనగానే ఎండిపోయేవి. కాలం కాకపోతే తిండి గింజలకూ ఇబ్బంది పడేవాళ్లం. ఇప్పుడా బాధ తప్పింది. – చెత్తిరి బాలయ్య, ఎల్లారెడ్డిపేట -
వినూత్నం.. కోతులు ‘బేర్’మన్నాయి!
కోహెడ రూరల్ (హుస్నాబాద్): ఓ వైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు వన్య ప్రాణుల దాడులు. రైతు తమ పంటను కాపాడుకోడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇలాగే కోతులు, అడవి పందుల నుంచి తన పంటను కాపాడు కోవడానికి ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. ఎలుగుబంటి వేషధారణ ద్వారా పంటలను కాపాడుకోవచ్చని గుర్తించాడు. కోహెడ మండలం నాగసముద్రాల గ్రామానికి చెందిన రైతు భాస్కర్రెడ్డి కోతుల బెడద ఎక్కువ కావడంతో హైదరాబాద్లో రూ.10 వేలు వెచ్చించి ఎలుగుబంటి వేషధారణను తయారు చేయించాడు. పంట రక్షణగా ఉదయం, సాయంత్రం కోతుల గుంపు, అడవి పందులు రాకుండా ఎలుగుబంటి వేషధారణ కోసం కూలీని పెట్టుకుని రోజుకు అతనికి రూ.500 చెల్లిస్తూ పంటకు కాపలా కాయిస్తున్నాడు. ఒకసారి ఎలుగుబంటి వేషధారణతో కోతులను తరిమితే పది రోజుల వరకు పంటల వైపు రావడం లేదని రైతులు చెబుతున్నారు. (చదవండి: అకాల వర్షంతో పంట నష్టం) -
రైతుల మేలు కోరు‘కొనేలా’..
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అడ్డగోలుగా దోచేసే దళారీ వ్యవస్థకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకోసం కొనుగోళ్లలో పారదర్శకత, రైతులకు ప్రయోజనం కల్పించడమే లక్ష్యంగా ఈ–ఫారమ్ పేరుతో ఓ సరికొత్త జాతీయ స్థాయి మార్కెటింగ్ వసతి ఏర్పాటు చేయనుంది. వ్యాపారులే నేరుగా రైతుల నుంచి పంట కొనుగోలు చేసేలా, అందుకు అధికారులు మధ్యవర్తిత్వం వహించేలా ఓ కొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టనుంది. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన జిల్లాల్లో ఇప్పటికే మార్కెటింగ్ శాఖ రైతుల వివరాలు సేకరిస్తోంది. జాతీయ స్థాయి మార్కెటింగ్ సౌకర్యం... పంటలు పండించడం ఒక ఎత్తయితే.. పండించిన పంటను మద్దతు ధరకు అమ్ముకోవడం రైతులకు మరో సవాల్. ప్రస్తుతం ఉన్న సంప్రదాయ మార్కెట్ విధానంలో వ్యాపారులకు, రైతులకు మధ్యలో దళారి వ్యవస్థ రైతులను నిలువునా ముంచుతోంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ఈ–ఫారమ్ అనే నూతన మార్కెటింగ్ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తోంది. ఈ విధానం కింద వ్యాపారులే నేరుగా రైతుల వద్ద నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. రైతులు, వ్యాపారులకు మధ్యలో మార్కెటింగ్శాఖ అధికారులు మధ్యవర్తిత్వం వహిస్తారు. జిల్లాలో ఎంత మంది రైతులు ఉన్నారు.. వారు ఏఏ పంటలు సాగు చేశారు.. వారి వద్ద ఉన్న ఉత్పత్తులు ఏంటి.. ఎంతమేర ఉన్నాయి.. అనే వివరాలను మార్కెటింగ్శాఖ అధికారులు సేకరిస్తారు. తరువాత ఆ వివరాలను నేరుగా కార్పొరేట్ కంపెనీలు, బడా వ్యాపారులకు అందిస్తారు. వ్యాపారులు వారి అవసరాల మేరకు రైతుల నుంచి నేరుగా ఉత్పత్తులు కొనుగోలు చేసుకోవచ్చు. ఉత్పత్తులను కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇప్పటి వరకు జిల్లాలో 3.50 లక్షల రైతులు, పంట ఉత్పత్తుల వివరాలను మార్కెటింగ్శాఖ అధికారులు సేకరించారు. ఈ మొత్తం వ్యవహారం నడిపించేందుకు నాగార్జున ఫెర్టిలైజర్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఎఫ్జీఎల్)ను స్పెషల్ పర్పస్ వెహికల్గా ఎంపిక చేశారు. త్వరలో ముఖ్యమంత్రి ప్రారంభించిన అనంతరం ఈ –ఫారమ్ వ్యవస్థ వెబ్సైట్ అధికారికంగా అందుబాటులోకి వస్తుంది. ఈ వెబ్సైట్లో రైతులు నేరుగా తమ ఉత్పత్తుల వివరాలను నమోదు చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఆఫ్లైన్లోనే అధికారులు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. భారీగా ఆర్డర్లు... ఈ–ఫారమ్ విధానంలో ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు బడా కంపెనీలు, వ్యాపారులు ముందుకు వస్తున్నారు. వివిధ దేశాలు, రాష్ట్రాలకు చెందిన పలు బడా కంపెనీలు ఇప్పటికే తమకు కావాల్సిన ఉత్పత్తుల వివరాలను మార్కెటింగ్శాఖ అధికారులకు ఇచ్చారు. ఇప్పటికే ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా పచ్చి మిర్చి 80 టన్నులు, ఎండు మిర్చి 25 టన్నులు, ధాన్యం 3 వేలు టన్నులు, పత్తి 15 టన్నులు రైతుల నుంచి సింగపూర్కు ఎక్స్పోర్టు జరిగింది. మరో రూ.200 కోట్లు విలువ గల మిర్చి, ధాన్యం, పత్తి, కందులు, శనగలు, మినుములు, పెసలు కావాలని బడా కంపెనీల నుంచి ఆర్డర్లు ఇచ్చారు. జిల్లాలో అత్యధికంగా మిర్చి, వరి, పత్తి, కందులు, శనగలు, మినుములు, జొన్న, మొక్కజొన్న, పెసర వంటి పంటలు పండుతుండడంతో వీటికి మార్కెట్ అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో.. రాష్ట్రంలోని గుంటూరు, అనంతపురం, కర్నూలు, కృష్ణా, ప్రకాశం జిల్లాలను ఈ పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. ఈ మేరకు గుంటూరు జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు ఈ–ఫారమ్ విధానాన్ని అమలు చేయడంలో మిగిలిన జిల్లాలతో పోల్చితే ముందు వరసలో ఉన్నారు. జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, జాయింట్ కలెక్టర్ దినేష్కుమార్ దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎప్పటికప్పుడు మార్కెటింగ్శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. కంట్రోల్ రూం ఏర్పాటు... ఈ విధానాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు చుట్టుగుంట సెంటర్లోని మార్కెటింగ్శాఖ కార్యాలయంలోనే ఓ కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి రైతులు తమ పేర్లు, ఉత్పత్తులను నమోదు చేసుకోవచ్చు. ఆన్లైన్ ట్రేడ్లో గుంటూరు జిల్లా ప్రథమ స్థానం... పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన జిల్లాల్లో ఈ–ఫారమ్ విధానం అమలు, ఆన్లైన్ ట్రేడింగ్లో గుంటూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా ఇప్పటికే రైతుల నుంచి నేరుగా బడా కంపెనీలు కొనుగోలు చేసి సింగపూర్కు ఎక్స్పోర్టు చేశారు. ఈ–ఫారమ్ విధానంతో రైతులకు మార్కెటింగ్, ధరల పరంగా లాభం చేకూరనుంది. –బి.రాజాబాబు, ఏడీ మార్కెటింగ్శాఖ ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం మంచిదే.. రైతుల పంట ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించి ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం శుభపరిణామం. వాణిజ్య పంటలు పండించే రైతులకు ఈ విధానం కచ్చితంగా మేలు చేస్తుంది. అయితే దేశంలోని అన్ని కంపెనీలు, వ్యాపారులను ఈ విధానంలోకి ప్రభుత్వం తీసుకురావాలి. దీంతో మధ్య దళారీ వ్యవస్థ పూర్తిగా నశించిపోతుంది. – భవనం జయరామిరెడ్డి, అభ్యుదయ రైతు -
భక్తి విత్తుగా...ఆనందం మొలకెత్తగా
పెదబయలు (అరకులోయ): మన్యంలో ఆదివాసీ గిరిజన గ్రామాల్లో నిర్వహించే పండగలు, పెళ్లిళ్లు, జీవన విధానం, ఆచార సంప్రదాయాలు చాలా ఆసక్తిగా ఉంటాయి. విశాఖ మన్యంలో ఆదివాసీ గిరిజనులు (పీవీటీజీ) తెగలకు చెందిన వారు పుష్య మాసంలో జరుపుకునే పండగల్లో ముఖ్యమైనది ‘విత్తనాల పండగ’. మిగతా వారికి సంక్రాంతి పండగ ఎంత ముఖ్యమో వీరికి ఈ పండగ అంత ముఖ్యం. తాము పండించిన పంటల్లో చోడి (రాగులు) రాజ్మా, సామలు, ధాన్యం నాలుగు రకాలతో ప్రతి ఇంటి నుంచి కొద్దికొద్దిగా సేకరించి కొంత భాగం శుంకుదేవునికి నైవేద్యంగా సమర్పించి..మరో సగం శంకుదేవుని సన్నిధిలో విత్తనాలు ఉంచి నాలుగు రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు. ఈ నాలుగు రోజులూ సందడి వాతావరణం ఉంటుంది. ప్రతి ఏడాది ఫిబ్రవరి నెల 15 తేదీలోపు పండగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ నెల 5వ తేదీ శనివారం ప్రతి ఇంటి నుంచి గ్రామ పూజారి, దీసారి, మరో ఏడుగురు గుర్మవ్లు కలిసి తొమ్మిది మంది వెదురుతో చేసిన కొత్త బుట్టలో ప్రతి ఇంటి నుంచి రాగులు, సామలు, కందులు, ధాన్యాన్ని నాలుగు రకాలను సేకరించి శంకుదేవుని సన్నిధికి చేర్చి ప్రత్యేక పూజలు చేశారు. రెండో రోజు ఆదివారం శంకుదేవుని వద్దకు డప్పు వాయిద్యాలతో తొమ్మిది మందితో గ్రామంలో అందరూ పూజలు చేశారు. అలాగే గ్రామ పొలిమేరలో పూజలు చేసి అక్కడ నుంచి మట్టి సేకరించి శంకుదేవునికి పెట్టి పూజలు చేశారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి పూజలు ప్రారంభించారు. ప్రతి ఇంటి నుంచి చిన్న వెదురు బుట్టలో బియ్యం పోసి అందులో ప్రమిద పెట్టి దీపం వెలిగించి రెండు చేతులతో దీపం కొండెక్కకుండా శంకుదేవుని వద్ద మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకొచ్చారు. దీపం మధ్యలో కొండెక్కితే అశుభంగా భావిస్తారు. ప్రతి ఇంటి నుంచి ఇలా వచ్చి సమర్పించిన తరువాత పూజారి, దీసారి, మరో ఏడుగురు గుర్మవ్లు పూజలు చేశారు. గిరిజన వాయిద్యాలు మోగగానే గుర్మవ్లు శుంకుదేవుని సన్నిధిలో నృత్యం చేశారు. శంకుదేవునికి కోడి..మేక.. పితృదేవతలకు పందిని బలిస్తారు మంగళవారం ఉదయం నుంచి పూజలు చేసిన తరువాత సాయంత్రం శంకుదేవుని కోడి, మేక బలిచ్చారు. పితృదేవతలకు పందిని బలిచ్చారు. జంతువుల రక్తాన్ని విత్తనాల్లో కలిపి, విత్తనాలు కొంత భాగం శంకుదేవుని వద్ద చిన్న గుంత తీసి పెట్టిన తరువాత మరికొంత భాగం విత్తనాలు ఇంటింటా నైవేద్యంగా పంచుతారు. వారు ఈ ఏడాది వేసే పంటల్లో వాడే విత్తనాల్లో కలుపుతారు. తరువాత బలిచ్చిన జంతువులను వండుకుని నైవేద్యంగా గ్రామస్తులు తీసుకుంటారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వారికి కూడా భోజనాలు పెడతారు. కన్నె గుర్మవ్ల నియామకం గ్రామంలో ఏడుగురు గుర్మవ్లు మహిళలే ఉంటారు. వీరు ఎక్కువగా ముసలివారే ఉంటారు. అయితే ప్రతి మూడేళ్లకు ఒకసారి కన్నె గుర్మవ్ల నియమిస్తుంటారు. గ్రామంలో పదేళ్లలోపు ఆడపిల్లను తల్లితండ్రుల అనుమతితో ఎంపిక చేస్తారు. బాలిక స్నానం చేసిన అనంతరం నూతన వస్త్రాలు ధరించిన తరువాత బావి నుంచి కన్నె గుర్మవ్ తెచ్చిన నీటిని వినియోగించి శంకుదేవునికి నైవేద్యం వండి, చెట్టుకు బోనం కుండను ఉట్టిలో ఉంచి వేలాడదీస్తారు. నాలుగు రోజుల పాటు జరిగే వేడుకల్లో కన్నె గుర్మవ్ పాల్గొంటుంది. వారు చేసే పూజలను అనుసరిస్తుంది. గ్రామాల్లో దింసా నృత్యం సందడి విత్తనాల పండగ సందర్భంగా గ్రామాల్లో మహిళలు, చిన్నపెద్ద తేడా లేకుండా దింసా నృత్యం చేయడం ఆనవాయితీ. గిరిజన డప్పు వాయిద్యాల నడుమ ఆదివాసీ గ్రామాల్లో సందడి నెలకొంటుంది. పూర్వీకుల ఆచారం ప్రకారం విత్తనాల పండగ పూర్వీకుల ఆచారం ప్రకారం విత్తనాల పండగ నిర్వహిస్తారు. పంటలు బాగా పండాలని, గ్రామంలో పశుసంపద బాగుండాలని, ప్రకృతి దేవతలకు పూజలు చేస్తాం. తాము పండించిన కొత్త పంటను శుంకుదేవుని దగ్గర ఉంచి కోడి, మేక, పందిని బలి ఇచ్చిన తరువాత ఆ రక్తాన్ని విత్తనాల్లో కలిపి శంకుదేవుని వద్దకు చిన్న గుంత తీసి విత్తనాలు వేస్తాం. మిగిలిన సగం విత్తనాలు ఇంటింటికి పంచుతాం. వారు ఈ ఏడాడి పంటకు ఉపయోగించే విత్తనాల్లో వాటిని కలిపి ఉపయోగిస్తారు. –వంతాల కళ్యాణం, గ్రామ పూజారి, కప్పాడ గ్రామం పంటలకు మేలు విత్తనాల పండగ ప్రతి ఏడాది నిర్వహిస్తాం. శంకుదేవుని సన్నిధిలో విత్తనాలు ఉంచి పూజలు చేసిన తరువాత అదే విత్తనాలు తీసుకుని నూతన పంటలకు ఉపయోగించే విత్తనాల్లో కలిపి సాగు ప్రారంభించడం ఆనవాయితీ. విత్తనాల పండగ ప్రతి కుటుంబానికి ఎంతో ముఖ్యం. గుర్మవ్గా 55 ఏళ్ల నుంచి చేస్తున్నాను. –కిల్లో లక్ష్మి, గుర్మవ్, కప్పాడ -
ఎగుమతి.. జిల్లాలకు అనుమతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు జిల్లాలను అంతర్జాతీయ ఎగుమతి హబ్లుగా కేంద్రం గుర్తించింది. కేవలం కేంద్ర, రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జిల్లా స్థాయిలోనూ పలు ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు వీలుగా ఆయా జిల్లాలను హబ్లుగా గుర్తించింది. గతంలో ఎగుమతుల వ్యవహారం మొత్తం కేంద్రమే పర్యవేక్షించేది. తాజాగా జిల్లా స్థాయిలో అట్టడుగు స్థాయిలో ఉత్పత్తి చేసిన వస్తువులు, సేవలను ప్రోత్సహించడమే ప్రధాన ఉద్దేశంగా ఈ హబ్లను గుర్తించారు. జిల్లాలు స్వయం సమృద్ధి, స్వావలంబన దిశగా ముందుకు సాగేలా ఈ ప్రక్రియకు రూపకల్పన చేశారు. ఈ మేరకు తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాల్లో వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతికి అవసరమైన నాణ్యత కలిగి ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ వ్యవసాయశాఖ అందించిన వివరాల ఆధారంగా ఎగుమతులకు అవకాశమున్న వ్యవసాయ ఉత్పత్తులను జిల్లాల వారీగా గుర్తించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. అంతర్జాతీయ నాణ్యతతో పండించాలి ఆయా ఉత్పత్తులను స్థానిక ఎగుమతిదారులు లేదా తయారీదారులు తగినంత పరిమాణంలో, అంతర్జాతీయ నాణ్యతతో పండించేలా చూడాలి. అందుకు అవసరమైన నిర్దిష్ట చర్యలు చేపట్టాలి. అంతేకాదు విదేశీ కొనుగోలుదారులకు అనుగుణంగా మార్కెట్ చేయాలి. ఆ మేరకు జిల్లా ఎగుమతి ప్రోత్సాహక కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు కొన్నిచోట్ల ఇప్పటికే ఏర్పాటయ్యాయి. కాగా ప్రతి జిల్లాలో సంబంధిత ఉత్పత్తులను ఎగుమతి చేసే వారందరి డేటాబేస్ను అభివృద్ధి చేయాలి. విదేశీ మార్కెట్ కొనుగోలుదారులను గుర్తించేందుకు జిల్లాలోని ఎగుమతిదారులకు అవకాశం కల్పించాలి. జిల్లాల్లో గుర్తించిన ఉత్పత్తులను ఎగుమతి చేయడంలో అడ్డంకులను నివారించాలి. విదేశీ మార్కెట్లకు ఎగుమతి అవకాశాలను పెంచాలి. జిల్లాల నుంచి ఉత్పత్తులు విదేశాలకు చేరుకోవడానికి ఈ–కామర్స్, డిజిటల్ మార్కెటింగ్ పద్ధతిని అవలంబించాలి. నాణ్యత పరీక్ష (టెస్టింగ్), ధ్రువీకరణ (సర్టిఫికేషన్), ప్యాకేజింగ్, కోల్డ్ చైన్ (సరైన పద్ధతిలో నిల్వ) విధానంలో రవాణా జరుగుతుంది. ప్రస్తుతం చేపట్టబోయే చర్యల వల్ల గ్రామాలు, చిన్న పట్టణాల్లో ఆర్థిక కార్యకలాపాలు మరింత వేగం పుంజుకుంటాయని కేంద్రం భావిస్తోంది. -
దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన మంత్రి వేణుగోపాల్
-
AP Special: ఈ గ్రామంలో గబ్బిలాలను రుషిపక్షులుగా పిలుస్తారు
వైఎస్సార్ జిల్లా (పులివెందుల రూరల్): ఈ చిత్రంలో మర్రి చెట్టు కొమ్మలకు వేలాడుతున్నవి కాయలు అనుకుంటే పొరపాటుపడినట్లే.. అవి కాయలు కాదండోయ్ గబ్బిలాలు. పులివెందుల మండల పరిధిలోని ఎర్రబల్లె గ్రామానికి వెళ్లే రహదారి పక్కన మర్రిచెట్టు కొమ్మలపై ఉన్న గబ్బిలాలను స్థానికులు కెమెరాతో క్లిక్మనిపించారు. వీటిని ఈ ప్రాంతంలో కీతరేవులు, రుషి పక్షులుగా పిలుస్తారు. ఇవి ఎక్కడ ఉన్నా పంటలు బాగా పండుతాయని రైతుల నమ్మకం. కీళ్ల, కాళ్ల నొప్పులు, మూర్ఛవ్యాధి తదితర వాటికి గబ్బిలాల మాంసం తింటే నయమవుతాయని ప్రజల నమ్మకం. ఈ పక్షులు రాత్రివేళల్లో ఆహారం కోసం బయటకు వెళ్లి.. పగటిపూట చెట్ల కొమ్మలకు తలకిందులుగా వేలాడుతుంటాయని స్థానికులు చెబుతున్నారు. చదవండి: పేదరికం నుంచి ...అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారిణిగా -
వరి ఏ గ్రేడ్కు మద్దతు ధర రూ.1,960
సాక్షి, హైదరాబాద్: నాణ్యతా ప్రమాణాలు పాటించి రైతులు పంటలకు మద్దతు ధర పొందాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చెప్పారు. వివిధ రకాల పంటలకు మద్దతు ధరలు ప్రకటించారు. ఇవి తక్షణం అందుబాటులోకి వస్తాయన్నారు. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలోని తన చాంబర్లో పంటల మద్దతు ధరలపై మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లను మంత్రి విడుదల చేశారు. రైతులు పంట ఉత్పత్తులను శుభ్రపరచి, ఎండబెట్టి మార్కెట్కు తీసుకురావాలని సూచించారు. వారి సౌకర్యార్థం మార్కెట్ యార్డుల్లో క్లీనర్లు, తేమ కొలిచే యంత్రాలు, ఎలక్ట్రానిక్ కాంటాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలతో ఏడేళ్లలో తెలంగాణ వ్యవసాయ స్వరూపం మారిపోయిందని చెప్పారు. వ్యవసాయ వృద్ధిరేటులో తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని, కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ ఇచ్చిన తాజా నివేదికనే దీనికి సాక్ష్యమన్నారు. పంటల ఉత్పత్తిలో ఏటా తెలంగాణ రికార్డులు తిరగరాస్తోందని, రైతు రెక్కల కష్టానికి తగిన ఫలితం రావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. పత్తిలో తేమ 8 నుండి 12 శాతం ఉండాలని, తేమ 6–7 శాతం ఉంటే సీసీఐ ద్వారా బోనస్ కూడా ఇస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, అదనపు సంచాలకులు లక్ష్మణుడు తదితరులు పాల్గొన్నారు. -
ఎక్కడెక్కడ ఏ పంటలు వేయాలి?
సాక్షి, హైదరాబాద్: యాసంగి పంటల ప్రణాళికపై ప్రభుత్వ కసరత్తు మొదలుపెట్టింది. ఎక్కడెక్కడ ఏయే పంటలు వేయాలనే దానిపై వ్యవసాయ అధికారులతో గురువారం హాకాభవన్లో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. వరికి ప్రత్యామ్నాయంగా ఏ పంటలు వేయా లనే దానిపై మంత్రి ప్రధానంగా చర్చించారు. ఎంత విస్తీర్ణంలో వేయాలి? మార్కెట్లో పంట ల డిమాండ్ ఎలా ఉంది అనే దానిపై వ్యవసాయనిపుణులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులతో మంత్రి ఆరా తీశారు. ఈ అంశాలపై సీఎం కేసీఆర్కు ఇచ్చే తుది నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కోటేశ్వర్రావు, ఉపకులపతి ప్రవీణ్రావు, ప్రత్యేక కమిషనర్ హన్మంతు, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నష్టం వచ్చినా కూడా రైతులనుండి అనేక పంటలను కొనుగోలు చేశాం : మంత్రి కన్నబాబు
-
అయ్యో పాపం..మండు వేసవిలో కూడా ఇలా..
యాదాద్రి భువనగిరి జిల్లా జగ్గన్న చెరువు కింద గల మాదాపురం ఆయకట్టు రైతులు ఏటా యాసంగి పంటనే సాగుచేస్తారు. వానాకాలం సాగుచేస్తే చెరువు నిండి పంట మునుగుతుందనేది వారి భయం. కానీ వారి అంచనాలు తప్పాయి. మండు వేసవిలోనూ పంటలు నీటమునిగాయి. కొండపోచమ్మ సాగర్ నుంచి చెరువులను నింపేందుకు తుర్కపల్లి మండలం గోపాలపురం చెరువులోకి నీటిని వదలడంతో సోమవారం చెరువు అలుగుపోసింది. అక్కడి నుంచి జగ్గన్న చెరువులోకి నీళ్లు చేరాలి. కానీ ఈ నీళ్లు వరి పంటలను ముంచెత్తుతూ చెరువులోకి వెళ్లాయి. వేసేదే ఒక్క పంట.. అదీ అనుకోని కాలంలో నీటి పాలైందని రైతులువాపోతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, యాదాద్రి భువనగిరి నీటిపాలైన వరి చేనును చూపుతున్న ఓ రైతు -
ఏనుగు వస్తే సైరన్ మోగుతుంది!
సాక్షి, పలమనేరు (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చురీ నుంచి సోలార్ ఫెన్సింగ్ను ధ్వంసం చేసి రైతుల పంటల్లోకి వస్తున్న ఏనుగుల సమస్యకు మండలంలోని మొరం గ్రామానికి చెందిన గ్రామీణ శాస్త్రవేత్త పవన్ ఓ పరికరాన్ని కనుగొన్నాడు. ఇప్పటికే ఈ ప్రాంతంలోని పలువురు రైతులు దీన్ని అమర్చుకొని ఏనుగుల బెడద నుంచి ఉపశమనం పొందారు. ఇదెలా పనిచేస్తుందంటే.. అడవికి ఆనుకుని పంటలు సాగుచేసే రైతులు చేలకు తొలుత రాతి స్తంభాలు, లేదా కర్రలతో జియో వైరును లాక్కోవాలి. పొలంలో ఓ చోట సోలార్ ప్యానల్, పవన్ తయారు చేసిన పరికరాన్ని అమర్చుతాడు. ఈ పరికరం సోలార్ సాయంతో పనిచేస్తుంది. పొలంలోని ఫెన్సింగ్ నుంచి వైర్లను గదిలో లేదా ఎక్కడైనా ఉంచిన పరికరానికి అనుసంధానం చేస్తారు. దీంతో పొలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్ను ఏనుగు టచ్ చేయగానే పరికరంలోని అలా రం గట్టిగా మోగడంతో పాటు ఎల్ఈడీ లైట్లు వెలుగుతాయి. ఫెన్సింగ్ను టచ్చేస్తే తక్కువ మోతాదుతో కరెంట్ షాక్ కొడుతుంది. ఇది రెండు సెకన్లు మాత్రమే. చదవండి: (ఏఐ రంగంలో అగ్రపథాన తెలంగాణ) దీంతో ప్రాణాపాయం ఉండదు. ఫలితంగా ఏనుగు భయపడి వెనక్కి వెళ్తుంది. ఇదే సమయంలో చుట్టుపక్కల రైతులు, ఫారెస్ట్ అధికారుల మొబైల్కు కాల్స్ ఏకకాలంలో వెళ్తాయి. రైతుల ఫోన్లకు రింగింగ్ టోన్గా ఏనుగులు వచ్చాయ్ అంటూ మోగడంతోపాటు మొబైల్ స్క్రీన్పై ఏనుగుల పిక్చర్ డిస్ప్లే అవుతుంది. దీంతో రైతులు, ఫారెస్ట్ శాఖ అప్రమత్తమవుతారు. బీట్లోని ఎలిఫెంట్ ట్రాకర్స్ అక్కడికి చేరుకొని ఏనుగులను అడవిలోకి మళ్లిస్తారు. ఫలితంగా రైతుల పంటకు రక్షణ దొరుకుతుంది. సెల్ఫోన్ సాయంతోనే దీన్ని ఆన్ ఆఫ్ చేయవచ్చు. రైతులకు అందుబాటు ధరలతో.. రైతుల పొలాల ఎకరాలను బట్టి రూ.15 వేల నుంచి రూ.30 వేలతో ఈ పరికరాన్ని తయారు చేసుకోవచ్చునని పవన్ తెలిపాడు. ఇందుకోసం 100 వోల్టుల సోలార్ ప్యానల్, ఆరు రోజులు కరెంటును నిల్వ ఉంచుకొనే 100 య్యాంప్స్ బ్యాటరీ, 12 వోల్టుల ఎనర్జలైజర్ తదితరాలను ఉపయోగించాడు. ఇప్పటికే ఈ ప్రాంతంలోని పలువురు రైతులకు అమర్చాడు. స్థానిక అటవీశాఖ అధికారులు సైతం ఈ పరికరం పనితీరును ప్రత్యక్షంగా గమనించి సంతృప్తిని వ్యక్తం చేశారు. -
జోడెద్దుల జోరు.. ఊరంతా హుషారు
వ్యవసాయం అంటే.. ట్రాక్టర్ల పరుగులు, పవర్ టిల్లర్ల ఉరుకులు, కోత యంత్రాల సందడే కనిపిస్తాయి. దుక్కి దున్నాలన్నా.. కలుపు తీయాలన్నా.. కోత కోయాలన్నా.. ఏ పని చేయాలన్నా యంత్రాలు రావాల్సిందే. వేలకు వేలు ఖర్చు చేయాల్సిందే. కానీ.. ఆ ఊళ్లో మాత్రం మచ్చుకైనా యంత్రాలు కనిపించవు. అలాంటి మాటలూ వినిపించవు. అలాగని అదేదో మారుమూల పల్లె కాదు. అక్కడి వారికి ఆధునిక యంత్రాల వల్ల కలిగే ప్రయోజనం తెలియనిదీ కాదు. పోనీ.. ఆ ఊరోళ్లంతా కాడి వదిలేశారా అంటే అదీ కాదు. ఆ ఊరి రైతుల దృష్టిలో వ్యవసాయం అంటే.. కాడెద్దులు, నాగలి, సహజసిద్ధ ఎరువులు, కూలీలే. అందుకే.. ఇప్పటికీ కాడెద్దులను వదలడం లేదు. విత్తనం నాటడం నుంచి.. పంటను ఇంటికి చేర్చే వరకూ ఆ ఊళ్లో నేటికీ ఎద్దులదే ప్రధాన పాత్ర. బేస్తవారిపేట: ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలోని ఆర్.కొత్తపల్లెలో ఏ గ్రామంలో లేనంతగా కాడెద్దులు కనబడతాయి. సూర్యోదయం ముందే కాడెద్దుల మువ్వల చప్పుళ్లు.. చర్నాకోల సవ్వడులే వినిపిస్తాయి. చూడగానే వరుస కట్టిన జోడెద్దులు.. హలం పట్టిన రైతన్నలే కనిపిస్తారు. ఏ మూలకెళ్లినా నాగలితో పొలం దున్నడం, నాగలి గొర్రుతో కలుపు తీయడం.. ఆ వెనుకే పక్షుల ఒయ్యారపు నడకలు కనువిందు చేస్తాయి. ఎద్దుల మాట వినిపించినా.. ఎద్దులు కనిపించినా అన్నదాతల మోముల్లో నూతనోత్సాహం ఉట్టిపడుతుంది. 100 జతల ఎడ్లు.. 2,500 ఎకరాల్లో వ్యవసాయం ఆర్.కొత్తపల్లెలో ప్రస్తుతం 100 జతల ఎడ్లు ఉన్నాయి. 2,500 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. ఎక్కువగా మిరప, పత్తి, పప్పు శనగ పంటల్ని సాగు చేస్తున్నారు. పంట ఏదైనా కాడెద్దులతోనే సేద్యం చేయడం ఇక్కడి రైతులకు అలవాటుగా మారింది. ఇక్కడి వారు బయటి ప్రాంతాలకు వెళ్లి వ్యాపారం చేసిన సందర్భాలు లేవు. గ్రామంలో ఒక్కొక్కరికీ 6 నుంచి 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దీంతో ప్రతి ఒక్కరూ కాడెద్దులపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. కష్టమైనా.. అదే ఇష్టం ఎడ్లను పెంచడమనేది ప్రస్తుతం చాలా కష్టమైన పనిగా మారింది. అయినా ఇక్కడి రైతులు ఎంతో ఇష్టంతో వాటిని పెంచుతున్నారు. వాటికి దాణా అందించడం ఖర్చుతో కూడుకున్న పని అయినా.. వ్యవసాయంలో అవి చేసే సేవలు అంతకంటే విలువైనవని రైతులు చెబుతున్నారు. ఖర్చులతో పోల్చుకున్నా.. ఎద్దుల వినియోగం వల్ల పెట్టుబడి వ్యయం బాగా తగ్గి మంచి లాభాలొస్తాయని ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. లాభసాటి వ్యవసాయం ఎద్దుల వల్లే సాధ్యమని నిరూపిస్తున్నారు. రెండిళ్లకో ఎడ్ల జత గ్రామంలో ప్రతి రెండిళ్లలో ఒకరు ఎద్దుల్ని పెంచుతారు. పత్తి, మిరప మొక్కలు పెరిగిన తర్వాత ట్రాక్టర్తో పొలం దున్నకం చేస్తే మొక్కలు విరిగిపోతాయన్న ఉద్దేశంతో పంట పూర్తయ్యే వరకు కాడెద్దులనే ఉపయోగిస్తున్నారు. ట్రాక్టర్ ఉపయోగిస్తే పంట దిగుబడి తగ్గుతుందనే అభిప్రాయం రైతుల్లో ప్రబలంగా నాటుకుపోయింది. భూమిని దున్నడం, విత్తనం నాటడం, కలుపు తీయడం, ఎరువుల్ని వ్యవసాయ క్షేత్రాలకు తరలించడం, ధాన్యం మిర్చి వంటి పంటల్ని ఇంటికి లేదా మార్కెట్కు తరలించడం వంటి పనులన్నిటికీ అక్కడి రైతులు ఎడ్లను, ఎడ్ల బండ్లనే ఉపయోగిస్తారు. ఖర్చుల ఆదా ఇలా.. ఎద్దుల్ని పెంచడం వల్ల వ్యవసాయ ఖర్చులు చాలా వరకు ఆదా అవుతున్నాయని ఇక్కడి రైతులు స్పష్టం చేస్తున్నారు. ఉదాహరణకు ఎకరం భూమిలో పత్తి సాగు చేస్తే.. దుక్కి దున్నడం, గొర్రులు తీయడం, విత్తనాలు నాటడానికి ట్రాక్టర్ను వినియోగిస్తే రూ.5,600 ఖర్చవుతుంది. కలుపు తీతకు మరో రూ.3,500, పంట రవాణా, ఆరబెట్టడం వంటి పనులకు మరో రూ.2వేల వరకు వెచ్చించాలి. అంటే 5 నెలల పంట కాలంలో ట్రాక్టర్ను వినియోగిస్తే ఎకరానికి రూ.11 వేల వరకు వినియోగించాలి. ఎద్దులను ఉపయోగించడం వల్ల ఆ ఖర్చులేమీ ఉండవు. అంతేకాకుండా ఎద్దులతో పనులు చేయించడం వల్ల ఎకరానికి 1.5 నుంచి 2 క్వింటాళ్ల పత్తి దిగుబడి పెరుగుతుంది. పైగా ఎద్దుల నుంచి వచ్చే పేడ, అవి తినగా మిగిలే గడ్డి, చొప్ప వంటి వ్యర్థాలు 4 ట్రక్కులకు పైగా వస్తాయి. వీటిని పంటలకు సేంద్రియ ఎరువుగా వినియోగిస్తారు. దీనిని బయట కొనుగోలు చేయాలంటే రూ.12 వేల వరకు వెచ్చించాలి. రెండు ఎద్దులకు ఎండుగడ్డి కోసం ఏడాదికి రూ.20 వేలు మాత్రమే ఖర్చయినా.. వాటివల్ల వ్యవసాయ ఖర్చుల రూపంలో ఏటా కనీసం రూ.40 వేలు ఆదా అవుతుందని రైతులు చెబుతున్నారు. వాటిని సాకడం, ఆలనాపాలనా చూడటం అనేది తమకో మంచి వ్యాపకమని చెబుతున్నారు. పుట్టినప్పటి నుంచీ ఎద్దులతోనే.. నేను పుట్టినప్పటి నుంచీ ఎద్దుల సాయంతోనే సేద్యం చేయడం అలవాటు. పత్తి, మిరప పంటలకు ట్రాక్టర్ ఉపయోగిస్తే మొక్కలు విరిగిపోయి చనిపోతాయి. పప్పుశనగ విత్తనం కూడా ఎద్దులతోనే వేయడం జరుగుతుంది. ఎడ్లతో పంట సాగుచేస్తే దిగుబడి ఎక్కువగా వస్తుంది. వ్యవసాయానికి ఎడ్ల వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు. – కంకర పెద్దవెంకటరెడ్డి, రైతు ఖర్చు లేని సేద్యం ఎడ్లతోనే సాధ్యం గ్రామంలో ప్రతి కుటుంబానికి పొలం ఎక్కువగా ఉండటంతో వ్యవసాయమే జీవనాధారంగా ఉంది. పూర్వం నుంచీ ప్రతి కుటుంబానికి ఎడ్లు ఉంటున్నాయి. సేద్యం ఖర్చు లేకుండా వ్యవసాయం చేయడానికి ఎడ్లు తప్పక ఉండాల్సిన పరిస్థితి. అందుకే ఆధునిక యంత్రాలు వచ్చినా మా గ్రామంలో ఎడ్ల పెంపకాన్ని వదిలిపెట్టడం లేదు. – రెడ్డి చిన్న మల్లారెడ్డి -
విధ్వంసం: నత్తలొస్తున్నాయ్ జాగ్రత్త!
