రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే కుమార్తె మృతి | former mla daughter died in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే కుమార్తె మృతి

Published Mon, Mar 23 2015 1:57 PM | Last Updated on Wed, Oct 3 2018 7:38 PM

former mla daughter died in road accident

గుంటూరు : గుంటూరు జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే చిట్టినేని వెంకటేశ్వర్లు కూతురు పద్మావతి(52) మృతి చెందగా.. ఆమె భర్త దేవేందర్‌నాథ్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లా పొన్నూరు మండలంలో బ్రాహ్మణకోడూరు అడ్డరోడ్డు సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. ఏలూరు నుంచి పొన్నూరు వస్తున్న పద్మావతి కారు బ్రాహ్మణకోడూరు అడ్డరోడ్డు సమీపంలో రేపల్లె నుంచి గుంటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది.

దీంతో కారు రోడ్డుపై పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో పద్మావతి అక్కడికక్కడే మృతిచెందగా.. ఆమె భర్తకు తీవ్రగాయాలయ్యాయి. ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
(పొన్నూరు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement