Seeds
-
'మిట్టి దీదీ': విషరహిత విత్తనాల కోసం..!
బిడ్డ ఎదుగుదలకు తోడ్పడే పోషకాలన్నీ కలిపి అమ్మచేతి గోరుముద్ద రూపంలో బుజ్జాయి బొజ్జలోకి వెళ్తాయి. అలాంటి అమ్మ చేతి ముద్దలో ఉండే ఆహారం రసాయనాలతో నిండితే.. భవిష్యత్తు తరం ఏమవుతుందోనన్న ఆలోచనే ఓ వినూత్న కార్యక్రమానికి పురుడు పోసింది. ఒకప్పటి విష రహిత దేశీ విత్తనాలను కాపాడుకుంటూ ముందు తరాలకు అందించాలన్న లక్ష్యంతో నిర్మల్ జిల్లాలో డీఆర్డీఓ విజయలక్ష్మి తమ కలెక్టర్ అభిలాష అభినవ్ సహకారంతో సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించారు. గురువారం నిర్మల్ కలెక్టరేట్లో మహిళా అధికారులు, మహిళా రైతులు, మహిళా సంఘాల సభ్యులు అందరూ కలిసి కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు.వాక్ ఫర్ దేశీ సీడ్...‘మన విత్తనం – మన భవిష్యత్తు‘ అన్న ట్యాగ్ లైన్తో ‘వాక్ ఫర్ దేశీ సీడ్‘ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పురాతన దేశీ విత్తనాలను సేకరించి, వాటిని భవిష్యత్ తరాలకు అందించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం జిల్లా అధికారులు పశ్చిమ బెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలలో ఇప్పటికీ సాగులో ఉన్న దేశీ విత్తనాలను సేకరించారు. వరి, పప్పు దినుసులతో పాటు కూరగాయలలోనూ అందుబాటులో ఉన్న దేశీ సీడ్ రకాలను తెప్పించారు. బహురూపి వంటి అరుదైన రకాలను సేకరించారు. జిల్లాలో ఆరువేల మంది సభ్యులుగా ఉన్న ‘మహిళా రైతు ఉత్పత్తిదారుల సంస్థ‘లో ఆధ్వర్యంలో వీటిని సాగు చేయించడం మరో ప్రత్యేకత. ముందుగా 20ఎకరాలలో 200 మంది మహిళ రైతులతో దేశీ విత్తనాలతో సాగు చేయించాలని నిర్ణయించారు. ఇలా సాగుచేసిన పంటలను సైతం తిరిగి మహిళా రైతు ఉత్పత్తిదారుల సంస్థ కొనుగోలు చేస్తాయి. పెరటి తోటల పెంపకంపై ఆసక్తి గల వారికి సైతం దేశీ విత్తనాలు అందిస్తామని చెబుతున్నారు.మిట్టి దీదీ...ఎంతటి విత్తనమైనా మట్టి బాగుంటేనే బతికి బట్ట కడుతుంది. అందుకే ఈ మహిళా అధికారులు కేవలం దేశీ విత్తనాలనే కాకుండా.. మట్టిని సైతం పరీక్షించిన తర్వాతే సాగు చేయాలన్న మరో లక్ష్యాన్ని ముందుకు తీసుకొచ్చారు. ‘భూసార పరీక్ష – నేలతల్లికి రక్ష‘ ట్యాగ్ లైన్ తో ‘మిట్టి దీదీ‘ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఇందులో ఏఐ టెక్నాలజీ కలిగిన ఫార్మోసిస్ యంత్రంతో భూసార పరీక్షలను చేసి అప్పటికప్పుడే అక్కడ ఎలాంటి పంటలు పండిస్తే బాగుంటాయో చెప్పేస్తారు. ఇలా భూసార పరీక్షలు చేయడం కూడా మహిళ రైతు ఉత్పత్తిదారుల సంఘాలే చేయనుండటం విశేషం.– రాసం శ్రీధర్, సాక్షి, నిర్మల్దేశీ విత్తనాలు కాపాడుకోవాలని...ప్రస్తుత పరిస్థితులలో ఆర్గానిక్ ఆహారం పైన చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. కానీ అధిక ధరలు ఉండటంతో ΄ాటు తక్కువ మొత్తంలో లభ్యమవుతుండటం ఇబ్బందిగా మారుతోంది. ఈ క్రమంలో మహిళా రైతులను ్ర΄ోత్సహించడంతో΄ాటు మనవైన దేశీ విత్తనాలను ముందు తరాలకు అందించాలన్న ఉద్దేశంతో కలెక్టర్ అభిలాష అభినవ్ గారి సహకారంతో ఈ కార్యక్రమాలను చేపడుతున్నాం. – విజయలక్ష్మి, డీఆర్డీఓ, నిర్మల్ -
చేజారుతున్న విత్తన స్వాతంత్య్రం
వ్యవసాయంలో విత్తనాల సమస్య రోజు రోజుకూ తీవ్రమవుతున్నది. హరిత విప్లవం పేరిట మొదలుపెట్టిన పరిణామం విత్తనాలతోనే మొదలైంది. అధిక దిగుబడి వంగడాల హామీతో ఇది మొదలై, క్రమంగా రైతులను విత్తనాలకు దూరం చేసింది. 1960వ దశకంలో మొదలు పెట్టిన ఈ మార్పు 2025 నాటికి తీవ్రరూపం దాల్చింది. ఆహార నాణ్యత దిగజారడానికి విత్తనాలలో వచ్చిన మార్పులే కారణం. దేశీ విత్తనాలను తులనాడి, భారత వ్యవసాయాన్ని హీనపరిచి తెచ్చిన హరిత అధిక దిగుబడి వంగడాలు క్రమంగా రైతుల విత్తన స్వావలంబనను హరించాయి. రసాయనాల దిగుబడివిదేశీయుల ప్రోత్సాహంతో ప్రవేశపెట్టిన వంగడాలు అధిక దిగుబడి ఇవ్వడానికి ప్రధాన కారణం రసాయన ఎరువులు. రసా యన ఎరువులు ఉపయోగించని పరిస్థితులలో ఈ వంగడాలు ఉప యోగపడలేదు, ఉపయోగపడవు. ఆ విధంగా మొదలుపెట్టిన రసా యన ఎరువుల వాడకం ఇప్పుడు విధిగా, అత్యధికంగా ఉపయోగించాల్సిన పరిస్థితికి వచ్చింది. ఒకప్పుడు ఎకరాకు ఒకటో రెండో ఎరువుల బస్తాల వాడకం నుంచి ఇప్పుడు 15 బస్తాలు వాడే దుఃస్థితికి రైతు చేరుకున్నాడు. పరిశోధన చేసి ప్రవేశపెట్టిన హైబ్రిడ్ లేదా అధిక దిగుబడి వంగడాలు, ఎరువులు, కీటకనాశక రసాయనాల ఉపయో గాన్ని కూడా పెంచాయి. ఈ రకం విత్తనాలు మొదట్లో అధిక దిగుబడి చూపినా క్రమంగా ఉత్పాదకత తగ్గింది. దిగుబడి పెరిగి తగ్గుతోందని గుర్తించి ఒక కొత్త వాదన ప్రవేశపెట్టారు శాస్త్రవేత్తలు. విత్తనాలు ఎప్పటికప్పుడు మార్చాలి. మార్చితేనే దిగుబడి! ఏ ఆధునిక విత్తనంలోనూ నూరు శాతం అంకురోత్పత్తి ఉండదు. దాంతో మభ్యపెట్టే సిఫారసు మొదలైంది. ఎకరాకు ఎన్ని గింజలు వెయ్యాలి? సాధారణంగా ఒక్కో పంటకు ఒక్క కొలమానం ఉంటుంది. ఆధునిక విత్తనాల్లో అంకురోత్పత్తి వంద శాతం ఎప్పుడూ ఉండదు కనుక ఈ కొలమానంలో మార్పులు తెచ్చి ఎకరాకు ఎక్కువ విత్తనాలు వాడే విధంగా సిఫారసు చేయడం మొదలు పెట్టారు. వరి పంటకు కొందరు రైతులు ఎకరాకు 18 నుంచి 20 కిలోలు వాడుతుంటే, పరిజ్ఞానం ఉన్న రైతులు కేవలం 250 గ్రాముల దేశీ వరి విత్తనాలు వాడుతున్నారు. ఎంత తేడా! మిర్చి, పత్తి, వరి, గోధుమ, టమాట వంటి పంటలలో నాసి రకం విత్తనాల వల్ల లాభపడు తున్నది ప్రైవేటు కంపెనీలు, నష్టపోతున్నది రైతులు. పోయిన జ్ఞానం, నమ్మకంఆధునిక విత్తనాల వల్ల సాగు ఖర్చు పెరిగింది. ఒకప్పుడు రైతు తన విత్తనాలు దాచుకుని వాడే రోజులలో విత్తనాల మీద సున్నా ఖర్చు ఉండేది. రైతుకు తన విత్తనాల మీద పరిజ్ఞానం ఉండేది. వేరే రైతు దగ్గర తెచ్చుకున్నా నమ్మకం ఉండేది. రైతు తన విత్తనాలు కోల్పోయి ఆధునిక విత్తనాలకు అలవాటు పడ్డ తరువాత విత్తనాల మీద జ్ఞానం, నమ్మకం పోయినాయి. ఆధునిక విత్తనాలకు చీడ పీడ బెడద పెరిగింది. దానికి పరిష్కారంగా కీటక నాశనిల వాడకం పెరి గింది. వాటి వల్ల ఖర్చు పెరిగింది. ప్రమాదకరమైన రసాయనాలు కాబట్టి వాటిని వాడే క్రమంలో రైతు ఆరోగ్యం ప్రమాదంలో పడింది. ఫలితంగా వలసలు, ఆత్మహత్యలు. వ్యవసాయ కూలీ కుటుంబా లతో మొదలైన వలసలు రైతులను కూడా తాకాయి. ఇంకొక వైపు ఎరువులు, విత్తనాలు, వ్యవసాయం మీద సలహాలు ఇచ్చే కంపెనీలు పెరిగాయి. వాటి వార్షికాదాయం యేటా పెరుగుతున్నది.బహుశా నార్మన్ బోర్లాగ్ కూడా ఈ పరిణామం ఊహించి ఉండక పోవచ్చు. బోర్లాగ్ ప్రవేశపెట్టిన ‘అధిక దిగుబడినిచ్చే’ విత్తనా లకు ఖరీదైన ఎరువులే కాక, ఎక్కువ నీరూ అవసరం. వ్యవసాయ ఉత్పత్తిలో అద్భుతాలు లేవు అని చెప్పిన ఈ వ్యక్తి, ప్రపంచానికి ఆహార భద్రత సాధించాలని మొదలు పెట్టిన ‘ఆధునిక విత్తనాల’ వ్యవసాయం జీవ వైవిధ్యాన్ని, జీవనోపాధులను నాశనం చేస్తున్న విషయం పట్ల స్పందించలేదు. ‘అధిక వంగడాల’ వల్ల దిగుబడి పెరుగుతుందనే ఏకైక సూత్రం మీద పని చేసిన ఆ మహానుభావుడు తద్వారా నిర్మాణమైన ‘దోపిడీ’ వ్యవస్థ గురించి ఆలోచించలేదు.పెద్ద కంపెనీల గుప్పిట్లో...ఇప్పుడు ‘ఆధునిక విత్తనాలు’ రైతుల చేతులలో లేవు. విత్తన, పెస్టిసైడ్ కంపెనీల గుప్పిట్లో ఉన్నాయి. ‘మేధో హక్కుల సంపత్తి’ పేరిట రక్షణ పొంది విత్తన మార్కెట్లను సురక్షితం చేసుకున్నాయి. ఎప్పటికప్పుడు దిగుబడులు తగ్గిపోతున్న నేపథ్యంలో యేటా కొత్త ‘విత్తనాలు’ మార్కెట్లో ప్రవేశపెట్టి అటు ప్రభుత్వాలనూ, ఇటు రైతులనూ మభ్యపెడుతూ తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. మన దేశంలో విత్తనాలు, ప్రకృతి వనరుల మీద మేధో సంపత్తి హక్కులు పొందే అవకాశం లేదు కనుక ఇతర మార్గాలలో తమ వ్యాపారాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు. పెద్ద కంపెనీలు సిండికేట్ అయ్యి చిన్న కంపెనీలను గుప్పిట్లో పెట్టుకుంటున్నాయి. మార్కెట్ ఒప్పందాలు చేసుకుని దేశీ, చిన్న కంపెనీలకు ‘బంధనాలు’ వేశారు. ప్రభుత్వం ఏదన్నా ‘చర్య’ చేపడితే కోర్టుకు వెళతారు. విత్తన కంపెనీలు కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల మీద వేసిన కేసులు కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి.రైతులలో విత్తనాల విజ్ఞానం కొండలా పెరగాల్సిందిపోయి, ప్రైవేటు గుత్తాధిపత్యం వల్ల వారికి అందడం లేదు. రానురాను విత్తన విజ్ఞానాన్ని రహస్యంగా మార్చుతున్నాయి విత్తన కంపెనీలు. ఇక్రి సాట్, ఇర్రి వంటి అంతర్జాతీయ సంస్థలు విత్తన పరిశోధనల సాకుతో భారతీయ జన్యు సంపద తీసుకుని, క్రమంగా ప్రైవేటు పెట్టుబడి దారులకు అందజేస్తున్నాయి. 1966 తరువాత నిర్మాణమైన ప్రభుత్వ విత్తన వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. ఇప్పుడు ఉన్న సంస్థలు, కమి టీల పరిశోధనలు ఉత్సవ పాత్రకే పరిమితమై, పరోక్షంగా ప్రైవేటు కంపెనీల ప్రయోజనాలను కాపాడుతున్నాయి. ప్రభుత్వ రంగంలో ఏదో జరుగుతున్న భ్రమ కల్పించటానికి ఉపయోగపడుతున్నాయి.వ్యాపార సరళీకరణ లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యానికి, దేశాభివృద్ధికి మూలమైన విత్తన రంగాన్ని ప్రైవేటుపరం చేస్తూ, ఉన్న ఒకే ఒక చట్టాన్ని అమలు చేయడం లేదు. 1966లో ప్రభుత్వం రంగంలో చేసే విత్తనాల నాణ్యత, సరఫరా మీద శాస్త్రీయ నియంత్రణకు తెచ్చిన విత్తన చట్టం ప్రైవేటు విత్తనాలకు వర్తింప జేయడానికి సిద్ధంగా లేదు. 2004లో ఒక కొత్త చట్టం తెచ్చే ప్రయత్నం ప్రైవేటు విత్తన కంపెనీల వ్యాపార వెసులుబాటును సరళీకృతం చేయడానికే అని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో 20 యేళ్ల తరువాత కూడా అది రూపుదాల్చలేదు. ఇప్పటి వరకు ప్రతిపాదించిన 4, 5 ముసాయిదాలు రైతుల ప్రయోజనాలు కాపాడటానికీ, భారత దేశంలో ఉన్న అపర విత్తన సంపద స్వచ్ఛతను పరిరక్షణకూ ఉద్దేశించినవి కావు. రైతులు, కంపెనీల ప్రయోజనాల మధ్య కంపెనీల పక్షం వహిస్తున్న కేంద్రం కొత్త చట్టం తేవడానికి భయపడుతున్నది. విత్తనాల మీద స్వావలంబన అత్యంత మౌలికమైన అవసరం. రైతులకు విత్తన స్వాతంత్య్రం కోసం రాష్ట్రాలు చట్టాలు తేవాలి. రైతుల పరిజ్ఞానం పెంచే విధంగా విత్తన వ్యవస్థను నిర్మించాలి. విత్తన జన్యుసంపదను కలుషితం కాకుండా కాపాడాలి. పర్యావరణానికి, జన్యుసంపదకు హాని చేసే విత్తనాలను ప్రవేశపెట్టే కంపెనీలు,సంబంధిత వ్యక్తుల మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలి. గ్రామీణ స్థాయి నుంచి విత్తనాలను రైతులు స్వేచ్ఛగా ఇచ్చి పుచ్చుకునే పద్ధతులను ప్రోత్సహించాలి.డా‘‘ దొంతి నరసింహా రెడ్డి వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు -
విత్తనాలకు రెక్కలొచ్చాయ్!
సూళ్లూరుపేట: అంతరిక్షంలో వ్యోమనౌకల అనుసంధానం కోసం ఉద్దేశించిన ప్రయోగంతోపాటు అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన మాడ్యూల్లో ఇస్రో చేపట్టిన ప్రయోగం మలి దశలోనూ విజయవంతమైంది. సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో విత్తనాలు మొలకెత్తగలవా? మొలకెత్తితే పూర్తిస్థాయిలో ఆకుల స్థాయిని సంతరించుకోగలవా? అని తెల్సుకోవడంతోపాటు ఆక్సిజన్, కార్భన్ డయాక్సైడ్ స్థాయిలను కొలిచేందుకు ఈ ప్రయోగం చేపట్టిన విషయంతెల్సిందే. స్పేస్ డాకింగ్ ఎక్స్పరిమెంట్(స్పేడెక్స్) కోసం నింగిలోకి పంపిన జంట ఉపగ్రహాలతోపాటు కంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ (క్రాప్స్)పేరిట ఇస్రో ఓ పేలోడ్ను అంతరిక్షంలోకి పంపిన విషయం తెల్సిందే. ఇందులో ఎనిమిది అలసంద విత్తనాలను ఉంచగా అవి ఇటీవల మొలకెత్తాయి. మొలకెత్తిన విత్తనాలు తాజాగా ఆకులను సంతరించుకోవడంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆకులు వచ్చిన సమయంలో మాడ్యూల్లో ఆర్ర్థత, ఉష్ణోగ్రత, మట్టిలో తేమ తదితరాలను అందులో అమర్చిన కెమెరా, ఇతర ఉపకరణాలతో కొలిచామని ఇస్రో సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అంతరిక్షంలో మొక్కల పెంపకానికి సంబంధించిన పరిశోధనలకు ఈ ప్రయోగం ఎంతో దోహదపడిందని వెల్లడించింది. భవిష్యత్తులో అంతరిక్షంలో గడిపే వ్యోమగాముల ఆహార అవసరాలు తీర్చే చెట్ల పెంపకం, ఆ చెట్లు సూక్ష్మ గురత్వాకర్షణ స్థితిలోనూ ఏ మేరకు ఆకులు, ఫలాలను అందివ్వగలవు, ఎంత మేరకు నీరు అవసరం తదతర అంశాలపై శోధనకూ తాజా ప్రయోగం సాయపడిందని ఇస్రో పేర్కొంది. -
అంతరిక్షంలో జీవం ‘పురుడు’ పోసుకుంది!
న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా అంతరిక్షంలో అద్భుతాలతో ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్న ఇస్రో మరో ఘనత సాధించింది. అంతరిక్షంలో జీవసృష్టి చేసి చూపించింది. స్పేడెక్స్ మిషన్లో భాగంగా పీఎస్ఎల్వీ–సి60 ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ (పోయెమ్–4) ద్వారా డిసెంబర్ 30న అంతరిక్షంలోకి పంపిన అలసంద విత్తనాలు కేవలం 4 రోజుల్లోనే మొలకెత్తాయి! కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటాల్ ప్లాంట్ స్టడీస్ (సీఆర్ఓపీఎస్) టెక్నాలజీ ద్వారా ఈ ప్రయోగాన్ని ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితుల్లో విత్తనాల అంకుర, మనుగడ ప్రక్రియను అధ్యయనానికి ఉద్దేశించిన ఆటోమేటెడ్ వ్యవస్థ అయిన సీఆర్ఓపీఎస్ పేలోడ్ను విక్రం సారాబాయ్ అంతరిక్ష కేంద్రం అభివృద్ధి చేసింది. ఇందులో భాగంగా ఎనిమిది అలసంద విత్తనాలను నియంత్రిత వాతావరణంతో కూడిన బాక్సులో ఉంచారు. వాటికి నిరంతరం కచ్చితత్వంతో కూడిన వెలుతురు అందేలా జాగ్రత్త తీసుకున్నారు. విత్తనాల్లో జరుగుతున్న మార్పుచేర్పులను అత్యంత హై రిజల్యూషన్తో కూడిన కెమెరా ఇమేజింగ్, ఉష్ణోగ్రత, సీఓటూ సాంద్రత, ఆర్ద్రత వంటివాటి తనిఖీ తదితరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చారు. నాలుగు రోజుల్లోనే విత్తనాలు మొలకెత్తడంతో సైంటిస్టులు ఆనందోత్సాహాల్లో తేలిపోతున్నారు. ‘‘అంతరిక్షంలో జీవం పురుడు పోసుకుంది. ప్రయోగం విజయవంతమైంది. విత్తనాలు విజయవంతంగా మొలకెత్తాయి’’ అంటూ ఇస్రో హర్షం వెలిబుచి్చంది. ‘‘త్వరలో వాటికి ఆకులు కూడా రానున్నాయి. అంతరిక్ష అన్వేషణ యాత్రలో అదో కీలక మైలురాయిగా నిలవనుంది’’అంటూ ఎక్స్లో పోస్ట్ చేసింది.స్పేడెక్స్ నుంచి పుడమి ఫొటోలు స్పేడెక్స్ జంట ఉపగ్రహాల్లో ఒకటైన చేజర్ భూమిని తొలిసారి ఫొటోలు, వీడియోలు తీసింది. దాన్ని ఇస్రో శనివారం విడుదల చేసింది. చేజర్ 470 కి.మీ. ఎత్తున దిగువ కక్ష్యలో పరిభ్రమిస్తూ తీసిన ఈ వీడియోలో భూమి అత్యంత అందంగా కని్పస్తోంది. ఉపగ్రహం తాలూకు అత్యంత అధునాతనమైన ఇమేజింగ్ సామర్థ్యంతో పాటు అత్యంత కీలకమైన తదుపరి దశ పరీక్షలకు దాని సన్నద్ధతకు ఈ వీడియో నిదర్శనమని ఇస్రో ఒక ప్రకటనలో పేర్కొంది. త్వరలో కీలక డాకింగ్ (ఉపగ్రహాల అనుసంధాన) పరీక్షకు చేజర్, టార్గెట్ శాటిలైట్లు సన్నద్ధమవుతున్నాయి. వీలైతే దాన్ని జనవరి 7న నిర్వహిస్తామని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ ప్రకటించడం తెలిసిందే. ఈ పరీక్ష విజయవంతమైతే డాకింగ్ పరిజ్ఞానమున్న అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ సగర్వంగా చేరుతుంది. గగన్యాన్ మొదలుకుని పలు భావి అంతరిక్ష పరీక్షలకు డాకింగ్ పరిజ్ఞానం కీలకం కానుంది. -
Telangana: ఇక రైతుల వద్దకే నేరుగా విత్తనాలు
సాక్షి, హైదరాబాద్: రైతులకు అవసరమైన విత్తనాలను నేరుగా సరఫరా చేసేందుకు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ (టీజీఎస్డీసీ) సిద్ధమైంది. ప్రైవేట్ కంపెనీలు, దళారుల మాయమాటలకు రైతులు మోసపోకుండా ఉండేందుకు ప్రస్తుత యాసంగి సీజన్ నుంచే కార్యాచరణ ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పీఏసీఎస్, ఆదర్శ రైతు సేవాకేంద్రాలు(ఏఆర్ఎస్కేస్), డీసీఎంలతోపాటు హైదరాబాద్ మినహా 9 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఉన్న టీజీఎస్డీసీ విక్రయ కేంద్రాల ద్వారా రైతులకు విత్తనాలు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ సీజన్ నుంచి గ్రామాల్లోని రైతులు 2 టన్నులకు మించి విత్తనాలు ఆర్డర్ చేస్తే నేరుగా వారి వద్దకే సరఫరా చేయాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఖరీఫ్ నాటికి కనీసం 15 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణానికి అవసరమయ్యే 7 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందించాలని విత్తనాభివృద్ధి సంస్థ లక్ష్యంగా పెట్టుకొంది. ఈ యాసంగి సీజన్లో ప్రస్తుత యాసంగి సీజన్కు సంబంధించి 40 వేల క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరమవుతాయని టీజీఎస్డీసీ భావిస్తోంది. ఇందుకోసం సంస్థ ఇప్పటికే 30 వేల క్వింటాళ్ల విత్తనాలను రాష్ట్రంలోని అన్ని మండలాలకు పంపించింది. ⇒ ఇందులో సన్నరకం విత్తనాలైన తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్– 15048), కేఎన్ఎం 1638, జేజీఎల్ 27356 అందుబాటులో ఉంచారు. ⇒ ఇక దొడ్డు రకాలైన ఎంటీయూ–1010, జేజీఎల్– 24423, కేఎన్ఎం–118, ఆర్ఎన్ఆర్–29,325 రకాలను అందుబాటులో ఉంచింది. రైతు వద్దకే విత్తనాలు, సంస్థ కౌంటర్లలో 6 శాతం డిస్కౌంట్ ఈ సీజన్ నుంచే ప్రారంభిస్తున్నట్టు చైర్మన్ అన్వేష్రెడ్డి చెప్పారు. వరి విత్తనాలతోపాటు శనగ, వేరుశనగ, పెసర మొదలైన విత్తనాలను కూడా సంస్థ అందుబాటులో ఉంచింది. రైతుల అవగాహన కోసం సమావేశాలు విత్తనాల పట్ల రైతుల్లో ఉన్న సందేహాల ను తొలగించడం, ప్రైవేట్ కంపెనీల దందాకు అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా విత్తనా భివృద్ధి సంస్థ అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా చైర్మన్ అన్వే‹Ùరెడ్డి సహకార సంఘాల చైర్పర్సన్లు, సీఈఓలతో ఆదిలాబాద్, జగిత్యా ల, మెదక్ జిల్లాల్లో సమన్వయ సమావేశాలు నిర్వహించారు. మిగతా జిల్లాల్లో కూడా ఈ సమావేశాలు నిర్వహించి రైతులను చైతన్యపరచాలని నిర్ణయించారు. -
ట్రెండ్ మారింది.. ఫుడ్ మారాలి
ఫ్యాషన్ ట్రెండ్స్లాగానే ఆహారంలో కూడా కొంతకాలం పాటు ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. ప్రతి సందర్భంలోనూ ఆ ట్రెండ్ ఎవరికి మంచిది, ఎవరికి హానికరం అనే వివరాలను తన బ్లాగ్లో రాస్తూ సమాజాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు బెంగళూరుకు చెందిన న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి. హెల్త్ ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న షీలా కృష్ణస్వామి ఈ వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యసంరక్షణ గురించి ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.న్యూట్రిషన్, వెల్నెస్ రంగంలో నలభై ఏళ్ల అనుభవం ఉన్న షీలా కృష్ణస్వామి రోజూ 30 గ్రాముల నట్స్, సీడ్స్ తీసుకోవాలని చెప్పారు. ముప్ఫై గ్రాములంటే ఎన్ని అని తూకం వేసుకోవాల్సిన అవసరం లేదు, ఓ గుప్పెడు చాలు. రోజూ గ్లాసు నీరు, గుప్పెడు బాదం పప్పులతో తన రోజు మొదలవుతుందన్నారు. ఉదయం ఇలాంటి శక్తినిచ్చే సహజాహారం తీసుకుంటే రోజంతా నీరసం రాదు. విటమిన్లు, ప్రొటీన్లతో కూడిన ఆహారం కోసం మన డైట్లో పప్పులు, ధాన్యాలు, పీచు, పాలు, పండ్లను తీసుకుంటున్నాం. బాదం, గుమ్మడి విత్తనాలను కూడా తప్పనిసరిగా చేర్చుకోవాలి. సమయానికి భోజనం చేయడం కుదరనప్పుడు కూడా బాదం తింటే దేహానికి దాదాపుగా సంపూర్ణ ఆహారం అందినట్లే. జంక్ బదులు గింజలు! వందేళ్ల కిందట ఇప్పుడున్న అనారోగ్యాలు లేవు. గడచిన తరాలు ఆహారం విషయంలో ఇంత ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదు. ఏం తినాలనిపిస్తే అది తిన్నారు. ఏం పండితే వాటినే తిన్నారు. ఊబకాయం, గుండె వ్యాధులు, డయాబెటిస్ వంటి అనారోగ్యాల్లేవు. అందుకు కారణం వారికి ఆహారం ద్వారా అందిన శక్తిని కరిగించేటంతటి వ్యాయామం ఉండేది. తగినంత వ్యాయామం ఉండడంతో మంచి నిద్ర ఉండేది. ఈ రెండింటి వల్ల దేహక్రియలు చక్కగా జరిగేవి. గట్ హెల్త్ అంటే అదే. ఆ గట్ హెల్త్ కోసం ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి వస్తోంది. ‘బెంగళూరులో నా కళ్లారా చూస్తుంటాను. ఉద్యోగం నుంచి ఇంటికి వెళ్లడానికి పదుల కిలోమీటర్లు ప్రయాణిస్తుంటారు. ఇంటికి వెళ్లేలోపు ఆకలి వేస్తుంటుంది. కారులో వెళ్తూ చిప్స్, ఫ్రెంచ్ ఫ్రై, సమోసాలు, బేకరీ ఫుడ్ వంటి జంక్ తింటూ ఉంటారు. నేనేం చె΄్తానంటే జంక్ స్థానంలో సహజ ఆహారాన్ని తీసుకోండి. ఆఫీసుకెళ్లేటప్పుడు పండ్లను బ్యాగ్లో తీసుకెళ్లడం కొన్నిసార్లు సాధ్యంకాకపోవచ్చు. బాదం వంటి నట్స్ ఒక చిన్న బాక్సులో పెట్టుకుంటే మధ్యలో ఆకలి అనిపించినప్పుడు పది గింజలు తింటే చాలు’ అన్నారు షీలా కృష్ణస్వామి. అరవై నాలుగేళ్ల వయసులో ఇంత చురుగ్గా ఉండడానికి సరైన ఆహారమే కారణమన్నారు. ‘అందంగా ఉండడానికి రహస్యం ఏమీ లేదు, ఆరోగ్యంగా ఉండడమే’నని నవ్వారామె. ఎలాగైనా తినండి!పరిపూర్ణ ఆరోగ్యానికి, దీర్ఘకాలం యవ్వనంగా ఉండడానికి దోహదం చేసే బాదం పప్పులను ఇలాగే తినాలనే నియమం ఏదీ అవసరం లేదు. పచ్చిగా లేదా నానబెట్టి తినవచ్చు. డ్రై రోస్ట్, నానిన వాటిని వేయించి,పోపు పెట్టి చాట్ మసాలా చల్లి తినవచ్చు. బాదం పప్పులను రాత్రి నానబెట్టి ఉదయం తినేటప్పుడు పొట్టు వలిచేస్తుంటారు. కానీ పొట్టు తీయాల్సిన అవసరం లేదు. ఆ ఫైబర్ కూడా దేహానికి అవసరమే. వృద్ధులకు పొట్టుతోపాటు తినడం ఇబ్బందవుతుంది. పొట్టు తీసి తినాల్సింది దంతాలు సరిగా లేని వాళ్లు మాత్రమే. – షీలా కృష్ణస్వామి, న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్, బెంగళూరు – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటో : టి.దయాకర్ -
సీడ్ ల్యాబ్పై శీతకన్ను
సాక్షి, మచిలీపట్నం: రైతులకు దిగుబడి బాగా రావాలంటే.. విత్తనం బాగుండాలి. కల్తీలేని విత్తనాలు అందిస్తేనే.. మొక్క బాగా పెరుగుతుంది. చీడపీడలు, వాతావరణ మార్పులను తట్టుకొని నిలుస్తుంది. అప్పుడే పంట దిగుబడి అధికంగా వస్తుంది. ఈ ఆలోచనతోనే రైతులకు మేలు చేసేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి విత్తన పరిశోధన కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. కృష్ణా జిల్లా గన్నవరంలో రూ.45.80 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టి.. 70 శాతం పనులు కూడా పూర్తి చేసింది. ఆ తర్వాత ఎన్నికల కోడ్ రావడం.. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఇది అందుబాటులోకి వస్తే.. నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేసే అవకాశమున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. వారణాసి తరహాలో.. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న జాతీయ విత్తన పరిశోధన, శిక్షణ కేంద్రం తరహాలో రాష్ట్ర స్థాయి విత్తన పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసేందుకు గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ సంకల్పించారు. రాష్ట్రంలో విత్తన పరిశోధన, శిక్షణ మరింత శాస్త్రీయంగా, పటిష్టంగా చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలో డాక్టర్ వైఎస్సార్ విత్తన పరిశోధన, శిక్షణ కేంద్రం పేరుతో నిర్మించేందుకు 2023 మార్చి 24న శంకుస్థాపన చేశారు. రూ.45.80 కోట్లతో 8 ఎకరాల్లో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా పరిపాలన, శిక్షణ కేంద్రంతో పాటు వసతి, సిబ్బంది నివాసాలు, టెస్ట్ ఫామ్, విత్తన పరీక్ష ప్రయోగశాల, గ్రీన్ హౌస్, సీడ్ ప్రాసెసింగ్ యూనిట్, గోడౌన్, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు తదితరాలు నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. 70 శాతం పనులు కూడా పూర్తయ్యాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో పనులు నిలిచిపోయాయని అధికారులు చెబుతున్నారు. పూర్తయితే ప్రయోజనాలెన్నో.. » రాష్ట్ర స్థాయిలో సంబంధించిన అన్ని విత్తన ఏజెన్సీలు, సంస్థలకు ఉమ్మడి వేదిక అవుతుంది. » విత్తన ప్రయోగశాలలు, అగ్రి ల్యాబ్లలో పనిచేస్తున్న సిబ్బందికి అధునాతన శిక్షణ లభిస్తుంది. » వ్యవసాయ పట్టభద్రులు, డిప్లొమా చేసిన వారికి మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభించేలా శిక్షణ ఇస్తారు. » సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రపంచంలోని అత్యున్నత సంస్థలతో సమన్వయం చేసుకోవచ్చు. » జీన్ బ్యాంకు ఏర్పాటు వల్ల అన్ని పంటల సంరక్షణకు కృషి చేయొచ్చు. కొత్త, అధిక దిగుబడినిచ్చే, వాతావరణ మార్పులను తట్టుకోగల విత్తన రకాల అభివృద్ధి సాధ్యపడుతుంది.అలా వదిలేయడం సరికాదు.. వ్యవసాయ ఆధారిత రాష్ట్రం మనది. రైతులకు అన్ని విధాలా మేలు చేకూర్చే విత్తన పరిశోధన, శిక్షణ కేంద్రం ఏర్పాటు చాలా అవసరం. నకిలీ విత్తనాలను నివారించొచ్చు. కొత్తరకం వంగడాలు, వాతావరణ మార్పులను తట్టుకునే విత్తనాలు సమకూరుతాయి. గత ప్రభుత్వం మొదలుపెట్టిందని.. ఈ ప్రభుత్వం వదిలేయడం సరికాదు. రాజకీయ పార్టీలకు అతీతంగా తగిన నిధులు సమకూర్చి రాష్ట్ర స్థాయి విత్తన పరిశోధన కేంద్రం నిర్మాణ పనులు పూర్తి చేయాలి. – కె.ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం -
రబీ సాగు లక్ష్యం 57.65 లక్షల ఎకరాలు
సాక్షి, అమరావతి: ఖరీఫ్ కలిసి రాలేదు. వరుస వైపరీత్యాలకు తోడు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఖరీఫ్లో రైతులు దెబ్బ తిన్నారు. అతి కష్టం మీద లక్ష్యానికంటే తక్కువగా 69.70 లక్షల ఎకరాల్లో సాగు చేసినా, పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు ముందస్తుగా రబీ సాగుకు సన్నద్ధమయ్యారు. ఆ మేరకు రబీ 2024–25 ప్రణాళికను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. రబీ సాధారణ విస్తీర్ణం 56.58 లక్షల ఎకరాలు. ఈ ఏడాది సాగు లక్ష్యం 57.65 లక్షల ఎకరాలుగా నిర్దేశించారు. 19.87 లక్షల ఎకరాల్లో వరి, 11.17 లక్షల ఎకరాల్లో శనగ, 8.44 లక్షల ఎకరాల్లో మినుము, 5.23 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 2.74 లక్షల ఎకరాల్లో జొన్న, 2.51 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 2.46లక్షల ఎకరాల్లో పెసలు, 1.77లక్షల ఎకరాల్లో పొగాకు పంటలు సాగు చేయనున్నారు. కాగా ఈ ఏడాది 94.69 లక్షల టన్నుల దిగుబడులు లక్ష్యంగా వ్యవసాయ శాఖ నిర్దేశించింది. రబీకి 3.85 లక్షల క్వింటాళ్ల విత్తనం రబీ కోసం 8.88 లక్షల క్వింటాళ్ల విత్తనం అవసరం. రూ.94.96 కోట్ల సబ్సిడీతో 3.85 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. సీజన్లో 2.64 లక్షల క్వింటాళ్ల శనగ విత్తనం అవసరం కాగా, ఇప్పటివరకు 26 వేల క్వింటాళ్లను సిద్ధం చేశారు. వరి, ఇతర విత్తనాలను ఈ నెల 25వ తేదీ నుంచి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 50,076 క్వింటాళ్ల వరి, 45,647 క్వింటాళ్ల వేరుశనగ, 16,249 క్వింటాళ్ల మినుము విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఎరువుల సరఫరాలో ఆర్బీకేలకు కోత ఈ ఏడాది 20.05లక్షల టన్నుల ఎరువులు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే 6.95 లక్షల టన్నుల ఎరువులు ఉండగా, కేంద్రం నుంచి ఈ నెలలో 1.47 లక్షల టన్నులు వచ్చాయి. ప్రస్తుతం 8.42 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. గత నాలుగేళ్లుగా సబ్సిడీ విత్తనం, ఎరువుల పంపిణీలో రైతు భరోసా కేంద్రాలకు (ఆర్బీకేలకు) అధిక ప్రాధాన్యతనిచ్చారు. కానీ చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఆర్బీకేలకు ప్రాధాన్యత లేకుండా చేసింది. గడిచిన ఖరీఫ్లో అతికష్టమ్మీద 1.50 లక్షల టన్నుల ఎరువులను మాత్రమే ఆర్బీకేల ద్వారా సరఫరా చేశారు. రబీలో కూడా ఆర్బీకేలకు సరఫరాలో భారీగా కోత పెడుతున్నారు. రబీలో రూ.68వేల కోట్లు పంట రుణాలు ప్రస్తుత రబీలో రైతులకు లక్ష కోట్ల రుణ పరపతి కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించారు. దాంట్లో రూ.68,060 కోట్లు పంట రుణాలు, 32,390 కోట్లు టర్మ్ రుణాలు ఇవ్వనున్నారు. గతేడాది 3.60 లక్షల మంది కౌలుదారులకు రూ.4,100 కోట్లు ఇవ్వగా, ఈ ఏడాది కనీసం 5 లక్షల మందికి రూ.5 వేల కోట్లు రుణాలివ్వాలని నిర్ణయించారు. -
శనగ విత్తనం కోసం రైతుల ఎదురుచూపులు
సాక్షి, అమరావతి : వర్షాభావంతో పంటలు దెబ్బతిన్న రాయలసీమ జిల్లాల్లో రైతులు ముందస్తు రబీకి సిద్ధమైనా, ప్రభుత్వం నుంచి సహకారం లభించడంలేదు. ముందస్తు రబీలో అవసరమైన విత్తనాలు, ముఖ్యంగా శనగ విత్తనం కోసం రైతులు కళ్లల్లో వత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. గతేడాది ఈపాటికే విత్తనం సరఫరా అవగా రైతులు పంటలు వేసుకున్నారు. ఈ ఏడాది అవసరమైన విత్తనంలో పదో వంతు మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో రైతులు రైతు సేవా కేంద్రాల్లో రిజి్రస్టేషన్ చేయించుకొని, విత్తనం కోసం ప్రదక్షిణాలు చేస్తున్నారు.ఖరీఫ్లో రాయలసీమ జిల్లాల్లో 7 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 4 లక్షల ఎకరాల్లో పత్తి పంటలు సాగవలేదు. సాగైన ప్రాంతాల్లోనూ వర్షాల్లేక సగానికిపైగా ఎండిపోయాయి. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలులో ప్రభుత్వం విఫలమైంది. ఈ రబీ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 57.67 లక్షల ఎకరాల్లో పంటల సాగు లక్ష్యంగా నిర్దేశించారు. ప్రధానంగా 19.87 లక్షల ఎకరాల్లో వరి, 11.17 లక్షల ఎకరాల్లో శనగ, 8.45 లక్షల ఎకరాల్లో మినుము, 5.27 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 2.75 లక్షల ఎకరాల్లో జొన్నలు, 2.47 లక్షల ఎకరాల్లో పెసలు, 2.52 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటలు సాగు చేయనున్నారు.ఇందు కోసం రూ.94.96 కోట్ల సబ్సిడీతో 3.85 లక్షల టన్నుల విత్తనం అవసరమని అంచనా వేశారు. గతేడాది మాదిరిగానే విత్తన రాయితీలు ఇవ్వాలని కోరుతూ అధికారులు పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ముందస్తు రబీకి 17 జిల్లాల్లో 2.64 లక్షల క్వింటాళ్ల శనగ విత్తనం అవసరం కాగా, ఇప్పటివరకు 6 జిల్లాలకు 26 వేల క్వింటాళ్లే చేరాయి. గతేడాది ఈపాటికే పంపిణీ.. వాస్తవానికి అక్టోబర్ 1వ తేదీ నుంచి శనగ విత్తనం, 15వ తేదీ నుంచి మిగిలిన విత్తనాల పంపిణీ చేయాలి. గత ఏడాది ప్రణాళిక ప్రకారం పంటల సాగు సాఫీగా సాగిపోయింది. గతేడాది సెపె్టంబర్ మూడో వారం నుంచే రిజి్రస్టేషన్స్ చేపట్టగా, అక్టోబర్ 1 నుంచి తొలుత శనగ విత్తనం, 12వ తేదీ నుంచే మిగిలిన విత్తనాల పంపిణీ మొదలెట్టారు. ఈ ఏడాది ఆ పరిస్థితి కన్పించడం లేదు. సోమవారం నుంచి పంపిణీ మొదలు పెడతామని చెబుతున్నప్పటికీ, గ్రామాలకు విత్తనాలే చేరలేదు. గతేడాది వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు వేసుకోలేని ప్రాంతాల్లో 80 శాతం సబ్సిడీపై విత్తనం పంపిణీ చేశారు. కానీ ఈసారి ఆరి్థక భారం సాకుతో సబ్సిడీకి భారీగా కోత పెట్టే అవకాశాలున్నాయని చెబుతుండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. -
ఆరెంజ్ గింజలతో లాభాల గురించి తెలిస్తే, అస్సలు వదలరు!
ఆరోగ్యం కోసం నారింజ పండ్లను తింటాం. తొందరగా శక్తి రావాలంటే ఆరెంజ్ జ్యూస్ తాగుతాం. ఎందుకంటే ఇందులో సీ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఏ విటమిన్, మినరల్, ఫైబర్ కూడా లభిస్తాయి. అలాగే నారింజ్ తొక్కలను ఎండబెట్టి పొడి చేసుకొని సున్నిపిండిలో వాడతాం. హెర్బల్ టీలో కూడా వాడతామని మనకు తెలుసు. కానీ నారింజ గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు న్నాయని మీకు తెలుసా? తెలుసుకుందాం రండి!ఆరెంజ్ పండ్ల మాదిరిగానే, దాని గింజలు కూడా శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలం. ఇవి మన శరీరాన్ని హైడ్రేటెడ్, తాజాగా ఉంచుతాయి. మొత్తం ఆరోగ్యాన్ని ఇవి మేలు చేస్తాయి. ఆరెంజ్ గింజల్లో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. రోజుకు మనకు కావాల్సిన దాంట్లో 116.2శాతం వీటిల్లో లభిస్తాయట. విటమిన్ సీ ఎక్కువగా తీసుకోవడం వల్ల పెద్దప్రేగు కేన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గ్యాస్,అసిడిటీ, ఉబ్బరం వంటి సమస్యల నివారణలో ఉపయోగపడతాయి.ఎనర్జీ బూస్టర్ నారింజ గింజలలో పాల్మిటిక్, ఒలీక్, లినోలిక్ ఆమ్లాలు ఉండటం వల్ల మానవ కణాలలో ఎక్కువ కాలం శక్తిని నిల్వ ఉంచుతుంది. శరీరంలో శక్తి స్థాయిని వేగవంతం చేస్తాయి.గుండె ఆరోగ్యానికి మంచిది: ఆరెంజ్ గింజల్లో మోనోఅన్శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి.జుట్టు: ఆరెంజ్ గింజల నూనెను ఉపయోగించడం వల్ల జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ నూనెను జుట్టుకు కండీషనర్గాపనిచేస్తుంది. నారింజ గింజలలో విటమిన్ సి, బయో-ఫ్లేవనాయిడ్స్కు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఫలితంగా జుట్టు ఆరోగ్యంగా దృఢంగా ఉంటుంది. నారింజ గింజలలో ఉండే ఫోలిక్ యాసిడ్ జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. (నా బిడ్డ నూరేళ్ల కలల్ని చిదిమేశారు: టాప్ కంపెనీకి తల్లి కన్నీటి లేఖ)చర్మానికి మెరుపు: వీటిల్లో పుష్కలంగా లభించే విటమిన్ సీ చర్మానికి మేలు చేస్తుంది. సహజమైన మెరుపునిస్తుంది. అంతేకాదు ముడతలు, మచ్చలు తగ్గుతాయి. కంటి ఆరోగ్యం: వీటిల్లో కెరోటినాయిడ్స్, విటమిన్ ఎ కళ్లలోని శ్లేష్మ పొరలను ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వయస్సు-సంబంధిత కండరాల క్షీణతను నివారిస్తుంది. బీపీ నియంత్రణ: ఆరెంజ్ గింజల్లో విటమిన్ బి6 అధికంగా లభిస్తుంది. ఇది హిమోగ్లోబిన్ను పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా రక్తపోటును అదుపు చేయడంలో కీలక ప్రాత పోషిస్తుంది. (పని ఒత్తిడితో మహిళా ఉద్యోగి షాకింగ్ డెత్, స్పందించిన కేంద్రం)కేన్సర్: ఆరెంజ్ గింజలు ప్రతిరోజు తినడం వల్ల చర్మ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్తో పోరాడడంలో సహాయ పడతాయి. ఇంట్లో చెడువాసన పోవాలంటేనారింజ గింజల నీటిని, కేక్ ఐసింగ్కు వాడతారు. అంతేకాదు సిట్రస్ సువాసన కోసం బాత్టబ్కు దీని ఆయిల్ వాడవచ్చు. ఇంట్లో అసహ్యకరమైన వాసనను పోగొట్టేందుకు డిఫ్యూజర్ నూనెగా కూడా దీన్ని వినియోగించుకోవచ్చు.ఆరెంజ్ విత్తనాలను ఎలావాడాలి?చిరు చేదుగా ఉండే ఆరింజ గింజల నూనె, పొడి రూపంలో వాడుకోవచ్చు. ఇవి మార్కెట్లో లభిస్తాయి. -
రైతులకు త్వరగా చేరినప్పుడే కొత్త వంగడాల ప్రయోజనం!
వాతావరణ మార్పుల్ని ధీటుగా తట్టుకునే అధిక పోషకాలతో కూడిన 109 కొత్త వంగడాలను ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల విడుదల చేశారు. వీటిల్లోని 5 వంగడాలతో అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా సంస్థ (ఇక్రిశాట్)కు సంబంధం ఉంది. ఇక్రిశాట్లో పెరిగిన తల్లి మొక్కల (పేరెంట్ లైన్స్)ను తీసుకొని వివిధ యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థలు కొత్త వంగడాలను రూపొందించాయి. ఈ ఐదింటిలో మూడు కంది, జొన్న, సజ్జ వంగడాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు అనువైనవి. ఈ వంగడాల రూపకల్పనలో ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు డా. ప్రకాశ్, డా.గుప్తా, డా. ఇఫ్రీన్ ప్రధానపాత్ర పోషించారని ఇక్రిశాట్ ప్రధాన శాస్త్రవేత్త డా.పసుపులేటి జనీల ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. ఇంతకీ.. ఇప్పుడు విడుదలైన కొత్త విత్తనాలు రైతులకు ఎప్పటికి అందుతాయి? అని ప్రశ్నిస్తే.. ఆశ్చర్యకరమైన సమాధానం వచ్చింది. కొన్ని పంటల్లో 5 నుంచి 15 ఏళ్లు పడుతోందన్నారు. విత్తన వ్యవస్థలపై శ్రద్ధ కొరవడినందున కొత్త వంగడాలు గ్రామీణ రైతులకు సత్వరమే చేరటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 5 తెగుళ్లను తట్టుకునే సజ్జ హైబ్రిడ్సజ్జ పూసా 1801: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు అనువైన హైబ్రిడ్ ఇది. ఇక్రిశాట్తో కలసి న్యూఢిల్లీలోని ఐఎఆర్ఐ రూపొందించింది. సజ్జల కోసమే కాకుండా, పశుగ్రాసం కోసం కూడా సాగు చేయతగినది. 5 తెగుళ్లను తట్టుకోగలుగుతుంది. అగ్గి తెగులును, వెర్రి తెగులును పూర్తిగా.. తుప్పు తెగులు, స్మట్, ఆర్గాట్ తెగుళ్లను కొంతమేరకు తట్టుకుంటుంది. ఈ రకం సజ్జల్లో ఇనుము (70 పిపిఎం), జింక్ (57 పిపిఎం) ఎక్కువ. హెక్టారుకు 33 క్వింటాళ్ల సజ్జలు, ఎండు చొప్ప హెక్టారుకు 175 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ఇది ప్రకృతి సేద్యానికీ అనువుగా ఉంటుందని డా. జనీల తెలిపారు.కోతకొచ్చినా పచ్చగా ఉండే జొన్నజొన్న ఎస్పిహెచ్ 1943: తెలంగాణకు అనువైన(ఏపీకి కాదు) హైబ్రిడ్ ఇది. యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ ధర్వాడ్(కర్ణాటక) ఇక్రిశాట్తో కలసి అభివృద్ధి చేసింది. హెక్టారుకు 39 క్వింటాళ్ల జొన్నల దిగుబడినిచ్చే ఈ రకం ఖరీఫ్లో వర్షాధార సాగుకు అనుకూలం. గడ్డి దిగుబడి హెక్టారుకు 116 క్వింటాళ్లు. కోత దశలోనూ గడ్డి ఆకుపచ్చగానే ఉండటం (స్టే గ్రీన్) దీని ప్రత్యేకత. గింజ బూజును కొంత వరకు తట్టుకుంటుంది. తక్కువ నత్రజని ఎరువుతోనే 9% అధిక దిగుబడినిస్తుంది. ప్రకృతి సేద్యానికీ అనువైనదని డా. జనీల తెలిపారు. 5 నెలల కంది సూటి రకంకంది ఎన్ఎఎఎం–88: ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో వర్షాధారం/నీటిపారుదల కింద ఖరీఫ్కు అనువైన సూటి రకం. ఇక్రిశాట్తో కలసి కర్ణాటక రాయచూర్లోని యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ ఈ రకాన్ని అభివృద్ధి చేసింది. 142 రోజుల (స్వల్పకాలిక) పంట. హెక్టారుకు 15 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ఎండు తెగులును కొంతమేరకు తట్టుకుంటుంది.పాలకులు శ్రద్ధ చూపాలిశాస్త్రవేత్తలు దీర్ఘకాలం పరిశోధనలు చేసి ఓ కొత్త వంగడాన్ని రూపొందిస్తారు. కానీ, విడుదలైన తర్వాత కూడా కొత్త విత్తనం రైతులకు సత్వరం అందటం లేదు. వేరుశనగ, శనగ వంటి పంటల్లో 15–18 ఏళ్లు పడుతోంది. వెరైటీల రిలీజ్తో పని అయి పోయినట్లు కాదు. ఫార్మల్, ఇన్ఫార్మల్ సీడ్ సిస్టమ్స్ను ప్రోత్సహించటంపైపాలకులు దృష్టిని కేంద్రీకరించటం అవసరం. అప్పుడే రైతులు, వినియోగదారులకు కొత్త వంగడాల ప్రయోజనాలందుతాయి. – డా. పసుపులేటి జనీల, క్లస్టర్ లీడర్ – క్రాప్ బ్రీడింగ్, ప్రధాన శాస్త్రవేత్త (వేరుశనగ), ఇక్రిశాట్ -
మేలు చేసే కొత్త వంగడాలు
సాక్షి, అమరావతి: ఆధునిక బయో టెక్నాలజీ ద్వారా ఆహార పంటల పోషక నాణ్యతను మెరుగుపర్చే బయో ఫోర్టీఫైడ్ పంటలకు ప్రాముఖ్యత, ప్రాబల్యం పెరుగుతోంది. మొక్కల పెరుగుదల సమయంలోనే పంటలలో పోషక స్థాయిలను పెంచడం లక్ష్యంగా శాస్త్రవేత్తలు కొత్త వంగడాలను అభివృద్ధి చేస్తున్నారు. దేశంలోని అగ్రో ఎకలాజికల్ జోన్స్కు అవసరమైన బయో ఫోర్టీఫైడ్ పంట రకాలను ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విడుదల చేసారు.వ్యాధులు, తెగుళ్లను తట్టుకుంటూ అధిక దిగుబడినిచ్చే ఈ రకాలు అన్నదాతల పాలిట వరంగా మారనున్నాయి. వీటిలో వ్యవసాయ పంటల్లో 69 రకాలు, ఉద్యాన పంటల్లో 40 రకాలు ఉన్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్)తోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ విశ్వ విద్యాలయాలు అభివృద్ధి చేసిన రకాలు ఉన్నాయి. వీటిలో 34 రకాల వంగడాలు తెలుగు రాష్ట్రాల్లో సాగుకు అనువైనవి ఉన్నాయి. ఈ వంగడాల్లో 3 ఆంధ్రప్రదేశ్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసినవి కాగా, 5 రకాలు తెలంగాణ రాష్ట్రానికి చెందినవి.జన్యుపరమైన లోపాలకు దూరంగా.. నూతన వంగడాలకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రస్తుతం వినియోగంలో ఉన్న వంగడాలతో పోలిస్తే ఈ కొత్త రకాలలో జన్యు పరమైన లోపాలు లేవని నిర్ధారించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం తట్టుకోగలవు. ఎరువులకు మెరుగైన రీతిలో స్పందిస్తాయి. తెగుళ్లు, వ్యాధులను సమర్ధంగా ఎదుర్కొంటాయి. పంట నాణ్యతతో పాటు ముందుగానే పరిపక్వం చెందుతాయి. అధిక పోషక విలువలతో అధిక ఆహార ఉత్పత్తిని, ఉత్పాదకతను కలిగి ఉండాయి.ఫలితంగా వీటి సాగు ద్వారా పర్యావరణ పరిరక్షణతో కూడిన వ్యవసాయం చేసేందుకు దోహద పడతాయని, వ్యవసాయ యోగ్యం కాని భూములు సైతం సాగులోకి తెచ్చేందుకు ఊతమిస్తాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ వంగడాలు పూర్తి స్థాయిలో రైతులకు అందుబాటులోకి రావాలంటే కనీసం మూడేళ్లు పడుతుందని చెబుతున్నారు. జాతీయ స్థాయిలో విడుదలైన వంగడాల్లో 34 రకాలు తెలుగు రాష్ట్రాలలో సాగుకు అనువైనవి. వీటిలో తెలుగు రాష్ట్రాల నుంచి విడుదలైన 8 రకాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన మరో 26 రకాలు ఉన్నాయి. -
మార్కెట్లోకి మూడు కొత్త వంగడాలు
సాక్షి, అమరావతి: మారుతున్న వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ, అధిక దిగుబడులను సాధించే మూడు కొత్త వంగడాలను ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మార్కెట్లోకి తీసుకొచి్చంది. ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ స్థాయిలో విడుదల చేసిన 109 వంగడాల్లో ఎన్జీ రంగా వర్శిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ వంగడాలూ ఉన్నాయి. దేశీ శనగలో నంద్యాల గ్రామ్, పెసరలో లాం పెసర, వేరుశనగలో ఐసీఏఆర్ కోణార్క్ (టీసీజీఎస్ 1707) రకాలను వర్శిటీ అభివృద్ధి చేసింది. వీటి ప్రత్యేకతలను వర్శిటీ వైస్ఛాన్సలర్ డాక్టర్ ఆర్. శారదా జయలక్ష్మీదేవి సోమవారం మీడియాకు వివరించారు. ఈ వంగడాలను ప్రధాని మోదీ విడుదల చేయడం గర్వకారణంగా ఉందని చెప్పారు. ఆ వంగడాల విశిష్టతలివీ.. నంద్యాల గ్రామ్ (ఎన్బీఈజీ 1267): రబీ సీజన్కు అనుకూలమైన ఈ శనగ రకం పంట కాలం 90 నుంచి 95 రోజులు. దిగుబడి హెక్టార్కు 20.95 క్వింటాళ్లు. ఎండు తెగులును తట్టుకోగలదు. దేశీ శనగ రకం యంత్రంతో కోతకు అనుకూలం. 1, 2 రక్షిత నీటి పారుదలతో పండించుకోవచ్చు. 15.96 శాతం సీడ్ ప్రొటీన్ ఉంటుంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో రబీ సీజన్కు అనుకూలం. ఐసీఏఆర్ కోణార్క్ (టీసీజీఎస్–1707): ఖరీఫ్ సీజన్కు అనుకూలమైన ఈ వేరుశనగ రకం పంట కాలం 110 నుంచి 115 రోజులు. దిగుబడి హెక్టార్కు 24.75 క్వింటాళ్లు వస్తుంది. రసం పీల్చే పురుగులను తట్టుకుంటుంది. ఆకుమచ్చ తెగులు, వేరుకుళ్లు, కాండంకుళ్లు, వేరు ఎండు తెగుళ్లను మధ్యస్థంగా తట్టుకుంటుంది. కాయ నుంచి పప్పు దిగుబడి 70 నుంచి 75 శాతం ఉంటుంది. నూనె 49 శాతం వస్తుంది. 100 గింజల బరువు 40 నుంచి 45 గ్రాములుంటుంది. ప్రొటీన్స్ 29 శాతం. అధిక నీటి వినియోగ సామర్థ్యం ఉంటుంది. గింజలు లేత గులాబీ రంగులో ఉంటాయి. కాయలన్నీ ఒకేసారి పక్వానికి వస్తాయి. లాం పెసర (ఎల్జీజీ 610): రబీ సీజన్కు అనుకూలమైన ఈ పెసర రకం పంట కాలం 74 రోజులు. దిగుబడి హెక్టార్కు 11.17 క్వింటాళ్లు వస్తుంది. ఎల్లో మొజాయిక్ వైరస్ను తట్టుకుంటుంది. యంత్రంతో కోతకు అనుకూలం. రబీ సీజన్లో వరి మాగాణులకే కాదు.. మెట్ట ప్రాంతాల్లో సైతం సాగుకు అనుకూలం. వీటిలో ప్రొటీన్స్ 23.16 శాతం ఉంటాయి. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిశాలలో రబీ సీజన్లో సాగుకు అనువైన రకమిది. -
పనస గింజలు ఇలా తినండి
వేసవి రాగానే పనస కాయలు, పనస పండ్లు విరివిగా లభిస్తాయి. చాలామంది పనస తొనలను తిసేసి, వాటి గింజలను పారవేస్తుంటారు. అయితే ఈ గింజలలోని ప్రయోజనాలు తెలిస్తే వాటిని అస్సలు పారవేయరు.పనస గింజలు మనకు యాపిల్కు మించిన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అలాగే వీటిలో బాదంపప్పుతో సమానమైన పోషకాలు లభిస్తాయి. పనసపండు బాగా పండినప్పుడు దాని తొనలు తియ్యగా, మరింత మెత్తగా తయారవుతాయి. దీంతో దానిలోని గింజలను తొలగించడం మరింత సులభమవుతుంది. ఈ గింజలను ఆహారంలో ఉపయోగించడం వలన అనేక ప్రయోజనాలు అందుతాయి. అయితే పనసపండులోని గింజలను ఎలా తినాలో, ఫలితంగా ఒనగూరే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.పనస గింజలను ఉడకబెట్టి, పైనున్న తొక్క తీసిన తర్వాత తినవచ్చు. ఈ గింజలతో కూర తయారుచేసి కూడా తినవచ్చు. జాక్ప్రూట్ గింజలు తినేందుకు ఎంతో రుచికరంగా ఉంటాయి. ఇవి మనకు పలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.హిమోగ్లోబిన్ పెరుగుదల జాక్ఫ్రూట్ గింజల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఈ గింజలను తినడం వలన శరీరంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. శరీరంలో ఎర్ర రక్త కణాలు పెరిగినప్పుడు, సహజంగా రక్తం పరిమాణం కూడా పెరుగుతుంది.శరీరానికి శక్తి లభిస్తుంది పనస గింజలు తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. వీటిని తీసుకోవడం ద్వారా శరీరంలో విటమిన్ బి లోపాన్ని నివారించుకోవచ్చు. జాక్ఫ్రూట్ గింజలు మన శరీరంలోని కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో, మెదడు పనితీరును మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడతాయి.జీర్ణక్రియ మెరుగుదల జాక్ఫ్రూట్ గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వలన జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. జాక్ఫ్రూట్ గింజలు చర్మానికి, జుట్టుకు కూడా మేలు చేస్తాయి.స్థూలకాయాన్ని తగ్గిస్తాయి జాక్ఫ్రూట్ గింజల్లో అధిక మొత్తంలో ప్రొటీన్లు ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు. చాలా సేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి.రోగనిరోధక శక్తి పెరుగుదల ఈ గింజలు తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఇది కొత్త వైరస్లతో పోరాడేందుకు శరీరానికి శక్తిని అందిస్తుంది. జాక్ఫ్రూట్ గింజల్లో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. -
నూతన వంగడాలను ఆవిష్కరించిన మోదీ
న్యూఢిల్లీ: కరువు కాటకాలను, నీటి ఎద్దడి పరిస్థితులను తట్టుకుంటూనే అధిక దిగుబడినిచ్చే నూతన వంగడాలను ప్రధాని మోదీ ఆదివారం ఆవిష్కరించారు. వీటిలో 61 పంటలకు సంబంధించిన 109 రకాల విత్తనాలున్నాయి. వీటిలో 34 ఆహార, వాణిజ్య పంటల వంగడాలు కాగా 27 ఉద్యాన పంటలకు చెందినవి. పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు, నూనె గింజలు, చెరకు, పత్తి, మొక్కజొన్న, పూలు, పండ్లు, కూరగాయలు, దినుసులు, ఔషధ గుణాల మొక్కల విత్తనాలు ఇలా పలురకాల నూతన వంగడాలను ఢిల్లీలోని పూసా క్యాంపస్లోని మూడు వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో ప్రధాని వీటిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడి రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో మోదీ ముచ్చటించారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసీఏఆర్) ఈ నూతన వంగడాలను అభివృద్ధిచేసింది. ఏటా పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా వ్యవసాయానికి అదనపు విలువ జోడింపు ప్రస్తుతం తక్షణ అవసరమని ప్రధాని వ్యాఖ్యానించారు. కొత్త వంగడాల విశిష్టతపై అక్కడి రైతులతో కలిసి చర్చించారు. తక్కువ నిర్వహణ వ్యయం కారణంగా నూతన వంగడాలతో తమకు మరింత లబ్ధి చేకూరనుందని అక్కడి రైతులు చెప్పారు. ‘‘ తృణధాన్యాల గొప్పదనం, వాటిలోని పోషకవిలువ గురించి తెలిశాక ప్రజలు వాటి వినియోగానికి మొగ్గుచూపుతున్నారు. సేంద్రియ వ్యవసాయం ఎంతో మేలు. ప్రకృతి వ్యవసాయం పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగింది. సేంద్రీయ ఆహారం కావాలని జనం అడిగి మరీ కొనుగోలుచేస్తున్నారు. ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న నూతన వంగడాలపై దేశవ్యాప్తంగా కృషి విజ్ఞాన్ కేంద్రాలు రైతులకు అవగాహన పెంచాలి. కొత్త రకాలను సృష్టిస్తున్న శాస్త్రవేత్తలకు నా అభినందనలు’’ అని మోదీ అన్నారు. సహజసిద్ధ సాగును ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం పట్ల తమలో సానుకూలత పెరిగిందని, కృషి విజ్ఞాన్ కేంద్రాల పాత్ర ఇందులో కీలకమని రైతులు చెప్పారని ప్రభుత్వం తర్వాత ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ వంగడాల్లో పోషక విలువలు మెండుగా ఉంటాయని తర్వాత ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. -
అచ్చెన్నా.. ఇదేంటన్నా!?
పెదకాకాని: వారు వ్యాపారులు కారు.. డీలర్లూ కాదు.. సొంత పొలంలో వరి పంట విత్తుకోవడానికి కొందరు కలిసి విత్తనం తెచ్చుకున్న అన్నదాతలు. అదే వారి పాలిట శాపమైంది. వారేదో మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్నట్లు అధికారుల తనిఖీలు.. పోలీసుల రంగ ప్రవేశం.. కేసుల నమోదు.. అసలు రాష్ట్రంలో నెల రోజులకు పైగా ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. పొలం వాళ్లది.. డబ్బులు వాళ్లవి.. శ్రమ వాళ్లది.. చేతనైతే సహకరించాల్సింది పోయి రైతులపై కేసులు పెట్టడం ఏమిటి? మునుపటికొకడు ఎద్దు ఈనిందంటే గాటికి కట్టేయండి.. అన్న చందంగా ఎవరో ఫిర్యాదు చేస్తే సరిగా విచారించకుండానే ఈ దుందుడుకు చర్యలు ఏమిటి? గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురం గ్రామానికి చెందిన అమ్మిశెట్టి రోజేశ్వరరావు, మరికొందరు రైతులు కలిసి ఈ నెల 2వ తేదీన 30 కిలోల బరువుగల 58 సంచుల వరి విత్తనాలను తెలంగాణ నుంచి తెప్పించారు. వాటిని రోజేశ్వరరావు తన గోడౌన్లో దించుకున్నారు. అదేరోజు గుంటూరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అందిన సమాచారం మేరకు మండల వ్యవసాయాధికారి (ఏవో) పి.సంధ్యారాణి గ్రామానికి వచ్చారు. వరి విత్తనాలు ఎక్కడ కొనుగోలు చేశారు.. అనుమతులున్నాయా అంటూ విచారించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం పెదపాపయ గ్రామం నుంచి నందీశ్వర సీడ్స్ పేరుతో ఉన్న వరి విత్తనాలను తామంతా కలిసి కొనుగోలు చేసినట్లు రైతులు తెలిపారు. అందుకు సంబంధించిన బిల్లు కూడా చూపించారు. ఒక్కరి పేరుతో ఇన్ని విత్తనాలు కొనుగోలు చేయకూడదని, షెడ్డులో ఉన్న 58 బస్తాలు సీజ్ చేస్తామని ఏవో చెప్పారు. తాము ఏటా వంద ఎకరాలకు పైగా వరి సాగు చేస్తామని రైతులు రోజేశ్వరరావు, మల్లికార్జునరావు, సాంబశివరావు తదితరులు విత్తనాలు సీజ్ చేయకుండా అడ్డుకున్నారు. దీంతో రైతులు తమ విధులకు ఆటంకం కలిగించారని ఏవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు శనివారం సీఐ కె.వీరాస్వామి తెలిపారు. రైతులపై కేసు నమోదు చేయడం పట్ల చుట్టుపక్కల గ్రామాల్లోని రైతుల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ ప్రభుత్వం రైతులకు ఇస్తున్న గౌరవం ఇదేనా అంటూ ప్రశి్నస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని, రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. -
బరువు తగ్గడంలో పుచ్చకాయ గింజలు ఎలా ఉపయోగపడతాయో తెలుసా..!
పుచ్చకాయ గింజలతో బరువుకి చెక్ పెట్టొచ్చట. సమ్మర్లో దాహార్తిని తీర్చే ఈ పుచ్చకాయతో బరువు తగ్గించడంలో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది అద్భుతమైన హైడ్రేటింగ్ పండు మాత్రమే గాక దీనిలో ఉండే చిన్న విత్తనాలు బరువుని తగ్గించడంలో ఎంతో పవర్ఫుల్గా పనిచేస్తాయని చెబుతున్నారు. ఇందులో దాదాపు 92% నీరు ఉంటుంది. ఇందులో ఖనిజాలు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. వేసవిలో మంచి రిఫ్రెష్ని ఇచ్చే జ్యూసీ పండు ఇది.అయితే దీనిలో ఉండే విత్తనాలను పారేస్తామే గానీ వినియోగించం. వీటిలో కూడా అవసరమైన పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయట. అవి బరువు తగ్గించడంలో ప్రభావవంతగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్ని అని చెబుతున్నారు. ఈ పుచ్చకాయ గింజల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో సవివరంగా చూద్ధామా..!అధిక ప్రోటీన్: పుచ్చకాయ గింజల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది, ఇది కండరాలను బలోపేతం చేయడానికి అవసరం. ఇందులో ఉండే ప్రొటీన్ ఎక్కువసేపు నిండుగా ఉన్న అనుభూతిని పొందడంలో సహాయపడుతుంది. అల్పాహారం చేయాలనే కోరికను తగ్గించి, బరువు నిర్వహణలో సహాయపడుతుంది. ఈ విత్తనాలలో కొన్ని మాత్రమే రోజువారీ ప్రోటీన్లో గణనీయమైన మొత్తాన్ని అందించగలవు.ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి: ఈ గింజల్లో ఒమేగా-6 తో సహా ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి. ఇవి శరీర కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. ఈ కొవ్వులు తక్షణ శక్తిని అందిస్తాయి. చురుకుగా ఉండటానికి, రోజంతా ఎక్కువ కేలరీలు బర్న్ చేయడంలో సహాయపడతాయి.ఫైబర్ కంటెంట్: పుచ్చకాయ గింజలు ఫైబర్ మూలం. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. సంపూర్ణత్వ భావనను ప్రోత్సహిస్తుంది. ఇది అతిగా తినడాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. పైగా మొత్తం కేలరీల తీసుకోవడం తగ్గిస్తుంది. అలాగే బరువు తగ్గించే ప్రయత్నాలకు మద్దతు ఇస్తుంది.జీవక్రియను పెంచుతుంది: పుచ్చకాయ గింజలలో లభించే మెగ్నీషియం జీవక్రియకు సంబంధించిన శక్తి ఉత్పత్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సమర్థవంతమైన బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన జీవక్రియ అవసరం. ఎందుకంటే ఇది శరీరంలో కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. అలాగే శరీరంలో అదనపు కిలోలను తగ్గించడంలో సహాయపడుతుంది.కేలరీలు తక్కువ: అనేక ఇతర చిరుతిండి ఎంపికలతో పోలిస్తే పుచ్చకాయ గింజలు చాలా తక్కువ కేలరీలను కలిగి ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి పోషకమైన సంతృప్తికరమైన ఎంపికగా మారుస్తుంది.ఎలా చేర్చుకోవాలంటే..వేయించిన పుచ్చకాయ గింజలు భోజనానంతరం స్నాక్గా తీసుకోవడం సరైనది. ఆరోగ్యకరమైన స్నాకింగ్ తినాలనుకుంటే చిటికెడు ఉప్పు, కొంచెం ఆలివ్ నూనెతో వేయించండి. అలాగే ప్రోటీన్లు, అవసరమైన పోషకాల కోసం స్మూతీస్లో కూడా జోడించండి. ముఖ్యంగా సలాడ్ల పైన వేయించిన పచ్చి పుచ్చకాయ గింజలను చిలకరించడం వల్ల క్రంచి క్రంచి వగరు రుచిని ఆస్వాదించవచ్చు. (చదవండి: కొలెస్ట్రాల్ను కంట్రోల్ చేసి సెంచరీ కొట్టిన తాత! ఎలాగంటే..) -
గోద్రెజ్ ఆగ్రోవెట్ నుంచి మూడు హైబ్రీడ్ విత్తనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గోద్రెజ్ ఆగ్రోవెట్ సీడ్స్ వ్యాపార విభాగం కొత్తగా మూడు హైబ్రిడ్ విత్తనాలను ఆవిష్కరించింది. మొక్కజొన్నకు సంబంధించి జీఎంహెచ్ 6034, జీఎంహెచ్ 4110 రకాలు, వరికి సంబంధించి నవ్య రకం విత్తనాలు వీటిలో ఉన్నాయి. ముందుగా వీటిని ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర మార్కెట్లలో ప్రవేశపెట్టగా రాబోయే నెలల్లో తెలంగాణ, బీహార్ మొదలైన రాష్ట్రాల్లోను క్రమంగా అందుబాటులోకి తెస్తామని కంపెనీ సీఈవో ఎన్కే రాజవేలు తెలిపారు. తమకు పంట సంరక్షణ ఉత్పత్తులు కూడా ఉన్నందున నాట్ల దగ్గర్నుంచి కోతల వరకు అన్ని దశల్లో రైతులకు తాము వెన్నంటి ఉంటామని ఆయన పేర్కొన్నారు. విత్తన రంగంలో సొంత ఆర్అండ్డీ విభాగం ఉన్న అతి కొద్ది కంపెనీల్లో తమది ఒకటని, అధిక దిగుబడులనిచ్చే విత్తనాలను రైతులకు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని రాజవేలు చెప్పారు. -
Sagubadi: విదేశీ విత్తనాలను, మొక్కల్ని ఆన్లైన్లో కొంటున్నారా? జాగ్రత్త..!
