
మార్కెట్ యార్డు వద్ద రైతుల ఆందోళన
అనంతపురం: అనంతపురం జిల్లా మార్కెట్ యార్డు వద్ద రైతులు ఆందోళనకు దిగారు. విత్తనాల పంపిణీ ని ఈ నెల 14 కు అధికారులు వాయిదా వేశారు. వేరుశెనగ విత్తనాలు ఎందుకు సరఫరా చేయడం లేదని అధికారులను రైతులు నిలదీశారు. దీంతో రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. విత్తనాలను వెంటనే పంపిణీ చేయాలని వారు ధర్నాకు దిగారు. విత్తనాల కోసం జిల్లాలోని పూడేరు, పుట్టపర్తి లో కూడా రైతులు ధర్నా చేపట్టారు.