నత్తలు.. నత్తలు.. నత్తలు దండు కడుతున్నాయి.. పంటలపై దాడి చేస్తున్నాయి.. రాత్రివేళ యథేచ్ఛగా పొలాల్లో చేరిపోతున్నాయి.. మొక్క మొదళ్లలోని మృదువైన భాగాలను తినేస్తున్నాయి.. ముఖ్యంగా వివిధ రకాల కూరగాయలను ఆరగించేస్తున్నాయి.. డ్రిప్ పైపుల్లోకి దూరి నీటి సరఫరాను అడ్డుకుంటున్నాయి.. తోటల్లోకి ప్రవేశించి తీవ్రమైన నష్టం కలిగిస్తున్నాయి.. ఆరుగాలం కష్టించిన అన్నదాతకు ఫలితం దక్కకుండా చేస్తున్నాయి. నివారణకు ఏంచేయాలో తెలియక తలలు పట్టుకునే పరిస్థితి కల్పిస్తున్నాయి. పలమనేరు(చిత్తూరు జిల్లా): కూరగాయ పంటలు సాగుచేసే రైతులకు కొత్త కష్టం వచ్చిపడింది. పలమనేరు హార్టికల్చర్ డివిజన్ పరిధిలోని 32 మండలాల్లో నత్తల దండు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. టమాట, బంగాళాదుంప, బీన్సు, బీర, మిరప తదితర పంటల మొదళ్లలోని మృధువైన భాగాన్ని నత్త పురుగులు తినేస్తున్నాయి. మొక్కకు అందాల్సిన సూక్ష్మ పోషకాలు తగ్గి పంట ఎదుగుదల దెబ్బతింటోంది. మొక్కలకు రోగనిరోధక శక్తి తగ్గి ఫంగస్ కారణంగా తెగుళ్లు సోకుతున్నాయి. వీటిని ఎలా అరికట్టాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి వేళల్లో దాడి డివిజన్ పరిధిలోని పలు రకాల పంటలు ప్రస్తుతం పూత, పిందె దశలో ఉన్నాయి. గతంలో కురిసిన వర్షాలతో పంటకు ఆకు మాడు, ఫంగస్ తెగుళ్లు సోకుతున్నాయి. అన్నింటికీ మించి నత్తల సమస్య ఎక్కువగా ఉంది. పగటిపూట కనిపించని నత్తలు రాత్రి సమయాల్లో తోటల్లోకి ప్రవేశిస్తున్నాయి. డ్రిప్పులు అమర్చిన పొలాల్లో మలి్చంగ్షీట్ కిందకు చేరి మొక్క మొదళ్లను నాశనం చేస్తున్నాయి. మరోవైపు డ్రిప్పులేటర్లలోకి నత్తలు వెళ్లడంతో పైపుల్లో నీళ్లు రాకుండా బ్లాక్ అవుతున్నాయి. ఉదయం పూట ఓ తోట నుంచి మరో పొలంలోకి పాకిపోతున్నాయి. ఇవి జిగటలాంటి ద్రవాన్ని విసర్జిస్తూ వెళుతున్నట్టు రైతులు చెబుతున్నారు. గత ఏడాది రబీలో అక్టోబర్, నవంబర్లో అక్కడక్కడా కనిపించిన నత్తలు ఈ దఫా వేల సంఖ్యలో తోటలపై పడి సర్వనాశనం చేస్తున్నాయని రైతులు వెల్లడిస్తున్నారు. ఈ మండలాల్లోనే అధికం తేమ వాతావరణం కలిగిన భూముల్లో అధిక సంఖ్యలో నత్తలు చేరుతున్నాయి. కొబ్బరి చెట్ల నీడలోని పొలాలు, మామిడి తోటల్లోని అంతర పంటలు, చెరువు కింద ఆయకట్టు భూములు వీటికి ఆవాసాలుగా మారాయి. వి.కోట, బైరెడ్డిపల్లె, పలమనేరు, రామసముద్రం మండలాల్లోని బంగాళదుంప, గంగవరం, పలమనేరు, బైరెడ్డిపల్లె, వి.కోట మండలాలతోపాటు పుంగనూరు, మదనపల్లె, వాల్మీకిపురం నియోజకవర్గాల్లో సాగు చేస్తున్న టమాటా పంటకు సమస్య ఎక్కువగా ఉంది. నష్టాల బెంగలో రైతులు టమాటా ఎకరా సాగుకు రూ.60 వేలు, బంగాళాదుంపకు రూ.80 వేలు, మిరపకు రూ.30 వేలు, బీన్సుకు రూ.50 వేలు ఇతర తీగ పంటలకు ఎకరానికి రూ.30 నుంచి రూ.40 వేల దాకా పెట్టుబడి పెడుతున్నట్టు రైతులు చెబుతున్నారు. ఈ తరుణంలో నత్తల కారణంగా లక్షలాది రూపాయల్లో పంటకు నష్టం వాటిల్లే పరిస్థితి కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నత్తల సమస్య నిజమే నత్తల దాడులు నిజమే. ఈ ప్రాంతంలో ప్రస్తుతం తేమ వాతావరణం ఉంది. నత్తలనబడే స్లగ్స్ కూరగాయ పంటలకు నష్టం కలిగిస్తున్నాయి. వీటి నివారణకు డ్రిప్పుల్లోగానీ నేరుగా కానీ క్లోరిఫైరిపాస్, కాఫర్ఆక్సిక్లోరైడ్ను పిచికారీ చేయాలి. పొలం చుట్టూ సున్నం వేస్తే మంచిది. ఇవి అక్కడికి చేరి కొంతవరకు చనిపోతాయి. – శ్రీనివాసులురెడ్డి, ఉద్యానశాఖ అధికారి, పలమనేరు నివారణ తెలియజేయాలి ప్రస్తుతం పలు రకాల పంటలకు నత్తల సమస్య అధికంగా ఉంది. నవంబర్, డిసెంబర్లో మంచు కురుస్తుంది కాబట్టి వీటి సంచారం మరింత ఎక్కువ కావొచ్చు. అధికారులు వెంటనే స్పందించి వీటి నివారణ మార్గాలపై అవగాహన కల్పించాలి. – గోవిందరెడ్డి, ఆత్మా చైర్మన్, పలమనేరు -
మద్దతు ధరకే కొనుగోళ్లు
కనీస మద్దతు ధర కన్నా తక్కువ ధర ఉందని యాప్లో అలర్ట్ వస్తే వెంటనే చర్చించి, తగిన చర్యలు తీసుకోవాలి. పంటలకు కనీస ధరలు ఉన్నాయా? లేవా? అనే సమాచారం ప్రతిరోజూ 10,641 ఆర్బీకేల ద్వారా కచ్చితంగా రావాలి. దానిని ప్రతి రోజూ పరిశీలించాలి. కనీస మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోళ్లు జరుగుతున్నాయనే మాట రాకూడదు. ఆర్బీకేల్లో ప్రదర్శించిన పంటల కనీస మద్దతు ధరలు అమలయ్యేలా చూడాలి. ధరలు తక్కువగా ఉన్న చోట్ల జేసీలు, ఆర్బీకేల్లోని అగ్రికల్చర్ అసిస్టెంట్లతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలి. – సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కన్నా తక్కువ ధరలకు పంటల కొనుగోళ్లు జరక్కూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. పంటలు అమ్ముకోవడంలో రైతులు ఇబ్బంది పడరాదని స్పష్టం చేశారు. ఎంఎస్పీ కన్నా తక్కువ ధరలుంటే ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ప్రత్యామ్నాయ మార్కెట్ చూపాలని, లేదంటే ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పారు. అగ్రి ఇన్ఫ్రా ఫండ్ ప్రాజెక్ట్, ఈ–మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్తో పాటు సీఎం యాప్ (కాంప్రహెన్సివ్ మానిటరింగ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్) పనితీరుపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షాల కారణంగా దెబ్బతిన్న వరి, వేరుశనగ, పత్తిలాంటి పంటలను అమ్ముకోవడంలో రైతులు ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మద్దతు ధర, కొనుగోళ్లపై వ్యవసాయ శాఖ మంత్రి నేతృత్వంలో ప్రతి రోజూ సమీక్ష చేయాలని ఆదేశించారు. కొనుగోళ్లకు సంబంధించి రైతులకు 10 రోజుల్లోగా పేమెంట్ అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఖరీఫ్లో 1,09,24,524 మెట్రిక్ టన్నుల పంటలు వస్తాయని అంచనాగా ఉందని, 5,812 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ఈ సమీక్షలో సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. యుద్ధ ప్రాతిపదికన మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ల పనులు – ప్రతి ఆర్బీకే పరిధిలో మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటులో భాగంగా గోడౌన్లు, కోల్డ్ రూమ్స్, డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్, ఆక్వా ఇన్ఫ్రాస్ట్రక్చర్.. ఆర్బీకే, మండల పరిధిలో వ్యవసాయ యంత్ర పరికరాలు, ప్రొక్యూర్మెంట్ సెంటర్లు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, ఆక్వా బజార్, ప్రి ప్రాసెసింగ్ ప్లాంట్లు, ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఇ–మార్కెటింగ్ ప్లాట్ఫాం ఉంటుంది. ఇందుకు దాదాపు రూ.9,093 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. – మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. అన్ని పనులు ఏకకాలంలో యుద్ధప్రాతిపదికన ముందుకు సాగాలి. క్షేత్ర స్థాయిలో పనుల పురోగతి కనిపించాలి. – పేమెంట్ గేట్వే, సెక్యూరిటీ కూడా చాలా ముఖ్యం. బయ్యర్లు, రైతుల మధ్య పేమెంట్ల చెల్లింపు సక్రమంగా ఉండేలా పటిష్ట విధానం ఉండాలి. బయ్యర్ ఆర్డర్ చేయగానే 3–4 రోజుల్లో ఆ పంట డెలివరీ అయ్యేలా చూడాలి. పంటను అత్యంత నాణ్యమైన విధానాల్లో ప్రాసెసింగ్ చేసి, క్వాలిటీ ప్రాడక్టు ఇవ్వడంపై దృష్టి పెట్టాలి. మహిళలకు మేలు జరగాలి – రాష్ట్రంలో పాడి పరిశ్రమాభివృద్ధి, మహిళా ఆర్థికాభివృద్ధి కోసం ఉద్దేశించిన అమూల్తో అవగాహన ఒప్పందం అమలు గురించి సమీక్షిస్తూ.. వైఎస్సార్ చేయూత ద్వారా లబ్ధి పొందిన మహిళలు పోషిస్తున్న పాడి పశువుల నుంచి తప్పకుండా పాల సేకరణ జరగాలని, తద్వారా వారికి మేలు కలగాలని సీఎం ఆదేశించారు. – రైతుల నుంచి పాల సేకరణ, బల్క్ మిల్క్ యూనిట్ల ఏర్పాటు తదితర అంశాలపై అధికారులు సీఎంకు వివరించారు. మహిళలకు పాడి పశువుల పంపిణీ కొనసాగుతోందన్నారు. – నవంబర్ 25 నుంచి కొన్ని బీఎంసీల్లో.. ఒంగోలు, మదనపల్లి డెయిరీల ద్వారా కార్యకలాపాలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వీలైంతన త్వరగా అన్ని చోట్లా కార్యకలాపాలు ప్రారంభం కావాలని సీఎం ఆదేశించారు. – ఈ సమీక్షలో వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి కురసాల కన్నబాబు, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
మునిగిన పంటల్ని కాపాడుకోండిలా!
సాక్షి, అమరావతి: ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల వరి, పత్తి, మొక్కజొన్న పంటలతోపాటు అక్కడక్కడా అపరాలకు నష్టం వాటిల్లినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. రాష్ట్రంలో సుమారు 1.10 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. నీట మునిగిన పంటల్ని కాపాడుకునేందుకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సూచనలు చేశారు. నీట మునిగిన పంటల్ని 48 గంటల్లోగా కాపాడుకునే చర్యలు చేపట్టాలని సూచించారు. వరి రక్షణకు.. వరి చేలల్లో అధికంగా ఉన్న నీటిని తొలగించేందుకు బోదెలు తీయాలి. వర్షం తెరిపి ఇస్తే.. ఎకరానికి 15, 20 కిలోల యూరియా, 10 కిలోల మ్యూరేట్ పొటాష్ వేయాలి. పొడ తెగులు లక్షణాలు కనిపిస్తే హెక్సాకొనజోల్ లేదా వాలిడా మైసిన్ లేదా ప్రోపికొనజోల్ మందుల్లో ఏదో ఒక దానిని లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి 15 రోజుల తర్వాత మందు మార్చి చేనంతా తడిసేలా చల్లుకోవాలి. నారుమళ్లలో లద్దె పురుగు నివారణకు లీటరు నీటికి క్లోరిపైరిఫాస్ 2 మిల్లీలీటర్లు, డైక్లోరోవాస్ ఒక మిల్లీలీటర్ కలిపి సాయంత్రం వేళ పిచికారీ చేయాలి. ఆకు ముడత నివారణకు ఎసిఫేట్ ఒకటిన్నర గ్రాము లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. దోమపోటు నివారణకు పైమెట్రోజైన్ 0.6 గ్రాము లేదా డైనోటేప్యూరాన్ 0.5 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ను ఇథిప్రోల్తో కలిపి పిచికారీ చేయాలి. మొక్కజొన్నలో సస్యరక్షణ భూమిలో అధికంగా తేమ ఉంటే అంతర సేద్యం ద్వారా తగ్గించాలి. ఎకరానికి 25, 30 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్ వేయాలి. ఫాల్ ఆర్మీ వార్మ్ తెగులు గమనిస్తే ఎకరానికి క్లోరాంట్రనిలిప్రోల్ 60 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయెట్ 80 గ్రాములు లేదా లాంట్డా సైహలోత్రిన్ 200 మిల్లీలీటర్లను పిచికారీ చేయాలి. ఇతర పంటల రక్షణకు.. అపరాల పంటల్లో అధిక తేమ వల్ల నత్రజని అందకపోతే ఒక శాతం కేఎన్ఓ–3ని రెండుసార్లు చొప్పున 4, 5 రోజులు చల్లాలి. సూక్ష్మ పోషకాల లోపం నివారణకు జింక్ సల్ఫేట్, అన్నభేది వేయాలి. మరింత సమాచారం కోసం సమీపంలోని వ్యవసాయ శాస్త్రవేత్తలను 155251 నంబర్లో లేదా ఆర్బీకేలలోని గ్రామీణ వ్యవసాయ సహాయకులను సంప్రదించవచ్చు. పత్తిలో తెగులు నివారణకు.. పత్తి తోటల్లో తేమను తగ్గించడానికి అంతర సేద్యం చేయాలి. మొదట డీఏపీ లేదా యూరియా వేయాలి. పత్తి విత్తిన 30, 35 రోజులప్పుడు గడ్డి జాతి మొక్కల నివారణకు ఎకరానికి 400 మిల్లీలీటర్ల క్విజలోపాప్ ఇథైల్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. భూమిలో వచ్చే కుళ్లు తెగుళ్లు, బ్యాక్టీరియా మచ్చ తెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములను లేదా పౌశమైసిన్ లేదా ప్లాంటా మైసిన్ను పిచికారీ చేయాలి. పంట వేసి 90 రోజులైతే ఎకరాకు 30, 35 కిలోల యూరియా, 20, 25 కిలోల పొటాష్ వేయాలి. -
1.07 లక్షల హెక్టార్లలో పంటలు మునక
సాక్షి, అమరావతి: భారీ వర్షాలు, వరదల వల్ల పంటలు నీట మునిగి రాష్ట్ర రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో 1,07,859 హెక్టార్లలో పంటలు దెబ్బ తిన్నట్లు జిల్లాల నుంచి అందిన ప్రాథమిక అంచనాలను బట్టి తెలుస్తోంది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 47,745 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. వరి పంట కోతకు వచ్చిన దశలో నీటి పాలు కావడంతో అన్నదాతలు తల్లడిల్లుతున్నారు. వరదల వల్ల రహదారులు, భవనాల శాఖకు రూ.1,288.96 కోట్లు, జలవనరుల శాఖకు రూ.31.50 కోట్లు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ.16.13 కోట్లు, ఇంధన శాఖకు రూ. 0.20 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.38.08 కోట్లు, గ్రామీణ నీటి సరఫరా శాఖకు రూ.0.45 కోట్లు కలిపి మొత్తం రూ.1,375.32 కోట్ల మేర నష్టం వాటిల్లింది. 171 మండలాలపై ప్రభావం భారీ వర్షాలు, వరదల ప్రభావం 171 మండలాలపై పడింది. 902 గ్రామాలు ప్రభావితమయ్యాయి. 28, 927 ఇళ్లు నీట మునిగాయి. 1336 ఇళ్లు కూలిపోయాయి. వివిధ సంఘటనల్లో 14 మంది చనిపోయారు. వరదల నేపథ్యంలో ప్రభుత్వం 123 సహాయ, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాలకు చెందిన 7,853 కుటుంబాలను తరలించింది. 32,823 మందిని పునరావాస కేంద్రాలకు తరలించి భోజన సదుపాయం కల్పించింది. -
71,821 హెక్టార్లలో పంటలపై వర్ష ప్రభావం
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం వల్ల కురిసిన వర్షాల ప్రభావం 9 జిల్లాల్లో 71,821 హెక్టార్లలో పంటలపై పడింది. వైఎస్సార్ కడప, అనంతపురం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, విజయనగరం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. వరి, పత్తి, మొక్కజొన్న, మినుము పంటలపై వర్ష ప్రభావం ఉన్నట్టు గుర్తించింది. తక్షణమే నివారణ చర్యలు చేపట్టేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించింది. 54,694 హెక్టార్లలో వరి, 12,047 హెక్టార్లలో పత్తి, 1,600 హెక్టార్లలో మినుము, 969 హెక్టార్లలో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. -
యాసంగిలో ఏ ఏ పంటలేయాలి?
సాక్షి, హైదరాబాద్: యాసంగి పంటల సాగు విధానం, గ్రామాల్లోనే వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం ప్రగతిభవన్లో వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. యాసంగిలో ఏ పంట వేయాలి? ఏ పంట వేయొద్దు? ఏ పంట వేస్తే లాభం? ఏ పంట వేస్తే నష్టం? తదితర అంశాలపై విస్తృతంగా చర్చించి ఓ విధానాన్ని ఖరారు చేయనున్నారు. ‘కేంద్రం పెద్ద ఎత్తున మక్కలను దిగుమతి చేసుకుంటుండటంతో దేశంలో మక్కల కొనుగోలుపై ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మక్కల సాగుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. శనివారం జరిగే సమావేశంలో ఈ విషయంపై కూడా విస్తృతంగా చర్చ జరుగుతుంది’అని ముఖ్యమంత్రి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామాల్లోనే వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు కరోనా ముప్పు ఇంకా తొలగనందున రైతుల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పత్తులను కోనుగోలు చేయాలని సీఎం నిర్ణయించారు. ఈ కొనుగోళ్లకు సంబంధించిన ఏర్పాట్లపై కేసీఆర్ సమీక్షిస్తారు. ‘కరోనా నేపథ్యంలో గత యాసంగి పంటలను గ్రామాల్లోనే కొనుగోలు చేశారు. ఇంకా కరోనా ముప్పు తొలగలేదు అందుకే వానాకాలం పంటలను కూడా గ్రామాల్లోనే కొనుగోలు చేయాలి. 6 వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి. దీనికి అనుగుణంగా ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేయాలి. పంటల కొనుగోలు తర్వాత వీలైనంత తక్కువ సమయంలో రైతులకు డబ్బులు చెల్లించాలి. దీని కోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లను ముందుగానే చేయాలి’అని సీఎం అధికారులను ఆదేశించారు. -
కనీస మద్దతు ధరలో రాజీ పడొద్దు
రైతుల ఉత్పత్తులకు మార్కెట్లో పోటీ ఏర్పడాలి. తద్వారా రైతులకు మెరుగైన ధర రావడమే ప్రధాన లక్ష్యంగా చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం అవసరమైతే ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసి, మార్కెట్లో పోటీ ఏర్పడేలా చేస్తుంది. ఈ ఏడాది కూడా రూ.3,300 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాదని రైతులు బెంగ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. పంటలకు ముందుగానే కనీస మద్దతు ధరలు (ఎంఎస్పీ) ప్రకటిస్తామని చెప్పాం. ఆ మేరకు గురువారం (నేడు) ప్రకటించబోతున్నాం. సాక్షి, అమరావతి: ప్రభుత్వం ఖరారు చేసే కనీస మద్దతు ధర కంటే తక్కువకు రైతుల పంటలు ఎక్కడా కొనుగోలు జరగకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. వీలుంటే ఇంకా ఎక్కువ ధరకు కొనుగోలు జరిగేలా చూడాలన్నారు. రైతులకు ఏ విధంగా కూడా నష్టం జరగకూడదని, ఈ విషయంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, మద్దతు ధరలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. ► రైతులు పంటలు అమ్ముకోవడంలో ప్రభుత్వం సహాయకారిగా నిలుస్తుంది. గత ఏడాది రైతులకు కనీస గిట్టుబాటు ధర రావాలని ప్రభుత్వం దాదాపు రూ.3,200 కోట్లు కేటాయించి పలు పంటలు కొనుగోలు చేసింది. ధాన్యం కొనుగోలు కోసం మరో రూ.11,500 కోట్లు ఖర్చు చేసింది. ► ప్రభుత్వం ప్రకటించిన ధరలు రైతులకు దక్కేలా చూస్తాం. కనీస ధర లేక ఏ ఒక్క రైతు కూడా నష్టపోకూడదన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం. జనతా బజార్లు ► రైతుల ఉత్పత్తులకు గ్రామాల్లో కూడా మార్కెటింగ్ సదుపాయం కల్పించడం కోసం జనతా బజార్లు ఏర్పాటు చేస్తున్నాం. ఆ బజార్లలో తప్పనిసరిగా ఫ్రీజర్లు ఉండాలి. ► రైతుల ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ కోసం ఇప్పటికే ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న రిలయెన్స్, ఐటీసీ, పీ అండ్ జీ, హిందుస్తాన్ యూనీలీవర్ వంటి సంస్థలను కూడా జనతా బజార్లలోకి తీసుకురావాలి. వీలైనంత త్వరగా జనతా బజార్లతో పాటు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం చేసే ప్రతి పని రైతులకు మేలు చేసేలా ఉండాలి. ► ఈ సమీక్షలో మంత్రి కె.కన్నబాబు, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, మార్కెటింగ్ శాఖ కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న, ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి వై.మధుసూధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం విస్తారంగా వర్షం కురిసింది. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి కొన్నిచోట్ల రహదారులపైకి నీరు చేరి రాకపోకలు స్తంభించాయి. వాగులు, వంకలు, చెక్ డ్యాంలు పొంగిప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. ► బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. ఉభయ గోదావరి, అనంతపురం జిల్లాల్లో కుండపోతగా వర్షం కురిసింది. తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా శనివారం రాత్రి, ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. పి.గన్నవరం మండలంలో అత్యధికంగా 17.42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు ముంపులో చిక్కుకున్నాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. ► అనంతపురం జిల్లాలో కురిసిన వర్షానికి 61 మండలాల పరిధిలో 2.82 సెం.మీ సగటు వర్షపాతం నమోదైంది. ► వైఎస్సార్ జిల్లాలో ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. కర్నూలు జిల్లాలో 3.72 సెం.మీ సగటు వర్షపాతం నమోదైంది. చిత్తూరు జిల్లాలోని 57 మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షం కురిసింది. ప్రకాశం జిల్లాలో అక్కడక్కడా వర్షం పడింది. గుంటూరు జిల్లాలో చిరు జల్లులు కురిశాయి. నీటమునిగిన పంట పొలాలు విశాఖ జిల్లా గొలుగొండ మండలంలో సుమారు 100 ఎకరాల్లో వరి పూర్తిగా నీటమునిగింది. వైఎస్సార్ జిల్లాలో 412 హెక్టార్లలో వరి, వేరుశనగ, పత్తి, సజ్జ పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయాధికారులు ప్రాథమిక అంచనాలు వేశారు. అనంతలో వందల హెక్టార్లలో దెబ్బతిన్నట్లు నివేదిక తయారు చేశారు. కర్నూలు జిల్లాలో పలుచోట్ల మొక్కజొన్న, వరి తదితర పంటలకు నష్టం వాటిల్లింది. తూర్పు గోదావరిలోనూ వాగు వెంబడి ఉన్న పంట పొలాలన్నీ నీట మునిగాయి. పిడుగు పడి ఇద్దరు కూలీల దుర్మరణం.. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో పిడుగు పడి ఇద్దరు కూలీలు మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలంలో ప్రహరీ కూలి 75 గొర్రెలు, 3 మేకలు, 20 గొర్రె పిల్లలు మృత్యువాత పడ్డాయి. -
ఖరీఫ్.. సాగు బాగు
సాక్షి, అమరావతి: పుడమి తల్లికి పచ్చని తివాచీ పరిచినట్లుగా ఖరీఫ్ సాగు జోరుగా సాగుతోంది. తొలకరి పలకరించిన నాటి నుంచి కురుస్తున్న వర్షాలతో జలాశయాలు, కుంటలు, చెరువులు నిండుకుండల్లా మారడంతో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. శ్రీకాకుళం మినహా మిగతా 12 జిల్లాలలో వర్షపాతం సాధారణానికి మించి నమోదైంది. ఖరీఫ్లో సాగు విస్తీర్ణం 37.42 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటికే 30.88 లక్షల హెక్టార్లలో(83 శాతం) పంటలు సాగవుతున్నాయి. ఈనెలాఖరు వరకు గడువున్నందున ఈ ఏడాది లక్ష్యానికి మించి పంటలు సాగయ్యే అవకాశమున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. రైతుల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన సంక్షేమ చర్యలు, ముందుగానే అందిన వైఎస్సార్ రైతు భరోసా, ఆర్బీకేల ద్వారా మేలైన విత్తనాలు, ఎరువులు అందుతుండటంతో రైతన్నలు హుషారుగా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. రికార్డు స్థాయిలో నూనెగింజల సాగు.. ► ఖరీఫ్లో వరి సాధారణ సాగు లక్ష్యం 14.97 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటికే 12.20 లక్షల హెక్టార్లకు చేరింది. గతేడాది ఇదే సమయానికి 11.40 లక్షల హెక్టార్లు మాత్రమే సాగులోకి వచ్చింది. ► సజ్జ, జొన్న, రాగి, మొక్కజొన్న, చిరుధాన్యాల సాగు విస్తీర్ణం 20.76 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటివరకు 16.03 లక్షల హెక్టార్లు సాగులోకి వచ్చాయి. గతేడాది కంటే లక్ష హెక్టార్లలో సాగు పెరిగింది. ► నూనె గింజల సాగు లక్ష్యం 7.66 లక్షలహెక్టార్లు కాగా ఇప్పటికే 7.84 లక్షల హెక్టార్లకు చేరింది. 7.50 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగులో ఉంది. ► పత్తి సాగు విస్తీర్ణం 6.08 లక్షల హెక్టార్లు కాగా 5.54 లక్షల హెక్టార్లలో పత్తి విత్తనాలు వేశారు. ► మిర్చి, ఉల్లి, పసుపు సాగు ఊపందుకుంది. సీజన్ ముగిసే నాటికి లక్ష్యానికి చేరువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ► కొన్ని పంటలకు అక్కడక్కడ తెగుళ్లు సోకినట్లు గుర్తించడంతో నివారణకు గన్నవరంలోని వ్యవసాయ సమగ్ర కాల్ సెంటర్ ద్వారా రైతులకు సూచనలు అందిస్తున్నారు. నాగార్జున సాగర్ కుడి కాలువ కింద సుమారు పది లక్షల ఎకరాలలో ఈ నెలాఖరు నుంచి వరి నాట్లు వేయనున్నారు. ఎరువుల కొరత లేదు.. ‘రాష్ట్రంలో ఎరువులకు ఎలాంటి కొరత లేదు. ఖరీఫ్ సీజన్లో 11.54 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 12.01 లక్షల టన్నులు వచ్చాయి. ప్రస్తుతం 7.83 లక్షల టన్నుల నిల్వలున్నాయి. యూరియా 2.37 లక్షల టన్నులు, డీఏపీ 91వేల టన్నులు, మ్యూరేట్ పొటాషియం 74 వేల టన్నులు, ఎస్ఎస్పీ 6 వేల టన్నులు, కాంప్లెక్స్ 3.09 లక్షల టన్నులు, ఇతర ఎరువులు 6 వేల టన్నులు ఉన్నాయి. సెప్టెంబర్లో 2.71 లక్షల టన్నుల యూరియా అవసరమని ప్రణాళిక రూపొందించి కేంద్ర ఎరువులు, రసాయన శాఖ నుంచి తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం’ – హెచ్.అరుణ్కుమార్, వ్యవసాయ శాఖ కమిషనర్ వర్షపాతం ఇలా ► ఖరీఫ్ సీజన్లో కురవాల్సిన వర్షం 556 మిల్లీమీటర్లు ► ఇప్పటికి కురవాల్సిన వర్షం 412.5 మీల్లీమీటర్లు ► ఇప్పటిదాకా కురిసిన వర్షం 491.7 మిల్లీ మీటర్లు ► ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాలు మిగులు వర్షపాతంలో ఉన్నాయి. ► విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లా స్వల్ప లోటులో ఉంది. -
20 వేలకు పైగా హెక్టార్లలో పంట నష్టం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు 20 వేలకు పైగా హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. పంటలు ఎంత మేర దెబ్బ తిన్నాయో పరిశీలన చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్కుమార్ సోమవారం ‘సాక్షి’కి చెప్పారు. ప్రాథమిక అంచనా ప్రకారం పది రకాల ఆహార పంటలు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న పంటల్లో మొక్కజొన్న, పెసర పంటలు ఎక్కువగా ఉన్నాయి. ఒక్క కర్నూలు జిల్లాలో 11,968.8 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు. నెల్లూరు జిల్లాలో 205 హెక్టార్లు, పశ్చిమ గోదావరిలో 1,613.07 హెక్టార్లు, తూర్పుగోదావరిలో 2,610, కృష్ణాలో 3,715 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. గోదావరి డెల్టా ప్రాంతంలో వరి నారుమళ్లలో నీళ్లు నిలిచి ఉన్నట్టు గుర్తించారు. కృష్ణా జిల్లాలో పెసర పంట దెబ్బతింది. నష్టపోయిన పంటలకు పెట్టుబడి రాయితీ ఇచ్చేందుకు అధికారులు ఎన్యూమరేషన్ చేస్తున్నారు. -
ఆర్బీకేల నుంచే పండ్లు, విత్తనాలు, మొక్కలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) నుంచే ఉద్యాన పంటల విత్తనాలు, మొక్కలు రైతులకు సరఫరా చేసేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాల పంటల విత్తనాలు, మొక్కలు ఆర్బీకేల ద్వారా సరఫరా చేసేందుకు అనుమతి ఇవ్వాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే ఆయన వ్యవసాయ, ఉద్యాన శాఖ కమిషనర్లు, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ, ఏపీ ఆగ్రోస్, అన్ని జిల్లాల వ్యవసాయ, అనుబంధ విభాగాల్ని సంప్రదించారు. దీనికి సంబంధించిన విధివిధానాలు ఇలా ఉండనున్నాయి... ► కూరగాయల సాగులో పాల్పంచుకుంటున్న కంపెనీలతో ఆగ్రోస్ ఎండీ అవగాహన ఒప్పందం చేసుకుంటారు. ► ఆర్బీకేల నుంచి ఆర్డరు చేసిన విత్తనాలను సమీపంలోని హబ్లకు పంపి రైతులకు నేరుగా పంపిణీ అయ్యేలా చూస్తారు ► ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్లు ఆయా ప్రాంతాల్లోని రైతులకు కావాల్సిన విత్తనాలను గుర్తించి వంగడాల జాబితాలను ఆగ్రో స్కు పంపిస్తారు. ► కూరగాయలు, సుగంధ ద్రవ్యాల విత్తనాల విషయంలో స్థానిక వ్యవసాయాధికారి, ఉద్యాన అధికారులు ఆయా ప్రాంతాల్లో ఎంత మొత్తం కావాలో అంచనా వేస్తారు. ► తమ ప్రాంతాల్లోని విస్తీర్ణం ఆధారంగా గ్రామ ఉద్యాన, వ్యవసాయ సహాయకులు విత్తన అవసరాన్ని గుర్తిస్తారు. ► ఆర్డరు అందిన 48 గంటల్లోపు సరఫరా చేసేలా ఏపీ ఆగ్రోస్ చర్యలు తీసుకుంటుంది ► ప్రస్తుత నర్సరీల చట్టం ప్రకారం ఉద్యాన శాఖ అన్ని పంటల నారుమళ్లను నమోదు చేసి పర్యవేక్షిస్తుంది. ► నారుమళ్ల నాణ్యతలో లోపాలుంటే సంబంధిత సంస్థపై చర్య తీసుకుంటారు. ► రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్పీవోలు) సైతం విత్తనాల సేకరణకు ఆర్బీకేలతో కలిసి పని చేయాలి. ► ఆర్బీకేల నుంచే కూరగాయల విత్తనాలు, మిర్చి, బొప్పాయి, టిష్యూ కల్చర్ అరటి, పుచ్చ, కర్బూజ పంటల మొక్కలు, విత్తనాల పంపిణీ. ► పొలంబడి కార్యక్రమంలో ఉద్యాన శాఖ పండ్లు, కూరగాయల పంటల సాగుపై రైతులకు మెళకువలు నేర్పించి మంచి దిగుబడులు వచ్చేలా చూస్తుంది. ► పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, పూల మొక్కలను నర్సరీల నుంచి సేకరించి ఆర్బీకేల ద్వారా సరఫరా చేసేందుకు ఎవరితో కలిసి పని చేయాలో ఉద్యాన శాఖ ప్రణాళికను ఖరారు చేస్తుంది. ► ఇలా చేయడం వల్ల ఉద్యాన రైతులు నష్టపోవాల్సి ఉండదని ఉద్యాన శాఖ స్పష్టం చేస్తోంది. -
‘సూక్ష్మ’ పంటలో ఆరోగ్య మోక్షం!
సూక్ష్మ మొక్కల (మైక్రోగ్రీన్స్)ను సులువుగా ఇంటి దగ్గరే పెంచుకోవచ్చు. వీటిని దైనందిన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా తరిగిపోతున్న వనరులు, పెరుగుతున్న భూతాపం, పౌష్టికాహార లోపం వంటి సమస్యలను నివారించవచ్చునంటున్నారు ‘మేనేజ్’ శాస్త్రవేత్తలు సూక్ష్మ మొక్కలు.. 7 నుంచి 10 రోజుల మొక్కలు. కూరగాయలు, ఆకుకూరలు, చిక్కుళ్లు తదితర రకాల మొక్కలు. వీటిని 2 అంగుళాలు లేదా అంతకంటే పొడవైన తరువాత కత్తిరించి వివిధ వంటకాలలో లేదా పచ్చివైనా తినవచ్చు. చాలా సార్లు మొలకెత్తిన గింజలు, సూక్ష్మ మొక్కలకు మధ్య తేడాని గుర్తించడంలో చాలా మంది పొరపడుతుంటారు. మొలకెత్తిన గింజలను కేవలం నీరు చల్లి ఒక వస్త్రంలో మొలక కట్టి తయారు చేయవచ్చు. కానీ సూక్ష్మ మొక్కలను నీరు, టిష్యూస్ మట్టి లేదా కంపోస్టు వంటి మాధ్యమంలో పెంచడం జరుగుతుంది. మామూలుగా వంటింట్లో దొరికే వివిధ విత్తనాలను ఉపయోగించి అతి తక్కువ స్థలంలో సూక్ష్మమొక్కలను పెంచుకోవచ్చు. ♦ వీటిని తేలికగా పెంచుకోవచ్చు. సూక్ష్మ మొక్కలను రెండు ఆకుల దశలో కత్తిరించాలి. కత్తిరించిన వాటిని నీటితో శుభ్రపరిచి వంటలలో లేదా పచ్చివి అయినా తినవచ్చు. 40 రెట్లు ఎక్కువ పోషకాలు సూక్ష్మమొక్కలు చాలా పోషక విలువలు కలిగి ఉంటాయి. అన్నిరకాల మొక్కలు దాదాపుగా పొటాషియం, ఇనుము, జింక్, మెగ్నీషియం, కాపర్లను అధిక శాతం కలిగి ఉంటాయి. అంతేగాక అత్యధికంగా యాంటీ ఆక్సిడెంట్లను కూడా కలిగి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ♦ ఎదిగిన ఆకుకూరల కంటే ఈ సూక్ష్మ మొక్కలు 4 నుంచి 40 రెట్లు ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. వివిధ జంతు పరిశోనలలో శరీర బరువును, చెడు కొలస్ట్రాల్ను, కొవ్వును, ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తాయని నిరూపితమైనది. ♦ సూక్ష్మమొక్కలను తినటం ద్వారా అనేక రకాల వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఈ మొక్కలు పెద్దగా ఎదిగిన కూరగాయల మొక్కల కంటే సమానంగా, ఎక్కువగా పోషకాలను కలిగి ఉంటాయి. కావున వీటిని తక్కువ మోతాదులో తీసుకున్నప్పటికీ ఎక్కువగా పోషకాలను పొందవచ్చు. పెంపకానికి కావలసినవి విత్తనాలు: అన్ని రకాల కూరగాయల విత్తనాలను ఉపయోగించుకొని సూక్ష్మ మొక్కలుగా పెంచుకోవచ్చు. ఉదాహరణకు బీట్రూట్, ముల్లంగి, ఆవాలు, తోటకూర, అవిసెలు, పెసర్లు మొదలగునవి. మిశ్రమాన్ని బట్టి రుచి సాధారణ మట్టిని ఉపయోగించి పెంచడమే కాకుండా, బలమైన మట్టి మిశ్రమం, కొబ్బరిపొట్టు, నీరు, టిష్యూస్ ఉపయోగించి కూడా పెంచుకోవచ్చు. మనం ఉపయోగించే మిశ్రమాన్ని బట్టి సూక్ష్మ మొక్కల రుచి, పోషకాలు ఆధారపడి ఉంటాయి. ట్రే / ప్లేట్లు ఈ సూక్ష్మ మొక్కలు పెంచడానికి చిన్న ట్రేలు లేదా ప్లేట్లు కావాలి. ఇవి వారం నుంచి పది రోజుల్లో కత్తిరించి వాడుకోవచ్చు. కాబట్టి ఇంట్లో ఉన్న పాత్రలను కూడా వాడుకోవచ్చు. నీరు: స్ప్రే బాటిల్ను ఉపయోగించి నీటిని చల్లాలి. సూక్ష్మ మొక్కలను పెంచే విధానం ♦ హైదరాబాద్లోని జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ (మేనేజ్), జాతీయ పోషకాహార సంస్థతో కలిసి ఈ సూక్ష్మ మొక్కలపై అధ్యయనం చేస్తున్నారు. సూక్ష్మమొక్కలు 7–14 రోజుల వ్యవధిలో కత్తిరించడానికి సిద్ధమవుతాయి. వాటిలోని పోషక విలువలు అవి పెరిగే మాధ్యమంపై ఆధారపడి ఉంటాయి. ♦ బలమైన మట్టిమిశ్రమం: దీనిలో మట్టి, వర్మీ కంపోస్టును 1:1 శాతంగా లేదా సమపాళ్లలో కలుపుకొని ఒక ట్రేలో తీసుకొని దానిపైన విత్తనాలను చల్లుకోవాలి. పైన మళ్లీ కొంత మిశ్రమాన్ని చల్లాలి. తరువాత నీటిని స్ప్రేయర్తో మెల్లగా చల్లుకోవాలి. 2 నుంచి 3 రోజుల్లో మొలకెత్తుతాయి. కొబ్బరి పొట్టు: ఒక ట్రేలో కొబ్బరి పొట్టును రెండు నుంచి మూడు అంగుళాల ఎత్తులో పరుచుకొని ఆ పైన విత్తనాలు చల్లుకోవాలి. విత్తనాలు కనపడకుండా మరోమారు కొబ్బరిపొట్టును ఒక పొరలాగా వేసుకొని నీరు చల్లుకోవాలి. ఈ ట్రేను రెండు రోజుల వరకు మూతతో కప్పి ఉంచి తరువాత రెండు రోజులు ఎండ తగిలేలా ఆరుబయట ఉంచాలి. టిష్యూస్: ముఖానికి ఉపయోగించే టిష్యూ పేపర్లను ఉపయోగించి కూడా సూక్ష్మ మొక్కలను పెంచుకోవచ్చు. ఒక ట్రేను తీసుకొని టిష్యూలను పరిచి దానిపైన నీటిని చల్లాలి. విత్తనాలను చల్లుకొని తరువాత మరలా కొద్దిగా నీటిని చల్లాలి. ఈ టిష్యూస్ తడి ఆరిపోకుండా ఎప్పుడూ కొంత నీరు చల్లుతూ ఉండాలి. విత్తనాలు వేసిన ట్రేలో తేమ ఆవిరైపోకుండా ఉండటానికి మరొక ట్రేతో కప్పి ఉంచాలి. హైడ్రోపోనిక్స్: ఒక ట్రేని తీసుకొని నీటితో నింపుకొని దానిపైన వేరొక జాలీ ట్రేని అమర్చి విత్తనాలు చల్లుకోవాలి. కింద ట్రేలో ఉన్న నీరు పైన పెట్టిన జాలీ ట్రేకి తాకే విధంగా చూసుకోవాలి. సూక్ష్మ మొక్కలను పెంచుకొనే విధానంలో దశలు 1. ముందుగా విత్తనాలను శుద్ధి పరుచుకొని పెద్ద సైజు కలిగిన వాటిని తొందరగా మొలకెత్తడం కోసం గోరువెచ్చని నీటిలో కొన్ని గంటలు లేదా ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. 2. మొలకలు వేయడానికి కావలసిన పాత్రలు లేదా ట్రేలు, మట్టి మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి. మట్టి మిశ్రమాన్ని 2 నుంచి 3 సెం.మీ.లు లేదా ట్రేకి 3/4వ భాగం వరకు నింపుకోవాలి. 3. విత్తనాలను మెల్లిగా సమాంతరంగా చల్లుకోవాలి. తరువాత స్ప్రే బాటిల్తో నీటిని చల్లుకొని మళ్లీ ఒక పొర పలుచగా మట్టిని కప్పుకోవాలి. మట్టిమిశ్రమం ఎండిపోకుండా రోజూ చూసుకుంటూ ఉండాలి. ఎక్కువగా నీరు పోయటం వలన విత్తనాలు కుళ్లిపోయే అవకాశం ఉంటుంది. 4. విత్తనాల నుంచి మెలకలు 2.5 నుంచి 10 సెంటీమీటర్లు ఎత్తు ఎదిగిన తరువాత వాటిని నెమ్మదిగా కాండం నుంచి పైకి కత్తిరించి రోజు ఆహారంలో వాడుకోవాలి. (ఇంకా ఉంది)– డా. వినీత కుమారి (83672 87287),డెప్యూటీ డైరెక్టర్ (జెండర్ స్టడీస్),మేనేజ్, హైదరాబాద్. -
ఇదిగో పంటల పటం
సాక్షి, హైదరాబాద్ : నూతన వ్యవసాయ విధానం ప్రకారం.. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పంటల వారీగా సాగుచేయాల్సిన విస్తీర్ణాన్ని వ్యవసాయ, మార్కెటింగ్, ఉద్యాన శాఖలు ఖరారు చేశాయి. జిల్లాల వారీగా 2019 వానాకాలంలో పంటల వారీగా సాగు విస్తీర్ణం గణాంకాలను దృష్టిలో పెట్టుకుని 2020 వానాకాలా నికి సంబంధించి పంటల చిత్రపటం (క్రాప్ మ్యాపిం గ్)ను రూపొందించాయి. గతేడాది వానాకాలం, యాసంగి కలుపుకుని రాష్ట్రంలో 1.23 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగుచేయగా, కాళేశ్వరం ప్రాజెక్టు జలాల రాకతో అదనంగా మరో 10లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో 2020 వానాకాలం, యాసంగి కలుపుకుని 1.33 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉంది. ఈ గణాంకాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాలు, పంటల వారీగా వానా కాలంలో సాగు విస్తీర్ణాన్ని ఖరారు చేశారు. సాగులో సం‘పత్తి’ తెలంగాణ రాష్ట్రంలో సాగవుతున్న నాణ్యమైన పత్తికి అంతర్జాతీయంగా డిమాండ్ ఉండటంతో ఆ పంటసాగు విస్తీర్ణం పెంచాలని నిర్ణయించారు. గతేడాది రాష్ట్రంలో 53లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా, ఈ ఏడాది 70లక్షల ఎకరాలకు పెంచాలని సీఎం ఆదేశించారు. దీంతో తాజాగా రూపొందించిన పంటల ప్రణాళిక మేరకు రాష్ట్రంలో అదనంగా 10.24లక్షల ఎకరాల్లో రైతులు పత్తిని సాగుచేయాల్సి ఉంటుంది. మక్క.. వద్దు పక్కా పొరుగు రాష్ట్రాల్లో మొక్కజొన్నలు తక్కువ ధరకే దొరుకుతుండటంతో రాష్ట్రంలో సాగవుతున్న మక్కలకు కనీస మద్దతుధర లభించట్లేదు. కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఏడాది క్వింటాలుకు రూ.1,760 చెల్లించి మక్కలను కొనుగోలు చేసింది. అయితే రాష్ట్రంలో 25లక్షల టన్నులకు మించి మక్కల వినియోగం లేకపోవడంతో వానాకాలంలో మొక్కజొన్న సాగు చేయొద్దని సీఎం ఖరాకండీగా చెప్పారు. గతేడాది రాష్ట్రంలో 10.11లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగయ్యింది. ప్రస్తుతం రూపొందించిన పంటల చిత్రపటంలో ఈ పంటకు చోటు దక్కలేదు. కంది.. సాగు దండి గతేడాది రాష్ట్రంలో 7.38లక్షల ఎకరాల్లో కంది సాగైంది. పంటల చిత్రపటం రూపకల్పనలో భాగంగా మొక్కజొన్నకు బదులు కంది సాగు విస్తీర్ణం పెంచాలని నిర్ణయించారు. తెలంగాణలో పప్పుధాన్యాల వినియోగం 11.7లక్షల టన్నులు కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 5.6 లక్షల టన్నుల పప్పుధాన్యాలు మాత్రమే దిగుబడి అవుతున్నాయి. ఈ లోటు భర్తీకి 6.1లక్షల టన్నుల మేర పప్పులను రాష్ట్రం దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కందితో పాటు మినుములు, పెసలు సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచుతూ కార్యాచరణ ఖరారు చేశారు. క్రాప్ మ్యాపింగ్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 6.70లక్షల ఎకరాల్లో కంది, 45వేలకుపైగా ఎకరాల్లో పెసలు, 28వేల ఎకరాల్లో మినుములు సాగు చేయాల్సి ఉంటుంది. వరి..సరిసరి గతేడాది వానాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా 41.19లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. వరి ధాన్యం దిగుబడిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తూ ధాన్యాగారంగా మారింది. ఈ ఏడాది ఎఫ్సీఐ సేకరించిన ధాన్యంలో సుమారు మూడోవంతు రాష్ట్రం నుంచి దిగుబడి వచ్చినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కాళేశ్వరం జలాలు కూడా అందుబాటులోకి వస్తుండటంతో వరిసాగు విస్తీర్ణం భారీగా పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో సాగునీటి వసతి ఉన్నచోట కూడా పత్తి సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించడంతో వరిసాగు విస్తీర్ణంలో భారీగా కోత పడనుంది. దీంతో పంటల చిత్రపటం ప్రకారం సుమారు 95వేలకుపైగా ఎకరాల్లో వరిసాగును తగ్గించాలని నిర్ణయించారు. ఆముదం.. ప్రధానం ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న ఆముదం నూనెలో భారత్ నుంచే 90శాతం వస్తుండగా, తర్వాత స్థానాల్లో బ్రెజిల్, చైనా ఉన్నాయి. దేశంలో గుజరాత్లోనే అత్యధికంగా 75శాతం మేర ఆముదం సాగు చేస్తున్నారు. తెలంగాణలో ప్రధానంగా మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో ఆముదం సాగుచేస్తుండగా, నూతన వ్యవసాయ విధానంలో భాగంగా ఈ సాగు విస్తీర్ణాన్ని భారీగా పెంచాలని నిర్ణయించారు. దీంతో కొత్తగా 73వేలకు పైగా ఎకరాల్లో ఆముదం సాగుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. వేరుశనగ బాగు.. సోయా తగ్గు నూనె గింజలకు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని వేరుశనగను కూడా 17వేలకు పైగా ఎకరాల్లో అదనంగా సాగు చేస్తారు. ఆముదం, వేరుశనగ సాగు విస్తీర్ణాలను పెంచుతూనే సోయా సాగు విస్తీర్ణాన్ని 1.74లక్షల ఎకరాల మేర కుదించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. గతేడాది 4.28లక్షల ఎకరాల్లో సోయా సాగుచేయగా, ప్రస్తుత వానాకాలంలో సుమారు 3లక్షల ఎకరాలకే పరిమితం కానుంది. పసుపు, ఉల్లి కుదింపు.. జొన్న కాదిక మిన్న ►గతేడాది 34వేల ఎకరాల్లో ఉల్లి సాగుచేయగా 3.40లక్షల మెట్రిక్ టన్నుల మేర దిగుబడి వచ్చింది. పంటల చిత్రపటం ప్రకారం ఈ ఏడాది వానాకాలంలో ఉల్లి సాగు విస్తీర్ణాన్ని 24వేల ఎకరాలకుపైగా తగ్గించాలని నిర్ణయించారు. ►పసుపు 1.33లక్షల ఎకరాల్లో సాగు చేయగా 2.81లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. తాజా ప్రణాళికలో భాగంగా ఈ పంట సాగు విస్తీర్ణాన్ని 8,700పైగా ఎకరాలకు కుదిస్తారు. ►ఆదిలాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో ఎక్కువగా సాగవుతున్న జొన్న పంట విస్తీర్ణాన్ని మొత్తంగా 5వేల ఎకరాల మేర తగ్గించాలని పంటల చిత్రపటంలో పేర్కొన్నారు. వరి సాగు విస్తీర్ణంలో టాప్ జిల్లాలు నల్లగొండ 3,30,000 ( ఎకరాలు) సూర్యాపేట 3,20,000 నిజామాబాద్ 3,00,000 పత్తి సాగు విస్తీర్ణంలో టాప్ జిల్లాలు నల్లగొండ 7,25,000(ఎకరాల్లో) నాగర్కర్నూలు 4,50,000 ఆదిలాబాద్ 4,35,088 కంది సాగు విస్తీర్ణంలో టాప్ జిల్లాలు వికారాబాద్ 1,73,900 (ఎకరాల్లో) నారాయణపేట 1,70,000 రంగారెడ్డి 1,00,000 సోయాబీన్ సాగు విస్తీర్ణంలో టాప్ జిల్లాలు నిర్మల్ 60,000( ఎకరాల్లో) కామారెడ్డి 50,000 సంగారెడ్డి 46,473 జొన్న సాగు విస్తీర్ణంలో టాప్ జిల్లాలు మహబూబ్నగర్ 41,500(ఎకరాల్లో) రంగారెడ్డి 22,000 నారాయణపేట 15,000 మినుములు సాగు విస్తీర్ణంలో టాప్ జిల్లాలు సంగారెడ్డి 22,000 (ఎకరాల్లో) కామారెడ్డి 10,000 వికారాబాద్ 9,500 ఆముదం సాగు విస్తీర్ణంలో టాప్ జిల్లాలు మహబూబ్నగర్ 40,530(ఎకరాల్లో) నారాయణపేట 36,000 వనపర్తి 25,050 వేరుశనగ సాగు విస్తీర్ణంలో టాప్ జిల్లాలు గద్వాల 20,000 (ఎకరాల్లో) వరంగల్ రూరల్ 8,500 వనపర్తి 4,500 చెరుకు సాగు విస్తీర్ణంలో టాప్ జిల్లాలు సంగారెడ్డి 34,200(ఎకరాల్లో) కామారెడ్డి 12,061 వికారాబాద్ 6,508 పెసలు సాగు విస్తీర్ణంలో టాప్ జిల్లాలు సంగారెడ్డి 48,000(ఎకరాల్లో) ఖమ్మం 22,000 వికారాబాద్ 20,800 పసుపు సాగు విస్తీర్ణంలో టాప్ జిల్లాలు నిజామాబాద్ 37,350 (ఎకరాల్లో) జగిత్యాల 32,240 నిర్మల్ 20,050 ఉల్లి సాగు విస్తీర్ణంలో టాప్ జిల్లాలు గద్వాల 7,599(ఎకరాల్లో) వనపర్తి 810 మెదక్ 578 -
మిడతల దాడితో తీవ్ర పంటనష్టం
-
మిడతల దండు.. పోలీస్ సైరన్లు!
-
పొలాల వెంట మోగుతోన్న పోలీస్ సైరన్లు
భోపాల్ : కరోనాతో వణికిపోతున్న భారత్కు రాకాసి మిడతల దండు కొత్త తలనొప్పిగా మారింది. తూర్పు ఆఫ్రికా దేశాల నుంచి గుంపులు గుంపులుగా ఖండాలు దాటి వస్తూ పంటలను స్వాహా చేస్తున్నాయి. మన దేశంలోకి ప్రవేశించిన ఈ దండు ఇప్పటికే రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్లలో పంటను నమిలేస్తూ అటు రైతులకు, ఇటు ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వీటిని పారదోలేందుకు డీజేలు పెడుతూ పెద్ద శబ్ధాలు చేస్తూ పంటను కాపాకునేందుకు రైతులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్లోని పన్నా టైగర్ రిజర్వ్ ప్రాంతంలో చెట్లు, పంటలను దాడి చేస్తున్న దండును పారదోలేందుకు పోలీస్ జీపుల సైరన్లను ఉపయోగించారు. (రాష్ట్రంపైకి మిడతల దండు?) పొలాల వెంబడి పోలీస్ జీపులను నడుపుతూ పెద్ద శబ్ధంలో సైరన్లను మోగిస్తూ వాటిని నియంత్రించేందుకు కృషి చేస్తున్నారు ఈ విషయం గురించి పన్నాకు చెందిన వ్యవసాయ అధికారి సుమన్ మాట్లాడుతూ.. "మిడతల దండు నుంచి పంటలను కాపాడేందుకు ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. భారీ శబ్ధాలు లేదా క్రిమిసంహారక మందులు పిచికారీ చేయడం ద్వారా రాకాసి దండు బారి నుంచి పంటను కాపాడుకోవచ్చ"ని సలహా ఇచ్చారు. కాగా భారత్లో మిడతల దండు ప్రవేశించిన రాష్ట్రాల్లో నివారణా చర్యలు చేపడుతున్నామని కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. (వణికిస్తున్న రాకాసి మిడతలు: రైతులు గజగజ) -
ఈ-క్రాపింగ్ ద్వారా పంట రుణాలు
-
ఆ పంటలనే రైతు సాగు చేయాలి : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : రైతుల ఆలోచనలో నిర్మాణాత్మకమైన మార్పులు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎవరిష్టం వచ్చినట్లు పంటలు వేసి మార్కెట్కు తీసుకురావొద్దన్నారు. ప్రభుత్వం సూచించిన పంటలనే రైతులు సాగుచేయాలని కోరారు. పంట మార్పిడి, క్రాప్ కాలనీల ఏర్పాటుపై వ్యవసాయ శాఖ అధికారులతో ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ మంగళవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నియంత్రిత పద్దతిలో పంటలు సాగుచేయాలన్నారు. ఎవరిష్టం వచ్చినట్లు వారు పంటలు వేసి మార్కెట్కు తీసుకొస్తే ఎవరూ కొనరని, డిమాండ్ ఉన్న పంటలే సాగు చేయాలని సూచించారు. ఏ పంటలు వేస్తే రైతులు లాభపడతారో ప్రభుత్వమే చెబుతుందన్నారు. విత్తనాలు కూడా ప్రభుత్వం నిర్ణయించిన పంటలకు మాత్రమే అమ్మాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తెలంగాణలో కొత్తగా సీడ్ రెగ్యులేటింగ్ అథారిటీ ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. ఈ విషయాలపై మే 15న అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. -
గ్రామాల్లోనే పంటల సేకరణకు సిద్ధంగా ఉండాలి
సాక్షి, అమరావతి: గ్రామస్థాయిలోనే పంటల సేకరణకు ఆయా శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. జిల్లాల్లో వ్యవసాయం.. దాని అనుబంధ రంగాలను ఒక జేసీకి అప్పగించాలన్నారు. అలాగే, ప్రతీరోజూ వ్యవసాయ రంగం పరిస్థితులను సమీక్షించాలని సూచించారు. మార్కెట్ ఇంటెలిజెన్స్ యాప్పై మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. ► గతంలో సీఎం సూచనల మేరకు మార్కెట్ ఇంటెలిజెన్స్ యాప్లో మార్పులు చేర్పులు చేసిన అధికారులు దాని పనితీరు గురించి వైఎస్ జగన్కు వివరించారు. ► ఈ యాప్కు కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ (సీఎం ఏపీపీ) గా నామకరణం చేశారు. ► జిల్లాల్లో వ్యవసాయం, అనుబంధ రంగాలు చూస్తున్న జేసీలు అందరికీ ఈ యాప్పైన అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. ► పంటల సేకరణ విధానాల్లో ఏమైనా లోపాలుంటే వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఫుల్స్టాప్ పెట్టాలని వైఎస్ జగన్ స్పష్టంచేశారు. ► ఈ నెల 30న రైతుభరోసా కేంద్రాలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. కాగా, సమీక్షా సమావేశంలో ఏపీ వ్యవసాయ మిషన్ వైస్చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
యాసంగి పంటకు రందిలేదు. పుష్కలమైన నీటితో సిరులు పండాయి. ఈ సారి దశ తిరిగినట్లే అని సంతోషపడుతున్న తరుణంలో అకాల వర్షం అన్నదాత నెత్తిన పిడుగై పడింది. తెగుళ్లకు, పెట్టుబడులకు ఓర్చి చేలోంచి కల్లాల్లోకి తీసుకొచ్చిన ధాన్యం వరణుడి పాలైంది. జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షంతో చాలా చోట్ల వరిధాన్యం నీటిపాలైంది. అసలే దిగుబడి అంతంతే ఉన్న మామిడి మరోసారి దెబ్బతింది. పంటకోసి నెలరోజులైనా కరోనా నేపథ్యంలో ట్రాన్స్పోర్టులేక కల్లాల్లోనే ఉన్న మిర్చిపంట వర్షపునీటికి తడిసింది. ధర్మారం, పాలకుర్తి మండలాల్లో వర్షం పంటలపై ప్రభావం చూపగా.. మిగితా చోట్ల పాక్షికంగా ధాన్యం నీటిపాలైంది. పెద్దపల్లిరూరల్/సుల్తానాబాద్రూరల్/ఎలిగేడు: పెద్దపల్లి నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో ఓ మోస్తరుగా, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. పెద్దపల్లి మండలంలోని బొంపల్లి, ముత్తారం, గౌరెడ్డిపేట ప్రాంతాల్లో ధాన్యం రాశులు తడిసిపోయాయి. టోకెన్లు ఇచ్చిన తర్వాతే తేవాలని చెబుతున్నా రైతులు కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారని ఐకేపీ, సహకార అధికారులు పేర్కొంటున్నారు. అక్కడక్కడా మొక్కజొన్న పంటకూడా వర్షానికి తడిసింది. సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి, చిన్నబొంకూర్, కనుకుల, తొగర్రాయి, దేవునిపల్లిలో కురిసిన వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. ఎలిగేడు మండలంలోని లోకపేట, ధూళికట్ట, ఎలిగేడు, నర్సాపూర్, శివుపల్లి, బుర్హాన్మియాపేట గ్రామాల్లో ధాన్యం తడిసిపోయింది. మండలంలో 11.8మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జూలపల్లి మండలంలోని పెద్దాపూర్, చీమలపేట,తేలుకుంట, అబ్బాపూర్ గ్రామాల్లో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. పాలకుర్తి, ధర్మారంలో భారీ వర్షం.. పాలకుర్తి/ధర్మారం: పాలకుర్తి మండల పరిధిలోని గ్రామాల్లో ఆదివారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం గంటపాటు కురిసింది. ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం కుప్పలు తడిశాయి. పాలకుర్తి ఐకేపీకేంద్రంలో టార్ఫాలిన్లు లేకపోవడంతో సంచులన్నీ తడిసిపోయాయి. బసంత్నగర్, పాలకుర్తి, ఈసాలతక్కళ్లపల్లి, మారేడుపల్లి, ముంజంపల్లి, ఉండేడ, పుట్నూర్, రామారావుపల్లి, జయ్యారం, గుడిపల్లి గ్రామాల్లో తడిసిన ధాన్యాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ధర్మారం మండలవ్యాప్తంగా 13.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మండలవ్యాప్తంగా ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. కోతకు వచ్చిన పొలాల్లో వరి నేలవాలింది. మామిడి పంటకు సైతం తీవ్రనష్టం ఏర్పడిందని రైతులు వాపోయారు. అకాల వర్షానికి నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని జెడ్పీ మాజీ చైర్మన్ లక్ష్మ ణ్కుమార్ డిమాండ్ చేశారు. మంథని: మంథని నియోజకవర్గం పరిధిలో ఆదివారం వేకువజామున తేలికపాటి వర్షంకురిసింది. మంథని మండలంలోని నాగేపల్లి, అడవిసోమన్పల్లి, ఆరెంద,వెంకటాపూర్ గ్రామాల్లో ధాన్యం తడిసింది. కమాన్పూర్, రామగిరి మండలాల్లోనూ కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో రైతులు పోసిన ధాన్యం పాక్షికంగా తడిసిపోయింది. మంథని మండలంలోని పలు గ్రామాల్లో మిర్చి పంటకూడా తడిసిపోయింది. -
'పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొంటది'
సాక్షి, హైదరాబాద్ : ‘గతంలో ఎప్పుడో ఓల్డ్ సిటీలో కర్ఫ్యూ చూసినం. యావత్ దేశమే ఈ రోజు కర్ఫ్యూలో ఉంది. రైలు, విమానం, ట్యాక్సీ లేదు. ఈ పరిస్థితుల్లో రైతులు ఆందోళనకు గురికావద్దు. మీరు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొంటది’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు హామీ ఇచ్చారు. తనకు కూడా 20 ఎకరాల పంట ఉందని, కోసి అమ్ముకోవాలని తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణకు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పంట దిగుబడుల కొనుగోళ్లకు తీసుకుంటున్న చర్యలను శుక్రవారం ఆయన ప్రగతి భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ‘54లక్షల ఎకరాల్లో పంట ఉంది. పండ్లు, కూరగాయలు అన్నీ కలిపితే లక్షా 20 వేల ఎకరాలుంటయి. 54 లక్షల ఎకరాల్లో పంటల నూర్పిడి జరగాలి. మన దగ్గర అవసరమైన హార్వెస్టర్లున్నాయి. రైతులు ఆందోళన పడకుండా పంటలు అమ్ముకోవాలి. పట్టణాల్లోని వ్యవసాయ మార్కెట్లకు రానియ్యరు. వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ సిబ్బంది గ్రామాల్లోనే ఉంటరు. నేటి నుంచి జిల్లా కలెక్టర్లు దీనిపైనే దృష్టిపెడతరు. ఏప్రిల్ మొత్తం ధాన్యం కొంటరు. ఊళ్లకే హమాలీవాళ్లు వచ్చి బస్తాలు, కాంటాలు తెస్తరు. డీసీఎంలు, లారీలు చేరుస్తరు. రైతుబంధు సమితిలు ప్రతి ఊరిలో మీ ఊరికి కథానాయకులు కావాలి. ఎంపీటీసీలు, సర్పంచ్లు కూడా రైతులకు అవగాహన కల్పించాలి. మక్కలు, వరి ధాన్యం, ఇతర పంటలను ప్రభుత్వమే కొంటది. వారి ఖాతాల్లో చెక్కులు వేస్తది. పంట తెచ్చేటప్పుడు పాస్బుక్ కాపీ, ఖాతా నంబర్ తేండి. మీకు నెల రోజుల్లో డబ్బులు విడుదలవుతాయి. గత్తర బిత్తర కావాల్సిన అవసరం లేదు. ధాన్యం కొనుగోళ్లకు మాకు రూ.35వేల కోట్లు కావాలి. ఆర్బీఐతో మాట్లాడుతున్నం. కరోనా వ్యాప్తి చెందకుండా ఊళ్లకు కంచెలు వేసుకోవడం ఒక విధంగా మంచిది అయితే మరో విధంగా సమస్యగా మారింది. గ్రామానికి ధాన్యం కొనుగోలు చేసేందుకు హమాలీలు, సిబ్బంది రావాలి.. అంబులెన్సులు రావాలి.. కాబట్టి కంచెను కొంత వరకు తొలగించండి’అని సీఎం కోరారు. ఏప్రిల్ 10 వరకు సాగునీరు, కరెంట్ ‘50లక్షల పైచిలుకు ఎకరాల్లో పంటలు నోరు తెరుచుకుని రెడీగా ఉన్నయి. ఆ పంటల నూర్పిడి జరిగితేనే మన నోటికి అన్నం అందుతది. ఎస్సారెస్పీ, కాళేశ్వరం, నాగార్జునసాగర్, జూరాల, దేవాదుల, కల్వకుర్తి కింద ఎట్టి పరిస్థితుల్లో ఆన్ ఆఫ్ పద్ధతిలో ఏప్రిల్ 10 వరకు నీళ్లు ఇవ్వాలని ఆదేశించాం. ఒక ఎకరం పంట కూడా ఎండొద్దు. ఆన్ ఆఫ్ పద్ధతిలోనైనా సరే చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలి. బోరు బావులకు ఏప్రిల్ 10 వరకు కరెంట్ అందించాలి. పంటలకు నిరంతర విద్యుత్ ఇచ్చి కాపాడాలని జెన్కో, ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావు వారి సిబ్బందిని కోరినందుకు ధన్యవాదాలు. మరో 15 రోజులు పంటలకు 24 గంటల విద్యుత్ అందించాలి. ఆ తర్వాత విద్యుత్ లోడ్ రెండు మూడువేల మెగావాట్లు తగ్గిపోయి ఒత్తిడి తగ్గుతుంది. విద్యుత్ సిబ్బంది సేవనందిస్తున్నారు’అని సీఎం ప్రశంసించారు. పాఠశాలల్లోనూ ధాన్యం నిల్వ.. ‘38 లక్షల ఎకరాల్లో ధాన్యం వస్తున్నది. చరిత్రలో తొలిసారిగా. వ్యవసాయ, మార్కెటింగ్, వేర్హౌసింగ్ కార్పొరేషన్ల గోదాముల్లో పెడ్తరు. 24లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో కొత్త గోదాములు కట్టుకున్నం. అవన్నీ సరిపోకపోతే గ్రామాల్లోని ప్రాథమిక, జిల్లా పరిషత్, జూనియర్ కళాశాలలను తాత్కాలికంగా గోదాములుగా వాడుకుంటాం. వ్యాపారులు కొంటామంటే తప్పనిసరిగా కనీస మద్దతు ధర చెల్లించాలి. ఆదివారం సాయంత్రం 5 గంటలకు జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ధాన్యం కొనుగోళ్లపై దిశానిర్దేశం చేస్తా’అని కేసీఆర్ తెలిపారు. -
అక్రమాలు జరిగితే ఏజెన్సీని మార్చేస్తాం
సాక్షి, అమరావతి: పంటల కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు జరిగితే సేకరణ ఏజెన్సీని మార్చేస్తామని మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రద్యుమ్న తేల్చిచెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు మోసపోకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆయన మంగళవారం మార్కెటింగ్ శాఖ అధికారులు, సేకరణ ఏజెన్సీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పత్తి, కందుల కొనుగోలు కేంద్రాల్లో జరిగిన అక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, పత్తి కొనుగోలు కేంద్రాలన్నింటిపై ఏసీబీ విచారణకు ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో కందుల సేకరణ ఏజెన్సీ అయిన జిల్లా కో–ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీని ఆ బాధ్యత నుంచి తప్పించామని చెప్పారు. అవకతవకలకు పాల్పడ్డ ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మద్దతు ధరలు ప్రకటించిన 22 రకాల పంటలను 216 మార్కెట్ యార్డులు, 150 సబ్ యార్డుల్లో కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు. పంటల సేకరణ ఏజెన్సీలు ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. మార్గదర్శకాలు - రైతుల వారీగా యార్డుల్లోని ఇన్గేట్, ఔట్గేట్ల వద్ద పంటలను నమోదు చేయాలి. రైతుల నుంచే పంటలను సేకరించాలి. - సేకరణ కేంద్రానికి రైతులు తప్పనిసరిగా రావాలి. అలా రాకపోతే పంటను తీసుకోరు. - రైతు పట్టాదారు పాస్పుస్తకం, బ్యాంకు పాస్పుస్తకం, కౌలుదారీ పత్రం, ఈ–క్రాప్ నమోదు వివరాలు తీసుకురావాలి. - ప్రభుత్వం సూచించిన పరిమాణానికి మించి పంటను రైతుల నుంచి ఏజెన్సీలు తీసుకోకూడదు. - పంటల నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేయాలి. - మార్గదర్శకాలను ఉల్లంఘించిన కేంద్రాల్లో పంటల సేకరణను నిలిపివేసే అధికారం మార్కెటింగ్ శాఖ కార్యదర్శికి ఉంటుంది. -
ఏనుగుల విధ్వంసకాండ
బంగారుపాళెం/చంద్రగిరి/గుడిపాల : జిల్లాలో ఏనుగులు రైతులను బెంబేలెత్తిస్తున్నాయి. పంట పొలాలపై వరుస దాడులు చేస్తుండడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. బంగారుపాళెం మండలం కీరమంద గ్రామంలో మంగళవారం రాత్రి పంట పొలాలపై ఏనుగులు విధ్వంసకాండ సృష్టించాయి. పూలదడి వంక సమీపంలో గల అటవీ ప్రాంతం నుంచి రెండు ఏనుగులు మహిళా రైతు కొండమ్మ పొలంలోకి ప్రవేశించి, బోరుపైపు, స్టార్టర్ను ధ్వంసం చేశా యి. విషయం తెలుసుకున్న ఆమె కుమారుడు నరేష్, గ్రామానికి చెందిన రైతులు బాల, మునిరత్నం రాత్రి 3 గంటలకు మోటారు బైక్పై అక్కడికి వెళ్లారు. మనుషుల రాకను గుర్తించిన ఏనుగులు వారిపై దాడికి దిగాయి. భయాందోళనకు గురైన నరేష్, బాల మునిరత్నం గ్రామంలోకి పరుగులు తీశారు. ఈ క్రమంలో నరేష్ కిందపడడంతో దెబ్బలు తగిలాయి. మోటారు సైకిల్ను ఏనుగులు తొండంతో విసిరివేయడంతో పక్కనే ఉన్న నీళ్లు లేని బావిలో పడింది. అక్కడి నుంచి దేవరగుట్టకు వెళ్లిన ఏనుగులు శ్రీనివాసులుకు చెందిన గుడిసెను ధ్వంసం చేశాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. తర్వాత నాగరాజ గుడిసె వైపునకు వెళ్లి పాడి ఆవులపై దాడి చేశాయి. ఆవుల అరుపులు విని నాగరాజ భార్య దేవమ్మ బయటకు వచ్చింది. ఏనుగులు చేసి ఆమె భయంతో వణికిపోయింది. పశువులు కట్లు తెంపుకుని పొలాల వైపు పరుగులు తీయ డంతో వాటి వెనుకే ఏనుగులు వెళ్లిపోయాయని దేవమ్మ పేర్కొంది. వారం రోజులుగా ఏనుగులు మండలంలోని పాలమాకులపల్లె, శేషాపురం గ్రామాల్లో పంటలను ధ్వంసం చేస్తున్నట్లు రైతులు తెలిపారు. గుడిపాలలో 10 ఎకరాల్లో పంట నష్టం గుడిపాల మండలంలో మంగళవారం రాత్రి ఏనుగులు పంట పొలాలపై దాడి చేశాయి. అరటి తోట మూడు ఎకరాలు, చెరుకు పంట ఎకరా, పచ్చిగడ్డి ఎకరా, వరి పంట రెండు ఎకరాలు, మామిడి చెట్లు 40 దాకా దెబ్బతిన్నా యి. ఉలవపంటనూ నాశనం చేశాయి. ముత్తువాళ్లూరు గ్రామానికి చెందిన చంద్రశేఖర్నాయుడు అరటితోటలో 300 చెట్లను ధ్వంసం చేశాయి. వీసీ ఖండిగ గ్రామానికి చెందిన కోకిల అనే మహిళా రైతుకు చెందిన 50 సెంట్ల భూమిలో చెరుకు పంట ధ్వంసమైంది. బట్టువాళ్లూరు గ్రామంలో కమలాకర్ అనే రైతుకు చెందిన రెండు ఎకరాల వరిపంటను పూర్తిగా ధ్వంసం చేశాయి. రెండు గుంపులుగా విడిపోయిన ఏనుగులు గుడిపాల మండలంలోని వెప్పాలమానుచేను, చిత్తపార అటవీ ప్రాంతంలో 14 ఏను గులు సంచరిస్తున్నాయని, మంగళవారం రాత్రి రెండుగా విడిపోవడంతో పంటలన్నింటినీ చాలావరకు ధ్వంసం చేశాయని రైతులు తెలిపారు. అధికారులు స్పందించి పంటలను కాపాడాలని కోరుతున్నారు. కట్టడి చేయకపోతే ఆత్మహత్యే శరణ్యం నమస్కారం సార్... మాది శ్రీనివాసమంగాపురం. నేను ఏ.రంగంపేట సమీపంలో రెండెకరాల భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటున్నాను. రూ.60వేలు ఖర్చుపెట్టి ఎకరాలో వరి పంట వేశాను. ఏనుగులు వచ్చి పంటను నాశనం చేశాయి. రేయి కావిలి కాస్తా ఉంటే కూడా ఏనుగులు వస్తా ఉండాయి. అదే పనిగా ఫారెస్టు ఆఫీసు కాడికి పోయి వాళ్లకు చెప్పినా వాళ్లు తిరిగి మళ్లి కూడా చూడలేదు సార్. దయచేసి మాకు ఏదైనా నష్ట పరిహారం ఇవ్వండి సార్.. నేనేదో కూలి చేసుకునే వాడిని.. దయచేసి జీవాలను కట్టడి చేయండి సార్.. లేకుంటే నేను సచ్చిపోతా..మడికాడే ఉరేసుకుని సచ్చిపోతాను సార్.. అంటూ ఏనుగుల దాడిలో పంట నష్టపోయిన కౌలు రైతు కన్నయ్య తన ఆవేదనను సోషల్ మీడియా ద్వారా వెళ్లగక్కాడు. -
ముంచుతున్న మూషికం!
రెండో పంటకు నీరివ్వడం.. తెగుళ్ల బెడద తక్కువగా ఉండడంతో రబీలో దిగుబడి ఆశాజనకంగా ఉంటుందని రైతులు నమ్మకంతో ఉన్నారు. కానీ వారి ఆశలపై మూషికాలు నీళ్లు చల్లుతున్నాయి. సాధారణంగా వర్షాకాలంలో పంటలపై ఎక్కువగా దాడి చేసే ఎలుకలు రబీలో కూడా విజృంభిస్తున్నాయి. ఏపుగా పెరిగిన అపరాలతో పాటు వరిపంటను కూడా దెబ్బతీస్తున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను ఎలుకల నుంచి కాపాడుకునేందుకు అన్నదాతలు నానాతంటాలు పడుతున్నారు. సాక్షి, మచిలీపట్నం: ఖరీఫ్లోనే కాదు.. రబీలో కూడా మూషికాలు అన్నదాతలను వణికిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి రబీలో తెగుళ్ల బెడద పెద్దగా లేకున్నప్పటికీ ఎలుకల బెడద మాత్రం చాలా ఎక్కువగా ఉంది. జిల్లాలో రబీ సాధారణ విస్తీర్ణం 5,01,481 ఎకరాలు కాగా, దాంట్లో ఇప్పటివరకు 4,77,959 ఎకరాల్లో పంటలు పడ్డాయి. బోర్ల కింద ఈసారి 63,450 ఎకరాల్లో వరి సాగవ్వాల్సి ఉండగా, ఈసారి రెండో పంటకు నీరివ్వడంతో కనీసం లక్షన్నరవేల ఎకరాలకు పైగా సాగవుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 90వేల ఎకరాల్లో రెండో పంట సాగైంది. ఇక మిగిలిన పంటల విషయానికి వస్తే 38,318 ఎకరాల్లో మొక్కజొన్న, 6,593 ఎకరాల్లో శనగలు, 12,645 ఎకరాల్లో పెసలు, 3,10,528 ఎకరాల్లో మినుములు సాగయ్యాయి. రబీలో వరితో పాటు మినుము, పెసలు, శనగలు, మొక్కజొన్న పంటలపై ఎలుకల ప్రభావం ఎక్కువగా ఉంది. తినేది తక్కువే అయినా.. ఎలుకలు తినేది తక్కువ.. నష్టం చేసేది ఎక్కువ. సాధారణంగా ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా పంటలను నాశనం చేసే ఎలుకలు ఈసారి రబీలో కూడా తమ ప్రతాపాన్ని చూపుతున్నాయి. అపరాలు, వరికి ఎలుకలు చేసే నష్టం అపారంగా ఉంటోంది. ఊడ్పులు, పిలకలు, పొట్ట దశలో పంటను కోసుకుంటూ పోతున్నాయి. తద్వారా ఎకరాకు 3 నుంచి 4 బస్తాల దిగుబడిపై ప్రభావం చూపుతోంది. ఎలుకల దాడి నుంచి పంటను రక్షించుకునేందుకు రైతులు నానాపాట్లు పడుతున్నారు. బందరు, అవనిగడ్డ, కోడూరు, మోపిదేవి, మొవ్వ, నాగాయలంక, చల్లపల్లి, ఘంటసాల, పామర్రు గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను, కైకలూరు, నాగాయలంక తదితర పాంతాల్లో ఎలుకుల బెడద ఎక్కువగానే కనిపిస్తుంది. ఎకరాకు రెండున్నరవేలకు పైగా భారం ఎలుకల నిర్మూలనకు రైతులు సంప్రదాయ పద్ధతులనే పాటిస్తున్నారు. బొరియల్లో పొగబెట్టడం, బుట్టలు వాడటం, పురుగు మందులు వినియోగించడం ద్వారా నివారణా చర్యలు చేపడుతున్నారు. కొన్నిచోట్ల ఎలుకులను పట్టే వారికి రప్పించి వాటిని మట్టుబెట్టేందుకు యత్నిస్తున్నారు. ఒక్కో దానికి రూ.15ల నుంచి రూ.20లు, కళ్లుతెరవని పిల్లలైతే మూడింటికి రూ.20లు చొప్పున తీసుకుంటున్నారు. ఎలుకల ఉధృతిని బట్టి పూత దశ నుంచి కాయ దశ వరకు రెండు నుంచి నాలుగుసార్లు ఎలుకలు బుట్టలు పెట్టాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. దుబ్బులను కొరికివేయడంతో పంటకు నష్టం వాటిల్లి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం ఎలుకల నిర్మూలనకు ఎకరాకు సుమారు రూ.రెండున్నర వేలకు పైగా రైతులపై ఆర్థిక భారం పడుతోంది. నివారణ ఇలా.. బ్రోమో డయోలిన్ను 0.25 శాతం పొడి మందును ఎర పదార్థాలతో కలిపి పేపరుతో 10 గ్రాముల పొట్లాలుగా కట్టి ఎలుకుల కన్నాల్లో వేయాలి. దీన్ని తింటే నాలుగు రోజుల తర్వాత ఎలుక చని పోతుంది. బ్రోమోడయోలిన్ మందును ప్రభుత్వం అందిస్తుంది. దానిలో కలిపేందుకు అవసరమ య్యే నూకలు, ఆయిల్ను పంచాయతీ అధికారులు సమకూర్చుతున్నారు. ఆయా అవకాశాలను సద్వినియోగం చేసుకుని రైతులు ఎలుకల సమస్య నుంచి బయటపడాలని అధికారులు సూచిస్తు న్నారు. రైతులు సామూహికంగా ఎలుకల నివారణను చేపడితే పూర్తిస్థాయిలో వాటి సమస్యను పరిష్కరించవచ్చు. దీనిపై పొలంబడి, ఇతర కార్యక్రమాల ద్వారా అన్నదాతలకు వ్యవసాయశాఖాధికారులు అవగాహన కల్పిస్తున్నారు. -
పంటలకు పరపతి...పెరిగిన రుణపరిమితి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సాగయ్యే వరి విత్తనోత్పత్తికి, శ్రీ వరి, కంది, శనగ, పెసర, మినుము, ఆయిల్ ఫామ్, టమాట, వంకాయ కూరగాయల పంటలకు రుణ పరిమితి (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) పెరిగింది. వరి విత్తనోత్పత్తికి ఎకరాకు రూ.45 వేలు, శ్రీ వరికి రూ. 36 వేలు, కందికి రూ. 18 వేలకు రుణ పరిమితి పెంచుతూ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) నిర్ణయించింది. ఈసారి కొత్తగా డ్రాగన్స్ ఫ్రూట్స్ సాగుకు రూ. 4.25 లక్షలు ఖరారు చేసింది.ఇక సేంద్రీయ కూరగాయల సాగుకు ఎకరానికి రూ.40 వేలు ఇవ్వాలంది. రాష్ట్రంలో పండించే దాదాపు 120 రకాల పంటలకు 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఎంతెంత రుణాలు ఇవ్వాలన్న దానిపై ‘టెస్కాబ్’భారీ కసరత్తు చేసింది. ఈ నివేదికను రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ)కి పంపించింది. ఈసారి కొన్ని పంటలకు మాత్రమే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెరిగింది. ఇలా మినుములు ఎకరాకు రూ. 14 వేల నుంచి రూ. 16 వేలకు, పెసరకు రూ. 13 వేల నుంచి రూ. 16 వేలకు, శనగకు రూ. 20 వేల నుంచి రూ. 22 వేల వరకు రుణ పరిమితి విధించారు. ఆయిల్పామ్కు రూ. 35 వేల నుంచి రూ. 38 వేలు ఉంది. ఆర్గానిక్ పద్ధతిలో పండించే కూరగాయలు సహా కంది, పెసర, మినుము సాగు చేసే రైతులకు ప్రత్యేకంగా రుణాలు ఇస్తారు. సేంద్రియ సాగు చేసే కంది, మినుములు, పెసర్లకు ఎకరానికి రూ. 17 వేల నుంచి రూ. 20 వేలు వంతున ఖరారు చేసింది.ఈ తరహా కూరగాయలు సాగు చేసే రైతులకు ఎకరానికి రూ.37 వేల నుంచి రూ. 40 వేలు ఇవ్వాలంది.దీంతో ఈసారి ఆర్గానిక్ పంటలు, కూరగాయల సాగు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు.టమాటకు కూడా ఈసారి రుణపరిమితి పెంచారు.సాగునీటి కింద వేసే టమాటాకు రూ.40 వేల నుంచి రూ. 45 వేలు ఇవ్వాలని నిర్ణయించారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది ఎకరాకు రూ.30 వేల నుంచి రూ. 35 వేల వరకు ఉంది.వంకాయ (విత్ మల్చింగ్కు) ఎకరాకు రూ. 40 వేల నుంచి రూ.45 వేలు రుణ పరిమితి ఖరారు చేశారు. పత్తికి రూ. 38 వేల వరకు... తెలంగాణలో అత్యధికంగా సాగు చేసే వరికి 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఎకరానికి రూ. 34 వేల నుంచి రూ. 38 వేలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఖరారు చేశారు. వరి విత్తనోత్పత్తి రైతులకు రూ.42 వేల నుంచి రూ. 45 వేలు ఖరారు చేశారు.పత్తికి రూ. 35 వేల నుంచి రూ. 38 వేలు చేశారు. సాగునీటి వసతి కలిగిన ఏరియాలో మొక్కజొన్నకు రూ. 25 వేల నుంచి రూ. 28 వేలు నిర్ధారించారు. నీటి వసతి లేని ప్రాంతాల్లో రూ. 20 వేల నుంచి రూ. 23 వేలు ఇస్తారు. సాధారణ పద్ధతిలో పండించే కందికి సాగునీటి వసతి ప్రాంతాల్లో రూ.17 వేల నుంచి రూ. 20 వేలు చేశారు. ఇక కంది విత్తనోత్పత్తి చేసే రైతులకు రూ.22 వేల నుంచి రూ. 27 వేలు చేశారు. సోయాబీన్కు రూ. 22 వేల నుంచి రూ. 24 వేలు ఇస్తారు. సోయా విత్తనోత్పత్తి రైతులకు రూ. 28 వేల నుంచి రూ. 31 వేల వరకు ఇస్తారు.మెడికల్, ఎరోమాటిక్ ప్లాంట్స్కు రూ. 35 వేల నుంచి రూ. 40 వేలు, రూఫ్ గార్డెన్కు దశల వారీగా తొలిసారి రూ. 9 వేల నుంచి రూ. 10 వేలు, రెండో దశలో రూ.18 వేల నుంచి రూ. 20 వేలు, మూడో దశలో రూ. 27 వేల నుంచి రూ. 30 వేలు ఇస్తారు.ఇక డ్రాగన్ ఫ్రూట్ తర్వాత అత్యధికంగా విత్తనరహిత ద్రాక్షకు రూ.1.2 లక్షల నుంచి రూ.1.25 లక్షల రుణం ఇవ్వనున్నారు. ఇప్పటివరకు ఉన్న ధరను మార్చలేదు. దాంతోపాటు పత్తి విత్తనాన్ని సాగు చేస్తే రూ.1.1 లక్షల నుంచి రూ.1.4 లక్షలకు ఖరారు చేశారు. పసుపు సాగుకు రూ. 60 వేల నుంచి రూ. 68 వేలు చేశారు. క్యాప్సికంకు రూ.30 వేల నుంచి రూ.40 వేలు ఖరారు చేశారు. ఉల్లిగడ్డకు రూ.30 వేల నుంచి రూ.35 వేలు, పుచ్చకాయకు రూ.25 వేల నుంచి రూ.27 వేలకు పెంచారు. -
భ్రమరావతిగా మార్చారు
అనంతపురం: ‘పదిమందికీ అన్నం పెట్టే రాయలసీమ ప్రాంత రైతులు తీవ్ర కరువుతో ఇతర రాష్ట్రాలకు వెళ్లి భిక్షాటన చేస్తున్నారు. ఎంతోమంది రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఏనాడూ వారి కోసం జోలె పట్టని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం వేలాది ఎకరాలు కొన్న తమ జాతి నాయకులు, బినామీల భూములకు మంచి ధర రావాలనే ఉద్దేశంతో రాజధానిని అమరావతిలోనే నిర్మించాలంటూ భిక్షాటన చేయడం సిగ్గు చేటు’ అని వక్తలు మండిపడ్డారు. ‘లక్ష కోట్ల రాజధాని వద్దు–సాగునీటి ప్రాజెక్టులే ముద్దు’ అనే నినాదంతో జిల్లాలోని రైతులంతా శుక్రవారం అనంతపురంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. స్థానిక టవర్ క్లాక్ కూడలి నుంచి సప్తగిరి సర్కిల్ వరకు వేలాదిమంది రైతులు ప్రదర్శనగా తరలి వెళ్లారు. అక్కడ వైఎస్సార్సీపీ అనంతపురం పార్లమెంటరీ అధ్యక్షుడు నదీంఅహ్మద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి శంకరనారాయణ, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, డాక్టర్ సిద్ధారెడ్డి, దుద్దుకుంట శ్రీధర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతి ప్రాంతంలో చంద్రబాబు, ఆయన బినామీలు భూములు కొని అక్కడ రాజధాని ఏర్పాటు చేశారన్నారు. బంగారు పంటలు పండుతున్న భూముల్ని రైతుల నుంచి బలవంతంగా లాక్కున్నారని, రూ.లక్ష కోట్ల పెట్టుబడితో ప్రపంచస్థాయి రాజధానిని నిర్మిస్తామని, ఎకరం రూ.20 కోట్లు ధర పలికేలా చేస్తామని నమ్మించారన్నారు. చివరకు అవేమీ చేయకుండా అమరావతిని భ్రమరావతిగా మార్చారన్నారు. ఆరోజు భ్రమ కల్పించారు కాబట్టే తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు కృత్రిమ ఉద్యమాలను సృష్టిస్తూ ప్రభుత్వంపై ఆ ప్రాంత రైతులను ఉసిగొల్పుతున్నారన్నారు. 13 జిల్లాల ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం పాలన వికేంద్రీకరణకు పూనుకుందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు అన్ని ప్రాంతాల ప్రజలు అండగా నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు. -
విషం పండిస్తున్నామా...?