విదేశాల నుంచి మొక్కలు, విత్తనాలు, చెక్క వస్తువులు, అలంకరణ చేపలను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారా? విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడ కంటికి నచ్చిన పూల మొక్కలనో, పంట మొక్కలనో, వాటి విత్తనాలనో అధికారుల కన్నుగప్పి వెంట తెస్తున్నారా?మిరపతో పాటు కొన్ని కూరగాయ పంటలు, మామిడి తోటలను ఇటీవల అల్లాడిస్తున్న నల్ల తామర ఇలాగే విదేశాల నుంచి వచ్చిపడిందేనని మీకు తెలుసా? కొబ్బరి, ఆయిల్పామ్ వంటి తోటలను పీడిస్తున్న రుగోస్ రింగ్స్పాట్ తెల్లదోమ కూడా విదేశాల నుంచి మన నెత్తిన పడినదే. వీటి వల్ల జీవవైవిధ్యానికి, రైతులకు అపారమైన నష్టం కలుగుతోంది.ఒక దేశంలో ఉన్నప్పుడు పెద్దగా నష్టం కలిగించని పురుగులు, తెగుళ్లు వేరే దేశపు పర్యావరణంలోకి ప్రవేశించినప్పుడు అక్కడి జీవవైవిధ్యానికి పెను సమస్య్ఠగా మారే ప్రమాదం ఉంటుంది.ఒక్కసారి ఆ పర్యావరణంలో అది సమస్యగా మారిన తర్వాత దాన్ని నిర్మూలించటం చాలా సందర్భాల్లో అసాధ్యం. ఉదాహరణ.. మన రైతులను వేధిస్తున్న నల్లతామర, రుగోస్ రింగ్స్పాట్ తెల్లదోమ. అందుచేత.. విదేశాల నుంచి సకారణంగా ఏవైనా మొక్కల్ని, విత్తనాలను, అలంకరణ చేపలను తెప్పించుకోవాలనుకుంటే.. అంతకు ముందే ఫైటోశానిటరీ సర్టిఫికెట్తో పాటు ఇతర అనుమతుల్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త..!తెలిసో తెలియకో పోస్టు, కొరియర్ల ద్వారా మన వంటి వారు కొనుగోలు చేస్తున్న విదేశీ మొక్కలు, విత్తనాలతో పాటు మనకు తెలియకుండా దిగుమతయ్యే సరికొత్త విదేశీ జాతుల పురుగులు, తెగుళ్లు మన దేశంలో పంటలకు, జీవవైవిధ్యానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ఆహార భద్రతకు ఎసరు పెట్టే పరిస్థితులూ తలెత్తవచ్చు. అందుకే అంతర్జాతీయంగా జన్యువనరుల వ్యాపారాన్ని నియంత్రించేందుకు ఎయిర్పోర్టుల్లో, సీపోర్టుల్లో, సరిహద్దుల్లో ప్రత్యేక అధికార వ్యవస్థలను ఏర్పాటు చేశారు.మొక్కలు, విత్తనాలే కాదు.. మట్టి ద్వారా కూడా ఒక దేశం నుంచి మరో దేశానికి చీడపీడలు తెలియకుండా రవాణా కావొచ్చు. ఆ మధ్య ఒక క్రికెటర్ తనతో పాటు తీసుకెళ్తున్న బూట్లకు అడుగున అంటుకొని ఉన్న మట్టిని సైతం ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు గుర్తించి, నివారించడానికి ఇదే కారణం.అధికారికంగా వ్యవసాయ పరిశోధనల కోసం దిగుమతయ్యే పార్శిళ్లను ఈ క్వారంటైన్ అధికారులు వాటిని నిబంధనల మేరకు పరీక్షించి, ప్రమాదం లేదనుకుంటేనే దిగుమతిదారులకు అందిస్తారు. జాతీయ మొక్కల జన్యువనరుల పరిశోధనా సంస్థ (ఎన్బిపిజిఆర్) ద్వారా ఇది జరుగుతుంది.ఒక వ్యాపార సంస్థ నుంచి నేరుగా వినియోగదారుల మధ్య (బి2సి) జరిగే ఆన్లైన్ వ్యాపారం వల్లనే సమస్య. విదేశాల్లోని వినియోగదారులకు ఓ వ్యాపార సంస్థ నేరుగా అమ్మకాలు జరుపుతున్నందున దిగుమతులకు సంబంధించిన ఫైటోశానిటరీ నిబంధనల అమలు కష్టతరంగా మారింది.అంతర్జాతీయంగా ఈ వ్యవహారాల పర్యవేక్షణ కోసం ప్రపంచ దేశాల మధ్య ఇంటర్నేషనల్ ΄్లాంట్ ్ర΄÷టెక్షన్ ఒడంబడిక (ఐపిపిసి) గతంలోనే కుదిరింది. ఇటీవల కాలంలో పెద్ద తలనొప్పిగా మారిన ఈ–కామర్స్ పార్శిళ్లను కట్టడి చేయడం కోసం జాతీయ స్థాయిలో నియంత్రణ వ్యవస్థలకు ఐపిపిసి సరికొత్త మార్గదర్శకాలను సూచించింది.- గోల్డెన్ ఆపిల్ స్నెయిల్, - వరి మొక్కపై నత్త గుడ్లుఎవరేమి చెయ్యాలి?దేశ సరిహద్దులు దాటి సరికొత్త చీడపీడలు మన దేశంలోకి ప్రవేశించకుండా ఉండాలంటే, ప్రమాదవశాత్తూ వచ్చినా వాటిని తొలి దశలోనే గుర్తించి మట్టుబెట్టేందుకు సమాజంలోని అనేక వర్గాల వారు చైతన్యంతో వ్యవహరించాల్సి ఉంది.రైతులు: చీడపీడలను చురుగ్గా గమనిస్తూ ఏదైనా కొత్త తెగులు లేదా పురుగు కనిపిస్తే వెంటనే అధికారులకు చె΄్పాలి. పర్యావరణ హితమైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.స్వచ్ఛంద సంస్థలు, సహకార సంఘాలు: చీడపీడల నివారణ, నియంత్రణకు మేలైన పద్ధతులను రైతులకు సూచించాలి. వీటి అమలుకు మద్దతు ఇస్తూ.. మొక్కల ఆరోగ్య పరిరక్షణకు సంబంధీకులందరినీ సమన్వయం చేయాలి.ప్రభుత్వాలు, విధాన నిర్ణేతలు, పాలకులు: మొక్కల ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రత్యేక విధానాలు రూపొందించాలి. పర్యావరణహితమైన సస్యరక్షణ చర్యలను ్రపోత్సహించాలి. ప్రమాదరహితమైన వ్యాపార పద్ధతులను ప్రవేశ పెట్టాలి. జాతీయ, రాష్ట్రాల స్థాయిలో మొక్కల ఆరోగ్య రక్షణ ప్రభుత్వ సంస్థలను అన్ని విధాలా బలోపేతం చేయాలి.దాతలు–సిఎస్ఆర్: మొక్కల ఆరోగ్య రక్షణ వ్యవస్థలను, సాంకేతికతలను బలోపేతం చేయాలి. ప్రైవేటు కంపెనీలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్) నిధులు సమకూర్చాలి. రవాణా, వ్యాపార రంగాలు: ప్రస్తుతం అంతర్జాతీయంగా అమల్లో ఉన్న ఫైటోశానిటరీ చట్టాలను, ఐపిపిసి ప్రమాణాలను తు.చ. తప్పక పాటించాలి.ప్రజలు: విదేశాల నుంచి మన దేశంలోకి మొక్కల్ని, మొక్కల ఉత్పత్తుల్ని తీసుకురావటం ఎంతటి ప్రమాదమో గుర్తించాలి. అధికార వ్యవస్థల కన్నుగప్పే విధంగా ఈ–కామర్స్ వెబ్సైట్లు, యాప్ల ద్వారా విదేశాల నుంచి మొక్కలను, విత్తనాలను ఆర్డర్ చేయకుండా చైతన్యంతో మెలగాలి.విదేశీ నత్తలతో ముప్పు!ఓ కోస్తా జిల్లాకు చెందిన ఒక వ్యక్తి మంచినీటి నత్త జాతికి చెందిన గోల్డెన్ ఆపిల్ స్నెయిల్ను విదేశాల నుంచి తెప్పించి సిమెంటు తొట్లలో పెంచుతూ పట్టుబడ్డాడు. దక్షిణ అమెరికా దీని స్వస్థలం. అయితే, తైవాన్, జపాన్, ఫిలిప్పీన్స్ దేశాలకు పాకిన ఈ నత్త ఆయా దేశాల్లో తామరతంపరగా పెరిగిపోతూ స్థానిక జలచరాలను పెరగనీయకుండా జీవవైవిధ్యాన్ని, వరి పంటను దెబ్బతీయటంప్రారంభించింది.లేత వరి మొక్కలను కొరికెయ్యటం ద్వారా పంటకు 50% వరకు నష్టం చేకూర్చగలదు. ఫిలిప్పీన్స్లో ఏకంగా 200 కోట్ల డాలర్ల మేరకు పంట నష్టం కలిగించింది. వేగంగా పెరిగే లక్షణం గల ఈ నత్త మంచినీటి చెరువులు, కాలువలు, వరి ΄÷లాల్లో జీవవైవిధ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈ వ్యక్తి ఈ నత్తలను పెంచుతూ మాంసాన్ని విక్రయించటంప్రారంభించిన విషయం తెలుసుకున్న అధికారులు అతని వద్ద ఉన్న విదేశీ నత్తలను, వాటి గుడ్లను పూర్తిగా నాశనం చేశారు.దీని వల్ల జీవవైవిధ్యానికి ఉన్న ప్రమాదాన్ని గుర్తించలేని స్థితిలో ఈ నత్తల్ని పెంచటంప్రారంభించినట్లు చెబుతున్నారు. కొరియర్ ద్వారా గాని, కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి నత్తలను తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. అయితే, సకాలంలో అధికారులు స్పందించటం వల్ల మన వరి ΄÷లాలకు ఈ నత్తల ముప్పు తప్పింది.ఇండియన్ స్టిక్ ఇన్సెక్ట్..ఎండిన, ముక్కలు చేసిన లేదా పాలిష్ చేసిన ధాన్యాలు, విత్తనాలు, పండ్లు, కూరగాయలు, ఔషధ మొక్కలు కూడా చీడపీడలను మోసుకొచ్చే ప్రమాదం ఉంది. అయితే, ఉడికించటం, స్టెరిలైజ్ చేయటం, వేపటం వంటిప్రాసెసింగ్ చేసిన ఆహారోత్పత్తుల ద్వారా మాత్రం చీడపీడలు రవాణా అయ్యే అవకాశం ఉండదు కాబట్టి వీటికి ఫైటోశానిటరీ నిబంధనలు వర్తించవు.తేనెటీగలు, సీతాకోకచిలుకలు, మాంటిడ్స్, పెంకు పురుగులు, పుల్లలతో చేసిన బొమ్మ మాదిరిగా కనిపించే పురుగులు (స్టిక్ ఇన్సెక్ట్స్), నత్తలు వంటి వాటిని కొందరు సరదాగా పెంచుకోవటానికి కూడా ఒక దేశం నుంచి మరో దేశానికి పంపటం లేదా ఆన్లైన్లో కొనుగోలు చేయటం వంటి పనులు చేస్తుంటారు. వీటి ద్వారా కూడా పురుగులు, తెగుళ్లు, వైరస్లు ఇతర దేశాలకు వ్యాపించే అకాశం ఉంటుంది. న్యూజిలాండ్లో మూడేళ్ల క్రితం ఒక స్కూలు విద్యార్థిని ఇంట్లో పెద్దలకు తెలియకుండా అనేక రకాల స్టిక్ ఇన్సెక్ట్ గుడ్లను పోర్చుగల్ దేశం నుంచి ఆన్లైన్లో కొనుగోలు చేసి తెప్పించుకుంది. పార్శిల్ వచ్చిన తర్వాత గమనించిన ఆమె తల్లి ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. వారు ఆ పార్శిల్ను జాగ్రత్తగా తీసుకెళ్లి పరీక్షించి చూశారు.ఆ దేశంలో అప్పటికే ఉన్న అనేక రకాల స్టిక్ ఇన్సెక్ట్స్ గుడ్లతో పాటు కొత్త రకం ఇండియన్ స్టిక్ ఇన్సెక్ట్ గుడ్లు కూడా ఆ పార్శిల్లో ఉన్నాయని గుర్తించి నాశనం చేశారు. ఈ విద్యార్థిని తల్లి చైతన్యం మెచ్చదగినది.సెకనుకు 5,102 ఈ–కామర్స్ లావాదేవీలు!ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ద్వారా వస్తువుల వ్యాపారం (ఈ–కామర్స్) గతమెన్నడూ లేనంత జోరుగా సాగుతున్న రోజులివి. సెకనుకు 5,102 ఈ–కామర్స్ లావాదేవీలు జరుగుతున్నాయి. 2022లో ఏకంగా 16,100 కోట్ల పార్శిళ్ల కొనుగోళ్లు ఆన్లైన్లో జరిగాయి. కరోనా కాలంలో 20% పెరిగాయి. ఇప్పుడు వార్షిక పెరుగుదల 8.5%. 2027 నాటికి ఏటా 25,600 కోట్ల పార్శిళ్లు ఈ కామర్స్ ద్వారా బట్వాడా అయ్యే అవకాశం ఉందని అంచనా.- అమెరికాలోని ఓ తనిఖీ కేంద్రంలో ఈ–కామర్స్ పార్శిళ్లుముఖ్యంగా అసక్తిగా ఇంటిపంటలు, పూల మొక్కలు పెంచుకునే గృహస్తులు చిన్న చిన్న కవర్లలో విత్తనాలను విదేశాల్లోని పరిచయస్తులకు పోస్ట్/ కొరియర్ ద్వారా పంపుతుంటారు. విదేశీ కంపెనీల నుంచి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటూ ఉంటారు. విదేశాల నుంచి విత్తనాలు, ఉద్యాన తోటల మొక్కలు, అలంకరణ మొక్కలు, వాటితో పాటు వచ్చే మట్టి, అలంకరణ చేపలు, చెక్కతో చేసిన వస్తువులు, యంత్రాల ప్యాకింగ్లో వాడే వుడ్ ఫ్రేమ్ల ద్వారా పురుగులు, తెగుళ్లు ఒక దేశం నుంచి మరో దేశానికి రవాణా అవుతూ అధికారులకు చెమటలు పట్టిస్తున్నాయి.కరోనా కాలం నుంచి ప్రపంచ దేశాల మధ్య పార్శిళ్ల వ్యాపారం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవటంతో నియంత్రణ వ్యవస్థలు ఉక్కిరి బిక్కిరవుతున్నాయి. మన దేశంలో నియంత్రణ వ్యవస్థలను నేటి అవసరాలకు అనుగుణంగా పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది.– నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
నాన్ సబ్సిడీ సీడ్ పంపిణీ ఎప్పుడో?
సాక్షి, అమరావతి: నాన్ సబ్సిడీ విత్తన పంపిణీ ఈసారి మరింత ఆలశ్యమయ్యేట్టు కన్పిస్తోంది. ప్రతీ ఏటా సబ్సిడీ విత్తనంతో పాటు నాన్ సబ్సిడీ విత్తనాలను కూడా ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేవారు. కానీ ఈసారి ఆ దిశగా ప్రయత్నాలు జరగడంలేదు. ఎన్నికల వేళ.. ఖరీఫ్ సీజన్లో రైతులు ఇబ్బంది పడకూడదన్న ముందుచూపుతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలను సిద్ధం చేసింది.ఎన్నికల కోడ్ కారణంగా ఈసారి కాస్త ఆలశ్యంగా ప్రారంభమైనప్పటికీ, సబ్సిడీ విత్తన పంపిణీ జోరుగా సాగుతోంది. అగ్రి ల్యాబ్్సలో సర్టిఫై చేసిన సీడ్ను ఆర్బీకేల్లో నిల్వ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ పూర్తి కాగా, వేరుశనగ విత్తన పంపిణీ 90 శాతం పూర్తయింది. వరితో సహా ఇతర విత్తనాల పంపిణీ ఊపందుకుంటోంది.ఇప్పటికే 3.11లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాల పంపిణీఖరీఫ్ సీజన్ కోసం 6.32 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనం అవసరం కాగా, 6.28 లక్షల క్వింటాళ్ల విత్తనం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే అందుబాటులో ఉంచింది. 4.38 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని ఆర్బీకేల్లో ఉంచింది. ఇప్పటి వరకు 34,500 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలతో పాటు 2,55,899 క్వింటాళ్ల వేరుశనగ, 20,340 క్వింటాళ్ల వరి, 95 క్వింటాళ్ల అపరాలు చొప్పున 3.11 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని పంపిణీ చేశారు.రెండేళ్లలో 305 క్వింటాళ్ల నాన్ సబ్సిడీ విత్తనంసీజన్లో నాణ్యమైన విత్తనం దొరక్క మిరప, పత్తి రైతులు నకిలీల బారిన పడి, కోట్ల విలువైన పెట్టుబడి, ఉత్పత్తి నష్టాల బారిన పడకుండా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లు సర్టిఫై చేసిన నాణ్యమైన నాన్ సబ్సిడీ సీడ్నే మార్కెట్లో అందుబాటులో ఉంచింది. రైతుల నుంచి వచ్చే డిమాండ్ మేరకు నాన్ సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేసేది. ఇందుకోసం ప్రైవేటు కంపెనీలతో ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఏటా సీజన్కు ముందే ఒప్పందాలు చేసుకునేది.ఇలా గత రెండేళ్లలో 305.43 క్వింటాళ్ల నాన్ సబ్సిడీ విత్తనాన్ని పంపిణీ చేసింది. ఖరీఫ్–2022లో 108.44 క్వింటాళ్ల పత్తి, 2.52 క్వింటాళ్ల మిరప, 2.25 క్వింటాళ్ల సజ్జలు, 37.20 క్వింటాళ్ల సోయాబీన్ విత్తనాల పంపిణీ జరిగింది. గడిచిన ఖరీఫ్–2023లో సైతం 17.38 క్వింటాళ్ల పత్తి, 0.64 క్వింటాళ్ల మిరప, 137 క్వింటాళ్ల సోయాబీన్ విత్తనాలను పంపిణీ చేసింది.నకిలీల బారిన పడకుండా చర్యలుఈసారి కూడా ఖరీఫ్ సీజన్కు 3 నెలల ముందుగానే పత్తి, మిరప ఇతర పంటల విస్తీర్ణానికి తగినట్టుగా విత్తనాలు సరఫరా చేసేలా కంపెనీలను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సిద్ధం చేసింది. ముఖ్యంగా 29 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం కాగా, ప్రస్తుతం మార్కెట్లో 30 లక్షల ప్యాకెట్లు అందుబాటులోకి తెచ్చింది. నకిలీల నివారణకు విస్తృతంగా తనిఖీలు చేసి, ముగ్గురు విత్తన డీలర్లపై 6 ఏ కేసులు నమోదు చేసింది. 7.77 లక్షల విలువైన పత్తి, మిరప విత్తనాలను జప్తు చేసింది. 2.13 కోట్ల విలువైన 435 క్వింటాళ్ల పత్తి, మిరప, ఇతర విత్తనాల అమ్మకాలను నిలిపివేసింది.ఫలితంగా ఎక్కడా నాసిరకం అనే మాటే విన్పించలేదు. సీజన్కు ముందే ప్రైవేటు కంపెనీలతో ఒప్పందానికి ఏర్పాట్లు చేసినా ఎన్నికల కోడ్ కారణంగా ముందుకు సాగలేదు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. దీంతో ఈ ఏడాది ఆర్బీకేల ద్వారా నాన్ సబ్సిడీ విత్తన పంపిణీపై ఈసారి నీలినీడలు కమ్ముకుంటున్నాయి. విత్తనాలు ఎప్పుడు వస్తాయో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. -
విత్తనాలకు.. సుస్థిర విధానం అవసరం!
మన దేశంలో వరిలో దాదాపు 3 లక్షల దేశీ రకం విత్తనాలు ఉండేవని వ్యవసాయ చరిత్ర చెబుతున్నది. అనేక పంటలకు వివిధ రకాల విత్తనాలను వృద్ధి చేసుకున్న ఘనత భారత సాంప్రదాయ వ్యవసాయానిది. హరిత విప్లవం ఒక విధానంగా వచ్చిన గత 60 ఏళ్లలో అనేక రకాల హైబ్రిడ్ విత్తనాలను ప్రవేశపెట్టారు. ఏకపంట పద్ధతికి ప్రోత్సాహం రావడంతో, పంటల వైవిధ్యం తగ్గింది. రసాయనాలు వాడి తయారు చేసిన విత్తనాలు రసాయన వ్యవసాయంలోనే పని చేస్తాయి. కొన్ని కంపెనీల ఆధిపత్యంలో మార్కెట్లు ఉండటం వ్యవసాయ సుస్థిరతకు శ్రేయస్కరం కాదు. రైతులకు విత్తనాల మీద స్వావలంబన కొనసాగించే వ్యవస్థ అవసరం. ప్రభుత్వాలు సుస్థిర, గుత్తాధిపత్య రహిత విత్తన వ్యవస్థకు ప్రోత్సాహం అందించే విధానాలు రూపొందించాలి.ఆహార ఉత్పత్తి మొదలయ్యేది విత్తనాల నుంచే. దాదాపు ప్రతి పంటకు అనేక రకాల విత్తనాలు ఉన్నాయి. స్థానికంగా లభ్యమయ్యే ప్రత్యేక పర్యావరణ, వాతావరణ, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ప్రతి పంటలో రైతులు వందల ఏండ్లుగా విత్తనాలను రూపొందిస్తున్నారు. మన దేశంలో వరిలో దాదాపు 3 లక్షల దేశీ రకం విత్తనాలు ఉండేవని వ్యవసాయ చరిత్ర చెబుతున్నది. వంకాయలో 3 వేలతో సహా అనేక పంటలకు వివిధ రకాల విత్తనాలను వందల యేండ్ల నుంచి వృద్ధి చేసుకున్న ఘనత భారత సాంప్రదాయ వ్యవసాయానిది. దేశవ్యాప్తంగా విత్తనాల చుట్టూ అనేక సంప్రదాయాలు, పండుగలు, గ్రామీణ కార్యక్రమాలు ఉండేవి. గ్రామీణులు, రైతులు, ప్రత్యేకంగా మహిళలు విత్తనాలను గుర్తించటంలో, దాచటంలో, శుద్ధి చేయడంలో గణనీయ జ్ఞానం, కౌశల్యం సంపాదించారు. 35,000 సంవత్సరాలకు పైగా, తరతరాలుగా రైతాంగం పరిశోధనల ఫలితంగా అనేక రకాల విత్తనాలు వృద్ధి అయినాయి. ఈ జానపద విత్తన రకాలు మానవాళికి సుమారు 2,500 పంటలు, 14 పశువుల రకాలకు సంబంధించి ఆశ్చర్యపరిచే స్థాయిలో 11.4 లక్షల రకాల పంటలు, 8,800 పశువుల జాతులను అందించాయి.హరిత విప్లవం ఒక విధానంగా వచ్చిన గత 60 ఏళ్లలో అనేక రకాల హైబ్రిడ్ విత్తనాలు, ప్రధానంగా వరి, గోధుమలు, మక్కల(మొక్కజొన్న)లో ప్రవేశపెట్టారు. 1968–2019 మధ్య వివిధ సంస్థల ద్వారా 1200 వరి హైబ్రిడ్లు ప్రవేశ పెట్టింది ప్రభుత్వం. ఏకపంట పద్ధతికి ప్రోత్సాహం రావడంతో, పంటల వైవిధ్యం క్రమంగా తగ్గుతూ వచ్చి, ప్రమాదకర స్థాయికి చేరింది. హైబ్రిడ్ విత్తనాలను ప్రతి 3, 4 ఏళ్లకు మార్చాల్సి వస్తుంది. ఆధునిక వ్యవసాయం ల్యాబ్ విత్తనాలను ప్రవేశపెట్టి, సంప్రదాయ విత్తనాలను కనుమరుగు చేస్తున్నది. విత్తనాలు కంపెనీల గుప్పిట్లోకి పోయాయి. విత్తనాలు పోయినాయి అంటే మొత్తం ఆహార వ్యవస్థ ఈ కంపెనీల చేతులలోకి వెళ్లిపోవచ్చు. అట్లని కంపెనీల అధీనంలో, ఒక గొప్ప విత్తన వ్యవస్థ వచ్చిందా అంటే అదీ లేదు. రసాయనాలు వాడి తయారు చేసిన విత్తనాలు రసాయన వ్యవసాయంలోనే పని చేస్తాయి. సహజంగా విత్తనాలలో సహజీవన సూక్ష్మజీవులు ఉంటాయి. రసాయన చర్యకు లోనైన ఆధునిక విత్తనాలలో ఈ సూక్ష్మ జీవులు ఉండవు. జీవ ప్రక్రియలో ముఖ్య ఘట్టం విత్తనాలు. ఆ విత్తనాలు విషానికి, విష వ్యాపార సంస్కృతికి బలవుతున్నాయి. ప్రైవేటు కంపెనీల విత్తన వ్యాపారం మన దేశంలో 2002 నుంచి పుంజుకుని, ప్రతి యేడు పెరుగుతున్నది. దాదాపు రూ.25 వేల కోట్ల వార్షిక టర్నోవర్కు చేరింది. ప్రపంచ వ్యాప్తంగా 75 శాతం విత్తన వ్యాపారం కేవలం మూడు బహుళజాతి కంపెనీల గుత్తాధిపత్యంలో ఉన్నది. అమెరికాలోనే పారిశ్రామిక వ్యవసాయానికి అనుగుణమైన విత్తన వ్యవస్థ పుట్టుకొచ్చింది.అమెరికా ప్రభుత్వం ఎల్లప్పుడూ ఈ కంపెనీలకు మద్దతుగా తన వాణిజ్య, విదేశాంగ విధానం అమలు చేస్తుంది. మార్కెట్లో పోటీ తగ్గి కొన్ని కంపెనీల ఆధిపత్యంలో మార్కెట్లు ఉండడం వ్యవసాయ సుస్థిరతకు శ్రేయస్కరం కాదు. బీటీ పత్తి మినహా వేరే రకం పత్తి మార్కెట్లో లేకుండా ఈ ప్రైవేటు కంపెనీలు సిండికేట్ అయినాయి. ప్రభుత్వ సంస్థలలో విత్తన పరిశోధనలు జరగకుండా ప్రైవేటు విత్తన వ్యాపారం అడ్డు పడుతున్నది.అధిక దిగుబడి వంగడాలు, హైబ్రిడ్ విత్తనాలు ప్రవేశపెట్టిన నేపథ్యంలో 1968లో కేంద్ర ప్రభుత్వం విత్తన చట్టం తెచ్చింది. ఈ చట్టం ప్రాథమిక లక్ష్యం అప్పట్లో ప్రభుత్వ పరిశోధన సంస్థలు విత్తనాలను విడుదల చేసే పద్ధతిని నిర్దేశించిడం. తరువాత 2002లో ప్రైవేట్ కంపెనీలకు విత్తనాలను ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చినాక విత్తన చట్టం సవరించాలని భావించారు. 2003 నుంచి కొత్త విత్తన చట్టాన్ని రైతాంగం కోరుతున్నా కూడా కేంద్ర ప్రభుత్వం చేయలేదు. కంపెనీలకు అనుకూల ముసాయిదాలతో 20 యేండ్ల కాలం దాటింది. కొన్ని రాష్ట్రాలు తమ పరిధిలో చట్టం తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తే కేంద్ర ప్రభుత్వం అడ్డుకున్నది. వ్యవసాయానికి విత్తన ఆవశ్యకత ఉన్నందున విత్తనాలను నిత్యావసర చట్టంలో చేర్చిన ప్రభుత్వం ప్రైవేటు విత్తన కంపెనీలకు ఆదాయ పన్ను చట్టం నుంచి మినహాయింపు ఇచ్చింది. విత్తన ధరల మీద నియంత్రణ లేదు. ఉత్తుత్తగా ప్రతి సంవత్సరం పత్తి విత్తనాల ధర నిర్ణయిస్తారు. కొరత ఉందని రైతులను భయపెట్టి బ్లాకు మార్కెట్లో ధరను పదింతలు పెంచుతారు. రైతు మీద భారం మోపుతారు. ఎవరైనా రైతు సొంతంగా విత్తనాలు చేసి అమ్మితే వారి మీద 420 కేసులు పెట్టే శాసన వ్యవస్థ, నాణ్యత లేని విత్తనాల వల్ల వేల ఎకరాల పంట నష్టపోయినా ఆయా కంపెనీలకు తాఖీదులు కూడా ఇచ్చే ధైర్యం చేయలేదు.జన్యుమార్పిడి విత్తనాల వల్ల శ్రేష్ఠమైన సంప్రదాయ విత్తనాలు కనుమరుగు అవుతుంటే, కలుషితం అవుతుంటే పట్టించుకుని సంరక్షించే విత్తన సంస్థ లేకపోవడం దురదృష్టకరం. ప్రత్తి విత్తనాలలో శ్రేష్ఠమైన, దేశీ విత్తనాలు ఇప్పుడు దొరికే పరిస్థితి లేదు. అనేక పంటలలోనూ ఇదే పరిస్థితి. పసుపు, చెరుకు, గోధుమలు, జొన్నలు, కూరగాయలు, మక్కలలో దేశీ రకాలు కనుమరుగు అవుతున్నాయి. ప్రైవేటు కంపెనీలు అమ్ముతున్న కంకర లాంటి మక్క గింజల పంటను ఫ్యాక్టరీకి పంపించి, ప్రాసెస్ చేసి, పశువుల, కోళ్ళ దాణాగా మాత్రమే ఉపయోగించేందుకు వృద్ధి చేశారు. ఇప్పటి మక్క కంకులు నేరుగా ఇళ్లల్లో కాల్చుకుని, ఉడకపెట్టుకుని, ఒలుచుకుని తినే విధంగా లేవు. అటువంటి మక్క గింజలనే పక్కాగా వాడమనీ, తమ కంపెనీల దగ్గర కొనుక్కోమనీ వివిధ దేశాల మీద ఒత్తిడి తేవడం అమెరికా పని. ఇటీవల అటువంటి జన్యుమార్పిడి మక్కలు మాకు వద్దని మెక్సికో ప్రభుత్వం అమెరికా నుంచి మక్కల దిగుమతిని ఆపేసింది. ముక్కలకు మక్కాగా ప్రసిద్ధి చెందిన మెక్సికో తమ గింజలను, తమ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి అమెరికాను ధిక్కరించింది. వరి గింజలకు, వైవిధ్యానికి ప్రసిద్ధి చెందిన మన దేశం మాత్రం విత్తన వైవిధ్యాన్ని కాపాడుకునేందుకు ఒక్కడుగు కూడా వేయడం లేదు. రైతులే కేంద్రంగా విత్తన వ్యవస్థను పునరుద్ధరించే పనిని అనేక స్వచ్చంద సంస్థలు దేశ వ్యాప్తంగా చేస్తున్నాయి. సహకార విత్తన బ్యాంకులను (కమ్యూనిటీ సీడ్ బ్యాంక్స్) ఏర్పాటు చేసి రైతులు, ప్రత్యేకంగా మహిళలను ప్రోత్సహిస్తున్నాయి. గత పదేళ్ళలో వరిలో, గోధుమలలో, చిరు ధాన్యాలలో, వివిధ కూరగాయలు, పండ్లలో తిరిగి దేశీ విత్తనాలను ఉపయోగించే వాతావరణం కల్పించటంలో అనేక సంస్థలు, వ్యక్తుల కృషి ఉన్నది. మన దేశంలో ఈ రెండు వ్యవస్థల (రైతు కేంద్రీకృత విత్తన వ్యవస్థ, లాభాపేక్షతో కొన్ని జన్యుమార్పిడి విత్తనాలను గుప్పిట్లో పెట్టుకున్న ప్రైవేటు వ్యవస్థ) మధ్య కనపడని సంఘర్షణ ఏర్పడింది. కానీ ప్రభుత్వాలు మాత్రం ప్రైవేటు విత్తన వ్యవస్థ వైపు మొగ్గు చూపుతూ, సబ్సిడీలు అందిస్తూ గుత్తాధిపత్యానికి ఊతం అందిస్తున్నాయి. రైతులకు విత్తనాల మీద స్వావలంబన కొనసాగించే వ్యవస్థ అవసరం. వ్యవసాయం లాభసాటిగా ఉండాలన్నా, రసాయన రహిత పౌష్టిక ఆహారం అందాలన్నా, అందరికి కూడు, బట్ట అందాలన్నా విత్తన వ్యవస్థ లాభాపేక్ష లేని వ్యవస్థగా రూపుదిద్దాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుస్థిర, గుత్తాధిపత్య రహిత విత్తన వ్యవస్థకు ప్రోత్సాహం అందించే విధానాలు రూపొందించాలి. గాలి, నేల, నీరు వంటివి సహజ పర్యావరణ వనరులు. విత్తనాలు కూడా సహజ వనరు. ఏ ఒక్కరి సొంతమో కారాదు. డా‘‘ దొంతి నరసింహా రెడ్డి వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు -
ఇకపై ఈ దుకాణాలకి.. ధ్రువీకరణ ఉండాల్సిందే..
కరీంనగర్: దుకాణాల్లో విరామం లేకుండా గడిపే డీలర్లు తరగతి గదిలో కూర్చోవాల్సిందే. ఇక విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు లెక్కలతో కుస్తీ పట్టేవారంతా నిపుణుల బోధనలు వినాల్సిందే. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం ప్రతీ డీలర్ వ్యవసాయ శాఖ నుంచి డీఏఈఎస్ఐ డిప్లమా కోర్సు ధ్రువీకరణ పత్రం పొందాల్సిందేనని స్పష్టం చేసింది. లేదంటే వారిక విక్రయాలు చేసే అవకాశం ఉండదు.కట్టుదిట్టమైన శిక్షణ.. తదుపరి డిప్లమా కోర్సు ధ్రువీకరణ పత్రం, ఆపై రైతులకు విక్రయిస్తున్న వాటిపై నిఘా వంటి ప్రత్యేక కార్యాచరణ ఉండనుంది. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) నేతృత్వంలో డిప్లొమా కోర్సు నిర్వహించనున్నారు. గతంలో జమ్మికుంట కేవీకేలో పలువురు డీలర్లకు డిప్లమా కోర్సు శిక్షణ జరగగా ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను సవరించింది. రైతు శిక్షణ కేంద్రంలో తర్ఫీదు ఇచ్చి ధ్రువీకరణ పత్రం ఇవ్వనున్నారు. డీలర్లు ఈ నెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలని రైతు శిక్షణ కేంద్రం డీడీ ఛత్రునాయక్ పేర్కొన్నారు.48 వారాలు.. నిపుణులతో బోధన..డీలర్లకు ఏడాది పాటు శిక్షణనివ్వనున్నారు. వారంలో ఒక రోజు ప్రతీ ఆదివారం తప్పనిసరిగా హాజరుకావాల్సిందే. కృషి భవన్ను శిక్షణకు వేదికగా నిర్ణయించారు. జిల్లా కేంద్రంలోనే డిప్లమా కోర్సు శిక్షణ ఉండాలని కేంద్రం నిర్దేశించగా తదనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రైతు శిక్షణ కేంద్రం ఏడీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. శిక్షణలో 48 ఆదివారాలు తరగతి గదిలో దుక్కుల నుంచి విత్తనాలు, సస్యరక్షణ చర్యలు తదితర సమగ్ర అంశాలను వివరించనున్నారు. మిగతా 8 వారాలు క్షేత్రస్థాయి శిక్షణ ఉండనుంది. వివరాలకు 81796 49595 నంబర్ను సంప్రదించాలని ఏడీ సూచించారు.ఒక్కో బ్యాచ్కు 40మంది డీలర్లు..విత్తన క్రిమిసంహారక, ఎరువు విక్రయ డీలర్లకు డిప్లమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీస్ టు ఇన్పుట్ డీలర్స్ (డీఏఈఎస్ఐ) డిప్లమా కోర్సుకు ఒక్కో బ్యాచ్కు 40 మందిని ఎంపిక చేయనున్నారు. లైసెన్స్ పొందిన డీలర్ల నుంచి మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కలెక్టరేట్ వ్యవసాయ శాఖలోని రైతు శిక్షణ కేంద్రం కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి. డీలర్ల లైసెన్స్ ప్రతిని సంబంధిత ఏడీఏ ధ్రువీకరణతో సమర్పించాలి. దరఖాస్తుదారు తప్పకుండా పదో తరగతి ఉత్తీర్ణుడై ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు రూ.10వేలు డీడీ చెల్లించి, రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోలు అందజేయాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యతనివ్వనున్నారు.పరీక్ష పాసైతేనే ధ్రువీకరణ..ఏదో మొక్కుబడిగా కాకుండా సమగ్ర అవగాహన కలిగేలా కోర్సును ఏర్పాటు చేశారు. కాలక్షేపం చేస్తే సదరు డీలరుకు ఇబ్బందులు తప్పవు. 48 వారాలు జరిగిన కోర్సుపై పరీక్షలు నిర్వహించనున్నారు. ప్ర తీ అంశంపై పట్టు సాధించాల్సిందే. పరీక్షలో ఉత్తీర్ణుడైతేనే ధ్రువీకరణ పత్రం ఇవ్వనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు శిక్షణ తరగతులు జరుగనుండగా భోజన వసతి కల్పించనున్నారు.ఫెసిలిటేటర్ నియామకానికి గడువు 15ఇందుకు ఫెసిలెటేటర్ను నియమించేందుకు ఆత్మ ప్రకటన విడుదల చేసింది. బీఎస్సీ(అగ్రికల్చర్) లేదా ఎంఎస్సీ అగ్రికల్చర్ చదివి వ్యవసాయశాఖ లేదా వ్యవసాయ విశ్వవిద్యాలయం లేదా కేవీకేలో 20 ఏళ్ల అనుభవం ఉన్నవారిని ఫెసిలిటేటర్గా నియమించాలని ప్రభుత్వం నిర్దేశించింది. వీరికి దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 15 గడువు. ప్రతి ఆదివారం జరిగే శిక్షణలో శాస్త్రవేత్తలు, నిపుణులతో తరగతులు నిర్వహించడం వీరి విధి. త్వరలో శిక్షణ ప్రారంభిస్తామని, డీలర్ల నుంచి దరఖాస్తులు వస్తున్నాయని రైతు శిక్షణ కేంద్రం డీడీ ఛత్రునాయక్ వివరించారు.ఇవి చదవండి: బ్యాంకు ఖాతాలో డబ్బు లేకపోయినా యూపీఐ చెల్లింపులు..! -
తెలంగాణలో రైతులకు గడ్డు పరిస్థితి
-
సాగు సీజన్ షురూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు. దుక్కులు దున్నడం మొదలుపెట్టారు. మరికాస్త వర్షం పడితే చాలు వెంటనే విత్తనాలు చల్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించడం, వచ్చే మూడు నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో.. వానాకాలం వ్యవసాయ సీజన్ గతం కంటే ముందుగా ప్రారంభమైనట్లేనని వ్యవసాయశాఖ వెల్లడించింది. ఈ వానాకాలం సీజన్లో 1.34 కోట్ల ఎకరాల్లో పంటల సాగు జరుగుతుందని అంచనా వేసింది. గతేడాది వానాకాలం సీజన్లో 1.26 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవగా.. ఈసారి 8 లక్షల ఎకరాల్లో అధికంగా పంటల సాగు జరుగుతుందని పేర్కొంది. ఈ మేరకు ఇటీవలే పంటల సాగు ప్రణాళికను విడుదల చేసింది. అత్యధికంగా 66 లక్షల ఎకరాల్లో వరి, ఆ తర్వాత 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని తెలిపింది. గతేడాది వరి 65 లక్షల ఎకరాల్లో, పత్తి 44.77 లక్షల ఎకరాల్లో సాగు అయ్యింది. ఈసారి పత్తి మరో 15.23 లక్షల ఎకరాల్లో సాగయ్యేలా రైతులను ప్రోత్సహించనున్నారు. వరి కంటే ఎక్కువగా పత్తిని ప్రోత్సహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఆ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. విత్తన ప్రణాళిక ఖరారు సాగుకనుగుణంగా విత్తన ప్రణాళికను కూడా వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. ఈ వానాకాలం సీజన్కు 19.39 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని నిర్ణయించారు. అందులో అత్యధికంగా 16.50 లక్షల క్వింటాళ్లు వరి విత్తనాలే కావడం గమనార్హం. పత్తి విత్తనాలు 54 వేల క్వింటాళ్లు, సోయాబీన్ విత్తనాలు 1.49 లక్షల క్వింటాళ్లు అందుబాటులోకి తెస్తారు. మొక్కజొన్న విత్తనాలు 48 వేల క్వింటాళ్లు, కంది విత్తనాలు 16,950 క్వింటాళ్లు, వేరుశనగ విత్తనాలు 13,800 క్వింటాళ్లు, పెసర విత్తనాలు 4,480 క్వింటాళ్లు సిద్ధం చేశారు. అలాగే జొన్న, సజ్జ, రాగి, మినుములు, ఆముదం, పొద్దు తిరుగుడు విత్తనాలను కూడా సిద్ధం చేయాలని నిర్ణయించారు. కొందరు రైతులు ఇప్పటికే విత్తనాలు కొనుగోలు చేయగా, మరికొందరు విత్తనాలు, ఎరువుల కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు రైతులకు అవసరమైన అన్ని రకాల ఎరువులు సిద్ధంగా ఉన్నాయని మార్క్ఫెడ్ వెల్లడించింది. వ్యవ‘సాయానికి’సన్నాహాలు ఈ వానాకాలం సీజన్ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతుబంధు స్థానంలో రైతుభరోసా ద్వారా పెంచిన పెట్టుబడి సాయం అందజేయనుంది. ఎకరాకు రూ.7,500 చొప్పున ఇవ్వనుంది. అయితే సాగయ్యే భూములకే ఇవ్వాలని, సీలింగ్ విధించాలని నిర్ణయించారు. అందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఖరారు చేసే పనిలో వ్యవసాయశాఖ నిమగ్నమైంది. కౌలుదారులకు కూడా రైతు భరోసా ఇవ్వనున్నారు. ఇక రైతులకు రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీని ఆగస్టు 15వ తేదీ నాటికి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. అందుకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా ఖరారు దశలో ఉన్నాయి. మరోవైపు ఈ వానాకాలం సీజన్ నుంచే రైతులకు పంటల బీమాను కూడా పునరుద్ధరించనున్నారు. 33 మందిపై కేసులు: మంత్రి తుమ్మల అనుమతి లేకుండా పత్తి విత్తనాల ప్యాకెట్లు విక్రయిస్తున్న 33 మందిపై కేసులు పెట్టి రూ. 2 కోట్ల విలువగల 118.29 క్వింటాళ్ళ విత్తనాలను స్వా«దీనం చేసుకున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విత్తనాలు బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారని తెలిసి ఇద్దరు డీలర్లపై కేసులు పెట్టామని వెల్లడించారు. పత్తి విత్తనాలు మార్కెట్లలో అవసరం మేరకు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. రైతులందరూ అ«దీకృత డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలని, ప్రైవేట్ వ్యక్తులు, మోసగాళ్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేయవద్దని సూచించారు. ఇప్పటివరకు 84.43 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లను సరఫరా చేశామని, అందులో రైతులు ఇప్పటికే 25.10 లక్షల ప్యాకెట్లు రైతులు కొనుగోలు చేశారని వివరించారు. -
జోరుగా విత్తన పంపిణీ
సాక్షి, అమరావతి: నైరుతి వచ్చేసింది. తొలకరి మొదలైంది. ఖరీఫ్ సాగు ఊపందుకుంటోంది. ఎన్నికల కోడ్ కారణంగా ఈసారి కాస్త ఆలశ్యంగా ప్రారంభమైన విత్తనాల పంపిణీ ఇప్పుడు జోరందుకుంటోంది. ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాలతో పాటు వేరుశనగ విత్తనాల పంపిణీ జోరుగా సాగుతోంది. గిరిజన జిల్లాల్లో వరి విత్తన పంపిణీ ప్రారంభమైంది. ఈ నెల 15 వ తేదీ నుంచి మిగిలిన జిల్లాల్లో వరి, ఇతర విత్తనాల పంపిణీకి ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ, వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తున్నాయి. సీజన్ ఏదైనా స్థానిక లభ్యతనుబట్టి సాగు విస్తీర్ణంలో 30 శాతం విత్తనాన్ని సబ్సిడీపై రైతులకు అందిస్తుంటారు.సబ్సిడీ విత్తనం కోసం చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పడరాని పాట్లు పడేవారు. రోజుల తరబడి బారులు తీరి ఎదురు చూసేవారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. గడిచిన ఐదేళ్లుగా సీజన్కు ముందుగానే నాణ్యమైన, సర్టిఫై చేసిన విత్తనాన్ని ఆర్బీకేల ద్వారా గ్రామాల్లోనే అందించడంతో రైతుల కష్టాలకు తెరపడింది. ఈ ఏడాది ఖరీఫ్లో 85.65 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్దేశించారు. ప్రధానంగా 39.07 లక్షల ఎకరాల్లో వరి, 14.80 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 14.67 లక్షల ఎకరాల్లో పత్తి, 8.35 లక్షల ఎకరాల్లో అపరాలు సాగు చేయనున్నారు. ఖరీఫ్ సీజన్ కోసం 6,31,742 క్వింటాళ్ల విత్తనం అవసరం కాగా, 6,50,160 క్వింటాళ్లు అందుబాటులో ఉంది.2.99 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాన్ని 40 శాతం సబ్సిడీతో అందిస్తున్నారు. పెసర, మినుము, కంది విత్తనాలను 30 శాతం సబ్సిడీపై ఇస్తున్నారు. చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు కొర్ర, రాగి, అండుకొర్రలు వంటి విత్తనాలను 50 శాతం రాయితీపై సరఫరా చేస్తున్నారు. జాతీయ ఆహార ధాన్యాల భద్రత పథకం అమలవుతున్న జిల్లాల్లో కిలోకి రూ.10 చొప్పున, ఇతర జిల్లాల్లో కిలోకి రూ.5 చొప్పున రాయితీతో వరి విత్తనాలు సరఫరా చేస్తున్నారు. ఏజెన్సీ జిల్లాల్లో మాత్రం 90 శాతం సబ్సిడీపై వరితో సహా అన్ని రకాల విత్తనాలను పంపిణీ చేస్తున్నారు. వీటిలో ఇప్పటికే 3,15,928 క్వింటాళ్ల విత్తనాన్ని ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచారు. 48,177 క్వింటాళ్ల పచ్చిరొట్ట, 2 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 67,617 క్వింటాళ్ల వరి, 84 క్వింటాళ్ల చిరుధాన్యాలు, కందులు, మినుములు, 50 క్వింటాళ్ల పెసర, రాజ్మా, నువ్వులు విత్తనాలను సిద్ధం చేశారు.విత్తనం కోసం 3.76 లక్షల మంది రైతులు నమోదుఆర్బీకేల ద్వారా విత్తనాలు కావాల్సిన రైతుల వివరాలను అన్ని జిల్లాల్లో నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు 2,46,997 క్వింటాళ్ల విత్తనాల కోసం 3,75,583 మంది రైతులు ఆర్బీకేల్లో వివరాలు నమోదు చేసుకున్నారు. ఇప్పటివరకు 40 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు, 1,04,200 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాల పంపిణీ పూర్తయింది.సరిపడా విత్తన నిల్వలుగతేడాది మాదిరిగానే సర్టిఫై చేసిన నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాన్ని ఆర్బీకేల ద్వారా పంపిణీ చేస్తున్నాం. ఇప్పటికే పచ్చిరొట్టతో పాటు వేరుశనగ విత్తనం పంపిణీ జోరుగా సాగుతోంది. మిగిలిన విత్తనాలను జూన్ 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నాం.– ఎం.శివప్రసాద్, ఎండీ, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థఏజెన్సీలో 7వేల క్వింటాళ్ల పంపిణీగిరిజన ప్రాంతాల్లో గతంలో ఏటా 2, 3 వేల క్వింటాళ్లకు మించి విత్తనాలను పంపిణీ చేయలేదు. ఈసారి రికార్డు స్థాయిలో 90 శాతం సబ్సిడీ విత్తనాల పంపిణీ జరుగుతోంది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఈ ఏడాది 7 వేల క్వింటాళ్ల విత్తనాన్ని సిద్ధం చేశారు. డిమాండ్ను బట్టి మరింత పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
కొత్త విత్తనాలు వేద్దాం
వరి సాగులో విత్తన మార్పిడిని ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. దశాబ్దాలుగా అన్నదాతలు సాగు చేస్తున్న పాత రకాల వరి వంగడాలకు బదులుగా శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు నవీకరించిన రకాల సాగును ప్రోత్సహించాలని భావిస్తోంది. దశలవారీగా వీటి సాగును విస్తరించేలా చర్యలు చేపట్టింది. ఆ దిశగా రైతులను కార్యోన్ముఖులను చేసేందుకు వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించారు. సాక్షి, అమరావతి: వరి సాగులో విత్తన మారి్పడిని ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు నూతన విత్తనాల సాగును ప్రోత్సహించాలని భావిస్తోంది. ఈ మేరకు వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో వరి ఖరీఫ్ సీజన్లో 37 లక్షల ఎకరాల్లో, రబీలో 20 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. ఖరీఫ్లో 20 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో మూడు దశాబ్దాల క్రితం అభివృద్ధి చేసిన వంగడాలనే నేటికీ సాగు చేస్తున్నారు. వీటిలో ప్రధానంగా బీపీటీ 5204తో పాటు ఎంటీయూ 7029, ఎంటీయూ 1061, ఎంటీయూ 1064 రకాలు ఎక్కువగా పండిస్తున్నారు. దశాబ్దాలుగా సాగవుతుండడంతో చీడపీడలను తట్టుకోలేకపోతున్నాయి. తుఫాన్లతోపాటు కొద్దిపాటి వర్షాలను సైతం తట్టుకోలేక పంటచేలు నేలచూపులు చూస్తున్నాయి.భారీ వర్షాలొస్తే ముంపు బారిన పడుతున్నాయి. వీటికి సరైన ప్రత్యామ్నాయం లేక, కొత్తగా అభివృద్ధి చేసిన వంగడాలపై అవగాహన లేక రైతన్నలు వీటిపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. అందుబాటులో ప్రత్యామ్నాయ రకాలు శాస్త్రవేత్తల సుదీర్ఘ పరిశోధనల అనంతరం ఎంటీయూ 7029, ఎంటీయూ 1061, ఎంటీయూ 1064 రకాలకు ప్రత్యామ్నాయంగా ఎంటీయూ 1318 రకం వరి విత్తనాన్ని అందుబాటులోకి తెచ్చారు. గింజ రాలకపోవడంతోపాటు తెగుళ్లను సమర్థంగా తట్టుకుని మిల్లర్లకు నూక శాతం లేని రకంగా ఈ కొత్త వరి వంగడం ప్రాచుర్యం పొందింది. ఇక బీపీటీ 5204 రకానికి ప్రత్యామ్నాయంగా ఎంటీయూ 1271, ఎన్డీఎల్ఆర్ 7 రకాలు అందుబాటులోకి వచ్చాయి. తెగుళ్లు, పురుగులను తట్టుకునే సామర్థ్యంతో అభివృద్ధి చేసిన ఈ వంగడాలు గింజ రాలకుండా అధిక దిగుబడులు ఇస్తున్నట్లు శాస్త్రవేత్తలు ధృవీకరించారు. ఆర్జీఎల్ 2537 రకం వరికి ప్రత్యామ్నాయంగా ఎంటీయూ 1232 రకాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇది సన్న గింజ రకం కావడంతోపాటు అధిక దిగుబడినిస్తుంది. వేరుశనగలో కే–6కు ప్రత్యామ్నాయం ఖరీఫ్లో సాగు చేసే నూనె గింజల్లో అత్యధిక విస్తీర్ణం (15 లక్షల ఎకరాలు)లో సాగయ్యే వేరుశనగలో కే–6 రకాన్నే దాదాపు మూడు దశాబ్దాలుగా పండిస్తున్నారు. తెగుళ్లు, చీడపీడలతో పాటు బెట్ట పరిస్థితులను తట్టుకోలేక, ఆశించిన దిగుబడులు రాకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవి చూస్తున్నారు. కే–6కు ప్రత్యామ్నాయంగా టీసీజీఎస్ 1694, కదిరి లేపాక్షి రకాలను అందుబాటులోకి తెచ్చారు. బెట్టనే కాకుండా తెగుళ్లను కూడాసమర్థంగా తట్టుకునే ఈ రకాలు అధిక దిగుబడినిస్తున్నాయని శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. దశలవారీగా విస్తరణ.. వ్యవసాయ శాఖాధికారులు, డీఏఏటీఐ, కేవీకే శాస్త్రవేత్తలు, విత్తనాభివృద్ధి సంస్థ అధికారులతో జిల్లా స్థాయిలో నిర్వహించిన సదస్సులతో కొత్త విత్తనాల సాగుపై వ్యవసాయ శాఖ పక్కాగా కార్యాచరణ సిద్ధం చేసింది. దశలవారీగా కొత్త రకాల సాగును విస్తరించేలా ప్రణాళిక రూపొందించారు. 2024–25 సీజన్లో 10 శాతం, 2025–26 సీజన్లో 15 శాతం, 2026–27లో 25 శాతం విస్తీర్ణంలో విత్తన మార్పిడి చేయనున్నారు. తరువాత సంవత్సరాల్లో ఇదే విధానం కొనసాగుతుంది. బ్రీడర్ విత్తనాన్ని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉత్పత్తి చేసింది. ప్రభుత్వ క్షేత్రాలు/ఏపీ సీడ్స్ ఎంపిక చేసిన రైతుల క్షేత్రాల్లో బ్రీడర్ సీడ్ నుంచి మూల విత్తనాన్ని పండిస్తారు. ఏపీ సీడ్స్ ఎంపిక చేసిన రైతుల క్షేత్రాల్లో మూల విత్తనాన్ని నాటి సర్టిఫైడ్ సీడ్ను పండిస్తారు. వీటిని ఏపీ విత్తన ధ్రువీకరణ అథారిటీ ధ్రువీకరిస్తుంది. బ్రీడర్, ఫౌండేషన్ సీడ్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ముందుగా వీటి సాగుకు ప్రాధాన్యతనిస్తారు. పూర్తిస్థాయిలో విత్తనం అందుబాటులోకి తెచి్చన తర్వాత సబ్సిడీపై రైతులకు సరఫరా చేసి దశల వారీగా సాగు విస్తీర్ణం పెరిగేలా ప్రోత్సహిస్తారు. ఆర్బీకేల ద్వారా అవగాహన రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎంపిక చేసిన ప్రాంతాల్లో రైతుల వారీగా సమావేశాలు నిర్వహించి తొలుత అవగాహన కల్పించనున్నారు. కొత్త రకాల ప్రత్యేకతను అందరికీ అర్థమయ్యే రీతిలో వాల్ పోస్టర్లు, కరపత్రాల ద్వారా విç్తత ప్రచారం కల్పిస్తారు. ఆర్బీకే ఛానల్ ద్వారా శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతుల సందేశాలతో కూడిన వీడియోల ద్వారా వీటి సాగును ప్రోత్సహిస్తారు.చిన్న చిన్న వీడియో, ఆడియో సందేశాలను రూపొందించి పంటల వారీగా ఏర్పాటు చేసిన వాట్సప్ గ్రూపుల ద్వారా రైతులకు చేరవేసి వాటిపై అవగాహన కల్పిస్తారు. ప్రత్యామ్నాయ రకాల విస్తరణే లక్ష్యంరాష్ట్రంలో కొన్ని రకాల వంగడాలు దాదాపు 20–30 ఏళ్లకుపైగా సాగులో ఉన్నాయి. కనీసం 10–15 ఏళ్ల పాటు సాగు చేసిన వంగడాలను క్రమేపీ తగ్గించాలి. వాటి స్థానంలో ఇటీవల కొత్తగా అభివృద్ధి చేసిన వంగడాలను సాగులోకి తేవాల్సిన అవసరం ఉంది. వచ్చే మూడేళ్లలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో కనీసం 50 శాతం విస్తీర్ణంలో పాత వంగడాల స్థానంలో శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన కొత్త రకాల సాగును ప్రోత్సహించేలా కార్యాచరణ సిద్ధం చేశాం. –చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
వచ్చిందే సగం ‘బ్లాక్’తో ఆగం!
సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్ : వానాకాలం ముంచుకొస్తోంది. ఈసారి మంచి వర్షాలు పడతాయన్న వాతావరణశాఖ ప్రకటనతో.. రైతులు పెద్ద ఎత్తున సాగుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా పత్తి విత్తనాల కోసం భారీగా డిమాండ్ నెలకొంది. కానీ బ్రాండెడ్ పత్తి విత్తనాలు బ్లాక్ మార్కెట్కు తరలిపోయాయి. రైతులు కోరుకునే విత్తనాలను వ్యాపారులు ‘బ్లాక్’ చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కాలం చెల్లిన, సాధారణ విత్తనాలను మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో మంచి విత్తనాల కోసం రైతులు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. మరోవైపు అనుమతి లేని విత్తనాలను ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చి అమ్ముతున్నట్టూ ఆరోపణలు ఉన్నాయి. అధిక దిగుబడి వస్తుందనే ప్రచారంతో.. శాస్త్రీయంగా అన్నిరకాల విత్తనాలు దాదాపు ఒకే రకమైన పంట, దిగుబడిని ఇస్తాయని నిపుణులు చెప్తున్నారు. కానీ వ్యాపారులు వ్యూహాత్మకంగా కొన్ని రకాలే మంచి దిగుబడులు ఇస్తాయని అపోహలు సృష్టిస్తూ దండుకుంటున్నారు. ప్రస్తుతం కంపెనీ ఏదైనా సరే.. బీటీ–2 పత్తి విత్తన ప్యాకెట్ (475 గ్రాములు) ధర రూ.864గా నిర్ణయించారు. 30కిపైగా కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న 200 రకాల విత్తనాలను ఇదే ధరపై విక్రయించాలి.కానీ మార్కెట్లో ఒక నాలుగైదు రకాలు అధిక దిగుబడులు ఇస్తాయనే ప్రచారం ఉంది. వ్యాపారులు అలాంటి వాటిని బ్లాక్ చేస్తూ రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. కొన్నిచోట్ల ఒక్కో ప్యాకెట్ విత్తనాలకు రూ.2 వేల నుంచి రూ. 2,500 వరకు వసూలు చేస్తున్నట్టు రైతులు చెబుతున్నారు. నిషేధిత విత్తనాలు అంటగడుతూ.. కొందరు వ్యాపారులు, దళారులు నిషేధిత బీటీ–3 విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. బీటీ–2 కంటే తెగుళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటాయని.. కలుపును తట్టుకుంటాయని చెప్తున్నారు. పత్తి చేన్లలో కలుపు నివారణ కోసం కూలీలు సకాలంలో దొరక్క ఇబ్బందిపడుతున్న రైతులు ఈ ప్రచారానికి ఆకర్షితులవుతున్నారు. ఇలా డిమాండ్ సృష్టిస్తున్న వ్యాపారులు బీటీ–2 విత్తనాల కంటే బీటీ–3 విత్తనాలను రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు.మహారాష్ట్రలోని ఔరంగాబాద్, జాల్నా ప్రాంతాలతోపాటు గుజరాత్లోని వివిధ పట్టణాల నుంచి ఈ బీటీ–3 విత్తనాలు రాష్ట్రంలోకి వస్తున్నాయి. నకిలీలు, నిషేధిత విత్తనాలను నియంత్రించడం, బ్లాక్ మార్కెటింగ్ను అడ్డుకోవడం వంటి చర్యలు చేపట్టాల్సిన అధికారులు.. కొందరు దళారులు, వ్యాపారులతో కుమ్మక్కై చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. తూతూమంత్రంగా దాడులు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటివరకు సగం వరకు సరఫరా.. నైరుతి రుతుపవనాలతో కురిసే తొలకరి వానలతోనే రైతులు పత్తి విత్తనాలు చల్లుతారు. ఈసారి రాష్ట్రంలో 55 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేశారు. అందుకోసం 1.26 కోట్ల విత్తన ప్యాకెట్లు సిద్ధం చేయాలని నిర్ణయించారు. కానీ ఇప్పటివరకు 68.16 లక్షల ప్యాకెట్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. వ్యవసాయశాఖ వెల్లడించిన వివరాలే ఇవి. దీనిపై రైతులు, వ్యవసాయ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.‘‘ఇప్పటివరకు మొత్తం విత్తనాలను ఎందుకు జిల్లాలకు సరఫరా చేయలేదు? కొరతే లేదని చెప్తున్నప్పుడు రైతులు ఎందుకు క్యూలైన్లలో ఎందుకు ఉండాల్సి వస్తోంది? ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారో అధికారులే చెప్పాలి. రైతులు కోరుకునే కంపెనీల విత్తనాలను అందుబాటులో ఉంచకపోవడమే ఇందుకు ప్రధాన కారణం..’’ అని వారు పేర్కొంటున్నారు. మరోవైపు ఇతర కంపెనీల విత్తనాలు కూడా కొనుగోలు చేసుకోవాలని అధికారులు చెప్తున్నారని.. మరి వారు దిగుబడికి గ్యారంటీ ఇవ్వగలరా అని రైతులు ప్రశి్నస్తున్నారు. ఇంకా సేకరణలోనే యంత్రాంగం.. రాష్ట్రంలో నిర్ణయించుకున్న లక్ష్యంలో సగం వరకే పత్తి విత్తనాలు సరఫరా అయ్యాయి. సీజన్ కూడా మొదలైపోతోంది. కానీ అధికారులు ఇంకా విత్తనాలను సేకరించే పనిలోనే ఉన్నారు. కంపెనీలతో ఇప్పటికీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒక రకం బ్రాండ్ విత్తనాలకు డిమాండ్ ఉందని తెలిసి.. ఇప్పుడు తమిళనాడు నుంచి ఆ రకం విత్తనాలు తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. ఉన్నతాధికారుల సమన్వయ లోపంతో.. వ్యవసాయ శాఖలోని ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారుల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోందని.. దిగువ స్థాయికి ఆదేశాలివ్వడంలో సరిగా వ్యవహరించలేక పోతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఎరువుల దుకాణాలను రోజూ పరిశీలించాలని వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో)ను ఒక ఉన్నతాధికారి ఆదేశిస్తుంటే.. మరో ఉన్నతాధికారి మాత్రం అలా చేయొద్దని, తాను చెప్పినట్టుగా రైతుల వద్దకు వెళ్లి వారికి సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్తున్నట్టు తెలిసింది. ఇలాగైతే ఏఈవోలు ఎవరి మాట వినాలి, ఏం చేయాలన్న ప్రశ్నలు వస్తున్నాయి. పత్తి విత్తనాల సరఫరా విషయంలోనూ ఈ ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య సమన్వయం లేకపోవడం సమస్యగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇదీ పరిస్థితి.. ⇒ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏటా వానాకాలంలో 14 లక్షల ఎకరాల వరకు వివిధ పంటలు సాగు చేస్తారు. అందులో వరి తర్వాత పత్తిసాగు రెండో స్థానంలో ఉంటుంది. దీంతో వ్యాపారులు ఇక్కడ రైతులకు కాలం చెల్లిన విత్తనాలను అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీటీ–3 విత్తనాలను కూడా విక్రయిస్తున్నారు. ⇒ సంగారెడ్డి జిల్లాలో ఆద్య రకం పత్తి విత్తనాలకు అధిక డిమాండ్ ఉంది. రైతుల డిమాండ్ను ఆసరాగా చేసుకుని విత్తన డీలర్లు అందిన కాడికి దండుకుంటున్నారు. ఈ విత్తన ప్యాకెట్ను రూ.1,800 వరకు విక్రయిస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుత వానాకాలం సీజన్లో సంగారెడ్డి జిల్లాలో 3.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని.. ఇందుకోసం 7.20 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని అంచనా వేశారు. ఈ నెల 29వ తేదీ వరకు అందుబాటులోకి వచి్చన విత్తన ప్యాకెట్లు 3.76 లక్షలు మాత్రమే. తమకు అవసరమైన రకం లేకపోవడంతో రైతులు ఇతర విత్తనాలు కొనడం లేదు. ⇒ యాదాద్రి భువనగిరి జిల్లాలో చాలా చోట్ల బ్రాండెడ్ పత్తి విత్తనాలు బ్లాక్ మార్కెట్కు తరలాయి. వ్యాపారులు లైసెన్స్ లేకుండా లూజ్ విత్తనాలు అమ్ముతున్నారు. ఈ జిల్లాలో 1.35 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని.. 2.70 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు 1.45 లక్షల ప్యాకెట్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. అందులోనూ తమకు అవసరమైన రకాలు, కంపెనీల విత్తనాలను అందుబాటులోకి తేవాలని రైతులు కోరుతున్నారు. ⇒ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1.10లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని, 2.20 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని అంచనా. కానీ ఇప్పటివరకు 1.20 లక్షల ప్యాకెట్లు మాత్రమే జిల్లాకు వచ్చాయి. ⇒ నల్లగొండ జిల్లాలో 5.40 లక్షల ఎకరాలకుపైగా పత్తి సాగవుతుందని అంచనా వేశారు. 15 లక్షలకుపైగా విత్తన ప్యాకెట్లు అవసరమంటూ వ్యాపారులు ఇండెంట్లు పెట్టారు. అందులో ఇప్పటివరకు 4 లక్షల ప్యాకెట్లు విత్తన దుకాణాల్లో అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. అందులో రైతులు కోరుకునే రకాలు, బ్రాండ్లు మాత్రం కనిపించడం లేదు. ⇒ ఖమ్మం జిల్లాలో 2 లక్షలకుపైగా ఎకరాల్లో పత్తి సాగుకు వ్యవసాయశాఖ ప్రణాళిక రూపొందించింది. 4.50 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని అంచనా వేసింది. అయితే రైతులు కోరుకుంటున్న విత్తనాలు మాత్రం కనిపించడం లేదు. ఇక్కడి రైతులు యూఎస్ 7067 రకం విత్తనాలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రకం విత్తనాలు గత ఏడాది మంచి దిగుబడులు ఇచ్చాయని అంటున్నారు. కానీ దుకాణాల్లో ఆ రకం విత్తనాలు దొరకడం లేదు. ⇒ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈసారి 5.67 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని వ్యవసాయాధికారుల అంచనా. ఇందుకోసం 11.34 లక్షలకుపైగా విత్తన ప్యాకెట్లు కావాలి. ఇప్పటివరకు డీలర్లు, వ్యాపారులకు చేరినది 8 లక్షల ప్యాకెట్లు మాత్రమే. చాలా చోట్ల రైతులకు అవసరమున్న రకాల విత్తనాలు అందుబాటులో ఉండటం లేదు. ఉన్నా ఒక్కో ప్యాకెట్ను రూ.864కు బదులుగా రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు విక్రయిస్తున్నారని రైతులు వాపోతున్నారు. యూఎస్ 7067 రకం లేవంటున్నారు యూఎస్ 7067 రకం పత్తి విత్తనాలు వేస్తే దిగుబడి బాగా వస్తుంది. ఈ కాయల నుంచి పత్తి తీయడం సులువు. గులాబీ రంగు పురుగు ఉధృతి ఉండదు. ఎకరాకు కనీసం 10 క్వింటాళ్లపైన దిగుబడి వస్తుంది. తక్కువ సమయంలో దిగుబడి వస్తుంది. దీన్ని తీసేశాక రెండో పంటగా మొక్కజొన్న వేసుకోవచ్చు. కానీ మార్కెట్లో ఈ రకం విత్తనాలు లేవంటున్నారు. – నునావత్ కిషోర్, రైతు, పీజీ తండా, దుగ్గొండి మండలం, వరంగల్ జిల్లా పోయినేడు దిగుబడి బాగా వచి్చంది.. మళ్లీ అదే వేస్తం నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. గత ఏడాది రాశి 659 రకం పత్తి విత్తనాలు సాగు చేస్తే.. ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి వచి్చంది. అందుకే ఆ రకం విత్తనాలు వచ్చే వరకు వేచి చూసిన. స్టేషన్ఘన్పూర్ ఎరువుల దుకాణంలో ఒక్కో ప్యాకెట్ రూ.864 చొప్పున 4 ప్యాకెట్లు కొన్నా. దిగుబడి ఎక్కువ రావడంతో పాటు చీడపీడల నుంచి తట్టుకునే శక్తి ఈ విత్తనాలకు ఉంది. – కత్తుల కొమురయ్య, రైతు, ఇప్పగూడెం, స్టేషన్ఘన్పూర్ మండలం, జనగాం జిల్లా -
ఆదిలాబాద్ జిల్లాలోని విత్తన గౌడౌన్లలో తనిఖీలు
-
అన్నదాత అడిగేదొకటి..మార్కెట్లో ఉన్నదొకటి..
