మాచర్ల: అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా మాచర్ల మండలం హస్నాబాద్ గ్రామంలో శుక్రవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన బిస్లావత్ సాహూనాయక్(43) తనకున్న రెండెకరాలతో పాటు మరో ఏడెకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. ఈ క్రమంలో అప్పులు పెరిగిపోవడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.