జిల్లాలో పంటలు విస్తారంగా పండిస్తున్నారు. వాటి దిగుబడి పెరగడానికి లక్షలాది బస్తాల రసాయనిక ఎరువులు కుమ్మరిస్తున్నారు. తెగుళ్లు ఆశించకుండా ఇబ్బడి ముబ్బడిగా పురుగుమందులు స్ప్రే చేస్తున్నారు. ఇలా పండించే పంట కాస్తా విషతుల్యం చేస్తున్నారు. సేంద్రియంపై ఎంతగా అవగాహన కల్పిస్తున్నా... ఎందుకో మారలేకపోతున్నారు. విజయనగరం ఫోర్ట్: రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం పెరుగుతోంది. సేంద్రియ ఎరువుల వాడకం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ రైతులు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించడం లేదు. సాగువిస్తీర్ణానికి సరి సమాన స్థాయిలో రసాయనిక ఎరువులు, పురుగుమందులు వినియోగిస్తున్నారు. చిన్న సమస్యకూ రసాయనిక మందులే విరుగుడుగా భావిస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు కాస్త ఆలస్యంగా పడటం వల్ల కొన్ని ప్రాంతాల్లో నాట్లు ఆలస్యంగా వేశారు. దీనివల్ల పంట ఎదుగుదల కోసం రైతులు ఎరువులను అధికంగా వినియోగించారు. పంటలకు తెగుళ్లు ఆశించడంతో పురుగుమందులను అధికంగా వినియోగించారు. ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లాలో లక్ష 90 వేల హెక్టార్లలో వరి, మొక్కజొన్న, వేరుశనగ, చెరకు తదితర పంటలు సాగు చేశారు. వాటికి 12.39 లక్షల బస్తాల ఎరువులను రైతులు వినియోగించారు. అంతేగాదు... 1.60 లక్షల లీటర్ల పురుగుమందులను వాడారు. తెగుళ్ల నివారణకు పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణం, వేప కషాయం, వేపనూనె వంటి వాటితో తక్కువ ఖర్చుతో నివారించవచ్చు. కాని చాలా మంది రైతులు అవగాహన లేక రసాయనిక ఎరువులు, పురుగు మందులనే వినియోగిస్తున్నారు. రైతులు పంట దిగుబడి పెంచేందుకు పోటీపడి నారుమడి నుంచి పంటకోత దశ వరకు ఎకరానికి 4 నుంచి 5 బస్తాల వరకు రసాయనిక ఎరువులు, 2 లీటర్ల వరకు పురుగు మందులు వాడుతున్నారు. ఇలా మొత్తం ఎరువులు, పురుగుమందులకోసం దాదాపు రూ.150 కోట్లు వరకు వెచ్చించారు. సేంద్రియంపై పెరగని ఆసక్తి.. రైతాంగంలో ఒకప్పుడు ఉండే సహనం... ఆసక్తి ఇప్పుడు సన్నగిల్లుతోంది. ఒకప్పుడు పూర్తిగా గెత్తం వంటివాటికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవా రు. కానీ సునాయాసంగా మార్కెట్లో లభ్యమ య్యే ఎరువులను కొనుగోలు చేసి వేసేస్తున్నారు. తక్కువ ఖర్చుతో తయారయ్యే సేంద్రియ ఎరువులుగానీ... తెగుళ్ల నివారణకోసం తయారయ్యే ద్రావణాల జోలికి పోవడం లేదు. దీనికి కాస్తంత శ్రమపడాల్సి రావడమే కారణం. వాస్తవానికి ర సాయనిక ఎరువుల వినియోగంవల్ల ఏడాదికేడాదికీ భూసారం తగ్గిపోతోంది. దిగుబడిపై దాని ప్రభావం చూపుతోంది. అయినా రైతాంగం మా త్రం రసాయనికంపైనే ఆసక్తి కనబరుస్తున్నారు. సేంద్రియమే మేలు.. పంటలకు ఆశించే తెగుళ్లు, పురుగులను సేంద్రియ ఎరువుల ద్వారా కూడ నివారించవచ్చు. ప్రకృతిలో దొరికే వేపగింజలతో చేసే వేపకషాయం, పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణం, వేపనూనె తయారీకి అతి తక్కువ ఖర్చు వుతుంది. వీటిని వినియోగించి తెగుళ్లను సమర్థంగా నివారించవచ్చు. వర్మీకంపోస్టు, అజొల్లా వంటివి వేసి కూడా పంటలను పండించవచ్చు. దీనివల్ల పంటలు ఆరోగ్యకరంగా ఉంటాయి. వాటి ఉత్పత్తులకు మంచి డి మాండ్ ఉంటుంది. – టి.ఎస్.ఎస్.కె.పాత్రో, వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి -
వనాలు తరిగి జనాలపైకి..
వీరఘట్టం: శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రైతులకు శాపంగా మారిన ఏనుగుల గుంపు సంచారం వెనుక మానవ తప్పిదాలు వెలుగు చూస్తున్నాయి. వాటి ఆవాసాలపై అక్రమార్కులు దాడులు చేస్తే అవి ప్రతిదాడులు చేస్తున్నాయి. దట్టమైన అడవుల్లో జరుగుతున్న మైనింగ్ కారణంగానే మూగ జీవాలు అభయారణ్యం నుంచి జనారణ్యంలోకి వస్తున్నాయి. ఇప్పుడు బీభత్సం సృష్టిస్తున్న ఏనుగులు గుంపుకు తోడు మరో గుంపు జిల్లా అడవుల్లోకి వచ్చే అవకాశం ఉందని అంచనా ఉండడంతో అటవీ ప్రాంత ప్రజల్లో ఆందోళన మొదలైంది. శ్రీకాకుళం జిల్లాలో అటవీ విస్తీర్ణం 616 చదరపు కి.మీ. ఈ అటవీ విస్తీర్ణంలో 70,350 హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి. వాస్తవానికి భూభాగంలో 33 శాతం అడవులు ఉంటే అక్కడ సంచరించే వన్యప్రాణులకు, ప్రకృతి సంపదతోపాటు మానవాళి మనుగడకు ఎటువంటి ముప్పు ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే మన జిల్లాలో మాత్రం అడవులు కేవలం 10 శాతం మాత్రమే ఉన్నాయి. అంటే వన్యప్రాణులు ఉండేందుకు సరైన ఆవాసాలు జిల్లా అడవుల్లో లేవని గణాంకాలు చెబుతున్నాయి. దీంతో 11 ఏళ్లలో రెండు గుంపులుగా వచ్చిన ఏనుగులు అడవుల్లో ఉండలేక జనారణ్యంలోకి వస్తూ పంటలు నాశనం చేస్తున్నాయి. ఇదీ పరిస్ధితి... మన జిల్లాకు పక్కనే అతి సమీపంలో ఒడిశా రాష్ట్రంలోని లఖేరీ అటవీ ప్రాంతంలో అభయారణ్యం ఉంది. ఈ అభయారణ్యంలో వందల సంఖ్యలో ఏనుగుల గుంపులు ఉన్నట్లు గణాం కాలు చెబుతున్నాయి. ఈ అభయారణ్యం చు ట్టూ విలువైన గ్రానైట్ నిక్షేపాలు కూడా ఉన్నా యి. ఈ గ్రానైట్ నిల్వలను కొల్లగొట్టేందుకు అక్కడ మైనింగ్ మాఫియా చేపడుతున్న బాంబ్ బ్లాస్టింగ్ల వల్ల ఏనుగుల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. చిన్న చిన్న శబ్దాలకు ఏనుగులు బెదిరిపోతాయి. బాంబు బ్లాస్టింగ్ వల్ల వచ్చే పెద్ద శబ్దాలను ఏనుగులు భరించలేవు. అందుకే భయంతో పరుగులు తీస్తున్నాయి. ఈ క్రమంలో అడ్డుగా వచ్చేవారని హతమారుస్తున్నాయి. వెంటాడుతున్న గజ భయం.. సిక్కోలు ప్రజలను గజ భయం వెంటాడుతోం ది. మరో ఏనుగుల గుంపు జిల్లాలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లు పలువురు అటవీ శా ఖ అధికారులు చెబుతున్నారు. ఒడిశా రాష్ట్రంలో ని లఖేరీ అభయారణ్యం నుంచి ఈ ఏనుగుల గుంపు విజయనగరం–శ్రీకాకుళం జిల్లాల సరి హద్దు అటవీ ప్రాంతాల గుండా ప్రవేశిస్తున్నా యి. గతంలో కూడా ఇదే ప్రాంతం నుండి వచ్చి న ఏనుగుల గుంపు ఏళ్ల తరబడి కదలకుండా తిష్టవేశాయి. ఇప్పుడు మరో గుంపు రానుందనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఏ మాత్రం గాని మరో ఏనుగుల గుంపు వస్తే ప్రజల ప్రాణాలకు ముప్పు తప్పదు. మరి ఈ పరస్ధితుల నుండి గట్టెక్కే మార్గం ఉందా అంటే సమాధానం ప్రశ్నార్ధకంగా మారింది. నిద్రావస్ధలో అటవీశాఖ.. అటవీశాఖ అధికారులు కృతనిశ్చయంతో ప్రయత్నిస్తే ప్రస్తుతం ఉన్న ఏనుగుల గుంపును తరలించవచ్చును. మరో ఏనుగుల గుంపు చొరబడకుండా చర్యలు తీసుకోవచ్చును. అయితే ఆ దిశగా ఆ శాఖ ప్రయత్నం చేస్తోందా అంటే సమాధానం చెప్పేవారే కరువయ్యారు. అయితే అటవీశాఖ అధికారులు ఏమైనా వ్యూహరచన చేస్తున్నారంటే అదీ లేదు. జిల్లాలో ఏనుగులు సంచరిస్తే ఎంతో మేలు అన్నట్లుగా ఈ శాఖ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఏనుగులను తరలించే చర్యల్లో భాగంగా పుష్కలంగా నిధులు ఖర్చు చేయవచ్చును. అడిగేవారుండరని ఏనుగులు అధికారులకు కామధేనువులుగా మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి అప్రమత్తంగా ఉన్నాం.. ఐదు రోజుల క్రితం జిల్లాలో వంగర మండలంలో ప్రవేశించిన ఏనుగుల గుంపు శనివారం వీరఘట్టం మండలం నడిమికెల్లలో ప్రవేశించి కంబర పంచాయితీలోని అరిటితోటల్లో తిష్టవేశాయి. సుమారు 15 ఎకరాల్లో అరటి తోటలు నాశనమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీటిని అటవీ ప్రాంతంలోకి తరలిస్తున్నాం. అయితే అవి వెళ్లిన వెంటనే మరలా తిరిగివచ్చేస్తున్నాయి. ఒడిశా అటవీ ప్రాంతంలో వీటి ఆవాసానికి తగిన వనరులు లేకపోవడం వల్లే అవి ఈ రెండు జిల్లాలో తిష్టవేస్తున్నాయి. జిల్లాలో మంచినీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా వృక్షసంపద కూడా ఉంది. అందుచే ఏనుగులు ఇక్కడ నుండి కదలడం లేదు. మరో ఏనుగుల గుంపు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మా సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. –విఠల్కుమార్, అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి, వీరఘట్టం -
చిరు ధాన్యాలను ప్రోత్సహించేలా ప్రణాళిక
-
గిట్టుబాటు కాలే..
సాక్షి, జడ్చర్ల(మహబూబ్నగర్) : పంటలకు కేంద్రం పెంచిన మద్దతు ధరలపై రైతులు పెదవి విరుస్తున్నారు. అరకొరగా పెంచి చేతులు దులుపుకొందని విమర్శిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలతో రైతాంగానికి కొంత ఊరట లభించినా ఆయా మద్దతు ధరలు రైతులకు ఎంతమాత్రం దక్కుతాయోనన్న ఆందోళన వ్యక్తమవుతుంది. గతంలోనూ ప్రకటించిన మద్దతు ధరలు రైతుల దరికి చేరకపోవడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. నాణ్యత పేరుతో వ్యాపారులు ప్రభుత్వ మద్దతు ధరలకు గండి కొడుతున్నారని వాపోతున్నారు. కేంద్రం నాణ్యత విషయంలో నిబంధనలను కొంత మేరకు సడలింపు చేసినట్లయితే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే సాగు ఖర్చులు కూడా పెరిగాయని, వీటితో పోలిస్తే కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలు ఎంత మాత్రం గిట్టుబాటుగా లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా విత్తనాలు, డీజిల్, ఎరువులు, పురుగు మందుల ధరలు గణనీయంగా పెరిగాయని వీటితోపాటు కూలీల ఖర్చు కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని రైతులు పేర్కొంటున్నారు. ఏ పంటకు ఎంత.. కేంద్రం 2019–20 సంవత్సర కాలానికి సంబంధించి పలు పంట ఉత్పత్తులకు మద్దతు ధరలను పెంచింది. అయితే 2018–19 ఏడాదిలో పెంచిన ధరలతో పోలిస్తే ప్రస్తుతం పెరిగిన ధరలు స్వల్పంగానే ఉన్నాయి. గతేడాది వరికి ఏకంగా క్వింటాకు రూ.200 పెంచగా.. ఈసారి నామమాత్రంగా రూ.65 పెంచింది. ఈ పెంపుతో ప్రస్తుతం క్వింటా ఏ గ్రేడు ధాన్యానికి రూ.1,770 నుంచి రూ.1,835కు మద్దతు ధర చేరింది. కాగా వరికి కనీసంగా క్వింటా ధరను రూ.2 వేలకు వరకు పెంచినా బాగుండేదని రైతులు పేర్కొంటున్నారు. అలాగే పత్తికి గతేడాది క్వింటాకు రూ.1,130 పెంచగా ఈసారి కేవలం రూ.105 మాత్రమే పెంచింది. దీంతో పత్తి మద్దతు ధర క్వింటాకు గరిష్టంగా రూ.5,550కు చేరింది. ఇక జిల్లాలో ప్రధానంగా సాగు చేసే మొక్కజొన్న పంటకు సంబంధించి క్వింటాకు రూ.60 పెంచింది. దీంతో మొక్కజొన్న గరిష్ట ధర రూ.1,760కు చేరింది. మరో ప్రధాన పంట వేరుశనగకు రూ.200 పెంచింది. దీంతో వేరుశనగ గరిష్ట ధర రూ.5,090కి చేరింది. నాణ్యతను సడలిస్తే.. కాగా పంట ఉత్పత్తుల నాణ్యత నిబంధనలను కొంత మేరకు సడలిస్తే బాగుండేదని రైతులు పేర్కొంటున్నారు. ప్రధానంగా పత్తి, వరి, మొక్కజొన్న ఉత్పత్తులకు సంబంధించి తేమ శాతం గుర్తింపులో సడలింపు ఉంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. అలాగే వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో పంట దిగుబడులకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా మద్దతు ధరలు లభించేలా సంబంధిత మార్కెటింగ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వ్యయ ప్రయాసాలకోర్చి పండించిన పంట దిగుబడులను మార్కెట్కు తీసుకువస్తే మద్దతు ధర దక్కడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ దిక్కు వివిధ కారణాలతో పంట దిగుబడులు తగ్తుండగా.. మద్దతు ధర కూడా దక్కకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం సైతం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరలను రైతులకు అందించేలా కృషి చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. రైతుకు మేలు జరగాలి రైతులకు మేలు జరిగే విధంగా ప్రభుత్వ మద్దతు ధరలు ఉండాలి. ప్రతి ఏటా సాగు వ్యయం పెరుగుతూ వస్తుంది. అందుకు తగ్గట్టుగానే మద్దతు ధరల పెరుగుదల ఉండాలి. సాగు వ్యయం, మద్దతు ధర మధ్య భారీ వ్యత్యాసం ఉంటుంది. పత్తి ధర రూ.6 వేలు, వరి ధాన్యం ధర రూ.2 వేలకు పెంచితే కొంత నయంగా ఉండేది. – వెంకట్రెడ్డి, రైతు సంఘం నాయకుడు, మున్ననూర్ -
బడుగు రైతుకు ఆదాయ భద్రత!
కేవలం 5 గుంటల(12.5 సెంట్లు) స్థలం..రూ. 3 లక్షల బ్యాంకు రుణంతోనెట్ హౌస్ నిర్మాణం..రైతు వాటా రూ. 35 వేలతోపాటు రోజుకు 2 గంటలు శ్రమ..అతి తక్కువ నీటితో, మార్కెట్లో గిరాకీ ఉన్న పంటలు కరువు కాలంలోనూనిశ్చింతగా పండించడం..పొలం దగ్గరే రైతులకుగిట్టుబాటు ధర చెల్లించడం..ప్రతి వంద రోజులకో పంట..ప్రతి సారీ పంటల మార్పిడి..పంట పంటకూ రూ. 50 వేల నికరాదాయం..ఇదంతా అందమైన కల లాగా ఉందా?కల కాదు.. నిజమే. నిజంగా నిజమే!చిన్న, సన్నకారు రైతుల అనుభవంలో నిగ్గుతేలిన విషయమిది. ‘ఖేతీ’ అనే లాభాపేక్ష లేని సంస్థ మార్గదర్శనంలో పలువురు రైతులు ఏడాది పొడవునా, తీవ్ర కరువు కాలంలోనూ, ఆదాయ భద్రత పొందుతున్నారు!! మెతుకు సీమ మెదక్ జిల్లా ఇప్పుడు భూగర్భ జలాలు ఇంకిపోయి కరువు సీమగా మారింది. నాలుగైదు వందల అడుగుల లోతుకు బోరు వేస్తే కానీ నీరు రాని పరిస్థితి.. వేసిన బోర్లలో కూడా సక్రమంగా నీరు వస్తుందనే నమ్మకం లేదు. ఒకటికి పది బోర్లు వేసినా నీటి కొరత తీరక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న రైతులు ఈ ప్రాంతంలోనే అధికంగా ఉన్నారు. అందుకోసమే నష్టాలతో సాగు చేయలేక హైదరాబాద్, ముంబై, దుబాయ్ వంటి ప్రాంతాలకు వలస వెళ్లి బతుకు జీవుడా అని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయితే ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో ఏడారిలో ఒయాసిస్సులాగా ‘ఖేతీ’ లాభాపేక్ష లేని సంస్థ రైతులకు అండగా నిలుస్తోంది. వ్యవసాయం దండుగ అన్న చోటనే పండుగలా చేసేందుకు ప్రయత్నిస్తున్నది. అన్నీ తానై చిన్న, సన్నకారు రైతులతో లాభసాటి వ్యవసాయం చేయిస్తోంది. 5 గుంటల (12.5 సెంట్లు) భూమిలో బ్యాంకు రుణం రూ. 3 లక్షల(8.8% వడ్డీ)తో నెట్ హౌస్ నిర్మిస్తోంది. రైతు వాటా రూ. 35 వేలు చెల్లించాలి. చుట్టూ పురుగులను లోనికి రానీయకుండా నెట్ ఉంటుంది. లోపల పంటల పైన షేడ్ నెట్ ఉంటుంది. ఎండ ఎక్కువగా ఉండే రోజుల్లోనే ఈ షేడ్నెట్ను వాడుతుంటారు. ఎండ తీవ్రతను 2 డిగ్రీల సెల్షియస్ మేరకు తగ్గిస్తే 20% దిగుబడి పెరుగుతుందని ‘ఖేతీ’ చెబుతోంది. ఆరు బయట డ్రిప్ ద్వారా వాడే నీటిలో కేవలం 10 శాతం నీటిని (రోజుకు వెయ్యి లీటర్లు) మాత్రమే వాడుతుండడం మరో విశేషం. 100 రోజుల్లో రూ. 90 వేల విలువైన కనీసం 3 టన్నుల కీర దోస వంటి స్వల్పకాలిక పంటలు పండించేలా బడుగు రైతులకు ‘ఖేతీ’ మార్గదర్శనం చేస్తున్నది. ఆరుబయట డ్రిప్తో ఇంత దిగుబడి తీయడానికి రోజుకు పది వేల లీటర్ల నీరు, అదే నీరు పారగట్టే పద్ధతిలో అయితే 50 వేల లీటర్ల నీరు అవసరమవుతుందని ‘ఖేతీ’ అంచనా. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం 90% తగ్గించగలుగుతోంది. పండించడం వరకే కాదు.. పంటను మార్కెట్ ధర చెల్లించి పొలం దగ్గరే మార్కెట్ ధరకే కొంటున్నది. మార్కెట్లో ధర మరీ తగ్గినప్పుడు కూడా కిలోకు రూ. 20 చొప్పున రైతులకు చెల్లించడం విశేషం. ఉన్న కొద్దిపాటి నీటి వనరులను ఉపయోగించుకొని కీరదోస సాగు లాభసాటిగా ఉందని సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం దాచారం రైతులు చెబుతున్నారు. 1హెచ్పి మోటర్, వెయ్యి లీటర్ల వాటర్ ట్యాంక్ నుంచి డ్రిప్ ద్వారా నీరు, ద్రవరూప ఎరువులు అందిచడంతో పంట దిగుబడి అధికంగా వస్తున్నదని రైతు గుండ తిరుమలగిరి, వజ్రమ్మ దంపతులు చెబుతున్నారు. పంట నాటిన నెల రోజుల నుంచి దిగుబడి మొదలైందన్నారు. పంటలు వేసి నష్టపోయిన రైతులకు ‘ఖేతీ’ స్వచ్ఛంద సంస్థ అండగా నిలిచింది. సంస్థ అధ్యక్షులు సత్య రఘు రైతులను కలిసి, ఉమ్మడి మెదక్, మేడ్చల్ జిల్లా పరిధిలో 500 మంది రైతులను ఎంపిక చేశారు. కీర పంట నాటిన నెల రోజులకు దిగుబడి ప్రారంభమవుతుంది. రోజు తప్పి రోజు కీర దోసకాయలను రైతులు కోస్తున్నారు. ‘ఖేతీ’ సంస్థ ప్రతినిధులు నెట్ హౌస్ వద్దకే వచ్చి కాంటా పెట్టుకొని ఆన్లైన్ మార్కెట్లలో ఆ రోజు ఉన్న రేటుకు కొనుగోలు చేసి.. నగరాల్లోని మాల్స్కు సరఫరా చేస్తున్నారు. రైతులకు నెలకోసారి డబ్బు చెల్లిస్తున్నారు. గరిష్టం ఐదేళ్లలో బ్యాంకు రుణం తీరిపోతుంది. అప్పటి వరకూ ‘ఖేతీ’ సంస్థ రైతులకు వెన్నుదన్నుగా ఉంటుంది. ఆ తర్వాత రైతులే నిర్వహించుకోవాలి. – ఈరగాని బిక్షం, సాక్షి, సిద్ధిపేటఫొటో జర్నలిస్టు : కె. సతీష్ పనులు మేమే చేసుకుంటాం..! నాకు మూడున్నర ఎకరాల భూమి ఉంది. బోరు కొద్డిగా పోయడంతో పంటలు మధ్యలోనే ఎండిపోయేవి. కానీ ఈ సార్లు వచ్చి కొద్దిపాటి నీళ్లతో 5 గుంటల్లో పంటలు సాగు చేసుకోవచ్చని చెప్పారు. మా వాటా రూ. 35 వేలు ఇచ్చాం. బ్యాంకు లోన్ వచ్చింది. నెట్ హౌస్ వేశాం. పంటలు వేయడం, మందులు వాటం అంతా వారే చెప్పారు. రోజు వారీగా తోటలో పనులు మేమే చేసుకుంటున్నాం. ఇప్పుడు రెండు నెలలైంది. మాకు 2 టన్నుల కీర దోస పండింది. కిలో రూ. 32 నుండి రూ. 35 వరకు పలుకుతున్నది. ఇప్పటి వరకు మాకు రూ. 60 వేలు వచ్చినయి. మరో టన్ను దిగుబడి వస్తుంది. వంద రోజుల్లో రూ. 90 వేల పంట పండుతుంది. ప్రతి రోజూ పని చేస్తే మంచి లాభాలు వస్తాయి.– గుండ తిరుమలగిరి, కీర రైతు,(88976 74823), దాచారం, గజ్వేల్ మండలం, సిద్ధిపేట జిల్లా తక్కువ విస్తీర్ణం.. ఎక్కువ లాభం! తక్కువ విస్తీర్ణంలో చిన్న, సన్నకారు రైతులతో లాభసాటి వ్యవసాయం చేయించడం, వ్యవసాయం దండుగ కాదని రుజువు చేయడమే మా సంస్థ లక్ష్యం. కేవలం 5 గుంటల స్థలంలో నెట్ హౌస్ నిర్మించడంతో పాటు డ్రిప్ తదితర వసతులన్నీ కల్పించాం. మా వ్యవసాయ నిపుణులు రైతుల పొలాల వద్దకు వెళ్లి ఎప్పటికప్పుడు సూచనలిస్తున్నాం. తీవ్ర కరువులోనూ మంచి దిగుబడి వస్తున్నది. మార్కెటింగ్ ఇబ్బందులు లేకుండా పొలం వద్దకే వెళ్లి మేమే కొనుగోలు చేస్తున్నాం. కీర దోస, క్యాప్సికం, చెర్రీ టమాటా, కర్బూజ, మిర్చి పంటలను పంటల మార్పిడి పద్ధతిలో సాగు చేయిస్తున్నాం. రైతులకు లాభసాటిగా ఉంది.– దిలీప్ (83400 65000),ఖేతీ సంస్థ ప్రతినిధి రోజుకు 2 గంటలు పని! నేను ఉదయం మిల్క్ డైరీలో పనిచేస్తా.. నాకు వ్యవసాయం ఉంది. కానీ దిగుబడి రాక వ్యవసాయం చేయడంలేదు. ‘ఖేతీ’ సంస్థ వారు చెప్పిన మాటలు విని 5 గుంటల్లో నెట్ హౌస్ వేసి కీర దోస వేశాను. ఉదయం గంటసేపు, సాయంత్రం గంటసేపు పంట బాగోగులు చూసుకుంటున్నా. డ్రిప్ ద్వారా నీళ్లు, మందులు వేస్తాం. పంట వేసి 70 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు నాకు రూ. 68 వేల ఆదాయం వచ్చింది. కాయలు కోయగానే పొలం దగ్గరకు వచ్చి వాళ్లే కొనుగోలు చేస్తారు. అమ్ముకోవడానికి ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు. మంచి సౌకర్యంగా, లాభంగా ఉంది. పాల డైరీ పనిచేసుకుంటూనే ఈ కీర దోస పండించిన. ఈ పంట అయిపోగానే క్యాప్సికం లేదా చెర్రీ టమాటా వేస్తాం.– వెంకటస్వామి, కీర రైతు(9030189288), దాచారం, గజ్వేల్ మండలం, సిద్ధిపేట జిల్లా -
ఇక పడావు భూముల్లోనూ పంటలే!
సాక్షి, హైదరాబాద్: ఈ ఖరీఫ్లో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తుంది. ఖరీఫ్లో సాగు విస్తీర్ణం కోటి ఎకరాల వరకు ఉండగా, ఈ ఏడాది ఖరీఫ్లో మరో 7 లక్షలకు చేరుకుంటుందని, మొత్తంగా 1.10 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేస్తున్నా యి. కాళేశ్వరం సహా పలు ప్రాజెక్టులు అందుబాటులోకి రానుండటంతో సాగు విస్తీర్ణం పెరుగుతుందని లెక్కగడుతున్నాయి. 2019–20 వ్యవసాయ ప్రణాళికను ఖరారు చేసే పనిలో ఆ శాఖ నిమగ్నమైంది. ఆ మేరకు విత్తనాలు, ఎరువులు అందించడంపై పలుమార్లు సమావేశాలు నిర్వహించింది. ఖరీఫ్లో అన్ని రకాల పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, గతేడాది 1.03 కోట్ల ఎకరాల్లో సాగయ్యాయి. ఈసారి అదికాస్తా 1.10 కోట్ల ఎకరాలకు చేరుకునే అవకాశముందని చెబుతున్నారు. పత్తి వైపే రైతుల చూపు రానున్న ఖరీఫ్లో రైతులు మళ్లీ పత్తిసాగు చేసేందుకే మొగ్గుచూపుతారని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. మద్ధతు ధర పెరగడమే కారణంగా అధికారులు పేర్కొంటున్నారు. అలాగే వరి, మొక్కజొన్న పంటల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముందంటున్నారు. రైతుబంధుతో రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం పెరిగిందని, అలాగే నీటిపారుదల ప్రాజెక్టులతో మరింతగా వరి సాగు పెరుగుతుందనీ అంచనా వేస్తోంది. సోయాబీన్ సాగు ఈసారి తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంతేగాక రైతుబంధు పథకం వల్ల ఇప్పటివరకు సాగు కాని భూములనూ రైతులు దున్నడం ప్రారంభిస్తారని భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వెట్రన్ విజయవంతం కావడంతో ఈ ఖరీఫ్ నుంచే నీళ్లు ఇచ్చేందుకు పనులు వేగవంతం చేసింది. ఈ ఖరీఫ్లో 19.40 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయింపులు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. -
కాడి పట్టింది
కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని రాతన గ్రామానికి చెందిన లాలూబీ తన భర్త పెద్ద మౌలాలితో కలిసి ఉన్న నాలుగన్నర ఎకరాలతో పాటు, మరికొంత పొలం గుత్తకు తీసుకుని పంటలు పండించుకుంటూ జీవించేవారు. తీవ్ర వర్షాభావం, పంట పెట్టుబడులు భారీగా పెరగడం, దిగుబడులు తగ్గడం తదితర కారణాలతో తీవ్ర నష్టాలను చూశారు. పంటల సాగు, కుటుంబ పోషణకు చేసిన అప్పులు కూడా పెరిగిపోయాయి. అప్పుల బాధ తాళలేక 2014 నవంబర్ 20న పెద్ద మౌలాలి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లాలూబీ భర్తను కోల్పోయింది, కానీ ధైర్యాన్ని కోల్పోలేదు. ఇద్దరు కుమారులు, కోడళ్లు, వారి పిల్లల బాధ్యత లాలూబీపై పడింది. ఉన్న పొలంతో పాటు మరికొంత పొలాన్ని గుత్తకు తీసుకుని వ్యవసాయం, కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. వరుస కరువులతో పంటలు పండకున్నా చేసిన అప్పులు తీర్చేందుకు పిల్లలతో పాటు కూలి పనులకెళుతోంది. పెద్దకొడుకు చాంద్బాష పొలం పనులతో పాటు, జేసీబీ డ్రైవర్గా, చిన్న కుమారుడు మున్నా సైకిల్ షాపు నడుపుకుంటూ లాలూబీకి చేదోడువాదోడుగా ఉంటున్నారు. అప్పుల బాధతో కుటుంబ యజమాని ఆత్మహత్య చేసుకున్నా, ప్రభుత్వం నుంచి ఒక్కరూపాయి పరిహారం రాకపోయినా కుంగిపోకుండా కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటూ జీవితాన్ని నెట్టుకొస్తోంది. ఆత్మస్థైర్యంతో నిలబడి కుటుంబాన్ని నడుపుతోంది. -
కుయ్యో..రొయ్యో
పశ్చిమగోదావరి, భీమవరం అర్బన్: వనామీ రొయ్య పెంపకం ప్రారంభంలో సిరులు కురిపించినప్పటికీ తర్వాత ఏయేటికాయేడు రైతులకు నష్టాలను మిగులుస్తోంది. దాంతో వనామీ సాగుపై ఆక్వా రైతులు ఆసక్తి చూపడం లేదు. గతేడాది పట్టుబడికి వచ్చిన రొయ్యలకు ధర లేకపోవడంతో అయినకాడికి అమ్ముకుని నష్టాలు చవిచూశారు. ఈ ఏడాది మళ్లీ అదే సమస్య వస్తే ఇబ్బందులు తప్పవన్న ఆలోచనలతో సన్నచిన్న కారు రైతులు దానికి ప్రత్యామ్నాయంగా పండుగొప్పవైపు దృష్టి సారిస్తున్నారు. భీమవరం మండలంలో దిరుసుమర్రు, దెయ్యాలతిప్ప, వెంప, గూట్లపాడు, దొంగపిండి, కొత్తపూసలమర్రు, నాగిడిపాలెం, తోకతిప్ప, లోసరి, అనాకోడేరు, ఎల్వీఎన్పురం, ఈలంపూడి తదితర గ్రామాల్లో సుమారు 7 వేల ఎకరాలలో వనామీ సాగుచేస్తున్నారు. పంట కాలం మూడు నెలలే ఉండి లాభార్జన ఎక్కువగా ఉండటంతో రైతులు ప్రారంభంలో వనామీపై ఆసక్తి చూపారు. రానురాను వైట్ స్పాట్, విబ్రియో, వైట్గట్ వంటి వ్యాధులు రావడంతో నెలరోజుల లోపే రొయ్యలు మృత్యువాత పడుతున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొనే నాథుడు కరువు ప్రస్తుత సీజన్లో ఏటా రొయ్య పెంపకంలో పెట్టుబడులు పోను కొంతైనా మిగిలేదని రైతులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ సీజన్ రొయ్య పెంపకానికి అనుకూలం కావడంతో అందరికీ ఒకేసారి పట్టుబడికి రావడంతో కొనేవారే ఉండటం లేదని రైతులు వాపోతున్నారు. పెరిగిన మేత ఖర్చులు, డీజిల్ ధరలు రొయ్యలకు మేతగా వేసే పిల్లెట్లు 25 కేజీలు రూ.1800 నుంచి రూ.2 వేలు, డీజిల్ లీటర్ రూ.70కి పైగా ఉండటంతో ఖర్చులు పెరిగిపోవడంతో సన్నచిన్నకారు రైతులు ఆసక్తి చూపడం లేదు. ఎకరానికి సుమారు రూ.2 లక్షలు నుంచి రూ. 3 లక్షలు పెట్టుబడి రైతులు పెడతారు. అయితే వేసిన తరువాత చలిగాలులు, వైరస్ బారిన పడితే తీవ్రంగా నష్టపోతున్నారు. రొయ్య సీడ్ ధర ఎక్కువ ఉండటం, కౌంట్ ధర తగ్గిపోవడంతో కౌలు రైతులు మరింత కుదేలవుతున్నారు. దాంతో సన్నచిన్నకారు రైతులు పండుగప్ప, శీలావతి, కట్ల సాగుపై మొగ్గు చూపుతున్నారు. రోజుకు రూ.17.5 కోట్ల విదేశీ మారకద్రవ్యం జిల్లాలో నరసాపురం, మొగల్తూరు, భీమవరం, కాళ్ల, ఉండి, పాలకొల్లు, పాలకోడేరు, వీరవాసరం, మండలాల్లో సుమారు 75 వేల ఎకరాలలో వనామీ రొయ్య పెంపకాన్ని సాగిస్తున్నారు. జిల్లా నుంచి సీజన్లో 250 టన్నులకు పైగా వనామీ రొయ్యలు విదేశాలకు ఎగుమతులు అవుతున్నట్లు ప్రాథమిక అంచనా. రోజుకు సుమారు రూ.17.50 కోట్ల విదేశీ మారక ద్రవ్యం జిల్లాకు వచ్చి చేరుతోంది. ఏటా పతనమవుతున్న ధర 2012 నుంచి వనామీ రొయ్య పెంపకంపై రైతులు మొగ్గు చూపించారు. మొదట్లో 50 కౌంట్ రూ.400పైగా ఉండటంతో సిరులు కురిపించింది. దీంతో మూడేళ్లు వనామీ సాగు రైతులకు సిరులు కురిపించింది. 2016 నుంచి నాణ్యతలేని వనామీ సీడ్, యాంటీబయోటిక్స్ వాడకం, వైరస్ వ్యాప్తి వంటి కారణాల వల్ల పతనమైంది. 2019 మొదటి పంటలో సుమారు 40–50 వేల ఎకరాలకు పడిపోవడంతో రైతులు ప్రత్నామ్నాయంగా చేపల పెంపకాన్ని సాగిస్తున్నారు. గతేడాది 100 కౌంట్ కేజీ ధర రూ. 160కి పడిపోవడంతో రొయ్య రైతులు నష్టపోకుండా ఆదుకునేందుకు ఎంపెడా 100 కౌంట్ కేజీ రూ.200 ఉండేటట్లు చూడాలని వ్యాపారులకు ప్రభుత్వం అదేశించినా ఫలితం శూన్యం. -
చేనుకి పోయిన మనిషి చితికిపోతే ఎలా?