సాక్షి, హైదరాబాద్: అధిక దిగుబడులు వచ్చే పత్తి విత్తనాల కోసం రైతులు కోరుతుంటే.. ఆ విత్తనాలు అందుబాటులో లేకుండా ఇతర కంపెనీల విత్తనాలు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. తమకు కావాల్సిన విత్తనాల కోసం రైతులు రాష్ట్రంలో పలుచోట్ల భారీ క్యూలలో నిలబడాల్సి వస్తోంది. కొన్నిచోట్ల రాస్తారోకోలు సైతం చేస్తున్నారు. డిమాండ్ ఉన్న విత్తనాలను సరఫరాలో చేయడంలో వ్యవసాయ శాఖ అధికారులు చేతులెత్తేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు కోరుకునే పత్తి విత్తనాలకు కొరత ఏర్పడింది. డిమాండ్ ఉన్న విత్తనాలను కొందరు వ్యాపారులు బ్లాక్ చేస్తున్నారన్న విమర్శలున్నాయి. విత్తనాల కొరత లేదని చెబుతున్న అధికారులు... డిమాండ్ ఉన్న విత్తనాల కొరత విషయంలో పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. రైతులు పెద్దగా కొనుగోలు చేయని విత్తనాలకు సంబంధించి ఆయా కంపెనీల నుంచి కొందరు అధికారులు వాటిని మార్కెట్లో ప్రోత్సహిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. వాస్తవానికి ఏ రకం విత్తనాలకు డిమాండ్ ఉంటుందో వ్యవసాయశాఖకు తెలుసు.. కానీ వాటిని మార్కెట్లో ఎందుకు అందుబాటులో ఉంచలేదో అధికారులు చెప్పాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సీజన్ ముంచుకొస్తున్నా...రుతుపవనాలు త్వరలోనే రాష్ట్రాన్ని తాకనున్నాయి. చినుకు పడితే చాలు రైతులు తక్షణమే పత్తి విత్తనాలు చల్లేస్తారు. ఇప్పుడు రైతులకు అత్యంత కీలకమైనవి పత్తి విత్తనాలే. ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లనే ఈ ఇబ్బందులు వస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీజన్ ప్రారంభానికి ముందుగా అధికారులు ప్రణాళిక రచించలేదు. రాష్ట్రంలో ఈసారి 55 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేయగా, అందుకోసం 1.26 కోట్ల విత్తన ప్యాకెట్లు సిద్ధం చేయాలని భావించారు. గురువారం నాటికి 68.16 లక్షల ప్యాకెట్లు మాత్రమే అందుబాటులో ఉంచారు. అయితే, మిగతా ప్యాకెట్లు కూడా వచ్చే నెల 5 నాటికి జిల్లాలకు చేరతాయని, అందువల్ల కొరతే లేదని వ్యవసాయశాఖ చెబుతోంది. ఇతర కంపెనీల విత్తనాలనూ కొనుగోలు చేసుకోవాలని పిలుపునిస్తున్న అధికారులు.. దిగుబడికి గ్యారంటీ ఇవ్వగలరా అని రైతులు నిలదీస్తున్నారు. దిగుబడి తక్కువ వస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. నకిలీ విత్తనాల ప్రవాహం...ప్రభుత్వం అవసరమైన పత్తి విత్తనాలను అందుబాటులో ఉంచకపోవడంతో ఇదే అదనుగా భావించిన విత్తన దళారులు మూకుమ్మడిగా నకిలీ విత్తనాలను అన్నదాతకు అంటగడుతున్నారు. నిషేధిత హెటీ కాటన్ (బీజీ–3) విత్తనాలను గుజరాత్, మహారాష్ట్ర నుంచి తెలంగాణ జిల్లాలకు తరలించారు. ప్రభుత్వం టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసినా నకిలీ విత్తనాల బెడద వేధిస్తూనే ఉంది. ఇదిలావుంటే, పచ్చిరొట్ట విత్తనాలను కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచలేదు. 1.38 లక్షల ఎకరాల విస్తీర్ణానికి సరిపోయే మొత్తం 1.41 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలైన డయాంచ, సన్హెంప్, పిల్లి పెసర విత్తనాలను అందుబాటులో ఉంచాలి. కానీ ఇప్పటివరకు కేవలం 79 వేల క్వింటాళ్లు మాత్రమే జిల్లాలకు చేరాయి. వ్యవసాయశాఖ లోని ఉన్నతాధికారుల మధ్య సమన్వయ లేమి ఈ సమస్యకు కారణమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఒక ఉన్నతాధికారి ఎరువుల దుకాణాలను రోజూ పరిశీలించాల ని వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో)ను ఆదేశిస్తుంటే... మరో ఉన్నతాధికారి మాత్రం అలా చేయొద్దని, తాను చెప్పినట్లుగా రైతుల వద్దకు వెళ్లి వారికి సలహాలు ఇవ్వాలని చెబుతున్నారు. ఒక ఏఈవోను ఇద్దరు ఉన్నతాధికారులు వేర్వేరుగా ఆదేశిస్తూ మరింత గందరగోళపరుస్తున్నారని వ్యవసాయ ఉద్యోగుల సంఘం నేత ఆరోపించారు. ఐదో తేదీ నాటికి మిగతా పత్తి విత్తనాలుమంత్రి తుమ్మల నాగేశ్వర్రావు రాష్ట్రంలో విత్తనాల కొరత లేదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చెప్పారు. ఈ మేరకు ఆయన విత్తన కంపెనీలతో సమీక్ష నిర్వహించారు. ఎక్కడైనా రైతులు ఎక్కువ సంఖ్యలో వచ్చినట్లైతే, కౌంటర్లు ఎక్కువ ఏర్పాటు చేయాలని, కలెక్టర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. రాష్ట్రంలో గతవారంలో కురిసిన వర్షాలకు రైతులు దుక్కులు చేసుకొని సిద్ధంగా ఉన్నారని, అందువల్ల విత్తన కంపెనీలన్నీ ప్రణాళిక ప్రకారం మిగతా పత్తి విత్తన ప్యాకెట్లను జూన్ 5 కల్లా జిల్లాలకు చేరవేయాలని చెప్పారు. కొన్ని జిల్లాల్లో.. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఒక కంపెనీ విత్తనాలనే రైతులందరూ కోరుతున్నారని, అన్ని విత్తనాల దిగుబడి ఒక్కటేనని ఆయన వివరించారు. రాష్ట్రంలో విత్తనాల కొరత లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి కూడా అన్నారు. -
విత్తనాలను బ్లాక్మార్కెట్కు తరలిస్తే పీడీయాక్ట్
సాక్షి, హైదరాబాద్: విత్తనాలను బ్లాక్ మార్కెట్కు తరలించి, కృత్రిమ కొరతను సృష్టించే వ్యాపారులపై పీడీ చట్టం కింద కేసులను నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో వానాకాలం పంటలకు విత్తనాల సరఫరా, జూన్ 2వ తేదీన జరిపే రాష్ట్ర అవతరణ ఉత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో ఆమె గురువారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జీఏడీ, వ్యవసాయ శాఖల కార్యదర్శి రఘునందన్రావు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సీఎస్ మాట్లాడుతూ వానాకాలానికి సంబంధించి గత సంవత్సరం కన్నా అధిక మొత్తంలో వివిధ రకాల పంట విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. విత్తనాల విషయంలో ఆందోళన చెందవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో అధిక డిమాండ్ ఉన్న పత్తి, సోయా, మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాలు సరిపడా ఉన్నాయని వివరించారు. వీటితోపాటు జీలుగ విత్తనాలు కూడా కావాల్సినంతగా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. విత్తన వ్యాపారుల గోదాములు, దుకాణాలను తనికీ చేయించాలని కలెక్టర్లను ఆదేశించారు. దీనితోపాటు, గోదాములు, విత్తన విక్రయ కేంద్రాలవద్ద పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను నియమించాలని సూచించారు. రైతులతో సమావేశమై, సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వారిలో విశ్వాసం కల్పించాలన్నారు. ఇతర రాష్ట్రాలనుంచి రైతులు వచ్చి ఇక్కడి విత్తనాలు కొనుగోలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్లతో పతాకావిష్కరణతెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ రెండవ తేదీన జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో కలెక్టర్లు జాతీయ జెండాను ఆవిష్కరించాలని సీఎస్ శాంతికుమారి స్పష్టం చేశారు. రాష్ట్ర అవతరణ కోసం అమరులైన వారికి నివాళులు అర్పించిన అనంతరం కలెక్టర్లు జాతీయ పతాకావిష్కరణ చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను, ఇతర ప్రముఖులను, జిల్లా అధికారులను ఆహ్వానించాలన్నారు. రాష్ట్ర స్థాయిలో పరేడ్ గ్రౌండ్స్లో జరిగే కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమంలో అమర వీరులైన వారి కుటుంబ సభ్యులకు, ఉద్యమ కారులకు జిల్లా కలెక్టర్ల ద్వారా ఆహ్వానం పంపుతున్నట్లు తెలిపారు. -
బోరు చుట్టూ.. ఇంకుడుగుంత నిర్మించడం ఎలా?
చిరుధాన్యాలను రోజువారీ ఆహారంలో ఎంతో కొంతైనా భాగం చేసుకోవాలని భారతీయ వైద్యపరిశోధనా మండలికి అనుబంధంగా ఉన్న జాతీయ పోషకాహార సంస్థ ఇటీవల విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలలో భారతీయులకు స్పష్టమైన సూచన చేసింది. గత ఏడాది అంతర్జాతీయ చిరుధాన్యాల దినోతవ్సం జరుపుకున్న నేపథ్యంలో ఇప్పటికే చిరుధాన్యాలను అన్నంగానో, అంబలిగానో స్నాక్స్గానో తీసుకునే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. చిరుధాన్యాలకు గిట్టుబాటు ధర లభిస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో చిరుధాన్యాల సాగుపై రైతులు మక్కువ చూపుతున్న ఈ నేపథ్యంలో చిరుధాన్యాల విత్తనాల సమాచారం పొందుపరుస్తున్నాం..హైదరాబాద్ రాజేంద్రనగర్లో...జొన్న, సజ్జ, కొర్ర, అండుకొర్ర, సామ, ఊద విత్తనాలు హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్లోని భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్)లో రైతులకు అందుబాటులో ఉన్నాయి. రకాన్ని బట్టి కిలో విత్తనాల ధర రూ. 100 నుంచి 200 వరకు ఉంటుంది. రైతులు స్వయంగా వెళ్లి ఐఐఎంఆర్ కార్యాలయంలో కొనుక్కోవాలి. వివరాలకు.. 040–24599305 నంబరులో సంప్రదించవచ్చు.పాలెంలో...నాగర్కర్నూల్ జిల్లాపాలెంలోని ్ర΄ాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో అనేక ఇతర పంటల విత్తనాలతోపాటు చిరుధాన్యాల విత్తనాలు కూడా రైతులకు విక్రయిస్తున్నారు.పాలెం పచ్చజొన్న–1 (3 కేజీలు–రూ.450), తెలంగాణ తెల్ల జొన్న (3 కేజీలు–రూ.270), రాగి (3కేజీలు– రూ.150), సజ్జ (2 కేజీలు–రూ.200), కొర్ర (2 కేజీలు–రూ.130) విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. వివరాలకు మురళిని 94904 09163 నంబరులో సంప్రదించవచ్చు.ఆంధ్రప్రదేశ్లో...నంద్యాలలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో జొన్న, రాగి విత్తనాలు ఉన్నాయి. డాక్టర్ నర్సింహులును 79810 85507 నంబరులో సంప్రదించవచ్చు. అనంతపురంలోని వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో సజ్జ విత్తనాలు ఉన్నాయి. డాక్టర్ మాధవీలతను 79819 29538 నంబరులో సంప్రదించవచ్చు. పెరుమాళ్లపల్లె వ్యవసాయ పరిశోధనా స్థానంలో రాగి విత్తనాలు ఉన్నాయి. ఎం. శ్రీవల్లిని 93987 95089 నంబరులో సంప్రదించవచ్చు. విజయనగరం వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో రాగి విత్తనాలు ఉన్నాయి. డా. ఎన్. అనూరాధను 85002 04565 నంబరులో సంప్రదించవచ్చు. ఇదిలా ఉండగా, ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఈ ఖరీఫ్కు ఇతరత్రా పంట విత్తనాతోపాటు 721 క్వింటాళ్ల రాగి, 146 క్వింటాళ్ల కొర్ర, 6 క్వింటాళ్ల సామ, ఒక క్వింటా ఊద విత్తనాలను 26 జిల్లాల్లో రైతులకు సబ్సిడీపై పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.బోరు చుట్టూ ఇంకుడుగుంత నిర్మించడం ఎలా?ఈ ఏడాది అధిక వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో వాననీటి సంరక్షణకు ఉపక్రమిద్దాం. పొలాల్లో, గేటెడ్ కమ్యూనిటీల్లో, అపార్ట్మెంట్లు / ఇళ్ల దగ్గర ఉన్న బోర్ల చుట్టూతా ఇంకుడు గుంతలు తీయించుకుందాం.బోరు రీచార్జ్ గుంతను నిర్మించుకుంటే.. వర్షపు నీటిలో 40–50% వరకు భూమి లోపలికి ఇంకింపజేసుకోవచ్చని భూగర్భ జల నిపుణులు, సికింద్రాబాద్లోని వాటర్ అండ్ లైవ్వీహుడ్స్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.వి. రామమోహన్ (94401 94866) సూచిస్తున్నారు. మరింత సమాచారం కోసం, సంబంధిత వీడియో కోసం ఈ క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయండి.ఇవి చదవండి: Sagubadi: ఈ అతిపొడవైన సజ్జ పేరు.. 'సుల్కానియా బజ్రా'! -
Sagubadi: అరెకరం ఉచిత విత్తనాలకై..
ఈ ఏడు ముందస్తు వానలు కురుస్తున్నాయి. ప్రకృతి శుభసూచనలు చేసింది. ప్రకృతిలో కానుగ చెట్లు ఇగురు పూత విరివిగాను, నేరేడు చెట్లు గుబురుగాను ఉన్నాయి. మే నెలలోనే తొలకరి వానలకు ప్రకృతి నాంది పలికింది. వానకు ΄÷లంలో ఉన్న కలుపు విత్తనాలు మొలుస్తాయి. ఆరుద్ర కార్తె నుంచి పంటలు సాగు చేయటానికి అనుకూలంగా ఉండాలంటే భూమిని వారం, పది రోజుల వ్యవధిలో ఒకటికి రెండుసార్లు తేలిక΄ాటి సేద్యం చేయాలి (దుక్కి దున్నాలి). ఇలా చేస్తే మట్టిలోని గడ్డి గింజలన్నీ మొలిచి ఆరుద్ర నాటికి 80 శాతం కలుపు మొక్కలు చని΄ోతాయి. ఆ తర్వాత పంట వేసుకుంటే కలుపు సమస్య పెద్దగా వేధించదు. అయితే, చాలా మంది రైతులు ఒకేసారి ఇరుసాలు సేద్యం (దుక్కి) చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మొదటి దుక్కికి భూమిపైన ఉన్న గడ్డి విత్తనాలు మట్టి కిందకు వెళ్తాయి. వానలు పడిన వెంటనే కలుపు మొలుస్తుంది. అయినా, ఇంకా కలుపు విత్తనాలు కొన్ని మట్టిలో మిగిలే ఉంటాయి. మొదటి దుక్కి నుంచి రెండోసారి దుక్కి చేయటానికి కనీసం ఒక వారం, పది రోజుల సమయం ఇవ్వాలి. లేక΄ోతే మన పంటకు కలుపు ఎక్కువ వస్తుంది. పంట దిగుబడి తగ్గుతుంది.ఈ విధంగా కలుపు నివారణ కోసం రెండు సార్లు సేద్యం (రెండు దుక్కులు) చేయక΄ోతే కూలీల ఖర్చు ఎక్కువగా ఉంటుంది. చాలా మంది రైతులు కొర్ర చేనులో కూడా కలుపు మందులు పిచికారీ చేస్తున్నారు. దీని వల్ల దిగుబడి బాగా తగ్గుతుందని గుర్తించండి. చిరుధాన్యాలు సాగు చేసే రైతులు వారం, పది రోజుల వ్యవధిలో రెండు సార్లు తేలిక ΄ాటి సేద్యం (దుక్కి) చేసి కలుపు నిర్మూలన చేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది.అరెకరానికి ఉచితంగా విత్తనాలు..కొర్రలు, అండుకొర్రలు, అరికెలు, ఊదలు, సామల సాగును పెంపొందించే లక్ష్యంతో కొత్తగా సిరిధాన్యాలు సాగు చేయదలచిన కొందరు రైతులకు అరెకరానికి సరి΄ోయే (5 రకాలు ఒక్కో రకం అర కేజీ చొప్పున) 2.5 కిలోల విత్తనాలను ఉచితంగా ఇస్తాను. ట్రాన్స్΄ోర్ట్ ఖర్చులు వారే భరించాలి (గమనిక: సిరిధాన్యాల సేంద్రియ సాగుపై సందేహాల నివృత్తి కోసం, విత్తనాల కోసం ఏపీ వారు ఉ. 5–30 గం. నుంచి సా. 7.30 గం. వరకు.. తెలంగాణ వారు సా. 7 గం. నుంచి రాత్రి 8.30 వరకు ఫోన్ చేయొచ్చు). విజయకుమార్: 98496 484985 రకాలను అంతటా పండించాలి..చిరుధాన్యాల సాగు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అన్ని జిల్లాల్లో పెరుగుదల బాగానే ఉంటుందనిపిస్తోంది. ఈ మధ్యన చిరుధాన్యాల ధర విపరీతంగా పెరిగింది. ఉదాహరణకు.. బరిగె ధాన్యం టన్నుకు రూ. 65 వేలు పలుకుతోంది. బరిగె బియ్యం కిలో రూ. 90–100 పలుకుతోంది. కోస్తా ఆంధ్ర జిల్లాలో పెద్ద సామ విరివిగా సాగు చేస్తున్నారు. రాయలసీమ జిల్లాల్లో కొర్ర పంట మాత్రమే సాగు చేస్తున్నారు.కర్ణాటక జిల్లాల్లో అరిక కొంత మేర సామ, ఊద సాగు చేస్తున్నారు. కొన్ని ్ర΄ాంతాల్లో మాత్రమే అండుకొర్రలు సాగవుతున్నాయి. ఐదు రకాల సిరిధాన్యాల బియ్యం కావాలంటే అన్నీ ఒక చోటకు చేర్చాలంటే రవాణా ఖర్చు ఎక్కువ అవుతున్నది. ఈ రోజు మార్కెట్లో చిరుధాన్యాల బియ్యం ధరలు పేదలు తినేటట్టు లేవు. అందుకే కొర్ర, అరిక, సామ, ఊద, అండుకొర్ర ఈ ఐదు రకాల సిరిధాన్యాలను అన్ని ్ర΄ాంతాల్లోనూ సాగులోకి తేవాలి.ఆరుద్రలో అరిక విత్తాలి..పెద్ద రైతులు ఒకసారి ఆలోచన చేయండి. చిరుధాన్యాలు సాగు చేస్తే రసాయన ఎరువులు, పురుగుమందుల ఖర్చులు తగ్గి భూసారం పెరుగుతుంది. అరిక పంట ఆరుద్ర కార్తెలో మిశ్రమ పంటగా సాగు చేసుకుంటే బాగుంటుంది. 6 సాళ్లు అరిక ఒక సాలు కంది.. 6 సాళ్లు అరిక, ఒక సాలు ఆముదాలు విత్తుకోవాలి. ఇందులో అలసందలు, అనుములు, నల్లపెసలు, గోగులు, సీతమ్మ జొన్న సాగు చేస్తే చాలా బాగుంటుంది.ఊద పంట 110–120 రోజులు, అండుకొర్ర పంట 105–115 రోజులు, సామ పంట 110 రోజులు, కొర్ర పంట 75–80 రోజుల వరకు ఉంటుంది. వానలు బాగా పడుతున్నందు వలన అన్ని రకాలు సాగు చేయవచ్చు. నీటి ఆధారం కింద రెండు లేదా మూడు పంటలు సాగు చేయవచ్చు. చిరుధాన్యాల సాగులో తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడి రావాలంటే.. రసాయనిక ఎరువులు వేయటం మానివేసి.. పశువుల ఎరువు, చెరువు మట్టి వేయటంతో ΄ాటు గొర్రెలను మళ్లించటం (మంద కట్టటం), అలాగే ఏగిలి మార్చటం (పంట మార్పిడి) వంటి పనులు చేయాలి. – కొమ్మూరి విజయకుమార్, సృష్టి సమ్మాన్ పురస్కార గ్రహీత, వేంపల్లె మం, టి.వెలమవారిపల్లె, వైఎస్సార్ కడప జిల్లా. -
నేరేడు పండ్లు తింటే, పిల్లలు నల్లగా పుడతారా? మీరు మాత్రం బీ కేర్ఫుల్
ప్రకృతిలో ఏ సీజన్లో వచ్చే పండ్లను ఆసీజన్లో తినడం ఆరోగ్యానికి చాలామంచింది. ప్రస్తుతం అల్లనేరేడు పండ్ల సీజన్ వచ్చేసింది. ప్రకృతి సిద్ధంగా లభించే ఈ పండ్లు తియ్యగా, పుల్లగా రుచికరంగా ఉంటాయి. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు , కేన్సర్ , కాలేయ సంబంధ వ్యాధుల్ని నివారించే ఎన్నో ఔషధగుణాలున్నాయి. అల్లనేరేడు పండ్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.. ముఖ్యంగా షుగర్ వ్యాధి గ్రస్తులకు చాలామంచిదని చెబుతారు.అల్ల నేరేడు పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అధిక మూత్ర విసర్జన, దప్పిక వంటి డయాబెటిస్ లక్షణాలను అల్ల నేరేడు పండ్లు తగ్గిస్తాయి. దీన్ని శాస్త్రీయంగా సిజిజియం క్యుమిని అని పిలుస్తారు, ఇది భారత ఉపఖండానికి చెందిన ఫలాలను ఇచ్చే చెట్టు. జంబోలన్ లేదా జామున్ అని కూడా పిలుస్తారు. సాధారణంగా మే , జూలై నెలల మధ్య వేసవి నెలలలో పండ్లు ఎక్కువగా వస్తాయి. నేనేడు పండు మాత్రమే కాదు, విత్తనాలు, ఆకుల్లో కూడా ఔషధ గుణాలున్నాయి. పండు: పండ్ల రూపంలో తాజాగా లేదా జామ్లు, జ్యూస్లా ప్రాసెస్ చేసిన రూపాల్లో విస్తృతంగా వినియోగిస్తారు.విత్తనాలు: గింజలు నూనెను తీయడానికి ఉపయోగిస్తారు.ఆకులు, విత్తనాలు ఆయుర్వేద ఔషధాలు, మూలికల తయారీలలో ఉపయోగిస్తారు.నేరేడు పండులో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, విటమిన్ సి, విటమిన్ బి సహా అనేక పోషకాలున్నాయి. నేరేడు పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.అల్ల నేరేడు ప్రయోజనాలునేరేడు పండ్లు శరీరానికి చలువ చేస్తాయి. నీరసంగా ఉన్నప్పుడు నేరెడు పండ్లను తింటే తక్షణం శక్తి వస్తుంది. డయాబెటిక్ రోగులు రోజూ నేరేడు పండ్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది.ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి.మహిళలకు రుతుస్రావం అధికంగా అయితే నేరేడు గింజల పొడిని కషాయంగా చేసుకొని చెంచాడు తాగితే మంచిదినేరేడు పండు ఊబకాయాన్ని తగ్గిస్తుంది. ఫైబర్ ఎక్కువ.నేరేడు పండ్లలోని యాంటీ అక్సిడెంట్లు కాలేయ పనితీరును మెరుగు పర్చడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. నేరెడు పండ్లలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. నేరేడు పండ్లు చిగుళ్ల వ్యాధులను నివారిస్తుంది. అపోహనేరేడు పండ్లు గర్భిణీ స్త్రీలు తినకూడదని అపోహ ప్రచారంలో ఉంది. వాస్తవానికి దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. నేరేడు పండ్లు తింటే పుట్టబోయే పిల్లలు నల్లగా పుడతారని, వారి చర్మంపై నల్లటి చారలు ఏర్పడుతాయనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని వైద్యులు అంటున్నారు. నిజానికి ఈ పండ్లలో కాల్షియం, విటమిన్-సి, పొటాషియం, మినరల్స్ పుట్టబోయే శిశువు ఎముకలు పటిష్టపరచడానికి సహాయపడతాయి.ఎవరు తినకూడదంటే...నేరేడు పండ్లు అధికంగా తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. అలాగే రక్తంలోని చక్కెర స్థాయి కూడా తగ్గుతుంది. కాబట్టి ఆపరేషన్లకు ముందు, తర్వాత తినకపోవడం ఉత్తమం.అతిగా తినడం వల్ల లోబీపీ వచ్చే అవకాశం ఉంది. నేరేడు పండ్లు తిన్న తర్వాత పసుపు వేసిన పదార్థాలు, పచ్చళ్లు కూడా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.ఖాళీ కడుపుతో నేరేడు పండ్లను అస్సలు తినకూడదు. లేదంటే వికారం, వాంతులతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అయితే ఇవి తిన్న వెంటనే పాలు మాత్రం తాగకూడదని అంటున్నారు. చర్మ సమస్యలు ఉన్న వారు వీటిని తినడం వల్ల అలర్జీలు ఎక్కువవుతాయని చెబుతారు. -
ఎరువులు, విత్తనాల సరఫరాలో సమస్య రావొద్దు
సాక్షి, హైదరాబాద్: ఎరువులు, విత్తనాల సరఫరాలో ఎక్కడా కూడా రైతులకు ఆటంకం రాకుండా చూడాలని, ఎప్పటికప్పుడు దీనిపై సమాచారం సేకరించాలని అధికారులకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. వానాకాలంలో ఇప్పటికే 6.26 లక్షల టన్నుల యూరియా, 0.76 లక్షల టన్నుల డీఏపీ, 3.84 లక్షల టన్నుల కాంప్లెక్స్, 0.29 లక్షల టన్నుల ఎంవోపీ ఎరువులను అందుబాటులో ఉంచామని వివరించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 50,942 క్వింటాళ్ల జీలుగు, 11,616 క్వింటాళ్ల జనుము, 236 క్వింటాళ్ల పిల్లి పెసర విత్తనాలు అందుబాటులో తెచ్చామన్నారు.మరో 30, 400 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. శుక్రవారం తెలంగాణ సచివాలయంలో రైతులకు సబ్సిడీపై సరఫరా చేస్తున్న పచి్చరొట్ట ఎరువుల విత్తనాల పంపిణీ, మార్కెట్లలో అందుబాటులో ఉంచిన పత్తి ప్యాకెట్లు, అమ్మకాలు, సన్నరకాల లభ్యతపై అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఒకేసారి పచి్చరొట్ట విత్తనాలకు డిమాండ్ ఏర్పడిందని, అయినా సకాలంలో అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ఆయా కంపెనీల గతేడాది బకాయిల విడుదలకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నేడు వ్యవసాయ వర్సిటీలో విత్తనమేళా 13.32 లక్షల క్వింటాళ్ల సన్న రకాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. దీనిపై శనివారం రాజేంద్రనగర్ వ్యవసాయ వర్సిటీ ఆధ్వర్యంలో విత్తన మేళాను నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో సన్నసాగును ప్రోత్సహించడం తమ ప్రభుత్వ ఉద్దేశమని, దానికనుగుణంగా తొలివిడతగా వీటికి రూ. 500 బోనస్ ప్రకటించామని, అధికారులు దీనిపై రైతుల్లో అవగాహన కలి్పంచాలని ఆదేశించారు. త్వరలో రైతు సంఘాలతో సమావేశం త్వరలోనే రాష్ట్రస్థాయిలో వివిధ రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. సచివాలయంలో శుక్రవారం తుమ్మలతో అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వే‹Ùరెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వానాకాలం రైతు భరోసా, పంటల బీమా విధివిధానాలపై మంత్రితో చర్చించారు. -
సన్న విత్తనాలు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: సన్న రకం ధాన్యానికే బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వానాకాలం సీజన్కు ముందు రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆ విత్తనాల కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వివిధ సన్న రకాల విత్తనాలను రైతులకు అందజేసేందుకు రంగం సిద్ధం చేసింది. మరోవైపు సన్నాలతో పాటు రైతులకు వివిధ రకాల నాణ్యమైన విత్తనాలను విక్రయించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో శుక్రవారం (24న) వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విత్తన మేళా నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. మేళాలో వ్యవసాయ వర్సిటీతో పాటు రాజేంద్రనగర్ పరిధిలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి సంస్థలు ఐఐఓఆర్, ఐఐఎంఆర్,ఐఐఆర్ఆర్, ఉద్యాన, పశు వైద్య విశ్వవిద్యాలయం, వ్యవసాయ, ఉద్యాన అనుబంధ శాఖలు టీఎస్ఎస్డీసీ, ఎన్ఎస్సీ, టీఎస్ఎస్ఓసీఏలు పాల్గొననున్నాయి. అదే రోజున విశ్వవిద్యాలయ పరిధిలోని మూడు (జగిత్యాల, పాలెం, వరంగల్) ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాలు, అలాగే వర్సిటీ పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రాలలో కూడా విత్తన మేళా నిర్వహించనున్నారు. వర్సిటీ ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు మేళా ప్రారంభం కానుంది. విత్తనాలతో పాటు వర్సిటీ రూపొందించిన వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులు రైతుల కొనుగోలు నిమిత్తం అందుబాటులో ఉంటాయి. మొత్తం 16 పంటలకు సంబంధించిన 67 రకాల విత్తనాలు కూడా ఉంటాయి. మేళాలో భాగంగా వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత వినియోగంపై రైతుల సందేహాలు తీర్చటానికి ఆయా పంటల ప్రధాన శాస్త్రవేత్తలతో చర్చా గోష్టి ఏర్పాటు చేస్తున్నారు. అలాగే రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించటానికి వీలుగా వ్యవసాయ, అనుబంధ రంగాలతో కూడిన వ్యవసాయ ప్రదర్శన కూడా 24న నిర్వహిస్తున్నారు. ఈ 19 రకాలకే బోనస్? విత్తన మేళాలో వ్యవసాయ వర్సిటీలో రూపొందించిన 19 రకాల సన్న వరి విత్తనాలు విక్రయిస్తారు. బి.పి.టి. 5204, డబ్ల్యూ.జి.ఎల్–44, డబ్ల్యూ.జి.ఎల్ –962, డబ్ల్యూ.జి.ఎల్. 1119, డబ్ల్యూ.జి.ఎల్.1246, డబ్ల్యూ.జి.ఎల్ 1487, ఆర్.డి.ఆర్ 1162, ఆర్.డి.ఆర్ 1200, కె.ఎన్.ఎం 1638, కె.పి.ఎస్. 6251, జె.జి.ఎల్– 28545, జె.జి.ఎల్ 27356, జె.జి.ఎల్ 33124, ఆర్.ఎన్.ఆర్.15435, ఆర్.ఎన్.ఆర్– 2465, ఆర్.ఎన్.ఆర్– 11718, ఆర్.ఎన్.ఆర్. 21278, ఆర్.ఎన్.ఆర్. 29325, ఆర్.ఎన్.ఆర్. 15048 రకాలు అందబాటులో ఉంటాయి. అయితే ఈ 19 రకాల సన్న రకం విత్తనాలకే రూ. 500 బోనస్ ఇస్తారా అన్న చర్చ జరుగుతోంది. పైగా ఇవి వ్యవసాయ వర్సిటీ అభివృద్ధి చేసినవి కావడంతో ప్రభుత్వం వీటినే సిఫారసు చేస్తుందన్న ప్రచారమూ జరుగుతోంది. రైతులను సన్నాల వైపు మళ్లించాలన్న ఆలోచనతోనే బోనస్ ప్రకటించిందని అధికారులు చెబుతున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉందని అంటున్నారు. 8 రకాల దొడ్డు విత్తనాలు దొడ్డు గింజలకు సంబంధించి 8 రకాలు.. ఆర్.ఎన్.ఆర్–28361, ఆర్.ఎన్.ఆర్. 15459, కె.ఎన్.ఎం 118, ఎమ్.టి.యు. 1010, డబ్ల్యూ.జి.ఎల్– 915, జె.జి.ఎల్ 24423, జె.జి.ఎల్ 28639 అందుబాటులో ఉంచుతారు. సువాసన కలిగిన రకం ఆర్.ఎన్.ఆర్–2465 కూడా విక్రయిస్తారు. ఇక మొక్కజొన్నలో 5 హైబ్రిడ్లు డి.హెచ్.యం 117, డి.హెచ్.యం 121, బి.పి.సి.హెచ్. 6, కరీంనగర్ మక్క, కరీంనగర్ మక్క–1 ఉంటాయి. జొన్నలో పి.వై.పి.ఎస్–2, సి.ఎస్.వి–41, రాగిలో పి.ఆర్.ఎస్.38, ఆముదంలో పి.సి.హెచ్. 111, నువ్వుల్లో జె.జి.యస్–1020, వేరుశనగలో ధరణి విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నట్లు వ్యవసాయ వర్సిటీ ప్రకటించింది. అలాగే అపరాలకు సంబంధించి పెసరలో డబ్ల్యూ.జి.జి 42, ఎమ్.జి.జి 295, ఎమ్.జి.జి 347, ఎమ్.జి.జి 385, మినుములో యం.బి.జి. 1070, కందిలో 8 రకాలు.. హనుమ, డబ్ల్యూ.ఆర్.జి.ఇ– 97, డబ్ల్యూ.ఆర్.జి.ఇ–93, డబ్ల్యూ.ఆర్.జి.ఇ–121, డబ్ల్యూ.ఆర్.జి.ఇ–255, పి.ఆర్.జి–176, టి.డి.ఆర్.జి–59, ఆశ అందుబాటులో ఉంచుతారు. సోయా చిక్కుడులో 4 రకాలు.. బాసర, కె.డి.ఎస్–726, ఎం.ఎ.యు.యస్–612, ఎ.ఐ.ఎస్.బి–50తో పాటు పశుగ్రాస పంటల విత్తనాలు కూడా అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు. -
Watermelon Seeds Benefits: పుచ్చకాయ గింజల ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు
సాధారణంగా ఏ సీజన్లో దొరికే పండ్లను ఆ సీజన్లో తీసుకోవాలని పెద్దలు, ఆరోగ్య నిపుణులు చెబుతారు. అలాంటి వాటిలో ఒకటివేసవిలో ఎక్కువగా లభించే పుచ్చకాయ. సాధారణంగా పుచ్చకాయ కోసి తినే సమయంలో వాటి గింజలను పారేస్తుంటారు. నిజానికి పుచ్చకాయ గింజల్లోని గుణాలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ఈసారి గింజల్ని అపురూపంగా చూసుకుంటారు. పుచ్చకాయ గింజల వలన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం రండి!పుచ్చకాయ అద్భుతమైన హైడ్రేటింగ్ ఫ్రూట్. ఇందులో 92శాతం నీరే ఉంటుంది. ఇంకా ఖనిజాలు, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి అలాగేదీని గింజలు వివిధ రకాల పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. తక్కువ క్యాలరీలు, జింక్, మెగ్నీషియం, పొటాషియం మొదలైన సూక్ష్మపోషకాలను కలిగి ఉంటాయి. పుచ్చకాయ గింజలు రోగనిరోధక శక్తిని,గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. పుచ్చకాయ గింజల్లోని మిథనాలిక్ సారం అల్సర్లకు వ్యతిరేకంగా అద్భుతంగా పని చేస్తుందని ఎలుకలపై చేసిన అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.తక్కువ కేలరీలుపుచ్చకాయ గింజల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. 4 గ్రాముల బరువున్న కొన్ని విత్తనాలలో 23 కేలరీలు మాత్రమే ఉంటాయి.మెగ్నీషియంజీవక్రియ కార్యకలాపాలకు అవసరమైన పోషకం మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది. ఆరోగ్యకరమైన జీవక్రియను ప్రోత్సహిస్తాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) ప్రకారం, మన శరీరానికి ప్రతిరోజూ 420 గ్రాముల మెగ్నీషియం అవసరం.జింక్ఇందులోని జింక్ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది, జీర్ణక్రియ, కణాల పెరుగుదలలో సహాయపడుతుంది. నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.ఇనుముఇనుము ఎక్కువగా లభిస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) ప్రకారం, ఒక వ్యక్తికి రోజువారీ 18 mg ఇనుము అవసరం. మంచి కొవ్వులుగుడ్ కొలెస్ట్రాల్(మంచి కొవ్వు) మోనోఅన్శాచురేటెడ్ , పాలీఅన్శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయి. ఇవి గుండెపోటు, స్ట్రోక్ను నివారించడానికి ఉపయోగపడుతుంది . కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. నాలుగు గ్రాముల పుచ్చకాయ గింజలు 0.3 గ్రాముల మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలను , 1.1 గ్రాముల పాలీఅన్శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలను అందిస్తాయి. -
రైతులూ.. జాగ్రత్త! విత్తనాల కొనుగోలులో.. ఆఫర్లు చూశారో?
వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ప్యాకెట్లపై ఆకర్షణీయమైన ఫొటోలు, తక్కువ ధరలు ఆఫర్లు చూసి మోసపోవద్దు. నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. విత్తనాల బెడద రైతులకు సవాల్గా మారింది. అసలు ఏదో, నకిలీ ఏదో గుర్తించలేని విధంగా విత్తనాలు మార్కెట్లోకి వస్తుండడంతో రైతులు నష్టపోతున్నారు. స్థానికంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన దుకాణాల్లో మాత్రమే విత్తనాలు కొనాలని చేయాలని వ్యసాయాధికారులు సూచిస్తున్నారు.తక్కువ ధరలు, ఆఫర్లు నమ్మొద్దు.. వర్షాలు పడితే చాలు రైతుల హడావుడి మొదలవుతుంది. రోహిణి కార్తె ప్రారంభం కానున్న నేపథ్యంలో విత్తనాల కోసం రైతులు విత్తన డీలర్ల దుకాణాల వద్ద బారులు తీరుతారు. పలు విత్తన కంపెనీలు డీలర్లకు ఆఫర్లు ప్రకటిస్తాయి. ఆ ఆఫర్ల కోసం డీలర్లు రైతులకు విత్తనాలను అంటగడుతున్నారు. వారి మాటలు నమ్మి మోసపోవద్దు. చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే నకిలీ విత్తనాల బారిన పడకుండా ఉండవచ్చు. ఫొటోలు చూపించి, ఆఫర్ల ఆశ చూపి వివిధ పట్టణాలకు కంపెనీ వారు రైతులను తీసుకుపోవడం, గ్రామాల్లో తిరుగుతూ విత్తన ప్యాకెట్లు బుక్ చేసుకోవడం చేస్తుంటారు. వాటికి దూరంగా ఉండడం మంచిదని వ్యవసా«యాధికారులు పేర్కొంటున్నారు.రైతులు తీసుకోవాలి్సన జాగ్రత్తలు..1. గుర్తింపు పొందిన దుకాణం నుంచి నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేస్తేనే అధిక దిగుబడులు సాధించి లాభాలు పొందే అవకాశం ఉంటుంది.2. విత్తనాలు కొన్న అనంతరం దుకాణం నుంచి తప్పనిసరిగా రశీదు తీసు కోవాలి.3. విత్తనాలు ఏ సంస్థకు చెందినవో ప్యాకెట్పై ఉన్న లేబుల్, లాట్ నంబర్ రశీదుపై నమోదు చేసుకొని, భద్రపర్చుకోవాలి.4. తొలుత విత్తనాలు మొలకెత్తే శాతాన్ని ప్యాకెట్పై చూసి కొనాలి.విత్తనాలపై అవగాహన ఉండాలి..విత్తనాలపై రైతులు అవగాహన ఉండాలి. కొన్న ప్యాకెట్లలో ఉన్న విత్తనాలు ఎంత శాతం మొలకెత్తుతాయో చూసుకోవాలి. రసీదులు, ప్యాకెట్లను భద్రపర్చుకోవాలి. అనుమతి ఉన్న దుకాణాల్లో విత్తనాలు కొనాలి. విత్తనాలు కొనుగోలు సమయంలో నాసిరకమా? అనేది చూసుకోవాలి.– వెండి విశ్వామిత్ర, వ్యవసాయాధికారి, బోథ్ -
విత్తనాలకు వి‘పత్తి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నకిలీ పత్తి విత్తనాలు అన్నదాతను ముంచేస్తున్నాయి. వ్యవసాయశాఖ కొరడా ఝుళిపించకపోవడంతో దళారులు ఇష్టారాజ్యంగా రైతులకు అంటగడుతున్నారు. వానాకాలం పంటల సీజన్ దగ్గర పడుతుండటంతో ఇప్పటికే లక్షలాది మంది రైతుల చెంతకు నకిలీ పత్తి విత్తనాలు చేరినట్లు సమాచారం. దళారుల ఒత్తిడితో కీలక సమయంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటం రైతుల పాలిట శాపంగా మారింది. తూతూమంత్రంగా దాడులు చేస్తున్నారని, కొందరు అధికారులు లంచాలు పుచ్చుకొని దళారులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అధికారులు ఇప్పటివరకు కేవలం రూ.1.19 కోట్ల విలువైన 78 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. అయితే వేలాది క్వింటాళ్ల నకిలీ విత్తనాలు దొంగచాటుగా రైతులకు చేరుతున్నాయి. గుజరాత్, మహారాష్ట్రల నుంచి రాక ఈసారి 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని వ్యవసాయశాఖ అంచనా. మార్కెట్లో ఎంఎస్పీ కంటే అధిక ధర రావడంతో అన్నదాతలు పత్తిపై ఎక్కు వగా ఆసక్తి చూపుతున్నారు. అందుకనుగుణంగా అధికారులు 1.20 కోట్ల విత్తనాల ప్యాకెట్లను రైతుల కు అందుబాటులో ఉంచారు. అయితే, ఇదే అదను గా ఆయా కంపెనీలు నకిలీ, నిషేధిత హెటీ కాటన్ (బీజీ–3) విత్తనాలను గుజరాత్, మహారాష్ట్రల నుంచి తరలించి జిల్లాల్లో దళారులకు అప్పగించా యి. చాలాచోట్ల రైతులకు అంటగట్టాయి. ఈ సీజన్లో వర్షం పడితే మొదటగా వేసేది పత్తే కాబట్టి ఇప్పటికే హెచ్టీ కాటన్ విత్తనాలు సరఫరా అయ్యా యి. గతేడాది ఎన్ని దాడులు చేసినా లక్షలాది ఎకరా ల్లో హెచ్టీ కాటన్ సాగైనట్లు సమాచారం. దీంతో అనేకచోట్ల రైతులు పంట పండక నష్టపోయారు. నకిలీకి లాభమెక్కువ... అదును రాగానే రైతులు గ్రామంలోని షావుకార్ల వద్దనో.. విత్తన వ్యాపారుల వద్దనో అప్పు కింద విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తారు. పంట వచ్చినప్పుడు అప్పు తీర్చేలా ఒ ప్పందం చేసుకుంటారు. ఎలా గూ అప్పు ఇస్తున్నారు కాబట్టి వ్యాపారి ఇచ్చిన విత్తనాలనే రైతు లు తీసుకుంటున్నారు. వీటికి ఎలాంటి రశీదు లు ఉండవు. డీలర్ నిబంధనల ప్రకారం అమ్మితే ఒక విత్తన ప్యాకెట్కు రూ.25–30 లాభం వస్తుంది. అదే బీజీ–3 విత్తన ప్యాకెట్ను విక్రయిస్తే రూ.500, లూజ్గా విక్రయిస్తే కిలోకు రూ.1,200 చొప్పున ఆదాయం సమకూరుతోంది. వ్యవసాయ గణాంకాల ప్రకారం గ్రామాల్లో ప్రతి 100 మంది రైతుల్లో 47 మంది మండల కేంద్రాల్లోని అధికారిక దుకాణల నుంచి విత్తనాలు తీసుకుంటుండగా... 53 మంది షావుకార్లు, ఇతర వడ్డీ వ్యాపారుల వద్ద తీసుకుంటున్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవటంతో రైతులు వడ్డీ వ్యాపారులు, విత్తన వ్యాపారులను ఆశ్రయిస్తున్నట్లు చెబుతున్నారు. రీసైక్లింగ్ విత్తనాలుకొన్ని కంపెనీలు కాలం చెల్లిన విత్తనాలను రీసైక్లింగ్ చేసి కొత్తవని చెప్పి రైతులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నాయి. నాణ్యత లేని విత్తనాల వల్ల సరైన దిగుబడి రాక రైతాంగం నష్టాల ఊబిలో చిక్కుకుంటోంది. వరి, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, ఆవాలు, బఠానీ సహా దాదాపు 30 రకాల పంటలకు సంబంధించి రీసైక్లింగ్ విత్తనాలనే పలు కంపెనీలు సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. ఈ రీసైక్లింగ్ కుంభకోణంలో బహుళజాతి కంపెనీలు కూడా ఉండటం నివ్వెరపరుస్తోంది. రాష్ట్రంలో సరఫరా చేసే వాటిలో 15 నుంచి 20 శాతం వరకు రీసైక్లింగ్ విత్తనాలే ఉంటాయని అంచనా. గతంలో విజిలెన్స్ దాడుల్లో ఈ విషయాలు బయటపడినా చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనకాడుతున్నారు. ఉన్నతస్థాయిలో అండదండలు ఉండటంతో ఈ వ్యవహారం యథేచ్ఛగా సాగిపోతోందని అంటున్నారు. -
Fennel Seeds: సోంపుతో ఇన్ని లాభాలా? ఐతే దీన్ని..!
రెస్టారెంట్లలోనూ, హోటల్లోనూ భోజనం చేశాక సర్వర్ ప్లేటులో సొంపు వేసి పట్టుకొస్తాడు. మనం కూడా నోరు మంచి వాసన వస్తుంది కదా !అని చక్కగా తింటాం. అయితే ఈ సోంపుని ఇలా భోజనం తర్వాత ఎందుకు ఇస్తారో తెలుసా..!. నోరు మంచి వాసన వస్తుందని మాత్రమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయట. భోజనం తర్వాత నోట్లో కాస్త వేసుకోవడం వల్ల చక్కగా ఆహారం జీర్ణం మవుతుంది, పైగా కడుపులో ఎలాంటి అసౌకర్యం లేకుండా చేస్తుంది. అలాంటి సోంపులో ఎలాంటి పోషకాలు ఉన్నాయి, ఎలా ఉపయోగించాలి తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందాం.! కడుపులో అసౌకర్యాన్ని నివారిస్తుంది.. సోంపు గింజలను నేరుగా తినడంతో పాటు వీటితో చేసిన నీటిని తాగడం వల్ల కూడా మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. సోంపు గింజల నీరు రిఫ్రెషింగ్ పానీయంగా పని చేయడంతో పాటు దీనిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సోంపు గింజల నీరు తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కడుపు నిండుగా భోజనం చేసిన తరువాత వచ్చే అసౌకర్యాన్ని తగ్గించడంలో సోంపు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. సోంపు గింజల నీటిని తాగడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. సోంపు గింజల నీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గి స్లిమ్గా అవ్వుతారు బరువు తగ్గుతాం.. సోంపు గింజల నీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే ఈ సొంపు నీటిని తాగడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. దీంతో మనం ఆహారం తీసుకునే మోతాదు తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునే వారు సోంపు గింజల నీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఈ నీటిలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. సోంపు గింజల నీటిని తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వాతావరణ మార్పుల కారణంగా వచ్చే ఫ్లూ, జలుబు వంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడడంలో ఈ నీరు మనకు ఎంతో దోహదపడుతుంది. మధుమేహం అదుపులో ఉంటుంది.. అదే విధంగా సోంపు గింజలల్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. సోంపు గింజలతో చేసిన నీటిని తాగడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది. వయసు పైబడడం వల్ల వచ్చే కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే సోంపు గింజల నీటిని తాగడం వల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. మధుమేహం లేదా ఫ్రీడయాబెటిక్ లక్షణాలతో బాధపడే వారు సోంపు గింజల నీటిని తాగడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా స్త్రీలు సోంపు గింజల నీటిని తీసుకోవడం వల్ల నెలసరి సమయంలో వచ్చే అసౌకర్యం నుంచి చక్కటి ఉపశమనం కలుగుతుంది. గర్భాశయ కండరాలను సడలించి నెలసరి సమయంలో నొప్పిని తగ్గించే సోంపు గింజలకు ఉంది. చర్మం ఆరోగ్యం.. ముఖ్యంగా స్త్రీలు క్రమం తప్పకుండా సోంపు గింజల నీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. నోట్లో ఉండే బ్యాక్టీరియా నశించడంతో పాటు నోటి దుర్వాసన తగ్గుతుంది. ఈ సోంపు గింజల నీటిని తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దీనిలో ఉండే యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు ఫ్రీరాడికల్స్ తో పోరాడి చర్మ కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఈ నీటిని తాగడం వల్ల మొటిమలు, మచ్చలు వంటి చర్మ సమస్యలు తగ్గడంతో పాటు వృద్దాప్య ఛాయలు కూడా మన దరి చేరకుండా ఉంటాయి. అలాంటి సోంపు గింజలను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందచ్చని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: ఏ నూనె ఆరోగ్యానికి మంచిది? వైద్యులు చెబుతున్నదిదే) -
రైతులకు విత్తన సబ్సిడీ
సాక్షి, హైదరాబాద్: వచ్చే వానాకాలం సీజన్ నుంచి రైతులకు సబ్సిడీపై విత్తనాలను సరఫరా చేయాలని వ్యవసాయశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. వరి, మొక్కజొన్న, కంది, పెసర, సోయాబీన్, మినుములు, జీలుగ, జనపనార, పిల్లి పెసర తదితర విత్తనాలను సబ్సిడీపై అందజేసేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. జీలుగ, జనపనార, పిల్లి పెసర మినహా ఇతర విత్తనాలకు మూడేళ్ల క్రితమే సబ్సిడీ ఎత్తేయగా ఇప్పుడు సబ్సిడీని పునరుద్ధరించాలని నిర్ణయించారు. కేవలం వానాకాలం సీజన్లో అందించే విత్త నాల సబ్సిడీ కోసమే దాదాపు రూ. 170 కోట్లు ఖర్చు కానుందని అంచనా. కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి దాదాపు రూ. 25 కోట్ల మేరకు విత్తన సబ్సిడీ కింద నిధులు వచ్చే అవకాశం ఉంది. మిగిలిన సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం సమ కూర్చుకోవాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. 35–65 శాతం వరకు సబ్సిడీ... గతంలో మాదిరిగానే విత్తనాలకు 35 నుంచి 65 శాతం వరకు సబ్సిడీని అందించనున్నారు. సోయాబీన్కు 37 శాతం, జీలుగ, పిల్లి పెసర, జనపనార విత్తనాలకు 65 శాతం సబ్సిడీ... కంది, పెసర, మినుము, వేరుశనగ విత్తనాలకు 35 శాతం వరకు సబ్సిడీ అందించాలని భావిస్తున్నారు. వరి పదేళ్లలోపు పాత విత్తనాల ధర ఎంతున్నా రూ. వెయ్యి సబ్సిడీ ఇవ్వాలని... పదేళ్లకుపైగా ఉన్న వరి విత్తనాలకు రూ. 500 సబ్సిడీ ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిసింది. మొత్తం విత్తన సరఫరాలో వ్యవసాయశాఖ అధికంగా వరి విత్తనాలనే రైతులకు సరఫరా చేయనుంది. రైతు కోరుకొనే విత్తనాలే కీలకం... ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేసే కొన్ని రకాల విత్తనాలను రైతులు పెద్దగా కోరుకొనే పరిస్థితి ఉండదు. గత అనుభవాల ప్రకారం రాష్ట్రంలో మొక్కజొన్న సాగు అధికం. ఆ విత్తనాన్ని ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేస్తోంది. కానీ మొక్కజొన్నలో అనేక హైబ్రీడ్ రకాల విత్తనాలున్నాయి. వాటిలో కొన్ని రకాలకు మరింత డిమాండ్ ఉంది. కానీ ప్రభుత్వం సరఫరా చేసే మొక్కజొన్న విత్తనాలను పెద్దగా కొనుగోలు చేసేందుకు ఇష్టపడని రైతులు.. ప్రైవేటు డీలర్ల వద్ద తమకు అవసరమైన డిమాండ్ ఉన్న విత్తనాలనే కొనుగోలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఏదో యథాలాపంగా టెండర్లు పిలిచి టెండర్లు ఖరారు చేస్తే పెద్దగా ప్రయోజనం ఉండదు. రైతులు కోరుకొనే రకాల విత్తనాలు ఇవ్వకపోవడం వల్ల గతంలో అనేక సబ్సిడీ విత్తనాలు వ్యవసాయశాఖ వద్ద మిగిలిపోయాయి. దీనివల్ల ఆ శాఖకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుంది. 1.21 కోట్ల పత్తి విత్తనాలు అవసరం: మంత్రి తుమ్మల వచ్చే వానాకాలం సీజన్లో రాష్ట్రంలో 60.53 లక్షల ఎకరా లలో పత్తి సాగు కానుందని... అందుకు 1.21 కోట్ల విత్తన ప్యాకెట్లు అవసరమని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపా రు. అధికారులు, విత్తన కంపెనీలతో ఆయన గురువారం సమావేశం నిర్వహించారు. అన్ని ప్రైవేటు విత్తన కంపెనీలు పత్తి విత్తనాలు సరఫరా చేయాలని ఆదేశించారు. వరి 16.50 లక్షల క్వింటాళ్లు, మొక్కజొన్న 48,000 క్వింటాళ్ల విత్తనాలు అవసరమన్నారు. ప్రస్తుత లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. -
సాగుబడి: సస్యగవ్యతో.. బంజరు భూమి సాగు!
మన దేశంలో 28.7% భూమి (9 కోట్ల 78 లక్షల హెక్టార్ల భూమి బంజరు భూమి ఉంది. విచ్చలవిడిగా రసాయనాల వినియోగం వల్ల పూర్తిగా నిస్సారమై సాగుయోగ్యం కాకుండా పోయిన భూమి కూడా ఇందులో కలసి ఉంది. ఇటువంటి రాళ్లూ రప్పలతో కూడిన బంజరు, నిస్సారమైన భూములను సైతం కేవలం ద్రవరూప ఎరువు ‘సస్యగవ్య’తో పునరుజ్జీవింపచేయ వచ్చని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన యూనివర్సిటీ ప్రయోగాత్మకంగా రుజువు చేసింది. వేదకాలం నాటి కృషిపరాశర గ్రంథం నుంచి తీసుకున్న సాగు పద్ధతిలో బంజరు భూములను, నిస్సారమైన భూములను పునరుజ్జీవింపజేస్తూ తిరిగి సాగులోకి తేవడానికి ఉపయోగపడే వినూత్న ప్రకృతి సేద్య పద్ధతిని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన యూనివర్సిటీ అనుసరిస్తోంది. అనేక రకాల పండ్ల మొక్కలను ఐదేళ్లుగా ఈ పద్ధతిలో ప్రయోగాత్మకంగా సాగు చేస్తోంది. వనపర్తి జిల్లా మదనాపురంలోని ఉద్యాన బోధనా క్షేత్రంలో 11 ఎకరాల రాళ్లతో కూడిన బంజరు భూమిలో అసిస్టెంట్ ్రపొఫెసర్ డా. జడల శంకరస్వామి 2019 నుంచి ఈ ప్రయోగాత్మక సాగు పద్ధతిని అవలంభిస్తూ భూమిని క్రమంగా సారవంతం చేస్తున్నారు. ఎత్తుమడులు.. అధిక సాంద్రత.. 11 ఎకరాలను ఎకరం ప్లాట్లుగా చేసి నేల తీరుకు సరిపోయే పంటలను సాగు చేస్తున్నారు. ఉదాహరణకు రాళ్లు రప్పలతో కూడిన నేలలో దానిమ్మ (భగువ) రకం మొక్కల్ని అధిక సాంద్రతలో ఎకరానికి 300 నాటారు. అదేవిధంగా, 7 రకాల మామిడి, మూడు రకాల అంజూర, జామ, మునగ తదితర తోటలను వేశారు. భూమిని దుక్కి చేసి 2.5 అడుగులు (75 సెం.మీ.) వెడల్పుతో.. సాళ్ల మధ్యలో మీటరు లోతున తవ్విన మట్టిని పోసి 2 మీటర్ల ఎత్తున బెడ్స్ చేశారు. సాళ్ల మధ్య 16 అడుగులు, మొక్కల మధ్య 10 అడుగుల దూరం పాటించారు. ఎత్తుమడులపై మొక్కలు అధిక సాంద్ర పద్ధతిలో నాటి డ్రిప్ ద్వారా నీరు అందిస్తున్నారు. గుంతకు 5 కిలోల వర్మీ కంపోస్టు వేసి మొక్కలు నాటారు. ఇక ఆ తర్వాత ఎటువంటి రసాయనిక ఎరువులు గానీ, సేంద్రియ ఎరువులు గానీ, పిచికారీలు గానీ చేయటం లేదు. కలుపు మొక్కలే బలం! ఏ పొలంలో మొలిచే కలుపు మొక్కలను పీకి ఆ పొలంలోనే ఆచ్ఛాదనగా వాడటంతో పాటు.. ఆ మొక్కలను మురగబెట్టి సస్యగవ్య అనే ద్రవ రూప ఎరువును తయారు చేస్తున్నారు. దీన్ని అదే పొలంలో గడ్డీ గాదాన్ని కుళ్లించడానికి వినియోగించటం ద్వారా భూమిని సారవంతం చేసుకోవచ్చు. బంజరు భూముల్ని, సారం కోల్పోయిన భూముల్ని సాగులోకి తేవటానికి బయటి నుంచి ఎటువంటి ఉత్పాదకాలను ఖర్చుపెట్టి కొని తెచ్చి వేయాల్సిన అవసరం లేదని రైతులకు తెలియజెప్పడానికే ఈ ప్రయోగాన్ని చేపట్టామని డా. శంకరస్వామి ‘సాక్షి సాగుబడి’కి వివరించారు. కలుపు మొక్కలుగా మనం భావించేవాటిలో చాలా మటుకు నిజానికి ఔషధ మొక్కలేనని అంటూ.. వాటిని పీకి పారేయటం కాకుండా అదే నేలలో కలిపేస్తే చాలు. కలుపు ఆచ్ఛాదనపై సస్యగవ్య పిచికారీ ఇక ఏ రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు చల్లకుండా ఉంటే.. ఆ భూమిలోనే ఉండే సూక్ష్మజీవరాశి సంరక్షించబడి భూమిని క్రమంగా సారవంతం చేస్తుందని ఆయన తెలిపారు.గులక రాళ్లు సైతం భూసారాన్ని పెంపొందించడానికి దోహదపడుతాయని తమ అనుభవంలో వెల్లడైందన్నారు. గణనీయంగా పెరిగిన సేంద్రియ కర్బనం.. సస్యగవ్యతో సేద్యం చేయనారంభించిన తొలి దశలో, నాలుగేళ్ల తర్వాత పండ్ల తోటలో భూసార పరీక్షలు చేయించగా భూసారం గణనీయంగా వృద్ధి చెందింది. 11 ఎకరాల్లో సగటున సేంద్రియ కర్బనం 0.24 నుంచి 0.53కి, సేంద్రియ పదార్థం 0.1 నుంచి 1%కి పెరిగింది. వీటితో పాటు మట్టిలో టోటల్ నైట్రోజన్ 0.015 నుంచి 0.045కి పెరిగిందని డా. శంకర స్వామి తెలిపారు. సస్యగవ్యను వరుసగా నాలుగేళ్లు వాటం వల్ల సాగుకు యోగ్యం కాని భూమిని కూడా తిరిగి సారవంతం చేయటం సాద్యమేనన్నారు. ఒక్కో రకం పండ్ల తోట సాగులో ఉన్న తోటలో వేర్వేరు రకాల కలుపు మొక్కలు, ఔషధ మొక్కలు మొలుస్తున్న విషయం గుర్తించామన్నారు. మట్టిలోని గులకరాళ్లు కూడా పరోక్షంగా మట్టిని సారవంతం చేయడానికి పరోక్షంగా దోహదపడుతున్నట్లు కూడా గుర్తించామని అంటూ.. సాగు భూమిలోని గులక రాళ్లు పనికిరానివేమీ కాదన్నారు. బెడ్స్ మధ్యలో రాళ్ల భూమి - బోడ్స్ మధ్య కలుపు ఆచ్ఛాదన ‘సస్యగవ్య’ తయారీ ఇలా.. పొలంలో మొలిచిన కలుపు మొక్కలను ఏడాదికి మూడు దఫాలు పీకి వాటితో సస్యగవ్యను డా. శంకర స్వామి తయారు చేయిస్తున్నారు. ఆ పొలంలోని తాజా కలుపు మొక్కలు కిలో, తాజా ఆవు పేడ కిలో, ఆవు మూత్రం లీటరు, రెండు లీటర్ల నీటి (1:1:1:2)తో కలిపి పొలంలోనే నీడన ఫైబర్ పీపాల్లో మురగబెడుతున్నారు. రోజూ ఉదయం, సాయంత్రం కలియదిప్పుతుంటే 10–12 రోజుల్లో సస్యగవ్య ద్రవ రూప ఎరువు సిద్ధమవుతుంది. ఆ పొలంలోనే సాళ్ల మధ్యలో ఆచ్ఛాదనగా వేసిన గడ్డీ గాదం, ఆకులు అలములు, కొమ్మలు రెమ్మలపై సస్యగవ్యను 1:1 పాళ్లలో నీరు కలిపి పిచికారీ చేస్తున్నారు. వారం తర్వాత ఆ గడ్డీ గాదాన్ని రొటోవేటర్తో మట్టిలో కలియదున్ని, ఆ మట్టిపై మరోసారి సస్యగవ్యను పిచికారీ చేస్తున్నారు. తద్వారా ఈ సేంద్రియ పదార్థం కుళ్లి మట్టిలో కలిసిపోయి భూమి సారవంతం అవుతోంది. ఏడాదిలో మూడు సీజన్లలో కొత్తగా కలుపు మొలిచినప్పుడు ఆ కలుపు మొక్కలతో మాత్రమే దీన్ని తయారు చేసి వాడుతున్నారు. భూమిని సారవంతం చేయటానికి ఈ ఒక్క పని తప్ప మరే ఎరువూ వేయటం లేదు. డ్రిప్ ద్వారా అవసరం మేరకు నీరు మాత్రం క్రమం తప్పకుండా ఇస్తున్నారు. రైతులు అనుసరించడానికి ఇది చాలా అనువైన, ఖర్చులేని పద్ధతని డా. శంకరస్వామి అంటున్నారు. ఇంతకీ దిగుబడి ఎంత? స్వల్ప ఖర్చుతోనే బంజరు భూముల్ని, రసాయనిక వ్యవసాయం వల్ల నిస్సారమైన భూముల్ని తిరిగి సారవంతం చేసుకొని ఫలసాయాన్నిచ్చేలా పునరుజ్జీవింపచేయొచ్చని మా ప్రయోగం రుజువు చేసింది. సస్యగవ్యతో కూడిన ప్రకృతి సేద్యంలో 4 ఏళ్ల తర్వాత ఒక్కో దానిమ్మ (భగువ) చెట్టుకు 3.96 కిలోల పండ్లు, అంజూర (డయాన) చెట్టుకు 13.8 కిలోల పండ్లు, జామ (అలహాబాద్ సఫేది) చెట్టుకు 1.65 కిలోల దిగుబడి వచ్చింది. బయటి నుంచి ఏదీ కొని వేయకుండా సాధించిన ఫలసాయం ఇది. – డా. జడల శంకరస్వామి (97010 64439), ఉద్యాన కళాశాల, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం -
చింతగింజల మ్యాజిక్ తెలుసా? పురుషులకు మరీ ప్రయోజనం!
చింత గింజలు అంటే చింతపండు వాడుకుని, పులుసు తీసుకున్న తరువాత తీసిపారేసే వేస్ట్ గింజలనుకునేరు. వీటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చింతపండు గింజల్లో ఉండే ప్రోటీన్లోయాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయని, చికున్ గున్యా కోసం యాంటీవైరల్ మందులను అభివృద్ధి చేయడానికి సమర్థ వంతంగా ఉపయోగించవచ్చని నిపుణుల మాట. దీంతో పాటు వివిధ ప్రయోజనాలూ ఉన్నాయి. అవేంటో తెలియాంటే..ఈ కథనాన్ని చదవాల్సిందే..! చింత చెట్టును భారత దేశపు ఖర్జూర చెట్టు అంటారు. గతంలోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) బయోటెక్నాలజీ విభాగానికి చెందిన రూర్కీ ప్రొఫెసర్లు చింతగింజలపై పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలు ఎల్సెవియర్ జర్నల్, వైరాలజీలో ప్రచురించబడ్డాయి కూడా. దీని ప్రకారం మధుమేహ నిర్వహణలో ఉపయోగ పడతాయి. చింత గింజల పొడితో దంత సమస్యలను దూరం చేసుకోవచ్చు. కీళ్ల నొప్పులతో బాధపడేవారికి చింతగింజలు దివ్యౌషధంగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మధుమేహం: చింతపండు గింజలు ప్యాంక్రియాస్ను రక్షిస్తాయి. ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల పరిమాణాన్ని పెంచుతుంది.చింతపండు గింజల నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా నియంత్రించుకోవచ్చు. దంతాలకు మేలు చేస్తుంది: చింతపండు గింజల పొడితో చిగుళ్ళు ,దంతాలను తోముకుంటే మంచిది. ఎక్కువగా పొగ త్రాగే వారికి. శీతల పానీయాలు, ధూమపానం వల్ల పళ్లు గారపట్టిపోతాయి. ఇందుకోసం చింత గింజలను పొడి చేసి అందులో నీళ్లు కలిపి పేస్ట్లా చేసి రోజూ దంతాలను తోముకోవాలి. దీంతో దంతాలు తెల్లగా మారడంతోపాటు దంతాలపై ఉండే గార, పాచి వదిలిపోతుంది. జీర్ణక్రియ: చింతపండు గింజల రసం అజీర్ణాన్ని నయం చేయడానికి, పిత్తానికి సహజ నివారణగా ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా, ఇందులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.ఇది కొలెస్ట్రాల్ను మరింత తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్లను నివారణలో: యాంటీ బాక్టీరియల్ లక్షణాలుతో చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షించుకోవచ్చు. అంతేకాకుండా, ఇది పేగు , మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ల నుండి కూడా కాపాడుతుంది. గుండెకూ మంచిదే: చింతపండు విత్తనాలలో పొటాషియం ఉంటుంది. పొటాషియం బీపీని తగ్గిస్తుంది. రక్తపోటు, ఇతర హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఉపయోగపడుతుంది. ఇన్ఫెక్షన్ల నివారణలో: చింత గింజల్లో యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఈ గింజల పొడిలో నీళ్లు కలిపి ఆ మిశ్రమాన్ని గాయాలు, పుండ్లపై రాసుకోవచ్చు. అలాగే మంగు మచ్చల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. చింత గింజలను పొడిలా తయారుచేసి, ఆ పొడిలో తేనె కలిపి మచ్చల ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. చింతగింజల పొడిని రోజూ ఓ అర టీస్పూన్ మేర రోజుకు రెండు సార్లు నీటితో కలిపి తీసుకోవాలి. పాలు లేదా నెయ్యిని కూడా వాడొచ్చు. దీనివల్ల మోకాళ్ల నొప్పులు దూరమవుతాయి. వీర్యకణాల వృద్ధిలో ఆవుపాలు, చింతగింజల పొడిని కలిపి రాత్రి పడుకునే ముందు తీసుకోవడం వల్ల పురుషుల్లో వచ్చే లైంగిక సమస్యలు తగ్గుతాయి. వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. ఇలా నోట్: చిట్కాలు అందరికీ ఒకేలా పనిచేస్తాయన్న గ్యారంటీ లేదు. నిపుణులతో సంప్రదించి చింతగింజల పొడిని వాడుకోవాలి. దీని ప్రయోజనానలు వైద్యుడిని సంప్రదించి నిర్ధారించుకోండి. -
సాగుబడి: పాలేకర్ ఫుడ్ ఫారెస్ట్లో ఎకరానికి రూ. 6 లక్షల ఆదాయం!
"పాలేకర్ ఫుడ్ ఫారెస్ట్ ఐదు అంచెల పంటల సాగు నమూనాతో ఎకరానికి ఏటా రూ. 6 లక్షల ఆదాయం సమకూరుతుందని పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. సుభాష్ పాలేకర్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. గుజరాత్లో ఫైవ్ లేయర్ ఫుడ్ ఫారెస్ట్లు తన టెక్నాలజీకి నిదర్శనంగా నిలిచాయని, తొలి ఏడాదే రూ. 2 లక్షలు, ఆరో ఏడాది నుంచి రూ. 6 లక్షల ఆదాయం సమకూరుతోందన్నారు. ఆసక్తిగల రైతులు గుజరాత్ వస్తే తానే స్వయంగా చూపిస్తానన్నారు." ఈ నెల 29,30,31 తేదీల్లో అహ్మదాబాద్కు 151 కి.మీ. దరంలోని పాలియాడ్ (బోటాడ్ జిల్లా)లోని శ్రీ విషమన్ బాపు ప్యాలెస్ మందిర్లో (ఆంగ్లం/ హిందీ) రైతు శిక్షణా శిబిరంలో పాల్గొనే వారికి ఈ ఫుడ్ ఫారెస్ట్లను స్వయంగా చూపిస్తానన్నారు. 3 రోజులకు ఫీజు రూ.700. ఇతర వివరాలకు.. ఘనశ్యాం భాయ్ వాల– 63550 77257, కశ్యప్ భాయ్చౌహాన్– 85303 13211. పుట్టగొడుగుల సాగుపై 26 రోజుల ఉచిత శిక్షణ.. ఇంటర్/డిప్లొమా దశలో చదువు మధ్యలో ఆపేసిన గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం, ‘ఆస్కి’ సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు పుట్టగొడుగుల పెంపకంపై పూర్తిస్థాయి శిక్షణా శిబిరం జరగనుంది. హైదరాబాద్ (రాజేంద్రనగర్లోని పిజెటిఎస్ఎయు ఆవరణ) లోని విస్తరణ విద్యా సంస్థలో జరిగే ఈ శిబిరంలో పాల్గొనే వారికి బోధనతో పాటు భోజన, వసతి కూడా పూర్తిగా ఉచితం. చిన్న స్థాయి పుట్టగొడుగుల రైతుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని అంశాలపై నైపుణ్య శిక్షణ ఇస్తారు. 16 ఏళ్లు పైబడిన గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులు అర్హులు. ఇంటర్ ఫస్టియర్ పాస్ లేదా టెన్త్ తర్వాత వ్యవసాయ/ అనుబంధ విభాగాల్లో 3 ఏళ్ల డిప్లొమా మొదటి ఏడాది పూర్తి చేసిన లేదా పదో తరగతి పాసైన తర్వాత కనీసం ఒక ఏడాది పుట్టగొడుగుల పెంపకంలో అనుభవం పొందిన వారు లేదా 8వ తరగతి పాసైన తర్వాత కనీసం 3 ఏళ్లుగా పుట్టగొడుగులు పెంపకం పని చేస్తున్న వారు.. ఈ ఉచిత శిక్షణకు అర్హులు. విద్యార్హత, కులధృవీకరణ, ఆధార్, ఫోటో తదితర వివరాలను పొందుపరుస్తూ ఆన్లైన్లో గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఈ క్యూ.ఆర్. కోడ్ను స్కాన్ చేయండి. ఇతర వివరాలకు.. 040– 2405368, 98666 18107. eeihyd1962@gmail.com 22 నుంచి దేశీ వరి సాగు, నీటి సంరక్షణపై ‘సేవ్’ శిక్షణ.. విశాఖపట్నం కృష్ణాపురంలోని సింహాచలం దేవస్థానం గోశాల (న్యూ)లో ఈ నెల 22 నుంచి 26 వరకు దేశీ వరి సాగుదారులు, దేశీ వరి బియ్యాన్ని సేకరించి ఆలయాల్లో నైవేద్యాల కోసం అందించే దాతలతో రైతుల ముఖాముఖి పరిచయ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకృతి వ్యవసాయ సాధకులు, ‘సేవ్’ సంస్థ నిర్వాహకులు విజయరామ్ తెలిపారు. పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో దేశీ వరి రకాల సాగు, ఉద్యాన పంటల 5 లేయర్ సాగు, వాననీటి సంరక్షణకు ఇంకుడు గుంతల తవ్వకంపై రైతులకు శిక్షణ ఇస్తామన్నారు. పెళ్లిళ్లలో ఔషధ గుణాలు గల సంప్రదాయ వంటకాలు వడ్డించే ఆసక్తి గల వారికి ఆ వంటకాలను కూడా ఈ శిబిరంలో పరిచయం చేస్తామన్నారు. ‘శబలా భోజన పండుగ’ పేరిట నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలన్నీ ఐదు రోజులూ జరుగుతాయని, ఆసక్తిగల వారు ఏదో ఒక రోజు హాజరైతే చాలని విజయరామ్ తెలిపారు. వివరాలకు.. సేవ్ కార్యాలయం 63091 11427, సురేంద్ర 99491 90769. 29 నుంచి సేవాగ్రామ్లో జాతీయ విత్తనోత్సవం! వాతావరణ మార్పుల్ని తట్టుకునే శక్తి దేశీ వంగడాలకే ఉందనే నినాదంతో ఈ నెల 29 నుంచి 31 వరకు మహారాష్ట్ర వార్థా జిల్లా సేవాగ్రామ్లోని నాయ్ తాలిమ్ సమితి పరిసర్లో వార్షిక జాతీయ విత్తనోత్సవం జరగనుంది. దేశం నలుమూలల నుంచి అనేక పంటల దేశీ వంగడాల ప్రదర్శన, అమ్మకంతో పాటు సేంద్రియ రైతుల సదస్సులు, క్షేత్ర సందర్శనలు, నిపుణులతో ముఖాముఖి వంటి కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. రుసుము రూ. వెయ్యి. వివరాలకు.. యుగంధర ఖోడె – 91302 17662, ప్రతాప్ మరొడె – 75888 46544. ఇవి చదవండి: సాగుబడి: ఈ సరికొత్త ప్రయోగంతో.. కరువును తట్టుకున్న పంటలు! -
మెంతులు..ఇంతులు అంటూ తెగ తినేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!
మన వంటింట్లో దొరికే మెంతులతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కేవలం సుగంధ ద్రవ్యంగా మాత్రమే కాదు. అతివలకు మెంతుల వల్ల జరిగే మేలు అంతా ఇంతా కాదు. మధుమేహం సహా అనేక అనారోగ్య సమస్యలకు అవి ఔషధంలా పనిచేస్తాయి. తినడానికి చిరు చేదుగా అనిపించినా మెంతులు వల్ల కలిగే కలిగే ఆరోగ్య ప్రయోజనాల రీత్యా మన ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటారు. అందుకే పోపు గింజల్లో మెంతులును ప్రధానంగా చేర్చారు మన పెద్ద వాళ్లు. పౌడర్లు, క్యాప్సూల్స్ , నూనెలతో సహా వివిధ రూపాల్లో లభిస్తున్న ఈ మెంతులు పురుషులు,స్త్రీలలో ఇతర వైద్య పరిస్థితులకు కూడా సహాయపడతాయని నమ్ముతారు. మెంతులను వివిధ రూపాల్లో తీసుకోవడం ద్వారా వివిధ రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మరి మెంతులలో దాగి ఉన్న ఆ ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందామా..? ప్రయోజనాలు ⇒ మెంతులు (ట్రైగోనెల్లా ఫోనమ్-గ్రేకమ్) అనేది బఠానీ కుటుంబానికి (ఫాబేసి) చెందిన సుగంధ ద్రవ్యం. ⇒ గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది ⇒ జుట్టు పెరుగుదలకు మంచిది ⇒ బ్లడ్ కొలెస్ట్రాల్ను, అధిక రక్తపోటును అదుపులో ఉంచుకుంది. ⇒ జ్వరం, అలెర్జీల , గాయాల చికిత్సలో మెంతులు మన రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్దీకరించడంలో బాగా పనిచేస్తాయి. అదేవిధంగా అజీర్తి, కడుపుబ్బరాన్ని కూడా తగ్గిస్తాయి. కాబట్టి మధుమేహం ఉన్నవాళ్లు నిత్యం మెంతులు తీసుకోవడం అలవాటుగా చేసుకోవాలంటారు నిపుణులు. మెంతుల్లో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావన కలిగిస్తుంది.అంటే ఒంట్లో కొవ్వు కరుగుతుంది. రాత్రిపూట ఒక చెంచా మెంతి గింజలను నీళ్లలో నానబెట్టి ఉదయం లేవగానే పరగడుపున ఆ నీళ్లను తాగాలి. ఇలా చేయడంవల్ల అజీర్తి సమస్య తగ్గుతుంది. జీర్ణ శక్తి మెరుగు పడుతుంది. అదేవిధంగా విరేచనాలు తగ్గడానికి కూడా మెంతులు ఉపయోగపడుతాయి. మెంతి టీ ద్వారా బ్లడ్ లో షుగర్ అదుపులో ఉంటుంది. చిటపట శబ్దం వచ్చేదాకా మెంతులను వేయించి మెత్తగా పౌడర్లా చేసుకుని , రోజూ ఉదయాన్నే ఆ పొడిని వేడి నీటిలో కలుపుకుని తాగితే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మెంతులు-ఇంతులు మహిళలు సౌందర్య పోషణలో కూడా మెంతులకు విరివిగా వాడవచ్చు బాగా మెత్తగా దంచిన మెంతిపౌడర్లో కొద్దిగా తేనె కలిపిన మిశ్రమంతో ముఖాన్ని సున్నితంగా స్క్రబ్ చేసుకోవాలి. ఎండిన తరువాత నీటితో చక్కగా కడిగేసుకుంటే.. చర్మం భలే స్మూత్గా ఉంటుంది. మెంతులలో ఉండే లెసిథిన్ కనుబొమ్మలే ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. నాన పెట్టిన గుప్పెడు మెంతులను మెత్తని ముద్దగా నూరుకోవాలి. దీన్ని కనుబొమ్మలకు రాసుకుని 20-25 నిమిషాల తరువాత తడి గుడ్డతో చాలా సున్నితంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి మూడు- నాలుగు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే కండరాల నొప్పులకు మెంతులు దివ్యౌషధం అని చెప్పవచ్చు.ఐరన్ లోపాన్ని కూడా ఈ మెంతులు తగ్గిస్తాయి. కఫం,దగ్గు, ఆస్తమా లాంటి సమస్యలకు మెంతు మంచి ఉపశమనం కలిగిస్తాయి. సైడ్ ఎఫెక్ట్స్ పాలిచ్చే తల్లులకు పాలు పడటం కోసం మెండి పౌడర్ను ఎక్కువగా వాడతారు. దీని వల్ల పిల్లలకు ఎటువంటి హాని జరగనప్పటికీ, మెంతి సప్లిమెంట్లను తీసుకునే ముందు వైర్భిణీలేదా పాలిచ్చే స్త్రీలు వైద్యులు సలహా మేరకు తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా మెంతి సప్లిమెంట్లు లేదా మందులకు దూరంగా ఉండాలంటున్నారు కొంతమంది నిపుణులు. ఎందుకంటే గర్భాశయ సంకోచాలు పెరిగి అవి శిశువుపై ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటాయి, ఒక్కోసారి గర్భస్రావం జరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. డెలివరీకి కొద్దిసేపటికి ముందు మెంతులు తీసుకోవడం వల్ల శిశువుల మూత్రం, శరీరంనుండి అసాధారణమైన వాసన వస్తుంది. ఈ వాసన ప్రమాదకరం కానప్పటికీ, మాపుల్ సిరప్ యూరిన్ డిసీజ్ అని పిలిచే జన్యుపరమైన పరిస్థితి వస్తుందంటారు. మెంతులు శరీరంపై ఈస్ట్రోజెన్ లాంటి ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఈ నేపథ్యంలో కొన్ని రకాల రొమ్ము క్యాన్సర్లలో ఈస్ట్రోజెన్-ఆధారిత కణితులను ఇది మరింత ప్రేరేపిస్తుందట. కనుక మెంతి సప్లిమెంట్లను ఉపయోగించాలనుకుంటే వైద్యులను సంప్రదించాలి. మరికొన్ని ⇒ అతిసారం ⇒ అజీర్ణం ⇒ కడుపు ఉబ్బరం ⇒ వికారం ⇒ తలనొప్పి ⇒ తలతిరగడం -
రెండేళ్లలోనే కొత్త వరి వంగడాలు
(సాక్షి సాగుబడి డెస్క్): సంప్రదాయ ప్రజనన (బ్రీడింగ్) పద్ధతిలో ఓ కొత్త వరి వంగడం రూపొందించడానికి 6–7 సంవత్సరాలు పడుతుంది. క్లైమెట్ ఛేంజ్ వల్ల వాతావరణంలో వస్తున్న పెనుమార్పులకు దీటుగా తట్టుకునే వంగడాలు రూపొందించడం శాస్త్రవేత్తలకు ఇంత సుదీర్ఘకాల పరిమితి పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ఏడాదిన్నర నుంచి 2 ఏళ్లలోనే సరికొత్త వంగడాన్ని రూపొందించేందుకు అనువైన వినూత్న స్పీడ్ బ్రీడింగ్ పద్ధతిని ఫిలిప్పీన్స్ మనీలాలోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఇరి) అభివృద్ధి చేసింది. భారతీయ, జపాన్ వరి రకాలతో పాటు ఏ దేశంలో వంగడాలతోనైనా రెండేళ్లలోనే కొత్త వంగడం రూపొందించటం సాధ్యమేనని ‘ఇరి’పరిశోధనల్లో తేలింది. ‘ఇరి’ప్ర«దాన కార్యాలయంతో పాటు వారణాసిలో ‘ఇరి’దక్షిణాసియా పరిశోధనా స్థానంలో కూడా సాంబ వంటి అనేక రకాలతో రెండేళ్లలోనే ‘ఇరి’శాస్త్రవేత్తలు విజయవంతంగా కొత్త వంగడాలను రూపొందించారు. కృత్రిమ వెలుగుల మధ్య ప్రయోగాలు నియంత్రిత వాతావరణంలో ప్రత్యేక గదుల్లో కృత్రిమ వెలుగుల మధ్య వరి ప్రయోగాలు చేయటం స్పీడ్ బ్రీడింగ్లో ముఖ్యభాగం. కాంతి తీవ్రత, ఉష్ణోగ్రత, తేమ, పోషకాల స్థాయి నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఇస్తారు. కుండీలలో పెరిగే వరి మొక్కలకు స్థూల, సూక్ష్మ పోషకాలను పిచికారీల ద్వారా అందిస్తున్నారు. ఈ స్పీడ్ బ్రీడింగ్ క్రమంలో వేగంగా పూత దశకు ఎదగటం అనేది మరో ముఖ్యాంశం. సాధారణంగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక వరి రకాలు 58 నుంచి 127 రోజుల మధ్య సహజంగా పూతకు వస్తాయి. అయితే, స్పీడ్ బ్రీడింగ్ పద్ధతిలో రాత్రి, పగలు అని తేడా లేకుండా కృత్రిమ వెలుగుల మధ్య పెరిగే వరి మొక్కలు, వాటి సహజ కాల పరిమితితో నిమిత్తం లేకుండా, 60 రోజుల లోపలే అన్ని రకాలూ ఒకేసారి పూతకు వస్తున్నాయి. ఇలా త్వరగానే ఏ వరి రకమైనా కోతకు వస్తున్నాయి. అందువల్లనే ఈ స్పీడ్ బ్రీడింగ్ ప్రొటోకాల్ ద్వారా జరిపే పరిశోధనలకు ‘స్పీడ్ ఫ్లవర్’అని ‘ఇరి’పేరుపెట్టింది. ఏడాదికి నాలుగైదు పంటలు ఈ విధంగా ఏడాదికి 1–2 పంటలకు బదులు నాలుగైదు పంటలు పండిస్తున్నారు. నియంత్రిత వాతావరణంలో అనుకున్నన్ని రోజుల్లో పంట నూరి్పడికి వస్తోంది. వారణాసిలోని ఇరి దక్షిణాసియా ప్రాంతీయ పరిశోధనా స్థానంలో 198 వరి రకాలను పెంచినప్పుడు అన్నీ 60 రోజుల్లోనే పూతకు రావటం విశేషం. స్వర్ణ, సాంబ మసూరి సహా.. వారణాసిలోని దక్షిణాసియా ఇరి పరిశోధనా స్థానం సంచాలకులు డా. సుధాంశు సింగ్ మాట్లాడుతూ.. క్రాసింగ్, ఇన్బ్రీడింగ్ కార్యకలాపాలను వేగవంతం చేయడానికి స్పీడ్ బ్రీడింగ్ ప్రొటోకాల్ ఉపయోగపడుతోంది. క్షేత్రస్థాయిలో 6–7 సంవత్సరాల సమయం పట్టే పని ఇప్పుడు 1.5–2 ఏళ్లలోనే పూర్తవుతోందని వ్యాఖ్యానించారు. స్పీడ్ ఫ్లవర్ పరిశోధన కార్యక్రమంలో స్వల్పకాలిక రకాలైన కో–51, ఐఆర్64, మధ్యకాలిక రకాలైన సర్జూ–52, డిఆర్ఆర్ ధాన్ 44, దీర్ఘకాలిక రకాలైన స్వర్ణ, సాంబ మసూరి రకాలు సైతం చక్కని ఫలితాలు వచ్చాయని, రెండేళ్లలోనే కొత్త వంగడాలను అభివృద్ధి చేయటం సాధ్యమేనని తేలిందని సుధాంశు సింగ్ చెప్పారు. ఏడాదిలో స్వర్ణ వరిని వరుసగా 5.1 పంటలు, సాంబ మసూరిని 4.9 పంటలు వరుసగా సాగు చేయటం ఈ పద్ధతిలో సాధ్యపడిందని పేర్కొన్నారు. – డాక్టర్ సుధాంశు సింగ్ ఇది శాస్త్రపరంగా పెద్ద ముందడుగు.. ’’అధికోత్పత్తినిచ్చే, వాతావరణ మార్పుల్ని తట్టుకునే, పోషకాల పరంగా మెరుగైన సరికొత్త వరి వంగడాలను అతి తక్కువ కాలంలోనే రూపొందించడానికి అవకాశం దొరికిందిప్పుడు. వరికి జన్యుసుసంపన్నత చేకూరడానికి, ప్రపంచ మానవాళికి ఆహార భద్రతను అందించడానికి ఇది ఉపయోగకరం’అంటున్నారు పరిశోధకుల బృందం సారధి డాక్టర్ వికాస్ కుమార్ సింగ్. ’’ఈ పరిశోధనా ప్రాజెక్టుకు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి సౌజన్యంతో కేంద్ర బయోటెక్నాలజీ శాఖ ఆర్థిక తోడ్పాటు ఉంది. సమీప కాలంలోనే మన వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లోని రైస్ బ్రీడర్లకు కూడా స్పీడ్ బ్రీడింగ్ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని ఆశించవచ్చు.’అని వెల్లడించారు. – డాక్టర్ వికాస్కుమార్ సింగ్ -
రైతులకు మరింత ‘సహకారం’
సాక్షి, హైదరాబాద్: ఎరువుల నుంచి విత్తనాలు, పురుగుల మందులు ఇలా అన్నీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోనే అందుబాటులోకి రానున్నాయి. రైతులకు అవసరయ్యే సేవలు విస్తరించేందుకు ‘వన్స్టాప్ షాప్’ విధానం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాస్ (పీఎంకేఎస్కే) పథకంలో భాగంగా దీనిని ప్రవేశపెట్టింది. ఇది ఇక్కడ కూడా అమలులోకి వస్తే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ‘వన్స్టాప్ షాప్’ కేంద్రాలుగా మార్చుతారు. ఒకేచోట అన్ని సేవలు... దేశవ్యాప్తంగా లక్ష ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (ప్యాక్స్) ఉన్నాయి. వాటిల్లో 73,098 ప్యాక్స్లు ఎరువుల లైసెన్స్ కలిగి ఉన్నాయి. మిగిలిన వాటిని కూడా లైసెన్స్ పరిధిలోకి తీసుకొస్తారు. తెలంగాణలో 1,423 ప్యాక్స్ ఉన్నాయి. అందులో 1,261 చురుగ్గా పనిచేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 16,915 ఎరువుల రిటైల్ దుకాణాలుండగా, 14,870 చురుగ్గా పనిచేస్తున్నాయి. అన్ని ప్యాక్స్లను ఎరువుల వ్యాపారంలోకి తీసుకొచ్చి అవన్నీ చురుగ్గా పనిచేసేలా కృషి చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ప్యాక్స్ల ద్వారా రైతులకు యూరియా, డీఏపీ వంటి ఎరువులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇకనుంచి వాటిల్లో అన్ని రకాల ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా అన్ని రకాల వ్యవసాయ ఉపకరణాలు అందించాలనేదే ఉద్దేశం. నాణ్యమైన సేవలు అందించవచ్చు దేశంలో సహకార వ్యవసాయ పద్ధతులు అనుసరించడం వల్ల రైతులకు మేలు జరుగుతుందని అంటున్నారు. ప్రైవేట్లో ఎరువులు, పురుగు మందులు, విత్తన వ్యాపారుల ద్వారా అనేకచోట్ల కల్తీ, నకిలీ రాజ్యమేలుతోంది. ఆ దందాకు చెక్ పెట్టాలంటే ‘వన్స్టాప్ షాప్’ విధానం మేలని కేంద్రం చెబుతోంది. ప్యాక్స్ ద్వారా యూరియా వెళ్లడం వల్ల బ్లాక్ మార్కెట్ జరగకుండా చూసుకోవచ్చు. అంతేగాకుండా కల్తీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు రైతులకు అంటగట్టకుండా నిరోధించవచ్చు. తక్కువ ధరల్లో రైతులకు వ్యవసాయ పనిముట్లు , సేంద్రీయ ఎరువులు కూడా ఇవ్వొచ్చు. భవిష్యత్లో ప్యాక్స్ ద్వారానే మార్కెటింగ్ వసతి కల్పించే ఆలోచనలో కూడా ఉన్నారు. దీనిపై పూర్తిస్థాయి అధ్యయనాలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే ప్యాక్స్ల్లో అనేకం అప్పుల్లో కూరుకుపోయాయని, అవి ప్యాక్స్ రాజకీయాల్లో మునిగిపోవడం వల్ల వాటిల్లో కొన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాయన్న చర్చ జరుగుతోంది. వాటిని అన్ని రకాలుగా బలోపేతం చేస్తే ‘వన్స్టాప్ షాప్’ విధానం విజయవంతమవుతుందని అధికారులు అంటున్నారు. -
రైతుకు కాదు రామోజీకే విపత్తు
-
విపత్తులోనూ విత్తనాలు సిద్ధం
సాక్షి, అమరావతి: మిచాంగ్ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలుల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులను అన్నివిధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 80 శాతం సబ్సిడీపై అవసరమైన విత్తనాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు 16 జిల్లాల నుంచి వచ్చిన ఇండెంట్ ప్రకారం 85,885 క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేశారు. ఇప్పటికే నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వరి విత్తనాలు పంపిణీకి శ్రీకారం చుట్టగా.. మిగిలిన జిల్లాల్లో సోమవారం నుంచి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో... సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆయా ప్రాంతాల్లో బాధిత రైతులకు 80 శాతం సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. జిల్లాల వారీగా అందిన సమాచారం మేరకు 85,885 క్వింటాళ్ల విత్తనాల కోసం అధికారులు ఇండెంట్ పంపారు. వాటిలో ప్రధానంగా 48,913 క్వింటాళ్ల శనగ, 21,064 క్వింటాళ్ల వరి, 12,407 క్వింటాళ్ల మినుము, 2,445 క్వింటాళ్ల వేరుశనగ, 894 క్వింటాళ్ల పెసర విత్తనాలతోపాటు 98 క్వింటాళ్ల నువ్వులు, 51 క్వింటాళ్ల పచ్చిరొట్ట, 14 క్వింటాళ్ల రాగులు, ఉలవలు, జొన్న విత్తనాల కోసం ఇండెంట్లు వచ్చాయి. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా బాపట్ల జిల్లాలో 20,850 క్వింటాళ్లు, గుంటూరులో 16,040 క్వింటాళ్లు, నెల్లూరు జిల్లాలో 14,384 క్వింటాళ్లు, పల్నాడులో 10,280 క్వింటాళ్లు, కృష్ణాలో 8,456, తిరుపతిలో 6,377, ప్రకాశంలో 5,005, ఏలూరు జిల్లాలో 1,096 క్వింటాళ్ల చొప్పున, మిగిలిన జిల్లాల్లో వెయ్యి క్వింటాళ్లలోపు విత్తనాలు అవసరమని అంచనా వేశారు. ఆ మేరకు ఆర్బీకేల్లో విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నారు. విత్తనాలపై సబ్సిడీ రూపంలో రూ.64.45 కోట్లు వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మొదలైన పంపిణీ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఎక్కువ విస్తీర్ణంలో నారుమళ్లు దెబ్బతిన్నాయి. దీంతో ఈ జిల్లాల్లో సాధ్యమైనంత త్వరగా మళ్లీ నారుమళ్లు పోసుకునేందుకు వీలుగా రైతులకు 80 శాతం సబ్సిడీపై వరి విత్తనాలు పంపిణీ చేయాలని సంకల్పించారు. నెల్లూరులో 80 శాతం సబ్సిడీపై వరి విత్తన పంపిణీని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి శ్రీకారం చుట్టారు. తిరుపతి జిల్లాలో కూడా వరి విత్తన పంపిణీ చేపట్టారు. ఆందోళన వద్దు తుపాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు 80 శాతం సబ్సిడీపై విత్తన పంపిణీకి ఏర్పాట్లు చేశాం. తుపాను ప్రభావిత జిల్లాల్లో నారుమళ్లు, నాట్లు దెబ్బతిన్న రైతులకు ఏ విత్తనం కావాలన్నా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. – కాకాణి గోవర్ధన్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి -
సబ్జాతో ఇలా చేస్తే ముఖం కాంతులీనుతుంది!
మంచి ఆరోగ్యకరమైన ఆహారం అనగానే కూరగాయాలు, పండ్లు, డ్రైఫ్రూట్స్ ఇవే గుర్తోస్తాయి. కానీ వీటితోపాటు ఆరోగ్యానికి మంచివి, కొన్ని వ్యాధుల తీవ్రం కాకుండా నిరోధించే మంచి ఔషధగుణాలు కలిగినవి కూడా ఉన్నాయి. వాటిలో ఈ సబ్జగింజలు ఒకటి. వీటిని బేసిల్ విత్తనాలు అని కూడా అంటారు. ఇవి ఆరోగ్యానికి, కాదు ముఖ సౌందర్యాన్ని ఇమనుడింప చేయడంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ సబ్జా గింజలు ఆరోగ్య పరంగానూ, ముఖ సౌందర్యానికి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం!. ఆరోగ్యపరంగా.. మధుమేహన్ని నియంత్రిస్తాయి. ప్రతీరోజు రెండు స్పూన్ల సబ్జాగింజలు తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా తినాలన్న కోరికను నియంత్రిస్తుంది భోజనానికి ముందు సబ్జా గింజలను పెరుగులో కలిపి, కొన్ని కూరగాయ ముక్కలను జోడించి తీసుకుంటే మనకు తెలియకుండానే తక్కువగా ఆహారం తీసుకుంటాం. నానాబెట్టిన సబ్జాగింజలను నానబెట్టి తీసుకుంటే అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. ఏదోరకంగా సబ్జాగింజలను తీసుకుంటుంటే కడుపు మంటను నియంత్రించడమే గాక శరీరంలోని కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్గా మారకుండా నియంత్రిస్తుంది సబ్జాతో మరింత కాంతిమంతం సబ్జాగింజలను నీటిలో నానబెట్టి , పేస్టు చేయాలి. ఈ పేస్టులో టీస్పూను బాదం నూనె వేసి కలపాలి. ఈ పేస్టుని ముఖానికి పూతలా రాయాలి. పదినిమిషాలు ఆరాక మరోసారి పూత వేయాలి. పూర్తిగా ఆరాక చల్లటి నీటితో ముఖాన్ని కడిగేయాలి. దీంతో మీ ముఖం కాంతిమంతంగా, ఫ్రెష్గా కనిపిస్తుంది. పంటికి జామ నాలుగు జామ ఆకులని నీటిలో వేసి మరిగించాలి. మరిగిన నీటిని వడగట్టి..గోరువెచ్చగా ఉన్నప్పుడు నోట్లో పోసుకుని పుక్కిలించాలి. ఇలా పుక్కిలించడం వల్ల పంటినొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. జామ ఆకుల రసం పళ్లను మరింత దృఢంగా మారుస్తుంది. (చదవండి: రాత్రిళ్లు అకస్మాత్తుగా చెమటలు పడుతున్నాయా? బీ కేర్ఫుల్ అంటున్న వైద్యులు!) -
Fact Check: 'సర్టిఫై' చేసినా సణుగుడే..
నాడు: టీడీపీ హయాంలో విత్తనాల కోసం పడరాని పాట్లు పడేవారు. ఎండనక, వాననక.. రేయనకా పగలనక రైతులు నిద్రహారాలు మాని సొసైటీల వద్ద పడిగాపులు పడితేగానీ కాసిన్ని గింజలు దొరికేవి కావు. తమకు అనుకూలంగా ఉన్న వారు, కాస్త పలుకుబడి ఉన్న వారికి ఇవ్వగా మిగిలినవే సన్న, చిన్నకారు రైతులకు విదిల్చేవారు. విత్తనాల కోసం బారులు తీరిన క్యూలైన్లలో నిల్చొనే సందర్భంలో ఎండలు తట్టుకోలేక స్పృహతప్పి పడిపోవడం, వడగాడ్పుల బారినపడి చనిపోవడం అప్పట్లో సర్వసాధారణం. నేడు.. కానీ, ఇప్పుడు చూద్దామంటే ఎక్కడా ఒక్క క్యూలైన్ కన్పించడంలేదు. విత్తనం దొరకలేదని కానీ, నాసిరకం విత్తనంవల్ల పంటలను కోల్పోయామని కానీ ఏ ఒక్క రైతు ఫిర్యాదు చేసిన దాఖలాల్లేవు. పైగా ఏ సీజన్కు ఆ సీజన్లో సకాలంలో అన్నీ అందుతున్నాయి. విత్తనాల కొరత అనే ఊసేలేదు. చిన్నా, పెద్దా అనే తారతమ్యంలేదు. పక్కాగా సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలు అందుతున్నాయి. సాక్షి, అమరావతి: గ్రామస్థాయిలో ఆర్బీకేల ద్వారా నాణ్యమైన ధృవీకరించిన విత్తనాలను రైతులకు సరఫరా చేస్తోంది. నిజానికి ఇదొక విప్లవాత్మక మార్పు. ఈ రాష్ట్రంలో మాదిరిగా ఆర్బీకేలుగానీ, విత్తు నుంచి విక్రయం వరకూ రైతును చేయి పట్టుకుని నడిపించే వ్యవస్థ మరే రాష్ట్రంలోనూ లేదు. అయినా, బురదజల్లడమే పనిగా పెట్టుకున్న ఈనాడు ‘శనగ విత్తన పంపిణీలో డొల్లతనం’ అంటూ రైతులను తప్పుదారి పట్టించేలా ఆదివారం అసత్యాలతో ఓ రుచీపచీలేని కథనాన్ని వండివార్చింది. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని చేస్తున్నా.. ‘పచ్చ’కామెర్ల ‘ఈనాడు’కు ఇవేవీ కనపడవు. ఆ పత్రిక కక్కిన విషంపై ఈ ‘ఫ్యాక్ట్చెక్’.. ఆరోపణ: రాయితీ విత్తనంతో ఒరిగేదేంటి? వాస్తవం: 2023–24 సీజన్లో ఇప్పటికే 10.90 లక్షల మంది రైతులకు రూ.204.15 కోట్ల సబ్సిడీతో 5.99 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేశారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలో భాగంగా 80 శాతం రాయితీపై 96,392 మంది రైతులకు రూ.21.44 కోట్ల సబ్సిడీతో 24,635 క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేశారు. అలాగే, ముందస్తు రబీ కోసం 2.96 లక్షల క్వింటాళ్ల శనగ విత్తనాన్ని కూడా సిద్ధంచేశారు. సీజన్లో సబ్సిడీ విత్తన ధరలను ఏటా రాష్ట్రస్థాయి ధరల నిర్ణయాక కమిటీ నిర్ణయిస్తుంది. అదే రీతిలో మొన్న సెప్టెంబర్ 15 నాటికి స్థానిక మార్కెట్ ధరలను అనుసరించి విత్తన శుద్ధి, ప్యాకింగ్, రవాణా ఖర్చులు, తాలు మినహాయింపు, ప్రాసెసింగ్ నష్టం వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని శనగ విత్తన ధరలను నిర్ణయించారు. జేజీ–11 రకానికి క్వింటాకు రూ.8,100, కేఏకే–2 రకానికి రూ.14,050 చొప్పున నిర్ణయించారు. గత ఏడాది 25 శాతం రాయితీపై ఎకరాకు 25 కేజీలు సరఫరా చేయగా, ఈ ఏడాది నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా చిన్న, సన్నకారు రైతులకు 40 శాతం రాయితీపై ఎకరాకు 40 కేజీల చొప్పున విత్తన సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆరోపణ: నాసిరకం అంటూ తిరుగుటపా? వాస్తవం: వ్యవసాయశాఖ నుంచి 2,59,660 క్వింటాళ్ల జేజీ–11 రకం, 36,313 క్వింటాళ్ల కేఏకే–2 రకం విత్తనం కోసం ఇండెంట్ రాగా.. వైఎస్సార్, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, ప్రకాశం తదితర జిల్లాలకు 1.30 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచారు. ఇప్పటివరకు 85,598 మంది రైతులకు 68,655 క్వింటాళ్ల విత్తనాన్ని వాటి ద్వారా సరఫరా చేశారు. వైఎస్సార్ జిల్లాలో 74,120 క్వింటాళ్ల విత్తనం అవసరం కాగా.. ఇప్పటికే 61,670 క్వింటాళ్లు సిద్ధంచేశారు. విత్తనం కోసం ఆర్బీకేల్లో 41,746 మంది రైతులు తమ వివరాలను నమోదు చేయగా, ఇప్పటికే 45వేల క్వింటాళ్ల విత్తనాన్ని సరఫరా చేశారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన విత్తనాల్లో సన్నగింజ, మట్టిగడ్డలు, పుల్లలతో సరఫరా చేస్తున్నారని, నాసిరకంగా ఉన్నాయని, నాణ్యత బాగోలేదని ఏ ఒక్క రైతు ఫిర్యాదు చేసిన, తీసుకున్న విత్తనాన్ని వెనక్కి ఇచ్చిన దాఖలాలు కానీ లేవు. అయినా సరే.. ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న ఈనాడు రైతులను రెచ్చగొట్టే ధోరణిలో రోజుకో తప్పుడు కథనాన్ని ప్రచురిస్తుండడంపట్ల రైతులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఆరోపణ: సన్నగింజ.. మట్టిగడ్డలు.. పుల్లలే.. వాస్తవం: సాధారణంగా విత్తన నాణ్యత ప్రమాణాలను నాలుగు దశలలో పరీక్షించిన తర్వాత ఆర్బీకేల ద్వారా రైతులకు సరఫరా చేస్తున్నారు. ఏపీ సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ ద్వారా సర్టిఫై చేసిన సీడ్ను ఆ తర్వాత ఏపీ సీడ్స్ క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్, నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటుచేసిన ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్లలో పరీక్షిస్తారు. చివరగా.. ఆర్బీకేల ద్వారా సరఫరా చేసే ముందు సంబంధిత ఆర్బీకే ఇన్చార్జి, ఆయా గ్రామాల అభ్యుదయ రైతుల సమక్షంలో మొలక, భౌతిక పరీక్షలు నిర్వహించి నాణ్యత బాగుందని నిర్థారించిన తర్వాతే రైతులకు సరఫరా చేసేందుకు అనుమతిస్తారు. ఇదేరీతిలో అత్యంత శాస్త్రీయంగా, విత్తన నాణ్యతను పరీక్షించిన తర్వాతే విత్తన పంపిణీకి అనుమతిచ్చారు. -
‘అంతరిక్ష విత్తనాలు’ ఆదుకుంటాయా?
భూమ్మీద అధిక ఉష్ణం, కరువు పరిస్థితులను ఎదుర్కొని సజావుగా పంట దిగుబడులు పొందాలంటే అందుకు తగినంత జన్యు దృఢత్వం కలిగిన వైవిధ్య భరితమైన వంగడాలు అవసరం. కానీ గడ్డు పరిస్థితులను తట్టుకొనే జన్యు దృఢత్వం తేవడం ఎలా అన్నది ప్రశ్న? అయితే అంతరిక్షంలో వేగంగా ఉత్పరివర్తనాలకు గురైన విత్తనాలతో భూమ్మీద ప్రతికూలపరిస్థితులను తట్టుకొనే వంగడాల తయారీ సాధ్యమనే వాదన బలంగా వినిపిస్తోంది. మరి ఇందులో నిజం ఎంత? ఈ నెల 4 నుంచి 10 వరకు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల నేపథ్యంలో ఈ అంశంపై ప్రత్యేక కథనం. (సాక్షి, సాగుబడి డెస్క్) విత్తన జన్యువ్యవస్థను సంపూర్ణంగా ప్రభావితం చేసే స్పేస్ బ్రీడింగ్... జన్యుమార్పిడి/సవరణకన్నా మెరుగైన ఫలితాలను అందిస్తుందని కొందరు శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. 15 ఏళ్లుగా స్పేస్ బ్రీడింగ్ ద్వారా కొత్త వంగడాలు రూపొందిస్తూ బహుళ ప్రయోజనాలు పొందుతున్నట్లు చైనా చెబుతోంది. మరోవైపు తొలిసారిగా అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ), ఐక్యరాజ్య సమితి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) సంయుక్తంగా స్పేస్ బ్రీడింగ్ ప్రాజెక్టుకు 2022 నవంబర్ 7న శ్రీకారం చుట్టాయి. ‘నాసా’కు చెందిన వాల్లప్స్ ఫ్లైట్ ఫెసిలిటీ రోదసీ నౌక ద్వారా భూమికి 175 మైళ్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తెల్లజొన్న విత్తనాలు, అరాబిడోప్సిస్ అనే ఆకుకూర విత్తనాలను అంతరిక్షంలోకి పంపాయి. కొన్ని విత్తనాలను అంతరిక్ష కేంద్రం లోపల భారరహిత స్థితిలో ఉంచగా మరికొన్నింటిని కేంద్రం బయట కాస్మిక్ రేడియేషన్కు గురిచేశాయి. ఆర్నెల్ల తర్వాత వాటిని 2022 ఏప్రిల్లో తిరిగి భూమిపైకి తీసుకొచ్చాయి. ఆ్రస్టియా రాజధాని వియన్నాలో ఏర్పాటైన ఐఏఈఏ, ఎఫ్ఏఓ ఉమ్మడి ప్రయోగశాలలోని పాలిహౌస్లో వాటిని ప్రయోగాత్మకంగా పెంచుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు కేరళకు చెందిన జన్యుశాస్త్ర నిపుణురాలు డా. శోభ శివశంకర్ సారథ్యం వహిస్తుండగా, మరో భారతీయ శాస్త్రవేత్త అనుపమ హింగనె ప్రయోగాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అనేక సీజన్లపాటు సాగు చేసి వాటి జన్యుమార్పులను నిర్ధారించాక సరికొత్త వంగడాలను రైతులకు అందించనున్నాయి. చైనా పొలాల్లో 260 ‘అంతరిక్ష వంగడాలు’! అంతరిక్షంలోని రేడియేషన్లో కొన్నాళ్లు ఉంచి భూమిపైకి తెచి్చన విత్తనాల (స్పేస్ ఇండ్యూస్డ్ మ్యుటేషన్ బ్రీడింగ్ లేదా స్పేస్ బ్రీడింగ్)తో సరికొత్త వంగడాలను రూపొందిస్తూ చైనా కొన్ని దశాబ్దాలుగా ప్రయోజనం పొందుతోంది. చైనా వ్యవసాయ పరిశోధనా సంస్థ (సీఏఏఎస్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్, చైనా అణు వ్యవసాయ శా్రస్తాల సంస్థ అధ్యక్షుడు కూడా అయిన డా. లూక్సియాంగ్ లియు చెబుతున్న మాట ఇది. ‘ప్లాంట్ బ్రీడింగ్ అండ్ జెనెటిక్స్’ న్యూస్లెటర్ 2023 జనవరి సంచికలో స్పేస్ బ్రీడింగ్ ప్రయోజనాలను వివరిస్తూ ఆయన ఓ వ్యాసం రాశారు. వరి, గోధుమ, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, నువ్వు, క్యాప్సికం, టొమాటో తదితర పంటలకు చెందిన 260 వంగడాలను ఇప్పటివరకు విడుదల చేసినట్లు డా. లియు ఆ వ్యాసంలో వెల్లడించారు. 2011లో విడుదల చేసిన ‘లుయుయాన్ 502’ గోధుమ వంగడంతో 12% దిగుబడి పెరగడంతోపాటు కరువును, ప్రధాన తెగుళ్లను తట్టుకుంటోందని పేర్కొన్నారు. హెక్టారుకు 12.18 టన్నుల గోధుమ దిగుబడినిస్తున్నదని డా. లియు చెప్పారు. 2016 తర్వాత 21 గోధుమ, 15 వరి, 7 మొక్కజొన్న వంగడాలను అధికారికంగా విడుదల చేశామన్నారు. మెరుగైన వంగడాల అభివృద్ధికి అవసరమే! అంతరిక్షంలో ఉత్పరివర్తనాలు(మ్యుటేషన్లు) ఎక్కువ సంఖ్యలో వస్తాయి. కాస్మిక్ ఎనర్జీ వల్ల విత్తనాల్లోని డిఎన్ఎలో పెనుమార్పులు సంభవిస్తాయి. కాంబినేషన్లు మారిపోతాయి. కొత్త వేరియంట్స్ ఆవిష్కరణకు, విస్తృతమైన జీవ వైవిధ్యానికి ఇది అవసరం. 1960వ దశకంలో ఎక్స్రేస్, గామారేస్తో మ్యుటేషన్ బ్రీడింగ్పై విస్తృత పరిశోధనాలు జరిగాయి. వరిలో జగన్నాద్ రకం అలా వచ్చిందే. అయితే, ఆ మ్యుటేషన్ల ద్వారా మనుగడలోకి వచ్చిన వంగడాలు చాలా తక్కువ. స్పేస్ బ్రీడింగ్ వల్ల లక్షల్లో మ్యుటేషన్లు వస్తే వాటిని స్థిరీకరించిన తర్వాత కొన్నయినా ఉపయోగపడొచ్చు. మ్యుటెంట్ లైన్స్ను ఉపయోగించుకొని పలు వాతావరణ పరిస్థితులకు అనువైన వాటిని స్థిరీకరించిన తర్వాత మెరుగైన వంగడాలను తయారు చేసుకోవడానికి స్పేస్ బ్రీడింగ్ ఉపయోగపడుతుంది. – డా. రాఘవరెడ్డి, మాజీ కులపతి, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం. రైతుల సమస్యలు తీరతాయనుకోవటం భ్రమే! మొక్కలు మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సహజంగానే మారుతూ ఉంటాయి. అంతరిక్షంలో గాలి, వత్తిడి ఉండదు. కాస్మిక్ కిరణాలు పడతాయి. అటువంటి అంతరిక్షంలోకి పంపిన విత్తనాల్లో వచ్చే పెను మార్పులు మంచివి కావొచ్చు, చెడువి కావొచ్చు. కొన్నిటిని మాత్రమే మనం గుర్తించగలం. గుర్తించలేని మార్పుల వల్ల ఎటువంటి పరిణామాలుంటాయో తెలియదు. మారిన దాని ప్రభావం వల్ల ఎలర్జీ రావచ్చు, ఇంకేదైనా సమస్య రావచ్చు. జన్యుమార్పిడి మాదిరిగానే మ్యూటేషన్ బ్రీడింగ్ వల్ల కూడా జీవ భద్రతకు ముప్పు ఉంటుంది. దీని వల్ల ఉపయోగం 0.0001% మాత్రమే. దానికి పెట్టే ఖర్చుకు, పొందే ప్రయోజనానికి పొంతన ఉండదు. ఈ హై టెక్నాలజీ ఫలితాలు అకడమిక్ పరిశోధనలకు పరిమితం. దీంతో రైతుల సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుందనుకోవటం భ్రమ. 60 ఏళ్లుగా మ్యూటేషన్ బ్రీడింగ్ అనుభవాలు చెబుతున్నది ఇదే. భూమ్మీదే సుసంపన్నమైన పంటల జీవవైవిధ్యం ఉంది. ప్రకృతిసిద్ధమైన వాతావరణంలో రెగ్యులర్ సెలక్షన్ ద్వారా వంగడాల ఎంపికపై ఆధారపడటమే మేలు. అధిక ఉష్ణాన్ని తట్టుకునే టొమాటో మొక్క భూమ్మీద దొరుకుతుంది. చంద్రుడి మీద దొరకదు కదా! – డా. జీవీ రామాంజనేయులు, సుస్థిర వ్యవసాయ కేంద్రం, కృష్ణ సుధా అకాడమీ ఫర్ ఆగ్రోఎకాలజీ. -
జీలకర్రలో కల్తీని నిమిషాల్లో ఇలా గుర్తించండి..
కల్తీని గుర్తిద్దామిలా... ►ఇప్పుడు ఏది చూసినా కల్తీ అవుతోంది. కల్తీ కలిసిన జీలకర్ర తింటే ఆరోగ్యం పాడవుతుంది. అందువల్ల జీలకర్రను నాణ్యమైనదో కాదో ఇలా తెలుసుకోండి... ► కొద్దిగా జీలకర్రను తీసుకుని నలిపి చూడాలి. నలిపినప్పటికీ జీలకర్ర అలానే ఉంటే జీలకర్రలో ఏదీ కలవలేదని అర్థం. ► జీలకర్రను నీటిలో వేసి ఐదు నిమిషాలు నానబెట్టాలి. నీరు రంగు మారితే జీలకర్రలో ఏదో కల్తీ జరిగినట్టే. ► జీలకర్ర వాసన లేకపోతే అది స్వచ్ఛమైన జీలకర్ర కాదు. ఇలా చేస్తే దంతాలు ఆరోగ్యంగా.. వేడి నీళ్లలో బేకింగ్ సోడా, కొద్దిగా నిమ్మరసం వేసి కలపాలి. ఈ నీటిలో టూత్ బ్రష్ను మునిగేలా వేసి ఇరవై నిమిషాలు నానబెట్టాలి. తరువాత సాధారణ నీటితో కడిగితే బ్రష్లో ఉన్న మురికి, బ్యాక్టీరియా పోతుంది. పదిరోజులకొకసారి బ్రష్లను ఇలా శుభ్రం చేసుకుంటే, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండిని కలపాలి. ఈ మిశ్రమంలో ముంచిన టిక్కాను, తరువాత గుడ్లసొనలో ముంచి డీప్ఫ్రై చేస్తే టిక్కా క్రిస్పీగా మరింత రుచిగా వస్తుంది. -
ఊపందుకున్న మిరప సాగు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మిరప సాగు ఊపందుకుంటోంది. సీజన్ ప్రారంభంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోయినప్పటికీ.. గడచిన రెండు వారాలుగా కురుస్తున్న వర్షాలు మిరప రైతులకు ఊరట ఇస్తున్నాయి. ఫలితంగా లక్ష్యం దిశగా మిరప సాగు పయనిస్తోంది. మార్కెట్లో మంచి ధర పలుకుతుండటం.. పెరిగిన ప్రభుత్వ ప్రోత్సాహంతో రైతులు మిరప పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేసేందుకు సమాయత్తమయ్యారు. రాష్ట్రంలో మిరప సాధారణ విస్తీర్ణం 4.87 లక్షల ఎకరాలు కాగా.. 50 శాతం వర్షాధారం కింద, మరో 50 శాతం బోర్ల కింద సాగవుతోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విత్తు నుంచి మార్కెటింగ్ వరకు తీసుకున్న చర్యల ఫలితంగా నాణ్యమైన దిగుబడులు పెరగడంతో మార్కెట్లో మంచి ధరలు లభిస్తున్నాయి. నాలుగేళ్లలో కనిష్ట ధర 3 రెట్లు పెరిగితే.. గరిష్ట ధర రెట్టింపు దాటింది. ఫలితంగా మిరప సాగు ఏటా విస్తరిస్తోంది. 2022–23లో 5.77 లక్షల ఎకరాల్లో మిర్చి సాగవగా.. 11.50 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. 2023–24 ఖరీఫ్ సీజన్లో 5.67 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్ధేశించగా.. ప్రస్తుతం రికార్డు స్థాయిలో పలుకుతున్న ధరల ఫలితంగా 6.50 లక్షల ఎకరాల్లో మిర్చి సాగవుతుందని అంచనా. దిగుబడులు సైతం 12 లక్షల టన్నులు దాటుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆర్బీకేల ద్వారా అన్ని సేవలు ఆర్బీకేల ద్వారా సర్టీఫై చేసిన నాణ్యమైన డిమాండ్ ఉన్న మిరప సీడ్ రైతులకు అందుబాటులో ఉంది. ఎరువులు, పురుగుల మందుల కొరత లేకుండా సీజన్ ముందు నుంచే ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. నల్లతామరతో పాటు ఇతర చీడపీడలు, తెగుళ్ల బారిన పడకుండా పంటను కాపాడటం, ఉత్తమ యాజమాన్య పద్ధతుల ద్వారా నాణ్యమైన దిగుబడులు సాధించడమే లక్ష్యంగా ఆర్బీకేల ద్వారా తోట బడులు నిర్వహిస్తూ రైతులకు శిక్షణ కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రైతుకు ఊరటనిస్తోన్న వర్షాలు మిరప రైతులు సాధారణంగా జూన్, జూలైలో నారు పోస్తారు. అక్టోబర్ వరకు నాట్లు వేస్తారు. సీజన్ ఆరంభంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు మిరప రైతులను ఒకింత కలవరపాటుకు గురి చేశాయి. బోర్ల కింద ఇబ్బంది లేనప్పటికీ వర్షాధారం కింద పండించే చోట్ల ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. ఆగస్టు నెలాఖరు నుంచి కురుస్తున్న వర్షాలు మిరప రైతులకు ఊరటనిచ్చాయి. కనీసం సాధారణ విస్తీర్ణంలోనైనా సాగవుతుందో లేదో అనే ఆందోళన చెందిన అధికారులు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఇదే రీతిలో కొనసాగితే నిర్ధేశించిన సాగు విస్తీర్ణం అధిగమించడం పెద్ద కష్టం కాదని చెబుతున్నారు. ప్రస్తుతం 3.50 లక్షల ఎకరాల్లో మిరప నాట్లు పడగా.. ఇదేరీతిలో వర్షాలు కురిస్తే సీజన్ ముగిసే నాటికి 5.50 లక్షల నుంచి 6 లక్షల ఎకరాలు దాటుతుందని చెబుతున్నారు. వర్షాలు కురవకపోతే 5 లక్షల నుంచి 5.50లక్షల ఎకరాలకు పరిమితమవుతుందని, దిగుబడులు మాత్రం 11 నుంచి 12 లక్షల టన్నుల మధ్య ఉంటుందని ఉద్యాన శాఖ అంచనా వేస్తోంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదురొడ్డి.. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో ప్రతికూల పరిస్థితులను ఎదురొడ్డి మరీ మిరప రైతులు సాగు చేస్తున్నారు. ఆగస్టులో వర్షాభావ పరిస్థితులను చూస్తే ఈసారి సాధారణ విస్తీర్ణం కూడా దాటలేం అనుకున్నాం. కానీ.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు మిరప సాగు విస్తీర్ణం పెరిగేందుకు దోహదపడేటట్టు ఉన్నాయి. అక్టోబర్ నెలాఖరు వరకు ఇదే రీతిలో వర్షాలు కురిస్తే విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది. – ఎస్ఎస్.శ్రీధర్, కమిషనర్, ఉద్యాన శాఖ -
తెలుగు రాష్ట్రాల్లో ఉత్తమ సీడ్ కంపెనీగా వేద సీడ్స్కు అవార్డ్
-
Fact check: విత్తనాలున్నాయ్.. చూస్తే కనిపిస్తాయ్..
సాక్షి, అమరావతి: బెట్ట పరిస్థితులున్నాయి.. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ఏదంటూ నిన్నటి వరకు ఓ రకమైన ఏడుపు.. నాలుగు వర్షాలు కురవగానే వానలు కురుస్తున్నా విత్తనాలేవంటూ ఇప్పుడు కొత్తగా మరో ఏడుపు. ఇది ఈనాడుకు మాత్రమే తెలిసిన భిన్న రాగాలు. ఇందులో విశేషమేమిటంటే.. రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల క్రితమే ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను రూపొందించి, అమల్లో పెట్టిన విషయం ఈనాడు గ్రహించలేకపోవడం. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సీజన్లో సాగు ముందుకు సాగక ఇబ్బంది పడుతున్న రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుంటే రామోజీకి మాత్రం ఇవేమీ కనిపించడంలేదు. సాగు వేళ కష్టాల్లో ఉన్న రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తూ అండగా నిలవాల్సింది పోయి వారిని రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తూ వక్రబుద్ధిని ప్రదర్శిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏనాడూ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సక్రమంగా అమలు పరిచింది లేదు. రైతులకు సరిగా విత్తనాలిచ్చిందీ లేదు. పైగా, రూ.384 కోట్లు విత్తన బకాయిలు పెట్టింది. ఈ బకాయిలను కూడా ప్రస్తుత ప్రభుత్వమే చెల్లించింది. దీనిపై ఏనాడూ నోరు మెదపని రామోజీ.. ఇప్పుడు మాత్రంరైతులకు అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉంచి, అన్నదాతకు అన్ని విధాలుగా సహకరిస్తున్నా, బురద జల్లుతున్నారు. ప్రతి 15 రోజులకూ సమీక్ష రాష్ట్రంలో ఖరీఫ్ సాగు లక్ష్యానికి అనుగుణంగా సీజన్కు ముందుగానే రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకేల్లో) 5.73 లక్షల క్వింటాళ్ల విత్తనాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. 7.32 లక్షల మంది రైతులకు 5.14 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేసింది. అయితే, జూన్లో వర్షాలు సరిగా కురవలేదు. వెంటనే ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు శాస్త్రవేత్తలు, సంబంధిత శాఖల నిపుణులతో సమాలోచనలు జరిపి ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను రూపొందించింది. ప్రతి 15 రోజులకోసారి పరిస్థితిని సమీక్షిస్తూ తదనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. జూలైలో అధిక వర్షాల వల్ల నారుమళ్లు, నాట్లు దెబ్బతిన్న కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో రైతులు కోరుకున్న వరి విత్తనాలను 80 శాతం సబ్సిడీపై పంపిణీ చేసింది. రాయలసీమ జిల్లాల్లో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అక్కడి రైతులకు అవసరమైన విత్తనాలను 80 శాతం సబ్సిడీపై పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. గతంలో వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు రైతుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు ఉలవలు, అలసందలు, పెసలు, మినుములు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగుల విత్తనాలను సిద్ధం చేసింది. రాయలసీమ జిల్లాల్లో ఏ ఆర్బీకేకు వెళ్లినా విత్తనాలకు కొదవలేదు. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక కింద ఆర్బీకేల్లో సిద్ధం చేసిన విత్తన నిల్వల వివరాలతో పాటు ఏ విధంగా సాగు చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే విషయంపై కరపత్రాలు, వాల్ పోస్టర్లు, వ్యవసాయ సలహా మండళ్లు, పంటల వారీ వాట్సప్ గ్రూపులు, ఆర్బీకే ఛానల్, ఆర్బీకేల ద్వారా రైతులకు విస్తృత అవగాహన కల్పిస్తోంది. జిల్లాల నుంచి 77,049 క్వింటాళ్ల విత్తనం అవసరమని ఇండెంట్లు రాగా.., 78,440 క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేసింది. ఆగస్టు 17వ తేదీ నుంచే విత్తన సరఫరా ప్రారంభించింది. 80 శాతం సబ్సిడీపై అన్ని రకాల విత్తనాలు సమృద్ధిగా ఉంచినప్పటికీ ఎక్కువ శాతం ఉలవలు ఇస్తున్నారంటూ దు్రష్పచారం చేయడం విడ్డూరం. రైతులు కోరిన పంట విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేస్తోందే తప్ప వారికి అవసరం లేని వాటిని సరఫరా చేయడం వల్ల ప్రయోజనం ఏముంటుందో రామోజీకే తెలియాలి. అన్ని రకాల విత్తనాలు సిద్ధం రాష్ట్ర ప్రభుత్వం జూన్లోనే రైతులకు అవసరమైన అన్ని రకాల విత్తనాలను సరిపడినంతగా సిద్ధంగా ఉంచింది. విత్తనం దొరకడంలేదని రాష్ట్రవ్యాప్తంగా ఒక్క రైతూ అనలేదు. ఎందుకంటే.. వారి కళ్లెదుటే ఆర్బీకేల్లో విత్తనాలు కనిపిస్తున్నాయి. చూడనిది ఈనాడు మాత్రమే. అనంతపురం జిల్లాల్లో 6,700 క్వింటాళ్ల విత్తనాన్ని రైతులకు అందుబాటులో ఉంచింది. శ్రీ సత్యసాయి జిల్లాలో 8,960 క్వింటాళ్లు, చిత్తూరు జిల్లాలో 2,700 క్వింటాళ్లు, అన్నమయ్య జిల్లాలో 7,419 క్వింటాళ్లు సిద్ధం చేసింది. తిరుపతి జిల్లాలో రైతుల కోరిన 226 క్వింటాళ్ల ఉలవలు అందుబాటులో ఉంచింది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ముందస్తు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక లేనప్పటికీ, స్థానికంగా వచ్చిన డిమాండ్ మేరకు 3,151 క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేసింది. వైఎస్సార్ జిల్లాలో తొలిదశలో 612 క్వింటాళ్లు, రెండో దశలో 3,929 క్వింటాళ్ల విత్తనం నిల్వ చేసింది. సీజన్ ముగిసేవరకు వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రాంతాల్లో 80 శాతం రాయితీపై విత్తనాల సరఫరాకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే, ఈ సీజన్లో వర్షాలు మరీ తక్కువగా ఉండటంతో రైతులు ముందస్తు రబీ పంటలు వేసుకొనే ఆలోచనలో ఉన్నారు. అందువల్ల వారు ఖరీఫ్లో సాగుకు ఆసక్తి చూపించడంలేదు. తక్కువ మొత్తంలో విత్తనాలు తీసుకుంటున్నారు. దీంతో రాయలసీమ ప్రాంతాల్లో.. ముఖ్యంగా అనంతపురం, వైఎస్సార్, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ముందస్తు రబీ కింద శనగ సాగుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నందున ప్రభుత్వం కూడా ముందస్తుగానే సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ఆర్బీకేల ద్వారా శనగ విత్తనం సరఫరాకు ఏర్పాట్లు చేస్తోంది. వాస్తవాలు ఇలా ఉంటే ఈనాడులో సత్యదూరమైన ఆరోపణలతో అబద్ధాలను అచ్చేయడంపట్ల రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
ఆ కంపెనీకి రైతులే ఓనర్లు!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : అక్కడ రైతులంతా సంఘటితమయ్యారు. అంతా మాట్లాడుకొని ఓ కంపెనీని ఏర్పాటు చేశారు. రైతులు పంటలు సాగు చేసే క్రమంలో దుక్కి దున్నడం మొదలుకొని పంట చేతికొచ్చాక లాభసాటిగా అమ్ముకునే వరకు అంతా ప్రయోజనం పొందడమే లక్ష్యంగా ఏర్పాటైన కంపెనీ. దీనికి 2019లోనే అడుగులు పడ్డాయి. పది మందితో మొదలై నేడు 900 మంది సభ్యులకు చేరుకున్న ఆ కంపెనీ ద్వారా ఇప్పుడు రైతులు గణనీయ అభివృద్ధిని సాధిస్తున్నారు. అదే నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని ‘ఫార్మర్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్’. పది మందితో మొదలై.. ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ (ఐఆర్డీఎస్) సహకారంతో కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామపంచాయతీ పరిధిలోని గంగదేవిగూడెంలో 2019లో కట్టంగూర్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ కార్యాలయం ఏర్పాటైంది. మొదట్లో పది మంది డైరెక్టర్లుగా ఏర్పడి, ఒక్కొక్కరు 10 మందిని చేరి్పంచగా, మొత్తంగా ముందుకొచ్చిన 500మంది రైతులతో కంపెనీ ప్రారంభమైంది. నాబార్డు సహకారంతో కంపెనీలో చేరిన ఒక్కొక్కరు రూ.1000 చొప్పున రూ.5లక్షలు కూడబెట్టి, నాబార్డు నుంచి మరో రూ.5 లక్షలు ఆర్థిక సహకారం పొంది రూ.10 లక్షలతో తమ పని ప్రారంభించారు. పనితీరును చూసి, నాబ్ కిసాన్ మరో రూ.20 లక్షలు మంజూరు చేసింది. దీంతో నిత్యం వ్యవసాయ పనుల్లో ఉపయోగపడే ట్రాక్టర్, నానో ట్రాక్టర్, బెయిలర్, రోటో వేటర్లు, డ్రమ్ సీడర్, కల్టివేటర్, ఆప్వీల్స్, ప్లవ్, విత్తన డ్రిల్తో పాటు పిచికారీ చేసే పంపుసెట్లు కొనుగోలు చేశారు. వాటన్నింటినీ కంపెనీలోని సభ్యులతోపాటు ఇతర రైతులు బయటి కంటే తక్కువ ఖర్చుతో వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు. దీనిపై రైతుల్లో అవగాహన పెరుగుతున్న కొద్దీ సభ్యుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం 900 మందికి చేరుకున్న కంపెనీ ద్వారా రైతు సేవలు విస్తృతం అయ్యాయి. దీంతో నాబార్డు తన 41వ వార్షికోత్సవంలో దీనికి రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డును ఇచ్చింది. అందుబాటులోకి విత్తనాలు నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు కొని మోసపోకుండా కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం నుంచే తమకు విత్తనాలు అందేలా మాట్లాడుకున్నారు. ఎరువులు, పురుగు మందులను సబ్ డీలర్ల వద్ద కొనుగోలు చేసినా, తరువాత కంపెనీ పేరుతో డీలర్íÙప్ తీసుకొని మార్క్ఫెడ్, ఇఫ్కో, కోరమాండల్ కంపెనీలనుంచే నేరుగా వాటిని కొనుగోలు చేస్తున్నారు. విత్తనాలు కూడా కంపెనీల నుంచే నేరుగా కొనుగోలు చేస్తుండటంతో మార్కెట్ రేట్ కంటే తక్కువ ధరకు వస్తుండటంతో వారు లబ్దిపొందుతున్నారు. ముందుకొచ్చిన దాతలు రైతుల ఐక్యతను చూసి దాతలు ముందుకొచ్చారు. ముఖ్యసలహాదారుడిగా సేవలు అందిస్తున్న నల్లగొండ మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి ఎన్ఆర్లు సహకరించేలా ఒప్పించారు. దీంతో మూడు టన్నుల కెపాసిటీ కలిగిన ఒక ట్రాక్టర్ ట్రాలీ, ఆరు టన్నుల కెపాసిటీ కలిగిన రెండు ట్రాలీలు వారు కంపెనీకి అందజేశారు. ఆ వాహనాలతో రైతులు పండించిన కూరగాయలు, నిమ్మ, బత్తాయి సరుకులను నేరుగా హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లోని మార్కెట్లకు తరలించి విక్రయిస్తున్నారు. రిటైర్డ్ టీచర్ మేరెడ్డి సత్యనారాయణరెడ్డి తన 2.30 ఎకరాల భూమిని కంపెనీకి ఉచితంగా ఇచ్చారు. అందులో ఆర్గానిక్ ఫాంహౌజ్ ఏర్పాటు చేశారు. ప్రారంభానికి సిద్ధంగా కోల్డ్ స్టోరేజీలు మార్కెట్లో మంచి ధర వచ్చే వరకు నిమ్మ, బత్తాయి తదితర ఉత్పత్తులను నిల్వచేసుకునేలా కోల్డ్ స్టోరేజీ యూనిట్లను (ఒక్కొక్కటి రూ.15 లక్షలతో) జిల్లాలోని వివిధ మండలాల్లో ఏర్పాటు చేసింది. ఒక్కోదాంట్లో 10 టన్నులు స్టోర్ చేసే సదుపాయం కల్పించింది. మండంలోని గంగదేవిగూడెంలో 4 (కంపెనీ కార్యాలయం), అయిటిపాముల –1, బొల్లేపల్లి –1, పామనగుండ్ల–1, నకిరేకల్ మండలం మర్రూర్–1, శాలిగౌరారం–1, నార్కట్పల్లి–1, దేవరకొండ మండలం–1. చిట్యాల–1 చొప్పుల ఏర్పాటు చేసి వాటిల్లో నిమ్మ ఉత్పత్తులను పెట్టి పరిశీలిస్తోంది. త్వరలోనే వీటిని ప్రారంభించనుంది. విద్యుత్ బిల్లును అధిగమించేలా సోలార్ సిస్టమ్తో వీటిని అనుసంధానం చేసింది. నిమ్మకు గ్రేడింగ్, ధర వచ్చినప్పుడే విక్రయాలు కట్టంగూర్ మండలంలో ఎక్కువగా నిమ్మకాయలు పండించే రైతులు ఉండటంతో నిమ్మకాయల గ్రేడింగ్ మిషన్ ఏర్పాటు చేశారు. నాలుగు వేర్వేరు గ్రేడ్లుగా నిమ్మకాయలను విభజిస్తున్నారు. ఆ గ్రేడ్ల ప్రకారం వేర్వేరుగా కోల్డ్ స్టోరేజీ బాక్స్ల్లో నిలువ ఉంచి మార్కెట్ ధర వచ్చినప్పుడే అమ్ముకుంటున్నారు. గ్రేడ్ 2, గ్రేడ్–3 రకం నిమ్మకాయలతో నిమ్మ ఒరుగులు తయారు చేసి వాటిని కూడా అమ్ముతున్నారు. నిమ్మకాయలను హైదరాబాద్లోని రహేజా, పొలిమేర, విజేత వంటి కంపెనీలకు నేరుగా విక్రయిస్తారు. ఐక్యంగా ముందుకు.. ఐక్యంగా ముందుకు సాగుతున్నాం. నకిలీ విత్తనాలు, పురుగు మందులతో మోసపోకుండా, దళారులకు çపంటలు అమ్మి నష్టపోకుండా ముందుకు సాగుతున్నాం. అభివృద్ధిని సాధిస్తున్నాం. – చెవుగోని సైదమ్మ, కంపెనీ చైర్మన్ సాగులో ఖర్చు తగ్గించేలా పంటల సాగులో రైతులకు ఖర్చు తగ్గించేలా కంపెనీ పని చేస్తోంది. పనిముట్లు మార్కెట్ కంటే తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చాయి. – వాడేపల్లి రమేష్, ఐఆర్డీఎస్ అధ్యక్షుడు -
మామిడి టెంకే!.. అని పడేయొద్దు!ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే..
పండ్లలలో రారాజు మామిడికాయ. టెంకే కదా అని తీసిపడేయొద్దు!. దీని వల్ల కలిగే అద్భత ప్రయోజనలు అన్ని ఇన్ని కావు. మామిడి టెంకను బ్యూటి ప్రొడక్ట్గా వాడతారని మీకు తెలుసా! ఇది మీ చర్మాన్ని, జుట్టుని ఆరోగ్యంగా ఉంచడంలో బెస్ట్ ఆప్షన్గా చెప్పొచ్చు. ఇది అందించే ప్రయోజనాలు ఏంటంటే.. ప్రయోజనాలు ఈ టెంకలోని గింజల పొడిని సేవించినా ఆరోగ్యానికి మంచిదే ఇది అతిసారం, ఊబకాయం, హృదయ సంబంధ వ్యాధులకు మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. దీని నుంచి తయారు చేసిన నూనె జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎలా ఆరోగ్యాన్ని సంరక్షిస్తుందంటే.. చుండ్రుకి చెక్పెడుతుంది మాడిగింజల పొడిని ఆవాల నూనెతో కలిపి అప్లై చేస్తే అలోపేసియా, జుట్టు రాలడం, నెరిసిపోవడం, చుండ్రు వంటివి రావు. టూత్ పౌడర్గా మామిడిగింజల పౌడర్ని టూత్ పౌడర్గా ఉపయోగిస్తే మీదంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. విరేచనాలకు ఔషధంగా మామిడి గింజల పొడిని రోజుకు మూడుసార్లు తీసుకుంటే విరేచనాలు తగ్గుముఖం పడతాయి. ఈ మామిడిగింజల పొడిని నీడలో ఎండబెట్టి తేనెతో తీసుకుంటే అతిసారం నుంచి సులభంగా బయటపడొచ్చు. ఒబెసిటీకి చక్కటి మందులా.. ఒబెసిటీ సమస్యతో బాధపడుతున్న వారికి ఇది చక్కటి మందులా ఉపయోగపుడుతుంది. దీన్ని తీసుకుంటే తక్షణ శక్తి పొందడమే గాక కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గించి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. కొలస్ట్రాల్ని కరిగించేస్తుంది రక్తప్రసరణను పెంచి చెడు కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది రక్తంలో పడిపోయిన చక్కెర స్థాయిలను, సీ రియాక్టివ్ ప్రోటీన్ స్థాయిలను, జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. గుండె సంబంధిత వ్యాధులకు.. రోజువారీ ఆహాకంలొ మామిడి గింజలను తక్కువ మొత్తంలో తీసుకుంటే గుండె సమస్యలు, అధిక రక్త పోటు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. డ్రై లిప్స్కి చెక్ పెదాలు హైడ్రేట్ చేయడానికి మామిడి గింజల పొడితో తయారు చేసిన బామ్ని ఉపయోగిస్తే పెదాలు మృదువుగా ఉంటాయి. చర్మకణాలు పునురజ్జీవింపజేస్తుంది. మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. మధుమేహం మామిడి గింజ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ప్రేగు, కాలేయంలలో గ్లూకోజ్ శోషణను తగ్గిస్తుంది. అలాగే నడుము చుట్టుకొలతను తగ్గిస్తుంది. మొటిమలు మాయం మామిడి గింజలతో మొటిమల స్క్రబ్ని తయారు చేసుకుని వాడితే చక్కటి ఫలితం ఉంటుంది. అంతేగాదు మామిడి గింజలను గ్రైండ్ చేసి టమాట రసంతో కలిపి ముఖానికి అప్లై చేస్తే బ్లాక్హెడ్స్, బ్రేక్ అవుట్లు, మెటిమలు, మచ్చలను నయ చేస్తుంది. ముఖంపై ఏర్పడే రంధ్రాలను తగ్గించి ఎరుపు మారకుండా సంరక్షిస్తుంది. (చదవండి: పెదవులు ఆరోగ్యంగా అందంగా కనిపించాలంటే ఇలా చేయండి!) -
ఆ దేశంలోని టమాట ధర వింటే కళ్లుబైర్లు కమ్మడం ఖాయం!