చేనుకి పోయిన మనిషి ఇంటికి ఏ రూపంలో తిరిగొస్తాడో తెలియదు. రైతు తనని తాను చంపుకోవాల్సిన పరిస్థితులు కొన్నయితే విధాన నిర్ణేతల తప్పిదాలు మరికొన్ని. ఈ కోవలోదే చంద్రబాబు 2014 ఎన్నికలకు ముందు ఇచ్చిన విద్యుత్ సరఫరా హామీ... గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం మందాడి గ్రామానికి చెందిన యువ కౌలు రైతు వంకద్వత్ అంజి నాయక్ మిర్చి పంట పండిస్తుంటాడు. వాన మొఖం చాటేసింది. మబ్బులు కిందికి దిగిరానంటున్నాయి. బోరు బావులే దిక్కయ్యాయి. వీటికి ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు పోతుందో సర్కారు వారి దయ. దీంతో అంజి నాయక్ ఇటీవల ఓరోజు అర్ధరాత్రి దాటింతర్వాత చేనుకి నీళ్లు కట్టుకుందామని వెళ్లాడు. వెళ్లినవాడు పొద్దు బారెడెక్కినా ఇంటికి రాలేదు. ఏమైందో తెలియక తల్లడిల్లిన ఇల్లాలు చేనుకి పోయి చూసేసరికి గుండె గుభిల్లుమంది. విద్యుద్ఘాతం అంజిని పొట్టన పెట్టుకుంది. ఇలాంటివి ఎన్నో... కర్నూలు జిల్లా సంజామల మండలం మిక్కినేని గ్రామంలో ఒకేరోజు ముగ్గురు రైతులు మబ్బుల్లో పొలానికి పోయి మళ్లీ తిరిగి రాలేదు. ఆ చీకట్లో తెగిపడిన కరెంటు తీగె వారి ప్రాణాలను మిగేసింది. రైతు వ్యథాభరిత చిత్రానికి ఇవన్నీ రుజువులు.వేళకాని వేళల్లో ఇచ్చే కరెంటు కోసం వెళ్లి రైతులు చచ్చిపోతున్నారు. గత నాలుగేళ్లుగా ఇదే తీరు. ఈ దశలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతన్నలకు ఓ హామీ ఇచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసే నవరత్నాలలో భాగంగా పగటిపూట నిరంతరాయంగా హెచ్చుతగ్గులు లేని నాణ్యమైన కరెంటును 9 గంటల పాటు సరఫరా చేస్తానని భరోసా ఇచ్చారు. ఆయన మాటను అన్నదాతలు విశ్వసించారు. ఎందుకో తెలుసా.. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన రోజే ఉచిత విద్యుత్ సరఫరా ఫైల్పై సంతకం చేసిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిది. పాత బకాయిలు రద్దు చేసిన పెద్దమనసు ఆయనది. ఆవేళ ఉమ్మడి రాష్ట్రంలో 23 లక్షల బోర్లకు ఉచిత విద్యుత్ను సరఫరా చేసి మాట నిలుపుకున్నారు. ఉచిత విద్యుత్ ఇచ్చే విషయంలో ఆయా రైతులకు భూమి ఎంత, ఎటువంటి పంట, పంప్సెట్ సామర్థ్యం ఎంత, పేదరైతా? పెద్ద రైతా అనేది చూడలేదు. కస్టమర్ సర్వీస్ చార్జీలనూ నయాపైసా వసూలు చేయలేదు. రాష్ట్ర ఖజానాకు అది భారమవుతుందేమో అని యోచించలేదు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ఉచిత విద్యుత్ సరఫరా చేసిన మహానేత వైఎస్సార్. అటువంటి ఆయన కడుపున పుట్టిన జగన్ మాట తప్పడన్న ధీమా రైతన్నది. అందుకే పాదయాత్రలో అంతలా ఆదరించారు. అక్కున చేర్చుకున్నారు. జగన్ హామీతో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 16 లక్షల పంపుసెట్లకు ఉచిత విద్యుత్ వస్తుంది. 17 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుంది. లక్షలాది ఎకరాలకు నీళ్లు అందుతాయి. వీళ్లందరికీ 9 గంటల పాటు పగటిపూట ఉచిత విద్యుత్ సరఫరా అవుతుంది. ఆక్వా రైతులకు యూనిట్కు రూపాయిన్నరకే విద్యుత్ వస్తుంది. – ఎ.అమరయ్య, చీఫ్ రిపోర్టర్, సాక్షి -
కరువు ప్రకటన కలేనా.!
కడప అగ్రికల్చర్ : రబీ సీజన్లో సాగు చేసిన పంటల నివేదికను పంపాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించినా ఆ దిశగా మెజార్టీ ప్రభుత్వ శాఖలు నివేదికలు పంపలేదు. దీంతో కరువు ప్రకటన వెలువడలేదనే సమాధానం వినిపిస్తోంది. జిల్లాలో మొత్తం 11 శాఖలు తమకు ఇచ్చిన అంశాలను పొందుపరుస్తూ ప్రస్తుత పరిస్థితులను వివరిస్తూ తగు నివేదికలు పంపాలని విపత్తులశాఖ జనవరి నెల 9వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. నెల రోజులు గడచినా ఇంతవరకు కొన్ని శాఖలు జిల్లా కేంద్రమైన కలెక్టరేట్లోని విపత్తుల నిర్వహణ విభాగానికి వివరాలు పంపలేదని ఆ విభాగం అధికారులు పెదవి విరుస్తున్నారు. ప్రధానంగా వర్షపాతం, వర్ష విరామం, వాతావరణ పరిస్థితులు, భూగర్భజలాల స్థితిగతులు, , తాగునీటి వనరులు, గ్రామాల్లో తాగునీటి సరఫరా, పంటల సాగు, పంట దిగుబడులు, పంటకోత ప్రయోగాల వివరాలు, ఉపాధి హామీ, కూలీలకు కల్పిస్తున్న పనుల నివేదిక, పాడిపరిశ్రమ, పశుపోషణ, పశుగ్రాసం నిల్వలు, గ్రాసం కొరత, పశువుల, జీవాల వలసలు, మత్స్యకారుల జీవన స్థితిగతులు తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుని 11 శాఖలు నివేదిక తయారు చేయాలని ఆదేశాలు జారీ చేసి నెల రోజులు గడచిపోయింది. ఈ విషయంలో కొన్ని శాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలున్నాయి. అయితే జిల్లా వ్యవసాయశాఖ అధికారులు మాత్రం తమ నివేదికను తయారు చేసి ఇచ్చినట్లు పేర్కొంటున్నారు. రెండు సీజన్లలోనూ నష్టమే.. ఖరీఫ్ సీజన్లో జిల్లాలోని 51 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. ఆ సీజన్కుగాను పంటలు దెబ్బతినగా ఇన్పుట్ సబ్సిడీ కోసం రూ.15.58 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం నివేదిక పంపింది. మామూలుగా అయితే ఒక్క సీజన్ పంటలకే ఇన్పుట్ చెల్లించే విధంగా విపత్తుల నిర్వహణ మార్గదర్శకాలు ఉన్నాయి. అయితే 2018–19లో ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్, రబీ పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విపత్తుల నిర్వహణను, మార్గదర్శకాలను సడలిస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీని ఆధారంగా ఇటీవల జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు జె.మురళీకృష్ణ రబీలో సాగు చేసిన పంటలకు సంబంధించిన ప్రాథమిక అంచనాల నివేదికను తయారు చేసి ఇన్పుట్ సబ్సిడీ రూ.71.36 కోట్లు అవసరమవుతుందని జిల్లా కలెక్టర్కు నివేదికను అందజేశారు. అయితే మారిన నిబంధనల ప్రకారం విపత్తుల విభాగం అధికారులు పలు అంశాలను జోడించి ఆయా అంశాల వారీగా నివేదికలు తయారు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. కానీ నెల రోజులు కావస్తున్నా ఆయా శాఖలు మాత్రం నివేదికలు ఇవ్వలేదు. మరో వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందని, షెడ్యూల్ విడుదల చేస్తే కరువు ప్రకటన వెలువడే అవకాశం ఉండదని రైతు సంఘాలు అంటున్నాయి. రైతులకు తీరని అన్యాయం జరుగుతుందని చెబుతున్నారు. జిల్లా నుంచి నివేదికను రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థకు ఇంతవరకు పంపలేదు. దీంతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ జోక్యం చేసుకుని వెంటనే నివేదికను పంపాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినా కూడా ఆయా శాఖలలో చలనం లేకపోవడం గమనార్హం. రబీలో ఏర్పడిన కరువు, పంటల పరిస్థితి, దిగుబడులు, వర్షపాతం, భూగర్భజలాల స్థితి తదితర అంశాలను లెక్కలోకి తీసుకుని నివేదిక పంపాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు పంపింది. ఇది ఇలా ఉండగా జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ముందు జాగ్రత్తగా పంటల సాగు, విస్తీర్ణం, ఆయా పంటల స్థితిగతులపై నివేదికలు తయారు చేసి సిద్ధంగా ఉంచారు. ఈ రబీలో సాధారణ పంటల సాగు 1,72,929 హెక్టార్లు కాగా, ఇప్పటి వరకు 1,37,154 హెక్టార్లలో ప్రధాన పంటలైన బుడ్డశనగ, వేరుశనగ, జొన్న, పొద్దుతిరుగుడు, ఉలవ, మొక్కజొన్న, మినుము పంటలున్నాయి. అయితే ఈ పంట దిగుబడులను (క్రాప్ కటింగ్) జిల్లా వ్యవసాయ గణాంక అధికారులు, ఫసల్ బీమా కంపెనీ ప్రతినిధులు లెక్కకడుతున్నారు. కానీ పంటకోత ప్రయోగంలో దిగుబడులు ఏ మాత్రం రాలేదని స్పష్టం చేశారు. పంట సాగు కోసం చేసిన పెట్టుబడులు కూడా తీరలేదని పంటకోత ప్రయోగాలు చెబుతున్నాయి. రబీ సీజన్లో కరువు మండలాలను ప్రకటిస్తే ఈ పంటలకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించే అవకాశం ఉందని అ«ధికారులు చెబుతున్నారు. -
పదార్థాల్లేని వంట
పూర్వం ఒకసారి ఒక ప్రాంతంలో తీవ్ర క్షామం ఏర్పడింది. అంటే వర్షాలు పడక పంటలు ఎండిపోయి, గడ్డి కూడా మొలవని పరిస్థితి అన్నమాట. ఒకాయన అక్కడ వర్షాలు పడేంతవరకు ఎలాగూ పనిదొరకదు కాబట్టి ఎక్కడికైనా వెళ్లి పని చేసుకోవాలనుకున్నాడు. కుటుంబ సభ్యులను తీసుకుని ప్రయాణం ప్రారంభించాడు. మార్గమధ్యంలో అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రమించారు. పిల్లల్లో చిన్నవాడు ఆకలి అనడంతో ఏదైనా వండుకుని తిని ఆకలి తీరాక ప్రయాణం కొనసాగించాలనుకున్నారు. తల్లి రాళ్లు తెచ్చి పొయ్యి తయారు చేసింది. తండ్రి నీళ్ల కోసం వెళ్లాడు. అబ్బాయి, అమ్మాయి చెట్టు కింద ఉన్న ఎండుపుల్లలు ఏరి నిప్పు రాజేస్తున్నారు. ఈ విధంగా అందరూ తలోపనిలో ఉండటాన్ని చెట్టుపైనుంచి పక్షులు చూస్తున్నాయి. వాటిలో పెద్ద పక్షి మిగిలిన వాటితో ‘‘వీళ్లు చూస్తే ఒట్టి తెలివితక్కువ వాళ్లలా ఉన్నారు. వండుకోవడానికి పదార్థాలేమీ లేకుండానే వంట ప్రయత్నాలు మొదలు పెట్టారు’’ అంటూ నవ్వింది. ఆ మాటలు విన్న పెద్దవాడికి కోపం వచ్చింది. ‘‘ఇప్పటివరకు ఏదైనా దుంపలు తవ్వుకు తీసుకొచ్చి వండుకు తినాలనుకుంటున్నాము. ఇప్పుడు మీరు మమ్మల్ని ఎగతాళి చేశారు కాబట్టి, మిమ్మల్నే పట్టుకుని వండుకుని తింటాం’’ అన్నాడు కోపంగా. ఆ మాటలకు పెద్దపక్షి భయపడింది. ‘‘బాబూ! కుటుంబమంతా కలిసి ఉండటంలోని సంతోషం నీకు తెలుసు కదా. మా పక్షి పరివారాన్ని చంపకండి. అందుకు బదులు మేము మీకు ఒక నిధి చూపిస్తాం వెళ్లి తెచ్చుకోండి. ఈలోగా మీకు ఆకలి తీరేందుకు కొన్ని పళ్లు, దుంపలు చూపిస్తాం. మీరు నిశ్చింతగా ఉండండి’’ అని బతిమాలింది. అందుకు అందరూ సంతోషంగా అంగీకరించారు. ఆ కష్టకాలంలో వారికి లభించిన నిధితో ఆనందంగా ఇంటికి తిరిగి వెళ్లారు. ఈ కథను ఒక గురువు తన శిష్యులకు చెప్పి, ‘‘చూశారా పిల్లలూ! పరిస్థితులను తలచుకుని భయపడుతూ కూర్చుంటే ప్రయోజనం ఉండదు. మన ప్రయత్నం చేయాలి. అప్పుడే అన్నీ అనుకూలిస్తాయి. ఆ కుటుంబం పదార్థాలేమీ దొరక్కుండానే వంట మొదలు పెట్టి అలా ఆశావహ దృక్పథంతో ప్రవర్తించింది కాబట్టే వారికి నిధి దొరికిందని గ్రహించండి’’ అని బోధించారు. పిల్లలు అర్థమైందన్నట్టు తలలు పంకించారు. – డి.వి.ఆర్. -
‘క్రీడా’ బృందానికి ఐఎస్ఏఈ పురస్కారం
సాక్షి, హైదరాబాద్: సాగుకు యోగ్యం కాని భూముల్లో సరికొత్త వ్యవసాయ పద్ధతులను అనుసరించి పలు రకాల పంటలు పండించిన కేంద్రీయ మెట్ట పంటల పరిశోధన సంస్థ (క్రీడా) శాస్త్రవేత్తల బృందానికి ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీర్స్ (ఐఎస్ఏఈ) అత్యుత్తమ పురస్కారాన్ని అందించింది. వారణాసిలో జరిగిన ఐఏఎస్ఈ 53వ వార్షిక సదస్సుల్లో భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ త్రిలోచన్ మహాపాత్ర చేతుల మీదుగా క్రీడా ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ కె.శ్రీనివాస్రెడ్డి బృందం ఈ అవార్డును అందుకుంది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలంలోని చెంచు కాలనీల్లో సాగుకు యోగ్యం కాని భూములను అభివృద్ధి చేసి వివిధ రకాల పంటల సాగు కోసం శ్రీనివాస్రెడ్డి బృందం పలురకాల పరిశోధనలను చేసింది. కనీస నీటి సామర్థ్యం లేకపోవడంతోపాటు అత్యధిక వర్షాభావ పరిస్థితులున్న ఆ ప్రాంతంలో మెట్ట పంటలు, కూరగాయల సాగు కోసం సరికొత్త వ్యవసాయ పద్ధతులను అనుసరించేలా స్థానిక రైతాంగానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించేలా సాంకేతిక సహకారాన్ని అందించింది. దాదాపు 60 కుటుం బాలకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై శిక్షణ ఇచ్చి ప్రోత్సహించింది. ఈ నేపథ్యంలో వీరి సేవలను గుర్తించిన ఐఏఎస్ఈ 2018 సంవత్సరానికి గాను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. -
పంటసిరితో తెలంగాణ కళకళ
ఒకప్పుడు దేశమంతటా కరువు తాండవించినా.. తెలంగాణలో మాత్రం కరువు ఛాయలు రాలేదు. 250 ఏళ్లుగా ఇక్కడ తిండి గింజలకు ఇబ్బంది లేదు. కాకతీయులు తవ్వించిన చెరువులు ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచాయి. 1630–32లో, 1702–04లో దక్కన్ ప్రాంతంలో కరు వొచ్చి, దాదాపు 2మిలియన్ల మంది చనిపోయారు. ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది. దెబ్బతిన్న అప్పటి ముస్లిం పాలకులు చెరువుల మీద దృష్టి పెట్టారు. కొత్త చెరువులు తవ్వించారు. పాత చెరువులు పున రుద్ధరించారు. నాటినుంచిæ భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడే వరకు కరువు ప్రభావం లేదు. హరిత విప్లవాని కంటే ముందే దేశ వాప్తంగా వరి దిగుబడి ప్రతి ఏడాది 1.3 శాతం చొప్పున పెరు గుతూ వస్తే. దక్కన్ పీఠభూమి ప్రాంతంలో దిగుబడి శాతం 2.2 శాతం ఉంది. 1967 తరువాత దేశంలో హరిత విప్లవం ఊపందుకుంది. 1990 నాటికి భార తదేశంలో వరి వార్షిక దిగుబడి 3.6 శాతానికి పెరి గింది. అదే సమయంలో తెలంగాణ ప్రాంతంలో ఈ దిగుబడి 1.9 శాతానికి పడిపోయింది. కారణం.. రైతును ఆధునిక సేద్యం వైపుకు మళ్లించాల్సిన గత పాలకులు తెలంగాణ ప్రాంత వ్యవసాయాన్ని విస్మరించారు. చేసిన ప్రయోగాలన్ని గుంటూరు, గోదావరి జిల్లాలను బేస్గా చేసుకొని పరిశోధనలు జరిగాయి. ఆంధ్ర ప్రాంత సమస్యలను దృష్టిలో ఉంచుకొని వాటిని తట్టుకోగల వరి వంగడాలను రూపొందించటంపైనే పరిశోధనలు జరిగాయి. ఎంటీయు, ఆర్జీఎల్ ఎన్ఎల్ఆర్ వంటి ఆంధ్ర ప్రాంత వాతావరణాన్ని తట్టుకొని నిలవగలిగే వంగ డాలను తెలంగాణ ప్రాంత రైతాంగం మీదికి రుద్దడంతో తెలంగాణ ప్రాంతంలో అనుకున్నంత దిగుబడి రాక రైతులు తీవ్రంగా నష్టపోయారు. నేడు తెలంగాణ దశాబ్దాల కష్టాలను అన్నిటినీ అధిగమించింది. ఇప్పుడు గోదావరి, కృష్ణా జలాలు తెలంగాణ మాగాణుల్లో పారుతున్నాయి. ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు శ్రమించి ‘తెలంగాణ సోనా’(ఆర్ఎన్ఆర్–15048), బతుకమ్మ వడ్లు వంటి కొత్త వంగడాలు ఆవిష్కరించారు. ఫలితంగా కరువులతో అల్లాడిన రైతులకు ఈ యాసం గిలో కరువు తీరా పంట పండింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 61 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చింది. వరి దిగుబడి 2015–16 యాసంగితో పోలిస్తే 2015–16 యాసంగిలో మూడు రెట్లు పెరిగింది. 2015–16 యాసంగిలో 7.21 లక్షల టన్నులు రాగా, 2016–71లో ఏకంగా 26.41 లక్షల టన్నుల వరి దిగుబడి వచ్చింది. 2016–17లో 38.01 దిగుబడి లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. ఆ రికార్డును బద్దలు కొడుతూ 2018–19లో 61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది.. గత రెండు దశాబ్దాల కాలంలో తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా 2013–14 ఖరీఫ్లో 56.56 లక్షల టన్నుల వరి దిగుబడి వచ్చింది, అప్పటితో పోలిస్తే ఇప్పటి దిగుబడి ఏకంగా 4.44 లక్షల టన్నులు అదనం. మొత్తంగా 25.65 లక్షల ఎకరాల్లో వరి సాగు అయింది. ఇది తెలంగాణ వ్యవసాయ పురోగతికి తొలి సంకేతం. సోలిపేట రామలింగారెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, దుబ్బాక ఎమ్మెల్యే ‘ 94403 80141 -
పులివెందులలో క్షుద్ర పూజలు?
వైఎస్ఆర్ జిల్లా ,పులివెందుల రూరల్ : పట్టణ పరిధిలోని భాకరాపురం సమీపంలోని పంట పొలాల్లో క్షుద్ర పూజలు చేస్తున్నారని రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రింగ్ రోడ్డు, హెలీప్యాడ్ ప్రాంతాల్లో గుర్తు తెలియని ఆకతాయిలు మద్యం సేవించి వీరంగం సృష్టిస్తున్నారని చెబుతున్నారు. పచ్చటి పొలాల్లో మద్యం తాగుతూ పంటలను నాశనం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడంలేదని వాపోతున్నారు. అధికారులు స్పందించి ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ధాన్యపు సిరుల జాతర
నేల ఉంది నీరు లేదు. చేవ ఉంది సాగు లేదు. బీజం ఉంది జీవం లేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆకలి తీరేదెలా? మనిషి బతికేదెలా? ఏడాదిలో ఎప్పుడో ఓసారి పడీపడనట్లు పడే నాలుగు వాన చుక్కలతోనే జీవం పోసుకోవాలి. మబ్బు ఎంతిస్తే నేల అంతే తీసుకోవాలి. అంతకంటే వేరే ఆధారం లేదు. కరెంటు బోర్లు లేవు, పంట కాలువలు లేవు. నేలలో ఇంకిన నాలుగు నీటి చుక్కలతోనే జీవం పోసుకోగలిగిన గింజలను నమ్ముకోవాలి. అందులోనే పచ్చదనాన్ని వెతుక్కోవాలి... బతుకు చిత్రాన్ని దిద్దుకోవాలి. జహీరాబాద్లోని గిరిజన తండాలు ఇప్పుడు ఈ ‘దిద్దుబాట’లోనే పండుగ సంతోషాన్ని వెతుక్కుంటున్నాయి. పంటల జాతర చేసుకుంటున్నాయి. మెదక్ జిల్లా జహీరాబాద్లోని గిరిజన తండాల ప్రజలు నది తీరంలో ఏమీ జీవించడం లేదు. ప్రాజెక్టు సాగు కింద లేదు వాళ్ల భూమి. ఎర్రటి ప్రచండభానుడి తీక్షణ దృక్కుల కింద ఉంది వాళ్ల జీవితం. ఆ నేలలో తల్లిని చూశారు వాళ్లు. పొద్దు పొడవక ముందు నుంచి పొద్దు కుంకే వరకు రెక్కలు ముక్కలు చేసుకున్నారు. మట్టిని నమ్ముకుంటే బతుకు పండుతుందని నిరూపిస్తున్నారు. పండుగ చేసుకుంటున్నారు. సంక్రాంతి పండుగ అంటే పంటల పండుగ. పంట లక్ష్మి ఇంటికి వచ్చిన లక్షణమైన పండుగ. ఈ లక్షణాలను అందరూ పుణికిపుచ్చుకోవాలని ఊరూరా తిరిగి చెబుతున్నారు. ‘దేవుడమ్మ దేవుడు... మా ఊరి దేవుడు... మీ ఊరికొచ్చాడు’ అని జాతర చేస్తూ ఇరుగుపొరుగు తండాలకు చెబుతున్నారు. పంటల జాతరలో ఊళ్లకు ఊళ్లు కలిసి సంబరం చేసుకుంటున్నాయి.మెదక్ జిల్లా, జహీరాబాద్ మండలంలోని లక్ష్మణ్ నాయక్ పంచాయతీలోని మూడ్తండాలో మొదలైంది ఈ పంటల జాతర. ఈ నెల 14వ తేదీన భోగిపండుగ రోజున లంబాడా సంప్రదాయ ఆటపాటలతో మొదలైన ఈ జాతర బండ్లు ఇప్పుడు ఇరుగుపొరుగు తండాలలో పర్యటిస్తున్నాయి. ఈ పంటల బండ్లు ఫిబ్రవరి 13వ తేదీ నాటికి ఝరాసంఘం మండలంలోని మాచ్నూర్ గ్రామం చేరుకుంటాయి. మొత్తం 23 గ్రామాల్లో డెబ్బైకి పైగా తండాల జనాలకు తాము పండించిన పంటలను ఊరేగిస్తారు. మాచ్నూర్లో ఆటపాటలతో ముగింపు వేడుక చేసుకుంటారు.ప్రకృతిని దైవంగా పూజించడం ప్రాచీనంగా వస్తున్న ఆచారమే, నేలకు మొక్కే కల్చర్ మనది. చెట్టును ప్రేమించే సంప్రదాయం మనది. చెట్టు కోసం ప్రాణాలర్పించే బిష్ణోయి గిరిజనులున్నారు రాజస్తాన్లో, మచ్చిక చేసుకున్న మృగాన్ని అక్కున చేర్చుకుని స్తన్యమిచ్చి ఆకలి తీర్చే తల్లులు ఆ గిరిజన మహిళలు. తోటి వారి ఆకలి తీర్చే సంప్రదాయంలో కొత్త ఒరవడిని తీసుకొచ్చారు అర్జున్ నాయక్ తండా గిరిజన మహిళలు. తాము పండించిన పంటలనే దేవుళ్లుగా కొలుస్తున్నారు. ఆ పంటలకే జాతర చేస్తున్నారు. అంకాళమ్మ, పోలేరమ్మ వంటి గ్రామ దేవతల జాతర్లలో వేడుక చేసుకున్నట్లే పంటల జాతరనూ ఊరు ఊరంతా కలిసి సంతోషాల పంటగా మలుచుకున్నారు. ఒకరి దగ్గరున్న గింజలను మరొకరికి పంచుతారు. అందరూ నేలనిండుగా పంటలు పండించుకోవాలని కోరుకుంటారు. ఇన్ని రకాల ధాన్యాలా! వరి పండని నేలలో పండే ప్రతి గింజనూ అపురూపంగా దాచుకున్నారీ మహిళలు. తమకున్న కొద్ది నేలలోనే మడులు కట్టారు. జొన్నలు, రాగులు, సజ్జలు, అరికెలు, వరిగెలు, కొర్రలు, నువ్వులు, అవిశెలు, సాయిజొన్న, కందులు, పెసలు, అండుకొర్రలు, సామలు... ఇలా దేనికది విడిగా పంటలు పెట్టారు. ఇన్ని పంటలెందుకంటే... ‘‘ఒకటి పోయినా ఒకటి పండుతుంది. ఏడాదికి కడుపు నింపుతుంది. ఒకటి వానకు తట్టుకునే పంట, ఒకటి ఎండకు తట్టుకునే రకం, ఒకటి మంచుకు పట్టే తెగుళ్లను తట్టుకుంటుంది. ఇలా కలిపి పెట్టుకుంటే ఒక పంట మరో పంటకు ఎరువవుతుంది’’ అంటారు. ఒక్కొక్కరు పది రకాలకు తక్కువ లేకుండా పండిస్తున్నారు. మొత్తం ఎనభై రకాల చిరుధాన్యాలు పండిస్తున్నారు. ఇంకా ‘‘వాన నీళ్లు, నేల మట్టి సారంతోనే పండుతాయి. మందుల్లేవు, ఎరువుల్లేవు మా పంటలకు. మేము గంపలో గింజను నిల్వ చేస్తే మూడేళ్లకు నేల మీద చల్లినా మొలకలొస్తాయి. పెద్ద కంపెనీలు మా దగ్గర తీసుకెళ్లి సరిగ్గా నిల్వ చేయకుండా బస్తాల్లో నింపి వాళ్ల పేర్లు వేసి (లేబిల్) అమ్ముతారు. వాటిలో సగం మొలకలొస్తే అదే చాలా ఎక్కువ. అందుకే మా తండాల్లో ఆడవాళ్లందరికీ ధాన్యాన్ని గింజ కట్టడం నేర్పిస్తున్నాం. మేము పండించిన ధాన్యానికి మరొకరు గింజకట్టి వ్యాపారం చేయడమేంటి, వాళ్ల దగ్గర మేము గింజలను కొనడమేంటి’’ అని ఎదురు ప్రశ్నించారు వాళ్లు. పలకా బలపం çపట్టని గిరిజన మహిళలు... దేశం బహుళ జాతి విత్తనాల కంపెనీల బారిన పడకుండా స్వయంసమృద్ధి సాధన దిశగా నడిపిస్తున్నారు. దేశీయ గింజను కాపాడటం ఎంత గొప్ప పని అనేది వాళ్లకు తెలియదు. వాళ్లకు తెలిసిందల్లా... బిష్ణోయిలు ప్రకృతిని కాపాడటానికి తమ ప్రాణాలను అడ్డువేసినట్లే, కన్నబిడ్డకూ, జింకపిల్లకూ స్తన్యమిచ్చి కాపాడినట్లే... తమతోపాటు తోటి వారి జీవితాలనూ పరిరక్షించుకోవడం. అలాగే... వ్యవసాయంలో జీవ వైవిధ్యతను కాపాడటానికి రెక్కలు ముక్కలు చేసుకోవడం, తాము జీవిస్తూ తోటి వారికి జీవికనివ్వడం కూడా. – వాకా మంజులారెడ్డి -
వదలని ‘గజ’ భయం
విజయనగరం, పార్వతీపురం/ కొమరాడ: ఏనుగుల భయం మన్యం ప్రాంత వాసులను వీడడం లేదు. నాలుగు నెలలుగా ఏనుగుల గుంపు కొమరాడ, కురుపాం, గరుగుబిల్లి, జియ్యమ్మవలస మండలాల్లో సంచరిస్తూ పంటలను నాశనం చేస్తున్న విషయం తెలిసిందే. అధికారులు ఏనుగులను వెళ్లగొట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి వెళ్లినట్లే వెళ్లి మళ్లీ తిరిగి వచ్చేస్తున్నాయి. ఇటీవల కెమిశిల పంచాయతీ నాయుడువలస గ్రామానికి చెందిన వ్యక్తి ఏనుగుల దాడిలో మృతి చెందగా మళ్లీ గంగురేగువలస గ్రామ సమీపంలో గురువారం తన పొలంలో పనిచేసుకుంటున్న గుంట్రెడ్డి రమేష్పై ఏనుగులు దాడి చేయడంతో గాయపడ్డాడు. వెంటనే స్థానికులు రమేష్ను పార్వతీపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఏనుగుల తరలింపునకు అధికారులు శాశ్వత చర్యలు తీసుకోకపోవడంతో కురుపాం నియోజకవర్గంలోని కొమరాడ, జియ్యమ్మవలస, గరుగుబిల్లి వాసులకు కంటిమీద కునుకు కరువైంది. ఏ సమయంలో ఎటువైపు నుంచి ఏనుగులు దాడి చేస్తాయోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. -
పంట వంటలు
కొత్త పంటలు కోతకు వచ్చాక వచ్చే తొలి పండుగ సంక్రాంతి.కొత్త పంటలతో సంక్రాంతి పిండివంటలు చేసుకుని ఆరగించడం మన సంప్రదాయం.కొత్తబియ్యంతో పాటు పెసలు, మినుములు, నువ్వుల వంటి అపరాలు కూడా..సంక్రాంతి నాటికి ఇంటికి చేరుతాయి. భోగినాడు బూరెలు, సంక్రాంతినాడు కొత్తబియ్యం పరవాన్నం...కనుమనాడు మినుముతో చేసిన వంటలు తినాలంటారు.ఇవి మాత్రమే కాదు, ఇంకా ఎన్నో ఎన్నెన్నో... పండుగ రోజుల్లో ఆరగించి ఆస్వాదించే కొత్త పంటల పిండివంటలు మీ కోసం... బెల్లం పరమాన్నం కావలసినవి: బియ్యం – అర కప్పు చిక్కటి పాలు – ఒకటిన్నర కప్పు పాత బెల్లం తురుము – పావు కప్పు నీళ్లు – పావు కప్పు నెయ్యి – 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు – 6 లేదా 8 తయారీ: ముందుగా బియ్యం శుభ్రం చేసుకోవాలి. తర్వాత పాలు, బియ్యం కలిపి కుక్కర్లో ఉడికించుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకుని అందులో బెల్లం తురుము, నీళ్లు వేసుకుని గరిటెతో తిప్పుతూ బెల్లం కరిగించాలి. ఇప్పుడు పాలలో ఉడికిన అన్నాన్ని బెల్లం నీళ్లలో వేసుకుని దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. కాస్త దగ్గర పడగానే నెయ్యి, జీడిపప్పు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బూరెలు కావలసినవి: బియ్యం – 1 కప్పు మినçప్పప్పు – 1 కప్పు ఉప్పు – తగినంత కొబ్బరి తురుము – ఒకటిన్నర కప్పులు బెల్లం తురుము – ముప్పావు కప్పు ఏలకుల పొడి – అర టీ స్పూన్ నీళ్లు – పావు కప్పు నెయ్యి – 1 టేబుల్ స్పూన్ నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ముందుగా బియ్యం, మినప్పప్పు నాలుగు గంటల పాటు నానబెట్టాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని పాన్లో బెల్లం తురుము, నీళ్లు వేసుకుని పాకం పట్టించుకోవాలి. లేత పాకం రాగానే కొబ్బరి తురుము వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఆ మిశ్రమం దగ్గర పడగానే ఏలకుల పొడి, నెయ్యి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన బియ్యం, మినప్పప్పు గ్రైండర్లో రుబ్బుకోవాలి. రుబ్బిన పిండిని పాత్రలోకి వేసుకోవాలి. మళ్లీ స్టవ్ ఆన్ చేసుకుని నూనె పాన్లో వేసుకుని వేడి కాగానే కొబ్బరి ఉండలను బియ్యం–మినప్పిండిలో ముంచి బూరెలు వేసుకోవాలి. కొయ్యరొట్టె కావలసినవి: బియ్యప్పిండి – 2 కప్పులుశనగపప్పు – అర కప్పు(రెండు గంటల ముందు నానబెట్టాలి)ఉల్లిపాయ తరుగు – 1 కప్పు / క్యారెట్ తురుము – 1 కప్పు కొత్తిమీర తురుము – అర కప్పు / పచ్చిమిర్చి తరుగు – 1 టేబుల్ స్పూన్జీలకర్ర – 2 టేబుల్ స్పూన్లు / నూనె – 2 టేబుల్ స్పూన్లుఉప్పు – తగినంత / వేడి నీళ్లు – తగినన్ని తయారీ: ముందుగా నానబెట్టిన శనగపప్పును మిక్సీ బౌల్లో వేసుకుని, మెత్తగా ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద బౌల్లో బియ్యప్పిండి, శనగపప్పు ముద్ద, ఉల్లిపాయ తరుగు, క్యారెట్ తురుము, కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి తరుగు, జీలకర్ర, ఉప్పు వేసుకుని అందులో కొద్ది కొద్దిగా వేడి నీళ్లు వేస్తూ ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఆ ముద్దను బాల్స్లా చేసుకుని, కొద్దిగా చేతులకు నూనె రాసుకుని... ఆ బాల్స్ని రొట్టెలా అత్తుకుని... నూనెలో దోరగా వేయించుకోవాలి. రైస్ హల్వా కావలసినవి: బియ్యప్పిండి – 1 కప్పు / బెల్లం తురుము – 2 కప్పులు క్కటి పాలు – 1 కప్పు / కొబ్బరి పాలు – 3 కప్పులుఏలకుల పొడి – 1 టీ స్పూన్ / నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు / డ్రై ఫ్రూట్స్ – కొన్ని తయారీ: ముందుగా పాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేసి అందులో డ్రై ఫ్రూట్స్ దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బెల్లం తురుము, కొబ్బరి పాలు పాన్లో వేసుకుని బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత చెత్తను తొలగించేందుకు ఆ మిశ్రమాన్ని వడకట్టుకోవాలి. పాన్ను శుభ్రం చేసుకుని బియ్యప్పిండిని వేసుకుని కొద్ది కొద్దిగా బెల్లం–కొబ్బరిపాల మిశ్రమాన్ని వేస్తూ ఉండలుగా మారకుండా గరిటెతో తిప్పాలి. మీడియం మంటపైనే ఆ మిశ్రమం మొత్తం దగ్గరపడేలా గరిటెను ఉపయోగిస్తూ అడుగంటకుండా జాగ్రత్త పడాలి. మిశ్రమం గట్టిపడటం మొదలైన తర్వాత... చిక్కటి పాలు జోడించి గరిటెతో తిప్పాలి. మళ్లీ దగ్గర పడుతున్న సమయంలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి జోడించి తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు ఏలకుల పొడి వేసుకుని కలుపుకోవాలి. మిశ్రమం మరింత దగ్గర పడగానే మిగిలిన నెయ్యి కూడా వేసి గరిటెతో తిప్పి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత నచ్చిన షేప్లో కట్ చేసుకుని, డ్రై ఫ్రూట్స్తో పాటు సర్వ్ చేసుకుంటే హల్వా ముక్కలు భలే టేస్టీగా ఉంటాయి. కొబ్బరి అన్నం కావలసినవి: అన్నం – 2 కప్పులు / నూనె – 3 టీ స్పూన్లు / ఆవాలు – అర టీ స్పూన్ / జీలకర్ర – అర టీ స్పూన్ / జీడిపప్పు – 2 టీ స్పూన్లు / పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్ / అల్లం తురుము – అర టీ స్పూన్ / ధనియాల పొడి – అర టీ స్పూన్/ కరివేపాకు – 2 రెమ్మలు / కొబ్బరి తురుము – 1 కప్పు / ఇంగువ – చిటికెడు / నిమ్మరసం – 1 టీ స్పూన్/ ఉప్పు – తగినంత / కొత్తిమీర – కొద్దిగా తయారీ: ముందుగా పాన్లో నూనె వేసుకుని వేడి కాగానే... అందులో ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము, ధనియాల పొడి, కరివేపాకు, ఇంగువ వేసుకుని గరిటెతో తిప్పుతూ బాగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు కొబ్బరి తురుము, ఉప్పు వేసుకుని బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు అన్నం కూడా వేసుకుని బాగా గరిటెతో తిప్పుతూ ఉండాలి. చివరిగా నిమ్మరసం వేసుకుని మరోసారి మొత్తం కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకునే ముందు కొత్తిమీర తురుము వేసుకుని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. దద్ధోజనం కావలసినవి: అన్నం – 2 కప్పులు / గడ్డ పెరుగు – ఒకటింపావు కప్పులుతాజా మీగడ – 2 టేబుల్ స్పూన్లు/ నూనె – 1 టేబుల్ స్పూన్శనగపప్పు – 1 టీ స్పూన్/ మినప్పప్పు – 1 టీ స్పూన్/ ఆవాలు – 1 టీ స్పూన్జీలకర్ర – 1 టీ స్పూన్/ కరివేపాకు – 12 లేదా 15/ ఎండు మిర్చి – 2ఇంగువ – చిటికెడు/ మెంతులు – అర టీ స్పూన్/ ఉప్పు – తగినంతదానిమ్మ గింజలు – 2 టేబుల్ స్పూన్లుకొత్తి మీర – 2 రెమ్మలు (అభిరుచిని బట్టి) తయారీ: ముందుగా ఒక బౌల్లో అన్నం, గడ్డ పెరుగు, తాజా మీగడ వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్లో నూనె వేసుకుని, వేడి చేసుకుని, శనగపప్పు, మినçప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, ఎండు మిర్చి, మెంతులు వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉప్పు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని పెరుగు అన్నంలో వేసుకుని గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పైన దానిమ్మ గింజలు, కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. రవ్వ పులిహార కావలసినవి: బియ్యం రవ్వ – 2 కప్పులు / నీళ్లు – ఒకటిన్నర కప్పునిమ్మకాయ – 1/ పచ్చిమిర్చి – 2 లేదా 3 / నూనె – 2 టేబుల్ స్పూన్లుఆవాలు – 1 టీ స్పూన్ / జీలకర్ర – 1 టీ స్పూన్ / మెంతులు –పావు టీ స్పూన్ / శనగపప్పు – 2 టీ స్పూన్లు / మినప్పప్పు – 2 టీ స్పూన్లు / వేరుశనగలు – 1 టేబుల్ స్పూన్ / ఎండు మిర్చి – 1 / జీడిపప్పు – 1 టేబుల్ స్పూన్ / ఉప్పు – తగినంతకరివేపాకు – 2 రెమ్మలు / పసుపు – 1 టీ స్పూన్అల్లం పేస్ట్ – 1 టీ స్పూన్ తయారీ: ముందుగా బియ్యం శుభ్రం చేసుకుని... రవ్వను పాన్లో వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు బియ్యం, నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసుకుని కుక్కర్లో మూడు విజిల్స్ వెయ్యించాలి. ఇప్పుడు నిమ్మరసంలో పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని నానబెట్టాలి. తర్వాత పాన్లో నూనె వేడి చేసుకుని ఆవాలు, జీలకర్ర, మెంతులు, శనగపప్పు, మినప్పప్పు, వేరుశనగలు, ఎండు మిర్చి, కరివేపాకు, జీడిపప్పు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో ఉప్పు, పసుపు, అల్లం పేస్ట్ వేసుకుని గరిటెతో తిప్పుతూ ఆ వేడి మిశ్రమంలో బాగా కలపాలి. తర్వాత ఒక పెద్ద బౌల్లో ఉడికిన బియ్యం రవ్వ, తాలింపు మిశ్రమం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నిమ్మరసం–పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటుంది. కట్టు పొంగలి కావలసినవి: బియ్యం – అర కప్పు / పెసరపప్పు – అర కప్పు / నీళ్లు – 3 కప్పులు / ఉప్పు – తగినంత / అల్లం తురుము – 1 టీ స్పూన్ / నెయ్యి – 3 లేదా 4 టేబుల్ స్పూన్లు / జీలకర్ర – 1 టీ స్పూన్ / ఇంగువ – చిటికెడు / కరివేపాకు – 10 లేదా 12 / పచ్చిమిర్చి – 2(పొడవుగా కట్ చేసుకోవాలి) / జీడిపప్పు –10 లేదా 12 / మిరియాలు– 10 (కొద్దిగా దంచి) తయారీ: ముందుగా పెసరపప్పుని దోరగా వేయించాలి. తర్వాత ఆ పెసరపప్పులో శుభ్రం చేసిన బియ్యం, నీళ్లు, ఉప్పు, అల్లం పేస్ట్ వేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మెత్తగా ఉడికిన మిశ్రమాన్ని గరిటెతో తిప్పుతూ మరింత మెత్తగా చేసుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకుని అందులో నెయ్యి వేసుకుని వేడికాగానే... జీలకర్ర , కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, జీడిపప్పు, ఇంగువ, మిరియాల పొడి వేసుకుని బాగా వేయించాలి. వెంటనే ఆ మిశ్రమాన్ని బియ్యం–పెసరపప్పు మిశ్రమంపైన వేసుకుని సర్వ్ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటుంది. పాల తాలికలు కావలసినవి: బియ్యప్పిండి – అర కప్పు / నెయ్యి – 1 టీ స్పూన్ / ఉప్పు – చిటికెడు / పాలు – రెండు కప్పులు / కొబ్బరి తురుము – పావు కప్పు / ఏలకుల పొడి – అర టీ స్పూన్/ బెల్లం – పావు కప్పు+ 1 టేబుల్ స్పూన్ / నీళ్లు – అర కప్పు తయారీ: ముందుగా పావు కప్పు నీళ్లు వేడి చేసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ బెల్లం వేసుకుని పాకం తయారు చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద పాత్రలో బియ్యప్పిండి, ఉప్పు వేసుకుని బెల్లం పాకం కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఆ ముద్దను చిన్న చిన్న బాల్స్లా చేసుకుని నెయ్యి ఉపయోగిస్తూ తాలికలు రెడీ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని పాలు వేడి చేసుకుని... తాలికలు విరిగిపోకుండా మెల్లగా గరిటెతో ముందుకు వెనక్కి తిప్పుతూ.. పాలు బాగా చిక్కబడేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు అందులో కొబ్బరి తురుము, ఏలకుల పొడి వేసుకుని కలుపుకుని కాసేపు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మరో పాత్ర తీసుకుని అందులో పావు కప్పు బెల్లం, పావు కప్పు నీళ్లు తీసుకుని స్టవ్పైన పాకం తయారు చేసుకోవాలి. తర్వాత పూర్తిగా చల్లారిన పాల తాలికల్లో వేడి వేడి బెల్లం పాకం కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ జోడించి సర్వ్ చేసుకుంటే రుచి మరింత పెరుగుతుంది. దిబ్బరొట్టె కావలసినవి: బియ్యం – 1 కప్పు / మిన్నప్పప్పు – అర కప్పు / బేకింగ్ సోడా – పావు టీ స్పూన్ / పచ్చిమిర్చి తరుగు – 1 టీ స్పూన్ / జీలకర్ర – పావు టీ స్పూన్ / నూనె – 1 టేబుల్ స్పూన్ / ఉల్లిపాయ తరుగు – 3 టీ స్పూన్లు / ఉప్పు – తగినంతకరివేపాకు – ఒకటి లేదా రెండు రెమ్మలు తయారీ: ముందుగా బియ్యం, మిన్నప్పప్పు నాలుగు లేదా ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత వాటిని మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. తగినంత ఉప్పు, బేకింగ్ సోడా కూడా వేసుకుని మరోసారి మిక్సీ పట్టుకుని మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి తరుగు, జీలకర్ర, ఉల్లిపాయ తరుగు, కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పాన్లో నూనె వేసుకుని పిండిని దళసరిగా రొట్టె వేసుకుని, ఆ పాత్రకు సరిపడా మూత పెట్టి, దానిపైన నిప్పులు వేసుకోవాలి. దానివల్ల రెండు వైపులా దోరగా వేగుతుంది. అయితే నిప్పులు వేసుకుని అవకాశం లేనివాళ్లు ఆ పాత్రకు మూత పెట్టుకుని, ఆ దిబ్బరొట్టె అడుగున బాగా వేగిన తర్వాత జాగ్రత్తగా తిరగేసి మరోవైపు కూడా వేయించుకోవాలి. చక్కెర పొంగలి కావలసినవి: బియ్యం – అర కప్పు / పెసరపప్పు – పావు కప్పునీళ్లు – తగినంత / బెల్లం – ముప్పావు కప్పు / జీడిపప్పు – 10 లేదా 15నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు+రెండు టీ స్పూన్లు / కిస్మిస్ – 2 టీ స్పూన్లు తయారీ: ముందుగా బియ్యం, పెసరపప్పు శుభ్రం చేసుకుని కుక్కర్లో వేసుకోవాలి. అందులో రెండున్నర కప్పులు వేసుకుని నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. తర్వాత పాన్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని అందులో కిస్మిస్, జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పావు కప్పు నీళ్లు, ముప్పావు కప్పు బెల్లం వేసుకుని బాగా కరిగించుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని వడకట్టి ఉడికిన పప్పుఅన్నంలో వేసుకుని మరో రెండు నిమిషాలు గరిటెతో తిప్పుతూ ఉడికించాలి. ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి... కొద్దిగా నీళ్లు వేసుకుని మరోసారి ఉడికించుకోవాలి. చివరిగా నేతిలో వేయించిన కిస్మిస్, జీడిపప్పు వేసుకుని గరిటెతో తిప్పుతూ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చింతపండు పులిహోర కావలసినవి: అన్నం – 5 లేదా 6 కప్పులు/ చింతపండు – ఒక కప్పు / నూనె – 3 లేదా 4 టేబుల్ స్పూన్లు ఎండు మిర్చి, పచ్చిమిర్చి – 3 చొప్పున (ముక్కలు చేసుకోవాలి) / వేరుశనగలు – అర కప్పు / మినప్పప్పు – 1 టేబుల్ స్పూన్ / శనగప్పప్పు – 1 టేబుల్ స్పూన్ / కరివేపాకు – 2 రెమ్మలు/ ఆవాలు – 1 టీ స్పూన్/ పసుపు – అర టీ స్పూన్ ఇంగువ – చిటికెడు / ఉప్పు – తగినంత తయారీ: ముందుగా చింతపండు శుభ్రం చేసుకుని మంచినీళ్లలో నానబెట్టి పక్కనుంచాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. అందులో వేరుశనగలు, మినప్పప్పు, శనగప్పప్పు, ఆవాలు, పచ్చిమిర్చి–ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు, పసుపు, ఇంగువ ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ... దోరగా వేగిన తర్వాత నానబెట్టిన చింతపండు గుజ్జు అందులో వేసుకుని ఉడకనివ్వాలి. ఆ మిశ్రమం దగ్గర పడగానే ఉప్పు కూడా వేసి గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఆ మిశ్రమం కుతకుతలాడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా చల్లారనివ్వాలి. తర్వాత ఒక పెద్ద బౌల్లో అన్నం, చింతపండు మిశ్రమాన్ని వేసుకుని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. పునుగులు కావలసినవి: దోసె పిండి – 1 కప్పు / బియ్యప్పిండి – 3 టేబుల్ స్పూన్లు / పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్ / ఉల్లిపాయ ముక్కలు – 3 టీ స్పూన్లు / అల్లం తురుము – పావు టీ స్పూన్ / కొత్తిమీర తురుము – 2 టీ స్పూన్లు / జీలకర్ర – అర టీ స్పూన్ / ఉప్పు – తగినంత / నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బియ్యప్పిండి, దోసె పిండి, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తురుము, కొత్తిమీర తురుము, జీలకర్ర, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్లో నూనె వేసుకుని వేడి కాగానే... కొద్ది కొద్దిగా ఆ మిశ్రమాన్ని వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ పునుగులు కొబ్బరి చట్నీలో నంజుకుని తింటే భలే టేస్టీగా ఉంటాయి. రవ్వ పాయసం కావలసినవి: నెయ్యి – 1 టేబుల్ స్పూన్ / కిస్మిస్ – 1 టీ స్పూన్జీడిపప్పు – 2 టీ స్పూన్లు / బియ్యం రవ్వ – 3 టేబుల్ స్పూన్లుపాలు – 2 కప్పులు / పంచదార – పావు కప్పు / ఏలకుల పొడి – పావు టీ స్పూన్ తయారీ: ముందుగా నేతిలో కిస్మిస్, జీడిపప్పు దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ నేతిలోనే బియ్యం రవ్వ వేసుకుని, గరిటెతో తిప్పుతూ దోరగా వేయించి అందులో పాలు, పంచదార వేసుకుని మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ మూడు లేదా నాలుగు నిమిషాల పాటు ఉడకనివ్వాలి. కాస్త చిక్కపడిన తర్వాత ఏలకుల పొడి, వేయించి పక్కన పెట్టుకున్న కిస్మిస్, జీడిపప్పు వేసుకుని కాసేపు గరిటెతో తిప్పుతూ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఉండ్రాళ్లు కావలసినవి: బియ్యప్పిండి – 1 కప్పు / నీళ్లు – ఒకటిన్నర కప్పులు / నువ్వుల నూనె – రెండున్నర టీ స్పూన్లు / నూనె – రెండు టీ స్పూన్లు / ఆవాలు – 1 టీ స్పూన్ / మినప్పప్పు – 1 టీ స్పూన్ / కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు / ఎండుమిర్చి – 2 / పచ్చిమిర్చి –2 ఉప్పు – తగినంత తయారీ: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాత్రలో నీళ్లు, రెండు టీ స్పూన్ల నువ్వుల నూనె, ఉప్పు వేసుకుని బాగా మరిగించాలి. ఇప్పుడు అందులో బియ్యప్పిండి వేస్తూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. అడుగంటకుండా తిప్పుతూ నీళ్లు మొత్తం ఆవిరి కాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఐదు లేదా ఏడు నిమిషాల పాటు ఆవిరిలో ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో పాత్ర తీసుకుని అందులో నూనె వేసుకుని వేడికాగానే మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. చివరగా కొబ్బరి తురుము వేసుకుని గరిటెతో తిప్పుతూ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఉండ్రాళ్లపైన ఈ మిశ్రమాన్ని వేసి సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉంటాయి. చలిమిడి కావలసినవి: బియ్యప్పిండి – 1 కప్పు (బియ్యం నానబెట్టుకుని అప్పటికప్పుడు మిక్సీలో పిండి చేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది) / బెల్లం – అర కప్పు / కొబ్బరి కోరు – పావు కప్పు / నెయ్యి – 1 టీ స్పూన్ తయారీ: ముందుగా బెల్లం మిక్సీలో వేసుకుని పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో బియ్యప్పిండి, బెల్లం, కొబ్బరి కోరు, నెయ్యి వేసుకుని బాగా మెత్తగా ముద్దలా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్లా సిద్ధం చేసుకుంటే సర్వ్ చేసుకునేందుకు, తినేందుకు అందంగానూ సులభంగానూ ఉంటాయి. మినపగారెలు కావలసినవి: మినప్పప్పు – 250 గ్రాములు / అల్లం– 2 అంగుళాల ముక్క / పచ్చిమిరపకాయలు – 6 / కరివేపాకు– ఒక రెమ్మ/ ఇంగువ – అర టీస్పూన్/ ఉప్పు– తగినంత / నెయ్యి– ఒక టీస్పూన్ / నూనె– వేపుడుకు తగినంత తయారీ: మినప్పప్పును గంటసేపు నానబెట్టి, మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. గారెల కోసం రుబ్బుకొనే పిండి కాస్త గట్టిగా ఉండేలా చూసుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి సన్నగా తరిగిపెట్టుకోవాలి. వీటితో పాటు కరివేపాకు, ఇంగువ, ఉప్పు, నెయ్యి పిండిలో కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌ వెలిగించి, మూకుడులో నూనె మరిగించుకోవాలి. పిండిని వత్తుకుని, మధ్యలో రంధ్రం చేసి, వేయించుకోవాలి. గారెలు బాగా వేగి రంగు మారిన తర్వాత మూకుడులోంచి తీసి, వేరే పాత్రలోకి తీసుకోవాలి. వేడి వేడి గారెలు కొబ్బరి పచ్చడి, అల్లం చట్నీతో తింటే రుచిగా ఉంటాయి. చంద్రకాంతాలు కావలసినవి: పెసరపప్పు– ఒక కప్పు / పంచదార– ఒక కప్పు / పచ్చి కొబ్బరి – ఒక చెక్క (తురుముకోవాలి) / జీడిపప్పు పలుకులు – ఒక టేబుల్ స్పూన్ / ఏలకుల పొడి – ఒక టీ స్పూన్ / పచ్చకర్పూరం– చిటికెడు తయారీ: పెసరపప్పును గంటసేపు నానబెట్టుకోవాలి. నీరు ఒంపేసిన తర్వాత మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. పచ్చికొబ్బరి తురుము, పంచదార ఈ పిండిలో కలుపుకోవాలి. దళసరి పాత్రను స్టౌ మీద పెట్టి, అది వేడెక్కిన తర్వాత ఈ మిశ్రమాన్ని పాత్రలో వేసుకుని, అడుగంటకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి. హల్వాలా మిశ్రమం చిక్కబడిన తర్వాత అందులో జీడిపప్పు, పచ్చకర్పూరం, ఏలకుల పొడి వేసుకోవాలి. ఒక పీట లేదా చెక్క బల్ల మీద తెల్లని దళసరి వస్త్రాన్ని తడిపి పరుచుకోవాలి. దాని మీద ఈ మిశ్రమాన్ని మందపాటి బిళ్లలుగా వత్తుకుని పేర్చుకోవాలి. ఇప్పుడు వీటిని స్టౌ మీద మూకుడు పెట్టి, అందులో నెయ్యివేసి మరిగించాలి. వీటిని నేతిలో వేయించుకోవాలి. బంగారు రంగులోకి రాగానే తీసేయాలి. వేడివేడిగా తిన్నా, బాగా చల్లారిన తర్వాత తిన్నా చంద్రకాంతాలు చాలా రుచిగా ఉంటాయి. -
కమ్ముకున్న కరువు మేఘాలు
సాక్షి, అమరావతి: కనుచూపు మేరలో ఎక్కడ చూసినా ఎండిన పైర్లు, బీడు భూములే. తినడానికి మేత దొరక్క బక్కచిక్కిన పశువులు.. మైళ్ల దూరం నుంచి బిందెల్లో నీరు మోసుకెళుతున్న మహిళలు... వ్యవసాయం సాగక, పనుల్లేక పొట్ట చేతపెట్టుకుని బతుకు జీవుడా అంటూ వలసబాట పట్టిన రైతన్నలు, వ్యవసాయ కూలీలు.. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎక్కడా చూసినా ఇలాంటి దయనీయ దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. సాధారణంగా జూన్–సెప్టెంబరు మధ్య ఖరీఫ్ సీజన్లోనే కరువు తీవ్రత కనిపిస్తుంది. ఈ ఏడాది రబీ సీజన్లోనూ దుర్భిక్షం తాండవిస్తుం డడం గమనార్హం. సాధారణంగా వేసవిలో నీటికోసం రైతులు బోర్లు వేస్తుంటారు. ప్రస్తుతం వేసవి కాకపోయినా నీటి దొరక్కపోవడంతో పంటలను, తోటలను కాపాడుకోవడానికి అప్పులు చేసి మరీ బోర్లు వేస్తున్నారు. అనంతపురం, కర్నూలు, వైస్సార్, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 800 నుంచి 1,000 అడుగుల లోతు వరకు బోర్లు వేసినా నీటి జాడ కనిపించడం లేదు. గతేడాది డిసెంబరు 27వ తేదీన రాష్ట్రంలో సగటు భూగర్భ జలమట్టం 35.62 అడుగులు కాగా, ప్రస్తుతం 42.12 అడుగులకు పడిపోయింది. రబీ ఆశలూ అడియాసలు ఖరీఫ్లో కరువు కాటు వల్ల పంటలు పోగొట్టుకుని అప్పులపాలైన రైతులు రబీలోనైనా ఎంతో కొంత పంటలు పండుతాయని ఆశపడ్డారు. పెట్టుబడుల కోసం అప్పులు చేసి పంటలు సాగు చేశారు. అక్టోబరులో పంటలు విత్తిన తర్వాత వర్షాలు పడలేదు. తుపాన్ల సీజన్గా పేరొందిన రబీలోనూ ఏకంగా12 జిల్లాల్లో కరువు మేఘాలు కమ్ముకున్నాయి. డిసెంబరు ముగుస్తున్నా నీటి తడి లేక రబీలోనూ పంటలన్నీ మాడిపోతున్నాయి. ఖరీఫ్లోనూ, ప్రస్తుత రబీలోనూ వేరుశనగ కంది, పత్తి, పెసర, మినుము, పొద్దుతిరుగుడు, ఉల్లి పైర్లు పొలాల్లోనే మలమలా మాడిపోయాయి. పెట్టుబడులు మట్టిపాలయ్యాయి.రైతన్నలపై అప్పుల భారం పెరిగింది. పైర్లు ఎండిపోవడంతో రైతులు పొలాల్లో పశువులను మేపుతున్నారు. కర్నూలు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో వాడిపోయిన పంటలను దున్నేస్తున్నారు. కబేళాలకు తరలుతున్న పశువులునాలుగేళ్లుగా వరుస కరువులతో చితికిపోయిన అన్నదాతలు, వ్యవసాయ కూలీలు ఈ రబీపై పెట్టుకున్న ఆశలు కూడా అడియాశలయ్యాయి. ప్రస్తుతం వరుణుడు ముఖం చాటేయడంతో కరువు తీవ్రత మరింత పెరిగింది. భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయి. పశుగ్రాసం లేక పశువులు బక్కచిక్కిపోతుండటంతో పాడిపై ఆధారపడిన రైతుల పరిస్థితి దీనంగా మారింది.చాలామంది మరోదారి లేక పశువులను కబేళాలకు అమ్మేస్తున్నారు. పరాయి రాష్ట్రాల్లో బతుకు పోరాటం రైతులు, వ్యవసాయ కూలీలు ఉపాధి కోసం కుటుంబాలతో సహా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. అనంతపురం జిల్లా నుంచి కేరళ, కర్ణాటకకు వలసలు భారీగా పెరిగాయి. వైఎస్సార్ జిల్లాలోని రాయచోటి, గాలివీడు, సుండుపల్లి, లక్కిరెడ్డిపల్లి ప్రాంతాల పేద రైతులు, కూలీలు ఎక్కువగా బెంగళూరులో పనుల వెతుక్కుంటున్నారు. కర్నూలు జిల్లా నుంచి ఎక్కువగా హైదరాబాద్కు వలస వెళుతున్నారు. వలస వెళ్తున్న వారితో రైల్వే స్టేషన్లు, బస్స్టేషన్లు నిత్యం కిటకిటలాడుతున్నాయి. పనిచేసే శక్తి ఉన్నవారు వలసబాట పట్టడంతో చాలా గ్రామాల్లో వృద్ధులు మాత్రమే కనిపిస్తున్నారు. బాధితులను ఆదుకోవడానికి చేతులు రాని ప్రభుత్వం రాయలసీమ జిల్లాల్లో ప్రధాన పంట అయిన వేరుశనగ ఖరీఫ్ సీజన్లో పూర్తిగా నేలపాలైంది. రబీలో వేసిన శనగ, కంది, మినుము, పెసర పంటలు కూడా వర్షాభావం వల్ల ఎండిపోయాయి. టమోటా, మిరప, బెండ, వంగ తోటలు కూడా నీరులేక వాడిపోయాయి. తమ పరిస్థితి ఏటేటా దిగదుడుపుగా మారిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరువు కాటేస్తున్నా ప్రభుత్వం ఆదుకోవడం లేదని వాపోతున్నారు. అప్పులు ఎలా తీర్చాలో, కుటుంబాలను ఎలా పోషించుకోవాలో తెలియక రైతులు మానసికంగా కుంగిపోయి, బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఖరీఫ్లో 450కి పైగా మండలాల్లో కరువు ఉన్నప్పటికీ ప్రభుత్వం 316 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించి చేతలు దులుపుకుంది. దుర్భిక్షం వల్ల పంటలు నష్టపోయిన రైతులకు పైసా కూడా పెట్టుబడి రాయితీ ఇవ్వలేదు. రబీలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించలేదు. రెయిన్ గన్తో పంటలను రక్షించామని గతంలో గొప్పగా చెప్పుకున్న ప్రభుత్వం ఈసారి ఆ ఊసే ఎత్తలేదు. 12 జిల్లాల్లో కరువు విలయ తాండవం రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తోంది. అక్టోబరు ఒకటో తేదీతో ఆరంభమైన రబీ సీజన్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. శ్రీకాకుళం జిల్లా మినహా మిగిలిన 12 జిల్లాల్లోనూ దుర్భిక్షం తీవ్రత అధికంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్లో ఇప్పటివరకూ కురవాల్సిన కనీస సగటు సాధారణ వర్షంతో పోల్చితే సగం కూడా కురవకపోవడం గమనార్హం. కర్నూలు జిల్లాలో అయితే కురవాల్సిన దానిలో కేవలం 29 శాతం మాత్రమే కురిసింది. రాష్ట్రంలో ఈ సీజన్లో ఇప్పటివరకూ 279.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 121.2 మిల్లీమీటర్లు మాత్రమే (57 శాతం తక్కువ) నమోదైంది. సాధారణం కంటే కోస్తాంధ్రలో 54 శాతం, రాయలసీమలో 62 శాతం సగటు లోటు వర్షపాతం రికార్డయింది. ఇవన్నీ అధికారిక గణాంకాలే కావడం గమనార్హం. ముప్పావు ప్రాంతంలో దుర్భిక్షమే రబీలోనే కాదు అంతకు ముందు ఖరీఫ్ సీజన్ నుంచి కరువు తిష్ట వేసింది. జూన్ 1వ తేదీతో ఆరంభమైన ఖరీఫ్ సీజన్ ఇప్పటివరకూ నమోదైన అధికారిక వర్షపాతం గణాంకాల ప్రకారం.. 480 మండలాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. అంటే రాష్ట్రంలో 72 శాతం ప్రాంతంలో కరువు తాండవిస్తోంది. అప్పులు ఎలా తీర్చాలో... ‘‘ఇంతటి దారుణ పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. సాగు చేసిన పంటలన్నీ కళ్ల ముందే ఎండిపోయాయి. రబీలో రూ.3 లక్షల ఖర్చు పెట్టి 18 ఎకరాల్లో శనగ పంట వేశా. వర్షాల్లేక పంటంతా ఎండిపోయింది. పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచడం లేదు’’ – తేనేశ్వరరెడ్డి, రైతు, కోడుమూరు, కర్నూలు జిల్లా ప్రభుత్వం ఆదుకోవడం లేదు ‘‘రూ.లక్ష ఖర్చు పెట్టి 8 ఎకరాల్లో జొన్న పంట సాగు చేశా. విత్తనాలు వేసే సమయంలో కురిసిన వాన తప్ప తర్వాత చినుకు పడలేదు. జొన్న పంటంతా ఎండిపోయింది. వానల్లేక ప్రతిఏటా పంటలు ఎండిపోతుండడంతో నష్టాలే మిగులుతున్నాయి. ప్రభుత్వం ఏమాత్రం ఆదుకోవడం లేదు’’ – విష్ణువర్దన్రెడ్డి, రైతు, ప్యాలకుర్తి, కర్నూలు జిల్లా -
చిన్న స్కీమ్లో పెద్ద స్కామ్!
సాక్షి, అమరావతి : కేవలం రూ.9.21కోట్లతో పూర్తయ్యే పని అది. కానీ, రూ.26.63కోట్లకు అంచనాలు పెంచారు. అంతటితో ఆగలేదు.. ఆయకట్టుకు చుక్క నీరు ఇవ్వకుండానే పంటలు సాగుచేసినట్లు, చివరి భూములు కావడంతో నీళ్లందక పంటలు ఎండిపోతున్నట్లు మాయమాటలు చెప్పారు. వాటిని రక్షించాలంటే కాల్వ పనులు పూర్తిచేయాలని స్కెచ్ వేశారు. అంతే.. ఆఘమేఘాలపై చక్రం తిప్పారు. ఆ పనులను తమ అనుకూల సంస్థ అయిన ‘మేఘా’కు నామినేషన్పై అప్పగించాలని తెలుగుగంగ సీఈపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆయన అంగీకరిస్తూ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. కానీ, అక్కడ కథ అడ్డం తిరిగింది. టెండర్లు తప్పనిసరి కావడంతో అందుకు తగ్గట్టుగా వ్యూహం మార్చారు. మరోసారి తమ అనుకూల సంస్థకే పనులు దక్కేలా నిబంధనలు రూపొందించారు. అంతే.. ఇక అక్కడ నుంచి అనుకున్నవన్నీ చకచకా జరిగిపోయాయి. రూ.17కోట్లకు పైగా కమీషన్లు రాబట్టుకోడానికి చిన్న స్కీం ముసుగులో పెద్ద స్కామ్కు తెరలేపిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అక్రమాల బాగోతం ఇదిగో ఇలా జరిగింది... నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలంలో కనుపూర్ కెనాల్ కింద 12,500 ఎకరాల చివరి ఆయకట్టు భూములకు సక్రమంగా నీళ్లందడంలేదు. డేగపూడి–బండేపల్లి లింక్ కెనాల్ పనులు పూర్తిచేసి.. కనుపూర్ కెనాల్ చివరి ఆయకట్టుకు నీళ్లందిస్తేనే 2019 ఎన్నికల్లో ప్రచారానికి వస్తానని పొదలకూరు మండలంలో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి 2014 ఎన్నికల సమయంలో వాగ్దానం చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాకాని గోవర్ధన్రెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. అనంతరం సోమిరెడ్డి ఎమ్మెల్సీ అయి మంత్రి అయ్యారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్లపాటు లింక్ కెనాల్ పనులను పట్టించుకోని ఆయన తాజాగా ఎన్నికలు ముంచుకొస్తుండటంతో ఆ పనుల ద్వారా కమీషన్లు దండుకునేందుకు వాటికి పరిపాలన అనుమతి వచ్చేలా చక్రం తిప్పారు. అందుకు అవసరమైన భూసేకరణకు రూ.10.29 కోట్లను విడుదల చేయడానికి సర్కార్ అంగీకరించింది. ఆ తర్వాత కండలేరుపై ఆనకట్ట, డేగపూడి–బండేపల్లి లింక్ కెనాల్ను రూ.31.40కోట్లతో తవ్వే పనులకు నవంబరు 11న సర్కార్ అనుమతిచ్చింది. నిబంధనలు అడ్డుపెట్టుకుని.. నామినేషన్ ఎత్తుగడను జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్కుమార్ చిత్తు చేయడంతో మళ్లీ మేఘా సంస్థకు పనులు దక్కేలా నిబంధనలు రూపొందించి ఈనెల 17న టెండర్ నోటిఫికేషన్ జారీచేసి జనవరి 4న ప్రైస్ బిడ్ తెరిచేలా మంత్రి సోమిరెడ్డి చక్రం తిప్పారు. అంతేకాదు.. పనులు చేసేటప్పుడు వాటికి అనుబంధంగా ఏవైనా అదనపు పనులు చేయాల్సి వస్తే వాటిని టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థకే నామినేషన్పై కట్టబెట్టాలన్న షరతు విధించారు. వాస్తవంగా కండలేరుపై ఆనకట్టను రూ.3.50 కోట్లతో.. 250 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో 9.275 కి.మీల కెనాల్ను, వాటిపై బ్రిడ్జిలతో కలిపి 5.71 కోట్లతో, మొత్తం రూ.9.21కోట్లతో పూర్తిచేయవచ్చునని జలవనరుల శాఖ అధికారులే చెబుతున్నారు. కానీ.. మంత్రి సోమిరెడ్డి ఒత్తిడి మేరకు అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా రూ.26.63 కోట్లకు పెంచేశారు. నిజానికి.. 2017–18 ధరల ప్రకారం ఎం–20 కాంక్రీట్ క్యూబిక్ మీటర్కు అయ్యే వ్యయం రూ.5143.23 మాత్రమే. కానీ.. ఈ పనుల్లో దాన్ని రూ.8247.88కు ఇష్టారాజ్యంగా పెంచేశారు. మట్టి పనుల నుంచి కాంక్రీట్ పనుల వరకూ అన్నింటా ఇదే కథ. అనుకూల సంస్థకు పనులు కట్టబెట్టేస్తే రూ.17 కోట్లకు పైగా కమీషన్లు వసూలు చేసుకోవడానికి సోమిరెడ్డి పావులు కదుపుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దీన్ని బట్టి చూస్తే, ఈ పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టడంలో రైతుల ప్రయోజనాల కంటే.. సోమిరెడ్డి కమీషన్ల యావే ఎక్కువగా ఉందన్నది స్పష్టమవుతోందని టీడీపీ వర్గాలే ఆరోపిస్తున్నాయి. కమీషన్ల కోసం వ్యూహం ఈ నేపథ్యంలో.. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆ పనులను నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్పై కట్టబెట్టి భారీఎత్తున కమీషన్లు రాబట్టుకోవడానికి మంత్రి సోమిరెడ్డి పథక రచన చేశారు. అందులో భాగంగా కండలేరు ఆనకట్ట, 9.275 కిమీల పొడవున డేగపూడి–బండేపల్లి కెనాల్ తవ్వకం పనులను మేఘా సంస్థకు నామినేషన్ పద్ధతిలో అప్పగించాలని తెలుగుగంగ సీఈ ఆర్.మురళీనాథ్రెడ్డిపై సోమిరెడ్డి ఒత్తిడి తెచ్చారు. మంత్రి సూచనలతో.. ఆ పనులు రూ.26.63 కోట్లకు తమకు నామినేషన్పై అప్పగిస్తే.. మూడు నెలల్లో పూర్తిచేస్తామని ఈనెల 12న సీఈకి మేఘా సంస్థ లేఖ రాసింది. అలాగే, మంత్రి ఒత్తిడి చేయడంతో.. ఆ పనులను సదరు సంస్థకు నామినేషన్పై అప్పగించేందుకు అనుమతివ్వాలని సీఈ తన ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. కానీ, జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్కుమార్ వాటిని తోసిపుచ్చారు. కండలేరు ఎడమ కాలువ ఎత్తిపోతల పథకాన్ని మేఘా సంస్థ ఇటీవలే పూర్తిచేసిందని.. యంత్రాలు, సామగ్రి అందుబాటులో ఉండటంవల్ల ఆ సంస్థ తక్షణమే పనులు పూర్తిచేసి, పంటలను రక్షించగలుగుతుందని తన ప్రతిపాదనల్లో సీఈ పేర్కొనడాన్ని శశిభూషణ్ తప్పుబట్టారు. నీటినే విడుదల చేయనప్పుడు పంటలు ఎలా సాగుచేశారని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. అంతేకాక.. అంచనా వ్యయం రూ.మూడు లక్షలకు మించి ఉన్న పనులను నామినేషన్పై అప్పగించడం నిబంధనలకు విరుద్ధమని.. ఆ పనులకు టెండర్లు పిలవాల్సిందేనని ఆదేశించారు. -
తోటల్లో గజరాజుల తిష్ట..
విజయనగరం, గరుగుబిల్లి: ఏ క్షణంలో గజరాజులు దాడి చేస్తాయోనని మండల వాసులకు కంటిమీద కునుకు ఉండడం లేదు. కొద్ది రోజులుగా మండల పరిధిలోని పలు గ్రామాల్లో సంచరిస్తూ పంటలను ధ్వంసం చేసిన ఏనుగులు తాజాగా సంతోషపురం పంచాయతీ పిట్టలమెట్టలోని అరటి, చెరకు తోటల్లో తిష్ట వేశాయి. బుధవారం రాత్రి గ్రామంలోని కళ్లాల వద్దనున్న నాటుబళ్లను తిరగవేశాయి. అలాగే పంటపొలాలకు నీటి తడులు అందించేందుకు ఏర్పాటు చేసుకున్న జాయింట్ పైపులను విరిచేశాయి. దీంతో ఇక్కడ ఇళ్లపై దాడి చేస్తాయోనని ప్రజలు భీతిల్లిపోతున్నారు. నిత్యం ప్రధాన రహదారి నుంచి రాకపోకలు చేసేవారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. ఒక్కొక్కరు బయటకు తిరిగేందుకు భయపడుతున్నారు. ఇదిలా ఉండగా పిట్టలమెట్ట నుంచి ఏనుగులను చిలకాం మీదుగా కెల్ల తరలించేందుకు అటవీశాఖాధికారులు చేసిన ప్రయత్నాలు గురువారం ఫలించలేదు..... సరికదా ఏనుగులపై బాంబులు వేసేందుకు ప్రయత్నించిన ట్రేకర్ ( అటవీ శాఖలో ఔట్ సోర్సింగ్ఉద్యోగి) చేతిలో దురదృష్టవశాత్తు బాంబు పేలిపోయింది. చేతికి గాయాలు.. ఎలిఫెంట్ ట్రేకర్ చేతికి గాయాలైన సంఘటన గురువారం చోటుచేసుకుంది. ఫారెస్ట్ రేంజర్ ఎన్.కల్యాణముని తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గరుగుబిల్లి మండలంలోని పిట్టలమెట్టలో తిష్ట వేసిన ఏనుగుల గుంపును ఉదయం తొమ్మిది గంటల సమయంలో తరుముతుండగా ప్రమాదవశాత్తు బాంబు చేతిలో పేలడంతో వెంకటరమణ ఎడమచేతికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సహచర సిబ్బంది 108 వాహనం ద్వారా పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వెంకటరమణది శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని సొలిబి గ్రామం. – భయాందోళనలో ప్రజలు ఏనుగులు ఈ ప్రాంతం నుంచి అటవీ ప్రాంతాలకు వెళ్లకపోవడంతో ప్రజలు నిత్యం భయాందోళన చెందుతున్నారు. కొన్ని రోజుల నుంచి తిష్టవేసిన ఏనుగులు వరిచేను, చెరుకు పంటలను నష్టపరిచాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో జియ్యమ్మవలస మండలంలో ఒకరికి, కొమరాడ మండలంలో మరొకరిని గాయపరిచాయి. రెవెన్యూ, అటవీ శాఖాధికారులు స్పందించి ఏనుగులు అటవీ ప్రాంతానికి తరలించాలని ప్రజలు కోరుతున్నారు. -
ఏనుగు ముప్పు..ఎవరు దిక్కు
అంతరిస్తున్న అడవులు.. మేత, నీరు కరువు.. గజరాజులకు తీరని ఆకలి, దప్పిక.. వెరిసి అరణ్యం నుంచి జనారణ్యంలోకి దూసుకువస్తున్న ఏనుగులు.. పంటపొలాలు, రైతులపై దాడులు.. దీనికి అడ్డుకట్ట వేయడానికి సోలార్ ఫెన్సింగ్, ట్రెంచ్ల ఏర్పాటు.. అయినా ఫలితం శూన్యం. ఆగని దాడులు.. సాగుకు అన్నదాత దూరం. ఇదీ పలమనేరు, కుప్పం ప్రాంతంలోని కర్షకుల దుస్థితి. చిత్తూరు, పలమనేరు: జిల్లాలోని పలమనేరు, కుప్పం నియోజకవర్గాల పరిధిలో దశాబ్దాలుగా గజరా జుల దాడులతో రైతులు నష్టపోతూనే ఉన్నారు. గజ దాడుల నుంచి పంటల పరిరక్షణకు అటవీ శాఖ సోలార్ ఫెన్సింగ్, ఎలిఫెంట్ ట్రెంచ్లు ఏ ర్పాటు చేసినా ప్రయోజనం లేకుండా పోతోంది. గజ దాడుల్లో ఏటా వేలాది ఎకరాల పంట నష్టం తోపాటు రైతుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. కంచె దాటి బయటకొచ్చే క్రమంలో ఏనుగులు సైతం మృతువాత పడుతున్నాయి. సోలార్ ఫెన్సింగ్, ఎలిఫెంట్ ట్రెంచ్లు వృథా గజ దాడుల నుంచి పంట రక్షణ కోసం ప్రభుత్వం 1984లో ఏర్పాటు చేసిన కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చురీ పూర్తి స్థాయిలో ప్రయోజనం లేకుండా పోతోంది. రూ.లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సోలార్ ఫెన్సింగ్ నిర్వహణ కొండెక్కింది. దీంతో లక్ష్యం నీరుగారిపోతోంది. పలమనేరు, కుప్పం పరిధిలోని కౌండిన్య అభయారణ్యం 250 కి.మీ మేర వ్యాపించి ఉంది. ఇందులో 36 ఏనుగులున్నట్లు అటవీశాఖ చెబుతోంది. ఇవి పలమనేరు కౌండిన్యలో మూడు గుంపులుగా, కుప్పం ప్రాంతంలో రెండు గుంపులుగా విడిపోయి అటవీప్రాంతంలో సంచరిస్తున్నాయి. ఇవి అడవిని దాటి బయటకు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం బంగారుపాళెం మండలం నుంచి కుప్పం వరకు 264 కి.మీ మేర సోలార్ ఫెన్సింగ్ను రెండు దఫాలుగా ఏర్పాటు చేశారు. ఆ ఫెన్సింగ్ ఇప్పటికే దెబ్బతింది. దీంతో ఏనుగులు పంటపొలాల్లోకి వస్తున్నాయి. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఎలిఫెంట్ ట్రెంచ్ పనులను చేశారు. పైన మూడు మీటర్ల వెడల్పు, లోపల రెండు మీటర్ల వెడల్పు, మూడు మీటర్ల లోతు వీటిని తవ్వారు. అయినా ఏనుగులు ట్రెంచ్లను దాటి బయటకొస్తున్నాయి. ఈ క్రమంలో గజదాడుల్లో 8 మంది మృతి చెందగా 12 మంది గాయపడ్డారు. అలాగే 9 ఏనుగులు చనిపోయాయి. ఎలిఫెంట్ కారిడార్ను మరిచిన బాబు ఏనుగుల సమస్యకు మూడు రాష్ట్రాల్లో కారిడార్ నిర్మాణం ఒక్కటే పరిష్కార మార్గంగా కనిపిస్తోంది. కర్ణాటకలోని బన్నేరుగట్ట, తమిళనాడులోని కృష్ణగిరి, హోసూరు, కావేరిపట్నం, మోర్ధనా తదితర ప్రాంతాల నుంచి కౌండిన్యలోకి తరచూ ఏనుగులు రావడంతోనే రైతులకు ఎక్కువ నష్టం వాటిల్లుతోంది. శాశ్వత పరిష్కారంలో భాగంగా మూడు రాష్ట్రాల్లోని అడవిలో ఓ కారిడార్ను నిర్మించేందుకు స్థానిక అధికారులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైల్డ్ అనిమల్ ప్రొటెక్ట్కు నివేదిక పంపినా పనులు ముందుకు సాగలేదు. పొరుగురాష్ట్రాల ముఖ్యమంత్రులతో రాష్ట్ర సీఎం సంప్రదించి సమస్యను పరిష్కరించాల్సి ఉంది. అయితే ఎప్పుడు కుప్పం, పలమనేరుకు వచ్చినా అదిగో ఇదిగో అంటున్నారే తప్ప సమస్యను గురించి పట్టించుకోలేదు. పంటపొలాలపై ఏనుగుల దాడులు మండలంలోని శేషాపురంలో మంగళవారం రాత్రి పంటపొలాలపై ఏనుగులు దాడులు చేశాయి. గ్రామ సమీపంలోని మోతకుంట అటవీ ప్రాంతం నుంచి మూడు ఏనుగులు పంటలపై దాడి చేసినట్లు బాధిత రైతులు తెలిపారు. ఏనుగులు గ్రామానికి చెందిన రైతు లక్ష్మీపతినాయుడు పొలం చుట్టూ వేసిన ఇనుప కంచెను ధ్వంసం చేసి పొలంలోకి ప్రవేశించాయి. జామ తోటలో చెట్లను తొక్కివేశాయి. డ్రిప్ పైపులను ధ్వంసం చేశాయి. మునికృష్ణకు చెందిన చెరకు తోట, నాగభూషణంనాయుడి అరటి చెట్లను తొక్కివేసినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మొగిలి, మొగిలివారిపల్లె, గౌరీశంకరపురం గ్రామాల్లో ఏనుగులు వరుస దాడులు చేసి పంటలను తీవ్రంగా నష్టపరుస్తున్నాయని తెలి పారు. ఏనుగులు ధ్వంసం చేసిన పంటలను బు ధవారం అటవీశాఖ అధికారులు పరిశీలించారు. దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలని కోరుతూ బాధిత రైతులు రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. పంటలపైకి ఏనుగులు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. -
మినుము సాగుకు అదును ఇదే..