రెండు నెలల కిందటి వరకు సామాన్యులకు అందుబాటులోనే ఉన్న టొమాటో ధరలు ఇటీవలి కాలంలో కళ్లుబైర్లు కమ్మిస్తున్నాయి. దేశవ్యాప్తంగా టొమాటో ధరలు కిలో వంద రూపాయలకు పైగానే ఉన్నాయి. కొన్నిచోట్ల కిలో రెండువందల యాభై వరకు కూడా పలుకుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ధరలకే జనాలు బెంబేలుపడుతుంటే.. ఇంకో రకం టొమాటో ధర వింటే అమ్మ బాబోయ్! అంటారు టొమాటోల్లో ఒక రకానికి చెందిన విత్తనాల ధర బంగారం కంటే ఎక్కువే! ‘హజేరా జెనెటిక్స్’ అనే యూరోపియన్ విత్తనాల కంపెనీ ‘సమ్మర్ సన్’ రకానికి చెందిన టొమాటో విత్తనాలను కిలో 3.50 లక్షల డాలర్లకు (దాదాపు రూ.3 కోట్లు) విక్రయిస్తోంది. ఈ విత్తనాలతో పండే టొమాటోల ధర యూరోప్ మార్కెట్లో కిలో దాదాపు 30 డాలర్ల (సుమారు రూ.2,500) వరకు ఉంటుంది. ఈ లెక్కన మన టొమాటోలు చౌకగా దొరుకుతున్నట్లే! ఈ రకం ఒక్కో విత్తనానికి సగటున ఇరవై కిలోల వరకు దిగుబడినిస్తుంది. (చదవండి: ఆ దీవిలో అడుగుపెట్టాలంటే హడలిపోవాల్సిందే! బతుకు మీద ఆశ వదులుకోవాల్సిందే) -
సజ్జలో బీవీ 04 కొత్త రకాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్తలు
-
50 రకాల విత్తనాలను ప్రదర్శించిన మహిళలు
-
అధిక వర్షాలతో పత్తికి విపత్తు
సాక్షి, హైదరాబాద్: వారం క్రితం వరకు వర్షాలు లేక ఇబ్బందులు పడగా, ఇప్పుడు ఎడతెరపి లేని వర్షాలతో పంటలను ఎలా కాపాడుకోవాలో రైతులు ఆందోళన చెందుతున్నారు. అనేక చోట్ల పత్తి పంటకు చేటు కలుగుతోంది. పత్తితోపాటు ఇతర ఆరుతడి పంటలైన సోయాబీన్, మొక్కజొన్న, కంది వంటి పంటలకు కూడా సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటీవల విత్తనాలు చల్లినచోట అధిక వర్షాలతో మునిగిపోయి ఆయా విత్తనాలు కుళ్లిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మొలక వచ్చినచోట కలుపు సమస్య, వేరుకుళ్లు, కాండం కుళ్లు తెగుళ్లు వస్తున్నాయి. వీటికి తోడు నిరంతర వర్షాల కారణంగా బ్యాక్టీరియా తెగుళ్లు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విత్తనాలు మొలకెత్తని చేలల్లో ఎక్కువ నీరు నిలిచిపోయే పరిస్థితి వస్తే పత్తి, సోయా, కంది వంటివి చేతికి రావనీ, వాటిని మరోసారి విత్తుకోవాల్సి ఉంటుందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా విభాగం మాజీ సంచాలకులు ప్రొఫెసర్ జగదీశ్వర్ అంటున్నారు. 38 లక్షల ఎకరాల్లో పత్తి సాగు... రాష్ట్రంలో వానాకాలం సీజన్లో ఇప్పటివరకు 57.24 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈ సీజన్ సాధారణ సాగు విస్తీర్ణం 1.24 కోట్ల ఎకరాలు కాగా, 46.06 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. ఇటీవల వర్షాలు పుంజుకోవడంతో వ్యవసాయ పంటల సాగు ఊపు మీద ఉంది. కాగా, పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.59 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 37.98 లక్షల ఎకరాల్లో (75.07%) సాగైంది. ఇక వరి సాధారణ సాగు విస్తీర్ణం 49.86 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 7.94 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. ఇక పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 9.43 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.04 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 4.13 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.05 లక్షల ఎకరాల్లో (98.21%) సాగైంది. ఇక మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 7.13 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 3 లక్షల ఎకరాల్లో సాగైంది. వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తుండటంతో ఆయా పంటలను కాపాడుకోవడం ఇప్పుడు రైతులకు కీలకమైన అంశంగా జగదీశ్వర్ చెబుతున్నారు. రైతులు ఏం చేయాలంటే? ఆరుతడి పంటలైన పత్తి, కంది, పెసర, సోయాచిక్కుడు, మొక్కజొన్న పంటల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తమ పొలాల్లో నిలిచిన మురుగునీరు పోయేందుకు కాల్వలు ఏర్పరచాలి. వర్షాలు ఆగిన వెంటనే తమ పొలాల్లో కలుపు ఏమాత్రం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రై తులు పంటల వారీగా కలుపు మందులను ఎంచుకొని సరైన మోతాదులో పిచికారీ చేయాలి. సాధ్యమైనంతవరకు గుంటకతో కానీ, దంతెలతో గానీ కలుపు తీసివేయాలి. పత్తిలో అధిక వర్షాలకు వేరుకుళ్లు, కాండం కుళ్లు, కాయ కుళ్లు ఆశించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మొక్కల మొదళ్లను కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు ఒక లీటర్ నీటికి కలుపుకొని లేదా కార్బండాజిమ్ ఒక గ్రాము ఒక లీటర్ నీటికి కలుపుకొని మొక్కల అడుగు భాగంలో పిచికారీ చేయాలి. ప్రస్తుతం భూమిలో తేమను ఆధారం చేసుకొని ఆరుతడి పంటల్లో పైపాటుగా ఎరువులను యూరియా 30 కేజీలు, పొటాష్ 15 నుంచి 20 కేజీలు కలుపుతీసిన తర్వాత మొక్కలకు బెత్తెడు దూరంలో మట్టిలో లోతుగా వేయాలి. మే జూన్లలో వేసిన పత్తిలో వర్షాలు ఆగిన వెంటనే పేనుబంక, పచ్చదోమ ఆశించేందుకు అవకాశం ఉంటుంది. దీనికోసం ఎస్పేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి. వర్షాలకు వరిలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు లేదా అగ్గితెగులు సోకేందుకు చాలా అనుకూల వాతావరణం ఉంది. దీంతో వర్షాలు ఆగిన వెంటనే ప్రైసైక్లోజల్ 0.6 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని అగ్గి తెగులు నివారణకు చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం బ్యాక్టీరియా తెగులు గమనించినట్లయితే తాత్కాలికంగా నత్రజని ఎరువులను వేయడం, వారం పది రోజుల వరకు ఆగి ముందస్తు చర్యగా కాపర్ఆజిక్లోరైడ్ 30 గ్రాములు, స్ట్రెప్లోమైసిన్ సల్ఫేట్ రెండు గ్రామలు పది లీటర్ల నీటికి కలుపుకొని ఎకరాకు 200 లీటర్ల ద్రావణాన్ని పిచికారీ చేయాలి. వరిలో ప్రస్తుతం వర్షాలను ఉపయోగించుకొని జూలై మాసాంతం వరకు స్వల్పకాలిక రకాలు (125 రోజులు) నారు పోసుకోవడానికి అనుకూలం. ఆ తర్వాత ఆగస్టు 15–20 తేదీల వరకు నాట్లు వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మధ్యకాలిక రకాలు (135 రోజులు) లేదా స్వల్పకాలిక రకాలు కూడా నేరుగా దమ్ము చేసిన పొలంలో డ్రమ్ సీడర్ ద్వారా గానీ, వెదజల్లుకు నే పద్ధతిలో గానీ వరిని విత్తుకున్నట్లయితే దాదా పుగా 15–20 రోజుల సమయం కలిసి వచ్చి మంచి దిగుబడులు రావడానికి అవకాశముంది. వెదజల్లే పద్ధతిలో విత్తుకునేప్పుడు నేల బాగా చదును చేసి ఉండాలి. ఆ తర్వాత వరి విత్తిన మూడు నుంచి ఐదు రోజుల లోపుల సిఫారసు చేసిన కలుపుమందులు తప్పనిసరిగా వాడాలి. -
ఏడు తరాల ఏడాకుల బీర
పిఠాపురం: ఇళ్లముందు మామిడి తోరణాలు కనిపించడం సహజం. కానీ.. కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలోని చిత్రాడ గ్రామంలో మాత్రం బీరకాయల తోరణాలు కనిపిస్తాయి. ఆ గ్రామంలో లభించే బీర విత్తనాలకు అంతటి ప్రసిద్ధి మరి. మొలకెత్తిన బీరపాదుకు ఏడు ఆకులు రాగానే.. కాయలు కాయడం చిత్రాడ బీర ప్రత్యేకత. అందుకే.. దీనిని ఏడాకుల బీర అని పిలుస్తుంటారు. పూర్వం ఇక్కడ ఒక ఇంట్లో సాగు చేసిన బీరపాదుకు ఏడాకులు రాగానే కాయలు కాయడం ప్రారంభించడంతో దాని నుంచి విత్తనాలు సేకరించి విత్తనాభివృద్ది చేసినట్టు పెద్దలు చెబుతుంటారు. గ్రామంలో ఏడు తరాలుగా రైతులు ఏడాకుల బీరను సాగు చేస్తున్నారు. ఇక్కడి పాదులన్నీ విత్తనాలకే.. చిత్రాడలో సాగు చేసే బీర పాదులకు కాసే కాయల్ని ఇంటి అవసరాలకు వినియోగించకుండా కేవలం విత్తనాలకు మాత్రమే కేటాయించడం ప్రత్యేకత. ఇక్కడ పండిన బీర నుంచి తీసిన విత్తనాలు మంచి దిగుబడి వస్తుందనే నమ్మకంతో గుంటూరు, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు తదితర జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల రైతులు కూడా చిత్రాడ వచ్చి విత్తానాలను కొనుగోలు చేస్తుంటారు. ఈ విత్తనంతో వేరే ప్రాంతాల్లో సాగు చేసి.. ఆ పంట నుంచి విత్తనాలను సేకరించినా ఆశించిన ఫలితాలు కనిపించకపోవడంతో రైతులు ఈ గ్రామంలో పండిన విత్తనాలపైనే ఆసక్తి చూపుతారు. గ్రామంలో 300 మందికి పైగా రైతులు చిత్రాడ, పరిసర పొలాల్లో బీర పంట సాగు చేస్తున్నారు. బీర పాదుల నుంచి సేకరించిన కాయలను ఇళ్లవద్ద చూరులకు తోరణాలుగా కట్టి నీడలోనే ఆరబెడతారు. పెద్ద రైతులైతే స్థానికంగా ఇళ్లను అద్దెకు తీసుకుని వాటిలో విత్తన బీరను నిల్వ ఉంచుతారు. పిఠాపురం–కాకినాడ ప్రధాన రహదారికి ఇరువైపులా విత్తన బీరకాయలను వేలాడదీసిన ఇళ్లే కనిపిస్తుంటాయి. ఇతర జిల్లాల నుంచి రైతులకు అక్కడికక్కడే ఎండిన బీరకాయల నుంచి విత్తనాలను తీసి ఇస్తారు. ప్రస్తుతం కేజీ విత్తనాలు రూ.1,600 వరకు ధర పలుకుతుంది. విత్తన బీరను పండించిన రైతులందరూ తమ ఇళ్లవద్ద మాత్రమే విత్తనాలు విక్రయిస్తుంటారు. సుమారు 600 ఎకరాల్లో రైతులు ఏడాకుల బీరను సాగు చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులను బట్టి ఎకరాకు 200 కేజీల వరకు విత్తన దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. తరతరాలుగా బీర విత్తనాలే మా తాతల కాలం నుంచీ బీర తోటలు సాగు చేస్తూ విత్తనాల్ని విక్రయిస్తున్నాం. అధికారులు, శాస్త్రవేత్తలు వచ్చి వీటి ప్రా«ముఖ్యతను గుర్తించారు. ఎన్ని హైబ్రీడ్ రకాలు వచ్చినా ఏడాకుల బీర విత్తనాలను కొట్టలేవు. ఎందుకంటే ఈ బీర రుచి, పోషకాలలో ఎంతో గొప్పది. మిగిలిన రకాల బీర కాయలు చేదు వస్తాయి. ఇక్కడ చేదు అనే మాట ఉండదు. చిత్రాడ అంటే ఏడాకుల బీర గ్రామం అనే పేరుంది. – పేర్నీడి నాగ సత్యవతి, మహిళా రైతు, చిత్రాడ హైబ్రీడ్ రాకతో మానేయాల్సి వచ్చింది ఒకప్పుడు సీజన్లో 2 టన్నుల వరకు విత్తనాలు విక్రయించేవాళ్లం. వందల ఎకరాల్లో బీర సాగు జరిగేది. 90 శాతం మంది రైతులు ఇదే వ్యవసాయం చేసే వారు. పదేళ్లుగా హైబ్రీడ్ విత్తనాలు రావడంతో రైతులు వాటిపై మొగ్గు చూపుతున్నారు. దీంతో అమ్మకాలు తగ్గిపోయాయి. ఒకప్పుడు 90 శాతం మంది రైతులు బీర సాగు చేస్తే.. 10 శాతం మంది మాత్రమే బీర వేస్తున్నారు. వీటి విలువ తెలిసిన రైతులు ఇప్పటికీ ఇక్కడకు వచ్చి విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. ఎన్ని హైబ్రీడ్ విత్తనాలు వచ్చినా చిత్రాడ ఏడాకుల బీరను మించి ఉండవు. – పి.కృష్ణ, రైతు, చిత్రాడ -
వార్షిక రుణ ప్రణాళిక రూ.7,800 కోట్లు
సంగారెడ్డి టౌన్: 2023–24 ఆర్థిక సంవత్సరానికి రూ.7,800 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను ఆమోదించినట్లు అదనపు కలెక్టర్ వీరారెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ చాంబర్లో డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2023–24 జిల్లా వార్షిక రుణ ప్రణాళికను అదనపు కలెక్టర్ వీరారెడ్డి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వార్షిక రుణ ప్రణాళికలో ప్రాధాన్యత రంగాలైన వ్యవసాయం, వాణిజ్యం, విద్య, గృహ రుణాలు, మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక రంగాలకు రూ.6,565 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ.1,235 కోట్లు కేటాయించామన్నారు. ఈ ప్రణాళికలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని, సాగుకు అవసరమైన పెట్టుబడుల కోసం రుణాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. పంట ఉత్పత్తి, నిర్వహణ, మార్కెటింగ్ కోసం రైతులకు పంట రుణాలు ఇవ్వనున్నామన్నారు. వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు, మౌలిక సదుపాయాల కల్పనకు, టర్మ్ రుణాలకు రూ. 4,147 కోట్లు, సూక్ష్మ సంస్థలకు రూ. 516.60 కోట్లు, చిన్న సంస్థలకు రూ.167.40 కోట్లు, మధ్యతరహా సంస్థలకు రూ. 326 కోట్ల రుణాలివ్వాలని నిర్ణయించామన్నారు. ఎంఎస్ఎంఈ కింద మొత్తం రూ.1,010 కోట్ల రుణాలివ్వడం లక్ష్యమని చెప్పారు. విద్యా రుణాలు కింద రూ.85 కోట్లు, గృహ రుణాలు రూ. 1,270 కోట్లు, సామాజిక మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 46 కోట్లు, పునరుత్పాదక శక్తి కింద రూ.7 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ.1,235 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని స్పష్టం చేశారు. ఆయా రంగాలకు బ్యాంకర్లు సహకరించి జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అందించాలని బ్యాంకర్లకు సూచించారు. అంతకుముందు 2022–23(మార్చి 31 నాటికి) వార్షిక రుణ ప్రణాళికలో సాధించిన లక్ష్యాలను ఎల్డీఎం గోపాల్ రెడ్డి వివరించారు. ప్రాధాన్యత, ప్రాధాన్యేతర రంగాలకు సంబంధించి రూ.7080.80 కోట్ల లక్ష్యం కాగా 10,269.42 కోట్ల రుణాలు అందించి 145 శాతం లక్ష్యాన్ని చేరుకున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా వ్యవసాయాధికారికి, బ్యాంకర్లకు కోఆర్డినేషన్ అవసరమని అన్నారు. ఏఈఓ వారీగా గ్రామం, బ్యాంకు బ్రాంచ్, పంట రుణాల టార్గెట్, సాధించిన లక్ష్యాల వివరాలు అందించా లని సూచించారు. అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పథకంపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ గోపాల్ రెడ్డి, నాబార్డ్ ఏజీఎం కష్ణ తేజ, ఆర్బీఐ ఏజీఎం అలీ బాబా, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్, మెప్మా పీడీ, జిల్లా వ్యవసాయ అధికారి, సంక్షేమ శాఖల జిల్లా అధికారులు, బ్యాంకర్స్ పాల్గొన్నారు. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూడాలి సంగారెడ్డి టౌన్: జిల్లాలో ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూడాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందీ కలగకూడదని అదనపు కలెక్టర్ వీరారెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వ్యవసాయ, పంచాయితీ, అటవీ, గ్రామీణాభివృద్ధి, సంక్షేమ శాఖల అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీ ఓలు, ఏపీవోలు ఏఈవోలు పాల్గొన్నారు. -
‘ఎంటీయూ–1001’ రకం ధాన్యం సాగు చేయొద్దు
ఖానాపురం: రైతులు దొడ్డు రకం వరి విత్తనాలు సాగుచేయొద్దు.. మిల్లర్లు ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయమని తెగేసి చెబుతున్నారు. రైతులు తొందరపడి సాగు చేస్తే అమ్ముకోవడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఖానాపురం మండలం ధాన్యాగార కేంద్రంగా గుర్తింపు పొందింది. పాకాల చెరువు నర్సంపేట రైతులకు ప్రధాన నీటి వనరు. ఆయకట్టు కింద ఖరీఫ్లో 29,500 ఎకరాల్లో వరి పంటలు సాగవుతాయి. రబీలోనూ నీటి లభ్యత ఆధారంగా పంటలు సాగు చేసేవారు. కానీ, పాకాలకు గోదావరి జలాలు రావడంతో రబీలోనూ పూర్తిస్థాయిలో వరి పంటలు సాగయ్యాయి. ఖరీఫ్లో రైతులు ఎక్కువగా దొడ్డు రకం ధాన్యాన్ని సాగు చేస్తారు. ఇందులో ప్రధానంగా ఎంటీయూ–1001తోపాటు పలు రకాలు ఉన్నాయి. గత ఖరీఫ్లో సుమారు 5 వేల ఎకరాల్లో దొడ్డు రకం వడ్లను సాగు చేసినట్లు వ్యవసాయ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. సన్న రకాలను తెగుళ్ల బారి నుంచి రక్షించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో రైతులు దొడ్డు రకాల వైపే మొగ్గు చూపుతారు. ఎఫ్సీఐ నిబంధనతో.. ఎంటీయూ–1001 రకం ధాన్యాన్ని కొనుగోలు చేయమని ఎఫ్సీఐ నిబంధన పెట్టడంతో మిల్లర్లు దొడ్డు రకాలను కొనుగోలు చేయమని తెగేసి చెబుతున్నారు. ఈ రకాన్ని రైతులు సాగు చేయకుండా నియంత్రించాలని మిల్లర్లు జిల్లా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు చేయవద్దని మండల వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతీ సమావేశంలోనూ ప్రజాప్రతినిధులకు తెలిపి రైతులు సాగు చేయకుండా నియంత్రించాలని సూచిస్తున్నారు. దీంతోపాటు విత్తన డీలర్లు సైతం ఎంటీయూ–1001 రకం ధాన్యం బస్తాలను విక్రయించకూడదని స్పష్టంగా ఆదేశించినట్లు తెలిసింది. ఈ ఒక్క రకాన్ని కాకుండా ఇతర దొడ్డు రకాలను రైతులు సాగు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. రైతులు తొందరపడి సాగు చేస్తే విక్రయించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని సూచిస్తున్నారు. ఎంటీయూ–1001 రకాన్ని కొనుగోలు చేయమంటూ మిల్లర్లు కరపత్రాలను ముద్రించి మరీ గ్రామాలకు చేరవేస్తున్నారు. 1001 సాగు చేయొద్దు రైతులు దొడ్డు రకం ఎంటీయూ–1001 రకాన్ని సాగు చేయొద్దు. ఎఫ్సీఐ దొడ్డు రకాన్ని తీసుకోమని చెప్పడంతో మిల్లర్లు కొనుగోలు చేయమని ఉన్నతాధికారులకు తెలిపారు. దీంతో ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. డీలర్లకు సైతం ఇప్పటికే దొడ్డు రకం విత్తన వడ్లను విక్రయించొద్దని సూచించాం. – బోగ శ్రీనివాస్, వ్యవసాయ అధికారి, ఖానాపురం -
నారు ఎండుతోంది... నాట్లు వేసేందుకు భయపడుతున్న రైతులు
డొంకేశ్వర్(ఆర్మూర్)/మాక్లూర్: నేలను చల్లబరిచే తొలకరి వానలు ముఖం చాటేశాయి. జూన్ నెల పూర్తి కావస్తున్నా చినుకు నేలను తాకడం లేదు. దీంతో ఖరీఫ్ సాగు పనులు నెమ్మదించాయి. ముఖ్యంగా భూమిలో వేడి కారణంగా వరినారుకు ప్రమాదం ఏర్పడింది. బోర్ల సాయంతో నీటిని ఎంత పెట్టినా రంగుమారుతోంది. ఎదుగుదల కనిపించడం లేదు. వేర్లు, కొనలు వాడిపోయి ఎండుముఖం పడుతున్నాయి. నారు చనిపోయి చేతికిరాని ప్రాంతాల్లో మళ్లీ నార్లు పోస్తున్నారు. అయితే, వాతావరణ పరిస్థితులను చూసి రైతులు నాట్లు వేసేందుకు భయపడుతున్నారు. వర్షాలు పడ్డప్పుడే చూద్దామని ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే, మొక్కదశలో ఉన్న మొక్కజొన్న, సోయా, పసుపు పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. వీటికి నీరందించినా తీవ్రమైన ఎండలు, వడగాల్పులకు ఆకులు వాడిపోతున్నాయి. పారకం చేసిన కొద్ది గంటలకే నేల పూర్తిగా పొడిబారుతోంది. ఒక్కరోజు అరుపిచ్చినా పొలంలో నెర్రలు ఏర్పడుతున్నాయి. భూమి లోపలి వేడికి విత్తనాలు సైతం ఉడికిపోయి చనిపోయితున్నాయి. అయితే, వర్షాల్లేక వ్యవసాయానికి ఏర్పడిన గడ్డు పరిస్థితులను చూసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్న చేతికొచ్చిన యాసంగి పంటలపై దాడిచేసి తీవ్రంగా నష్టం చేసిన వానలు, ఇప్పుడేమో సమయానికి రాకుండా దెబ్బతీస్తున్నాయని వాపోతున్నారు. దమ్ము చేసి నారు పోయడంతోనే.. నేల లోపలి భూభాగం చల్లబడాలంటే అది వర్షాలతోనే సాధ్యమవుతుంది. తొలకరి చినుకులతో నేలలో కొంత తేమశాతం కనిపిస్తే నార్లు పోయడానికి, విత్తనాలు విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కానీ, నేల పొడిగా ఉండగానే రైతులు పొలంలో కొంత భాగాన్ని దమ్ముచేసి అందులో వరినార్లు పోశారు. దీనికి తోడు వర్షాలు రాకపోవడంతో నేలలోని వేడికి నార్లు మాడిపోతున్నాయి. ఇలాంటి సమయంలో దమ్ము చేయకుండా వెదజల్లే పద్ధతిలో నార్లు పోసుకోవాలని వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ ఏడాది వర్షాకాలం సీజన్లో 5.13లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని, ఇందులో 4.17 ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వర్షాల లేమి కారణంగా వరిసాగు ఇప్పటి వరకు 2శాతం కూడా మించలేదు. బోధన్ డివిజన్లోనే నాట్లు ప్రారంభమయ్యాయి. మొక్కజొన్న సాగు సైతం ఐదుశాతం దాటలేదు. నారు పెరుగుతలేదు మూడెకరాల కోసం బీపీటీ రకం విత్తనాలు కొని ఇరవై రోజుల క్రితం నారు పోసినం. వర్షాల్లేక ఎండల ప్రభావానికి నారు వాడిపోయి రంగుమారుతోంది. ఎంత నీళ్లు పెట్టినా ఎదగడం లేదు. వాతావరణం అనుకూలించక పసుపు, సోయా, మక్క సాగుకు సాహసించడం లేదు. – కృష్ణయాదవ్, యువరైతు, నికాల్పూర్ రోగం వస్తే మందులు కొట్టినం తొమ్మిది బస్తాల బీపీటీ విత్తనాలు చల్లినం. ఎండలకు నారుకు రోగం వచ్చింది. మొగిపురుగు ఆశించింది. వెంటనే మందులు కొట్టినం. పరిస్థితులు చూస్తేంటే నాట్లు వేయాలంటే భయంగా ఉంది. వ్యవసాయాధికారులు సలహాలు, సూచనలు అందించాలి. – శ్రీనివాస్, రైతు, నికాల్పూర్ -
వరుణుడు కరుణిస్తాడని...కలవరపెడుతున్న వానాకాలం
మంచిర్యాలఅగ్రికల్చర్: జూన్ వచ్చిందంటే చాలు అన్నదాతలు వానాకాలం సాగు పనుల్లో బిజీగా కనిపిస్తారు. కానీ.. ఈసారి భిన్నమైన పరిస్థితి నెలకొంది. తొలకరి కోసం నేటికీ రైతులు నిరీక్షిస్తూనే ఉన్నారు. ఆలస్యమవుతుండగా అదునుదాటుతుందని ఆందోళన చెందుతున్నారు. వరుణుడు కరుణించకపోతాడా.. అని పలువురు రైతులు ఎప్పటిలాగే మృగశిరకార్తె (మిరుగుకార్తె) నుంచి పొడి దుక్కుల్లోనే విత్తనాలు వేస్తున్నారు. ఇంకా వానలు కురియ క పోవడంతో వేసిన విత్తనాలు దుక్కుల్లోనే మాడి పోతుండగా, మరోసారి విత్తనం వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని దిగులు చెందుతున్నారు. ఈ సమయానికే జిల్లాను రుతుపవనాలు తాకాల్సి ఉంది. కానీ ఇంకా ఎండలు తగ్గక రైతన్నను వానాకాలం కలవరం పెడుతోంది. వానాకాలం ఆరంభమై పక్షం రోజులు గడిచినా వర్షాలు పడలేదు. దీంతో అన్నదాత గుండెల్లో గుబులు మొదలైంది. జిల్లాలో ఇప్పటికే కొన్ని మండలాల్లో పత్తి విత్తనాలు వేస్తున్నారు. కాగా, ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసి భూమిలో తేమ శాతం పెరిగితేనే విత్తనాలు వేయాలని వ్యవసాయశాఖ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అడుగంటుతున్న జలాశయాలు జిల్లాలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొడుతున్నాయి. సాయంత్రం ఈదురుగాలులు, మబ్బులు పడుతున్నా వర్షాలు మాత్రం కురవడం లేదు. మృగశిర కార్తె బుధవారంతో ముగుస్తుండగా గురువారం నుంచి ఆరుద్ర కార్తె ప్రారంభం కానుంది. ఈ పాటికి జోరువర్షాలు కురిసి వాగులు, వంకలు పొంగి పొర్లుతుండాలి. చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లో కొత్తనీరు చేరి జలమట్టం క్రమేపి పెరుగుతుండాలి. ఇందుకు భిన్నంగా ఇంకా ఎండలు మండుతుండగా జలాశయాలు అడుగంటిపోతున్నాయి. 94శాతం లోటు వర్షపాతం ఈసారి 3.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా. కానీ.. ఇప్పటివరకు 7వేల ఎకరాల వరకు పత్తి విత్తుకున్నట్లు తెలుస్తోంది. ఆశించిన వర్షాలు కురిస్తే ఈ సమయానికి 50వేల ఎకరాల వరకు విత్తనాలు వేసుకోవాల్సి ంది. గతేడాది ఇదే సమయానికి 45 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఈ ఏడాది సాధారణ స్థాయి వర్షాలు ఉంటాయని వాతావరణ నిపుణులు చెబుతుండగా ప్రస్తుత పరిస్థితులు రైతుల్లో గుబులు రేపుతున్నాయి. గతేడాది ఇదే సమయానికి జిల్లాలో సగటున 119 మిల్లీమీటర్ల వర్షపాతం కురువగా, ఈ ఏడాది 07 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. ఈ నెల 20వరకు సాధారణ వర్షపాతం 101.7 మిల్లిమీ టర్లు కురవాల్సి ఉండగా 6.2 మిల్లిమీటర్లు మాత్రమే కురిసింది. 94 శాతం లోటు వర్షపాతం నెలకొంది. మృగశిర కార్తె ఆరంభానికి ముందే ఉపరితల ద్రోణి ప్రభావంతో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిశాయి. దీంతో కొంతమంది రైతులు విత్తనాలు వేశారు. ఆ తర్వాత చినుకు పడక విత్తనం మొలకెత్తక ఆదిలోనే నష్టాలు చవి చూశారు. తేమ లేకుంటే ప్రమాదమే.. నేలలో తేమ లేనిదే విత్తనం వేసుకోవద్దని వ్యవసాయశాఖ ఓ వైపు హెచ్చరిస్తున్నా రైతులు విత్తనాలు వేస్తూనే ఉన్నారు. రెండు, మూడు భారీ వర్షాలు కురిసి 60–70శాతం తేమ నేలలో ఉంటేనే విత్తుకోవాలంటున్నారు. పత్తి, కంది, వరి, మొక్కజొన్న పంటలు విత్తుకునేందుకు వచ్చే నెల వరకు సమయం ఉందని చెబుతున్నారు. దుక్కి వేడి తగ్గకుండానే విత్తనాలు విత్తుకోవడం మంచిది కాదని పేర్కొంటున్నారు. విత్తిన ఐదురోజుల వరకు వాన పడకుంటే విత్తనం చెడిపోతుందని చెబుతున్నారు. కొన్ని విత్తనాలు మొలకెత్తినా మొలక దశలోనే మాడిపోతాయని పేర్కొన్నారు. ఇలా.. మొలక ఎండిపోయిన స్థానంలో రెండుమూడుసార్లు విత్తుకుంటే అదనపు ఖర్చుతో పాటు మొక్కల ఎదుగుదలలో వ్యత్యాసమేర్పడి కలుపు తీయడానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. వానలు పడుతయనుకున్న నిరుడు మిరుగుకార్తెలోనే ప త్తి విత్తనం వేసిన. ఈసారి నాలుగురోజులు ఆలస్యంగా ఎనిమిదెకరాల్లో విత్తనాలేసి న. వారంరోజులైనా వర్షాలు పడుతలేవు. విత్తనాలు మొలకెత్తలేదు. ఎండలకు దుక్కిలోనే మాడిపోతున్నయ్. ఈ రెండుమూడ్రోజు ల్లో వాన పడకుంటే నేను పెట్టిన పెట్టుబడి రూ.35 వేల దాకా నష్టపోవుడే. – ముదరకోల సదయ్య, రైతు, నెన్నెల తొందరపడి విత్తనాలు వేయొద్దు తుఫాన్ కారణంగా రుతుపవనాల రాక కొంత ఆలస్యమైంది. ఈనెల 25నుంచి ఉ మ్మడి జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. రైతులు ఒకట్రెండు భారీ వర్షాలు కురిసి 60–70 శాతం తేమ ఉన్న తర్వాతే విత్తనాలు వేసుకోవాలి. పత్తి విత్తేందుకు సమయం ఉంది. తొందరపడి విత్తుకుంటే మొలక రాదు. – శ్రీధర్చౌహాన్, వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త -
45 రోజులైనా..రైతుల ఖాతాల్లో జమకాని ధాన్యం డబ్బులు
సుభాష్నగర్ : ధాన్యం అమ్మి 45 రోజులైనా డబ్బులు ఖాతాల్లో జమ కాకపోవడంతో రైతులు ఎదురుచూస్తున్నారు. మొత్తం రూ.529 కోట్లకుపైనే రైతులకు రావాల్సి ఉంది. అందులో ఓటీపీఎస్ పూర్తయిన వారికే రూ.330.76 కోట్లు జమ చేయాల్సి ఉంది. మరో వైపు వానాకాలం సీజన్ మొదలైంది. ఇప్పటికే నార్లు పోసి, నాట్ల కోసం మడులను సిద్ధం చేసుకుంటున్నారు. ధాన్యం డబ్బులు రాకపోవడం.. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో రైతులు ప్రయివేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ● జిల్లా వ్యాప్తంగా 459 కొనుగోలు కేంద్రాల ద్వారా 93,150 మంది రైతుల నుంచి 6.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఈ ధాన్యం విలువ రూ.1,313.05 కోట్లు ఉంటుంది. అందులో రూ.1129 కోట్ల విలువైన ధాన్యానికి సంబంధించి ఓటీపీఎస్ పూర్తయ్యింది. ఇంకా రూ.184 కోట్ల విలువైన ధాన్యానికి ఓటీపీఎస్ సొసైటీల్లో పూర్తి చేయాల్సి ఉంది. ● రూ.784 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశారు. మొత్తం రూ.529 కోట్లకుపైగా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. ● ట్యాబ్ ఎంట్రీ, ట్రక్ షీట్ జనరేటెడ్, మిల్లర్ ఎక్నాలెడ్జ్మెంట్, ఓటీపీఎస్ తర్వాతే బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. వారం రోజుల్లో రూ.345 కోట్లు జమవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. కాగా సుమారు 100 వరకు లారీల ధాన్యం వివిధ రైస్మిల్లుల్లో అన్లోడింగ్ అవుతున్నాయి. డబ్బుల కోసం ఎదురుచూపులు! గత 15 రోజులుగా డబ్బులు జమ కావడం లేదని రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభం కాగా ఇప్పటికే నార్లు పోసుకుని, నాట్లు వేసుకునేందుకు మడులను సిద్ధం చేసుకుంటున్నారు. సోయా, శనగ, ఇతర పంటల సాగుకు దుక్కులు పూర్తయ్యాయి. ఈనెల 19 తర్వాత ఎప్పుడైనా వర్షాలు కురిసే అవకాశమున్నందున రైతులు సిద్ధమవుతున్నారు.ప్రస్తుతం డబ్బులు చేతిలో లేక అవస్థలు పడుతున్నారు. రూ. లక్ష వరకు రావాల్సి ఉంది ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ధా న్యం విక్రయించి నెల రోజులు గడి చిపోయింది. 130 బస్తాలను విక్రయించాను. సుమారు రూ.లక్ష వర కు రావాల్సి ఉంది. జూన్ పూర్తిగా పెట్టుబడుల నెల. పిల్లల స్కూల్ ఫీ జులు, వానాకాలం వ్యవసాయ పనులు ప్రారంభమైన నేపథ్యంలో పెట్టుబడికి డబ్బుల్లేక ధాన్యం విక్రయించిన సొ మ్ము కోసం ఎదురుచూస్తున్నాను. ఎరువులు, విత్తనాలు, వరి కోత యంత్రాలు, ట్రాక్టర్ అద్దె చెల్లించేందుకు డబ్బులు లేవు. సొసైటీలో అడిగితే త్వరలో వస్తాయని చెప్తున్నారు. వెంటనే ధాన్యం డబ్బులు జమ చేసేలా చూడాలి. – కేపీ నర్సారెడ్డి, రైతు, నల్లవెల్లి, ఇందల్వాయి మండలం వారంలోపు రూ.345కోట్లు జమ రైతులు అమ్మిన ధా న్యానికి సంబంధించి ఓటీపీఎస్ పూర్తయిన రూ.345 కో ట్లు వారం రోజుల్లో జమ అవుతాయి. రై తుల వివరాలను ఇప్పటికే నివేదించాం. డ బ్బులు జమ కావడంలో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమే. మిగతా డబ్బులు కూడా వీలైనంత త్వరగా జమ చేసేలా చర్య లు చేపడుతున్నాం. రైతులెవరూ ఆందోళన చెందొద్దు. – జగదీష్కుమార్, -
వరి విత్తనరకాలు, పంటకాలం, నారుపోసే సమయం
వరిసాగుకు సంబంధించి పంట కాలాన్ని ముందుకు జరిపే క్రమంలో ఏఏ రకాల విత్తనాలతో నార్లు పోసుకోవచ్చని, వాటి పంట కాలం తదితర వివరాలను సిద్దిపేట జిల్లా తోర్నాల ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త సీహెచ్.పల్లవి వివరించారు. ● దీర్ఘకాలిక రకాలు: పంటకాలం 140 రోజులపైనే. ఇందులో ప్రధానమైన వరి విత్తన రకాలు వరంగల్ 44 (సిద్ది), కంపాసాగర్ 2874, సాంబమసూరి. మే 25 నుంచి జూన్ 5వ తేదీ వరకు నార్లు పోసుకోవాలి ● మధ్యకాలిక రకాలు: పంటకాలం 135 రోజులు. ఇందులో ప్రధానమైన రకాలు రాజేంద్రనగర్ 2458 (కృష్ణ), వరంగల్ 32100 (వరంగల్ సన్నాలు), వరంగల్ 915, జగిత్యాల 384, పొలాస ప్రభ, జగిత్యాల 28545, జగిత్యాల 27356, వరంగల్ 1487 జూన్ 15వ తేదీ వరకు నార్లు పోసుకోవాలి ● స్వల్పకాలిక రకాలు : పటకాలం 120 నుంచి 125 రోజులు. ఇందులో ప్రధానమైనవి సన్న రకాలైన కునారం–1638, వరంగల్ 962. రాజేంద్రనగర్–21278, రాజేంద్రనగర్– 15048 (తెలంగాణ సోనా), దొడ్డురకాల్లో కునారం–118 (కూనారం సన్నాలు), జగిత్యాల – 24423, జగిత్యాల – 18047 (బతుకమ్మ), రాజేంద్రనగర్–29325, మారుటేరు–1010 (కాటన్ దొర సన్నాలు). ● వానాకాలం వరిపంటకు జూన్ 25 లోపు నారు పోసుకుంటే...అక్టోబర్ మూడో వారం నుంచి నవంబరు మొదటి వారంలోపు కోతలు పూర్తి చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా మళ్లీ యాసంగిలో వరి ఆరుతడి పంటలను సకాలంలో సాగు చేసుకోవడానికి వీలవుతుంది. ఇక యాసంగిలో వరి సాగుకు స్వల్పకాలిక రకాలను ఎంచుకొని నవంబర్ 15 నుంచి 20వతేదీలోపు విత్తుకుంటే మార్చి నెలాఖరు నుంచి ఏప్రిల్ మొదట్లో పంట కోతకు వస్తుంది. తద్వారా వర్షాల నష్టం నుంచి మనం పంటను కాపాడుకోవచ్చు. -
తల ఎత్తుకుని వ్యవసాయం చేసేలా చేసారు..!
-
రైతుకు అసలైన భరోసా
సాక్షి, అమరావతి : వ్యవసాయం దండగ అన్నవాళ్ల నోళ్లను మూయిస్తూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవసాయ రంగాన్ని పండుగలా మార్చారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ సర్కారు ఏర్పాటైన తరువాత దేశంలోనే ఎక్కడా లేనివిధంగా వ్యవసాయ రంగంలో సీఎం జగన్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ, పంట నష్టపరిహారం, వైఎస్సార్ యంత్ర సేవ, ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ పథకాలతోపాటు రైతులు పండిస్తున్న పంటలను నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేయడం, విత్తన సబ్సిడీ, సూక్ష్మ సేద్యం, పండ్ల తోటల అభివృద్ధి, ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ, ఆయిల్పామ్ రైతులకు సబ్సిడీ, పగటి పూటే 9 గంటల విద్యుత్ సరఫరా కోసం ఫీడర్ల సామర్ధ్యం పెంపు, విత్తు నుంచి పంట విక్రయం వరకు రైతుకు అండదండలు అందించేదుకు రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే)ల ఏర్పాటు వంటి ఎన్నో కీలక నిర్ణయాలతో వ్యవసాయ రంగాన్ని ఉరకలెత్తిస్తున్నారు. ప్రాజెక్టులు నిండుకుండలు.. నిండా పంటలు పాలించే మారాజు మనసున్న వాడైతే.. ప్రకృతి పులకిస్తుందని రుజువైంది. నాలుగేళ్లుగా కరువుతీరా కురుస్తున్న వర్షాలతో సాగునీటి ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. భూగర్భ జలాలు ఎగసిపడుతున్నాయి. ఆహార ధాన్యాల ఉత్పత్తి 2014–19 మధ్య ఏటా సగటున 153.95 లక్షల టన్నులు నమోదు కాగా.. 2019–23 మధ్య ఏటా సగటున 165.40 లక్షల టన్నులకు పెరగడం విశేషం. ఇదే సందర్భంలో ఉద్యాన పంటల దిగుబడులు సైతం పెరిగాయి. 2014–15లో 305 లక్షల టన్నులుగా ఉన్న ఉద్యాన పంటల దిగుబడులు.. ప్రస్తుతం 368.83 లక్షల టన్నులకు పెరిగింది. మూడు రెట్లు పెరిగిన కేటాయింపులు టీడీపీ ఐదేళ్ల పాలనలో వ్యవసాయ, దాని అనుబంధ రంగాలకు రూ.61,758 కోట్లు వెచ్చించగా.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక రూ.1,70,571.62 కోట్లను వెచ్చించింది. మరో ఏడాదికి కేటాయించే మొత్తాన్ని కలిపితే గత ప్రభుత్వం కంటే.. మూడు రెట్లకు పైగా నిధులు కేటాయించినట్టు తేటతెల్లమవుతోంది. కరోనా విపత్కర పరిస్థితులకు ఎదురొడ్డి మరీ రూ.1.49 లక్షల కోట్ల సాయాన్ని నేరుగా రైతులకు అందించి రైతులకు అన్ని విధాలుగా అండగా నిలవడం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేసింది. సున్నా వడ్డీ.. ఉచిత బీమా సున్నా వడ్డీకే పంట రుణాలివ్వడంతోపాటు ప్రతి పంటను ఈ క్రాప్లో నమోదు చేస్తూ పైసా భారం పడకుండా పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే బీమా కల్పిస్తోంది. కోతలకు ముందే ప్రతి పంటకు కనీస మద్దతు ధర ప్రకటిస్తోంది. ధరల స్థిరీకరణ నిధి ద్వారా కనీస మద్దతు ధర దక్కని పంటలను కొనుగోలు చేస్తోంది. విపత్తుల వల్ల నష్టపోయే రైతులకు సీజన్ ముగిసేలోగానే పంట నష్టపరిహారంతో పాటు బీమా సొమ్ము సైతం అందిస్తోంది. సేంద్రియ సాగుతోపాటు చిరుధాన్యాలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రత్యేక పాలసీలను తీసుకొచ్చింది. మెట్టప్రాంత పంటలకు పగటిపూట 9 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ను నిరాటంకంగా అందిస్తోంది. పల్లెసీమల రూపురేఖలు మార్చిన ఆర్బీకేలు గతంలో విత్తనాల కోసం రైతులు పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చేది. ఎరువుల కోసం ప్రైవేట్ డీలర్లు అంటగట్టే అవసరం లేని పురుగుమందులను కొనాల్సి వచ్చేది. ఎండల్ని తట్టుకోలేక అన్నదాతలు ఏటా పదుల సంఖ్యలో రైతులు మతిచెందేవారు. అదునులోపు విత్తనం దొరక్క దళారుల వద్ద నకిలీ, నాసిరకం వాటిని అధిక ధరలకు కొనుగోలు చేసేవారు. విత్తనాల కోసం రైతుల పాట్లు పత్రికల్లో పతాక శీర్షికల్లో కథనాలు వచ్చేవి. ఆర్బీకేల రాకతో రైతుల కష్టాలు తొలగిపోయాయి. ఇప్పుడు సీజన్కు ముందే రెడీ సాగు ఉత్పదకాలను రైతుల ముంగిటకు తీసుకెళ్లాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలతో రైతుల వెతలకు చెక్ పడింది. సీజన్కు ముందుగానే సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలను గ్రామస్థాయిలో నిల్వ చేసి రైతులకు నేరుగా పంపిణీ చేస్తున్నారు. ఆర్బీకేల్లోని కియోస్్కల్లో బుక్ చేసుకున్న 24 గంటల్లోపే వారి ముంగిట అందిస్తున్నారు. ఆర్బీకేలు ఏర్పాటైన మూడేళ్లలో 63.50 లక్షల మంది రైతులకు 37.04 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేశారు. వరి, అపరాలు, చిరుధాన్యాలు, నూనెగింజలు, పచ్చిరొట్ట విత్తనాలే కాదు పత్తి, మిరప వంటి నాన్ సబ్సిడీ విత్తనాలను సైతం ఆర్బీకేల ద్వారా అందిస్తున్నారు. 10,778 ఆర్బీకేల ద్వారా దుక్కి పనులు ప్రారంభం కాకముందే రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుతున్నాయి. ముందుగానే అగ్రి ల్యాబ్స్లో టెస్ట్ చేసి మరీ నాణ్యమైన సీడ్ను పంపిణీ చేస్తున్నారు. మూడేళ్లుగా చూద్దామంటే విత్తనాల కోసం ఎక్కడా బారులు తీరే పరిస్థితి కనిపించడం లేదు. విత్తనం దొరుకుతుందో లేదోననే చింత ఎవరిలోనూ కనిపించడం లేదు. నకిలీల ఊసే ఎక్కడా వినిపించడం లేదు. మూడేళ్లలో ఆర్బీకేల ద్వారా రూ.953.53 కోట్ల విలువైన 8.69 లక్షల టన్నుల ఎరువులను 23.47 లక్షల మంది రైతులకు పంపిణీ చేశారు. మార్కెట్లో ధరలు పతనమైన ప్రతిసారి మార్కెట్లో జోక్యం చేసుకుని ఆర్బీకేల ద్వారా ఆయా పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. పంట రుణాలు, ఈ–క్రాప్ నమోదు, పంటల బీమా, పంట నష్టపరిహారం ఇలా ప్రతి ఒక్కటి అర్హత ఉన్న ప్రతి రైతుకు అందేలా ఆర్బీకే సిబ్బంది కృషి చేస్తున్నారు. గతంలో పశువుకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా మండల కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం ఫోన్ చేయగానే క్షణాల్లో వీహెచ్ఏ ఇంటికి వచ్చి మరీ సేవలందిస్తున్నారు. ఉచితంగా మందులిస్తున్నరు. నాణ్యమైన ధ్రువీకరించిన మిశ్రమ దాణా, పశుగ్రాసం సరఫరా చేస్తున్నారు. ఫలితంగా గతంతో పోలిస్తే పాల దిగుబడి రెట్టింపయ్యిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆర్బీకేల ద్వారా ఆక్వా సాగు చేస్తున్న ప్రతి రైతుకు లైసెన్సు జారీతో పాటు నాణ్యమైన ఫీడ్ను అందజేస్తున్నారు. అగ్రి ల్యాబ్లు.. యంత్ర సేవా కేంద్రాలు.. గోదాములు అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో 147 చోట్ల వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ను నెలకొల్పుతోంది. ఇందుకోసం ఒక్కొక్క ల్యాబ్కు రూ.81 లక్షల చొప్పున వెచ్చిస్తోంది. రూ.6.25 కోట్ల అంచనా వ్యయంతో జిల్లా స్థాయిలో 13 ల్యాబ్లు, రూ.75 లక్షల అంచనా వ్యయంతో రీజనల్ స్థాయిలో నాలుగు సమన్వయ కేంద్రాలను, గుంటూరులో రాష్ట్రస్థాయిలో రూ.8.50 కోట్ల అంచనాతో విత్తన జన్యు పరీక్ష కేంద్రాన్ని డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీతో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 70 అగ్రి ల్యాబ్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కాగా.. చిన్న, సన్నకారు రైతులకు అవసరమైన యంత్ర పరికరాలను స్వల్ప అద్దె ప్రాతిపదికన వారి ముంగిటకే తీసుకెళ్లాలన్న సంకల్పంతో రూ.691 కోట్లతో 6,525 ఆర్బీకే, 391 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆర్బీకేలకు అనుబంధంగా రూ.1,584.61 కోట్లతో 2,536 బహుళ ప్రయోజన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్కటి రూ.40 లక్షల అంచనాతో 500 టన్నుల సామర్థ్యంతో 1021, రూ.75లక్షల అంచనాతో 100 టన్నుల సామర్థ్యంతో 113 గోదాముల నిర్మిస్తున్నారు. వీటిలో రూ.166.33 కోట్ల ఖర్చుతో వివిధ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇప్పటికే వెయ్యి గోదాములు నిర్మాణం పూర్తి కాగా.. వచ్చే నెలలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. -
మహిళల ఘన విజయం: విత్తనం పరిరక్షణకు‘చిరు’యత్నం
‘ఇంటర్నేషనల్ సీడ్ డే’... ఇలాంటి ఓ రోజు ఉందా! ఉంది... అయితే ప్రచారమే పెద్దగా ఉండదు. ఇది గ్లామర్ మార్కెట్ వస్తువు కాకపోవడమే కారణం. ఈ రోజును రైతు మహిళలు నిర్వహించారు. ‘చిరు’సాగు చేసి కళ్లాల్లో రాశులు పోసిన చేతులవి. విత్తనాన్ని కాపాడాలనే ముందుచూపున్న చేతలవి. రాగి ముద్ద స్టార్ హోటల్ మెనూలో కనిపిస్తోంది. స్మార్ట్గా ఆర్డర్ చేస్తే అందమైన ప్యాక్తో ఇంటిముందు వాలుతోంది. అలాగే సజ్జ ఇడ్లీ, ఊదల దోసె, కొర్రల కర్డ్ మీల్, జొన్న రొట్టె, మిల్లెట్ చపాతీ, మిల్లెట్ పొంగలి... ఇలా బ్రేక్ ఫాస్ట్ సెంటర్లు కొత్త రూపుదిద్దుకున్నాయి. ఎక్కడో మారుమూల గ్రామాల్లో నీటి వసతి లేని నేలను నమ్ముకుని బతికే వాళ్ల ఆకలి తీర్చిన చిరుధాన్యాలు ఇప్పుడు బెంజ్కారులో బ్రేక్ఫాస్ట్కి వెళ్లే సంపన్నుల టేబుల్ మీదకు చేరాయి. ఒకప్పుడు చిన్న చూపుకు గురైన చిరుధాన్యాలు నేడు సిరిధాన్యాలుగా మన దైనందిన జీవితంలో ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. వీటి వెనుక నిరుపేద మహిళల శ్రమ ఉంది. పాతికేళ్లుగా ఈ నిరుపేద మహిళలు చిరుధాన్యాలతోనే జీవించారు, చిరుధాన్యాల పరిరక్షణ కోసమే జీవించారు. సేంద్రియ సేద్యంతో చిరుధాన్యాల జీవాన్ని నిలిపారు. అంతర్జాతీయ విత్తన దినోత్సవం (ఏప్రిల్ 26) సందర్భంగా బుధవారం వీరంతా మెదక్ జిల్లా, జహీరాబాద్ మండలం, పస్తాపూర్లో తమ దగ్గరున్న పంటల విత్తనాలను సగర్వంగా ప్రదర్శించారు. హైబ్రీడ్ వంగడాల మాయలో పడకుండా మన విత్తనాలను మనం కాపాడుకోవాలని ఒట్టు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ బోర్డు సభ్యులు రుక్మిణీరావు సాక్షితో పంచుకున్న వివరాలివి. ఈ నేల... ఈ విత్తనం... మన సొంతం ‘‘చిరుధాన్యాల పట్ల అవగాహన కోసం ఈ ఏడాదిని ‘ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్’ నిర్వహించుకుంటున్నాం. ఈ ఏడాది సీడ్ డే రోజున మేము చిరుధాన్యాల విత్తనాల పరిరక్షణ, ప్రదర్శన నిర్వహించాం. పస్తాపూర్ కేంద్రంగా జరిగిన ఈ కార్యక్రమంలో 26 పరిసర గ్రామాల నుంచి వందకు పైగా మహిళలు వారు పండించి, పరిరక్షించిన విత్తనాలను తీసుకువచ్చారు. చిరుధాన్యాలతోపాటు పప్పుధాన్యాలు, నూనె గింజల విత్తనాలు మొత్తం యాభైకి పైగా పంటల విత్తనాలకు ఈ ప్రదర్శన వేదికైంది. ఇవన్నీ సేంద్రియ సేద్యంలో పండించినవే. ఆహారం –ఆకలి! ఆహారం మన ఆకలి తీర్చాలి, దేహానికి శక్తినివ్వాలి. ‘వరి అన్నం తిని పొలానికి వెళ్తే పని మొదలు పెట్టిన గంట సేపటికే మళ్లీ ఆకలవుతుంది. రొట్టె తిని వెళ్తే ఎక్కువ సేపు పని చేసుకోగలుగుతున్నాం. అందుకే మేము కొర్రలు, జొన్నలు తింటున్నాం’ అని ఈ మహిళలు చెప్పిన మాటలను తోసిపుచ్చలేదు సైంటిస్టులు. వారి అనుభవం నుంచి పరిశోధన మొదలు పెట్టారు. అందుకే మిల్లెట్స్లో దాగి ఉన్న శక్తిని ప్రపంచ వేదికల మీద ప్రదర్శించగలిగారు. అలాగే ఈ మహిళలు విదేశాల్లో రైతు సదస్సులకు హాజరై తమ అనుభవాలను వారితో పంచుకున్నారు. భూగోళం ఎదుర్కొంటున్న మరో విపత్తు క్లైమేట్ చేంజ్. ఈ పంటలైతే వాతావరణ ఒడిదొడుకులను ఎదుర్కుని పంటనిస్తాయి. పదిహేను రోజులు నీరు అందకపోయినప్పటికీ జీవాన్ని నిలుపుకుని ఉంటాయి. చిరుధాన్యాలకు గాను మన ముందున్న బాధ్యత ఈ విత్తనాలను కాపాడుకోవడం. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటి మీద హక్కులను కార్పొరేట్ సంస్థలు తన్నుకుపోకుండా చూసుకోవాలి. అవసరమైతే ఉద్యమించాలి. ఇదే మనం డీడీఎస్ స్థాపకులు మిల్లెట్ మ్యాన్ పీవీ సతీశ్గారికి ఇచ్చే నివాళి’’ అన్నారు రుక్మిణీరావు. చిరుధాన్యాలను పండించడంలో ముందడుగు వేసేశాం. ఇక మన ముందున్న బాధ్యత ఈ విత్తనాలను కాపాడుకోవడం. ఈ విత్తనాల మీద పూర్తి హక్కులు ఈ పేద రైతు మహిళలవే. – రుక్మిణీరావు, బోర్డు సభ్యులు, దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ – వాకా మంజులారెడ్డి -
రైతన్నలకు విత్తనాలు రెడీ
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్ కోసం ప్రభుత్వం విత్తనాలను సిద్ధం చేసింది. ఆర్బీకేల ద్వారా రైతులకు అందించేందుకు ప్రణాళిక రూపొందించింది. రబీ కోతలు జోరందుకోవడంతో ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీకి సిద్ధం చేయగా.. మే 1 నుంచి వేరుశనగ, జూన్ 1 నుంచి వరి, ఇతర విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. 2023–24 ఆరి్థక సంవత్సరంలో 9.15 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలు అవసరమవుతాయని అంచనా వేసిన అధికారులు ఖరీఫ్ సీజన్ కోసం 6.18 లక్షల క్వింటాళ్లను ఆర్బీకేల ద్వారా రైతులకు అందించనున్నారు. రబీ సీజన్ కోసం 2.97 లక్షల క్వింటాళ్లను సిద్ధం చేయనున్నారు. జాతీయ ఆహార భద్రతా మిషన్ అమలవుతున్న జిల్లాల్లో క్వింటాల్కు రూ.1,000, మిషన్ పరిధిలో లేని జిల్లాల్లో క్వింటాల్కు రూ.500 చొప్పున సబ్సిడీ ఇవ్వనున్నారు. పచ్చిరొట్ట విత్తనాలతో పాటు చిరుధాన్యాల విత్తనాలపై 50 శాతం, వేరుశనగ, నువ్వుల విత్తనాలపై 40 శాతం, అపరాలపై 30 శాతం, శనగ విత్తనాలపై 25 శాతం చొప్పున సబ్సిడీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏజెన్సీ మండలాల్లో గిరిజన రైతులకు అన్నిరకాల విత్తనాలను 90 శాతం సబ్సిడీపై, కంటింజెన్సీ కింద 80 శాతం సబ్సిడీపై ఇవ్వనున్నారు. ఆర్బీకేల ద్వారా అందిస్తాం ఖరీఫ్ సీజన్కు సరిపడా విత్తనాలను ఆర్బీకేల ద్వారా పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాం. రైతుల ద్వారా సేకరించిన విత్తనాలతో పాటు ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ, ప్రైవేట్ కంపెనీల నుంచి సేకరించి అగ్రి ల్యాబ్లలో నాణ్యత ధ్రువీకరించిన తర్వాత ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచే ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ జరుగుతోంది. -
ఎర్రజొన్న సీడ్.. కేరాఫ్ అంకాపూర్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్లోని అంకాపూర్ అనగానే రాష్ట్రంలో ప్రతిఒక్కరికీ దేశీ చికెన్ గుర్తొస్తుంది. ఇతర రాష్ట్రాలు, దేశాలకు సైతంఈ దేశీ చికెన్ పార్సిళ్ల రూపంలో వెళుతోంది. అయితే ఇదే అంకాపూర్ పశుగ్రాసం కోసం పెంచే ఎర్రజొన్న విత్తనాల ఎగుమతిలోనూ ప్రత్యేకత పొందింది. ఇక్కడి నుంచి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హరియాణా, పంజాబ్తోపాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికాకు సైతం ఎర్రజొన్న విత్తనాలు ఎగుమతి చేస్తున్నారు. ఉత్తరాదిలో పశుగ్రాసానికి ఆధారం ఇదే.. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్లో సుమారు 40 వేల ఎకరాల్లో రైతులు ఏటా ఎర్రజొన్న సాగు చేస్తున్నారు. పక్కనే ఉన్న నిర్మల్, జగిత్యాల జిల్లాల్లోనూ రైతులు మరో 30 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఉత్తరాదిలో పశుగ్రాసం పెంచేందుకు ఇక్కడి నుంచి తీసుకెళ్లిన ఎర్రజొన్నలను వాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్మూర్ డివిజన్లో 40 చోట్ల ఎర్రజొన్న సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటయ్యాయి. వాటిలో 10 యూనిట్లు చుట్టుపక్కల ఉండగా ఒక్క అంకాపూర్లోనే 30 ఎర్రజొన్న యూనిట్లు ఉన్నాయి. దీంతో ఎర్రజొన్న విత్తనాలకు కేరాఫ్గా అంకాపూర్ పేరుగాంచింది. ఏపీలో చూసొచ్చి.. 1983లో ఏపీలోని ఏలూరులో ఎర్రజొన్న విత్తనాల పంటలను పరిశీలించి వచ్చిన ఆర్మూర్ ప్రాంత రైతులు ఈ సాగు ప్రారంభించారు. రైతులు ఏటా అక్టోబర్, నవంబర్లలో ఒప్పందం ద్వారా విత్తన వ్యాపారుల నుంచి ఫౌండేషన్ సీడ్ను తీసుకుంటారు. ఫిబ్రవరిలో పంట చేతికి రాగానే ఫౌండేషన్ సీడ్స్ ఇచ్చిన వ్యాపారులకే రైతులు అమ్ముతారు. రైతుల నుంచి సేకరించిన విత్తనాలను వ్యాపారులు ఆయా యూనిట్లలో శుద్ధిచేసి ప్యాక్ చేసి ఉత్తరాది రాష్ట్రాలతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. నిజామాబాద్ భూములే సాగుకు అనుకూలం.. దేశం మొత్తంలో తెలంగాణలోని నిజామాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రమే భూములు ఎర్రజొన్న విత్తనాలు పండించేందుకు అనుకూలంగా ఉన్నాయి. కర్ణాటకలోని బళ్లారిలో 15 శాతం ఎర్రజొన్న విత్తనాలు పండిస్తుండగా నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో కలిపి 85 శాతం ఎర్రజొన్న విత్తనాలను పండిస్తున్నారు. రైతుల నుంచి కిలో రూ.45 చొప్పున ఎర్రజొన్నలను తీసుకుంటున్న వ్యాపారులు వాటిని శుద్ధిచేసి కిలో రూ.65 చొప్పున అమ్ముతున్నారు. ఏటా ఇక్కడి నుంచి 60 వేల మెట్రిక్ టన్నుల ఎర్రజొన్న విత్తనాలను శుద్ధిచేసి ఎగుమతి చేస్తున్నారు. ప్రభుత్వం కొంటేనే మేలంటున్న రైతులు.. సీడ్ వ్యాపారులు సిండికేట్గా మారుతుండడంతో ఏటా ధర విషయంలో నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వమే విత్తన విధానాన్ని రూపొందించి రైతులతో బైబ్యాక్ ఒప్పందం చేసుకునే విధానాన్ని తయారుచేస్తే రైతులకు మేలు కలుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడి ఎర్రగరప నేలలు అనుకూలం నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో ఎర్రగరప నేలలు ఎర్రజొన్న పంటకు అనుకూలంగా ఉన్నాయి. అలాగే, పశువుల పెంట, చెరువు నల్లమట్టి ఈ భూముల్లో వేస్తారు. మరోవైపు ఈ మూడు జిల్లాల్లోని వాతావరణ పరిస్థితులు ఎర్రజొన్న సాగుకు కలిసివస్తున్నాయి. రైతులు పసుపు, మొక్కజొన్న, ఎర్రజొన్న పంటల మార్పిడి వ్యవసాయం చేస్తుండడంతో మరింత మేలు చేస్తోంది. ప్రైవేటు వ్యాపారులు అంకాపూర్లో యూనిట్లు ఏర్పాటు చేసి రైతులను ప్రోత్సహిస్తుండడంతో ఎర్రజొన్న సాగుకు రైతులు మొగ్గుచూపుతున్నారు. – హరికృష్ణ, వ్యవసాయాధికారి, ఆర్మూర్ -
కల్తీ విత్తనాలు అమ్మితే ఉపేక్షించం.. సీఎం కేసీఆర్ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: కల్తీ విత్తనాలు అమ్మితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు హెచ్చరించారు. అసెంబ్లీలో ఆదివారం ప్రశ్నోత్తరాల సమయంలో సమీకృత మార్కెట్లపై ప్రశ్నకు సంబంధించి కల్తీ విత్తనాల బెడద ఉందని సభ్యులు ప్రస్తావించగా సీఎం కేసీఆర్ జోక్యం చేసుకొని సమాధానం ఇచ్చారు. కల్తీ విత్తనాల బెడద ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే ఎక్కువగా ఉందన్నారు. వాటిని నియంత్రించేందుకు పీడీ యాక్ట్ తెచ్చామని చెప్పారు. పీడీ యాక్ట్ ఎందుకని కేంద్రం చెప్పినా, మంత్రి నిరంజన్రెడ్డి ఢిల్లీ వెళ్లి దీనిపై వారిని ఒప్పించి, పోరాడి సాధించారని వివరించారు. పీడీ యాక్ట్ కింద అనేకమందిపై కేసులు నమోదు చేశామనీ అయినా కొందరు మారడం లేదన్నారు. అవసరమైతే మరిన్ని కఠిన చర్యలు చేపడతామన్నారు. జనాభాకు అనుగుణంగా మార్కెట్లు లేవు హైదరాబాద్లో జనాభాకు అనుగుణంగా మార్కెట్లు లేవని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కోటికిపైగా జనాభా ఉన్న హైదరాబాద్లో సరిపడా వెజ్, నాన్వెజ్ మార్కెట్లు లేవన్నారు. హైదరాబాద్ మార్కెట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించామని సీఎం తెలిపారు. చాలా కూరగాయల మార్కెట్లు పరిశుభ్రంగా లేకుండా మురికి, మట్టి, దుమ్ములో కూరగాయలు అమ్మే పరిస్థితి ఉండేదని చెప్పారు. ఈ నేపథ్యంలో సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్లకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. మోండా మార్కెట్ మోడల్గా..: రెండు లక్షల జనాభాకు ఒక మార్కెటైనా ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని కేసీఆర్ వివరించారు. నిజాం హయాంలో కట్టిన మోండా మార్కెట్ని చూసి తాను ఆశ్చర్యపోయానన్నారు. ‘125 ఏళ్ల కింద కట్టిన మోండా మార్కెట్ చాలా శాస్త్రీయంగా ఉంది. పాతది అయినా జాలీలు ఉన్నాయి. మాంసమైనా, కూరగాయలు అయినా అక్కడ 2.5 ఫీట్ల ఎత్తులో పెట్టి అమ్ముతారు. ఈ పద్ధతిలోనే సమీకృత మార్కెట్లను అన్ని జిల్లాల్లో నిర్మించాలని సూచించాం’ అని సీఎం చెప్పారు. చదవండి: సభలో నవ్వులే నవ్వులు..ప్రధాని భజన బృందంపై పిట్ట కథను వినిపించిన సీఎం కేసీఆర్ -
ఎరువు.. బరువుగా మారిన వేళ
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఎకరాకు పదివేల రూపాయల పెట్టుబడి సాయం.. ఉచితంగా నిరంతర విద్యుత్.. పండిన పంటలను మద్దతు ధరతో కొనుగోలు.. వీటికి అదనంగా ఐదేళ్లకొక మారు పంట రుణమాఫీ. తెలంగాణలో వ్యవసాయాన్ని పండగలా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా అమలు చేస్తున్న పథకాలివి. కానీ ఇక్కడ వ్యవసాయం రైతులకు పండుగలా మారిందా? అంటే లేదనే అంటోంది మెజారిటీ రైతాంగం. సాగు విస్తీర్ణం, పంట దిగుబడి పెరిగినా.. తమ కష్టమంతా ఎరువులు, పురుగు మందులు, కూలీలు తదితర ఖర్చులకే సరిపోతోందని అంటున్నారు. దేశంలో అత్యధికంగా ఎరువులు వాడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి వరుసలో నిలవడం గమనార్హం. హెక్టారుకు సగటున 206 కిలోల ఎరువులు వాడుతున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. సారవంతమైన భూములు, చాలినన్ని సాగునీళ్లు ఉన్నా.. విపరీతంగా పెరిగిన ఎరువుల వాడకం, ఇతర ఖర్చుల వల్ల.. రైతుకు సాగు సంబురంగా మారడం లేదని ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు. ప్రధానంగా ఎరువుల ఖర్చును తగ్గించుకుంటే ఎక్కువ ఫలితం దక్కుతుందని, పంటల మార్పిడితో ఎరువుల వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు అంటున్నారు. ఎరువుల వినియోగంలో టాప్ ఆహారోత్పత్తిని, మొక్కలకు పోషకాలు, భూసారాన్ని పెంచేందుకు రైతులు నత్రజని, భాస్వరం, పొటాషియం (ఎన్పీకే) భారీగా వినియోగిస్తున్నారు. తెలంగాణ 2018–19లో దేశంలోనే అత్యధిక ఎరువుల వినియోగంతో మొదటి స్థానంలో (హెక్టారుకు 245 కిలోలు) నిలవగా, 2019–20లో నాలుగో స్థానంలో (హెక్టారుకు 206 కిలోలు) నిలిచిందని ఫెర్టిలైజర్ అసోసియేషన్ వెల్లడించింది. అయితే దేశ సగటు వినియోగం 133.1 కిలోలు మాత్రమే కావడం గమనార్హం. అవసరానికి మించి ఎరువుల వాడకం వల్ల ఏకంగా 200 మండలాల్లోని భూముల్లో భారీగా భాస్వరం నిల్వలు పేరుకు పోయాయని జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ తాజా పరిశోధనలో తేలింది. పేరుకుపోయిన భాస్వరం నిల్వల నుంచి భూసార పరిరక్షణ చేపట్టేందుకు ప్రత్యేక కార్యాచరణను నిర్దేశించినా అది ఇంకా పంట పొలాలకు చేరువ కాలేదు. ఇదీ సాగు లెక్క.. ► రాష్ట్ర జనాభాలో 48.4 శాతం మందికి వ్యవసాయమే ఉపాధి. ► 2018 నుంచి రైతుబంధు కింద 63 లక్షల మందికి ఎకరానికి ఏటా రూ.10 వేల చొప్పున అందుతున్న పెట్టుబడి సాయం. ► బావులు, లిఫ్ట్లు, చెరువులు, చెక్డ్యామ్ల ద్వారా రాష్ట్రంలోసాగవుతున్న భూమి 1.36 లక్షల ఎకరాలు ► గడిచిన ఐదేళ్లలో వరి ఉత్పత్తి పెరిగింది. అత్యధిక ఎరువుల వినియోగం ఉన్నా.. సగటు ఉత్పత్తిలో పంజాబ్ కంటే వెనకే ఉంది. ► 25.92 లక్షల వ్యవసాయ మోటార్లకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ ఇస్తోంది. ► అత్యధికంగా మెదక్, జనగామ, నాగర్కర్నూల్, సిద్దిపేట జిల్లాల్లో వ్యవసాయ విద్యుత్ వినియోగం అవుతోంది. రైతులు, ఉన్న భూమి లెక్కలు ఇలా 2.47 ఎకరాలలోపు.. 64.6 శాతం 2.48 – 4.94 ఎకరాలు.. 23.7 శాతం 4.95– 9.88 ఎకరాలు.. 9.5 శాతం 9.89 –24.77 ఎకరాలు.. 2.1 శాతం 24.79 కంటే ఎక్కువ.. 0.2 శాతం అత్యధికంగా ఎరువులు వినియోగించిన రాష్ట్రా లు ఎరువులు, మందులకే రూ.47,600 ఖర్చు నాకున్న ఐదెకరాల భూమిలో పత్తి సాగు చేసిన. ఆదాయం చూస్తే పెట్టుబడి ఖర్చులు కూడా పూర్తిగా రాలా. ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అనుకున్నా. అధిక వర్షాల కారణంగా నాలుగు క్వింటాళ్లే వచ్చింది. క్వింటాకు రూ.8 వేల చొప్పున విక్రయిస్తే రూ.1.60 లక్షలు రాగా, రూ.1,61,450 పెట్టుబడి పెట్టా. ఇందులో యూరియా, క్రిమిసంహారక, పూత మందులకే రూ.47,600 ఖర్చయ్యాయి. దీంతో పడిన కష్టానికి ఫలితం లేకుండా పోయింది. –బలరాం, పత్తి రైతు తిగుల్, సిద్దిపేట జిల్లా ఐదెకరాలు సాగు చేస్తే రూ.55 వేలే మిగిలింది ఐదు ఎకరాల్లో వరి సాగు చేస్తే రెక్కల కష్టానికి తగిన ఫలితం కూడా మిగలలేదు. సాగు కోసం రూ.1.2 లక్షలు ఖర్చు పెడితే 100 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అమ్మితే రూ.2 లక్షలు వచ్చాయి. విత్తనాల ఖర్చు నుంచి, నాటు వరకు రూ.45 వేల ఖర్చు కాగా, ఎరువులకు రూ.18 వేలు అయ్యాయి. పంటకోత, ఆరబెట్టేందుకు రూ.14 వేలు, మోటార్ల మరమ్మతుకు రూ.4 వేలు, 3 మోటార్ల నిర్వహణకు, ఏడాది కరెంటు బిల్లు రూ. 2,250 అయింది. ఖర్చులు పోను రూ.80 వేలు మిగిలితే.. పెట్టుబడి వడ్డీలకు రూ.25 వేలు పోయింది, ఆర్నెల్ల పాటు భార్యాభర్తలం ఇద్దరం కలిసి పనిచేస్తే రూ.55 వేలు మాత్రమే మిగిలింది. –లెక్కల ఇంద్రసేనారెడ్డి, రైతు, దేవరుప్పుల, జనగామ జిల్లా వ్యయం తగ్గాలి.. మద్దతు పెరగాలి పలు కారణాలతో పంట ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగిపోయింది. ఈ మేర పంట మద్దతు ధర పెరగలేదు. దీంతో పిల్లల చదువులు, ఆరోగ్యం విషయాల్లో మిగిలిన సమాజంతో రైతులు పోటీ పడలేకపోతున్నారు. ప్రభుత్వం అనేక రకాలుగా చేయూతనిస్తున్నా.. ఫలితం ఉండటం లేదు. ఉత్పత్తి వ్యయం తగ్గించడంతో పాటు, రైతులకు ఇచ్చే మద్దతు ధరలు పెంచాల్సి ఉంది. – ప్రొఫెసర్ కె.ముత్యంరెడ్డి, అధ్యక్షుడు, తెలంగాణ ఎకనమిక్ అసోసియేషన్ -
రైతన్నకు ‘విత్తన’ దన్ను
సాక్షి, అమరావతి: మాండూస్ తుపాను కారణంగా విత్తనాలు కొట్టుకుపోయి ఆర్థికంగా నష్టపోయిన రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచింది. అదును ఉన్నా మళ్లీ విత్తేందుకు చేతిలో చిల్లిగవ్వలేక ఆందోళనకు గురవుతున్న అన్నదాతలపై ఆర్థికభారం పడకుండా అండగా నిలుస్తోంది. వీరికి 80 శాతం సబ్సిడీపై విత్తనాలను అందిస్తోంది. ఏ విత్తనం కావాలన్నా, సాగు విస్తీర్ణం బట్టి ఎంత కావాలన్నా సరఫరా చేస్తోంది. మాండూస్ తుపాను ఇటీవల రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే. రబీ సీజన్లో ముందుగా పంటలు సాగుచేసే నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ఆయా జిల్లాల్లో వరి, శనగ, వేరుశనగ, నువ్వులు, మినుము విత్తనాలను 80 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తున్నారు. వరిలో ఎన్ఎల్ఆర్–34449, ఆర్ఎన్ఆర్–15048, శనగలో జేజీ 11, పెసలులో పీయూ 31, వేరుశనగలో కదిరి లేపాక్షి రకం విత్తనాల కోసం రైతుల నుంచి డిమాండ్ వచ్చింది. ఇలా ఆయా జిల్లాల నుంచి 33వేల క్వింటాళ్ల విత్తనం అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో 28వేల క్వింటాళ్లను ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధంచేసింది. ఆర్బీకేల్లో విత్తనం కావాల్సిన రైతుల వివరాలను నమోదు చేస్తోంది. వారికి డి.క్రిష్ యాప్ ద్వారా పారదర్శకంగా విత్తన సరఫరా చేస్తోంది. 15వేల మంది రిజిస్ట్రేషన్ ఇక విత్తనాల కోసం ఇప్పటివరకు 15వేల మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 10వేల మందికి 8,727 క్వింటాళ్ల విత్తనం సరఫరా చేశారు. వీరికి 4,686 క్వింటాళ్ల వరి, 3,288 క్వింటాళ్ల శనగ, 748 క్వింటాళ్ల వేరుశనగ, ఐదు క్వింటాళ్ల నువ్వుల విత్తనం సరఫరా చేశారు. జనవరి 10 కల్లా మిగిలిన వారికి 80 శాతం సబ్సిడీపై పంపిణీ చేసేందుకు విత్తనాలను ఆయా జిల్లాల్లోని ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచనున్నారు. గతంలో ఎప్పుడూ ఇలా ఇవ్వలేదు రబీలో 8 ఎకరాల్లో ఆర్ఎన్ఆర్ వరి విత్తనం వేశా. తుపాన్ దెబ్బకు మొత్తం పోయింది. ఆర్థికంగా చాలా నష్టపోయా. సీఎం వైఎస్ జగన్ పెద్ద మనసు చేసుకుని 80 శాతం సబ్సిడీపై విత్తనం సరఫరా చేశారు. మొన్న రెండు బ్యాగ్లు ఆర్ఎన్ఆర్ 15048 విత్తనం తీసుకున్నా. ప్రభుత్వం ఆదుకోవడం ఆనందంగా ఉంది. పంట నష్టాన్ని కూడా అంచనా వేశారు. – అట్ల కృష్ణయ్య, తునుబాక, పెల్లకూరు మండలం, తిరుపతి జిల్లా జనవరి 10కల్లా అందరికీ సరఫరా సీఎం జగన్ ఆదేశాల మేరకు 80 శాతం సబ్సిడీపై వరి, శనగ, వేరుశనగ, అపరాల విత్తనాన్ని సరఫరా చేస్తున్నాం. 33వేల క్వింటాళ్ల విత్తనం కోసం ఇండెంట్ పెట్టారు. ఇప్పటికే 28వేల క్వింటాళ్ల విత్తనాన్ని సిద్ధంచేశాం. 8,727 క్వింటాళ్ల విత్తనాలను రైతులు కొనుగోలు చేశారు. పంట దెబ్బతిన్న రైతులు ఆర్బీకేల్లో వివరాలు నమోదు చేసుకుంటే జనవరి 10కల్లా కావాల్సిన విత్తనం సరఫరా చేస్తాం. – డాక్టర్ గెడ్డం శేఖర్బాబు, ఎండీ, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం నాకున్న ఐదెకరాల్లో శనగ పంట వేశాను. వేసిన వారంలోనే తుపానువల్ల మొలక దశలోనే పంట పూర్తిగా దెబ్బతింది. 80 శాతం సబ్సిడీపై ప్రభుత్వం విత్తనాలు సరఫరా చేస్తోంది. కేవలం రూ.2,040 చెల్లించి ఆర్బీకేల్లో 1.25 క్వింటాళ్ల శనగ విత్తనం తీసుకున్నా. సబిడీపై విత్తనం ఇవ్వకపోతే చాలా ఇబ్బందిపడే వాళ్లం. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. – నలదల కొండయ్య, పలుకూరు, కందుకూరు మండలం, ప్రకాశం జిల్లా -
Recipe: పనస గింజలతో వడలు.. ఇలా తయారు చేసుకోండి!
పనస గింజల వడల తయారీ విధానం తెలుసా? పనస గింజల వడల తయారీకి కావలసినవి: ►పనస గింజలు – ఒకటిన్నర కప్పులు (పైతొక్క తీసి, మెత్తగా ఉడికించుకుని, కొద్దిగా నీళ్లు పోసుకుని మిక్సీ పట్టుకోవాలి) ►ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు (చిన్నచిన్నగా తరగాలి) ►పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్ (చిన్నగా తరిగినవి) ►కొత్తిమీర తురుము, కరివేపాకు తురుము – అర టేబుల్ స్పూన్ చొప్పున ►అల్లం పేస్ట్, మిరియాల పొడి, వాము – అర టీ స్పూన్ చొప్పున ►కారం, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా పనస గింజల వడల తయారీ విధానం ►ముందుగా ఒక బౌల్లో పనస గింజల గుజ్జు వేయాలి ►దానిలో.. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కారం, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ►అందులో కొత్తిమీర తురుము, కరివేపాకు తురుము, అల్లం పేస్ట్, మిరియాల పొడి, వాము అన్నీ కలిపి బాగా ముద్దలా చేసుకోవాలి. ►అనంతరం ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండల్లా చేసుకుని.. వేళ్లతో గట్టిగా ఒత్తి, పలుచగా చేసుకుని, నూనెలో దోరగా వేయించుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Singori Sweet Recipe: కోవా... పంచదార.. పచ్చి కొబ్బరి.. నోరూరించే స్వీట్ తయారీ ఇలా! ఇవన్నీ కలిపి బోన్లెస్ చికెన్ ముక్కల్ని బొగ్గు మీద కాల్చి తింటే! మరిన్ని రెసిపీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
80వ పుట్టినరోజు.. కేజీల విత్తనాలు
ఖమ్మం రూరల్: ఖమ్మం జిల్లా రెడ్డిపల్లికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య తన 80వ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం 80 కేజీల విత్తనాలను నాటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఖమ్మం రూరల్ మండలం, కొణిజర్ల మండలంలోని వివిధ ప్రాంతాల్లో ఆయన విత్తనాలు నాటి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడంతో పాటు మొక్కను బతికించినప్పుడే అందుకు తగిన ప్రతిఫలం వస్తుందని తెలిపారు. తద్వారా రాబోయే తరాలకు మేలు చేసిన వారమవుతాయని చెప్పారు. కార్యక్రమంలో రామయ్య అభిమాను లు పాల్గొన్నారు. (చదవండి: బియ్యంపై కయ్యం!) -
విత్తనాలు వెదజల్లే డ్రోన్..10 కోట్ల వృక్షాలే టార్గెట్గా
ప్రపంచవ్యాప్తంగా అడవులు అంతరిస్తున్నాయి. ప్రభుత్వాలు మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతున్నా, అవేవీ ఎడాపెడా చెట్లు నరికేస్తున్నంత వేగంగా మొక్కలు నాటడంలో సఫలం కాలేకపోతున్నాయి. చెట్లు నరికేసినంత వేగంగా మొక్కలు నాటడం మానవమాత్రుల వల్ల కాదని చెప్పి, ఆస్ట్రేలియాకు చెందిన స్టార్టప్ కంపెనీ ‘ఎయిర్ సీడ్ టెక్నాలజీ’ ఫొటోలో కనిపిస్తున్న ఈ డ్రోన్ను రూపొందించింది. ఈ డ్రోన్ శరవేగంగా గగనతలంలో ప్రయాణిస్తూ, భూమిమీద ఖాళీగా ఉన్న బంజరు నేలలను గుర్తించి, అనువైన చోట విత్తనాలను నాటగలదు. మరో రెండేళ్లలోగా ఆస్ట్రేలియాలో 10 కోట్ల వృక్షాలను నాటే దిశగా, ఇలాంటి డ్రోన్లను పెద్ద సంఖ్యలో రంగంలోకి దించనున్నట్లు ‘ఎయిర్ సీడ్ టెక్నాలజీ’ చెబుతోంది. -
అరటి రైతుకు మహర్దశ
సాక్షి, అమరావతి: అరటి రైతుకు మహర్దశ పట్టనుంది. విత్తు నుంచి విపణి వరకు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలవనుంది. దిగుబడుల్లో నాణ్యత పెంచడం, ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా రూ.269.95 కోట్లతో కార్యాచరణ సిద్ధం చేసింది. రానున్న మూడేళ్లలో వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో క్లస్టర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు (సీడీపీ)ని అమలు చేయనుంది. గడిచిన మూడేళ్లలో లక్ష టన్నుల ఎగుమతులు రాష్ట్రంలో 2,02,602 ఎకరాల్లో అరటి సాగవుతుండగా, 48.62 లక్షల టన్నుల దిగుబడులతో దేశంలో నం.1 స్థానంలో ఉంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 23వేల టన్నులు ఎగుమతులు జరుగగా, కరోనా పరిస్థితులున్నప్పటికీ గడిచిన మూడేళ్లలో లక్ష టన్నులకు పైగా అరటి ఎగుమతులు చేయగలిగారు. దేశంలోనే తొలిసారి తాడిపత్రి నుంచి ముంబైకు ప్రత్యేక రైలు ద్వారా అరటిని ఎగుమతి చేసి చరిత్ర సృష్టించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న వాల్యూచైన్ ప్రాజెక్టు వల్ల హెక్టార్కు 24 టన్నుల వరకు దిగుబడులు, టన్నుకు రూ.12వేల వరకు ఆదాయం పెరిగింది. ఎగుమతులను ప్రోత్సహించే లక్ష్యంతో అనంతపురంలో రెండు ప్యాక్ హౌస్లు, రెండు కోల్డ్ స్టోరేజ్లు నిర్మించగా, పులివెందులలో ప్యాక్ హౌస్ నిర్మాణ దశలో ఉంది. 42,500 ఎకరాల్లో క్లస్టర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు తాజాగా ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించే లక్ష్యంతో జాతీయ ఉద్యాన బోర్డు దేశవ్యాప్తంగా 12 క్లస్టర్స్ను ఎంపిక చేయగా, ఏపీలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అరటి ఎగుమతులను ప్రోత్సహించనున్నారు. అరటి ఎక్కువగా సాగవుతున్న వైఎస్సార్, అనంతపురం, కర్నూలు, జిల్లాలను ఈ ప్రాజెక్టు కోసం ఎంపిక చేశారు. మూడు జిల్లాల పరిధిలో గుర్తించిన 42,500 ఎకరాల్లో సీడీపీ ప్రాజెక్టును అమలు చేసేందుకు రూ.269.95కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మొత్తంలో రూ.100 కోట్లు గ్రాంట్ రూపంలో అందించనుండగా, మిగిలిన మొత్తాన్ని పీపీపీ కింద సమీకరించనున్నారు. క్లస్టర్ గ్యాప్ అసెస్మెంట్ రిపోర్టు ఆధారంగా ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే ప్రాంతంలో మొక్కల నుంచి ఎగుమతి వరకు మూడు దశల్లో రైతులకు సపోర్టు ఇవ్వనున్నారు. విత్తు నుంచి కోత (ప్రీ ప్రొడక్షన్ – ప్రొడక్షన్)వరకు రూ.116.50 కోట్లు, కోత అనంతర నిర్వహణ–విలువ ఆపాదించడం (పోస్ట్హార్వెస్ట్ మేనేజ్మెంట్, వాల్యూఎడిషన్) కోసం రూ.74.75కోట్లు, ఎగుమతులకు అవసరమైన లాజిస్టిక్స్, మార్కెటింగ్, బ్రాండింగ్ కల్పనకు రూ.78.70కోట్లు ఖర్చు చేయనున్నారు. అరటికి కేరాఫ్ ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా గడిచిన మూడేళ్లలో అరటి ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. వీటిని మరింత పెంచే లక్ష్యంతో ప్రభుత్వం రూ.269.95 కోట్లతో క్లస్టర్ డెవలప్మెంట్ ప్రాజెక్టును అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్టుతో ఎగుమతుల్లో ఏపీకి త్వరలో అంతర్జాతీయఖ్యాతి లభించనుంది. –డాక్టర్ ఎస్ఎస్ శ్రీధర్, కమిషనర్, ఉద్యాన శాఖ రైతుకు చేయూత ఇలా.. సాగుకు అవసరమైన నాణ్యమైన టిష్యూ కల్చర్ మొక్కల నుంచి మైక్రో ఇరిగేషన్, సమగ్ర సçస్యరక్షణ (ఐఎన్ఎం), సమగ్ర ఎరువులు, పురుగు మందుల యాజమాన్యం(ఐపీఎం), ఫ్రూట్ కేర్ యాక్టివిటీ వరకు ఒక్కో రైతుకు గరిష్టంగా హెక్టార్కు రూ.40వేల వరకు ఆర్థిక చేయూతనివ్వనున్నారు. తోట బడుల ద్వారా15వేల మందికి సాగులో మెళకువలపై శిక్షణనిస్తారు. సాగుచేసే ప్రతీ రైతుకు గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ సర్టిఫికేషన్ (జీఏపీ)ఇస్తారు. కోతలనంతర నిర్వహణకు అవసరమైన ప్యాక్ హౌసెస్, కోల్డ్ స్టోరేజ్లు, ఎయిర్పోర్టులు, రైల్వేస్టేషన్లలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైనపెట్టుబడులు అందించడంతో పాటు బ్రాండింగ్, విదేశాల్లో ప్రమోçషన్ వంటి కార్యకలాపాలకు ఆర్థిక చేయూతనందిస్తారు. (చదవండి: సీమసిగలో మెగా పవర్ ప్రాజెక్ట్.. సీఎం జగన్ చేతులమీదుగా శంకుస్థాపన) -
అక్షయ తృతీయ.. విత్తనమే బంగారం
బోథ్/ఇచ్చోడ: అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేస్తే మంచిదంటారు. కానీ ఆదిలాబాద్ జిల్లా రైతులకు మాత్రం విత్తనాలే బంగారం. అందుకే... మంగళవారం అక్షయ తృతీయ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో విత్తన విక్రయ దుకాణాలు రైతులతో కిటకిటలాడాయి. వానాకాలం సాగు కోసం ఈ రోజు విత్తనాలు కొనుగోలు చేస్తే మంచిదని జిల్లా రైతులు భావిస్తారు. ఈ మేరకు చాలామంది రైతులు పత్తి, సోయా విత్తనాలు కొనుగోలు చేశారు. అక్షయ తృతీయ నుంచే ప్రారంభం కొన్నేళ్లుగా అక్షయ తృతీయ రోజు నుంచే వానాకాలం సాగు మొదలు పెడుతున్న. ఈ రోజు పత్తి విత్తనాలు కొంటే మంచి దిగుబడి వస్తుందని నమ్మకం. జూన్లో వర్షాలు పడగానే ఈ విత్తనాలు విత్తుకుంటం. దీంతో పంటలో మంచి దిగుబడి వస్తుందని మా నమ్మకం. – కామాజి, అడేగామ(కె) రైతు -
మొక్కలు కూడా యుద్ధం చేస్తాయా..?
ఒడిశా: మొక్కలు సాధారణంగా ఎవరినీ నొంపించవనే మనకు తెలుసు. కానీ వుడ్ సోరెల్ అని పిలవబడే ఓ మొక్క ఉంది. అయితే దానిని ఎవరైనా ముట్టుకుంటే దానికి కోపం వస్తుంది. ఎంతలా అంటే దాని దగ్గరున్న ఆయుదాలతో ఆపకుండా యుద్ధం చేస్తుంది. అదేంటి మొక్క యుద్ధం చేయడమేంటనుకుంటున్నారా..? ఇది నిజమే ఆ మొక్కను ఎవరైనా ముట్టుకుంటే వారి బారి నుంచి కాపాడుకోవడానికి మిస్సైళ్లను పేల్చుతుంది. మిస్సైల్స్ అంటే ఎలాంటి బాంబులనో కాదు. ఆ మొక్క విత్తనాలనే బాంబుల్లా విసిరేస్తుందన్నమాట. వుడ్ సోరెల్ కాయలు చూడటానికి అచ్చం బెండకాయల్లా ఉంటాయి. ఎవరైనా దానిని తాకిన వెంటనే ఆపకుండా వరుసగా విత్తనాలను విసురుతుంది. ఒక్కటి రెండో కాదు కాసేపు అలా వాటిని వదులుతూనే ఉంటుంది. మిస్సైళ్ నుంచి బాంబులను వదిలినట్టుగా ఈ మొక్క విత్తనాలను వదలుతుంది. ఇలా దాదాపు నాలుగు మీటర్ల వరకు విత్తనాలను విసరగలిగే శక్తి ఈ వుడ్ సోరెల్ మొక్కలకు ఉంటుంది. ఒత్తిడితో పాటు దానికున్న శక్తి వల్ల అది విత్తనాలను విసరగలుగుతుంది. అయితే ఈ విత్తనాలు తగిలితే మనుషులకు పెద్దగా నొప్పి లేకపోవచ్చు కానీ చిన్నచిన్న కీటకాలకు తగిలితే వాటికి మాత్రం నొప్పి పుడుతుంది. తాజాగా ఈ మొక్కకు సంబంధించిన ఓ వీడియోను ఒడిశాకు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా ట్విట్ చేయడంతో అది వైరల్గా మారింది. ఇక ఈ వుడ్ సోరెల్ మొక్క బ్రెజిల్, మెక్సికో, దక్షిణాఫ్రికా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మినహా ఈ మొక్క ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉంటుందని తెలుస్తుంది. మన దేశంలో కూడా కొన్ని ప్రదేశాల్లో వుడ్ సోరెల్ కనిపిస్తుందని సమాచారం. Ballistic missiles as seen in the on going war are not humans prerogative only.. Wood Sorrel plant explodes & goes ‘ballistic’ when touched. Seeds are thrown as far as 4 metres away due to stored strain energy, with the plant targeting the object that agitated it. 🎥Arun Kumar pic.twitter.com/uRVWO2MOut — Susanta Nanda IFS (@susantananda3) February 26, 2022 -
ఉక్రెయిన్ ఉక్కు మహిళ! మా గడ్డ పై ఏం పని మీకు ?
Ukrainian Woman Confronts Russian Soldiers: రష్యా దళాలు గురువారం ఉక్రెయిన్ సరిహద్దును దాటి దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అవి ఇప్పుడు రాజధాని కైవ్కు సమీపంలో ఉన్నాయి. రష్యా సైనికులు ఉక్రెయిన్ సరిహద్దును దాటి వీధుల్లోకి ప్రవేశించడంతో ఉక్రెనియన్లు రష్యా దాడిని ఖండిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా విస్తృత నిరసనలు చేపట్టారు. టోక్యో నుంచి న్యూయార్క్ వరకు రష్యా కార్యాలయలు వద్ద, బహిరంగ ప్రదేశాల్లో పెద్ద పెద్ద ఎత్తున నిరసనలు ప్రారంభించారు. మరోవైపు ఆ దేశ అధ్యక్షుడు సైతం సైనిక దుస్తులతో యుద్థ రంగంలోకి వెళ్లి తమ సైనికులకు ధైర్యాన్ని నింపడమే కాక తాను సైతం రష్యా బలగాలతో తలపడుతున్నాడు. ఇంకో వైపు ఆ దేశపు మహిళలు సైతం తాము కూడా తమ దేశం కోసం ఏం చేయడానికైన సిద్ధం అంటున్నారు. ఈ మేరకు రాజధానికి సమీపంలోని ఓడరేవు నగరమైన హెనిచెస్క్లోని వీధుల్లోకి వస్తున్న రష్యా బలగాలకు ఒక ఉక్రెయిన్ మహిళ ఎదురు నిలబడి ప్రశ్నల వర్షం కురిపించింది. ఏ మాత్రం బెరుకు లేకుండా మా దేశంలో ఏం చేస్తున్నారంటూ నిలదీసింది. తుపాకులు, పెద్ద మెషిన్ గన్లు పట్టుకున్న ఆ సైనికులు నివ్వెరపోయాలా ఆక్రోసించింది. దీంతో వారు ఆ మహిళతో ఇక్కడ ఏం జరగటం లేదంటూ..ఆమెను శాంత పరచడానికి ప్రయత్నించారు. అయితే ఆమె ఏ మాత్రం ఖాతరు చేయకుండా మీకు ఇక్కడేం పని అంటూ గర్జించింది. దెబ్బకు ఆ రష్యా సైన్యం తాము ఇక్కడ సైనిక కసరత్తులు చేస్తున్నాం దయచేసి మీరు వెళ్లండి అని వాళ్లు సున్నితంగా చెబుతున్న ఆమె లక్ష్యపెట్టలేదు. పైగా ఈ భూమి పై మీకు ఏం దొరకదు. కనీసం ఈ గింజలైన తీసుకుని జేబులో పెట్టుకోండి. మీరంతా ఇక్కడ పడుకున్నప్పుడు కనీసం ఆ పొద్దుతిరుగుడు పువ్వులు అయిన పెరుగుతాయని వ్యంగ్యంగా చెప్పి నిష్క్రమించింది. పొద్దు తిరుగుడు పువ్వు ఉక్రెయిన్ జాతీయ పుష్పం. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆ సైనికులను చూసి ఏ మాత్రం భయపడకుండా నిలబడిన "నిర్భయ", ఆమెను తమ దేశ దళాలతో మాట్లాడమని చెప్పాలి ఎందుకంటే ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా తమ బలగాలను ధైర్యంగా పోరాడేలా చేయగల సమర్థురాలు అని ప్రశంసిస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. Woman in Henichesk confronts Russian military. “Why the fuck did you come here ? No one wants you!” 🤣#Russia #Ukraine #Putin pic.twitter.com/wTz9D9U6jQ — Intel Rogue (@IntelRogue) February 24, 2022 (చదవండి: చనిపోతున్నప్పుడు మన మెదడు ఏం ఆలోచిస్తుందో తెలుసా!) -
గుమ్మడి గింజలు: ఎవరు తినకూడదు? ఎవరు తినవచ్చు!
సాధారణంగా గుమ్మడి కాయల్ని కూరగా చేసుకుంటాం. లేదా స్వీట్ చేసుకుంటాం. గింజల్ని పక్కన పారేస్తుంటాం. అయితే కరోనా మహమ్మారి తరువాత డ్రైఫ్రూట్స్, నట్స్తో పాటు గుమ్మడి గింజల వాడకం బాగా పెరిగింది. ఈ సీడ్స్లోని పోషక విలువలు మన శరీరానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయట. అయితే కొన్ని సమస్యలు ఉన్నవారు గుమ్మడికాయ విత్తనాల్ని తినకూడదు. ఎందుకలా? వాచ్దిస్ స్టోరీ.. గుమ్మడికాయ గింజలు చాలా ప్రయోజనాలను కలిగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఇందులో కొవ్వు ఆమ్లాలు, భాస్వరం, పొటాషియం, జింక్ లాంటి అవసరమైన అమైనో ఆమ్లాలు, ఫినోలిక్ సమ్మేళనాలు కలిగి ఉంటాయి. మధుమేహం, గుండె జబ్బులు, కండరాలు, ఎముకల నొప్పి నివారణకు ఉపయోగపడతాయి. హైబీపీని తగ్గిస్తాయి. వీటిని తింటే రుచికి రుచికితోపాటు శక్తికి శక్తిని అందిస్తాయి. వీటిల్లో ఏ సీ ఈ విటమిన్లతోపాటు, ఐరన్, కాల్షియం, జింక్, ఫోలేట్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు చాలా మంచిది. (Chocolate Day Story: వాలెంటైన్స్ డే వీక్, స్వీటెస్ట్ డే.. ‘చాక్లెట్ డే’) మంచిగా నిద్ర పట్టాలంటే గుమ్మడి గింజలు తింటే మంచి ఫలితం ఉంటుంది. అంతేనా జుట్టు రాలడం, మొటిమలను నియంత్రించడంతోపాటు, చర్మ సంరక్షణకు కూడా ఏజెంట్లుగా పనిచేస్తాయి. వీటిల్లో జింక్ పుష్కలంగా ఉండటంతో బట్టతల సమస్యను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే గాయాలను నయం చేయడంలో సహాయ పడుతుంది. చర్మాన్ని యవ్వనంగా, ముడతలు లేకుండా ఉంచుతుంది గుమ్మడి గింజల నూనెలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, కెరోటిన్ ఉంటాయి. ఇంకా చర్మ సంబంధమైన దీర్ఘకాలిక మంటలు, బొబ్బలకు ఉపశమనం లభిస్తుంది. గుమ్మడికాయ గింజలలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్, యాంటీ ఆర్థరైటిక్తోపాటు యాంటీ డయాబెటిక్ లక్షణాలున్నాయి. ఇవి క్యాన్సర్, మూత్రాశయ ఇన్ ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి. గుమ్మడి గింజలు ఆరోగ్యకరమైన కొవ్వు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లకు నిలయం. అందుకే ఇవి ఊబకాయాన్ని నిరోధిస్తాయి. ఇది స్క్రబ్, లోషన్ రూపంలో లేదా మసాజ్ చేసినప్పుడు బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి కూడా రక్షిస్తుంది. ఈ సీడ్స్ తినడం ద్వారా గుండె రక్త నాళాలు గడ్డలు రాకుండా నిరోధించవచ్చు. స్ట్రోక్ వంటి వివిధ గుండె సమస్యలను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ గింజల్లోని యాంటీ డయాబెటిక్ లక్షణం సుగర్ను అదుపులో ఉంచుతుంది. గర్భవతులు తినవచ్చా? అత్యంత పోషకాలతో ఈ సీడ్స్ గర్భధారణ సమయంలో వినియోగానికి పూర్తిగా సురక్షితమే. ఎలాంటి దుష్ప్రభావాలు ఇంతవరకు నమోదు కాలేదు. కానీ ఈ సమయంలో జాగ్రత్త వహించాలి. అసహనం, తలనొప్పి, కడుపునొప్పి, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, డమేరియా లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. అలాగే గుమ్మడి గింజలు బీపీ సుగర్ లాంటి సమస్యలున్న గర్భిణీలు, పాలిచ్చే తల్లులు మాత్రం డాక్టర్ల సూచన మేర తీసుకోవాలి. లోసుగర్ ఉన్నవాళ్లు లో-బీపీ సమస్య ఉన్నవారు తీసుకోకుండా ఉంటే మంచిది. ఈ విత్తనాలను మరీ ఎక్కువగా తింటే అజీర్ణ సమస్యలొచ్చే అవకాశం ఉందనేది గమనించాలి. ఇలా కొన్ని పరిమితులు తప్ప ఈ గింజలతో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. -
Pumpkin Seeds: ఈ సీడ్స్ తింటున్నారా?
-
భక్తి విత్తుగా...ఆనందం మొలకెత్తగా
పెదబయలు (అరకులోయ): మన్యంలో ఆదివాసీ గిరిజన గ్రామాల్లో నిర్వహించే పండగలు, పెళ్లిళ్లు, జీవన విధానం, ఆచార సంప్రదాయాలు చాలా ఆసక్తిగా ఉంటాయి. విశాఖ మన్యంలో ఆదివాసీ గిరిజనులు (పీవీటీజీ) తెగలకు చెందిన వారు పుష్య మాసంలో జరుపుకునే పండగల్లో ముఖ్యమైనది ‘విత్తనాల పండగ’. మిగతా వారికి సంక్రాంతి పండగ ఎంత ముఖ్యమో వీరికి ఈ పండగ అంత ముఖ్యం. తాము పండించిన పంటల్లో చోడి (రాగులు) రాజ్మా, సామలు, ధాన్యం నాలుగు రకాలతో ప్రతి ఇంటి నుంచి కొద్దికొద్దిగా సేకరించి కొంత భాగం శుంకుదేవునికి నైవేద్యంగా సమర్పించి..మరో సగం శంకుదేవుని సన్నిధిలో విత్తనాలు ఉంచి నాలుగు రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు. ఈ నాలుగు రోజులూ సందడి వాతావరణం ఉంటుంది. ప్రతి ఏడాది ఫిబ్రవరి నెల 15 తేదీలోపు పండగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ నెల 5వ తేదీ శనివారం ప్రతి ఇంటి నుంచి గ్రామ పూజారి, దీసారి, మరో ఏడుగురు గుర్మవ్లు కలిసి తొమ్మిది మంది వెదురుతో చేసిన కొత్త బుట్టలో ప్రతి ఇంటి నుంచి రాగులు, సామలు, కందులు, ధాన్యాన్ని నాలుగు రకాలను సేకరించి శంకుదేవుని సన్నిధికి చేర్చి ప్రత్యేక పూజలు చేశారు. రెండో రోజు ఆదివారం శంకుదేవుని వద్దకు డప్పు వాయిద్యాలతో తొమ్మిది మందితో గ్రామంలో అందరూ పూజలు చేశారు. అలాగే గ్రామ పొలిమేరలో పూజలు చేసి అక్కడ నుంచి మట్టి సేకరించి శంకుదేవునికి పెట్టి పూజలు చేశారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి పూజలు ప్రారంభించారు. ప్రతి ఇంటి నుంచి చిన్న వెదురు బుట్టలో బియ్యం పోసి అందులో ప్రమిద పెట్టి దీపం వెలిగించి రెండు చేతులతో దీపం కొండెక్కకుండా శంకుదేవుని వద్ద మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకొచ్చారు. దీపం మధ్యలో కొండెక్కితే అశుభంగా భావిస్తారు. ప్రతి ఇంటి నుంచి ఇలా వచ్చి సమర్పించిన తరువాత పూజారి, దీసారి, మరో ఏడుగురు గుర్మవ్లు పూజలు చేశారు. గిరిజన వాయిద్యాలు మోగగానే గుర్మవ్లు శుంకుదేవుని సన్నిధిలో నృత్యం చేశారు. శంకుదేవునికి కోడి..మేక.. పితృదేవతలకు పందిని బలిస్తారు మంగళవారం ఉదయం నుంచి పూజలు చేసిన తరువాత సాయంత్రం శంకుదేవుని కోడి, మేక బలిచ్చారు. పితృదేవతలకు పందిని బలిచ్చారు. జంతువుల రక్తాన్ని విత్తనాల్లో కలిపి, విత్తనాలు కొంత భాగం శంకుదేవుని వద్ద చిన్న గుంత తీసి పెట్టిన తరువాత మరికొంత భాగం విత్తనాలు ఇంటింటా నైవేద్యంగా పంచుతారు. వారు ఈ ఏడాది వేసే పంటల్లో వాడే విత్తనాల్లో కలుపుతారు. తరువాత బలిచ్చిన జంతువులను వండుకుని నైవేద్యంగా గ్రామస్తులు తీసుకుంటారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వారికి కూడా భోజనాలు పెడతారు. కన్నె గుర్మవ్ల నియామకం గ్రామంలో ఏడుగురు గుర్మవ్లు మహిళలే ఉంటారు. వీరు ఎక్కువగా ముసలివారే ఉంటారు. అయితే ప్రతి మూడేళ్లకు ఒకసారి కన్నె గుర్మవ్ల నియమిస్తుంటారు. గ్రామంలో పదేళ్లలోపు ఆడపిల్లను తల్లితండ్రుల అనుమతితో ఎంపిక చేస్తారు. బాలిక స్నానం చేసిన అనంతరం నూతన వస్త్రాలు ధరించిన తరువాత బావి నుంచి కన్నె గుర్మవ్ తెచ్చిన నీటిని వినియోగించి శంకుదేవునికి నైవేద్యం వండి, చెట్టుకు బోనం కుండను ఉట్టిలో ఉంచి వేలాడదీస్తారు. నాలుగు రోజుల పాటు జరిగే వేడుకల్లో కన్నె గుర్మవ్ పాల్గొంటుంది. వారు చేసే పూజలను అనుసరిస్తుంది. గ్రామాల్లో దింసా నృత్యం సందడి విత్తనాల పండగ సందర్భంగా గ్రామాల్లో మహిళలు, చిన్నపెద్ద తేడా లేకుండా దింసా నృత్యం చేయడం ఆనవాయితీ. గిరిజన డప్పు వాయిద్యాల నడుమ ఆదివాసీ గ్రామాల్లో సందడి నెలకొంటుంది. పూర్వీకుల ఆచారం ప్రకారం విత్తనాల పండగ పూర్వీకుల ఆచారం ప్రకారం విత్తనాల పండగ నిర్వహిస్తారు. పంటలు బాగా పండాలని, గ్రామంలో పశుసంపద బాగుండాలని, ప్రకృతి దేవతలకు పూజలు చేస్తాం. తాము పండించిన కొత్త పంటను శుంకుదేవుని దగ్గర ఉంచి కోడి, మేక, పందిని బలి ఇచ్చిన తరువాత ఆ రక్తాన్ని విత్తనాల్లో కలిపి శంకుదేవుని వద్దకు చిన్న గుంత తీసి విత్తనాలు వేస్తాం. మిగిలిన సగం విత్తనాలు ఇంటింటికి పంచుతాం. వారు ఈ ఏడాడి పంటకు ఉపయోగించే విత్తనాల్లో వాటిని కలిపి ఉపయోగిస్తారు. –వంతాల కళ్యాణం, గ్రామ పూజారి, కప్పాడ గ్రామం పంటలకు మేలు విత్తనాల పండగ ప్రతి ఏడాది నిర్వహిస్తాం. శంకుదేవుని సన్నిధిలో విత్తనాలు ఉంచి పూజలు చేసిన తరువాత అదే విత్తనాలు తీసుకుని నూతన పంటలకు ఉపయోగించే విత్తనాల్లో కలిపి సాగు ప్రారంభించడం ఆనవాయితీ. విత్తనాల పండగ ప్రతి కుటుంబానికి ఎంతో ముఖ్యం. గుర్మవ్గా 55 ఏళ్ల నుంచి చేస్తున్నాను. –కిల్లో లక్ష్మి, గుర్మవ్, కప్పాడ -
విత్తనం నుండి విక్రయం వరకు అన్ని ఒకే చోట:పూనం మాలకొండయ్య
-
లిప్స్టిక్ తయారీలో వాడే గింజలు ఏంటో తెలుసా..!
సాక్షి, బుట్టాయగూడెం: పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీలో కొత్తరకం సాగుకు గిరిజన రైతు శ్రీకారం చుట్టాడు. లిప్స్టిక్ గింజలుగా పేర్గాంచిన జాఫ్రా పంట సాగు మొదలుపెట్టి తొలి ప్రయత్నంలోనే సత్ఫలితాలు సాధించాడు. బుట్టాయగూడెం మండలం దాసయ్యపాలెంకు చెందిన మడకం జంపాలరావు దాదాపు 30 ఏళ్లుగా 100 ఎకరాల్లో పలు రకాల పంటలు సాగుచేస్తున్నాడు. ఇటీవల తూర్పుగోదావరి, విశాఖ మన్య ప్రాంతంలో పర్యటించిన సమయంలో జాఫ్రా సాగు గురించి తెలుసుకున్నాడు. ఈ సాగు అతడిని ఆకట్టుకోవడంతో మొదటగా మూడు ఎకరాల్లో సాగు ప్రారంభించాడు. సాధారణంగా 14 నెలల్లోపు పంట చేతికి రావాల్సి ఉండగా 9 నెలలకే దిగుబడి సాధించాడు. జాఫ్రా అంటే.. ►జాఫ్రా మొక్కలు కొండలు, గుట్టల్లో సహజ సిద్ధంగా పెరుగుతాయి. ►జాఫ్రా మొక్కల కాయల నుంచి ఎర్రటి గింజలు (లిప్స్టిక్ గింజలు) తీస్తారు. ►ఈ గింజలను లిప్స్టిక్, సౌందర్య సాధనాలు, ఫుడ్ కలర్స్, ఆహార ఉత్పత్తులు, అద్దకాలు, మందుల తయారీకి వినియోగిస్తారు. ►ఆహార ఉత్పత్తుల్లో కృత్రిమ రంగుల వాడకాన్ని అమెరికా నిషేధించడంతో జాఫ్రా గింజలకు డిమాండ్ పెరిగింది. ►జాఫ్రా గింజల వినియోగం పెరగడంతో వాణిజ్య పంటగా రూపుదిద్దుకుంది. ►జాఫ్రా ఆకులను కామెర్లు, పాము కాటుకు మందుగా ఉపయోగిస్తారు. ►బెరడను గనేరియా వ్యాధి నివారణకు వినియోగిస్తారు. ►జీసీసీ ద్వారా జాఫ్రా గింజలను కిలో రూ.100 నుంచి రూ.120 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఎకరాకు 160 మొక్కల చొప్పున రంపచోడవరం నుంచి మొక్కలను తీసుకువచ్చి ఎకరాకు 160 చొప్పున మూడెకరాల్లో నాటాను. మొక్కల ఎదుగుదల ఆశాజనకంగా ఉంది. సాధారణంగా పంట 14 నెలలకు చేతికి వస్తుంది. అయితే నేను వేసిన పంట 9 నెలలకే దిగుబడి వచి్చంది. తూర్పుగోదావరి జిల్లా రైతులు ఎకరాకు ఏడున్నర క్వింటాళ్ల దిగుబడి సాధించగా మా పంట 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని ఆశిస్తున్నా. ప్రస్తుతం మూడెకరాల్లో పంటను వేశాను. వచ్చే ఏడాది 50 ఎకరాల్లో పంట వేయాలని అనుకుంటున్నా. ఐటీడీఏ ద్వారా పంటను కొనుగోలు చేస్తే మరింత మంది గిరిజనులు జాఫ్రా సాగుకు ముందుకు వస్తారు. ఇంటర్నెట్లోనూ సాగు వివరాలు తెలుసుకున్నా. అంతర్జాతీయ మార్కెట్లో జాఫ్రా గింజలకు కిలో రూ.1,200 వరకు ధర పలుకుతోంది. –మడకం జంపాలు, గిరిజన రైతు, దాసియ్యపాలెం, బుట్టాయగూడెం మండలం జాఫ్రా గింజలు -
ఇవి ‘బాహుబలి’ విత్తనాలు.. శివగామి, కట్టప్పవీ ఉన్నాయ్
న్యూఢిల్లీ: రైతుల కష్టార్జితం వారికి కడుపు నింపుతుందా? అన్నది ప్రకృతి చేతుల్లోనే ఉంటుంది. నాణ్యమైన విత్తనాలు, ప్రకృతి అనుకూలత, ఆరోగ్యకరమైన దిగుబడి, మార్కెట్లో మద్దతు ధరలు ఇవన్నీ కలిస్తేనే అన్నదాత కష్టానికి ఫలితం దక్కినట్టుగా భావించాలి. మహారాష్ట్రలో వరి, ఉల్లి రైతులు ఈ సీజన్లో బాహుబలి, కట్టప్ప, శివగామి, భీమ, దుర్గ బ్రాండ్ల విత్తనాలతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అకాల వర్షాలు, లాక్డౌన్లు, పెరిగిన ఖర్చుల మధ్య వారు ప్రజాదరణ పొందిన పౌరాణిక పాత్రల పేర్లతో విక్రయిస్తున్న విత్తనాలపై ఆశలు ఎక్కువగా పెట్టుకున్నారు. మహారాష్ట్రలో సాగు ఊపందుకోవడంతో ఇటువంటి బ్రాండ్లు మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. పేర్లతో అనుబంధం వేరు.. పేర్లలో ఏముందిలే అనుకోవద్దు. కొనుగోళ్ల విషయంలో బ్రాండ్ల పేర్లకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని.. ముఖ్యంగా కరువు, సంక్షోభ సమయాల్లో వీటికి ఉన్న ప్రాముఖ్యత ఎక్కువని మహారాష్ట్ర విత్తన పరిశ్రమ సమాఖ్య ఈడీ ఎస్బీ వాంఖడే పేర్కొన్నారు. ‘‘నిర్ణీత పరీక్షలు, అనుమతుల తర్వాతే విత్తన కంపెనీలు తమ ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెడతాయి. సినిమాల్లోని పాత్రల పేర్లు, దేవతల పేర్లను పెట్టడం ద్వారా రైతుల దృష్టిని ఆకర్షించడానికి వీలుంటుంది’’అని వాంఖడే వివరించారు. సినిమాల్లో ప్రజాదరణ పొందిన పాత్రల పేర్లు అయితే ప్రజలకు పరిచయం చేయక్కర్లేదని.. దీంతో ప్రచారం కోసం పెద్దగా ఖర్చు చేయకుండానే ఆయా పేర్లతో తేలిగ్గా చేరువ కావచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమా దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించడం తెలిసిందే. ఇందులోని బాహుబలి, కట్టప్ప, శివగామి పాత్రలు ఎంతో విజయవంతం అయ్యాయి. అందుకే ఈ పేర్లను విత్తన కంపెనీలు తమ ఉత్పత్తులకు తగిలించేశాయి. వీటితోపాటు భీష్మ, అర్జున్, కరణ్ వంటి పౌరాణిక పేర్లతో ఉన్న విత్తనాలను అక్కడి రైతులు నాణ్యమైనవిగా భావిస్తుండడం గమనార్హం. వరికి సంబంధించి సోనా, నవాబ్, ఉల్లికి సంబంధించి కోహినూర్ బ్రాండ్లకూ అక్కడ మంచి ఆదరణే ఉంది. మ్యాజిక్.. పత్తి సాగు రైతులకు పెద్దగా మిగిల్చిందేమీ లేకపోయినా.. మహారాష్ట్రలోని విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాల్లో మ్యాజిక్, మనీ మేకర్, ఫోర్స్ పేర్లతో ఉన్న పత్తి విత్తనాలు బాగా అమ్ముడుపోతున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మార్కెటింగ్ చేసుకునే విషయంలో ఈ పేర్లకు ఎంతో ప్రాధాన్యత ఉన్నట్టు కమ్యూనికేషన్ నిపుణుడు ఫ్రొఫెసర్ ఆర్ఎల్ పండిట్ పేర్కొన్నారు. ప్రజలకు చేరువ కావడమే ఈ పేర్ల వెనుక వ్యూహమని చెప్పారు. ‘‘తమ అనుభవం, నేపథ్యం, అవగాహన ఆధారంగా పేర్లతో వ్యక్తులకు అనుబంధం ఏర్పడుతుంది. ప్రజాదరణ పొందిన పాత్రల పేర్లు ప్రజల జ్ఞాపకాల్లో సులభంగా నిలిచిపోవడమే కాకుండా ఆయా పేర్లతో ఉన్న ఉత్పత్తులను కొనుగోలు చేసే దిశగా ప్రోత్సహిస్తుంది’’అని పండిట్ వివరించారు. అయితే, అనుభవం కలిగిన రైతులు మాత్రం నాణ్యమైన విత్తనాల వైపే మొగ్గు చూపిస్తున్నారు. గత సీజన్లో నాణ్యతలేమి విత్తనాల కారణంగా నష్టపోయిన రైతులు.. సోయాబీన్, ఉల్లి, పత్తి విత్తనాలపై ఫిర్యాదులు కూడా చేశారు. -
నట్టేట ముంచిన నకిలీ విత్తనం..!
సాక్షి, మంచిర్యాల అగ్రికల్చర్: నిషేధిత, నకిలీ పత్తి విత్తనాలు ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే రైతులను నట్టేట ముంచాయి. మొలకెత్తకపోవడంతో వేలాది రూపాయలు మట్టిపాలయ్యాయి. అధికారులకు ఫిర్యాదు చేస్తే గుర్తింపు లేని విత్తనాలు కొనుగోలు చేసినందుకు కేసు నమోదు చేస్తారనే భయంతో ఆవేదనను దిగమింగుతున్నారు. సీజన్ ఆరంభానికి ముందే గుర్తింపు లేని, నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పోలీసులు, అధికారులు ప్రయత్నిస్తున్నా రైతులను చేరాయి. లూజుగా దొరికే పత్తి విత్తనాలు కిలో రూ.2 వేల నుంచి రూ.2,200 చొప్పున కొనుగోలు చేసి విత్తుకున్నారు. ఎవరి వద్ద కొనుగోలు చేశారో వారిని నిలదీస్తే.. డబ్బు ఇవ్వడం కుదరదని, దాచిన విత్తనాలు ఏమైనా ఉంటే మళ్లీ వేసుకోవాలని, వచ్చే ఏడాది మంచి విత్తనాలు ఇస్తామని సముదాయిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తప్పని పరిస్థితుల్లో మళ్లీ దుక్కి దున్ని విత్తనాలు వేసుకుంటున్నారు. సీజన్ ముందే అందడంతో.. నకిలీ విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పోలీసు, వ్యవసాయ శాఖ అధికారులు గుర్తింపు లేని, నకిలీ విత్తనాలు, గ్లైపొసెట్ గడ్డిమందు పట్టుకొని పీడీ యాక్టు వంటి కేసులు నమోదు చేస్తున్నారు. అక్రమార్కులను జైలుకు పంపించారు. గతంలో కంటే ఈ ఏడాది 70 శాతం రైతుల దరిచేరకుండా చూసినా మరో 20 నుంచి 30 శాతం వరకు ఫిబ్రవరి, మార్చి నెలలోనే గ్రామాల్లోకి విత్తనాలు చేరాయి. మారుమూల ప్రాంతాల్లో, చేన్లలో కవర్లతో భద్రపరిచారు. ఎవరికీ అనుమానం రాకుండా గుర్తింపు ఉన్న కంపెనీ పత్తి విత్తనాల ప్యాకెట్లలో కలిపి నకిలీ విత్తనాలు వేసుకున్నారు. జూన్ రెండో వారం నుంచి కురిసిన భారీ వర్షాల అనంతరం విత్తుకున్నారు. కొన్ని చోట్ల విత్తనం మొలక శాతం 90 శాతం ఉండగా భీమిని, కన్నెపెల్లి, నెన్నెల, బెల్లంపల్లి, తాండూర్, కాసిపేట మండలాల్లో కొన్ని చొట్ల 10 నుంచి 30 శాతమే మొలక వచ్చిందని రైతులు వాపోతున్నారు. విత్తనం నాటిన వారం రోజుల్లో మొలక రావాల్సి ఉంటుంది. నేలలో తేమ శాతం బాగానే ఉన్నా 15 రోజుల నుంచి 20 రోజులు గడిచినా మొలక రాలేదని ఆందోళన చెందుతున్నారు. దుఃఖాన్ని దిగమింగి.. నెన్నెల మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ రైతు 20 ఎకరాల్లో వేసేందుకు ఈ విత్తనాలు రూ.50 వేలకు కొనుగోలు చేశాడు. దుక్కి, విత్తన సాల్లకు రూ.10 వేలు, విత్తేందుకు కూలీలకు రూ.8 వేలతో వెచ్చించాడు. 10 నుంచి 20 శాతం మాత్రమే మొలక రావడంతో రూ.80 వేల వరకు నష్టపోయాడు. బయటకు చెప్పుకోలేక.. బయటకు వస్తే అధికారులకు తెలిసిపోతుందని దుఃఖాన్ని దిగమింగి మరోసారి విత్తనాలు వేసేందుకు దున్ని సిద్ధపడ్డాడు. చదవండి: జీఎస్టీతో తగ్గిన పన్నుల భారం -
రెచ్చిపోతున్న విత్తన మాయగాళ్లు
-
ఆమె అడవిగా విస్తరించింది
పురుషుడి చేతిలో భూమి ఉంటే దానిని వ్యాపారం చేయాలని చూస్తాడు. స్త్రీ చేతిలో భూమి ఉంటే అందులో నాలుగు మొక్కలు నాటుదామని చూస్తుంది. నేలపై మొక్క లేదంటే ఆమడ దూరంలో కరువు ఉన్నట్టే. ఆ పైన ఆ నేల ఎడారి కానున్నట్టే. ప్రపంచం ఈ విషయం కనిపెట్టడానికి ముందే 40 ఏళ్ల క్రితం తన ఇంటి వెనుక ఉండే నాలుగున్నర ఎకరాలను అడవిగా మార్చడం మొదలెట్టింది దేవకీ అమ్మ. అందుకే ఆమెను అందరూ ‘అమ్మ చెట్టు’ అని పిలుస్తారు. ఆమె పరిచయం. దుబాయ్ నుంచి 12 ఏళ్ల ముని మనవరాలు కేరళ లో ఉన్న 85 ఏళ్ల దేవకీ అమ్మకు కుతూహలంగా ఫోన్ చేస్తుంది. ‘అవ్వా... నేను నాటిన మొక్క పెద్దదయ్యిందా’ అని అడుగుతుంది. దానికి దేవకీ అమ్మ కావాలనే జవాబు చెప్పదు. ‘మళ్లీ ఎప్పుడొస్తావ్... నువ్వొచ్చి కొత్త మొక్కలు నాటితే కదా’ అంటుంది. ‘వస్తా.. వస్తా... ఎంత తొందరగా అయితే అంత తొందరగా రావాలని ఉంది’ అంటుంది మునిమనవరాలు. ఆ మునిమనవరాలే కాదు, మనవలు, కడుపున పుట్టినవారు అందరూ దేవకీ అమ్మ కోసం ఒక సంస్కారాన్ని పారంపర్యంగా స్వీకరించారు. అది వారి పూర్వికుల ఇంటి వెనుక ఉన్న నాలుగున్నర ఎకరాల భూమిలో విత్తనాలు, మొక్కలు నాటడం. అది ఇవాళ్టి పరంపర కాదు. దాదాపు 40 ఏళ్లుగా వస్తోంది. దానిని మొదలెట్టింది దేవకీ అమ్మ. ముత్తుకులం కోడలు దేవకిది అలెప్పికి 40 కిలోమీటర్ల దూరంలో ఉండే ముత్తుకులం అనే చిన్న పల్లెటూరు. ఆ ఊళ్లో అందరూ వ్యవసాయం చేస్తారు. ఇంటి దగ్గర మొక్కలు పెంచడం కూడా ఆనవాయితీనే. ‘మా నాన్న వైద్యన్. ఆయన ఇంట్లో అప్పుడప్పుడు విత్తనాలు, మొక్కలు తెచ్చి నాటేవారు. నేను ఇంట్లో అందరి కంటే చిన్నదాన్ని కాబట్టి నన్ను నాటమనేవారు. అలా నాకు మొక్కలంటే ఇష్టం ఏర్పడింది’ అంటుంది దేవకీ అమ్మ. ఆమెకు వయసు వచ్చాక అదే ఊళ్లో ఉన్న గోపాలకృష్ణ పిళ్లై అనే ఇంగ్లిష్ టీచర్ను వివాహం చేసుకుంది. అత్తగారిది విశాలమైన ఇల్లు. దాని వెనుక దాదాపు నాలుగున్నర ఎకరాల పెరడు ఉంది. ఇంట్లో ఉన్న స్త్రీలందరూ వ్యవసాయ పనులు చేసి సొంత పొలంలో వరి పండించేవారు. ‘నాకు వ్యవసాయం ఇష్టం కనుక అత్తయ్యకు సాయం చేసేదాన్ని’ అంటుంది దేవకీ అమ్మ. 1980లో మారిన కథ 1980లో దేవకీ వెళుతున్న కారుకు యాక్సిడెంట్ అయ్యింది. ఆమె కాలు కదల్లేని పరిస్థితి వచ్చి మూడేళ్లు మంచాన ఉండిపోయింది. పొలానికి వెళ్లొద్దని డాక్టర్లు చెప్పారు. ‘నాకేమో పొలం పనులు ఇష్టం. ఏం చేయాలో తోచక పెరట్లో ఒక మొక్క నాటాను. అది పెరిగింది. మరోటి నాటాను. ఆ తర్వాత ఆ నాలుగున్నర ఎకరాల స్థలమే నా నివాసం అయ్యింది. అక్కడ మొక్కలు నాటుతూ వెళ్లాను. నా భర్త ఆ పనిలో నేను ఆనందం పొందుతూ పూర్తిగా కోలుకోవడం చూసి రోజూ తప్పనిసరిగా కొత్త కొత్త మొక్కలు తెచ్చివ్వడం మొదలుపెట్టారు. నా మొక్కల ఇష్టం చూసి బంధువులు, స్నేహితులు ఎవరు మా ఇంటికి వచ్చినా మొక్కలు తీసుకు వచ్చారు. రోజులు గడిచాయి. నాకు తెలియకనే నా పెరడు ఒక అద్భుతమైన అడవిగా మారిపోయింది’ అంటుంది దేవకీ అమ్మ. స్త్రీ పెంచిన అడవి దేవకీ అమ్మ ఆ రోజుల్లోనే సేంద్రియ పద్ధతి లో ఆ అడవిని పెంచింది. ఎరువులు వాడలేదు. పేడనీళ్లే ఎరువు. అడవిలో ఏయే వృక్షాలు ఉంటాయో అవన్నీ ఆమె పెరట్లో ఉన్నాయి. దాదాపు 200 రకాల వృక్షజాతులు ఉన్నాయి. 3000 చెట్లు, మొక్కలు ఉన్నాయి. ‘నేను రోజూ ఈ అడివంతా తిరుగుతాను. చెట్లతో మాట్లాడతాను. నా మాటలు వాటికి అర్థమవుతాయి. మాకేం చింత లేదు... ఈమె ఉంది కదా అని అనుకుంటాయి’ అంటుంది దేవకీ అమ్మ. చిన్న ఊరి మధ్యలో ఇంటి వెనుక పెద్ద అడవి ఏర్పడటం నిజంగా వింతే. అందుకే వృక్షశాస్త్రం అభ్యసించేవారు తరచూ దేవకీ అమ్మ అడవిని సందర్శిస్తూ ఉంటారు. అధ్యయనం చేస్తూ ఉంటారు. ‘సాధారణంగా చాలామంది అడవికి కంచె వేస్తుంటారు. నేను వేయను. వచ్చే జంతువులన్నీ రానీ. వాలే పక్షులన్నీ వాలనీ. ఈ భూమి అందరిదీ. నేను రోజూ నా కుటుంబం మంచితో పాటు ఈ భూమి మీద ఉన్న సకల జీవరాశుల మంచిని కోరుతూ ప్రార్థిస్తాను’ అంటుంది దేవకీ అమ్మ. అమ్మ చెట్టు దేవకీ అమ్మకు ఇప్పుడు 85 ఏళ్లు. నిజానికి అడివంతా తిరగలేదు. అయినా సరే కొన్ని అడుగులైతే చెట్ల మధ్య వేసి వస్తుంది. పిల్లలు, మనమలు, మునిమనవలు ఎక్కడ ఉన్నా సెలవల్లో తప్పనిసరి గా వచ్చేస్తారు. అందరూ పండగలాగా అడవిలో కొత్త మొక్కలు నాటుతారు. ఈ నేల బతకాలంటే పచ్చగా ఉండాలని వారందరూ గట్టిగా నమ్ముతారు. ‘మా అమ్మ ప్రోత్సాహంతో నేను ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ చదివాను. మా పిల్లల్లో ఒకరిద్దరు బోటనీ స్టూడెంట్స్గా మారారు. ఇదంతా అమ్మ చలవే’ అని దేవకీ అమ్మ కుమార్తె ప్రొఫెసర్ టంకమణి అంటుంది. దేవకీ పెంచిన అడవిలోనే రెండు నీటి చెలమలు కూడా ఉన్నాయి. వాటిలో చేపలు ఆ చెట్ల నీడలతో ఆడుకుంటూ ఉంటాయి. ‘మా ఇంటికి వచ్చి చూసిన వారందరూ ఇలాంటి అడవిని పెంచడానికి తమ ఇళ్లల్లో స్థలాల్లో ప్రయత్నిస్తున్నారు. ఇంతకంటే ఏం కావాలి’ అంటుంది దేవకీ అమ్మ. జీవం ఎప్పుడూ బతుకునిస్తుంది. జీవం గురించి జీవం పోస్తే స్త్రీకి కాకుండా ఇంకెవరికి తెలుస్తుంది. ఈ భూమి జీవంతో ఉండాలంటే... ఈ భూమిపై ఉన్నవారు జీవంతో ఉండాలంటే... ఈ భూమిని జీవంతో నింపాలి. అలా నింపే శక్తి చెట్టుకే ఉంది. దేవకీ అమ్మవంటి వారికి ఆ సంగతి తెలుసు. భూమిని నిర్జీవం చేసే కార్యకలాపాలను నియంత్రించుకుంటూ అవసరమైన నేలను మాత్రమే వాడుకుంటూ మిగిలిన నేలను ఎప్పుడూ పచ్చదనంతో నింపుకుంటూ రావాలి మనిషి. దేవకీ అమ్మ వంటి వారు అందుకు ఒక పచ్చటి సందేశంలా నిలుస్తూనే ఉంటారు. అవార్డులు దేవకీ అమ్మ కృషికి, పర్యావరణ ప్రేమకు ఆమెకు ఎన్నో అవార్డులు వచ్చాయి. ప్రతిష్టాత్మక ఇందిరాగాంధీ ‘వృక్షమిత్ర’ పురస్కారం దక్కింది. కేరళ ప్రభుత్వం ‘హరి వ్యక్తి పురస్కారం’తో సత్కరించింది. కేంద్ర ప్రభుత్వం ‘నారిశక్తి అవార్డు’ను బహూకరించింది. వీటన్నింటిని మర్యాద కోసం దేవకీ అమ్మ స్వీకరించింది. నిజానికి ఆమెకు ఒక ఉదయం లేచినప్పుడు కొన్ని పక్షులు వచ్చి తన అడవిలో వాలి కువకువలు వినిపించడమే అతి పెద్ద పురస్కారం. అది ఇచ్చే ఆనందం అనుభవించినవారికే తెలుస్తుంది. – సాక్షి ఫ్యామిలీ -
ఉత్తుత్తిగా నకిలీ విత్తనాల కేసులు నమోదు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: నకిలీ పత్తి విత్తనాలకు కేంద్ర బిందువుగా ఉన్న జోగుళాంబ గద్వాల జిల్లాలో పోలీస్, వ్యవసాయశాఖల ఆధ్వర్యంలో 15 రోజులుగా దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 10,230 కిలోల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకోగా.. 18 మందిపై 15 కేసులు నమోదయ్యాయి. అయితే పట్టుబడుతున్న వారిపై తూతూమంత్రంగా చీటింగ్ కేసులు నమోదు చేస్తున్నారు. ఇందుకు గద్వాల రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకున్న ఘటనే నిదర్శనం. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 3న గద్వాల శివారులోని రమ్య ఇండస్ట్రీస్లో టాస్క్ఫోర్స్ నిర్వహించిన తనిఖీల్లో 72 బ్యాగుల (3434.5 కిలోల) నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. దీనిపై ఎం.విజయభాస్కర్రెడ్డిపై కేసు నమోదైంది. అసలు మిల్లు యజమానిని వదిలేసి, ఎవరో వ్యక్తిపై కేసు నమోదు కావడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలొచ్చాయి. ఆ మిల్లును లీజుకిచ్చినట్లు పేపర్లు సృష్టించారనే చర్చ జరిగింది. దీంతో గద్వాల రూరల్ పోలీసులు సోమవారం మిల్లు యజమాని, సీడ్ ఆర్గనైజర్, సీడ్మెన్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ భీంనగర్కు చెందిన బండ్ల రాజశేఖర్రెడ్డి (ఏ–1) ధరూర్ మండలం, బురెడ్డిపల్లికి చెందిన ఎం.విజయభాస్కర్రెడ్డి (ఏ–2)పై కేసు నమోదుచేసి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్డి ఎదుట హాజరుపరిచారు. ఆపై రిమాండ్కు తరలించారు. అయితే పోలీసులు వారిపై చీటింగ్ కేసు, విత్తన యాక్ట్ కిందే కేసు పెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కల్తీ విత్తన తయారీదారులను పీడీ యాక్టు కింద అరెస్ట్ చేయాలని సీఎం ఆదేశించినా గద్వాల పోలీసులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘సాక్షి’ నాడే చెప్పింది.. రాష్ట్రంలో కొనసాగుతోన్న నకిలీ విత్తనాల దందాపై ‘సాక్షి’ ప్రధాన సంచికలో కొద్ది రోజుల క్రితం ‘కల్తీ విత్తులతో కొల్లగొడతారు’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఎక్కడెక్కడ నకిలీ విత్తనాల దందా జరుగుతోంది?, మాఫియా ఆగడాలు, వారికి అండగా నిలుస్తున్నదెవరు?, నామమాత్రంగా కేసుల నమోదుపై ప్రచురితమైన ఈ కథనం సంచలనం సృష్టించింది. నాటి నుంచి సర్కారు ఆదేశాలతో వ్యవసాయ, పోలీస్శాఖల ఆధ్వర్యంలో జిల్లాల్లోని విత్తన దుకాణాలు, గోదాంలు, మిల్లులపై దాడులు నిర్వహిస్తున్నారు. క్వింటాళ్ల కొద్దీ నకిలీ విత్తనాలు పట్టుబడగా, వందల మందిపై కేసులు నమోదయ్యాయి. ‘సాక్షి’ కథనం తర్వాత సీడ్మెన్ అసోసియేషన్ సమావేశమైంది. ఇందులో ప్రస్తుతం కేసు నమోదైన బండ్ల రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ ‘నాణ్యమైన సీడ్ను పండిస్తూ దేశవ్యాప్తంగా నడిగడ్డకు మంచిపేరును తీసుకొస్తామని.. కొందరు వ్యక్తులు గద్వాల సీడ్కు ఉన్న బ్రాండ్ను వినియోగించుకుని నకిలీవి ఉత్పత్తి చేస్తున్నారని, వాటితో తమకు సంబంధం లేదని’ తెలిపారు. అయితే ప్రస్తుతం ఆయన మిల్లులోనే నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. చదవండి: కల్తీ విత్తులతో కొల్లగొడతారు -
భూమి పదునయ్యాకే విత్తడం మేలు
సాక్షి, అమరావతి: నైరుతిలో కురిసే తొలకరి వర్షాలకే విత్తనాలు వేయకుండా, భూమి పదునయ్యే దాకా కొద్దిగా ఆగాలని కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన కేంద్రం (క్రిడా) శాస్త్రవేత్తలు రైతులకు సూచిస్తున్నారు. రెండేళ్ల కిందట తొలకరిలో వచ్చిన తొలి వానలకే విత్తనాలు వేశారు. ఆ తర్వాత కొద్ది కాలం పాటు వర్షాలు ముఖం చాటేయడంతో రైతులు నష్టపోయారు. ఒకటికి రెండు సార్లు విత్తనాలు వేయాల్సి వచ్చింది. ప్రత్యేకించి పత్తి, వేరుశనగ రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముందస్తుగా పత్తి వేసే రైతులు బిందు సేద్యం పద్ధతి పాటించడం ఉత్తమం. తుపాన్లు, అల్పపీడనాల ప్రభావంతో ఇటీవల అక్కడక్కడా వర్షాలు పడ్డాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో వేరుశనగ విత్తనాలు వేసేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో విత్తనాలు మొలకెత్తినప్పటికీ ఆ తర్వాత వర్షాలు రాకుంటే ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. నాలుగు నుంచి ఆరంగుళాల లోతు వరకు నేల తడవడం ముఖ్యమని, అలాంటి వర్షాలు కురిశాకే విత్తనాలు వేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. విత్తనాలు వేయడం వారం ఆలస్యమైనా ఇబ్బంది లేదని డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు చెప్పారు. తక్కువ నీటితో సాగయ్యే పంటలు మేలు.. తక్కువ నీటితో సాగయ్యే పంటలు వేయడం ఉత్తమమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే గోదావరి జిల్లాల్లో వరి తప్ప ప్రత్యామ్నాయం లేకున్నా సాగు విస్తీర్ణాన్ని కుదించుకుని వేరే పంటలపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న సాగు విస్తరిస్తోంది. మాగాణి భూముల్లోనూ కంది, పెసర, మినుము వంటి తక్కువ నీటితో సాగయ్యే వంగడాలు వేసుకోవచ్చు. ప్రతి పంటలోనూ తక్కువ వ్యవధిలో పండే వంగడాలొచ్చాయి. దగ్గర్లోని ఏ వ్యవసాయాధికారిని సంప్రదించినా మరిన్ని వివరాలు చెబుతారు. అలాగే ఎరువుల వాడకంలోనూ జాగ్రత్తలు పాటించాలని శాస్త్రవేత్తలంటున్నారు. విత్తనాలు వేసే సమయంలో ఒకేసారి ఎక్కువ ఎరువుల్ని కుమ్మరించినంత మాత్రాన ఫలితం ఉండదంటున్నారు. రెండు మూడు దఫాలుగా వేయాలని చెబుతున్నారు. పత్తి, వేరుశనగ రైతులు ఈ విషయాన్ని విధిగా గుర్తుపెట్టుకోవాలని శాస్త్రవేత్తలు సలహా ఇస్తున్నారు. -
విత్తనం to విక్రయం... భూమి పుత్రులకు భరోసా
ఏటికి ఎదురీదిన రైతు బతుకులు ఇప్పుడు సేదతీరుతున్నాయి. విత్తనాల కోసం గంగ దాటెళ్లకే చెల్లమ్మా అనే హెచ్చరికలు ఇపుడు వినిపించడంలేదు. యూరియా కోసం వేకువ నుంచే అల్లంత దూరం కనిపించే ’చీమల దండులు’ కనుమరుగయ్యాయి. దళారుల దందాకు అరదండాలు పడ్డాయి. నాగేటి చాళ్లల్లో నవోదయం వికసించింది. పల్లెల్లో రుతు రాగం వినిపిస్తోంది. సాగుబడికి స్వేచ్ఛ, అన్నదాతకు విముక్తి దొరికాయి.. రైతు ఈ వేళ దేనికీ తలవంచాల్సిన పని లేదు. ఆత్మగౌరవం, గుండె నిబ్బరంతో తనున్న చోటుకే అన్నింటినీ తెప్పించుకుంటున్నాడు. అందర్నీ రప్పించుకుంటున్నాడు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దూరదృష్టితో చేసిన రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) ప్రయోగం స్వల్పకాలంలోనే సత్ఫలితాలను ఇచ్చింది. ఈ ప్రతిపాదన తెరపైకి తెచ్చినప్పుడు– ఆశ లావు పీక సన్నం– అని ఎకసెక్కం ఆడిన నోళ్లు ఇప్పుడు మూత పడ్డాయి. పల్లెల్లో పెను విప్లవానికి ఆర్బీకేలు నాంది పలికాయి.. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఒకటి చొప్పున 10,778 డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. నవరత్నాల్లో భాగంగా ఏర్పాటైన ఈ కేంద్రాల లక్ష్యం పంట ఉత్పాదకత మెరుగుపర్చడం, సాగు ఖర్చు తగ్గించడం. దీనికి అవసరమైన అన్ని రకాల ఉత్పాదకాలు–విత్తనం మొదలు విక్రయం వరకు రైతు ఇంటి ముంగిటే అందించడం లక్ష్యం. నాణ్యతలో రాజీ లేకుండా సరఫరాలో జాప్యం కాకుండా రైతు సేవలన్నీ ఒకే చోట అందించడమే ఉద్దేశం. అందుబాటులో అన్ని సేవలు.. ఆర్బీకేలు అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి. వ్యవసాయ విస్తరణలో భాగంగా శాస్త్రవేత్తలు ఆవిష్కరించే కొత్త విషయాలు రైతులకు చేరుతున్నాయి. నాణ్యమైన వ్యవసాయ ఉత్పాదకాలైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఇతర సామాగ్రి తమ చేరువలోకి వచ్చాయని రైతన్నలు సంబరపడుతున్నారు. ఏ ఊరు వెళ్లినా ఈ విషయాన్ని గమనించవచ్చునని తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన రైతు త్రినాధరెడ్డి అంటున్నారు. రైతు భరోసా కేంద్రాలు గ్రామ సీమల్లో విప్లవాన్ని తెచ్చాయి. గతంలో మాదిరి ఏ రైతూ ఉసూరుమంటూ పట్టణాల బాట పట్టడం లేదు. చిన్న, సన్న, మధ్యకార రైతులెవ్వరూ వ్యవసాయ ఉత్పాదకాల కోసం బండ్లు కట్టుకుని వెళ్లడం లేదు. ఇ–పంట నమోదు పెద్ద ముందడుగు... ప్రభుత్వం ఇచ్చే రాయితీలు ఏ కొందరికో పరిమితం కాకుండా వాస్తవ సాగుదార్లకు అందుతున్నాయంటే దానికి కారణం ఎలక్ట్రానిక్ పంట నమోదే. ఆయా గ్రామ పరిధిలోని అన్నదాతలు తాము సాగు చేసే పంటను గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా నమోదు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే ప్రతి లబ్ధీ పొందుతున్నారు. ఆర్బీకేలు రైతుకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తలుగా పని చేస్తున్నాయనడంలో సందేహమే లేదని రైతు సంఘాల నాయకులే చెప్పడం విశేషం. సేవలపై సర్వత్రా సంతృప్తి.. పంటల బీమా మొదలు ఉత్పత్తుల విక్రయం వరకు రైతు భరోసా కేంద్రాలలో అందుతున్న సేవలపై రైతులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. భూ రికార్డుల్లో తప్పులుంటే తప్ప నిర్దేశించిన ప్రతిదీ సమయానికి అందుతోంది. రైతుకు ఏదన్నా జరిగితే చెప్పుకోవడానికి ఇప్పుడో కేంద్రం ఉందన్న భరోసా ఉంది. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. మూగ జీవాలు చచ్చిపోతే వాటి బీమా కోసం కాలి గిట్టల్నో, చెవి పోగులను గోతాల్లో వేసుకుని పోవాల్సి వచ్చేది, ఈవేళ ఆర్బీకేకి వెళ్లి పశుసంవర్ధక శాఖ సహాయకునికి చెబితే సరిపోతుందని అనంతపురం జిల్లాకు చెందిన వెంకటయ్య అభిప్రాయపడ్డారు. నాసిరకం ఉత్పత్తుల్ని రైతులకు అంటగట్టేందుకు ప్రైవేటు డీలర్లు భయపడుతున్నారంటే ఆర్బీకేల వల్లేనని రైతు నాయకుడు వంగల భరత్ రెడ్డి చెప్పారు. కనీస మద్దతు ధర కల్పించడంలో కీలక పాత్ర పండించిన ప్రతి పంటకూ గిట్టుబాటు ధర కల్పించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిలాషకు నిలువెత్తు నిదర్శనం ఆర్బీకేలు. ఇవి సీఎం మానసపుత్రికలు. ధాన్యం, మొక్కజొన్న, జొన్న, చిరుధాన్యాలు, అపరాలు, నూనె గింజలు, ఇతర వాణిజ్య పంటలకు కనీస మద్దతు ధరలు తగ్గినప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్కు కూడా ఆర్బీకేలు తోడ్పడుతున్నాయి. ఆర్బీకేలు ఉండబట్టే ప్రైవేటు వ్యాపారుల ఆగడాలు ఆగాయి. త్వరలో గిడ్డంగులు కూడా వస్తాయి. అవి వస్తే రైతులకు ఇంకా మేలు జరుగుతుంది. – హెచ్.అరుణ్ కుమార్, వ్యవసాయ శాఖ కమిషనర్ ఆర్బీకేల ప్రయోగం దేశానికే ఆదర్శం.. ఆర్బీకేలు వచ్చిన తర్వాత విత్తనాల కోసం క్యూలు లేవు. ధరల్లో తేడాలు లేవు. ఎంఎస్పీ ప్రకారం కొనకపోతే ఫిర్యాదు చేసే వ్యవస్థ ఒకటి ఈవేళ ఏర్పాటైంది. రూ.2,281.8 కోట్లతో ఆర్బీకేలకు భవనాలు, ఇతర మౌలిక వసతులు సమకూరుతున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికీ ఒక వ్యవస్థ ఏర్పాటవుతుంది. పారదర్శకత, జవాబుదారీ తనం పెరుగుతుంది. – కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి రైతుకు తలలో నాలుకలా ఆర్బీకేలు రాష్ట్రంలో వినూత్నంగా అమలవుతున్న ఆర్బీకేలను ప్రత్యక్షంగా చూశా. రైతులకు తలలో నాలుకలా ఉన్నాయి. సమగ్ర రైతు సేవలకు ఇవి సాక్షాత్తు కేంద్రాలు. ఆర్బీకేలను గ్రామీణ సహకార సంఘాలతో అనుసంధానం చేసే ఆలోచన చేస్తున్నాం. రైతుల సాధికారతలో గ్రామీణ పరపతి సంఘాలను ఆర్బీకేలతో అనుసంధానం చేస్తే అద్భుత ఫలితాలు రావొచ్చునని భావిస్తున్నాం. – డాక్టర్ జీఆర్ చింతల, నాబార్డ్ చైర్మన్ జీవితానికి ‘భరోసా’ దొరికింది ఎప్పట్నుంచో ఇక్కడి పోడు భూముల్లో కాఫీ పంట సాగు చేస్తున్నా. వైఎస్సార్ తర్వాత మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. మళ్లీ జగనన్న సీఎం అయిన తర్వాతే మాకు పట్టాలు వచ్చాయి. వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద డబ్బులు కూడా ఇచ్చారు. ఈ సొమ్మును పొలం పనులకు వాడుతున్నా. ఎవరూ పట్టించుకోని మాకు పట్టాలిచి్చ.. రైతు భరోసా అమలు చేసిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం. – కొర్రా వరహాలమ్మ, మోదాపల్లి, విశాఖ జిల్లా వైఎస్సార్ రైతు భరోసా ఇచ్చిన మాట కంటే ఎక్కువగా.. చెప్పిన దాని కంటే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల కోసం వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టి అమలుచేస్తోంది. మూడు విడతల్లో కలిపి రూ.13,500 అందిస్తోంది. అలాగే భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులతో పాటు పోడు భూముల సాగుదారులకు కూడా రైతు భరోసా ఇస్తోంది. తొలి ఏడాది 1,58,123 మంది కౌలుదారులు, పోడు భూముల సాగుదారులకు లబ్ధి చేకూరగా.. గతేడాది 1,54,171 మందికి పెట్టుబడి సాయం అందింది. ఈ ఏడాది 1,86,254 మందికి రైతు భరోసా లభించింది. వడ్డీల భారాన్ని దించేశారు.. నాకు 3.46 ఎకరాల పొలముంది. సాగు కోసమని కమలాపురం డీసీసీబీలో దాదాపు రూ.90 వేల వరకు రుణం తీసుకున్నా.దీనికి సంబంధించిన వడ్డీని బ్యాంకుకు సకాలంలో చెల్లించేవాడిని. ఈ పరిస్థితుల్లో సీఎం జగన్.. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకంతో ఆదుకున్నారు. ఇప్పుడు నాకు వడ్డీ భారం కూడా తొలగిపోయింది. రైతు భరోసా కూడా వస్తోంది. జగన్ సీఎం అయ్యాక నా లాంటి రైతుల పరిస్థితి బాగుపడింది. – వి.కృష్ణారెడ్డి, అగస్త లింగాయపల్లె, వైఎస్సార్ జిల్లా వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు రైతులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా ‘వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు’ పథకాన్ని సీఎం జగన్ తీసుకొచ్చారు. రూ.లక్ష వరకు పంట రుణాలు తీసుకొని ఏడాది లోపు దాన్ని తిరిగి చెల్లించిన రైతులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో రైతులకు రూ.1,202.61 కోట్ల వడ్డీ రాయితీ అందజేసింది. 2019(ఖరీఫ్)లో అర్హులైన 14,26,994 మందికి రూ.289.42 కోట్లు.. 2019–20(రబీ)లో అర్హులైన 6,27,906 మందికి రూ.128.47 కోట్లు జమ చేసింది. టీడీపీ ప్రభుత్వ బకాయిలనూ చెల్లిస్తోంది. సమయానికి ఆదుకున్నారు మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నాను. గతేడాది కురిసిన వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయా. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న నన్ను సీఎం జగన్.. సమయానికి ఆదుకున్నారు. అదే ఏడాది నవంబర్లో ఇన్పుట్ సబ్సిడీ ప్రకటించారు. ఎకరాకు రూ.6 వేలు చొప్పున మొత్తం రూ.18,000 నా ఖాతాలో జమ చేశారు. నిజంగా ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం. – బి. సత్యనారాయణరాజు, రైతు, గంటి గ్రామం, తూర్పుగోదావరి జిల్లా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విపత్తుల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు దక్కాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఒకప్పుడు అందని ద్రాక్షగానే ఉండేది. కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. విపత్తు జరిగి నెల రోజులు కూడా తిరగక ముందే పంట నష్ట పరిహారం అందజేస్తోంది. గత రెండేళ్లుగా కరువు తీరా కురిసిన వర్షాల వల్ల వచ్చిన వరదలతో పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా స్పందించింది. అతి తక్కువ సమయంలోనే ఇన్పుట్ సబ్సిడీ అందించింది. దీని కోసం ప్రభుత్వం ప్రతి బడ్జెట్లో ప్రత్యేకంగా రూ.2 వేల కోట్లు చొప్పున ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధిని ఏర్పాటు చేస్తోంది. సొంతంగా వ్యాపారం చేస్తున్నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే నా భర్త ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఎవరి మీదా ఆధారపడకూడదని కూరగాయలమ్మడం మొదలుపెట్టా. చేతిలో డబ్బుల్లేక పెట్టుబడికి అప్పు చేయాల్సి వచ్చేది. వచ్చిన లాభం కాస్తా వడ్డీకే సరిపోయేది. ఇలాంటి పరిస్థితిలో వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రూ.18,750 వచ్చాయి. వాటితో తోపుడు బండి కొనుక్కొని మచిలీపట్నం సెంటర్లో కూరగాయల వ్యాపారం చేస్తున్నా. – రసూల్ బీ, మచిలీపట్నం, కృష్ణా జిల్లా వైఎస్సార్ చేయూత మహిళా సాధికారతే లక్ష్యంగా అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం వైఎస్ జగన్ ‘వైఎస్సార్ చేయూత’ పథకాన్ని తీసుకొచ్చారు. దీని ద్వారా 45–60 ఏళ్ల వయసు మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున అందజేస్తున్నారు. నాలుగేళ్లలో రూ.75,000 ఆర్థిక సాయం చేయనున్నారు. తొలి ఏడాది 24.55 లక్షల మంది మహిళలకు రూ.4,604.13 కోట్ల మేర ప్రభుత్వం లబ్ధి చేకూర్చింది. ఇది పేదోళ్ల ప్రభుత్వం నేను కౌలు రైతును. కొడుకు, కోడలితో కలిసి వ్యవసాయ పనులు చేస్తుంటాం. ఇతరత్రా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. ఈ పరిస్థితిలో గత ఏడాది కరోనా కారణంగా బయటి పనులు లేవు. ఇల్లు గడిచేదెలా అని దిగులు చెందాం. ఇదే సమయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం పెద్ద మనసుతో తెల్ల కార్డు ఉన్న పేదలందరికీ కోవిడ్ సాయం ప్రకటించి ఆదుకుంది. ఎనిమిది నెలల పాటు ప్రతినెలా రెండు పర్యాయాల చొప్పున బియ్యం ఉచితంగా పంపిణీ చేశారు. సీఎం కరోనా తొలి నెలలోనే వలంటీర్తో మా ఇంటికి రూ.1,000 పంపించి, ఖర్చుల కోసం ఎవరినీ చేయి చాచకుండా చేశారు. ప్రతి నెలా బియ్యంతో పాటు శనగలు లేదా కందిపప్పు ఇచ్చారు. చివరి విడతలో గోధుమలు కూడా ఇచ్చారు. గతేడాది నవంబర్లో నా కోడలు కవితకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్తే ఆపరేష¯Œన్ చేయాలని, రూ.2.50 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉండటంతో ఒక్క రూపాయి తీసుకోకుండా చికిత్స చేశారు. ఇతరత్రా ప్రభుత్వ పథకాలతో మా కుటుంబానికి లబ్ధి కలిగింది. – గోళ్లమూడి భూషణం, తురుమెళ్ల, అమతలూరు మండలం, గుంటూరు జిల్లా పేదలకు ఆహార భద్రత కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా కేంద్రం లాక్ డౌన్ విధించిన సమయంలో నిరుపేదలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఒక్కో కుటుంబానికి రూ.వెయ్యి చొప్పున రూ.1,350.53 కోట్లను నగదు సాయంగా పంపిణీ చేసింది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న సమయంలో గతేడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు అదనంగా రెండోసారి రేషన్ను పంపిణీ చేసింది. ఇందుకు రూ.3,103 కోట్లను అదనంగా వెచ్చించింది. ఈ ఏడాది మే, జూన్ నెలల్లో సాధారణంగా కుటుంబంలో ఒక్కొక్కరికి ఐదు కేజీల చొప్పున ఇచ్చే బియ్యంతోపాటు అదనంగా ఐదు కేజీల బియ్యాన్ని ఒకే విడతలో పంపిణీ చేస్తోంది. ఇందుకు రూ.754 కోట్లను అదనంగా వ్యయం చేస్తోంది. నిరుపేదలకు ఆహారభద్రత చేకూర్చడాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా చేపట్టింది. దేశంలో ఎక్కడా లేని రీతిలో పౌరసరఫరాల శాఖ నేతృత్వంలో 1.47 కోట్ల నిరుపేదల కుటుంబాలకు 9,260 వాహనాల ద్వారా నాణ్యమైన బియ్యంతోపాటు చక్కెర, కందిపప్పు వంటి నిత్యావసరాలను పంపిణీ చేస్తోంది. తోబుట్టువులా తోడుంటున్నారు మా సంఘంలో పది మంది ఉన్నారు. పిల్లల చదువుల కోసమని, చిన్నచిన్న వ్యాపారాల కోసమని రుణాలు తీసుకునేవాళ్లం. ఆ తర్వాత వడ్డీలతో కలిపి అసలు చెల్లించలేక ఇబ్బంది పడేవాళ్లం. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ సమస్య తొలగిపోయింది. వైఎస్సార్ సున్నా వడ్డీ ద్వారా మాకు మేలు చేస్తున్నారు. గతేడాది నాకు రూ.3,200 వడ్డీ రాయితీ వచి్చంది. ఈ ఏడాది మరో రూ.3 వేలు వచ్చాయి. ఒక కుటుంబ సభ్యుడిలా.. తోబుట్టువులా మమ్మల్ని సీఎం జగన్ ఆదుకుంటున్నారు. – గేదెల సరస్వతి, లక్ష్మీపురం, శ్రీకాకుళం. వైఎస్సార్ సున్నా వడ్డీ (స్వయం సహాయక సంఘాలు) స్వయం సహాయక సంఘాల మహిళల కుటుంబాల్లో సంతోషం నింపేందుకు సీఎం జగన్ ఇచి్చన మాట ప్రకారం.. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీని ప్రభుత్వమే భరిస్తోంది. 7,81,485 పొదుపు సంఘాలు తీసుకున్న రుణాలపై 2019–2020కి సంబంధించిన వడ్డీ డబ్బులు రూ.1,257.99 కోట్ల మొత్తాన్ని గతేడాది ఏప్రిల్లో చెల్లించింది. 2020–21కి సంబంధించిన వడ్డీ రూ.1,096.23 కోట్లను ఈ ఏడాది ఏప్రిల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. ఇలాంటి సీఎంను ఇప్పటివరకు చూడలేదు.. సొంతంగా అర ఎకరా ఉంది. మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నా. గతేడాది వర్షాల వల్ల కోతకు వచ్చిన పైరు దెబ్బతింది. ప్రభుత్వమే ప్రీమియం కట్టి బీమా వచ్చేలా చూసింది. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా రైతులను ఆదుకోలేదు. కానీ జగన్ ప్రభుత్వం.. వర్షాల వల్ల జరిగిన పంట నష్టానికి సంబంధించి నా బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేసింది. – తెలమేకల శ్రీనివాసులు, అన్నారెడ్డిపాళెం, నెల్లూరు జిల్లా వైఎస్సార్ ఉచిత పంటల బీమా రైతులు తాము పండించిన పంటలకు బీమా చేయించుకోలేక.. విపత్తుల బారిన పడిన ప్రతిసారీ ఆరి్థకంగా నష్టపోయేవాళ్లు. ఈ పరిస్థితికి సీఎం జగన్ చెక్ పెట్టారు. రైతులపై పైసా భారం పడకుండా వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా నష్టపోయిన మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. పైగా టీడీపీ హయాంలోని రూ.715.84 కోట్ల బకాయిలనూ సీఎం జగన్ చెల్లించారు. -