విజయనగరం ఫోర్ట్: మినుము పంట సాగుకు అదును ఇదేనని విజయనగరం మండల వ్యవసాయ అధికారి గాలి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మినుము సాగు విధానం, అధిక దిగుబడుల సాధనపై పలు సూచనలిచ్చారు. ఆయన మాటల్లోనే... సాగుకు అనువైన నేలలు.. మాగాణి, మెట్ట భూములు మినుము పంటకు అనుకూలం. వరి మాగాణుల్లో నవంబర్, డిసెంబర్ నేలల్లో మినుము పంటను వేసుకోవాలి. విత్తడం ఇలా.. మరి మాగాణాల్లో అయితే వరి కోయటానికి 4, 5 రోజుల ముందు విత్తనాలను వెదజల్లుకోవాలి. ఈ పద్ధతిలో భూమిని దుక్కి చేయడం, ఎరువులు వేయడం వంటివి చేయరాదు. అధిక మోతాదులో విత్తనాన్ని వాడాలి. మెట్ట భూముల్లో అయితే తేమను నిలుపుకోగలిగి మురుగునీరు పోయేనేలలు మినుముకు అనుకూలం. భూమిని బాగా దుక్కిచేయాలి. విత్తనం దుక్కిలో 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు వేసి భూమిలో కలియదున్నాలి. వరి మాగాణాల్లో అయితే విత్తనాలను వెదజల్లాలి. మెట్ట భూముల్లో అయితే వరుసల మ«ధ్య 30 సెంటీ మీటర్లు, మొక్కలు మధ్య 10 సెం.మీ అంతరంతో గొర్రుతో గాని సీడ్ డ్రిల్తో గాని విత్తాలి. రకాలు... ఎల్ఐజీ–645: ఈ రకం పంట కాలం 85 నుంచి 90 రోజులు. హెక్టారుకు 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. లావుపాటి పాలిసీ రకం. ఎండు తెగులను తట్టుకుట్టుంది. ఎల్.బి.జి –402: ఈ రకం పంట కాలం 90 నుంచి 95 రోజులు. గింజలు లావుగా సాదాగా ఉంటాయి. హెక్టారుకు 8 నుంచి 9 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎండు తెగులును తట్టుకుంటుంది. ఎత్తుగా పెరిగి కలుపును అణిచి వేస్తుంది. చౌడును కొంత వరకు తట్టుకుట్టుంది. ఎల్బీజీ 22: ఈ పంట రకం 85 రోజులు. హెక్టారుకు 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎండు తెగులును తట్టుకుంటుంది. ఆలస్యంగా విత్తేందుకు అనుకూలం. ఎల్బీజీ–17: ఈ రకం పంట కాలం 80 నుంచి 85 రోజులు. బూడిద తెగులను తట్టుకుంటుంది. కొమ్మలు విస్తరించి పెరుగుతాయి. ఎల్బీజీ– 752: ఈ రకం పంటకాలం 75 నుంచి 80 రోజులు. పల్లాకు, ఎండు తెగులను తట్టుకుంటుంది. విత్తన మోతాదు: వరి మాగాణాల్లో అయితే ఎకరాకు 16 కేజీలు, మెట్ట భూముల్లో అయితే ఎకరాకు 10 కిలోల విత్తనం అవసం అవుతుంది. కిలో విత్తనానికి 30 గ్రాముల కార్పోసల్ఫాన్, 2.5 థైరమ్ లేదా కాప్టాన్ మందును వాడి విత్తన శుద్ధి చేయాలి. నీటి యాజమాన్యం: వర్షాభావ పరిస్థితి ఎర్పడినప్పుడు ఒకటి రెండు నీటి తడులు పెట్టాలి. వరి మాగాణుల్లో నీటి తడి ఇవ్వవచ్చు. ఒకటి రెండు తేలిక తడులు, 30 రోజులకు, 55 రోజుల తర్వాత ఇస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు. కలుపు నివారణ: పెండి మిథాలిన్ ద్రావణం ఎకరాకు లీటరు నుంచి లీటరన్నర ఎకరాకు విత్తిన వెంటనే గాని మరుసటి రోజున గాని పిచికారీ చేయాలి. విత్తిన 20 నుంచి 25 రోజులప్పుడు గొర్రుతో అంతరకృషి చేయాలి. సస్యరక్షణ: మరకా మచ్చల పురుగు: ఈ పురుగు మొగ్గ, పూత, పిందె దశల్లో ఆశించి ఎక్కువ నష్టం కలుగజేస్తుంది. పూత దశలో పూలను గూడుగా చేసి లోపలి పదార్థాలను తింటుంది. కాయలు తయారయ్యేటప్పుడు కాయలను దగ్గరగా చేర్చి గూడుగా కాయలకు రంధ్రం చేసి లోపలి గింజలను తినడం వల్ల పంటకు ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. దీని నివారణకు క్లోరిఫైరిపాస్ 2.5 మి.లీ లీటరు నీటిలో కలిపి ఎకరాకు 200 లీటర్లు పిచికారీ చేయాలి. ఎండు తెగులు: ఈ తెగులు ఆశించిన మొక్కలు వడిలి, ఎండిపోతాయి. పంటకు అధిక నష్టం కలుగుతుంది. ఈ తెగులు భూమిలో ఉన్న శిలీంధ్రం ద్వారా వ్యాపిస్తుంది. పైరుపై మందులను వాడి నివారించడం లాభసాటి కాదు. తెగులను తట్టుకునే రకాలు వేసుకోవాలి. పొలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పల్లాకు తెగులు: ఇది జెమిని వైరస్ జాతి వల్ల వచ్చే తెగులు. ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు, కాయల మీద పసుపుపచ్చ మచ్చలు ఏర్పడతాయి. తొలిదశలో ఈ వైరస్ తెగులు ఆశించినట్టయితే పైరు గిడసబారిపోయి , పూతపూయక ఎండిపోతుంది. ఈ వైరస్ తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీని నివారణకు పొలంలో పల్లాకు తెగులు సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. మోనోక్రోటోపాస్ 1.6 మి.లీ లీటరు నీటిలో కలిపి ఎకరాకు 200 లీటర్ల నీటిని పిచికారీ చేయాలి. -
ధీమానివ్వని బీమా
విజయనగరం గంటస్తంభం: రైతుల కోసం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలు చేస్తున్న విషయం విదితమే. రైతులు 10శాతం ప్రీమియం చెల్లిస్తే మిగతా సొమ్ము కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. 2015–16 ఆర్థిక సంవత్సరం నుంచి ఏటా బీమా ప్రీమియం డీఆర్డీఏ అధికారులు కట్టిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో 27వేల మంది ప్రీమి యం చెల్లించారు. గడిచిన మూడేళ్లలో 25వేల నుంచి 30వేల మంది వరకు ఐసీఐసీఐ ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రీమియం కట్టినట్టు సమాచా రం. ప్రీమియం చెల్లించిన రైతులు పంట నష్టపోతే ఆ కంపెనీ రైతులకు పరిహారం ఇవ్వాల్సి ఉంది. ఇందులో భాగంగా 2015–16 సంవత్సరానికి సం బంధించి 25వేల మంది వరకు రైతులు బీమా కట్ట గా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వి డుదల చేస్తున్నారు. ఇందులో అనేక వింతలు చోటు చేసుకుంటున్నాయి. ప్రీమియం చెల్లించిన రైతులందరికీ పరిహారం రావడం లేదు. మంజూరైన జాబితాలో కూడా చాలామంది రైతుల పేర్లు లేవు. వాస్తవానికి పంటల బీమా గ్రామం యూనిట్గా కట్టిస్తారు. కానీ ఒకే గ్రామంలో కొందరికి పరిహారం రావడం, మరికొందరికి రాకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఇక ప్రీమియం చెల్లించిన రైతులకు పరిహారం వచ్చినట్లు అధికారులకు సమాచారం వచ్చింది. ఆ జాబితాలో పేర్లున్నా... బ్యాంకు ఖాతాలో కొందరికి జమ కావట్లేదు. పట్టించుకోని అధికారులు బీమా ప్రీమియం కట్టినా పరిహారం రాకపోవడం, పరిహారం వచ్చినా బ్యాంకు ఖాతాలో సొమ్ము లేకపోవడంతో రైతులు, రైతు సంఘాల నాయకులు డీఆర్డీఏ, వ్యవసాయాధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రీమియం చెల్లించినా అసలు నష్టపరిహారం రాకపోతే డీఆర్డీఏ, వ్యవసాయాధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. పరిహారం సొమ్ము పడకపోతే బీమా కంపెనీ కూడా స్పందించాలి. కానీ ఎవరూ ట్టించుకోకపోవడంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. వివరాలు చెబితే పరిష్కరిస్తాం ఐసీఐసీఐ కంపెనీకి 2015–16 సంవత్సరం బీమాతో సంబంధం లేదు. తర్వాత నుంచి పంటల బీమా మా కంపెనీ కట్టించుకుం టోంది. కాబట్టి ఆ ఏడాది నుంచి ఎవరికైనా సమస్య ఉంటే వివరాలు తెలియజేస్తే పరిష్కరిస్తాం. సోమవారం సంప్రదిస్తే పూర్తి వివరాలు తెలియజేస్తాం. ప్రీమియం కట్టినా పరి హారం రాకపోయినా, పరిహారం మంజూరై జమ కాకపోయినా రైతుల వివరాలు తెలియజేస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. – మల్లికార్జున, ఐసీఐసీఐ లాంబోర్డు బీమా అధికారి ప్రీమియం కట్టినా రాలేదు నాకు పినవేమలి రెవెన్యూలో మూడు ఎకరాల భూమి ఉంది. బీమా కోసం రూ.1540 చెల్లిం చాను. పంట నష్టపోవడంతో బీమా పరిహారానికి ఆ గ్రామం ఎంపికైంది. కొందరు రైతులకు పరిహారం వచ్చింది. కానీ నాకు మాత్రం రాలేదు. ఇదేమని అడిగితే ప్రీమియం మీపేరున కట్టలేదని డీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. కావాలంటే ప్రీమియం సొమ్ము వెనక్కి ఇచ్చేస్తామని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఇదేమి ఘోరం. – సిరిపురం క్రిష్ణంనాయుడు,రైతు కోరుకొండపాలెం -
గిరులపై పచ్చని సిరి
విజయనగరం, కురుపాం: గిరి శిఖరాలన్నీ చదును అవుతున్నాయి. పచ్చని సీమలుగా మారుతున్నాయి. వ్యవసాయ క్షేత్రాలుగా వర్ధిల్లుతున్నాయి. ఊటనీటితో దాహం తీర్చుకుంటున్నారు. సాగునీటిగా మార్చి సస్యశ్యామలం చేస్తున్నారు. ఆరోగ్యకరమైన పంటల సాగుతో ఆదర్శంగా నిలుస్తున్నారు. మైదాన ప్రాంత రైతుల కంటే అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఊటనీరే సాగు.. తాగునీరు కురుపాం నియోజకవర్గంలో గిరి శిఖరాల నుంచి వస్తున్న ఊటనీటినే సాగునీటిగా, తాగునీటిగా వినియోగించడంలో సత్ఫలితాలు సాధిస్తున్నారు. అక్కడి ప్రకృతి సాగు గిరిపుత్రులకు ఆహ్లాదంతో పాటు ఆరోగ్యకరమైన పంటలను అందిస్తున్నాయి. కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ మండలాల్లో గిరిశిఖరాలపై ఉన్న గిరిజనులకు సాగునీరు, తాగునీటి కష్టాలు ఎక్కువే. అదే సమయంలో ఊటనీటినే పైపులైన్ల ద్వారా గ్రామాలకు రప్పించుకొని మైదాన ప్రాంత రైతుల కంటే మెరుగైన దిగుబడులు సాధించి ఔరా అనిపిస్తున్నారు. కొండలను తవ్వి.. ఏజెన్సీలో పల్లపు భూములంటూ ఉండవు. పెద్ద పెద్ద డెప్పులు, రాళ్ల దిబ్బలు మాత్రమే ఉంటాయి. అలాంటి కొండలపై ఇంటిల్లిపాదీ కలిసి కొండరాళ్లను పేర్చి చిన్న చిన్న పంట పొలాలుగా తీర్చి దిద్ది వరి సాగు చేస్తుంటారు. దీనికి ఊటనీటినే సమయానుకూలంగా తరలిస్తారు. ఎలాంటి పురుగు మందులు వాడకుండా వ్యవసాయాధికారుల సూచనలు.. సలహాలనే పాటిస్తూ ప్రకృతి సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఆరోగ్యకర పంటలైన వరి, చోడి, కందులు, ఉలవలు, పెసలు, జనుములు, వలిశెలు తదితర చిరుధాన్యాలు పండించుకుంటున్నారు. -
భూములిచ్చి రోడ్డునపడ్డాం..
‘అడిగిన జీతం బియ్యని మిడిమేలుపు దొరనుగొల్చి మిడుకుట కంటెన్, వడిగల యెద్దుల గట్టుక మడిదున్నక బతుకవచ్చు మహిలో సుమతి’ అని శతకారుడు చెప్తాడు. అంటే జీతం ఇయ్యని దొర దగ్గర పనిచేసే కంటే రెండు చురుకైన ఎద్దులను నమ్ముకుని పొలాన్ని దున్నుకుంటే లాభముంటుందని అర్ధం. అదే ఎద్దులను, కాడిని కూడా లాగేసుకునేవాడు పరిపాలకుడైతే పరిస్థితి ఎలా ఉంటుందన్నదానికి ఈ దంపతులే ఉదాహరణ. అదిగో అమరావతి.. ఇదిగో ఉజ్వల భవిష్యత్’ అన్న పాలకుల బురిడీ మాటలు నమ్మి ఆర్థికంగా ఆదుకుంటున్న పొలాన్ని అప్పనంగా అప్పచెప్పిన నేరానికి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు ఆ దంపతులు. ఉద్యోగాలిచ్చామని చెప్పి.. రెండేళ్లు పని చేయించుకుని తీరా ఇప్పుడు మెడపట్టుకుని బయటకు గెంటేస్తే తమ పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నిస్తున్న బాధితుల మాటల్లో నిజం లేకపోలేదు. ఇది అమరావతి కథ. అందులోని ఓ రైతు వ్యథ. కృష్ణాజిల్లా, మంగళగిరి: రాజధాని భూసమీకరణ గ్రామాల్లో ఒకటి కృష్ణాయపాలెం. గ్రామానికి చెందిన రైతు వేమూరి సోమయ్య, వేమూరి మరియమ్మలకు సర్వే నెంబర్ 121,122లలో 23 సెంట్లు భూమి ఉంది. రాజధాని రాకముందు ఆ కొద్దిపాటి భూమిలోనే ఆకుకూరలు సాగు చేసుకుంటూ హాయిగా జీవనం కొనసాగించే వారు. మూడు రకాల ఆకుకూరలు సాగు చేసుకుంటే వారానికి రూ.3 వేల నుంచి 4 వేల ఆదాయం వచ్చేది. ఖాళీ సమయంలో వేరే రైతుల పొలాల్లో కూలీకి వెళ్లి వచ్చినదాంతో జీవనం సాగించే వారు. అయితే రాజధాని రావడంతో ఉన్న 23 సెంట్ల భూమి రాజధాని భూ సమీకరణలో ఇచ్చారు. దీంతో కూరలు సాగు చేసేది లేకపోవడంతో గ్రామంలోని భూములు రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం తీసుకోవడంతో కూలి పని లేకుండా పోయింది. దీంతో కొద్దికాలం వేరే గ్రామాల్లో పనులు చేసుకుని జీవనం గడిపారు. ఇంతలో తాత్కాలిక సచివాలయం ప్రారంభం కావడంతో అక్కడ క్లీనింగ్ విభాగంలో ఇద్దరూ పనికి చేరారు. తాము భూ సమీకరణకు ఇచ్చిన భూమి వివాదంలో ఉందనే కారణంతో కౌలు నిలిపివేసిన అధికా రులు, రాజధాని గ్రామాలలో రైతు కూలీలకు ఇచ్చే రూ.2500 పింఛన్లు సోమయ్య పేరు మీద భూమి మీద ఉందనే సాకుతో నిలిపివేశారు. భూమి సోమయ్య పేరున ఉంటే కౌలు చెల్లించకుండా ఆపి, భూమి ఉందనే ఫించను ఇవ్వకుండా అధికారులు ద్వంద్వవైఖరి అవలంభించడం గమనార్హం. సదరు భూమిలో తనకు వాటా ఉం దంటూ తన సోదరి తనయుడు సీఆర్డీఏ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఒరిజినల్ పట్టా ఆధారంగా గ్రామంలో విచారించి నిర్ణయం తీసుకోవాల్సిన అధికారులు ఆ పని చేయకుండా పక్కన పడేశారు. తాత్కాలిక సచివాలయంలో క్లీనింగ్ విభాగంలో రెండు సంవత్సరాలు నుంచి పని చేస్తుండగా కొద్ది కాలం క్రితం మరియమ్మ అనారోగ్యానికి గురైంది. ఆస్పత్రిలో చికిత్స నిమిత్తమై దంపతులు ఇరువురు పనికి హాజరు కాలేకపోగా సమస్యను సం బంధిత విభాగంలోని వారికి తెలియజేశారు. వారం రోజుల అనంతరం విధులకు హాజరయ్యేం దుకు వచ్చిన సోమయ్య, మరియమ్మలను ‘మిమ్మల్ని పనిలోంచి తీసివేశామని’ సదరు కాంట్రాక్టరు చెప్పడంతో అవాక్కయిన వారు మూడు నెలలుగా తాత్కాలిక సచివాలయం చుట్టూ తిరుగుతూ కనిపించిన ప్రజాప్రతినిధులు, అధికారులను కలసి తమగోడు వెళ్లబోసుకుంటున్నారు. అయినా ఒక్కరూ కనికరించకపోవడంతో తాము ఎలా బతకాలని ఆవేదన చెందుతున్నారు. రాజధాని భూసమీకరణ సమయంలో భూములిచ్చిన రైతులతో ఆయా గ్రామాల్లోని రైతు కూలీలకు, చేతివృత్తిదారులకు పింఛన్లు, ఇంటికో ఉద్యోగం, ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం, ఉచితంగా ఇళ్ల నిర్మాణం అంటూ ఎన్నో హామీలను ఇచ్చి భూములు లాక్కుని ఒక్క హామీని నెరవేర్చలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమతో ఎంతో మంది రైతులు, రైతుకూలీలు ఉద్యోగాలలో చేరారని, వారిని ఎలాంటి కారణం లేకుండా ఇంటికి పంపుతూ మళ్లీ వారి స్థానంలో అధికార పార్టీ నేతలు చెప్పిన వారిని నియమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నదంతా అప్పచెప్పాం... గ్రామంలో ఉన్న 23 సెంట్లు రాజధానికి ఇచ్చాం. రాజధాని రాకముందు ఉన్న కొద్దిపాటి భూమిలోనే ఆకుకూరలు పండించుకుని జీవించే వాళ్లం. భూసమీకరణలో భూమి తీసుకున్న అధికారులు పొలం వివాదంలో ఉందనే నెపంతో కౌలు ఇవ్వడం లేదు. భూమి ఉందనే పేరుతో పింఛను ఇవ్వడం లేదు. ఆడపిల్ల పెళళ్లి చేసి అప్పులు పాలయ్యాం. ఇంటికో ఉద్యోగమని చెప్పారు. డిప్లమా చదివిన అబ్బాయి నిరుద్యోగిగా ఉన్నాడు. ఉన్న ఉద్యోగాలు తీసేయడంతో మా బ్రతుకులు అగమ్యగోచరంగా మారాయి. సొంత ఇళ్లు కూడా లేకపోవడంతో అద్దె కట్టే పరిస్థితి లేదు. వెంటనే ప్రజాప్రతినిధులు, అధికారులు తమకు బ్రతుకుతెరువు కల్పించేలా చర్యలు తీసుకోవాలి. -
ఎటుచూసినా ఎండిపోయిన పంటలు.. బీడుపడిన భూములే!
సాక్షి, అమరావతి: కనుచూపు మేరలో ఎటు చూసినా ఎండిపోయిన పంటలు.. బీడుపడిన భూములే. చిన్న కొండల్లా గడ్డివాములుండాల్సిన రైతుల కళ్లాలన్నీ బోసిపోతున్నాయి. మేతలేక లారీల్లో కబేళాలకు తరలుతున్న పశువులు.. చినుకు జాడలేక, బతుకుతెరువు కనిపించక కంటతడి పెట్టుకుంటున్న రైతన్నలు... రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతోపాటు ఇతర జిల్లాల్లో కనిపిస్తున్న హృదయవిదారక దృశ్యాలివీ. రాష్ట్రంలో కరువు విలయతాండవానికి ప్రత్యక్ష నిదర్శనాలవీ. రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్షం వల్ల పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. ఖరీఫ్ ఆరంభంలో జూన్లో కురిసిన వర్షాలను చూసి రైతులు శ్రమకోర్చి విత్తిన పంటలు తదుపరి చినుకు జాడలేక పూర్తిగా ఎండిపోయాయి. రాష్ట్రంలో దాదాపు 80 శాతం మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని అనధికారిక గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ పంట చేతికి రాకుండాపోయింది. పత్తి, కంది, ఉల్లి, సజ్జ, మొక్కజొన్న తదితర పంటలతోపాటు టమోటా, మిరప తదితర కూరగాయల తోటలు మాడిపోయాయి. పంటల సాగుకోసం అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టిన అన్నదాతలు కుంగిపోతున్నారు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక దిక్కులు చూస్తున్నారు. సెప్టెంబరుతో ముగిసిన ఖరీఫ్లోనే కాకుండా ప్రస్తుత రబీ సీజన్లోనూ తీవ్ర దుర్బిక్ష పరిస్థితులే కొనసాగుతున్నాయి. కురవాల్సిన దాంట్లో సగం వర్షమే ఖరీఫ్లో వరుస కరువుల వల్ల సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోతోంది. అధికారిక గణాంకాల ప్రకారమే.. రాష్ట్రంలో జూన్ 1తో ఆరంభమైన ఖరీఫ్ సీజన్లో ఇప్పటిదాకా(అక్టోబరు 21) కురవాల్సిన కనీస సగటు వర్షం కంటే 27.4 శాతం తక్కువ కురిసింది. వైఎస్సార్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో కనీసం కురవాల్సిన దానిలో సగం వర్షమే కురవడం గమనార్హం. రాష్ట్రంలో 689.4 మిల్లీమీటర్ల కనీస సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 500.8 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. జూన్ 1 నుంచి ఇప్పటివరకూ శ్రీకాకుళం జిల్లా మినహా అన్ని జిల్లాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలోనూ లోటు వర్షపాతమే ఉండేది. అక్టోబర్ రెండోవారంలో తిత్లీ తుపాన్ వల్ల కురిసిన భారీ వర్షంతో అక్కడ 7.3 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ముప్పావు ప్రాంతంలో దుర్భిక్షమే అధికారిక వర్షపాత గణాంకాల ప్రకారం... రాష్ట్రంలో ముప్పావు ప్రాంతంలో తీవ్ర కరువు నెలకొంది. రాష్ట్రంలో మొత్తం 670 మండలాలుండగా, 470 మండలాల్లో కురవాల్సిన కనీస వర్షం కంటే 19 నుంచి 52.9 శాతం తక్కువ వర్షం పడింది. శ్రీకాకుళం మినహా అన్ని జిల్లాల్లో లోటు వర్షపాతమే ఉన్నప్పటికీ.. సాధారణం కంటే 19 శాతం మించి తక్కువ వర్షం కురిస్తేనే ప్రభుత్వం లోటు వర్షపాత మండలాలుగా గుర్తిస్తుంది. అందువల్లే వర్షాభావ మండలాల జాబితాలో 470 మండలాలే ఉన్నాయని, లేకపోతే 600కు పైగా ఉండేవని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో కేవలం 19 మండలాల్లోనే సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. రైతుల కష్టాలపై కనికరం లేని సర్కారు రాష్ట్రంలో 470 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఖరీఫ్ సీజన్లో కేవలం 296 మండలాలనే కరువు ప్రాంతాలుగా ప్రకటించి చేతులు దులుపుకుంది. కరువు వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తోంది. గత ఏడాది రెయిన్గన్లతో ఒక్క సెంటు కూడా పంటలు ఎండిపోకుండా కాపాడామని ప్రచారం చేసుకున్న ప్రభుత్వం ఈ ఏడాది రెయిన్ గన్ల ఊసే ఎత్తడం లేదు. రూ.2,250 కోట్ల పెట్టుబడి మట్టిపాలు ఎకరా పొలంలో వేరుశనగ సాగుకు సగటున రూ.15,000 ఖర్చవుతుంది. సెప్టెంబరుతో ముగిసిన ఖరీఫ్ సీజన్లో 16.50 లక్షల ఎకరాల్లో రైతులు వేరుశనగ పంట వేయగా, 15 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది. దీనివల్ల రైతులు ఈ పంట సాగు కోసం పెట్టిన రూ.2,250 కోట్ల పెట్టుబడి మట్టిపాలైంది. - 2016 ఖరీఫ్లో 450 మండలాల్లో వర్షాభావ పరిస్థితి ఉండగా ప్రభుత్వం 301 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. - 2017 ఖరీఫ్ సీజన్లో ఆగస్టు మూడో వారం వరకూ 241 మండలాల్లో వర్షాభావ పరిస్థితి ఉండేది. ఆగస్టు చివరల్లోనూ, సెప్టెంబరులోనూ అల్పపీడనాల వల్ల వర్షం కురవడంతో లోటు వర్షపాత మండలాల సంఖ్య 93కు తగ్గింది. అయితే ప్రభుత్వం ఒక్క మండలాన్ని కూడా కరువు ప్రాంతంగా ప్రకటించలేదు. - 2018లో 470 మండలాల్లో వర్షాభావ పరిస్థితి ఉన్నప్పటికీ ప్రభుత్వం 296 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. - 2016లో 38.62 లక్షల హెక్టార్లలో పంటలు సాగుకాగా, 301 మండలాలను దుర్భిక్ష ప్రాంతాలుగా ప్రకటించారు. ఈ ఏడాది 3 లక్షల హెక్టార్లలో పంటల సాగు తగ్గినా కరువు మండలాలను పెంచాల్సిందిపోయి తగ్గించడం గమనార్హం. రబీలో 12 జిల్లాల్లో లోటు వర్షపాతమే రాష్ట్రంలో ప్రస్తుత రబీ సీజన్లో (అక్టోబరు 1 నుంచి 20వ తేదీ మధ్య) ఏకంగా 65 శాతం సగటు లోటు వర్షపాతం నమోదైంది. కోస్తాంధ్రలో 61 శాతం, రాయలసీమలో 74 శాతం లోటు వర్షపాతం రికార్డయ్యింది. ఖరీఫ్లో కంటే రబీలో కరువు తీవ్రత మరింత అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 21 రోజుల్లో కురవాల్సిన దానికంటే 65 శాతం లోటు వర్షపాతం నమోదైంది. కోస్తాలోని తొమ్మిది జిల్లాల్లో సగటున 109.6 మిల్లీమీటర్ల సాధారణ వర్షం కురవాల్సి ఉండగా, 43.2 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. రాయలసీమ జిల్లాల్లో 78 మిల్లీమీటర్ల కనీస వర్షం కురవాల్సి ఉండగా. 20.1 మిల్లీమీటర్లు (74 శాతం లోటు) కురిసింది. శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాన్ వల్ల భారీ వర్షం కురవడంతో సాధారణం కంటే 66 శాతం అధిక వర్షపాతం నమోదైంది. మిగిలిన 12 జిల్లాల్లో కురవాల్సిన దానికంటే చాలా తక్కువ వర్షం కురవడం గమనార్హం. పెట్టిన పెట్టుబడులు కూడా రాలేదు ‘‘వరుసగా నాలుగేళ్లు కరువు వల్ల పంటలు పండక పెట్టుబడులు కూడా చేతికి రాలేదు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో మూడు ఎకరాల్లో వేరుశనగ వేశా. వర్షాల్లేక మొక్కలు గిడసబారి పోయాయి. పెట్టిన పెట్టుబడులు పోయాయి. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి’’ – భాస్కర్రెడ్డి, రైతు, వేపలపల్లె, చిత్తూరు జిల్లా పంటల బీమా, పెట్టుబడి రాయితీ ఇవ్వాలి ‘‘వేరుశనగ పంటే కాదు మిగిలిన పంటలూ కరువు వల్ల ఎండిపోయాయి. ఎకరాకు 15 నుంచి 20 బస్తాల వేరుశనగ రావాల్సి ఉండగా ఒకటి రెండు బస్తాలు కూడా రావడం లేదు. ప్రభుత్వం తక్షణమే పంటల బీమా, పెట్టుబడి రాయితీ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి’’ – సరస్వతి, మహిళా రైతు, కురబలకోట, చిత్తూరు జిల్లా చివరకు అప్పులే మిగిలాయి ‘‘నాకున్న రెండు ఎకరాల్లో వేరుశనగ సాగు చేశా. విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చు కలిపి రెండెకరాలకు రూ.30 వేలు పెట్టుబడి పెట్టా. జూన్లో కురిసిన వానకు విత్తనాలు వేశా. ఆ తరువాత వానల్లేక పైరంతా ఎండిపోయింది. రూపాయి కూడా ఆదాయం రాలేదు. చివరకు అప్పులే మిగిలాయి’’ – దుగ్గిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, దేవలంపల్లి, లక్కిరెడ్డిపల్లె మండలం, వైఎస్సార్ జిల్లా ఇంతటి కరువు ఎన్నడూ చూడలేదు ‘‘నాలుగేళ్లుగా పశ్చిమ ప్రకాశంలో వర్షాలు లేక పంటలన్నీ ఎండిపోయి తీవ్రంగా నష్టపోయాం. ఈ ఏడాది కూడా వర్షాలు లేకపోవడంతో పత్తి, మిర్చి పంటలు ఎండిపోయాయి. నేను ఎకరా మిర్చి సాగు చేయగా రూ.25 వేలు పెట్టుబడి అయింది. పత్తికి రూ.12 వేల ఖర్చు వచ్చింది. వానల్లేక పంటలు ఎండిపోయాయి. పొట్టకూటి కోసం వలస పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇంతటి కరువు గతంలో ఎన్నడూ చూడలేదు’’ – కె.వెంకటరెడ్డి, రైతు, వేములపేట, మార్కాపురం మండలం, ప్రకాశం జిల్లా కబేళాలకు పశువులు.. రైతన్నల వలసలు దుర్బిక్షం ప్రభావం వ్యవసాయంతోపాటు పశు సంపదపైనా పడింది. పశువులకు మేత, నీరు సమకూర్చే పరిస్థితి కూడా లేక రైతన్నలు వాటిని నిస్సహాయంగా కబేళాలకు అమ్మేస్తున్నారు. కన్నబిడ్డల్లా పెంచుకున్న పాడిపశువులను కోతకు ఇవ్వడం ఇష్టంలేని కొందరు గోశాలలకు తరలిస్తున్నారు. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో నీటి ఎద్దడి భయం గొలుపుతోంది. కందుకూరు, కొండెపి, వై.పాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఈ ఐదు నియోజకవర్గాల్లోని 320 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తేనే ప్రజలు గొంతు తడుపుకోగలుగుతున్నారు. వరుణుడి కరుణ లేక పంటలు పండక, సొంత ఊళ్లల్లో పనులు లేక రైతులు వలసబాట పడుతున్నారు. బెంగళూరు, చెన్నై, సూరత్ నగరాలకు చేరుకుని, కూలీ పనులు చేసుకుంటున్నారు. చాలామంది రైతులు తిరుపతి, బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లో భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్నారు. -
తుంగభద్ర కరుణించినా..