Photo Feature: తుపాను దెబ్బ.. కరోనా కట్టడి
‘యాస్’ తుపాను ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో కల్లోలం రేపింది. సముద్ర తీర ప్రాంత జిల్లాల్లో భారీ నష్టం మిగిల్చింది. ఖరీఫ్కు సిద్ధమవుతున్న అన్నదాతలు విత్తనాల కోసం నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు సాగు చట్టాల వ్యతిరేక పోరాటానికి ఆరు నెలలు పూర్తి కావడంతో నల్ల జెండాలతో రైతు సంఘాల ప్రతినిధులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇక.. కరోన మహమ్మారిని కట్టడి చేసేందుకు ఆంక్షలు కొనసాగుతున్నాయి. -
విత్తన నిల్వకు సరికొత్త పద్ధతి
సాక్షి, హైదరాబాద్: ఆకలి కేకలు, అన్నదాతలకు నష్టాలు తగ్గేదిశగా హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీహెచ్) శాస్త్రవేత్తలు ఓ అద్భుత ఆవిష్కరణకు రూపకల్పన చేశారు. విత్తనాలను దీర్ఘకాలంపాటు సురక్షితంగా నిల్వ చేసేందుకు సరికొత్త పదార్థం కనుగొన్నారు. ప్లాస్టిక్కు వేపనూనె జతచేసి నానో స్థాయి ప్లాస్టిక్ పదార్థం రూపొం దించారు. ఈ నానో ప్టాస్టిక్ పోగులతో తయారైన సంచుల్లో ఉంచిన విత్తనాలు 75 రోజుల తరువాత కూడా తాజాగానే ఉంటాయని ప్రయోగాల ద్వారా స్పష్టమైంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సంచుల్లో విత్తనాలు ఇదే కాలవ్యవధికి 70 శాతం మాత్రమే తాజాగా మిగులుతుండగా, కొత్త రకం సంచుల్లో ఇది 90 శాతం వరకూ ఉండటం విశేషం. అధిక ఉష్ణోగ్రతలను అడ్డుకొనేలా.. నానో ప్లాస్టిక్ పదార్థం శక్తిమంతమైందే కాకుం డా.. అధిక ఉష్ణోగ్రతలు లోనికి చేరుకోకుండా అడ్డుకోగలదు. ఇక పురుగు, పుట్ర నివారణకు వేపనూనె ఎంత ఉపయోగకరం. వేపనూనెలోని నింబిన్, అజాడిరక్టిన్ వంటి ట్రిటెర్పినాయిడ్లు బూజును దరిచేరనివ్వవు. క్రిమికీటకాల ఎదుగుదలనూ అడ్డుకుంటాయి. వేపనూనె ద్వారా 200 రకాల కీటకాలను అడ్డుకోవచ్చు. ఈ లక్షణాలన్నింటినీ ఒకదగ్గరకు చేర్చడం ద్వారా విత్తన నిల్వల నష్టాన్ని తగ్గించేందుకు పరిశోధనలు చేసినట్లు ఐఐటీ హైదరాబాద్ కెమికల్ ఇంజనీరింగ్ శాఖ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్ శర్మ తెలిపారు. నానోప్లాస్టిక్ పదార్థంతో తయారుచేసిన సంచుల్లో విత్తనాలను సాధారణ ఉష్ణోగ్రతల వద్దనే నిల్వ చేయొచ్చని వివరించారు. ధాన్యం వృథాను అరికట్టేలా సంప్రదాయ పద్ధతులు వాడినా, ఆధునిక విధానంలో భాగంగా రకరకాల రసాయనాలు ఉపయోగించినా ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 130 కోట్ల టన్నుల ధాన్యం పనికిరాకుండా పోతోందని అంచనా. ఇంత మొత్తం ధాన్యంలో కొంతైనా రక్షించుకోగలిగితే రైతులకు నష్టాలు తగ్గడమే కాకుండా చాలామంది ఆకలి కూడా తీరుతుంది. -
10 నుంచి రాయితీపై రబీ విత్తనాలు
సాక్షి, అమరావతి: రబీ సీజన్లో రాయితీపై ఇచ్చే వివిధ రకాల విత్తనాలను ఈనెల 10 నుంచి పంపిణీ చేయనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. 12 రకాల విత్తనాలను ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధం చేసినట్టు బుధవారం ‘సాక్షి’కి చెప్పారు. రబీ సీజన్లో అత్యధికంగా సాగు చేసే వాటిలో ఒకటైన శనగ విత్తనాల పంపిణీ గురువారం కర్నూలు జిల్లాలో లాంఛనంగా ప్రారంభమవుతుందన్నారు. మిగతా జిల్లాల్లో పదో తేదీ నుంచి మొదలవుతుందన్నారు. ఆయన తెలిపిన వివరాలివీ.. ► 42,023 క్వింటాళ్ల వరి వంగడాలను, 30,819 క్వింటాళ్ల వేరుశనగ, 2,92,319 క్వింటాళ్ల శనగలు, 3,500 క్వింటాళ్ల పెసలు, 11,051 క్వింటాళ్ల మినుములు, 589 క్వింటాళ్ల రాగులు, 42 క్వింటాళ్ల కొర్రలు, 50 క్వింటాళ్ల ఊదలు, 30 క్వింటాళ్ల ఆరికలు, 32 క్వింటాళ్ల సామలు, 2 క్వింటాళ్ల కందులు, 25 క్వింటాళ్ల ఆండ్రు కొర్రలు పంపిణీకి సిద్ధం చేశాం. ► వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామ స్థాయిలో సబ్సిడీ విత్తనాల పంపిణీ జరుగుతుంది. ► సబ్సిడీపై ఎకరానికి 25 కిలోల శనగల్ని ఇస్తారు. సబ్సిడీ లేని రైతులు పూర్తి మొత్తాన్ని చెల్లించి కొనవచ్చు. ► జేజీ 11 రకం శనగలు క్వింటాల్ పూర్తి విలువ రూ.7,500 కాగా, ప్రభుత్వం రూ.2,250 సబ్సిడీగా ఇస్తుంది. కేఏకే–2 రకం శనగలు క్వింటాల్ పూర్తి ధర రూ.7,700 కాగా, రూ.2,310 సబ్సిడీగా ఇస్తారు. ► విత్తన నాణ్యతపై ఫిర్యాదులుంటే రైతులు 155251 నంబర్కు కాల్ చేయవచ్చు. -
విదేశాలకు మన వంగడాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్ నుంచి ఏటా రూ.2,000 కోట్ల విలువైన విత్తనాలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. వీటిలో టమాటా, మిరప, పుచ్చకాయ, మొక్కజొన్న తాలూకు విదేశీ వెరైటీలు కూడా ఉన్నాయి. పలు విదేశీ కంపెనీలు ఇక్కడి రైతులతో భాగస్వామ్యం కుదుర్చుకుని విత్తనాలను ఉత్పత్తి చేసి అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం రూ.200 కోట్ల విలువైన విదేశీ వెరైటీల విత్తనాల ఎగుమతి జరుగుతోంది. ఇక్కడి విత్తనాలకు విదేశాల్లో మార్కెటింగ్, సర్టిఫికేషన్, సబ్సిడీలతో ప్రభుత్వం ప్రోత్సహిస్తే అయిదేళ్లలో మొత్తం ఎగుమతులు నాలుగు రెట్లకు చేరడం ఖాయమని సీడ్స్మెన్ అసోసియేషన్ అంటోంది. ఇదే జరిగితే తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు మరింత ప్రయోజనమని చెబుతోంది. నాబార్డు సహకారంతో లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చని అసోసియేషన్ ధీమాగా ఉంది. విత్తన భాండాగారాలు.. తెలుగు రాష్ట్రాలు విత్తన భాండాగారాలుగా విరాజిల్లుతున్నాయి. వాతావరణం, నేలలు అనుకూలంగా ఉండడం, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం ఇందుకు కారణం. దేశవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న విత్తనాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాటా 60 శాతంగా ఉంది. మొక్కజొన్న, జొన్న విత్తనాల్లో 90 శాతం, సజ్జలు 85 శాతం, వరి 60 శాతం, పత్తి విత్తనాల్లో 50 శాతం తెలుగు రాష్ట్రాలు సమకూరుస్తున్నాయి. ఇక రూ.200 కోట్ల విలుౖÐð న కూరగాయల విత్తనాలు ఉత్పత్తి అవుతున్నాయి. జాతీయ స్థాయిలో కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీల్లో 90 శాతం ఇక్కడ కొలువుదీరాయని సీడ్స్మెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్, కార్న్టెక్ సీడ్స్ సీఈవో యాగంటి వెంకటేశ్వర్లు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఈ రెండు రాష్ట్రాల్లో 10 లక్షలకుపైగా రైతులు విత్తన సాగులో నిమగ్నమయ్యారని చెప్పారు. రబీకి పెరగనున్న విక్రయాలు.. కోవిడ్–19 కారణంగా ఉపాధి కోల్పోయిన, ఉద్యోగాలు వదులుకున్న యువత తిరిగి గ్రామాల బాట పట్టారు. వీరిప్పుడు వ్యవసాయంపై దృష్టిసారించారని కంపెనీలు అంటున్నాయి. మరోవైపు వర్షాలు దేశవ్యాప్తంగా అంచనాలను మించి కురిశాయి. ఈ ఏడాది ఖరీఫ్లో పరిశ్రమ 5 శాతం వృద్ధి సాధించింది. రబీకి విత్తన అమ్మకాలు 20–25 శాతం అధికం కావచ్చని పరిశ్రమ భావిస్తున్నట్లు రాశి సీడ్స్ సీవోవో ఏ.ఎస్.ఎన్.రెడ్డి తెలిపారు. ఎంౖMð్వరీలనుబట్టి చూస్తే సాగు విస్తీర్ణమూ పెరగనుందని అన్నారు. రెండున్నర దశాబ్దాల్లో కూరగాయల ఉత్పత్తి మూడు రెట్లు అధికమైందని ఈస్ట్–వెస్ట్ సీడ్ ఎండీ దిలీప్ రాజన్ వెల్లడించారు. కాగా, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కోవిడ్–19 ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో లేదని.. ఇందుకు ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా స్పందించడమే కారణమని సీడ్స్మెన్ అసోసియేషన్ తెలిపింది. పరిశోధనకు రూ.2 వేల కోట్లు.. దేశవ్యాప్తంగా విత్తన పరిశ్రమ ఏటా 5–10 శాతం వృద్ధితో రూ.30,000 కోట్లకు చేరుకుంది. ఇందులో కూరగాయల విత్తనాల విలువ రూ.3,000 కోట్ల మేర ఉంది. మొత్తం ఎగుమతులు రూ.2,000 కోట్ల మేర జరుగుతున్నాయి. 2,000 కంపెనీలు పరిశ్రమలో నిమగ్నమయ్యాయి. ఇందులో 500 దాకా కంపెనీలు జాతీయ స్థాయిలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. పరిశోధన, అభివృద్ధి విభాగంలో రూ.5,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జీనోమ్ ఎడిటింగ్ సాంకేతిక విధానంపై ఫోకస్ చేయనున్నందున వచ్చే రెండేళ్లలో రూ.2,000 కోట్ల పెట్టుబడులు పరిశోధన, అభివృద్ధి విభాగంలో రానున్నాయి. 16 లక్షల మంది రైతులతో కంపెనీలు చేతులు కలిపాయి. శాస్త్రవేత్తలు, తయారీ, మార్కెటింగ్ సిబ్బంది ఒక లక్ష వరకు ఉంటారు. -
విదేశాలకు మన వంగడాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్ నుంచి ఏటా రూ.2,000 కోట్ల విలువైన విత్తనాలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. వీటిలో టమాట, మిరప, పుచ్చకాయ, మొక్కజొన్న తాలూకు విదేశీ వెరైటీలు కూడా ఉన్నాయి. పలు విదేశీ కంపెనీలు ఇక్కడి రైతులతో భాగస్వామ్యం కుదుర్చుకుని విత్తనాలను ఉత్పత్తి చేసి అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం రూ.200 కోట్ల విలువైన విదేశీ వెరైటీల విత్తనాల ఎగుమతి జరుగుతోంది. ఇక్కడి విత్తనాలకు విదేశాల్లో మార్కెటింగ్, సర్టిఫికేషన్, సబ్సిడీలతో ప్రభుత్వం ప్రోత్సహిస్తే అయిదేళ్లలో మొత్తం ఎగుమతులు నాలుగు రెట్లకు చేరడం ఖాయమని సీడ్స్మెన్ అసోసియేషన్ అంటోంది. ఇదే జరిగితే తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు మరింత ప్రయోజనమని చెబుతోంది. నాబార్డు సహకారంతో లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చని అసోసియేషన్ ధీమాగా ఉంది. విత్తన భాండాగారాలు.. తెలుగు రాష్ట్రాలు విత్తన భాండాగారాలుగా విరాజిల్లుతున్నాయి. వాతావరణం, నేలలు అనుకూలంగా ఉండడం, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం ఇందుకు కారణం. దేశవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న విత్తనాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాటా 60 శాతంగా ఉంది. మొక్కజొన్న, జొన్న విత్తనాల్లో 90 శాతం, సజ్జలు 85 శాతం, వరి 60 శాతం, పత్తి విత్తనాల్లో 50 శాతం తెలుగు రాష్ట్రాలు సమకూరుస్తున్నాయి. ఇక రూ.200 కోట్ల విలుౖÐð న కూరగాయల విత్తనాలు ఉత్పత్తి అవుతున్నాయి. జాతీయ స్థాయిలో కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీల్లో 90 శాతం ఇక్కడ కొలువుదీరాయని సీడ్స్మెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్, కార్న్టెక్ సీడ్స్ సీఈవో యాగంటి వెంకటేశ్వర్లు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఈ రెండు రాష్ట్రాల్లో 10 లక్షలకుపైగా రైతులు విత్తన సాగులో నిమగ్నమయ్యారని చెప్పారు. రబీకి పెరగనున్న విక్రయాలు.. కోవిడ్–19 కారణంగా ఉపాధి కోల్పోయిన, ఉద్యోగాలు వదులుకున్న యువత తిరిగి గ్రామాల బాట పట్టారు. వీరిప్పుడు వ్యవసాయంపై దృష్టిసారించారని కంపెనీలు అంటున్నాయి. మరోవైపు వర్షాలు దేశవ్యాప్తంగా అంచనాలను మించి కురిశాయి. ఈ ఏడాది ఖరీఫ్లో పరిశ్రమ 5 శాతం వృద్ధి సాధించింది. రబీకి విత్తన అమ్మకాలు 20–25 శాతం అధికం కావచ్చని పరిశ్రమ భావిస్తున్నట్లు రాశి సీడ్స్ సీవోవో ఏ.ఎస్.ఎన్.రెడ్డి తెలిపారు. ఎంక్వైరీలనుబట్టి చూస్తే సాగు విస్తీర్ణమూ పెరగనుందని అన్నారు. రెండున్నర దశాబ్దాల్లో కూరగాయల ఉత్పత్తి మూడు రెట్లు అధికమైందని ఈస్ట్–వెస్ట్ సీడ్ ఎండీ దిలీప్ రాజన్ వెల్లడించారు. కాగా, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కోవిడ్–19 ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో లేదని.. ఇందుకు ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా స్పందించడమే కారణమని సీడ్స్మెన్ అసోసియేషన్ తెలిపింది. పరిశోధనకు రూ.2 వేల కోట్లు.. దేశవ్యాప్తంగా విత్తన పరిశ్రమ ఏటా 5–10 శాతం వృద్ధితో రూ.30,000 కోట్లకు చేరుకుంది. ఇందులో కూరగాయల విత్తనాల విలువ రూ.3,000 కోట్ల మేర ఉంది. మొత్తం ఎగుమతులు రూ.2,000 కోట్ల మేర జరుగుతున్నాయి. 2,000 కంపెనీలు పరిశ్రమలో నిమగ్నమయ్యాయి. ఇందులో 500 దాకా కంపెనీలు జాతీయ స్థాయిలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. పరిశోధన, అభివృద్ధి విభాగంలో రూ.5,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జీనోమ్ ఎడిటింగ్ సాంకేతిక విధానంపై ఫోకస్ చేయనున్నందున వచ్చే రెండేళ్లలో రూ.2,000 కోట్ల పెట్టుబడులు పరిశోధన, అభివృద్ధి విభాగంలో రానున్నాయి. 16 లక్షల మంది రైతులతో కంపెనీలు చేతులు కలిపాయి. శాస్త్రవేత్తలు, తయారీ, మార్కెటింగ్ సిబ్బంది ఒక లక్ష వరకు ఉంటారు. -
అమ్మకాలపై అమెజాన్ బ్యాన్..
చికాగో: అమెరికాలో దిగుమతయిన వేలాది విదేశీ విత్తనాల అమ్మకాలపై ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ నిషేధం(బ్యాన్) విధించింది. వివరాల్లోకి వెళ్తె అమెరికాలోని రైతులకు వేలాదిగా దిగుమతైన విత్తనాల ప్యాకేట్లు అందాయి, కాగా విత్తనాల ప్యాకేట్లను తామేమి ఆర్డర్ చేయలేదని వారు అమెజాన్కు తెలిపారు. ఈ నేపథ్యంలో అక్రమంగా విదేశాల నుంచి దిగుమతయ్యే విత్తనాలను నిషేదిస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది. అయితే ఎక్కువగా చైనా నుంచే దిగుమతైనట్లు తెలుస్తుంది. కాగా ప్యాకేజీలలో లభ్యమయ్యే విత్తనాలను ఉపయోగించొద్దని అమెరికా వ్యవస్తాయ విభాగం జులైలో హెచ్చరించింది. ఒకవేళ ఆ విత్తనాలను అమెరికన్ రైతులు ఉపయోగిస్తే దేశానికే ప్రమాదమని పేర్కొంది. అయితే ఈ స్కామ్ జరిగినట్లు కచ్చితమైన ఆధారాలు లేవని, అమ్మకందార్లపై నిఘా పెట్టనున్నట్లు అమెరికా వ్యవసాయ విభాగం ఈ ఆగస్టులో పేర్కొన్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో వినియోగదారుల బధ్రతకు అమెజాన్ అధిక ప్రాధాన్యమిస్తుంది. కాగా వినియోగదారులకు చేరువకావడానికి అమెజాన్ సరికొత్త వ్యూహ్యాలను అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దిగ్గజ కంపెనీలు అమెజాన్తో జతకట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. (చదవండి: అమెజాన్.. జెఫ్ బెజోస్ సరికొత్త రికార్డ్) -
రైతు భరోసా కేంద్రాల్లో డిజిటల్ పేమెంట్ విధానం అమలు
-
'రైతుభరోసా' కేంద్రాల్లో డిజిటల్ పేమెంట్
సాక్షి, విజయవాడ : రైతుభరోసా కేంద్రాలలో ప్రయోగాత్మకంగా డిజిటల్ పేమెంట్ విధానాన్ని అమలుచేశారు. దీని ద్వారా రైతులు నేటినుంచి తమకు కావాల్సిన ఉత్పాదకాలు. ఎరువులు, విత్తనాలు, మందులను కొనుగోలు చేయోచ్చు. డిజిటల్ విధానంలో చెల్లింపు ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ అగ్రోస్ సంస్థ నేటినుంచి సేవలను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యమంత్రి సూచన మేరకు నగదు చెల్లింపులతో పాటు డిజిటల్ విధానంలో కూడా రైతులు చెల్లిపులు చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. దీని ద్వారా రైతులు నేరుగా భీం, గూగుల్ పే, పేటియం, ఫోన్ పే వంటి డిజిటల్ విధానంలో చెల్లింపులు జరిపి తమకు కావాల్సినవి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. . -
పొలం పనుల్లో అరకు ఎంపీ మాధవి
సాక్షి, అరకు : పార్లమెంటు సభ్యురాలు అయినప్పటికీ తమ కుటుంబ జీవనాధారమైన వ్యవసాయ పనుల్లో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి పాల్గొన్నారు. తన తండ్రి మాజీ ఎమ్మెల్యే గుడి దేవుడు ద్వారా సంక్రమించిన పొలంలో మంగళవారం దుక్కి దున్ని విత్తనాలు జల్లి పనులు చేపట్టారు. తన స్వగ్రామం శరభన్నపాలెం నుంచి నిమ్మగడ్డ వెళ్లే మార్గంలో ఉన్న పరిమిత వ్యవసాయ భూమిలో పొలం పని చేశారు. తొలి దశ నుంచి తన తండ్రి ద్వారా వ్యవసాయ పనులు చేస్తూ సామాజిక కార్యక్రమాలు పాల్గొనడం అలవాటు అని ఎంపీ మాధవి పేర్కొన్నారు. -
చంచి భీమల్ దేవుడి కల్యాణంతో..
కెరమెరి(ఆసిఫాబాద్): అనాదిగా వస్తున్న ఆచారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు కాపాడడంలో ఆదివాసీలు ముందుంటున్నారు. ఇటీవల మృగశిర కార్తె ప్రవేశించడంతో ‘గిరి’ గ్రామాల్లో రెండు రోజులుగా విత్తనపూజకు శ్రీకారం చుట్టారు. ఏటా విత్తన పూజతోనే తమ పొలాల్లో విత్తనాలు నాటడం ప్రారంభిస్తారు. దేవతలకు విత్తనాలను చూపిస్తారు మేలో అన్ని గ్రామాల్లో గ్రామ పటేల్ ఇంట్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆదివాసీల కులదైవమైన పాటేరు అమ్మోరు, జంగుబాయి, గాంధారి కిల్ల, పద్మాల్పురి కాకో వద్దకు వెళ్లి విత్తనాలు చూపిస్తారు. అక్కడే దేవతల ఆశీర్వాదం తీసుకుని తిరుగుపయనమవుతారు. అనంతరం గ్రామంలో ఉన్న ఆకీపేన్, అమ్మోరు, పొచమ్మ వద్దకు వెళ్లి విత్తనాలతో పూజలు చేస్తారు. అక్కడ పటేల్ ఇచ్చే విత్తనాలను ఇంటికి తీసుకెళ్తారు. అదే రోజు రాత్రి రెండున్నర కిలోల జొన్నలను గడ్క తయారు చేసి ఆరగిస్తారు. అర్ధరాత్రి అడవికి వెళ్లి (కుమ్ముడ్) చెట్టు ఆకులను తీసుకువచ్చి డొప్పలు తయారు చేసి అన్ని ఇళ్లల్లో ఇస్తారు. అందులో పూజ చేసిన విత్తనాలను వేçస్తారు. ఇదంతా మృగశిర మాసానికి కొద్దిరోజుల ముందుగానే నిర్వహిస్తారు. విత్తన పూజలు(మొహతుక్) విత్తనపూజ చేసేరోజు రైతు కుటుంబమంతా ఉదయాన్నే పొలం బాట పడతారు. జొన్నతో గడ్క తయారు చేసి కులదైవంతో పాటు నేలతల్లికి సమర్పిస్తారు. అనంతరం పొలంలో విత్తనాలు చల్లి అరకకు ప్రత్యేక పూజలు చేసి విత్తనాలు నాటుతారు. గ్రామపటేల్ ఇంటి ఎదుట మహిళలు సాంప్రదాయ నృత్యం చేస్తారు. పురుషులు గిల్లిదండా ఆట ఆడుతారు. అనంతరం సహపంక్తి భోజనం చేస్తారు. చంచి భీమల్ దేవుడి కల్యాణంతో.. మరికొందరు ఇలా చెప్తున్నారు. ఆదివాసీల ఇష్టదైవమైన చంచి భీమల్ దేవుడి కల్యాణం సందర్భంగా ఏటా ఏప్రిల్లోనే విత్తనాలను దేవుడికి చూపిస్తారు. ఆ రోజు ఆదివాసీలు భీమల్ దేవుడికి సాంప్రదాయ పూజలు చేస్తారు. అడవుల్లో లభించే ఆకులతో ఆరు డొప్పలను తయారు చేస్తారు. అందులోనే అన్ని విత్తనాలను కలిపి దేవునికి చూపిస్తారు. అనంతరం వాటిని ఇంటికి తీసుకెళ్లి దాచిపెడతారు. ఆరోజు పిండివంటలు చేసి ఆరగిస్తారు. మృగశిర కార్తే ప్రారంభంతో దాచిపెట్టిన విత్తనాలను తమ పంటపొలాల్లో చల్లుతారని మరికొందరు చెప్తున్నారు. -
నాణ్యత లేని విత్తన సంస్థలపై వేటు
సాక్షి, అమరావతి: ► అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బొమ్మేపర్తి. డి.వెంకటరాయుడు మూడు మూటల విత్తన కాయల్ని తీసుకున్నాడు. మూట విప్పి చూస్తే అవి కె–6 రకంగా అనిపించలేదు. కాయల్ని వలవకుండానే రెండు మూడు కిలోల విత్తనాలు కిందపడ్డాయి. అవి నాణ్యత లేనివిగా గుర్తించి గ్రామ వ్యవసాయాధికారికి ఫిర్యాదు చేశాడు. ► అనంతపురం రూరల్ మండలం నారాయణపురానికి చెందిన జగన్ మూడు బస్తాల వేరుశనగ విత్తనాన్ని కొన్నాడు. కాయల్ని కొట్టి విత్తనాన్ని చూస్తే పప్పు పుచ్చిపోయి, ఏమాత్రం నాణ్యత లేకుండా ఉంది. దీంతో తనతోపాటు కాయల్ని కొన్న 130 మంది రైతులతో కలిసి శుక్రవారం అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇలా.. అనంతపురం జిల్లాలో ఐదారు మండలాలు.. నార్పల, అనంతపురం రూరల్, కందుకూరు, కదిరి, పెనుగొండ, రాప్తాడుల్లో నాణ్యత లేని విత్తన వేరుశనగ కాయలు పంపిణీ అయ్యాయి. రైతుల నుంచి ఒక్కసారిగా ఫిర్యాదులు రావడంతో వ్యవసాయ శాఖ, ఏపీ సీడ్స్, ఏపీ మార్క్ఫెడ్, ఇతర శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. ఇలా ఎలా జరిగిందో తెలుసుకుని చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అనంతపురంలోనే ఉన్న ఏపీ సీడ్స్ ఎండీ శేఖర్ బాబును ఆదేశించారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం నాణ్యత లేని కాయల్ని సరఫరా చేసిన ప్రైవేటు సంస్థలపై వేటు వేశారు. ఆ సంస్థలు సరఫరా చేసిన 835 క్వింటాళ్ల కాయల్ని వెనక్కి తీసుకుని రైతులకు మేలైన కాయల్ని సరఫరా చేస్తామని ప్రకటించారు. రైతుల హర్షాతిరేకాలు పుచ్చిపోయిన, పనికిమాలిన నాణ్యత లేని కాయల్ని వెనక్కు తీసుకుని తిరిగి నాణ్యమైన కాయల్ని ఇస్తామని వ్యవసాయ శాఖాధికారులు ప్రకటించడం పట్ల ఆయా మండలాల రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమన్నారు. గతంలో కాయలు బాగోకపోతే పారేయడం తప్ప వేరే మార్గం ఉండేది కాదని.. ఇప్పుడా బాధ తప్పిందని నారాయణపురానికి చెందిన వేణుగోపాల్, రాప్తాడుకు చెందిన జయప్రకాష్రెడ్డి, రామసుబ్బారెడ్డి తదితరులు తెలిపారు. ఆ రెండు సంస్థలే.. ► అనంతపురం,కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు కె–6 రకం 4,81,344 క్వింటాళ్లు, నారాయణి 25,263 క్వింటాళ్లు, ధరణి 992 క్వింటాళ్లు కలిపి మొత్తం 5,07,599 క్వింటాళ్ల వేరుశనగ విత్తనం కాయ కావాల్సి ఉంది. ► ఇందులో వ్యవసాయ శాఖ ’రైతు విత్తనం రైతు చెంతకే’ అనే కార్యక్రమం కింద 2 లక్షల క్వింటాళ్ల నాణ్యమైన కాయను కొనుగోలు చేసింది. ► మిగతా 3 లక్షల క్వింటాళ్ల కాయను కొనుగోలు చేసే బాధ్యతను ఏపీ సీడ్స్కు అప్పగించింది. అయితే.. రైతుల వద్ద సరుకు లేకపోవడంతో ఏపీ సీడ్స్ అధికారులు ప్రైవేటు సంస్థలను ఆశ్రయించారు. వీటిలో కొన్ని నాణ్యత లేని విత్తన కాయలను సరఫరా చేశాయి. ► ఈ నెల 18 నుంచి గ్రామ సచివాలయాల వద్ద విత్తన పంపిణీ ప్రారంభమైంది. ► అనంతపురం రూరల్, రాప్తాడు, నార్పల మండలాలకు శ్రీ సుబ్రమణ్యేశ్వర అగ్రిటెక్ (వనపర్తి, ప్రొద్దుటూరు), గంగాధర్ అగ్రిటెక్ (ప్రొద్దుటూరు) నుంచి విత్తన కాయలు వచ్చినట్టు వ్యవసాయ శాఖాధికారులు గుర్తించి వాటిపై వేటు వేశారు. ► మనీలా, కంబదూర్, ఎ.నారాయణపురం, బొమ్మేపర్తి, గంగిరెడ్డిపల్లి, మరూర్–1, రాప్తాడు, చెలమూరు గ్రామాల్లోని రైతులకు తిరిగి నాణ్యమైన కాయల్ని సరఫరా చేస్తామని ఏపీ సీడ్స్ ప్రకటించింది. ► మిగతా మండలాల్లో పరిస్థితిని పరిశీలించేందుకు ప్రభుత్వం నిఘా బృందాలను పంపింది. ► రైతులు తమ సమస్యలను 1902, 1907కు ఫిర్యాదు చేయొచ్చు. -
విత్తనాలు రెడీ
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్లో రైతులకు సబ్సిడీపై ఇచ్చే విత్తన ప్రణాళికను వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. ఈ నెల 18 నుంచి విత్తనాలు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఇ–క్రాప్ బుకింగ్ ఆధారంగా విత్తనాలు సరఫరా చేస్తారు. రైతులు గ్రామ సచివాలయాల్లో డబ్బు చెల్లించి రాయితీ పొందవచ్చు. సబ్సిడీ వర్తించని వారు పూర్తి మొత్తాన్ని చెల్లించి విత్తనాలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. 5,07,599 క్వింటాళ్ల వేరుశనగ, 2,28,732 క్వింటాళ్ల వరి, 83,215 క్వింటాళ్ల జీలుగ, జనుము, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట విత్తనాలు వ్యవసాయ శాఖ అందుబాటులో ఉంచింది. సబ్సిడీ ఇలా.. ► 13 రకాల వరి వంగడాలను 9 జిల్లాలకు కేటాయించారు. ఈ విత్తనాలపై క్వింటాల్కు రూ.500 సబ్సిడీ ఉంటుంది. పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో రైతులు సొంతంగా విత్తనం తయారు చేసుకుంటారు కాబట్టి ఆ జిల్లాలకు తక్కువ కేటాయించారు. ► గ్రామ సచివాలయాల్లో రైతులు నిర్ధేశించిన సొమ్ము చెల్లించి రశీదును గ్రామ వ్యవసాయ సహాయకులకు చూపి విత్తనాల్ని పొందవచ్చు. ► జాతీయ ఆహార భద్రత మిషన్ కింద గుర్తించిన జిల్లాలకు, గుర్తించని జిల్లాలకు సబ్సిడీలో తేడా ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు జాతీయ ఆహార భద్రతా మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం)లో ఉన్నాయి. ► కే–6, ఇతర రకాల వేరుశనగ విత్తనాల ధరను క్వింటాల్కు రూ.7,850గా నిర్ణయించారు. దీనిపై 40 శాతం పోను రైతులు క్వింటాల్కు రూ.4,710 చెల్లించాలి. ► పచ్చిరొట్ట పంటలుగా సాగు చేసే జీలుగ, జనుము, పిల్లి పెసర విత్తనాలపై 50 శాతం సబ్సిడీ ఉంటుంది. -
ఆధునిక శోధనం.. అవసరానుగుణ విత్తనం
ఒకపక్క జనాభా పెరిగిపోతోంది.. వాతావరణ మార్పుల ప్రభావం ముంచుకొస్తోంది.. కానీ.. అందుబాటులో ఉన్న సాగుభూమి పెరగదు సరికదా.. దిగుబడులూ తగ్గిపోయే ప్రమాదమూ వెన్నాడుతోంది.ఈ వీటిని పరిష్కరించే లక్ష్యంతో అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) ఓ వినూత్న కార్యక్రమం చేపట్టింది.మన అవసరాలకు తగ్గ కొత్త పంటలను అభివృద్ధి చేసేందుకు పట్టే సమయాన్ని సగానికి తగ్గించేందుకు.. వంగడ అభివృద్ధి ఆధునికీకరణను చేపట్టింది. ఆ పరిశోధనలేమిటో తెలుసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి నేతృత్వం వహిస్తున్న శాస్త్రవేత్త యాన్ దబానేను ‘సాక్షి’ సంప్రదించింది.. ఇవీ ఆ వివరాలు... ప్రశ్న: వంగడాల అభివృద్ధి ప్రక్రియను ఆధునికీకరించాలనే ఇక్రిశాట్ నిర్ణయం వెనుక ఉద్దేశం? జవాబు: ఒక్కమాటలో చెప్పాలంటే.. కొత్త, వినూత్న లక్షణాలున్న వంగడాలను వేగంగా అభివృద్ధి చేయడమే. అంతర్జాతీయ స్థాయిలో కొన్ని విత్తన కంపెనీలు విజయవంతంగా వాడిన సాంకేతికత, పద్ధతులను సామాన్య రైతులకు అందుబాటులోకి తేవాలని ఇక్రిశాట్ ఈ విత్తన ఆధునికీకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. నగరంలోని ఇక్రిశాట్ ప్రధాన కేంద్రంలో ‘ర్యాపిడ్జెన్’ పేరిట ప్రారంభించిన వ్యవస్థ ఈ దిశగా వేసిన తొలి అడుగు. ప్ర: ‘ర్యాపిడ్జెన్’ వ్యవస్థ తొలి అడుగు అంటున్నారు. ఇంకా ఎలాంటి సాంకేతికత, పద్ధతులు దీంట్లోకి చేర్చవచ్చు? జ: చాలా ఉన్నాయి. పంటలకు సంబంధించి నాణ్యమైన సమాచారం రాబట్టేందుకు ‘ర్యాపిడ్జెన్’ఉపయోగపడుతుంది. విత్తనోత్పత్తికి, పంట దిగుబడి, నాట్లకు చెందిన కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయవచ్చు. చీడపీడలను తట్టుకోవడంతోపాటు కరవు కాటకాలను, విపరీతమైన వేడిమిని ఓర్చుకునే పంటలు, మంచి పోషకాలు ఇవ్వగల వంగడాలను అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే అందుబాటులో ఉన్న మాలిక్యులర్ మార్కర్ టెక్నాలజీలను (కణస్థాయిలో మార్పులు చేయడం ద్వారా మొక్కల లక్షణాలను నియంత్రించడం) కూడా ఇందులో వాడుకోవచ్చు. ప్ర: ఇక్రిశాట్ చేపట్టిన వంగడ ఆధునికీకరణ పూర్తయ్యేందుకు ఎంత సమయం పడుతుంది? జ: సాంకేతికత అనేది కాలంతోపాటు అభివృద్ధి చెందుతుంటాయి. కాబట్టి నిర్దిష్టంగా ఇంత సమయం అని చెప్పలేము.ఎప్పటికప్పుడు మరింత వృద్ధి చేసేందుకు ఎప్పుడూ అవకాశం ఉంటుంది.‘ర్యాపిడ్జెన్’ద్వారా చేపట్టిన కొన్ని కార్యక్రమాలను రానున్న రెండేళ్లలోనే రైతులకు అందుబాటులోకి తేవచ్చు. ప్ర: మీరు అమలు చేయబోయే టెక్నాలజీలపై ఏవైనా అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం ఉందా? జ: అలాంటిదేమీ లేదు. వంగడ అభివృద్ధి ఆధునికీకరణలో ఉపయోగిస్తున్న టెక్నాలజీలన్నీ ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో విజయవంతంగా అమల్లో ఉన్నాయి.ఇక్రిశాట్ వాణిజ్య భాగస్వాములు కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. వీటిలో ఎక్కడా ఎలాంటి వ్యతిరేక పరిణామాలు సంభవించలేదు. ప్ర: ఇక్రిశాట్ ప్రధానంగా ఆరు పంటల (రాగి, సజ్జ, జొన్న, కంది, శనగ, వేరుశనగ)పై మాత్రమే పనిచేస్తోంది.వంగడ అభివృద్ధి ఆధునికీకరణను ఇతర పంటలకు విస్తరించే ఆలోచన ఏదైనా ఉందా? జ: ఇక్రిశాట్ అంతర్జాతీయ స్థాయిలో వేర్వేరు ప్రభుత్వ పరిశోధన సంస్థలతోనూ కలిసి పనిచేస్తోంది. భారత్లో ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్తోపాటు అంతర్జాతీయ మొక్కజొన్న, గోధుమ అభివృద్ధి కేంద్రం, అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం, ప్రపంచ కాయగూరల కేంద్రాలు వీటిలో ఉన్నాయి. మొక్కల అభివృద్ధికి ఇక్రిశాట్ ఈ సంస్థలకు తన దగ్గరున్న ఆరు పంటల జెర్మ్ప్లాసమ్ను సరఫరా చేస్తుంది. ఆయా సంస్థలు ఇతర పంటలపై కూడా పరిశోధనలు చేసుకుంటాయి. హైదరాబాద్లోని ఇక్రిశాట్ కేంద్రంలో ఇతర సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. ప్ర: చిన్న, సన్నకారు రైతులకు ఈ కార్యక్రమం ఎలా ఉపయోగపడుతుంది? జ: వాతావరణ మార్పుల నేపథ్యంలో చిన్న, సన్నకారు రైతులు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. చీడపీడల సమస్య పెరిగిపోనుంది. మారుతున్న వాతావరణాన్ని తట్టుకోగల వంగడాల అవసరం మునుపటి కంటే ఇప్పుడు ఎక్కువగా ఉంది. ఇక్రిశాట్ చేపట్టిన వంగడ అభివృద్ధి ఆధునికీకరణ ద్వారా వీటికి వేగం గా పరిష్కారాలు లభించే అవకాశాలున్నాయి. -
‘సీమ’ ఇంట.. రెండో పంట
సాక్షి, అమరావతి: ‘మా చేలల్లో ఈ కాలంలో విత్తనాలు వేసి 15 ఏళ్లు దాటిందనుకుంటా. మళ్లీ ఇంతకాలానికి ఇప్పుడు వేశాం. ఎంత సంతోషంగా ఉందంటే మాటల్లో చెప్పలేను. ఎర్ర నేలల్లో వానలు పడందే రెండో పంట వేయలేం. మా అదృష్టం బాగుండి ఈ ఏడాది కురిసిన వానలతో రెండు పంటలు వేశాం. వేరుశనగ పీకాం. ఇప్పుడు 8 ఎకరాల్లో ఉలవ వేశా. మా అప్పులు తీరినట్టే’నని సంబరపడుతున్నాడు అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బొమ్మేపర్తికి చెందిన రైతు డి.వెంకటరాముడు. ‘తొలకరి తప్ప రెండో పంట తెలియదు నాకు. 17, 18 సంవత్సరాల తర్వాత ఈ ఏడాది మా ఊళ్లో ఎటుచూసినా పచ్చగా కనిపిస్తోంది. చెరువులు, బావులు, కుంటల కింద తప్ప పంటలు తెలియవు నాకు. అలాంటిది ఇప్పుడు మా ఊరి పొలాల్లో జొన్న, సజ్జ, ఉలవ వేశారు’ అని అంటున్నాడు కర్నూలు జిల్లా బసాపురంలో ఆరు ఎకరాల్లో జొన్న పంట వేసిన రామన్న. ఇలా ఒకరి ద్దరు కాదు.. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లా ల్లోని అన్నదాతల ఆనందం ఇది. సుదీర్ఘకాలం తర్వా త కురిసిన, కురుస్తున్న వర్షాలకు రైతులు ఈ ఏడాది రబీ సీజన్లో రెండో పంటను సాగు చేస్తున్నారు. ఎప్పుడు వేసినా ఒక పంటతోనే సరిపెట్టుకునే వీరు ఈసారి అనుకూల వాతావరణంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. అన్ని చోట్లా రిజర్వాయర్లు, కుంటలు, చెరువులు నీళ్లతో తొణికిసలాడుతున్నాయి. భూ గర్భ జల మట్టం కూడా పెరిగింది. ప్రస్తుత వర్షాలూ అనుకూలమే.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రాయలసీమ ప్రాంతంలో రెండో పంటకు అనుకూలంగా మారాయి. దీంతో ఆరుతడి పంటల్ని పెద్దఎత్తున సాగు చేస్తున్నారు. ‘గత పాతికేళ్లలో మా ప్రాంతంలో ఇంత పెద్దఎత్తున రెండో పంట వేయడం ఇదే మొదటి సారి’ అని అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన జి.గంగయ్య యాదవ్ చెప్పారు. ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాలలో రబీ సాగు విస్తీర్ణ లక్ష్యం 11,59,453 హెక్టార్లు. ఇందులో ఇప్పటికే 5,56,213 హెక్టార్లు సాగులోకి వచ్చింది. కరవుకు నెలవైన అనంతపురం జిల్లాలో సైతం ఇప్పటికే 99 శాతం విస్తీర్ణం సాగులోకి రావడం విశేషం. ఏటా పంట విత్తే సమయంలో రైతులు పెట్టుబడి కోసం ఇబ్బంది పడేవారు. అప్పుల కోసం వ్యాపారుల చుట్టూ తిరిగే వారు. ఈ ఏడాది వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ పరిస్థితిని సమూలంగా మార్చి వేసింది. వైఎస్సార్ రైతు భరోసా పథకంతో రైతులను, కౌలు రైతులను ఆదుకుంది. ఒక్కో రైతుకు ఏటా రూ.13,500 వస్తుంది. ఇందులో సింహ భాగం ఇప్పటికే రైతు ఖాతాల్లో జమ కావడంతో వ్యవసాయం పండుగగా మారింది. ఆరుతడి పంటలు భారీగా సాగు ఆరుతడి పంటలుగా ఉన్న ఉలవ, జొన్న, సజ్జ, శనగ, పొద్దు తిరుగుడు, జనుము పంటల్ని పెద్దఎత్తున సాగు చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో రబీ పంటల సాగు దాదాపు పూర్తయింది. చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో సుమారు 75 శాతం విస్తీర్ణంలో, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 50 శాతం విస్తీర్ణంలో పంటల్ని సాగు చేశారు. అంతా అనుకూలంగా ఉంటే రబీ సీజన్లో ఉలవ 25 వేల హెక్టార్లలో సాగవుతుంది. కానీ ఈ ఏడాది ఇప్పటికే 37 వేల హెక్టార్లలో పంట వేశారు. శనగ నిర్ణీత సాగు విస్తీర్ణం 4.42 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటికి 3.09 లక్షల హెక్టార్లలో సాగయింది. జొన్న నిర్ణీత సాగు విస్తీర్ణం 1.14 లక్షల హెక్టార్లయితే ఇప్పటికి 55 వేల హెక్టార్లలో విత్తారు. సీజన్ ముగిసే నాటికి సాగు విస్తీర్ణం పరిపూర్తి అవుతుందని వ్యవసాయ అధికారుల అంచనా. పశువుల మేతకు ఇబ్బంది తప్పినట్టే.. తొలి పంట చాలక రెండో పంట లేక వేసవి వస్తే గ్రాసం లేక మూగజీవాలను కబేళాలకు తోలాల్సి వచ్చేది. ఈ ఏడాది ఆ పరిస్థితి తప్పిందని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన అమీన్ అభిప్రాయపడ్డారు. ఉలవ, జొన్న, సజ్జ వంటి వాటితో పశువుల్ని కాపాడుకోవచ్చని చెప్పారు. వేసవిలో పొట్టచేతబట్టుకుని వలస పోయే పరిస్థితి తప్పుతుందని రైతు నాయకుడు భరత్ కుమార్ చెప్పారు. ఆరుతడి పంటలు భారీగా సాగు ఆరుతడి పంటలుగా ఉన్న ఉలవ, జొన్న, సజ్జ, శనగ, పొద్దు తిరుగుడు, జనుము పంటల్ని పెద్దఎత్తున సాగు చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో రబీ పంటల సాగు దాదాపు పూర్తయింది. చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో సుమారు 75 శాతం విస్తీర్ణంలో, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 50 శాతం విస్తీర్ణంలో పంటల్ని సాగు చేశారు. అంతా అనుకూలంగా ఉంటే రబీ సీజన్లో ఉలవ 25 వేల హెక్టార్లలో సాగవుతుంది. కానీ ఈ ఏడాది ఇప్పటికే 37 వేల హెక్టార్లలో పంట వేశారు. శనగ నిర్ణీత సాగు విస్తీర్ణం 4.42 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటికి 3.09 లక్షల హెక్టార్లలో సాగయింది. జొన్న నిర్ణీత సాగు విస్తీర్ణం 1.14 లక్షల హెక్టార్లయితే ఇప్పటికి 55 వేల హెక్టార్లలో విత్తారు. సీజన్ ముగిసే నాటికి సాగు విస్తీర్ణం పరిపూర్తి అవుతుందని వ్యవసాయ అధికారుల అంచనా. మా పంటలు బాగున్నాయి.. నా పేరు వీరన్నగౌడ్. మాది బొమ్మనహాళ్ మండలం బొల్లనగుడ్డం గ్రామం. నాకు హెచ్చెల్సీ చివరి ఆయకట్టు 9వ డిస్ట్రిబ్యూటరీ కింద 20 ఎకరాల పొలం ఉంది. గత 20 ఏళ్లలో ఎన్నడూ ఈసీజన్లో పంట చేతికొచ్చిన ఘటన లేదు. సరైన వర్షాలు పడలేదు. ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా ఉంది. సకాలంలో వర్షాలు పడ్డాయి. నాకున్న 20 ఎకరాల్లో జొన్న పంట వేశా. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన వేళావిశేషమో ఏమో.. జలాశయాలు నిండుకుండల్లా ఉన్నాయి. -
దానిమ్మను ఇలా ఒలిచేయండి.. ఈజీగా
-
దానిమ్మను ఇలా ఒలిచేయండి.. ఈజీగా
దానిమ్మ కాయ గురించి తెలియని వారు వుండరు. అనేక ఔషధ లక్షణాలను తనలోదాచుకున్న దానిమ్మ అంటే ఇష్టం పడనివారు దాదాపు ఎవరూ వుండరు. ఎర్రటి గింజలతో చూడగానే నోరూరించే దానిమ్మ జ్యూస్ను సేవిస్తే..రక్తహీనత నుంచి బయటపడవచ్చని వైద్యులు చెపుతారు. అలాగే దానిమ్మ పండు పైన ఉన్న బెరడును పదిగ్రాములు తీసుకుని దాన్ని కషాయంగా కాచి తాగితే విరోచనాల నుంచి విముక్తి కలుగుతుందట. అలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా దానిమ్మ గింజలను తింటే క్యాన్సర్ బారి నుంచి గట్టెక్కవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్న మాట. అయితే.. దానిమ్మ కాయలు వలవడం అంటే అంత సులువు కాదు. కొంచెం కష్టపడాల్సిందే. దానిమ్మ గింజలు చితికిపోకుండా, దుస్తుల మీద గింజల రసం పడకుండా.. జాగ్రత్తగా ఒలవాలి. ఎందుకంటే.. దానిమ్మ రసం దుస్తుల మీద పడితే... ఆ మరకలు ఒక పట్టాన పోవు. దీంతో దానిమ్మ గింజలు ఒలవడం అంటే ఓర్పు, నేర్పూ వుండాలి. దీనికి సంబంధించి గతంలో చాలా వీడియోలు మనకు అందుబాటులో ఉన్నప్పటికీ తాజాగా దానిమ్మగింజలు ఒలిచే విధానంపై ఒక వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మరి సులభమైన ఆ విధానం కథా కమామిషు ఏంటో మీరు కూడా ఒకసారి వీక్షించండి.. ఇప్పటికే చూశారా.. అయినా మరోసారి చూసేయండి! -
రాష్ట్రంలో అంతర్జాతీయ విత్తన సలహామండలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి యూరప్ దేశాలతోపాటు వియత్నాం, కంబోడియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, మయన్మార్ దేశాలకు విత్తన ఎగుమతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో అంతర్జాతీయ విత్తన సలహామండలి ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు. సోమవారం నెదర్లాండ్స్లోని సీడ్ వ్యాలీని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల్లో కూరగాయల విత్తనోత్పత్తికి మంచి అవకాశాలున్నాయని తెలిపారు. రాష్ట్రంలో విత్తనోత్పత్తిని ప్రోత్సహించడం మూలంగా అంతర్జాతీయ విత్తన విపణిలో కీలకంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్న విత్తన పార్క్లో అంతర్జాతీయ విత్తన సలహామండలి, రైతులకు అంతర్జాతీయ విత్తన నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్ సమీపంలోని బండమైలారంలో 150 ఎకరాల్లో విత్తన పార్క్ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. దేశానికి 60 శాతం సరఫరా.. ప్రస్తుతం దేశానికి అవసరమైన విత్తనాల్లో 60 శాతం తెలంగాణ సరఫరా చేస్తోందన్నారు. జర్మనీ, నెదర్లాండ్స్ పర్యటనలో వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు, విత్తన కంపెనీల ప్రతినిధులు, విత్తన ఉత్పత్తిదారులతో రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్న అంతర్జాతీయ విత్తన సలహా మండలి గురించి ఆయన చర్చించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం ప్రకారం తెలంగాణను గ్లోబల్ సీడ్ హబ్గా తీర్చిదిద్దడంలో ఈ అంతర్జాతీయ విత్తన సలహా మండలి కీలక పాత్ర పోషిస్తుందన్నారు. -
రబీకి రెడీ
సాక్షి, అమరావతి: వచ్చే నెల నుంచి ప్రారంభమయ్యే రబీ సాగు కోసం వ్యవసాయ శాఖ సన్నద్ధమైంది. ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, సూక్ష్మ నీటి పారుదల సదుపాయాలు సహా అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 22,77,407 హెక్టార్లలో రబీ పంటలు సాగు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్కుమార్ చెప్పారు. ఇందులో ఆహార పంటల సాగు 19,91,326 హెక్టార్లుగా ఉండనుంది. పెరిగిన అంచనాలు: గత ఏడాది కనీసం 25 లక్షల హెక్టార్లలో రబీ సాగు లక్ష్యంగా నిర్దేశించగా.. 22 లక్షల హెక్టార్లకు మించలేదు. ఈ ఏడాది రబీకి అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి. నైరుతి రుతు పవనాలు, అల్పపీడనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రిజర్వాయర్లు నిండుకుండల్లా మారాయి. ఈ పరిస్థితుల్లో సాగుపై అంచనాలు పెరిగాయి. ఈసారి అన్ని రిజర్వాయర్ల కింద పెద్దఎత్తున వరి సాగు చేయవచ్చని భావిస్తున్నారు. నాగార్జున సాగర్ రిజర్వాయర్ కుడి కాల్వకు నాలుగేళ్ల తరువాత పూర్తిస్థాయిలో నీరు విడుదల చేస్తుండటంతో దాని పరిధిలోని 11 లక్షల ఎకరాలు పూర్తిగా సాగులోకి రానున్నాయి. ఇప్పటికే కుడి కాల్వ కింద గల ప్రధాన కాలువలన్నిటికీ నీరు వదిలారు. రైతులు నార్లు కూడా పోసుకున్నారు. వచ్చే నెల రెండు వారం నుంచే నాట్లు పడనున్నాయి. విత్తన ప్రణాళిక ఖరారు ఖరీఫ్ అనుభవాలను దృష్టిలో వ్యవసాయాధికారులు వచ్చే రబీకి ముందే విత్తన ప్రణాళిక ఖరారు చేశారు. ఆయా జిల్లాలకు అవసరమైన విత్తనాలను ముందే పంపించారు. 14,180 క్వింటాళ్ల వరి, 29,438 క్వింటాళ్ల వేరుశనగ, 36,250 క్వింటాళ్ల పప్పు శనగ, 9,545 క్వింటాళ్ల మినుము, 3,550 క్వింటాళ్ల పెసలు, 140 క్వింటాళ్ల కందులు, 6,940 క్వింటాళ్ల మొక్కజొన్న, 150 క్వింటాళ్ల జొన్న విత్తనాలను సిద్ధంగా ఉంచారు. వీటితో పాటు 647 క్వింటాళ్ల రాగులు, 450 క్వింటాళ్ల నువ్వులు, 105 క్వింటాళ్ల పొద్దు తిరుగుడు, 732 క్వింటాళ్ల ఉలవలు, 2,225 క్వింటాళ్ల రాజ్మా, 600 క్వింటాళ్ల ధనియాలు, పిల్లిపెసర, జనుము తదితర విత్తనాలను కూడా సిద్ధం చేశారు. వీటిని అర్హులైన రైతులకు సబ్సిడీపై సరఫరా చేస్తారు. -
గుంటూరు జిల్లాలో మన విత్తనాల పండుగ
-
‘ఇస్టా’ ఉపాధ్యక్షుడిగా డాక్టర్ కేశవులు
సాక్షి, హైదరాబాద్ : అంతర్జాతీయ విత్తన పరీక్ష ప్రమాణాల సంస్థ (ఇస్టా) ఉపాధ్యక్షుడిగా తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కె.కేశవులు ఎన్నికయ్యారు. భారతదేశానికి, అందునా తెలంగాణకు ప్రపంచ వేదికపై దక్కిన అరుదైన గౌరవంగా వ్యవసాయశాఖ వర్గాలు అభివర్ణించాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల అవసరాలకు అనుగుణంగా విత్తన చట్టాలను, పాలసీలను, మార్కెట్లో విత్తన నాణ్యత, నియంత్రణ, సరఫరా మొదలగు అంశాలన్నింటిలో తీసుకునే కీలక నిర్ణయాలలో ప్రధానపాత్ర పోషించే ఇస్టా కార్యనిర్వాహక కమిటీ ఎన్నిక మంగళవారం ఏకగ్రీవంగా జరిగింది. జూన్ 26 నుంచి హైదరాబాద్ కేంద్రంగా హెచ్ఐసీసీలో అంతర్జాతీయ విత్తన సదస్సు– 2019 నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇస్టా అత్యున్నత కమిటీలో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్తోపాటు 8 మంది సభ్యులు ఉంటారు. ప్రతి మూడేళ్లకు ఒకసారి వివిధ దేశాల ప్రతినిధుల ద్వారా ఈ కమిటీ సభ్యులను ఎన్నుకుంటారు. మొట్టమొదటిసారిగా భారతదేశం నుంచి తెలంగాణకు చెందిన డాక్టర్ కె.కేశవులు వైస్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1924లో ఏర్పాటైన ఈ సంస్థలో భారతదేశానికి ఉపాధ్యక్ష పదవి లభించడం ఇదే మొదటిసారి. ఇస్టా ఉపాధ్యక్షుడిగా కేశవులు ఎన్నికవ్వడం భారతదేశానికి, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, కేంద్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్ అగర్వాల్, రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి పేర్కొన్నారు. భారతదేశ విత్తనరంగంలో ఈ దశాబ్దకాలంలో వివిధ దేశాలకు దీటుగా, దేశ అవసరాలకు సరిపడా విత్తనోత్పత్తి చేస్తూ, వివిధ దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్న తరుణంలో ఈ స్థానం సంపాదించడం తెలంగాణకు ఎంతో గర్వకారణమని వారు పేర్కొన్నారు. ఇస్టా సంస్థ ఉపాధ్యక్షుడిగా 2019–22 వరకు కేశవులు కొనసాగుతారు. సంస్థ నిబంధనల ప్రకారం ఇస్టా ఉపాధ్యక్షుడే తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. అంటే 2022–24 మధ్య ఇస్టా అధ్యక్షుడిగా డాక్టర్ కేశవులు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇస్టా సంస్థ వందేళ్ల కార్యక్రమం కేశవులు నేతృత్వంలోనే జరిగే అవకాశం ఉంది. ఈ అవకాశం ద్వారా మన దేశం ముఖ్యంగా తెలంగాణ నుంచి వివిధ దేశాలకు విత్తనాలు ఎగుమతులు చేసుకోవడానికి దోహదపడనుంది. అంతేకాకుండా విత్తన పరీక్షలో పద్ధతులు, నాణ్యత పెరిగి విత్తన చట్టాలను, పాలసీలను రూపొందించడానికి ఉపయోగపడనుంది. తెలంగాణ బిడ్డ... డాక్టర్ కేశవులు ఇస్టా ఉపాధ్యక్షుడిగా ఎన్నికవ్వడం తెలంగాణకు గర్వకారణం. ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన కేశవులు ఇంటర్మీడియట్ వరకు వరంగల్ జిల్లాలో విద్యను అభ్యసించి, వ్యవసాయ శాస్త్రంలో డిగ్రీని పొంది, తమిళనాడులోని కోయంబత్తూరు అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, డేవిస్, అమెరికాలో పోస్ట్ డాక్టరల్ పరిశోధన చేసి విత్తన శాస్త్రంలో అత్యంత అనుభవం గడించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో విత్తన శాస్త్ర విభాగానికి అధిపతిగా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థలో, విత్తనాభివృద్ధి సంస్థలో సంచాలకులుగా పనిచేస్తున్నారు. అంతర్జాతీయ విత్తన ప్రముఖుడైన ప్రొఫెసర్ కెంట్ బ్రాడ్ఫోర్డ్తో కలిసి పనిచేశారు. యూఎస్ఏఐడీ భాగస్వామ్య సభ్యుడిగా ఉండి ఈస్ట్ ఆఫ్రికన్, సౌత్ ఆసియా దేశాలలో విత్తన పద్ధతుల అభివృద్ధిపై అధ్యయనం చేశారు. విత్తన నిల్వలో ఆహారధాన్యాల నష్టాన్ని తగ్గించి అంతర్జాతీయంగా అంగీకరించిన వినూత్న విత్తన నిల్వ పద్ధతులను కనుగొన్నారు. ఇస్టా, ఓఈసీడీ నేపాల్ అగ్రికల్చర్ రీసెర్చ్ కౌన్సిల్, ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సీఏబీఐ ఆఫ్రికా, సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీస్ ఆఫ్ టాంజానియా, బంగ్లాదేశ్లతో కలిసి విత్తన రంగ అభివృద్ధికి కృషి చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా తీర్చిదిద్దడంలో, 32వ అంతర్జాతీయ విత్తన సదస్సు హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడంలో కేశవులు కీలకపాత్ర పోషించారు. కేశవులు ఇస్టా ఉపాధ్యక్షుడిగా ఎన్నికవడంతో తెలంగాణకు అనేక అవకాశాలు లభిస్తాయంటున్నారు. విత్తన శాస్త్ర సాంకేతిక రంగాలలో ఇతర దేశాలతో భాగస్వామ్యం కావడానికి మంచి అవకాశం లభించనుంది. ఇస్టా నూతన కార్యవర్గం అధ్యక్షుడు : స్టీవ్ జోన్స్ (కెనడా) ఉపాధ్యక్షుడు : డాక్టర్ కె.కేశవులు (తెలంగాణ, భారత్) కార్యవర్గ సభ్యులు : క్లెయిడ్ ముజాజు (జింబాబ్వే); వాలేరి కొకరేల్ (యునైటెడ్ కింగ్డమ్); శైల్వీ డ్యూకోర్నో (ఫ్రాన్స్); బెర్టా కిల్లర్మన్ (జర్మనీ); రిటాజెకెనెల్లీ (ఇటలీ); రూయెల్ సి.గెస్ముండో (ఫిలిప్పైన్స్); లీనా పియెట్ల్లా (ఫిన్లాండ్); ఇగ్నోషియో అర్నషియాగ (అర్జెంటీనా) -
రైతులను నిండా ముంచేసిన చంద్రబాబు సర్కారు
-
గత చంద్రబాబు సర్కారు నిర్వాకం
సాక్షి, అమరావతి: గత చంద్రబాబునాయుడు సర్కారు నిర్వాకం.. రైతులను నిండా ముంచేసింది. చంద్రబాబు ప్రభుత్వం.. ఏపీ సీడ్స్ సంస్థకు రూ. 380 కోట్లు ఎగనామం పెట్టింది. నిధులు ఇవ్వకపోవడంతో ఏపీ సీడ్స్ సంస్థ రాష్ట్రంలో రైతులకు కావాల్సిన విత్తనాలు సేకరించలేకపోయింది. దీంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులకు విత్తనాలు లేకుండాపోయాయి. రైతులకు విత్తనాలు అందించే విషయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిన చంద్రబాబు సర్కారు తీరుపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు వల్లే రైతులకు ప్రస్తు దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాల సేకరణ కోసం గత జనవరి నుంచి వ్యవసాయశాఖ అధికారులు నిధులు మంజూరు చేయాలని కోరినా.. ఈ విషయమై 28 సార్లు అధికారులు చంద్రబాబుకు లేఖలు రాసినా... ఆయన పట్టించుకోలేదని పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్లకు ధైర్యముంటే ఈ విషయంలో సమాధానం చెప్పాలని నిలదీశారు. గతంలో నిధుల కోసం వ్యవసాయ శాఖ అధికారులు రాసిన లేఖలను టీడీపీ ఆఫీస్కి పంపిస్తామని చెప్పారు. చంద్రబాబు రైతులను ముంచేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారని, విత్తనాల సరఫరా కోసం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారని తెలిపారు. మూడు లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు రైతులకు సరఫరా చేసామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అధిక ధరకు విత్తనాలు కొని.. రైతులకు సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం సేకరణ డబ్బులు కూడా గత చంద్రబాబు ప్రభుత్వం దారి మళ్లించి.. వారిని కష్టాల్లోకి నెట్టేసిందని, రైతులకు చేయాల్సిన నష్టం చేసి ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర కోసం చంద్రబాబు ఊబలాటపడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం అవకతవకలు, అక్రమాలు ఆధారాలతో సహా ఎండగడతామన్నారు. -
విత్తనాల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి
-
ఆ నిధుల విడుదలలో ఉదారంగా వ్యవహరించాలి : సీఎం జగన్
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో విత్తనాల కొరత లేకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో విత్తనాల కొరతపై సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. విత్తనాల కోసం రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని అధికారులకు సూచించారు. విత్తనాలకు సంబంధించిన రూ.360 కోట్లను గత ప్రభుత్వం దారిమళ్లించిందని, దాని వల్లే ప్రస్తుతం సమస్యలు తలేత్తాయని సీఎం ఆరోపించారు. విత్తనాల నిధుల విడుదలలో ఉదారంగా ఉండాలని ఆర్థిక శాఖ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రత్యామ్నాయ విత్తనాలైనా రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. వచ్చే ఐదేళ్లకు సరిపడ విత్తనాలపై సరైన ప్రణాళిక తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. -
‘వ్యవసాయం’పై బకాయిల బండ!