సాక్షి, అమరావతి: తుంగభద్ర నదిలో ఈ ఏడాఇ నీటిలభ్యత బాగా పెరిగినప్పటికీ రాయలసీమలో హెచ్చెల్సీ(ఎగువ కాలువ), దిగువ కాలువ(ఎల్లెల్సీ), కేసీ(కర్నూలు–కడప) కెనాల్ ఆయకట్టుకు నీళ్లందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కర్నూలు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో తుంగభద్ర నదిపై ఆధారపడిన 6.44 లక్షల ఎకరాల ఆయకట్టులో కనీసం 40 శాతానికి కూడా నీళ్లందించకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి లభ్యత పుష్కలంగా ఉన్నప్పుడు కూడా వరి పంటకు కాదు కదా.. కనీసం ఆరుతడి పంటలకూ నీళ్లివ్వకపోవడాన్ని వారు తప్పుపడుతున్నారు. తుంగభద్ర నదిలో ఈ ఏడాది నీటి లభ్యత పెరిగింది. ఇప్పటివరకు తుంగభద్ర జలాశయంలోకి 351.69 టీఎంసీలు రాగా దిగువకు 180 టీఎంసీలను విడుదల చేశారు. ఇందులో సుంకేసుల బ్యారేజీలోకి 173 టీఎంసీలు చేరాయి. దీనిలో 166 టీఎంసీలను దిగువకు.. అంటే శ్రీశైలం ప్రాజెక్టుకు వదిలారు. తుంగభద్ర జలాశయంలో 230 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్ హెచ్చెల్సీకి 32.50, ఎల్లెల్సీకి 24, కేసీ కెనాల్కు పది, ఆర్డీఎస్(రాజోలిబండ డైవర్షన్ స్కీం)కు 6.51 టీఎంసీలు చొప్పున కేటాయించింది. కేసీ కెనాల్కు బచావత్ ట్రిబ్యునల్ 39.90 టీఎంసీలను కేటాయించింది(ఇందులో 29.9 టీఎంసీలు సుంకేశుల బ్యారేజీ వద్ద లభిస్తాయని, మిగతా 10 టీఎంసీలను తుంగభద్ర జలాశయం నుంచి విడుదల చేయాలని పేర్కొంది). అంటే, ఆర్డీఎస్ కింద తెలంగాణ వాటా పోనూ తుంగభద్ర జలాల్లో కనీసం వంద టీఎంసీలు రాయలసీమకు దక్కాలి. కానీ ఇప్పటివరకూ కేసీ కెనాల్కు పది, ఎల్లెల్సీకి ఆరు, హెచ్చెల్సీకి 11 టీఎంసీలను మాత్రమే విడుదల చేశారు. కేసీ కెనాల్ కింద సాగు చేసిన పంటలు చేతికి అందాలంటే ఇంకా 24 టీఎంసీలు అవసరం. హెచ్చెల్సీ, ఎల్లెల్సీల ఆయకట్టుకు సక్రమంగా నీటిని విడుదల చేయకపోవడం వల్ల 25 శాతం ఆయకట్టులో కూడా పంటలు సాగుచేయలేని దుస్థితి నెలకొంది. కర్నూలు జిల్లాలో ఆదోని నియోజకవర్గం పరిధిలో పదివేల ఎకరాల్లో సాగు చేసిన పంటలు ఇప్పటికే ఎండిపోయాయి. హెచ్చెల్సీ ఆయకట్టులోనూ ఇదే పరిస్థితి. ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వ 84.96 టీఎంసీలుగా ఉంది. ఈ నీటిలో సింహభాగం రాష్ట్రానికే దక్కాలి. కానీ ఆ మేరకు తుంగభద్ర బోర్డుపై ఒత్తిడి తేవడంలో రాష్ట్ర సర్కారు విఫలమైంది. కర్ణాటక జలచౌర్యాన్ని అడ్డుకోవడంలోనూ చేతులు ఎత్తేసింది. పర్యవసానంగానే ఆయకట్టుకు నీళ్లందట్లేదని రైతులు మండిపడుతున్నారు. -
పంట పొలాల్లో మృత్యుగీతం
సాక్షి, అమరావతి: పచ్చటి పంటలు పండాల్సిన పొలాల్లో చావు డప్పు మోగుతోంది. బ్యాంకుల్లో రుణాలు మాఫీ కాకపోవడం.. కొండల్లా పెరిగిపోతున్న అప్పుల భారం.. పంటలకు గిట్టుబాటు ధరలు దక్కకపోవడం వంటి కారణాలతో రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ఇప్పటిదాకా 28 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. కష్టాల సాగు చేయలేక అన్నదాతలు పిట్టల్లా రాలిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం చలించడం లేదు. తనువు చాలించిన రైతుల కుటుంబాలను ఆదుకోవడం మాట అటుంచి.. కనీసం పరామర్శించేందుకైనా సీఎం, మంత్రులకు తీరిక చిక్కడం లేదు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో వృద్ధి నానాటికీ పెరిగిపోతోందంటూ కాకిలెక్కలు చెబుతూ కాలం గడిపేయడం క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పాలకులు గుర్తించడం లేదు. కళ్లుండి చూడలేని కబోదుల్లా వ్యవహరిస్తూ అన్నదాతలను మరణ శయ్యలపైకి తోసేస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్లో వెలుగులోకి వచ్చిన ఆత్మహత్యల సంఖ్య 28. బయటపడని బలవన్మరణాలు ఇంకెన్ని ఉంటాయో ఊహించుకోవచ్చు. నాలుగున్నరేళ్లలో 2,000 మంది.. రాష్ట్రంలోని 670 రెవెన్యూ మండలాలకు గాను 394 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 296 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించి చేతులు దులుపుకుంది. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో వృద్ధి రేటు విషయంలో మన రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు రైతుల ఇళ్లల్లో ఆర్తనాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉరికొయ్యలకు వేలాడుతున్నారని సాక్షాత్తూ ‘నాబార్డ్’ నివేదిక తేల్చిచెప్పింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నరేళ్లలో 2,000 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రైతు సంఘాలు చెబుతున్నాయి. చనిపోయిన రైతు కుటుంబాలకు ఇవ్వాల్సిన రూ.5 లక్షల పరిహారాన్ని ఎగ్గొట్టేందుకు వారి ఆత్మహత్యలను ప్రభుత్వం గుర్తించడం లేదని ఆరోపిస్తున్నాయి. యువ రైతులే అధికం ఖరీఫ్ సీజన్ అధికారికంగా జూన్ 1న ప్రారంభమైంది. అదే నెల 27న సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో అట్టహాసంగా ఏరువాకకు శ్రీకారం చుట్టారు. రైతు చనిపోతే గరిష్టంగా రూ.2 లక్షల నష్టపరిహారం ఇస్తామంటూ తన పేరిట ఓ పథకాన్ని కూడా ప్రకటించారు. ఇప్పటికి దాదాపు 80 రోజులవుతోంది. ఒక్క రైతు కుటుంబానికైనా పరిహారం ఇచ్చిన పాపానపోలేదు. ఖరీఫ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా కర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో రైతుల బలవన్మరణాలు చోటుచేసుకున్నాయి. అర్ధాంతరంగా కన్నుమూస్తున్న వారిలో యువ రైతులే అధికంగా ఉండడం గమనార్హం. హామీలు మాఫీ చనిపోయిన రైతులందరి గోస దాదాపు ఒకటే. తాను అధికారంలోకి వస్తే రైతుల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానంటూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ అమలు కాలేదు. అప్పులు తీర్చాలంటూ బ్యాంకులు నుంచి నోటీసులు వస్తున్నాయి. రుణాల కోసం కుదువపెట్టిన బంగారాన్ని బ్యాంకులు వేలం వేస్తున్నాయి. కొత్త అప్పులు పుట్టే మార్గం లేక ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. ఇంత చేసినా ఆఖరికి పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదు. అప్పుల కత్తి మెడపై వేలాడుతుండడంతో దిక్కుతోచక తనువు చాలిస్తున్నారు. పరిహారం ఇవ్వకుండా మొండిచేయి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన ప్రకారం.. 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న రైతులు సహజంగా చనిపోయినా రైతు బీమా పథకం కింద రూ.2 లక్షలు, 51 నుంచి 60 ఏళ్ల లోపు వారు చనిపోతే రూ.30 వేల పరిహారం వస్తుంది. 18 నుంచి 70 ఏళ్ల లోపు రైతులు ప్రమాదవశాత్తూ మరణించినా, పూర్తి అంగవైకల్యానికి గురైనా రూ.5 లక్షల పరిహారం ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రకరకాల సాకులు, నిబంధనలతో పరిహారం ఇవ్వకుండా మొండిచేయి చూపుతున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల వివరాలను ప్రభుత్వం సేకరించడం లేదు. బాబు పాలనలో రైతుల ఆత్మహత్యల్లో వృద్ధి 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నట్టు జాతీయ క్రైమ్ రికార్డుల బ్యూరో(ఎన్సీఆర్బీ) గణాంకాలు చెబుతున్నాయి. 2014తో పోలిస్తే 2015లో రైతుల ఆత్మహత్యలు 322 శాతం పెరిగాయి. 2014లో 160 మంది రైతుల ఆత్మహత్యలు నమోదు కాగా, 2015లో 516కి పెరిగినట్టు ఎన్సీఆర్బీ చెబుతుండగా అంతకు రెండు రెట్లు ఎక్కువ ఉంటాయని రైతు సంఘాల పేర్కొంటున్నాయి. 2016, 2017లో కూడా రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగింది. -
సగమే రుణం... తప్పని భారం
సాక్షి, హైదరాబాద్: ఈ నెలాఖరుకు ఖరీఫ్ ముగియనుంది. ఇప్పటికే కోటి ఎకరాలకు పైగా పంటలు సాగయ్యాయి. సీజన్లో సమృద్ధిగా వర్షాలు కురవడంతో లక్ష్యానికి మించి వరి నాట్లు పడుతున్నాయి. అయితే బ్యాంకులు రైతులకు పంట రుణాలు ఇవ్వడంలో సహకరించడం లేదన్న ఆరోపణలున్నాయి. దీంతో రైతులకు ప్రైవేటు అప్పులే దిక్కయ్యాయి. ఖరీఫ్ పంట రుణ లక్ష్యం రూ.25,496 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.11,400 కోట్లే బ్యాంకులు ఇచ్చాయి. అంటే లక్ష్యంలో సగం కూడా విడుదల చేయలేదు. దీనిపై వ్యవసాయశాఖ వర్గాలు బ్యాంకులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు. బ్యాంకులు మాత్రం ధరణి వెబ్సైట్ అందుబాటులోకి రాకపోవడం వల్లే రుణాలు ఇవ్వడంలేదని చెబుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే వ్యవహరిస్తున్నామంటున్నాయి. ప్రభుత్వం పంట రుణాలకు సంబంధించి ఈసారి కొత్త నిబంధనను అమలులోకి తీసుకొచ్చింది. ఈ ఖరీఫ్ నుంచి కొత్త పట్టాదారు పాసు పుస్తకం కుదువబెట్టుకోకుండానే రైతులకు రుణాలు ఇవ్వాలని బ్యాంకులను ఆదేశించింది. రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ధరణి వెబ్సైట్లో రైతుల సమాచారం సరిచూసుకున్న తర్వాతే పంట రుణాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే ఆచరణలో అది సాధ్యంకాలేదు. దీంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. ధరణి వెబ్సైట్కు, రుణాలకు లంకె పెట్టడంపై విమ ర్శలు వస్తున్నా సర్కారు పట్టించుకోకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. -
బతుకుపై బండ'రాయి'
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలోని నాగల్గిద్ద మండలం మేత్రి రాందాస్కు రాళ్లలతో నిండిన ముప్పావు ఎకరం భూమి ఉంది. దానిపైనే ఆధారపడి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అందులో పంటలు సరిగా పండక కుటుంబంతో సహా ఉపాధి కోసం వలస బాట పట్టాడు. వర్షాలకు మాత్రమే పంటలు పండే ఆ భూముల్లో వర్షాభావంతో ఇప్పటికే వేసిన పెసర పంట సగానికి పైగా ఎండిపోయింది. నారాయణఖేడ్ ప్రాంతంలో రాళ్ల భూముల్లో రైతులు చేస్తున్న ‘కష్టాల సాగు’కు రాందాస్ కథ అద్దం పడుతోంది. నారాయణఖేడ్ ప్రాంతంలో వేలాది ఎకరాల్లో రాళ్ల భూమి విస్తరించి ఉంది. వీటిపైనే ఆధారపడి రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఎలాంటి నీటి ఆధారం లేకపోవడంతో పూర్తిగా వర్షాధార పంటలను సాగు చేస్తూ కుటుంబాలను పోషిస్తున్నారు. వర్షాధార పంటలు జొన్న, పెసలు, మినుములు తదితరాలను పండిస్తున్నారు. నియోజకవర్గంలోని నాగల్గిద్ద, మనూరు, కంగ్టి మండలాల్లో ఈ తరహా ‘ఎర్ర నేలలు’ఎక్కువగా ఉన్నాయి. పలుగు రాళ్లతో కూడిన ఈ భూములను స్థానికంగా ఎర్ర మొరం భూములు లేదా పడావు భూములుగా వ్యవహరిస్తారు. పూర్తిగా రాళ్లతో కూడిన ఈ భూమిలో భూగర్భ జల జాడలు ఎక్కడా కనిపించడం లేదు. బావుల తవ్వకానికి ఈ భూములు అనుకూలం కావని రైతులు చెబుతున్నారు. 300–400 అడుగుల లోతు వరకు బోర్లు వేసినా చుక్క నీరు పడలేదని కొందరు రైతులు చెబుతున్నారు. దీంతో వర్షాధార పంటలపైనే ఆధారపడుతున్నారు. నాకు ఉన్న భూమితో పాటు మరో ఎకరా కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నా. నువ్వులు, అవిశెలు వంటి గడ్డి జాతి పంటలు పండిస్తున్నా. రాళ్ల భూమి కాబట్టి వేరే పంటలు వేసే అవకాశం లేదు. ఈ భూముల్లో సాగు చేసినా లాభం లేదనే ఉద్దేశంతో చాలా మంది పంటలు వేయడం మానేశారు. వర్షం ఎక్కువ కురిసినా నీటి జాలుతో వేర్లు కుళ్లిపోయి పంటలు దెబ్బతింటాయి. ఈ భూములకు ఎకరా కౌలుకు రూ.5 వేలు ఇవ్వడం కూడా కష్టమే. ఏవైనా ఫ్యాక్టరీలు, తోటలు పెడితే ఏదన్నా ప్రయోజనం కలుగుతుంది. – బక్కప్ప, రైతు, నాగల్గిద్ద మాకు ఐదెకరాల భూమి ఉంది. ఎలాంటి నీటి ఆధారం లేదు. వర్షాధార పంటలు కంది, పెసర, జొన్న వేస్తున్నాం. పూర్తిగా రాళ్లతో కూడిన భూమి కావడంతో పత్తి, వరి పంటలు వేసేందుకు మాకు అవకాశం లేదు. ఏటా దుక్కి దున్నేందుకు రూ.10 వేలకు పైగా ఖర్చు అవుతుంది. వర్షాలు లేకపోతే పంట చేతికందే పరిస్థితి ఉండదు. ఎకరాకు ఒక్కో సారి క్వింటాలు కందులు కూడా పండవు. వానలు పడితే చేనులో పని చేసుకుంటం. లేదంటే తలోదారిన వేరే పనికి వెళ్తాం. – శాంతాబాయి, బంగ్లా తండా,నాగల్గిద్ద మండలం వర్షం లేకుంటే ఉపాధి బాటే.. తొలకరి మొదలవ్వగానే జొన్నలు, కందులు, పెసలు, మినుములు తదితర పంటలు వేస్తారు. జొన్న కొంత మేర వర్షాభావాన్ని తట్టుకోవడం, పెసలు, మినుములు తక్కువ కాల వ్యవధిలో దిగుబడి రావడంతో రైతులు వీటి సాగుపైనే మొగ్గు చూపుతున్నారు. రాళ్లతో కూడిన భూమిని దుక్కి దున్నేందుకు ఏటా వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. ఒకసారి రాళ్లను తొలగించినా, ఆ నేలల స్వభావం వల్ల మరుసటి సంవత్సరం కూడా మళ్లీ రాళ్లు వస్తాయని అంటున్నారు. వర్షాలు ఎక్కువ కురిస్తే మృత్తిక క్షయం జరుగుతోందని, తక్కువ పడితే పంటలు ఎండిపోయి పెట్టుబడి కూడా రావడం లేదని చెబుతున్నారు. దీంతో వేలాది ఎకరాలు నిరుపయోగంగా ఉన్నాయి. సాగు నీరు అందించడం లేదా పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తేనే తమకు ప్రయోజనం కలుగుతుందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలో రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు అమ్ముడుపోయిన ఈ భూములు ప్రస్తుతం ఎకరాకు రూ.2 లక్షల పైనే ధర పలుకుతున్నాయి. -
ఎకరాకు రూ.10 వేలు
సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరికి వరదల వల్ల ఉభయ గోదావరి జిల్లాల్లో పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకుంటామని, ఆయా పంటలను తిరిగి వేసుకునేందుకు హెక్టారుకు రూ.25 వేల చొప్పున (ఎకరాకు సుమారు రూ.10 వేలు) సాయం అందజేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వరదల కారణంగా పశ్చిమగోదావరి జిల్లాలో 19 వేల ఎకరాల్లో, తూర్పుగోదావరి జిల్లాలో 6,468 హెక్టార్లలో వరి, పత్తి, ఉద్యానవన పంటలు, కూరగాయలు దెబ్బతిన్నాయని తెలిపారు. మొత్తంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పంటలు, రోడ్లు, ఇళ్లు దెబ్బతినడంతో రూ.600 కోట్ల నష్టం వాటిల్లిందని వివరించారు. పశ్చిమగోదావరిలో రూ.350 కోట్లు, తూర్పుగోదావరిలో రూ.250 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి వరదలపై సీఎం బుధవారం ఏరియల్ సర్వే చేశారు. అనంతరం రాజమహేంద్రవరం సమీపంలోని మధురపూడి విమానాశ్రయంలో రెండుజిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జలనవరులశాఖ, ఆర్అండ్బీ తదితర విభాగాల ముఖ్యఅధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష జరిపారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల కలెక్టర్లు కార్తికేయ మిశ్రా, కాటమనేని భాస్కర్లు తమ జిల్లాల్లో వరద ప్రభావం, నష్టం, పునరావాస చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం సీఎం విలేకరులతో మాట్లాడుతూ.. పశ్చిమగోదావరి జిల్లాలో గోదావరి వరదలకంటే ఎర్రకాలువ పొంగడంతో ఎక్కువ నష్టం జరిగిందన్నారు. ఎర్రకాలువ వరదను పోలవరం కుడికాలువ, సముద్రంలోకి మళ్లించి మరోసారి నష్టం జరగకుండా చర్యలు చేపడతామని చెప్పారు. వరదలకు ప్రభావితమైన తూర్పుగోదావరి జిల్లాలోని 19 మండలాల్లోని 149 గ్రామాలు, పశ్చిమలో 25 మండలాల్లోని 195 గ్రామాల్లో చేపట్టిన పునరావాస చర్యలపై అధికారులను అభినందించారు. వరదలు తగ్గగానే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఆర్అండ్బీ రోడ్ల మరమ్మతులకు రూ.35 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. 110 కిలోమీటర్ల మేరకు దెబ్బతిన్న రాష్ట్ర రహదారుల మరమ్మతులకు రూ.22 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. పశ్చిమలో కొత్తగా ఐదు బ్రిడ్జిల నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మైదాన ప్రాంతాల్లో దెబ్బతిన్న ఇళ్లనిర్మాణానికి గృహ నిర్మాణ పథకం కింద రూ.1.5 లక్షలు, గిరిజన ప్రాంతాల్లో రూ.2.25 లక్షలు చొప్పున అందజేస్తామని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు నెలరోజులకు సరిపడా బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేయాలని ఆదేశించారు. కోనసీమలో లంకల్లోకి వెళ్లేందుకు నదిని దాటే 8 ప్రాంతాల్లో 15 రోజుల్లో స్పీడు బోట్లు ఏర్పాటు చేస్తామన్నారు. కరువు, వరద వారసత్వంగా వస్తున్నాయి... రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కరువు, కోస్తాలో వరదలు కవలపిల్లల్లా వారసత్వంగా వస్తున్నాయని సీఎం వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ధవళేశ్వరం నుంచి రోజుకు రూ.150 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళుతోందన్నారు. ఆ నీటిని కొంతమేరకైనా కరువు జిల్లాలకు మళ్లిస్తే బాగుండేదన్నారు. పోలవరం ప్రాజెక్టును 2019లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు. ఆలోపు పూర్తి చేస్తామంటే ఎవరికైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ప్రాజెక్టు రీడిజైన్లను కేంద్రం ఆమోదించాల్సి ఉందని, ఇప్పటివరకు చేసిన పనులకు ఇవ్వాల్సిన రూ.2,600 కోట్లను మంజూరు చేయకపోవడమే అడ్డంకిగా మారిందని చెప్పారు. రాష్ట్రంలో 57 ప్రాజెక్టులు చేపట్టామని, నదుల అనుసంధానం చేసి కరువును తరమికొడతామన్నారు. త్వరలో ప్రతిఇంటికీ కుళాయి ద్వారా నీళ్లు ఇస్తామన్నారు. దుబారా ఖర్చులను అరికడితే ప్రాజెక్టులు పూర్తి చేయవచ్చని ఓ నాయకుడంటున్నారని, అలాంటప్పుడు మీరెందుకు చేయలేదని ప్రశ్నించారు. సమావేశంలో ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డిసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. -
2.08 లక్షల ఎకరాల్లో పంట నష్టం
సాక్షి, హైదరాబాద్: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు 2.08 లక్షల ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లింది. ఈ మేరకు వ్యవసాయశాఖ బుధవారం సర్కారుకు ప్రాథమిక నివేదిక సమర్పించింది. అందులో 1.19 లక్షల ఎకరాల్లో పత్తి, 55 వేల ఎకరాల్లో వరికి నష్టం సంభవించినట్లు వెల్లడించింది. మొత్తం 11 జిల్లాల్లో పంటలకు నష్టం జరిగినట్లు ఆ నివేదికలో వివరించింది. ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వాగులు వంకలు పొంగిపొర్లాయి. కుండపోత వర్షాలకు పూర్తిగా పంటలు మునిగిపోయాయి. తీవ్ర వర్షాల కారణంగా దాదాపు 4 లక్షల ఎకరాల్లో పంటలు మునిగిపోయినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు అంచనా వేశాయి. అందులో పైన పేర్కొన్నట్లుగా 2.08 లక్షల ఎకరాల్లోని పంటలు పూర్తిగా చేతికందకుండా పోయినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. గురువారం నాటికి పూర్తి నష్టం లెక్కలు వెల్లడి కానున్నాయని అధికారులు చెబుతున్నారు. అత్యధిక వర్షపాతంతో అధిక నష్టం అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ తన నివేదికలో తెలిపింది. 11 జిల్లాల్లో 2.08 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరగ్గా, ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే 1.25 లక్షల ఎకరాల పంటకు నష్టం సంభవించినట్లు వెల్లడించింది. ఆ తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 35,137 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఆదిలాబాద్ జిల్లాలో 97,547 ఎకరాల్లో పత్తికి నష్టం చేకూరింది. రాష్టవ్యాప్తంగా అత్యధిక వర్షపాతం నమోదైన జిల్లాల్లో జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్ జిల్లాలు ముందున్నాయి. సాధారణం కంటే భూపాలపల్లి జిల్లాలో 63 శాతం, ఆదిలాబాద్ జిల్లాలో 59 శాతం వర్షపాతం నమోదు కావడంతో అక్కడే పంటలకు అధిక నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. అత్యంత తక్కువగా జగిత్యాల జిల్లాలో 358 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తెలిపింది. పూత దశలో ఉండటంతో ఎక్కువగా.. పత్తి మొక్క దశ నుంచి పూత దశకు చేరుకుంటున్న తరుణంలో భారీ వర్షాలు పడటంతో పంటకు ఎక్కువ నష్టం చేకూరింది. వరి ఇప్పుడిప్పుడే నాట్లు వేసిన దశలో ఉండటంతో దానిపై కూడా అధిక ప్రభావం పడింది. పెసర మొత్తం నాశనమై పోయినట్లేనని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఖరీఫ్లో 90 లక్షల ఎకరాల్లో పంటలు వేయగా, వాటన్నింటికీ ఈ వర్షాలు మరింత ప్రాణం పోసినట్లేనని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే భారీగా పంటలకు నష్టం వాటిల్లడంతో ఏ మేరకు వీటికి బీమా పరిహారం అందుతుందోనన్న చర్చ జరుగుతోంది. -
తెలంగాణలో వర్షాలతో రైతులకు భారీ నష్టం
-
3 లక్షల ఎకరాల్లో పంట మునక
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో దంచికొడుతున్న భారీ వర్షాలకు పలు జిల్లాల్లో ఖరీఫ్ పంటలు నీట మునిగాయి. ఇప్పటివరకు 3 లక్షల ఎకరాల మేర పంటలు నీటిమునిగినట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా పూర్వ ఆదిలాబాద్ జిల్లాలోనే 1.23 లక్షల ఎకరాల మేర పంటలు నీటమునిగినట్లు తెలుస్తోంది. ప్రధానంగా పత్తి, పెసర పంటలు మునిగినట్లు చెబుతున్నారు. పూర్వ ఖమ్మం జిల్లాలో మిరప నారు మునిగిపోవడంతో పనికి రాకుండా పోయింది. అలాగే చేతికి వచ్చే దశలో పెసర పంట పూర్తిగా నాశనమైందని వ్యవ సాయశాఖ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.76 లక్షల ఎకరాల్లో పెసర వేయగా భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో పెసర కాయలు బూజుపట్టి పాడైపోయాయని అధికారులు పేర్కొన్నారు. పూర్వ ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో అనేక చోట్ల సోయాబీన్, జొన్న, పత్తి పంట మునిగిపోయింది. రెండు, మూడు రోజుల్లో ఆయా చేల నుంచి నీరు బయటకు పోతే ఎలాంటి ఇబ్బంది ఉండదని, లేకుంటే మాత్రం నష్టం వాటిల్లుతుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఇప్పటికే నీటమునిగిన పంటలు దెబ్బతినే అవకాశమే ఎక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు. మరోవైపు ప్రస్తుత వర్షాలతో వరి నాట్లు ఊపందుకున్నాయి. కీలక సమయంలో వర్షాలు కురుస్తుండటంతో ఈసారి వరి అంచనాలకు మించి సాగవుతుందని అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్ వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.75 లక్షల ఎకరాలుకాగా ఇప్పటివరకు 18 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. ఈ వర్షాలతో మిగిలిన చోట్ల కూడా వరి నాట్లు పడతాయని, ప్రాజెక్టుల కింద కూడా వరి నాట్లు పుంజుకుంటాయని అంచనా వేస్తున్నారు. నేడు అతి భారీ వర్షాలు... పశ్చిమ బెంగాల్–ఉత్తర కోస్తా ఒడిశాలను ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనంతోపాటు దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుండటంతో మంగళవారం రాష్ట్రంలో పలుచోట్ల అత్యంత భారీ వర్షం, మరికొన్ని చోట్లభారీ నుంచి అతిభారీ వర్షాలు, ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. అలాగే బుధవారం పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు. ఆదివారం నుంచి సోమవారం రాత్రి వరకు భూపాలపల్లి, కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవగా, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల్లోకి భారీగా వరద చేరుతుండటంతో చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. ఈ ఏడాది జూన్ ఒకటో తేదీ నుంచి సోమవారం వరకు ఈ సీజన్లో రాష్ట్రంలో సాధారణం కంటే 17 శాతం అధిక వర్షపాతం నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి, కొమురం భీం జిల్లాల్లో 61 శాతం, ఆదిలాబాద్ జిల్లాలో 55 శాతం అధికంగా వర్షపాతం నమోదు కావడం విశేషం. ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి సోమవారం ఉదయం 8.30 గంటల వరకు సూర్యాపేట జిల్లాలో 11.74 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా ఒక్క రోజులో కురిసే సగటు వర్షపాతానికి ఇది 1,763 శాతం అధికం కావడం విశేషం. అలాగే ఖమ్మం జిల్లాలో ఒక్క రోజులో 1,397 శాతం అధికంగా వర్షం కురిసింది. సాగర్లో 200 టీఎంసీలు... కృష్ణా బేసిన్ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి వరద పరవళ్లు తొక్కుతోంది. ఇప్పటికే నిండిన శ్రీశైలం ప్రాజెక్టులోకి వస్తున్న ప్రవాహాలను దిగువకు వదిలేయడంతో నాగార్జునసాగర్లో నీటి నిల్వ 200 టీఎంసీలకు చేరింది. వరద ఇలాగే కొనసాగితే 7–8 రోజుల్లో ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సాగర్ ఎడమ కాల్వ కింది ఆయకట్టుకు బుధవారం నుంచి నీటిని విడుదల చేయనున్నారు. సాగర్ నిండాలంటే ఇంకా 112 టీఎంసీలు అవసరం. గతేడాది సాగర్లో ఈ సమయానికి నీటి నిల్వ 115 టీఎంసీలే ఉండటం గమనార్హం. గోదావరి ప్రాజెక్టుల్లో జలకళ.. గోదావరి ప్రాజెక్టుల్లోనూ ప్రవాహాలు పుంజుకుంటున్నాయి. ఇప్పటికే వాగులు, వంకలు నిండటం, చెరువులు అలుగుపారుతుండటంతో ప్రాజెక్టుల్లో ప్రవాహాలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో గోదావరి బేసిన్లోని ప్రధాన మధ్యతరహా ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. బేసిన్ పరిధిలోని 27 మద్యతరహా ప్రాజెక్టులన్నీ నిండటంతో వాటి గేట్లెత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాల, మత్తడివాగు, సుధ్దవాగు, వట్టివాగు, ఎన్టీఆర్ సాగర్, పీపీ రావు ప్రాజెక్టు, కొమురం భీం, గొల్లవాగు, నీల్వాయి, ర్యాలివాగు ప్రాజెక్టులన్నీ నిండటంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. వరంగల్ జిల్లాలోని లక్నవరం, పాలెంవాగు, గుండ్లవాగు ప్రాజెక్టులు, ఖమ్మం జిల్లాలోని తాలిపేరు, పెద్దవాగు, కిన్నెరసానిలకు గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. వాటి కింద 2.92 లక్షల ఎకరాల సాగుకు మార్గం సుగుమమైంది. ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు (టీఎంసీల్లో), ప్రవాహాలు (క్యూసెక్కుల్లో) ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం ప్రస్తుత నిల్వ ఇన్ఫ్లో ఔట్ఫ్లో ఆల్మట్టి 129.72 125.83 1,48,000 1,60,060 నారాయణపూర్ 37.64 35.83 1,60,260 1,59,630 జూరాల 9.66 9.11 1,17,000 1,14,942 శ్రీశైలం 215.81 200.20 2,38,889 2,38,889 నాగార్జునసాగర్ 312.05 200 2,08,464 9,638 కడెం 7.6 6.05 61,241 77,116 లోయర్ మానేరు 24.07 3.52 238 99 నిజాంసాగర్ 17.80 2.29 487 0 సింగూరు 29.91 7.61 170 170 ఎల్లంపల్లి 20.17 19.20 81,195 81,195 ఎస్సారెస్పీ 90.31 33.76 19,720 0 గత 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో వర్షపాతం (సెంటీమీటర్లలో) అశ్వారావుపేట 21 భద్రాచలం 15 ముల్కలపల్లి 14 ఏన్కూరు, సత్తుపల్లి 13 వెంకటాపురం 12 బూర్గుంపాడు 12 దుమ్ముగూడెం 12 సూర్యాపేట 12 మణుగూరు 11 జూలూరుపాడు 11 తల్లాడ 11 చెరువులు ఫుల్... కృష్ణా, గోదావరి బేసిన్లలో చెరువులు 44,497 అలుగు పారుతున్న వాటి సంఖ్య 9,948 వాటిలో గోదావరి బేసిన్లో అలుగుపారుతున్నవి 9,719 నిండేందుకు సిద్ధంగా ఉన్న చెరువులు 5,500 జిల్లాలవారీగా అలుగుపారుతున్న చెరువుల సంఖ్య... కొత్తగూడెం 2,184 భూపాలపల్లి 2,011 పెద్దపల్లి 1,097 వనపర్తి 138 -
‘కత్తెర’ కాటు
సాక్షి, హైదరాబాద్:‘గులాబీ’గుబులు రేపుతోంది. ‘కత్తెర’కాటు వేస్తోంది. పురుగులు చేల వైపు పరుగులు తీస్తున్నాయి. పంటలపై దాడి చేస్తున్నాయి. పత్తిని గులాబీరంగు పురుగు, మొక్కజొన్నను కత్తెర పురుగు పీల్చి పిప్పి చేస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో ఆ రెండు పంటల పరిస్థితి దయనీయంగా మారింది. మెదక్, వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో పూత దశలో ఉన్న పత్తి పంటకు గులాబీ పురుగు సోకినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లోనూ దాని ఛాయలు కనిపిస్తున్నాయని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 42.99 లక్షల(102%) ఎకరాల్లో సాగైంది. అందులో దాదాపు 15 శాతం వరకు గులాబీ రంగు పురుగు సోకినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పలు జిల్లాల్లో మొక్కజొన్న పంటను తీవ్రంగా నష్టపరుస్తున్న కత్తెర పురుగు ఉధృతిని కేంద్రం అత్యవసర పరిస్థితిగా గుర్తించిందని కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రానికి చెందిన మొక్కల సంరక్షణ అధికారి ఒకరు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు ఇటీవల సిద్దిపేట జిల్లా గజ్వేల్, వర్గల్ మండలాల్లో మొక్కజొన్న చేలను పరిశీలించారు. ఎక్కడ చూసినా కత్తెర పురుగు ధాటికి తీవ్రంగా ధ్వంసమైన పంటలే కనిపించాయి. వాటిలో మొక్కలకు ఆశించిన పురుగులను, వాటి గుడ్లను, లార్వాను పరిశీలించారు. విదేశాల నుంచి వచ్చిన ఈ కత్తెర పురుగు(ఫాల్ ఆర్మీ వామ్)పై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని వారు పేర్కొన్నారు. ఇప్పటికే సిద్దిపేట జిల్లాల్లో 50 శాతం మేర మొక్కజొన్నకు నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. దీనిపై కేంద్రానికి ఆ బృందం నివేదిక సమర్పించనుంది. తెలంగాణ మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 13.40 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 10.88 లక్షల ఎకరాల్లో సాగైంది. రాష్ట్రంలో ఏ స్థాయిలో కత్తెర పురుగు సోకిందోనన్న ఆందోళన రైతులను పట్టి పీడిస్తోంది. ఆసియాలో కర్ణాటక తర్వాత తెలంగాణలోనే ఈ పురుగు కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో వరినాట్లు పుంజుకున్నాయి. 17.52 లక్షల (74%) నాట్లు పడినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. 12 జిల్లాల్లో లోటు వర్షపాతమే... రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నా ఇప్పటికీ 13 జిల్లాల్లో లోటు వర్షపాతమే ఉంది. కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, యాదాద్రి, మేడ్చల్, హైదరాబాద్, వికారాబాద్, వనపర్తి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని వ్యవసాయశాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, కొమురంభీం, పెద్దపల్లి, జయశంకర్, భద్రాద్రి జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదుకాగా, మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం రికార్డు అయింది. విదర్భ, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారి శుక్రవారం ఉదయానికి నైరుతి మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో తెలంగాణలో శని, ఆదివారాల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్ కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కొమురంభీం, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలతోపాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. అనేకచోట్ల భారీవర్షాల కారణంగా పెద్ద ఎత్తున పంటలు మునిగిపోయాయి. దాదాపు 50 వేల ఎకరాల్లో పంటలు మునిగినట్లు అంచనా వేస్తున్నారు. పంటలు మునుగుతుంటే పట్టించుకునే నాథుడే లేకుండా పోయారన్న విమర్శలున్నాయి. -
పంటలకు ప్రాణం..
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: చాలా రోజుల తర్వాత భారీ వర్షం జిల్లాను ముంచెత్తింది. ఎండిపోతున్న పంటలకు ప్రాణం పోసింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కాలువల్లో నీరు చేరి జల కళ సంతరించుకున్నాయి. ఉపరితల ఆవర్తనం కారణంగా శనివారం తెల్లవారు జామున నుంచి ప్రారంభమైన వాన ఆదివారం ఉదయం వరకు ఎడ తెరిపి లేకుండా కురిసింది. జిల్లా వ్యాప్తంగా 232.9 సెం.మీటర్ల వర్షపాతం రికార్డు కాగా, సగటున 8.6 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా ఆర్మూర్లో 13.6 సెం.మీటర్ల వర్షం కురియగా, మోర్తాడ్లో 11.3, ఏర్గట్ల, నిజామాబాద్ దక్షిణం, నవీపేట్, నందిపేట్ మండలాల్లో 10 సెం.మీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది. దీంతో జిల్లాలోని చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. పంటలకు ప్రాణం.. పక్షం రోజులుగా సరైన వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండుముఖం పట్టాయి. ఖరీఫ్లో సాగు చేసిన పంటలన్నీ వాడిపోయాయి. ముఖ్యంగా వరి పొలాలు నీళ్లు లేక బీటలు వారాయి. నాట్లు వేసుకున్న చాలా చోట్ల వాడిపోయే పరిస్థితికి చేరుకుంది. అలాగే, మొక్కజొన్న, పూత దశలో ఉన్న సోయా ఎండి పోయే దశకు చేరడంతో రైతులు ఆందోళన చెందారు. పంటలు ఎండిపోతున్న తరుణంలో కురిసిన తాజా వర్షం ప్రాణం పోసింది. దీంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఎస్సారెస్పీకి స్వల్ప ఇన్ఫ్లో.. తాజా వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో స్వల్పంగా పెరిగింది. వారం రోజులుగా ఇన్ఫ్లో లేని ఈ జలాశయానికి ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 3,224 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎస్సారెస్పీ ఎగువ ప్రాంతంలో వర్షాలు కురిస్తే మరింత వరద నీరు వచ్చే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఎనిమిది మండలాల్లో లోటు.. జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురిసినప్పటికీ ఇంకా ఎనిమిది మండలాలు లోటు వర్షపాతం జాబితాలో ఉన్నాయి. ఆదివారం నాటికి సగటున 7.9 సెం.మీ. లోటుంది. బాల్కొండ, మోపాల్, ఇందల్వాయి, రుద్రూర్, నిజామాబాద్ రూరల్, రెంజల్, ముప్కాల్, మెండోరాల్లో ఇప్పటికీ సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. జక్రాన్పల్లి, మోర్తాడ్ మండలాల్లో మాత్రమే సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం రికార్డయింది. మిగిలిన మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా జూన్ 1 నుంచి ఈ నెల 12 నాటికి 1,503.8 సెం.మీ. సాధారణ వర్షపాతం కురవాల్సి ఉండగా, 1,385.6 సెం.మీల వర్షం మాత్రమే కురిసింది. -
అతలాకుతలం..
ఆదిలాబాద్రూరల్: జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి మొదలైన వర్షం విరామం లేకుండా కురుస్తోంది. దీంతో జిల్లాలో 140.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా ఉట్నూర్లో అత్యధికంగా 235.3 మిల్లీమీటర్లు, భీంపూర్లో అత్యల్పం గా 89.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాలతో వాగులు, వంకలు జలకళ సంతరించుకున్నాయి. ఆయా ప్రాంతాల్లో లోలెవల్ వంతెనల పైనుంచి వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. చెరువులు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. ప్రాజెక్టులకూ భారీగా నీరు చేరుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని వ్యవసాయ పంట పొలాల్లో కొంత మేర పంట దెబ్బతిని నేలమట్టమైంది. ఎడతెరిపి లేకుండా ముసురు వానతో జనజీవనం స్తంభించింది. చేలలోకి వెళ్లాల్సిన రైతులు ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి కనిపించింది. ముసురువాన.. ముసురు ఇంకా కొనసాగుతోంది. ఉట్నూర్, గాదిగూడ, నార్నూర్, ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, నేరడిగొండ, సిరికొండ, ఇచ్చోడ మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. పక్షం రోజులుగా వర్షాలు ముఖం చాటేయడంతో ఆందోళన చెందిన రైతన్నలు ముసురు వానలతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెన్గంగ, సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టు పరీవాహక ప్రాంతాల్లోని వాగుల సమీపంలో పంట పొలాల్లో వరద నీరు చేరడంతో కొంతమేర దెబ్బతిన్నాయి. దీంతో ఆ రైతులు ఆందోళన చెందుతున్నారు. జూన్ మొదటి వారంలో జిల్లాను తొలకరి పలకరించింది. తొలకరి వానలతో రైతులు మురిసిపోయారు. పత్తి, సోయా పంటలు సాగు చేశారు. ఆ తర్వాత వర్షాలు ముఖం చాటేశాయి. దీంతో రైతుల్లో ఆందోళన కనిపించింది. మధ్య మధ్యలో కురిసిన వానలు కొంత ఊరటనిచ్చాయి. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అన్ని చోట్ల వాగులు, వంకల్లో వరద నీరు ప్రవహిస్తోంది. పంటలకు ఈ వర్షాలు జీవాన్నిస్తున్నాయి. చెరువులకు జలకళ.. ప్రాజెక్టులకు ఇన్ఫ్లో.. జిల్లాలో కురుస్తున్న వర్షాలతో చెరువులు జలకళ సంతరించుకున్నాయి. వరుణుడి కరుణ కోసం ఆకాశంవైపు దిగాలుగా చూస్తున్న రైతన్నకు ఈ వర్షాలు ఊపిరినిచ్చాయి. జైనథ్ మండలం సాత్నాల ప్రాజెక్టు 1.24 టీఎంసీ సామర్థ్యం కలిగి ఉండగా, 1 టీఎంసీ నీటి నిల్వ ఉంది. 1400 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుండగా, ఒక గేటు ఎత్తి అంతే మొత్తంలో దిగువకు వదులుతున్నారు. లక్ష్మీపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీటిమట్టం 250.6 మీటర్లు కాగా, నీటి నిల్వ సామర్థ్యం 0.153 టీఎంసీలు కాగా, ప్రస్తుతం పూర్తిగా నిండింది. ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు సాత్నాల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో నిండుకుండలా తలపిస్తోంది. తాంసి మండలం మత్తడి వాగు ప్రాజెక్టు 277.5 మీటర్లు నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉండగా, ప్రస్తుతం 277.3 మీటర్ల నీటి నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టులో 5 గేట్లు ఉండగా, 3 గేట్లను ఎత్తివేసి ఇన్ఫ్లో వదులుతున్నారు. అతలాకుతలం.. జిల్లాలో భారీ వర్షాలు కురియడంతో అతలాకుతలమైంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో పలు లోతట్టు ప్రాంతాల్లోని పంట పొలాల్లో వర్షపు నీరు చేరి నష్టం వాటిల్లింది. సిరికొండ మండలం గుండాల వాగు పొంగిపొర్లడంతో సుమారు 70 మంది రైతులకు సంబంధించిన 150 ఎకరాల పత్తి పంట కొట్టుకుపోయింది. ఇచ్చోడ మండలం చించోలి, హీరాపూర్, ఆడెగాం(కె) గ్రామాల్లోని శివారు సుమారు 120 ఎకరాల పంట పొలాలు వరదనీటితో ముంపునకు గురయ్యాయి. వర్షాలు తగ్గుముఖం పట్టాకే వీటి నష్టం అంచనా వేసే వీలుంటుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇంద్రవెల్లి మండలం లోతట్టు ప్రాంతంలోని వ్యవసాయ పంట పొలంలో వరదనీరు చేరి సోయాబీన్, కొంత మేర పత్తి పంటకు నష్టం వాటిల్లింది. పంట నష్టాన్ని అధికారులు అంచనా వేయాలని కోరుతున్నారు. నార్నూర్ మండలం గాదిగూడ లోలెవల్ వంతెన పైనుంచి వరదనీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో సుమారు 25 గ్రామాల ప్రజలు రాకపోకల కోసం ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆదిలాబాద్రూరల్ మండలం అనుకుంట లోలెవల్ వంతెన పైనుంచి వరదనీరు పోటెత్తడంతో ఎక్కడి గ్రామాల ప్రజలు అక్కడే ఉండిపోయారు. ఆయా వాగుల ఉధృతి ఆదివారం ఉదయం 10గంటల వరకు తగ్గకపోవడంతో ప్రజలు అవస్థలు ఎదుర్కొన్నారు. పంటలకు మేలైన వర్షం.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పంటలకు అనుకూలంగా ఉన్నాయి. గత 20 రోజుల నుంచి వర్షాల జాడ లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ఆనందంలో ఉన్నారు. మరో వారం రోజులు వర్షాలు కురియకుండా ఉంటే దిగుబడిపై ప్రభావం చూపే ప్రమాదం ఉండేది. కొన్ని ప్రాంతాల్లో వాగుల సమీపంలోని పంట పొలాల్లో వరదనీరు చేరడంతో పంట దెబ్బతింది. మరికొన్ని పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. – మంగీలాల్, జేడీఏ, ఆదిలాబాద్ -
అర టీఎంసీ ఇస్తే ఇబ్బంది లేదు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కాకతీయ కాలువ ఆధారంగా పంటలు వేసుకుంటున్నాము. గతేడాది మాదిరిగానే ఈ ఏడాదీ నీళ్లిస్తే ఎండిపోతున్న మా పంటలు గట్టెక్కుతాయి. మేము రోజుకు 200 క్యూసెక్కులే నీటిని వదలమంటున్నాము. నెలంతా ఇచ్చినా అర టీఎంసీకి మించదు. ప్రాజెక్టులోకి నీళ్లు వచ్చాక సెప్టెంబర్లో నీళ్లిస్తామని సర్కారు అంటోంది. అప్పటి వరకు మా పంటలు బతుకుతయా? ఒక్క తడి ఇచ్చినా పంటలు గట్టెక్కుతాయి. – ఇది ఎస్సారెస్పీ కాకతీయ కాలువ రైతుల ఆవేదన. ఈసారి వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రాజెక్టులో ప్రస్తుతం 16 టీఎంసీలే నిల్వ ఉన్నాయి. తాగునీటి అవసరాలు, డెడ్స్టోరేజీ, ఆవిరి నష్టాలకు పోను ఉన్న నీరు బొటాబొటిన సరిపోతాయి. రాబోయే రోజుల్లో ఎగువన వర్షాలు కురిసి.. ప్రాజెక్టులోకి నీరు వస్తే కాకతీయ కాలువతో పాటు, సరస్వతి, లక్ష్మి కాలువలకు నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. – ఇది ప్రభుత్వ వాదన. ఇదీ ఎస్సారెస్పీ ప్రాజెక్టు పరిస్థితి.. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 16 టీఎంసీల నిల్వ ఉంది. రైతులు అడుగుతున్న మేరకు రోజుకు 200 క్యూసెక్కులు విడుదల చేస్తే ఇబ్బందేమీ లేదని నిపుణు లు పేర్కొంటున్నారు. ఇలా నెలంతా ఇచ్చినా అర టీఎంసీకి మించదని అంటున్నారు. ప్రస్తుతమున్న 16 టీఎంసీల్లో.. మిషన్ భగీరథకు 6.5 టీఎంసీలు, డెడ్స్టోరేజీ 5.0 టీఎంసీలు, ఆవిరి నష్టాలు 3 టీఎంసీలు (4 నెలలకు) పోగా సుమారు 1.5 టీఎంసీలు మిగులుతాయి. ఇందులో నుంచి 0.5 టీఎంసీలు ఇవ్వడానికి ఇబ్బందేమీ ఉండదు. సెప్టెంబర్లోనే వరద..: గత దశాబ్ద కాలంగా ఎస్సారెస్పీకి వచ్చిన ఇన్ఫ్లోలను పరిశీలిస్తే.. సెప్టెంబర్ నెలలోనే భారీ ఇన్ప్లో వచ్చి చేరుతుంది. దీనికి తోడు జలాశయం ఎగువన ఉన్న మహారాష్ట్ర ప్రాజెక్టులు నిండుకుండలా ఉన్నాయి. అయినా ప్రభుత్వం అర టీఎంసీ ఇచ్చేందుకు ససేమిరా అనడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. రెండు జిల్లాల రైతుల ఆందోళన..: ఎస్సారెస్పీ జలవివాదం రోజురోజుకూ ముదురుతోంది. కాకతీయ కాలువకు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్, జగిత్యాల జిల్లాల రైతులు ఉద్యమబాట పట్టారు. రైతులకు మద్దతు తెలిపేందుకు నిజామాబాద్కు వస్తున్న తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాంను సోమవారం భిక్కనూర్ వద్ద అదుపులోకి తీసుకుని తిరిగి హైదరాబాద్ తరలించారు. -
పోడు రైతుల జోలికి వెళ్లొద్దు
కొల్లాపూర్: పోడు భూములు సాగుచేసుకుంటున్న రైతులను ఇబ్బంది పెట్టొద్దని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ఆ శాఖ అధికారులకు సూచించారు. పోడు భూముల్లో పంటలు వేసుకున్న రైతుల జోలికి వెళ్లొద్దని స్పష్టం చేశారు. శనివారం ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలసి నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో పర్యటించారు. ఈ నియోజకవర్గంలో అటవీ సరిహద్దుల పేరిట అధికారులు తవ్వుతున్న కందకాలను అడ్డుకుంటున్న రామాపురం, ముక్కిడిగుండం, నార్లాపూర్, కల్వకోల్, వరిదేల గ్రామాల రైతులతో మంత్రులు సమావేశమయ్యారు. పోడు భూముల సాగుకు తమ ప్రభుత్వం వ్యతిరేకం కాకున్నా.. అడవులను నరుక్కుంటూ పోతే జీవరాశి ఎలా బతుకుతుందని ప్రశ్నించారు. ఇప్పటివరకూ అటవీ భూములు సాగుచేసుకుంటున్న రైతుల జోలికి అధికారులు రారని, పంటలకు నష్టం చేయరని తెలిపారు. కందకాల తవ్వకాల వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. అయితే, పంటలు సాగుచేయని భూముల్లో మాత్రం చెట్లు నాటుతామని స్పష్టం చేశారు. 1960లో చాలామంది రైతులకు అటవీ భూముల్లో రెవెన్యూ పట్టాలు ఇచ్చారని చెప్పిన ఆయన, రెవెన్యూ, అటవీ భూముల సరిహద్దులు గుర్తించేందుకు సర్వేఆఫ్ ఇండియాకు సీఎం కేసీఆర్ లేఖ రాశారని తెలిపారు. అక్కడి అధికారులు సర్వే చేశాక భూముల హద్దులు తేలుతాయన్నారు. ఆ విషయాలను తాము చూసుకుంటామని, అప్పటివరకు రైతులను ఇబ్బంది పెట్టొద్దని అధికారులకు మంత్రి జోగు రామన్న సూచించారు.