సాక్షి, అమరావతి : చంద్రబాబు సర్కారు గత ఐదేళ్లుగా అనుసరించిన లోపభూయిష్ట విధానాలవల్ల వివిధ శాఖలు నిధుల కొరతతో అల్లాడుతున్నాయి. ఇందులో వ్యవసాయ శాఖ కూడా ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. జూన్ ఒకటో తేదీతో ఖరీఫ్ సీజన్ ఆరంభమైంది. ఖరీఫ్ పంటల సాగుకు వీలుగా వ్యవసాయ శాఖ రైతులకు సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేయాలి. ఇలా వ్యవసాయ శాఖ రైతులకు సబ్సిడీ విత్తనాలు అందించాలంటే ఏపీ సీడ్స్, ఆయిల్ఫెడ్ లాంటి సంస్థలు విత్తనాలను వ్యవసాయ శాఖకు ఇవ్వాలి. అయితే, దురదృష్టవశాత్తు్త ఈ విత్తన సరఫరా సంస్థలకు ప్రస్తుతం అప్పు కూడా పుట్టని దుస్థితిలో ఉన్నాయి. ఇదంతా గత ఐదేళ్లుగా బాబు సర్కారు సాధించిన ఘనకార్య ఫలితమేనని అధికారులు విమర్శిస్తున్నారు. జూన్ మొదటి వారంలో రుతు పవనాలు రాగానే రైతులు పొలాలను దుక్కి దున్ని సాగు చేస్తారు. వేరుశనగ, కంది, పిల్లి పెసర, జీలుగ తదితర విత్తనాలను ప్రభుత్వం సబ్సిడీతో రైతులకు సరఫరా చేయాలి. వ్యవసాయ శాఖకు విత్తనాలు ఇచ్చేందుకు విత్తన సరఫరా సంస్థల వద్ద నిధులు లేవు. వ్యవసాయ శాఖ ఇప్పటికే ఆయా సంస్థలకు బకాయి ఉంది. కీలకమైన ఖరీఫ్ సీజన్లో భారీగా విత్తనాలు సరఫరా చేయాల్సిన వ్యవసాయ శాఖ నిధుల లేమితో అల్లాడుతోంది. ఎటూ అధికారంలోకి రాలేమని తెలిసే కొత్తగా అధికారంలోకి వచ్చే ప్రభుత్వం ఇబ్బంది ఎదుర్కోవాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు సర్కారు వ్యవసాయ శాఖకు నిధులు విదల్చకుండా కమీషన్లు వచ్చే సాగునీటి పారుదల ప్రాజెక్టులు, ఇతర కాంట్రాక్టర్లకు నిధులు మళ్లించారు. దీంతో వ్యవసాయ శాఖ నిధుల కొరతతో విత్తనాల సేకరణకు కూడా తీవ్ర అవస్థలు ఎదుర్కొంటోంది. విత్తన సబ్సిడీకి, సరఫరా సంస్థలకు ఉన్న బకాయిలు రూ.370 కోట్లు 2015–16 నుంచి 2018–19 వరకూ రూ.249 కోట్ల విత్తన సబ్సిడీ బకాయిలు విడుదల చేయకుండా ప్రభుత్వం పెండింగులో పెట్టింది. మరో రూ.120.91 కోట్లు బఫర్ సీడ్ స్టాకింగ్ ఆపరేషన్ లాసెస్ కింద విత్తన సరఫరా సంస్థలకు చెల్లించాల్సి ఉంది. సబ్సిడీ విత్తనాల సరఫరాకు సంబంధించి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.369.91 కోట్లు పైమాటే. రైతులకూ రూ.145 కోట్లు జొన్న, మొక్కజొన్న ఉత్పత్తులను ప్రభుత్వానికి విక్రయించిన 1.57 లక్షల మందికి పైగా రైతులకు ప్రభుత్వం రూ.145.78 కోట్లు చెల్లించాల్సి ఉంది. కరువు కాలంలో అష్టకష్టాలు పడి పండించిన ఉత్పత్తులను సర్కారుకు అమ్మిన పాపానికి వారు డబ్బు కోసం గుంటూరు, కృష్ణా, ప్రకాశం, కర్నూలు తదితర జిల్లాల రైతులు వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా ప్రదక్షిణలు చేస్తున్నారు. వ్యవసాయోత్పత్తుల ధరలు దారుణంగా పడిపోయినప్పుడు కనీస మద్దతు ధరకు రైతుల నుంచి వాటిని కొనుగోలు చేసి మార్కెట్ ధరకు విక్రయించాల్సిన బాధ్యత సర్కారుపై ఉంది. ఇందులో భాగంగానే గత ఆర్థిక సంవత్సరం మొక్కజొన్న, జొన్న రైతుల నుంచి ఉత్పత్తులు సేకరించి వారికి డబ్బు చెల్లించలేదని, రైతులకు సమాధానం చెప్పుకోలేకపోతున్నామని వ్యవసాయ శాఖ అధికారులు వాపోతున్నారు. అంతేకాదు..పౌర సరఫరాల శాఖ రైతుల నుంచి ధాన్యం సేకరించింది. గత ఖరీఫ్లో ధాన్యం విక్రయించిన వారికి ఇవ్వాల్సిన సొమ్మును ఇప్పటికీ చెల్లించలేదు. ఈ సొమ్మును కూడా సాగునీటి ప్రాజెక్టుల బిల్లుల చెల్లింపు, ఎన్నికల ముందు ఓట్ల తాయిలాలకు బాబు సర్కారు మళ్లించింది. బిందు, తుంపర సేద్యం, వ్యవసాయ పనిముట్లకు సంబంధించిన సబ్సిడీ బిల్లులు కూడా వేలకోట్లు పెండింగులోనే ఉన్నాయి. ట్రాక్టర్ల కొనుగోలు, పొలాల్లో షెడ్ల నిర్మాణం, చిన్న చిన్న నీటి చెరువుల ఏర్పాటు తదితరాల కోసం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లులను కూడా పెండింగులో పెట్టింది. దీనివల్ల కొత్తగా ఈ యూనిట్లు ఎవరికీ మంజూరు కావడంలేదు. అలాగే, రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక కింద రూ.103.89 కోట్ల నిధులు, భూ, నీటి సంరక్షణ కింద రూ.1.73 కోట్లు, వర్షాధార ప్రాంతాల అభివృద్ధి పథకం కింద రూ.20.02 కోట్లు, ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన బిల్లులు సీఎఫ్ఎంఎస్ పోర్టల్లో 2016–2019 మార్చి వరకూ పెండింగులో ఉన్నాయి. రూ.2,882.75 కోట్ల పెట్టుబడి రాయితీ ఎగవేత గత ఖరీఫ్లో పంట నష్టపోయిన 15.97 లక్షల మంది రైతులకు రూ.1,832 కోట్లు పెట్టుబడి రాయితీని బాబు సర్కారు చెల్లించకుండా ఎగవేసింది. 2014–15 నుంచి ఉన్న బకాయిలను కలిపితే రైతులకు చెల్లించాల్సిన పెట్టుబడి రాయితీ గత ఖరీఫ్ నాటికి రూ. 2102.75 కోట్లు. అలాగే, గత ఏడాది రబీ సీజన్లో ప్రకటించిన 257 కరువు మండలాల్లోని బాధిత రైతులకు చెల్లించాల్సిన మొత్తం రూ.780 కోట్లు ఉంటుందని అంచనా. వెరసి గత ఏడాది రబీ సీజన్ ముగిసే వరకూ బాబు సర్కారు రైతులకు ఇవ్వాల్సిన రూ.2,882.75 కోట్లలో నయాపైసా కూడా విదల్చలేదు. -
చెరువు నిండె.. చేను పండె!
సాక్షి, హైదరాబాద్: ఆహా.. ఉత్పత్తి అంటే ఇదీ..! తెలంగాణ పంట పడింది. రికార్డులు కొట్టుకుపోతున్నాయి. చెరువు నిండింది. పొలం పారింది. రైతుకు దిగులు లేదు. పంటకు తెగులులేదు. విత్తనాల కొరతలేదు. ఎరువుల కరువులేదు. ‘రైతుబంధు’ఆదుకుంది. చేనూచెలకా చిద్విలాసం చేశాయి. దిగుబడులు ఎగబడి పెరిగాయి. ఉత్పత్తిలో ఖరీఫ్, రబీలకు తేడా లేదు. తెలంగాణ పల్లెలు గోదావరి జిల్లాలతో పోటీ పడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. రెండు, మూడేళ్లుగా ఆహారధాన్యాల ఉత్పత్తిలో భారీ పురోగతి కనిపిస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువులు ఉనికిలోకి రావడంతో సాగునీటి వసతి పెరిగింది. దీంతో ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగింది. గోదావరి జిల్లాలతో పోటీ పడి... కేంద్ర ప్రభుత్వానికి పంపిన నివేదికల ప్రకారం రాష్ట్రంలో ఈ ఐదేళ్లలో ఆహారధాన్యాల ఉత్పత్తి భారీగా పెరిగింది. 2014–15లో ఆహారధాన్యాల ఉత్పత్తి 72.18 లక్షల మెట్రిక్టన్నులు. అది ఇప్పుడు 91.93 లక్షల మెట్రిక్టన్నులకు చేరుకుంది. 2016–17, 2017–18 ఏళ్లల్లో రబీల్లో రికార్డుస్థాయిలో ఆహారధాన్యాలు ఉత్పత్తి అయ్యాయి. గోదావరి జిల్లాలతో పోటీపడి ఆహారధాన్యాల ఉత్పత్తి కావడం విశేషం. విచిత్రమేంటంటే... 2014–15 ఖరీఫ్లో 44.72 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలు పండితే, 2016–17 రబీలోనైతే ఏకంగా 49.07 లక్షల మెట్రిక్ టన్నులు పండటం విశేషం. గత ఖరీఫ్లో వరి దిగుబడి గత 20 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. ఏకంగా 41.04 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం (61.57 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం) పండటం విశేషం. గతేడాది పత్తి, పప్పుధాన్యాల దిగుబడి ఢమాల్... గతేడాది పత్తి, పప్పుధాన్యాల ఉత్పత్తి మాత్రం పడిపోయింది. 2018–19లో పత్తి 48.71 లక్షల బేళ్లు ఉత్పత్తి అయిందని నివేదిక తెలిపింది. 2017–18లో 51.95 లక్షల బేళ్లు ఉత్పత్తి కాగా ఈసారి 3.24 లక్షల బేళ్లు తగ్గింది. పప్పుధాన్యాల ఉత్పత్తి కూడా గణనీయంగా పడిపోయింది. 2017–18లో 5.15 లక్షల టన్నులు ఉత్పత్తి కాగా, 2018–19 ఆర్థిక సంవత్సరంలో 3.85 లక్షల టన్నుల మేర ఉత్పత్తి అయింది. ఖరీఫ్లో పప్పు ధాన్యా ల ఉత్పత్తి 2.58 లక్షల మెట్రిక్ టన్నులు రాగా రబీలో 3.85 లక్షల టన్నులు ఉత్పత్తి కానున్నట్లు ప్రభుత్వం కేంద్రానికి పంపిన నివేదికలో పేర్కొంది. -
రైతులను ముంచడమే లక్ష్యంగా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విత్తన దళారులు రైతులను దోచుకుంటున్నారు. అనేకచోట్ల నాసిరకపు విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. లేబుల్స్ లేకుండా విత్తన విక్రయాలు జరుపుతున్నారు. మరికొన్నిచోట్ల విత్తన ధ్రువీకరణ సంస్థ ద్వారా అంద జేసే లేబుళ్లనూ కొందరు అధికారులతో కుమ్మక్కై సంపాదిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా రైతులను మోసం చేసే పనిలో దళారులు, కొందరు ఏజెంట్లు నిమగ్నమయ్యారు. పైగా రాష్ట్రంలో విత్తన దుకా ణాల్లో సరైన రికార్డులు నిర్వహించడం లేదు. విత్తన ప్యాకెట్లకు అసలు లేబుల్స్ లేకుండా నేరుగానే రైతులకు అంటగడుతున్నారు. ఏ విత్తనం ఎక్కడిది.. ఎవరికి విక్రయిస్తున్నారు.. రోజువారీగా ఎంత అమ్ముతున్నారన్నది స్పష్టత లేదు. ప్యాకింగ్ లేని.. అనుమతి లేని పత్తి విత్తనాలు, నకిలీ విత్తనాలు యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఇటీవల జరిపిన నిఘా బృందాల తనిఖీలో బట్టబయలైంది. రూ.7.20 కోట్ల విలువైన పత్తి విత్తనాల సీజ్ వివిధ జిల్లాల్లో నిఘా బృందాలు విత్తన విక్రయ కేంద్రాలు, జిన్నింగ్ మిల్లులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వీటిలో ఒక్కరోజే రూ.7.20 కోట్ల విలువ చేసే 16,499 కిలోల పత్తి విత్తనాలను స్వా ధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిషేధిత గ్లైఫోసేట్ పురుగుమందు కూడా సీజ్ చేశారు. అనేక చోట్ల విత్తన దుకాణాల నిర్వహణ సరిగా లేకపోవడంతో పాటు నకిలీ, నాసిరకం విత్తనాలను రైతులకు అంటగడుతున్నట్లు తేలింది. ఖరీఫ్ దగ్గర పడుతుండటం తో దళారులు రైతులను మోసం చేస్తున్నారు. విత్తన చట్టాల్లోని లోపాలను ఆసరా చేసుకొని దళారులు, కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఖరీఫ్లో 1.29 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లు... వచ్చే ఖరీఫ్లో 1.29 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లు సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. 90 కంపెనీల ద్వారా వీటిని రైతులకు సరఫరా చేయనుంది. జిల్లాల నుంచి వివిధ రకాల విత్తనాలకు ఇండెంట్ తెప్పించుకున్న ప్రకారం 7.50 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేయనున్నారు. ఇందులో వరి విత్తనాలు 3 లక్షల క్వింటాళ్లు సరఫరా చేయనున్నారు. హైబ్రిడ్ రకం, ఆర్ఎన్ఆర్–15064, కేఎన్ఎం–118, జేజీఎల్–18047 రకం విత్తనాలను సరఫరా చేస్తారు. వీటితోపాటు బీపీటీ–5204 రకం విత్తనాలనూ సరఫరా చేయాలని నిర్ణయించారు. 1.70 లక్షల క్వింటాళ్ల సోయాబీన్ విత్తనాలనూ సరఫరా చేయడంతోపాటు 20 వేల క్వింటాళ్ల కంది విత్తనాలను సరఫరా చేస్తారు. పెసర, మినుములు, జొన్న, మొక్కజొన్న, జీలుగ, పిల్లిపెసర, పొద్దు తిరుగుడు, ఆముదం విత్తనాలను ఖరీఫ్ కోసం అందజేస్తారు. లక్ష క్వింటాళ్ల జీలుగ విత్తనాలు, 80 వేల క్విం టాళ్ల మొక్కజొన్న విత్తనాలు సరఫరా చేస్తారు. -
కొత్త శనగ వంగడాల సృష్టికి మార్గం సుగమం!
సాక్షి, హైదరాబాద్: కరువు కాటకాలను తట్టుకుని ఎక్కువ దిగుబడులు ఇవ్వగల సరికొత్త శనగ వంగడాల అభివృద్ధికి మార్గం సుగమమైంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) నేతృత్వంలో జరిగిన ఓ అంతర్జాతీయ పరిశోధన శనగలో మేలైన లక్షణాలను అందివ్వగల జన్యువులను గుర్తించారు. దాదాపు 45 దేశాల్లోని 429 రకాల శనగ పంటల జన్యుక్రమాన్ని విశ్లేషించడం ద్వారా శాస్త్రవేత్తలు అందులోని జన్యువైవిధ్యతను అంచనా వేయగలిగారు. శనగ మొట్టమొదట ఏ ప్రాంతంలో పుట్టింది? ఆసియా, ఆఫ్రికాల్లోకి ఎలా ప్రవేశించిందన్న విషయాలనూ తెలుసుకోగలిగారు. సుమారు 200 ఏళ్ల క్రితం మధ్యదరా ప్రాంతం నుంచి ఈ శనగ పంట అఫ్గానిస్తాన్ మీదుగా భారత్కు వచ్చింది. అదే సమయంలో ప్రపంచానికి ఈ పంట మధ్యదరా ప్రాంతం నుంచి కాకుండా మధ్యాసియా లేదా తూర్పు ఆఫ్రికా ప్రాంతం నుంచి విస్తరించడం గమనార్హం. శనగ జన్యుక్రమాన్ని నిర్దిష్ట లక్ష్య సాధన కోసం పునఃసమీక్షించడంలో ఇదే అతిపెద్ద పరిశోధన. దీనిద్వారా లభించిన సమాచారంతో వర్షాభావం, అధిక ఉష్ణోగ్రతలు, చీడపీడలను తట్టుకునే కొత్త వంగడాలను సృష్టించడం సులువు కానుంది. మూడేళ్లు శ్రమపడి శాస్త్రవేత్తలు జరిపిన ఈ అధ్యయనం వివరాలు నేచర్ జెనిటిక్స్ ఆన్లైన్లో ప్రచురితమయ్యాయి. పప్పు ధాన్యాలకు దేశం లో డిమాండ్ ఉన్నప్పటికీ సాగు, దిగుబడులు లేవు. ఈ నేపథ్యంలో భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలనేకం ఈ అంతర్జాతీయ పరిశోధనలో పాలుపంచుకున్నాయి. 90 శాతం సాగు ఇక్కడే.. ప్రపంచవ్యాప్త శనగ సాగులో దక్షిణాసియా ప్రాంతం వాటా దాదాపు 90 శాతం. అయితే వర్షాభావం, ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కారణంగా దిగుబడులు తగ్గిపోతున్నది కూడా ఇక్కడే ఎక్కువ. ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కారణంగా రబీ సీజన్ పంట అయిన శనగకు నష్టమెక్కువగా జరుగుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు తాము గుర్తించిన ఆర్ఇఎన్–1, 3–గ్లుకనేస్, ఆర్ఈఎఫ్ 6 జన్యువులు, ఉపయోగపడతాయని, వీటిని నియంత్రించడం ద్వారా పంటలు 38 డిగ్రీ సెల్సియస్ వేడిని తట్టుకోవడమే కాకుండా ఎక్కువ దిగుబడి సాధించవచ్చునని ఇక్రిశాట్ శాస్త్రవేత్త, అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ రాజీవ్ వార్‡్షణీ తెలిపారు. అంతర్జాతీయ బృందం అధ్యయనం కారణంగా శనగకు సంబంధించి అనేక కొత్త విషయాలు తెలిశాయని, వీటి ఆధారంగా వాతావరణ మార్పులను తట్టుకునే కొత్త వంగడాలను ఉత్పత్తి చేయవచ్చునని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ పీటర్ కార్బెర్రీ తెలిపారు. ఈ పరిశోధన రైతులకు మరింత ఆదాయం తెచ్చిపెడుతుందని, ఇక్రిశాట్ లాంటి సంస్థతో కలసి పనిచేయడం తమకు ఎంతో సంతోషాన్నిచ్చిందని గ్లోబల్ క్రాప్ డైవర్సిటీ ట్రస్ట్ (జర్మనీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేరీ హాగా హర్షం వ్యక్తంచేశారు. ఈ పరిశోధనలో బీజీఐ (చైనా), ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఏఆర్ఐ), ఫ్రెంచ్ నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ (ఐఆర్డీ, ఫ్రాన్స్), ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్), యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ (బెంగళూరు)లతోపాటు కీనా, ఇథియోపియా, కొరియా, అమెరికా, మెక్సికో, ఆస్ట్రేలియాలకు చెందిన పలు పరిశోధన సంస్థలు పాల్గొన్నాయి. -
2.18 కోట్ల మందికి ‘పెట్టుబడి’
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం–కిసాన్) పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి కోసం ఆర్థిక సాయం చేసింది. తాజాగా ప్రకటించిన లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 2.18 కోట్ల మంది రైతులకు రూ. 4,366 కోట్ల పెట్టుబడి సాయం అందించినట్లు కేంద్రం విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది బడ్జెట్లో కేంద్రం ఐదెకరాలలోపున్న నిర్దేశిత సన్న చిన్నకారు రైతులకు ఏడాదికి రూ.6 వేలు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. విడతకు రూ. 2 వేల చొప్పున మూడు విడతల్లో ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. రైతులకు విత్తనాలు, ఎరువులు, ఇతరత్రా సాగు ఖర్చుల నిమిత్తం కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎన్నికల కోడ్ వచ్చే నాటికి నిధులను విడుదల చేసినట్లు కేంద్రం ప్రకటించింది. ఎన్నికలు అయ్యాక మిగిలిన రైతులకు కూడా ఇచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో 14.41 లక్షల మందికి ఐదెకరాలలోపు ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఉన్నతాదాయ వర్గాలంతా అనర్హులని పీఎం–కిసాన్ పథకం తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. రైతు కుటుంబంలో ఎవరైనా రాజ్యాంగ పదవుల్లో ఉంటే వారికి వర్తించదు. తాజా, మాజీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జిల్లా పరిషత్ తాజా, మాజీ చైర్మన్లకు కూడా ఈ పథకాన్ని వర్తింపచేయలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రస్తుత, రిటైర్ అయిన ఉద్యోగులు, అధికారులు అనర్హులు. స్వయంప్రతిపత్తి సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన అధికారులు కూడా అనర్హులే. 10 వేల రూపాయలకు మించి పింఛన్ తీసుకునే ఉద్యోగులంతా అనర్హుల జాబితా కిందకే వచ్చారు. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సీఏలు, ఆర్కిటెక్ట్లు తదితర వృత్తి నిపుణులకు ఈ పథకాన్ని వర్తింపచేయలేదు. దీంతో తెలంగాణలో సన్న, చిన్నకారు రైతులు దాదాపు 47 లక్షల మంది ఉంటే, వారిలో కేవలం 26 లక్షల మంది మాత్రమే పీఎం–కిసాన్ పథకానికి అర్హులయ్యారు. తెలంగాణ లో 14.41 లక్షల మంది రైతులకు రూ.288 కోట్లు విడుదల చేసింది. దేశంలో అత్యధికంగా ఏపీలో 32.15 లక్షల మంది రైతులకు రూ.643 కోట్లు అందజేసింది. ఆ తర్వాత గుజరాత్ రాష్ట్రంలో 25.58 లక్షల మంది రైతులకు రూ. 511.62 కోట్లు అందజేసింది. అత్యంత తక్కువగా ఛత్తీస్గఢ్లో 36 మంది రైతులకు రూ.72 వేలు అందజేసింది. -
మిద్దె తోటలో మొక్కజొన్న
మిద్దె తోటల్లో కూడా మొక్కజొన్నను అన్ని కాలాల్లోనూ బాగా పండించుకోవచ్చు. పెద్దగా తెగుళ్లు రావు. నాటిన రెండు నెలలకు, పొత్తులు తయారవుతాయి. మరో నెల దాకా అవసరాలకు పనికివస్తాయి. ఉదయాన్నే ఒకటో రెండో మొక్కజొన్న పొత్తులు తినండి. ఉప్పూ నూనెల తిండ్లకు దూరంగా ఉండండి. ఒక మొక్కజొన్న పొత్తు తింటే, మరే టిఫిన్ అవసరం లేదు. ఆకలి అవదు. మలబద్ధకం ఉండదు. అనేక సూక్ష్మ పోషకాలు ఉన్నాయి. పాలిష్ చేసిన తెల్ల అన్నం తినటం కంటే, మొక్కజొన్న పొత్తును తినడం నయం. పొత్తుల్ని కాల్చుకొని తినడం కంటే, లైట్గా ఉడికించి తినడం మంచిది. అడుగు(ఫీటు) లోతు మట్టి ఉంటే చాలు, మొక్కజొన్నను పెంచుకోవచ్చు. ఎటు చూపినా పది అంగుళాలకు ఒక విత్తనాన్ని నాటుకోవాలి. అర అంగుళం లోతులో విత్తనాలను నాటుకోవాలి. నాటాకా మడి మొత్తం తడిసేలా నీరు పెట్టాలి. మట్టి నాలుగైదు వంతులు, ఎరువు ఒక వంతు చొప్పున కలిపి వాడాలి– మడుల్లో. ఆహార వైవిధ్యం పాటించాలి. మనం ఆరోగ్యంగా జీవించాలి. – తుమ్మేటి రఘోత్తమరెడ్డి, మిద్దెతోట నిపుణులు -
నిస్సారమైన భూమిలో దేవుని నూరంతల దీవెన
‘ఈ దేశంలోనే ఉండు, ఇక్కడే నిన్ను ఆశీర్వదిస్తానంటూ దేవుడు వాగ్దానం చేస్తే, ఇస్సాకు దేవుని మాటకు కట్టుబడి ఎడారి అయిన గెరారు దేశంలోనే జీవించాడు. నిజానికి దేవుడు ఆయనకు చూపించిన గెరారు లోయ ఆ బెయేర్షెబా ఎడారిలోకెల్లా అత్యంత నిస్సారమైన ప్రాంతం. అయితే ఇస్సాకు దేవుని మాటకు విధేయుడై అక్కడ నివసిస్తూ శ్రమించి వ్యవసాయం చేస్తే, దేవుడు నూరంతల పంటను అనుగ్రహించాడు. ఒక విత్తనం వేస్తే వంద విత్తనాలు రావడం ఎక్కడైనా జరిగేదే. కాని ఆ నిస్సారమైన భూమిలో దానికి నూరంతలు అంటే ఒక విత్తనానికి పదివేల విత్తనాల పంట చేతికొచ్చింది. అలా అనతికాలంలోనే ఇస్సాకు ఆ దేశంలోకెల్లా గొప్ప వాడయ్యాడు(ఆది 26:12). ఇశ్రాయేలీయుల మూలపితరులు అబ్రాహాము, ఆయన కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. ‘మా దేవుడు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు’ అంటూ ఇశ్రాయేలీయులు ఎంతో ఘనంగా చెప్పుకునే గొప్ప ‘పితరుల త్రయం’ వారు ముగ్గురూ!! ఈ ముగ్గురిలో ఇస్సాకు చాలా మెత్తటి వాడు, మితభాషి, పైగా మిగతా ఇద్దరికున్నంత తెగింపు, చైతన్యం ఉన్నవాడు కాదు. బైబిల్లో కూడా ఆయన గురించి చాలా తక్కువ వివరాలున్నాయి. కాని దేవుని పట్ల విధేయతలో మాత్రం ఆయన ఎవరికీ తక్కువ కాదు. గెరారు లోయ నిస్సారమైన ప్రాంతమని నిస్పృహచెందకుండా తాను కష్టపడితే దేవుడే ఆ కష్టాన్ని ఆశీర్వదిస్తాడని నమ్మి అతను నూరంతల దీవెన పొందాడు. అయితే దేవుని ఆశీర్వాదంతో అతి త్వరలోనే అతడక్కడ చాలా ధనవంతుడై ఎంతో గొప్పవాడు కావడంతో, స్థానికులైన ఫిలిష్తీయులకు అసూయ కలిగి కలహించారు. కాని అతని వెనుక దేవుడున్నాడని గ్రహించిన ఫిలిష్తీయుల రాజు తానే తన పరివారంతో సహా ఇస్సాకు ఇంటికొచ్చి మరీ ఆయనతో శాంతి ఒప్పందం చేసుకొని విందారగించాడు. దేవుడిచ్చేదానికి, మనిషి సంపాదించుకునే దానికి మధ్య ఉన్న తేడా అదే. దేవుడిచ్చే సంపద శత్రువులను మిత్రులుగా మార్చుతుంది, మనిషి సంపాదించుకునేది మిత్రులను కూడా శత్రువులుగా మార్చుతుంది. అలా ఇస్సాకు క్రమంగా బలం, ధైర్యం పుంజుకొని అక్కడి పరిస్థితులన్నీ తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. తన తండ్రి తవ్వించగా ఫిలిష్తీయులు పూడ్చేసిన బావుల్ని మళ్ళీ తవ్వించాడు. కొన్ని కొత్త బావుల్ని కూడా తవ్వించాడు. అలా ఎంత ఎదిగినా, ఆ దేశానికి రాజంతటివాడు స్వయంగా తనవద్దకు వచ్చినా, ఇస్సాకు మిడిసిపడలేదు. తలవంచే తత్వం, కష్టపడేతత్వం, సాత్వికత్వం, దేవుడిచ్చిన పారలౌకిక జ్ఞానం, శాంతికాముకత కలిగిన విశ్వాసిగా ఇస్సాకు తనపట్ల దేవుని ప్రసన్నతను నిరూపించుకున్నాడు. లోకంలోని ధనవంతుల్లో కళ్ళు నెత్తికెక్కి అది నడమంత్రపు సిరిగా మారి, అందర్నీ శత్రువులను చేసుకొని అశాంతితో జీవించేవాళ్లే చాలామంది ఉంటారు. అయితే ఎంతసంపన్నులైనా సరే అటు దేవునికి ఇటు సమాజానికి కూడా ఒదిగి జీవించే ఇస్సాకు లాంటి వాళ్ళు చాలా అరుదు. ఇస్సాకు లాంటి వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదాలను, శాంతిని పంచుతారు. నేను మహా విశ్వాసియైన అబ్రాహాము కొడుకును కాబట్టి దేవుడెలాగైనా ఆశీర్వదిస్తాడులే అని అతను చేతులు ముడుచుకొని సోమరిలాగా కూర్చోలేదు. తన వంతు కష్టపడ్డాడు. దేవుడు ఎవరి ఆశీర్వాదాలు వారికే ఇస్తాడు. అబ్రాహామువి అబ్రాహామువే, ఇస్సాకువి ఇస్సాకువే!! నా తండ్రిని దీవించిన దేవుడు నన్ను కూడా దీవిస్తాడులే అన్న భరోసాతో విశ్వాసులుండకూడదు. ప్రతి విశ్వాసికి దేవునితో సన్నిహితమైన, పూర్తిగా వ్యక్తిగతమైన తనదైన ఒక అనుబంధం, సహవాసం ఉండాలి. అదే సంపదలను, శాంతిని చేకూర్చుతుంది. ఆశీర్వాదాలను తన స్వాస్త్యంగా ప్రతి విశ్వాసి ఎవరికి వారు సొంతగా సంపాదించుకోవాలి. తాత్పర్యమేటంటే, దేవునికి మనవలు మనవరాళ్ళుండరు. విశ్వాసులంతా ఆయనకు కుమారులు, కుమార్తెలే!! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
అగచాట్లు
సాక్షి కడప : విత్తనాల కోసం రైతులకు అగచాట్లు తప్పడం లేదు. జిల్లా వ్యాప్తగా శనగ విత్తన కంపెనీకి వ్యవసాయశాఖ శ్రీకారం చుట్టింది. మొదటిరోజు సర్వర్తోపాటు ఆన్లైన్ సమస్యలు ఏర్పటడంతో ఇబ్బందులు తలెత్తాయి. బుడ్డశనగ విత్తన కాయల కోసం రాజుపాలెం, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు ప్రాంతాల్లో రైతులు భారీగా బారులు తీరుతున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో నిలుచోవాల్సి వస్తోందని వాపోతున్నారు. శుక్రవారం పులివెందుల ఎంపీడీఓ కార్యాలయ సమీపంలో క్యూలైన్లలో నిలుచున్న మహిళలను స్థానిక మహిళా పోలీసులు లాగేశారు. పోలీసుల మాటలతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.ఉన్నతాధికారులు స్పందించి విత్తనాలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
రబీ విత్తనాలు రెడీ
సాక్షి, హైదరాబాద్: రబీ విత్తన ప్రణాళికను వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే రబీ సీజన్కు అవసరమైన విత్తనాలను ఇప్పటికే సిద్ధం చేసినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. మొత్తం 4.19 లక్షల క్వింటాళ్ల వివిధ విత్త నాలు రబీకి అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అందులో వరి విత్తనాలే 3.16 లక్షల క్వింటాళ్లున్నాయి. వీటిలో 25 వేల క్వింటాళ్లు ఇప్పటికే సిద్ధంగా ఉండగా, ప్రస్తుత ఖరీఫ్లో విత్తనోత్పత్తి కార్యక్రమం కింద మరో 2.91 లక్షల క్వింటాళ్లు సిద్ధం చేయనున్నారు. వరిలో ఎంటీయూ–1010 విత్తనాలు 1.22 లక్షల క్వింటాళ్లు, బీపీటీ–5204 విత్తనాలు 87,654 క్వింటాళ్లు సరఫరా చేయనున్నారు. కేఎన్ఎం–118 వరి విత్తనాలను 57,740 క్వింటాళ్లు, ఆర్ఎన్ఆర్–15048 విత్తనాలను 31 వేల క్వింటాళ్లు సరఫరా చేస్తారు. అలాగే ఎంటీయూ–1061, ఎంటీయూ–1001, జేజీఎల్–18047 రకం వరి విత్తనాలను కూడా పంపిణీ చేయనున్నారు. ఇవిగాక 64,880 క్వింటాళ్ల శనగ విత్తనాలు, 8,666 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు, మినుములు, ఆముదం విత్తనాలను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. అయితే వీటిని సబ్సిడీపై అందజేయనున్నా రు. ఎంత సబ్సిడీ ఇవ్వాలనే దానిపై త్వరలోనే నిర్ణయించనున్నారు. ఇటీవల విస్త్రృతంగా వర్షాలు కురవడం, జలాశయాల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరడంతో రబీలో వరి సాగు భారీగా పుంజుకోనుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. అంతేకాకుండా కొత్తగా పూర్తయ్యే ప్రాజెక్టుల కింద అదనంగా 6.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగనుండటంతో ఆ మేరకు అదనంగా వరి విత్తనాలను సరఫరా చేసేందుకు సిద్ధమైంది. -
విత్తనోత్పత్తిలో సహాయం చేయండి
సాక్షి, హైదరాబాద్: నాణ్యమైన విత్తనోత్పత్తి, విత్తన నిల్వలో సాంకేతిక పరిజ్ఞానంపై సహకారం అందించాలని వియత్నాం దేశ జాతీయ అసెంబ్లీ ప్రతినిధుల బృందం రాష్ట్రాన్ని కోరింది. 4 రోజుల పర్యటనలో భాగంగా సోమవారం హైదరాబాద్ చేరుకున్న వియత్నాం ఉన్నతాధికారుల బృందం రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథితో సమావేశమైంది. వ్యవసాయాభివృద్ధి, పరిశ్రమలు, వ్యాపారం, విత్తన శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పెట్టుబడులకు సంబంధించిన అవకాశాలను అన్వేషించి అందిపుచ్చుకోవటానికి తెలంగాణ పర్యటనకు వచ్చినట్లు 10 మంది సభ్యుల బృందానికి నాయకత్వం వహిస్తున్న గుయెన్ తి యెన్ తెలిపారు. తమ దేశంలో గాలిలో అధిక తేమ వల్ల విత్తన నిల్వ సమస్యగా ఉందన్నారు. విత్తన పంటల కోత అనంతరం విత్తన నాణ్యతా పరిరక్షణ, విత్తన నిల్వలపై శిక్షణ అందించాలని కోరారు. భారతదేశానికి తెలంగాణ విత్తన రాజధానిగా ఉండటం గర్వకారణమన్నారు. ప్రస్తుతం తాము విత్తనాన్ని అమెరికా, ఐరోపా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని పేర్కొన్నారు. నాణ్యమైన విత్తనోత్పత్తికి తెలంగాణ ప్రసిద్ధి అని తెలుసుకొని ఒప్పందాలు చేసుకోవటానికి రాష్ట్రానికి వచ్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ.. ఈజిప్ట్, ఫిలిప్పీన్స్, రష్యా, ఇటలీ తదితర 20 దేశాలకుపైగా విత్తనాలను ఎగుమతి చేస్తున్నామన్నారు. వియత్నాం సహా ప్రపంచ దేశాలకు కావాల్సిన అన్ని రకాల నాణ్యమైన విత్తనాన్ని ఉత్పత్తి చేసి ఎగుమతికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. వియత్నాంకు అన్ని విధాలా శాస్త్ర, సాంకేతిక సహకారం అందిస్తామని తెలిపారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 3 వరకు హైదరాబాద్లో నిర్వహించే 32వ ఇస్టా సదస్సుకు రావాలని వియత్నాం బృందాన్ని ఆయన ఆహ్వానించారు. కార్యక్రమంలో రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ సంచాలకుడు డాక్టర్ కేశవులు, సుదర్శన్, రవీందర్ రెడ్డి, భాస్కర్ సింగ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
అరెరే..విత్తనాలను తెగనమ్ముకుంటున్నారే!
కడప అగ్రికల్చర్ : వర్షాభావ పరిస్థితులు రైతన్నను అగాధంలో పడేశాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు దాటినా ఆశించిన స్థాయిలో పదును వర్షం కురవకపోవడంతో వ్యవసాయ పంటల సాగు అగమ్యగోచరంగా తయారైంది. గతేడాది ఇదే సమయానికి అనుకున్న మేర పంటలు సాగు కావడంతో, ఈ ఏడాది ఖరీఫ్ సీజన్పై రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు. పంటల సాగుకు పొలాలను దుక్కులు దున్ని, ఎరువులు చల్లి సిద్ధం చేసి ఉంచారు. అడపాదడపా చిరుజల్లులు, ఓ మోస్తరు వర్షం కరుస్తుండడం రైతుల్లో కాస్త ఉత్సాహం నింపినా, అరకొర పదునైనా, రాబోయే రోజుల్లో మంచి వర్షాలు పడతాయనే ఆశతో కొంతమంది రైతులు అక్కడడక్కడ పంటలను సాగు చేశారు. అయితే ఆ తర్వాత వానలు కురిసే నమ్మకం కనిపించకపోవడంతో రైతులు పంట సాగుకు పూనుకోలేక పోయారు. వర్షాలు కురవకపోతాయా? పంటలు పండించుకోక పోతామా... అనే నమ్మకాన్ని మనసులో ఉంచుకుని రెండు నెలలుగా ఆకాశంవైపు ఆశగా చూస్తున్న రైతన్నను వానలు నిరాశపరచాయి. విత్తన పంపిణీ ఇలా.. వేరుశనగ కాయలు 43,030 క్వింటాళ్లకుగాను 10,488 క్వింటాళ్లు పంపిణీ చేశారు. కందులు 1,000 క్వింటాళ్లకుగాను 221 క్వింటాళ్లు, పెసలు 80 క్వింటాళ్లకుగాను, 30.58 క్వింటాళ్లు, మినుములు 173.2 క్విం టాళ్లకు 69.2 క్వింటాళ్లు, జీలుగలు 15,000 క్విం టాళ్లకు 13,144 క్వింటాళ్లు, జనుములు 2,000 క్వింటాళ్లకు 1,612 క్వింటాళ్లు, పిల్లి పెసర 1,500 క్వింటాళ్లకు 881 క్వింటాళ్లు పంపిణీ చేశారు. సాలు తప్పిన సాగు.. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్లో సాధారణ సాగు 1.34 లక్షలుకాగా, ఇందులో ఇప్పటికి 12,501 హెక్టార్లలో ప్రధాన పంటలు సాగయ్యాయని వ్యవసాయశాఖ రికార్డులు చెబుతున్నాయి. జూన్ నెలలో 69.2 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 31.9 మి.మీ కురిసింది. జూలైలో 97.0 మి.మీ కురవాల్సి ఉన్నా ఇప్పటివరకు 21.4 మి.మీ కురిసింది. ఈ అరకొర వర్షానికి జిల్లావ్యాప్తంగా వేరుశనగ, కంది, ఆము దం, సజ్జ, పత్తి,పెసర, వరి, అలసంద, మిరప, ఉల్లి తదితర పంటలు కలిపి 12,501 హెక్టార్లలో సాగైనట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. విత్తనాలను తెగనమ్ముకుంటూ... ఈ ఖరీఫ్లో పదునుపాటి వర్షాలు కురుస్తాయన్న ఆశతో రైతులు ప్రధాన పంటైన వేరుశనగ సాగుకు విత్తనకాయలను సబ్సిడీపై ఇచ్చిన వాటితో పాటు పాత గత రబీలో పండిన పంట నుంచి సేకరించుకున్నవి కూడా సిద్ధం చేసుకున్నారు. వేరుశనగ విత్తనకాయలు 30కిలోల బస్తాను రూ.1,250లు వెచ్చించి తీసుకొచ్చారు. జూన్ మొదటి వారంలో వర్షాలు కురుస్తాయని ఆశించారు. రెండు నెలలు కావస్తున్నా అదునులో పదును కాకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో, బర్మా (ఊజిఈగ)పురుగు ఆశిస్తే కొనుగోలు చేసే వారుండనే భయంతో విత్తనాలను తెగనమ్ముకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదనతో తెలిపారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు రామకృష్ణారెడ్డి. గొందిపల్లె గ్రామం, వేముల మండలం. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు ఐదు ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనికిగాను 20బస్తాలు కొనుగోలు చేశాడు. రూ.24 వేలు ఖర్చు. పదునుపాటి వానలు కురవకపోవడంతో చేసేదేమీ లేక విత్తనాలను తెగనమ్ముకున్నాడు. రూ.20 వేలు వచ్చాయి. అంటే రూ.4 వేలు నష్టపోయాడు. ఈ పరిస్థితి ఒక్క రామకృష్ణారెడ్డిదే కాదు. జిల్లాలో వేరుశనగ ఇతర పంటలను సాగు చేసే ప్రతి రైతు పరిస్థితి ఇలానే ఉంటోంది. విత్తనాలు అమ్ముకుంటున్నాం నాలుగు ఎకరాల్లో వేరుశనగ పంట వేయాలనుకుని వేల రూపాయలు పెట్టుబడి పెట్టి అన్ని సిద్ధంగా ఉంచుకున్నాం. వానలు కురవకపోవడంతో విత్తనాలను అమ్ముకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. –ఎర్రగోర్ల చలపతి, యువరైతు, వేముల -
నీటి శుద్ధికి పండ్ల తొక్కలు!
నీటిలోని కాలుష్యాలను తొలగించేందుకు పండ్లు, కాయగూరల మొక్కలు బాగా ఉపయోగపడతాయని అంటున్నారు డికిన్సన్ కాలేజీ శాస్త్రవేత్తలు. గుమ్మడికాయ విత్తనాలు మొదలుకొని నిమ్మ, అరటి తొక్కలు దాదాపు 12 రకాలతో తాము ప్రయోగాలు నిర్వహించామని.. కృత్రిమ రంగులు, లోహాల వంటి కాలుష్యాలను తొలగించేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త సిండీ సామెత్ తెలిపారు. ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే అవొకాడో తొక్కను ఉపయోగించినప్పుడు నీటిలో కలిసిన నీలి రంగు (మిథిలీన్ బ్లూ) రెండు గంటల్లో అడుగుకు చేరిపోయిందని సామెత్ తెలిపారు. మూడేళ్ల క్రితం సురేశ్ వలియవీటిల్ అనే శాస్త్రవేత్త చేసిన పరిశోధనల ఆధారంగా తాము ప్రయోగాలు నిర్వహించామని కాయగూరలు, పండ్ల తొక్కలను ముందుగా నీటిలో ఉడకబెట్టి ఆ తరువాత ఆరబెట్టి పొడి చేశామని చెప్పారు. నిమ్మ విత్తనాలు నీటిలోని సీసపు అయాన్లను పూర్తిగా తొలగించగలిగాయని, తొక్కలను ఉపయోగించినప్పుడు 96.4 శాతం అయాన్లు మాత్రమే వేరు పడ్డాయని సామెత్ వివరించారు. శుద్ధమైన తాగునీటికి కొరత ఉన్న చోట్ల ఇలాంటి చౌక పద్ధతులను ఉపయోగించడం ఎంతో మేలు చేస్తుందని అన్నారు. -
పూవై పూచే పెళ్లిపత్రిక!
ఎంతో ప్రయాసపడి, దూరతీరాల నుంచి ఇల్లిల్లూ వెతుక్కుంటూ వచ్చి పెళ్లి పత్రిక ఇచ్చి వెళ్లాక దాన్ని మనమేం చేస్తాం. అదెంత ఖరీదైనదైనా మహా అయితే పెళ్లి రోజు వరకూ ఉంచి ఆ తరువాత ఊడ్చి పారేస్తాం. అలా కాకుండా అందరూ భద్రంగా దాచుకునేలా తన కూతురి పెళ్లి పత్రికను తయారుచేయాలనుకున్నారు కేరళకు చెందిన ఓ ఎమ్మెల్యే. కేరళ తానూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అబ్దుర్ రహ్మాన్ తన కుమార్తె రిజ్వానా షేరిన్ రిసెప్షన్కు వచ్చే అతిథులను ప్రత్యేకంగా ఆహ్వనించాలనుకున్నారు. తమ ఇంటి పెళ్లి పిలుపు వాళ్లింట్లో ఓ జ్ఞాపకంగా మిగిలిపోతే బావుంటుందని భావించారు. అందుకే స్క్రీన్ ప్రింటెడ్ వెడ్డింగ్ ఇన్విటేషన్ను ఎకో ఫ్రెండ్లీగా తీర్చిదిద్దారు. అన్ని రంగులూ అద్దుకొని గుండెలనిండా ఆహ్వానించే నిండైన పెళ్లి పత్రికను తయారు చేశారు. కాకపోతే మీరు చదివాక లేదా పెళ్లి అయిపోయాక దాన్ని పూడ్చిపెట్టాలని రాసి మరీ ఇచ్చారు. ఎందుకంటే అందులోని రకరకాల పూల విత్తనాలు లేదా కూరగాయల విత్తనాలు ప్రేమతో మొలకెత్తాలంటే పత్రికను మట్టిలో పెట్టి సూర్యరశ్మి పడేలా కుండీలో ఉంచి నీళ్లు పోస్తే సరి. ఎమ్మెల్యేగారి పెళ్లి పత్రిక మీ ఇంట్లో ఏ గులాబీ మొక్కగానో లేక చామంతిగానో మొలుస్తుంది. క్యారెట్టో, పాలకూరగానో పెళ్లి జ్ఞాపకాన్ని పదే పదే గుర్తుచేస్తుంది. అది పూచిన ప్రతిసారీ ఆ జ్ఞాపకం మీ మదిలో ఆనందమై విరుస్తుంది. అయితే ఇది తయారు చేయడం కాస్త శ్రమతో కూడుకున్నదే. రీసైకిల్ చేసేందుకు వీలైన అట్టలో పలు రకాల విత్తనాలు పొందుపరిచి మరీ ఈ పెళ్లి పత్రికను రూపొందించాలి మరి. అయితేనేం ఈ పత్రిక తయారీ కుటీర పరిశ్రమ ద్వారా పది మందికి అన్నంపెడుతున్నప్పుడు అంటారు ఎమ్మెల్యే సారు. -
ఈ– స్కూటర్, విత్తనాల మిషన్
శివాజీనగర: సప్తగిరి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు బ్యాటరీతో నడిచే స్కూటర్, రైతులకు ఉపయోగపడే పంట విత్తనాల మిషన్ను మంగళవారం ప్రెస్క్లబ్లో ప్రదర్శించారు. పాత బజాజ్ చేతక్ను ఈ–స్కూటర్గా మార్చేశారు. ఇందుకు సుమారు రూ.12 వేలు ఖర్చు అయింది. ఎలాంటి కాలుష్యం వెదజల్లదు. గంటకు 30– 35 కిలోమీటర్ల వేగంతో వెళ్లవచ్చు. ఒకసారి బ్యాటరీని చార్జ్ చేయటానికి 4– 5 గంటల సమయం పడుతుంది. కేవలం 3.5 యూనిట్ల విద్యుత్ చాలని చెప్పారు. ఇక వ్యవసాయ పరికరంతో బహుళ ప్రయోజనాలున్నాయి. సులువుగా విత్తనాలు వేయవచ్చు. దీని వ్యయం రూ.600–800 మాత్రమేనని విద్యార్థులు తెలిపారు. విద్యార్థులు బీ.భరత్కుమార్, బీ.హేమంత్కుమార్, వీ.లోకనాథ్, పీ.మంజునాథ్, కాలేజీ అధ్యాపకులు పాల్గొన్నారు. -
అందుబాటులో విత్తనాలు, ఎరువులు: పోచారం
సాక్షి, హైదరాబాద్: రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులోనే ఉన్నాయని క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేవని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో శనివారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. వర్షాధార పంటల సాగు ఆశాజనకంగానే ఉందని, ప్రాజెక్టులు, చెరువుల్లోకి ఇంకా నీరు రానందున వరి నాట్లు మందకొడిగా సాగుతున్నాయని మంత్రి చెప్పారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంటుందన్నారు. వ్యవసాయ యాం త్రీకరణకు ఈ ఏడాది అధిక నిధులను కేటాయించామని, విత్తనం వేసిన దగ్గర నుంచి పంట కోతల వరకు అన్ని పనులు యంత్రాలతోనే జరి గేలా చూడాలని మంత్రి సూచించారు. యం త్రాల ద్వారా సాగు ఖర్చు తగ్గడంతో పాటు కూలీల కొరతను కూడా అధిగమించ వచ్చన్నారు. ప్రతి 5 వేల ఎకరాలను ఒక క్లస్టర్గా విభజించి ఒక్కో క్లస్టర్కు వ్యవసాయ విస్తరణ అధికారిని(ఏఈఓ) నియమించినట్లు చెప్పారు. ప్రతి క్లస్టర్లో సాగుకు అవసరమైన యంత్రాల వివరాలను అధికారులు రూపొందించాలన్నారు. రైతు వేదికల నిర్మాణం వేగం పుంజుకోవాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి, కమిషనర్ ఎం.జగన్మోహన్, పాల్గొన్నారు. -
24న విత్తన మేళా
రైతులకు నాణ్యమైన విత్తనం అందించే లక్ష్యంతో ఈ ఏడాది మే 24(గురువారం)న హైదరాబాద్ రాజేంద్రనగర్తో పాటు.. పాలెం, జగిత్యాల(పొలాస), వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాల్లో విత్తన మేళా నిర్వహిస్తున్నట్లు ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం విత్తన సంచాలకులు డాక్టర్ నగేష్ కుమార్ తెలిపారు. విశ్వవిద్యాలయంలో రూపొందించిన 9 రకాల ఖరీఫ్ పంటల విత్తనాన్ని రైతులకు విక్రయిస్తారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన విత్తనాలతో పాటు భారతీయ నూనె గింజల పరిశోధనా సంస్థ, భారతీయ వరి పరిశోధనా సంస్థ, భారతీయ చిరుధాన్య పరిశోధనా సంస్థలు రూపొందించిన ఫౌండేషన్, సర్టిఫైడ్ విత్తనాలను రైతులకు విక్రయిస్తారు. వరి 4 సన్న రకాలు(ఆర్.ఎన్.ఆర్.15048, బీపీటీ 5204 సహా), వరి 3 దొడ్డు రకాలు, మొక్కజొన్న–డి.హెచ్.ఎం. 117, పాలమూరు జొన్న(సి.ఎస్.బి. 31), కందులు 3 రకాలు, పెసలు 4 రకాలు, మినుములు–పి.యు.31, ఆముదాలు–పి.సి.హెచ్. 111, నువ్వులు –స్వేత విత్తనాలను ఒకే చోట రైతులకు విక్రయిస్తారు. వివరాలకు.. 8008404874 నంబరులో సంప్రదించవచ్చు. 27న పశుగ్రాసాల సాగుపై రైతులకు శిక్షణ పశుగ్రాసాల పెంపకంపై రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు రైతు శిక్షణా కేంద్రంలో ఈ నెల 27(ఆదివారం)న శిక్షణ ఇవ్వనున్నారు. సూపర్ నేపియర్ పశుగ్రాసం సాగుపై రైతు సీతారామశాస్త్రి, గన్నవరం పశువైద్య కళాశాల ప్రొఫెసర్ డా.వెంకట శేషయ్య శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 97053 83666, 0863–2286255 నంబర్లలో సంప్రదించవచ్చు. లాంఫాంలో అమ్మకానికి మిరప విత్తనాలు గుంటూరు సమీపంలోని ఉద్యాన పరిశోధన స్థానం లాంఫాంలో ఎల్సీఏ–620, ఎల్సీఏ–625, సీఏ–960 (సింధూర్) మిరప రకాల ఫౌండేషన్ విత్తనాలను అమ్ముతున్నట్టు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎల్. నారంనాయుడు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విత్తనాలు అమ్ముతున్నారు. కిలో విత్తనం ధర రూ.800గా నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్తోపాటు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కూడా ఈ విత్తనాలను విక్రయిస్తామని తెలిపారు. వివరాలకు ఉద్యాన శాస్త్రవేత్త డా. సి. వెంకటరమణ – 94405 92982. -
తూనిక.. రైతు రక్షణకు పూనిక
సాక్షి, హైదరాబాద్: విత్తనాలు, ఎరువుల కొనుగోలులో రైతులు మోసపోకుండా తూనికలు, కొలతల శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. 4 రోజులుగా విస్తృత తనిఖీలు చేపట్టింది. కొన్ని విత్తన కంపెనీలు నిబంధనలను ఉల్లంఘించి నడుస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. చాలావాటికి తయారీ లైసెన్సు లేకపోవడమేకాకుండా తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఎరువుల బస్తాలపై బరువు సూచికల్లో వ్యత్యాసాలున్నట్లుగా కూడా గుర్తించారు. విత్తనాల తయారీ.. గడువు వివరాలు కూడా సంచులపై లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. తయారీ లైసెన్సులు లేకుండానే కొందరు వ్యాపారం చేస్తున్నట్లు, తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నట్లు తనిఖీల్లో వెల్లడైందని కంట్రోలర్ అకున్ సబర్వాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి గడిచిన 3 రోజులుగా జరిపిన తనిఖీల్లో 154 కేసులు నమోదు చేసి, రూ. 2.35 కోట్ల విలువ చేసే విత్తనాలను సీజ్ చేశారు. ఈ కంపెనీలపై జరిమానాలు విధిస్తామని పేర్కొన్నారు. ఇదేవిధంగా మోసాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా అరెస్టులు చేస్తామని హెచ్చరించారు. ఖరీఫ్ సీజన్ను దృష్టిలో పెట్టుకొని నిరంతరం తనిఖీలను కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. విత్తన కంపెనీల మోసాలకు సంబంధించి ఏ మాత్రం సమాచారమున్నా రైతులు వెంటనే వాట్సప్ నంబర్కు 73307 74444కు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. -
ఖరీఫ్ విత్తనాలు రెడీ
సాక్షి, హైదరాబాద్: రానున్న ఖరీఫ్కు అవసరమైన విత్తనాలను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. మొత్తం 7.5 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు రెండు లక్షల క్వింటాళ్లు అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. మిగతా ఐదున్నర లక్షల క్వింటాళ్లను నెలాఖరులోగా అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నాయి. ముందస్తుగా రైతులకు జీలుగ, పిల్లిపెసర విత్తనాలు అవసరం. ఈ మేరకు జీలుగ విత్తనాలను 50 వేల క్వింటాళ్లను సరఫరా చేశారు. అలాగే 10 వేల క్వింటాళ్ల పిల్లిపెసర విత్తనాలను అందుబాటులో ఉంచారు. వరి విత్తనాలను కూడా జిల్లాలకు పంపించారు. సోయాబీన్ విత్తనాలను మాత్రం ఇంకా సన్నద్ధం చేయలేదని తెలిసింది. ఈనెల 15వ తేదీ నుంచి మిగిలిన విత్తనాలను కూడా రైతులకు అందుబాటులో ఉంచుతామని అధికారులు చెబుతున్నారు. సోయాబీన్ విత్తనాలను మొత్తంగా 2 లక్షల క్వింటాళ్లు సరఫరా చేయనున్నారు. 20 వేల క్వింటాళ్ల వేరుశనగ, 80 వేల క్వింటాళ్ల మొక్కజొన్న విత్తనాలను సరఫరా చేస్తారు. 20 వేల క్వింటాళ్ల కంది, 12 వేల క్వింటాళ్ల పెసర, 6 వేల క్వింటాళ్ల మినుములను సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. మొత్తంగా 17 రకాల విత్తనాలను ఖరీఫ్, రబీలకు ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేయనుంది. మరోవైపు ప్రైవేటు విత్తన కంపెనీలు బీజీ–2, బీజీ–3 పత్తి విత్తనాలను ప్రాసెసింగ్ చేసి ప్యాకింగ్ ప్రక్రియలో నిమగ్నమై ఉన్నాయి. ఆ రెండు విత్తనాలూ గత ఖరీఫ్లో విఫలమైన సంగతి తెలిసిందే. అయినా రైతు ముంగిటకు అనుమతిలేని విషపూరితమైన బీజీ–3 విత్తనాలు వచ్చి చేరుతున్నాయి. -
చుక్కకూర విత్తనాల సేకరణ ఎలా?
► మన విత్తనాలను మనం కట్టుకోవడం మంచిది. మార్కెట్లో దొరికే విత్తనాలు ఒక్కోసారి మొలవవు. మొలిచినా బూడిద తెగులువి అయ్యుండే ప్రమాదం ఉంటుంది! చక్కని ఆరోగ్యవంతమైన విత్తనాలను మనం మన తోటలోనే కట్టుకోవడం మంచిది. ► చుక్క కూర పూత దశకు రాగానే రెండు, మూడు బలమైన ఆరోగ్యవంతమైన మొక్కలను విత్తనం కోసం వదలాలి. వాటిని కొయ్యకూడదు. ► పువ్వుల మధ్యలో విత్తనాలు ఉంటాయి. చిన్న చిన్న స్పాంజి ముక్కల్లా కనిపిస్తాయి. గాలి ద్వారా వ్యాప్తి చెందే విత్తన రకం చుక్కకూర! ► పువ్వులు క్రమంగా ఎండుతాయి. బాగా ఎండిన తరువాత పువ్వుల గుత్తులను కొయ్యాలి. మరో రెండు రోజులు బాగా ఎండబెట్టాలి. తరువాత కుండలో నిల్వ చేసుకోవడం మంచిది! పైన మూత పెట్టుకోవాలి. వెంటనే కానీ తరువాత కానీ ఎప్పుడు అవసరం పడితే అప్పుడు నాటుకోవచ్చు. ఈ దిగువ విత్తనాలు వందల మందికి ఇవ్వవచ్చు. అలా ఇస్తున్నాం కూడా, మా మిద్దెతోట చూడ వచ్చిన వారికి! – తుమ్మేటి రఘోత్తమరెడ్డి, మిద్దె తోటల నిపుణులు -
రాష్ట్రంలో బీజీ–3కి ఓకే!
సాక్షి, హైదరాబాద్: పర్యావరణానికి, జీవ వైవిధ్యానికి ముప్పుగా ఆందోళన వ్యక్తమవుతున్న బీజీ–3 పత్తిని రాష్ట్రంలో అనుమతించేందుకు రంగం సిద్ధమవుతోంది. పలు షరతులతో బీజీ–3కి అనుమతి ఇచ్చేందుకు వ్యవసాయ శాఖ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. బీజీ–2 పత్తి విత్తనాల్లో ఐదు శాతం వరకు బీజీ–3 విత్తనాలు కలిపి విక్రయించేందుకు అనుమతివ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరనున్నట్టు సమాచారం. వచ్చే నెల మూడో తేదీన ఢిల్లీలో బీజీ–3పై కేంద్ర ప్రభుత్వం ‘క్షేత్రస్థాయి తనిఖీలు, శాస్త్రీయ మూల్యాంకన కమిటీ (ఎఫ్ఐఎస్ఈసీ)’సమావేశం నిర్వహించనుంది. ఆ భేటీలో బీజీ–3కి అనుమతిపై ప్రతిపాదన చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ యోచిస్తున్నట్టు తెలిసింది. కేంద్రం ఆమోదం తెలిపితే రాష్ట్రంలో బీజీ–3 పత్తి విత్తనానికి అధికారిక ఆమోదం లభించినట్లేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. జన్యు మార్పిడి చేసి.. పత్తిని పట్టి పీడించే గులాబీరంగు పురుగును తట్టుకునేలా జన్యుమార్పిడి చేసిన బీజీ–1 (బీటీ–1) టెక్నాలజీని 2002లో మోన్శాంటో దేశంలో ప్రవేశపెట్టింది. కానీ బీజీ–1 విత్తనాలు 2006 నాటికే గులాబీరంగు పురుగును తట్టుకునే శక్తిని కోల్పోయాయి. దీంతో మోన్ శాంటో మరిన్ని జన్యువులను మార్చి బీజీ–2 పత్తి విత్తనాన్ని తీసుకొచ్చింది. దానికి కూడా 2012 నాటికి గులాబీరంగు పురుగును తట్టుకునే శక్తి నశించింది. తర్వాత గులాబీరంగు పురుగును నాశనం చేసే విష రసాయనం పత్తి మొక్కల్లోనే ఉత్పత్తయ్యేలా జన్యు మార్పిడి చేసి బీజీ–3 పత్తి విత్తనాన్ని అభివృద్ధి చేసింది. దీంతోపాటు పత్తిలో కలుపును నాశనం చేసేందుకు గ్లైఫోసైట్ అనే రసాయనాన్ని తీసుకొచ్చింది. వీటివల్ల పర్యావరణం దెబ్బతింటుందని, జీవ వైవిధ్యానికి నష్టం జరుగుతుందని నిర్ధారణ కావడంతో దేశంలో బీజీ–3ని ప్రవేశపెట్టేందుకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. బీజీ–2లో కలిపి అమ్ముకునేలా.. దేశంలో బీజీ–3కి అధికారికంగా ఎలాంటి అనుమతీ లేకున్నా.. మోన్శాంటో పలు కంపెనీల ద్వారా ప్రయోగాత్మక పరిశీలన పేరుతో బీజీ–3ని రైతులకు అంటగట్టింది. రైతులు బీజీ–3 పత్తిని పండించడం, తర్వాత ఈ పత్తి ద్వారా విత్తనాలు మరింతగా విస్తరించుకుంటూ పోవడం మొదలైంది. కొన్ని కంపెనీలు ఏవేవో పేర్లతో బీజీ–3 విత్తనాలను అమ్ముతున్నట్టు వెల్లడికావడంతో.. వాటిపై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంది. దాంతో చివరికి కంపెనీలు కొత్త కుట్రకు తెరతీశాయి. బీజీ–2 విత్తనాల్లో 10 శాతం వరకు బీజీ–3 విత్తనాలు ఉండేందుకు అనుమతించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. వాస్తవానికి బీజీ–2లో నూటికి నూరు శాతం ఆ రకం విత్తనాలే ఉంటాయి. ఒక్క బీజీ–3 విత్తనం ఉన్నా కల్తీ కిందే లెక్క. అలాంటిది ఐదు శాతం కలపడానికి ఓకే చెబితే.. కంపెనీలు అధికారికంగా కల్తీ చేయడానికి అనుమతి ఇవ్వడమేనన్నమాట. రాష్ట్రంలో ఖరీఫ్లో కోటికిపైగా పత్తి విత్తన ప్యాకెట్లు వినియోగిస్తారు. ఐదు శాతానికి అనుమతిస్తే.. 5 లక్షల ప్యాకెట్ల మేర బీజీ–3 విత్తనాలు ఉంటాయి. ఇప్పటిదాకా దొంగతనంగా బీజీ–3 విత్తనాలు అమ్ముకున్న కంపెనీలు.. ఇక అధికారికంగా విక్రయించుకునేందుకు రంగం సిద్ధమైనట్టే! పట్టించుకోని సర్కారు రాష్ట్రంలో రెండు మూడేళ్లుగా బీజీ–3 పత్తి సాగవుతోందని ఇప్పటికే పలుమార్లు నిర్ధారించారు. కానీ ప్రభుత్వం, వ్యవసాయ శాఖ పెద్దగా పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. బీజీ–3 నియంత్రణపై కేంద్రం ఒత్తిడి చేయడంతో వ్యవసాయ శాఖ ఒక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసి.. చేతులు దులుపుకొందనే విమర్శలు వస్తున్నాయి. అయితే బీజీ–3 విషయంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో వ్యవసాయ శాఖ కమిషనర్ ఎం.జగన్మోహన్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇందుకోసం స్టేట్ బయోటెక్నాలజీ కో–ఆర్డినేషన్ కమిటీ (ఎస్బీసీసీ) ఏర్పాటు చేయాలని సూచించారు. కానీ ఇప్పటివరకు కమిటీ ఏర్పాటుకాలేదు. ఇక ప్రమాదకరమైన గ్లైపోసైట్ కలుపు మందును నిషేధించాలని వ్యవసాయ శాఖ కోరినా.. సర్కారు అనుమతివ్వలేదు. అయితే ‘‘బీజీ–3ని రైతులు కూడా వ్యతిరేకించడం లేదు. చాటు మాటుగా బీజీ–3 విక్రయాలు జరుగుతున్నాయి. దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. కేంద్రం చెబుతోంది కాబట్టి వీలైన మేర చర్యలు తీసుకుంటున్నాం..’’అని వ్యవసాయశాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొనడం గమనార్హం. -
కడప పసుపు @ తూములూరు
కొల్లిపర: వైఎస్సార్ కడప జిల్లా నుంచి కొల్లిపర మండలంలోని తూములూరు గ్రామానికి పసుపు విత్తనం దిగుమతులు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు పది వేల పుట్ల వరకు మేలురకం విత్తనం దిగుమతి చేసుకున్నారు. జూన్ చివరి నుంచి గ్రామంలో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. పుట్టి సుమారు రూ.4000 వరకు పలికే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొల్లిపర మండలంలోని రైతులు వైఎస్సార్ కడప జిల్లా నుంచి పసుపు విత్తనాన్ని దిగుమతి చేసుకుని ఇక్కడి నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. పసుపు విత్తన క్రయవిక్రయాలకు తూములూరు గ్రామం కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది. 35 ఏళ్లుగా కడప జిల్లాలో పండిన పసుపును విత్తనం నిమిత్తం తూములూరు గ్రామానికి తెచ్చి విక్రయిస్తున్నారు. ఏటా 17 వేల నుంచి 18 వేల పుట్ల వరకు వచ్చి పసుపు విత్తనం గ్రామానికి దిగుమతి అవుతుంది. ఒక పుట్టికి 225 కిలోలు ఉంటుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఒడిశా నుంచి రైతులు ఇక్కడ వచ్చి కొనుగోలు చేస్తారు. నాణ్యమైన విత్తనంతో పాటు సరైన కాటా, నమ్మకం ఉండటంతో విత్తనం అమ్మకానికి మార్కెట్ ఏర్పడింది. పసుపు వ్యాపారానికి ప్రతి ఏటా కాటా పాట జరుగుతుంది. దీనికి సంబంధించిన రాబడి గ్రామ పంచాయతీకి చెల్లిస్తారు. దీని ద్వారా గ్రామంలో 250 మందికి మూడు నెలలు పాటు ఉపాధి లభిస్తోంది. పసుపు విత్తనంలో రకాలు.. పసుపు విత్తనంలో పలు రకాలు ఉన్నాయి. టేకూరుపేట, బాక్రాపేట, సేలం, సుగంధ, కడప, ప్రగడవరం వంటి రకాలు ఇక్కడ దిగుమతి అవుతాయి. ప్రగడవరం రకం ఏలూరు, ద్వారకాతిరుమల ప్రాం తాల్లో, సుగంధ రకం జిల్లాలోని పల్నాడు, కృష్ణా జి ల్లా నందిగామ ప్రాంతాలకు ఎగుమతి అవుతా యి. సేలం రకం లంక గ్రామాలతో పాటు కొల్లిపర మం డల పరిసర ప్రాంతాల్లో విస్తారంగా పండిస్తారు. నాలుగేళ్లుగా నిరాశే.... గత నాలుగేళ్లుగా ఎండు పసుపుకు గిట్టుబాటు ధర లేక పోవటంతో రైతుల్లో ఆసక్తి కొరవడింది. కౌలు ఎకరాకు రూ.50 వేలకు ఉండడం, కూలీ రేట్లు, ఎరువుల ధరలు ఆమాంతం పెరగటంతో రైతులు పసుపు సాగు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. గతేడాది కడప వ్యాపారస్తులు 17 వేల పుట్లు నిల్వ ఉంచగా, ఆశించిన ధర పలకకపోవడంతో నష్టాలను చవిచూశారు. ఈ ఏడాది ప్రారంభంలో మార్కెట్లో ఎండు పసుపు ధర రూ.5,500 పలికింది. ప్రస్తుతం మోడల్ ధర రూ.5 వేలు ఉంది. ప్రస్తుతం కడపలో క్వాలిటీని బట్టి పుట్టు రూ.3 వేల నుంచి రూ.4,500 ధర పలుకుతోంది. కడప విత్తనానికి గిరాకీ.. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో రైతులు విత్తన మా ర్పిడికి వైఎస్సార్ కడప జిల్లాలో పండిన పసుపు ను వాడతారు. దీంతో క డప పసుపు విత్తనానికి గిరాకీ ఉంది. గిట్టుబాటు ధర, అన్ని సౌకర్యాలు ఉండటంతో ఇక్కడ క్రయవిక్రయాలకు ఆసక్తి చూపుతాం. మహారాష్ట్ర సాంగ్లీ ప్రాంతంలో పసుపు కాయలను, ఇక్కడ పసుపు కొమ్ములను విత్తనంగా సాగు చేస్తారు. కొమ్ముల ను ఇక్కడికి, కాయలను సాంగ్లీకి ఎగుమతి చేస్తాం.-ఎ.సుబ్బన్న, రైతు, మైదుకూరు, కడప జిల్లా -
గ్రామగ్రామాన ‘పెట్టుబడి’ దందా!
మహబూబాబాద్ జిల్లా కేంద్రం సమీప గ్రామంలో పదెకరాల భూమి ఉన్న రైతు కృష్ణమోహన్. రైతు బంధు పథకం కింద ఎకరాకు రూ.4 వేల చొప్పున వస్తుందని ఆశపడుతున్నాడు. ఇటీవల ఓ రోజు ఆ గ్రామ కార్యదర్శి ఫోన్ చేసి ఎకరానికి రూ.400 చొప్పున రూ.4 వేలు ఇస్తేనే పెట్టుబడి సొమ్ము వస్తుందని, లేకుంటే తామేమీ చేయలేమని బెదిరించాడు. రూ.4 వేలు కోసం రూ.40 వేల పెట్టుబడిని పోగొట్టుకోలేక ఆ రైతు గ్రామ కార్యదర్శికి అడిగినంత ముట్టజెప్పుకున్నాడు. మరో రైతు రంగారెడ్డి. ఖమ్మం జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈయన గ్రామం. ఇప్పటివరకు భూములకు పట్టాలివ్వలేదు. ఈ నేపథ్యంలో పట్టాదారు పాసు పుస్తకం రావాలన్నా, పెట్టుబడి సొమ్ము అందాలన్నా ఎకరానికి రూ.500 ఇవ్వాలని స్థానిక రెవెన్యూ అధికారి ఒకరు డిమాండ్ చేస్తున్నారని ఆయన చెబుతున్నాడు. దీంతో గత్యంతరం లేక లంచం ముట్టజెప్పుకునేందుకు రంగారెడ్డి సిద్ధమయ్యాడు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెట్టుబడి దందా సాగుతోంది. వచ్చే నెల 19వ తేదీ నుంచి రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.4 వేల చొప్పున అందజేసేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. 1.62 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సొమ్ము అందజేయనున్నారు. సమయం సమీపిస్తుండటంతో అనేకచోట్ల అధికారులు దందాలు మొదలుపెట్టారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖలకు చెందిన అధికారులు కొందరు లంచాలు వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. లంచాలు ఇవ్వకుంటే అడ్డుపుల్ల వేస్తారన్న భయంతో రైతులు గత్యంతరం లేక అడిగినంత ఇచ్చేస్తున్నారు. ఈ వ్యవహారం చాపకింద నీరులా జరుగుతోంది. ఇలా అధికారులు లంచం తీసుకున్నారని తమ పేరు, గ్రామం వెల్లడిస్తే పెట్టుబడి సొమ్ము రాదని రైతులు వేడుకుంటున్నారు. లంచం ఇచ్చినా బయటకు చెప్పడానికి నిరాకరిస్తున్నారు. లంచం ఇస్తే.. మేనేజ్ చేస్తాం.. రైతులకు విత్తనాలు, ఎరువులు, ఇతరత్రా వ్యవసాయ సంబంధిత ఖర్చుల కోసం.. ఖరీ ఫ్, రబీలకు కలిపి ఎకరాకు రూ.8 వేల చొప్పు న ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. డబ్బులిస్తే రైతులకు అందుతా యో లేదోనని భావించిన సర్కారు.. చివరకు చెక్కులు ఇవ్వాలని, అవి కూడా గ్రామ సభ లో ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో చెక్కులు పంపిణీ కావడానికే ముందే రైతుల నుంచి లంచాలు వసూలు చేయాలని కొన్ని చోట్ల రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు ముందస్తు పన్నాగాలు చేస్తున్నారు. ‘నీ భూమి సాగుకు యోగ్యంగా లేదు. అలా అని రికార్డుల్లో రాసేస్తే నీకు పెట్టుబడి సాయం రాదు. లంచమిస్తే మేనేజ్ చేస్తాం’అంటూ రైతులను బెదిరిస్తున్నారు. ఇప్పటికీ ప్రభు త్వం పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వనందున రైతుల్లో ఆందోళన నెలకొంది. దీన్నే అవకాశంగా తీసుకొని రెవెన్యూ అధికారులు పలుచోట్ల ‘నీకు పట్టాదారు పాసుపుస్తకం, పెట్టుబడి సొమ్ము రావాలంటే ముట్టజెప్పుకోవాల్సిందే’ అంటూ హెచ్చరిస్తున్నారు. భయ పెడుతూ వసూళ్లు సాగిస్తున్నారు. చూసీచూడనట్లుగా రైతు సమితులు పెట్టుబడి సొమ్ము రైతులకు సక్రమంగా పంపిణీ చేయడంలో రైతు సమన్వయ సమితులు కీలకపాత్ర పోషించాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఒక్కో గ్రామంలో 15 మందితో రైతు సమితులను ఏర్పాటు చేసింది. ఆ ప్రకారం రాష్ట్రంలో 1.61 లక్షల మంది రైతు సమన్వయ సమితుల్లో సభ్యులున్నారు. అయితే గ్రామాల్లో పెట్టుబడి దందా యథేచ్ఛగా మొదలైనా రైతు సమితి సభ్యులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంపై ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో రెవెన్యూ అధికారులు రైతు సమితి సభ్యులను కూడా మచ్చిక చేసుకొని దందా కొనసాగిస్తున్నారన్న విమర్శలున్నాయి. -
రైతులే విత్తనాలు తయారు చేసుకోవాలి
ఇబ్రహీంపట్నం: రైతులే విత్తనాలు తయారు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ సలహాదారుడు ఆశోక్ అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం మనధాన్యం–మనవిత్తనం అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ రైతులు పండించిన ధాన్యం నుంచే విత్తనం తయారు చేసుకోవచ్చని తెలిపారు. మనం తయారుచేసుకున్న విత్తనాలను వెస్తే అధిక దిగుబడి సాధించవచ్చని అన్నారు. పంటలకు రసాయన ఎరువులు వాడొద్దని సేంద్రియపు ఎరువులే వాడాలని తెలిపారు. పండించిన వడ్లను రైసుమిల్లులో పట్టించి బియ్యాన్ని అమ్ముకుని లాభాలు పొందాలని సూచించారు. రైతులు సొసైటీగా ఏర్పడాలని సూచించారు. కార్యక్రమంలో రైతులు ఎలిసె పాపన్న, గుజ్జుల రమేశ్, అబ్బటి రాజరెడ్డి, నాంపల్లి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
సబ్సిడీ విత్తనాలు.. 12 లక్షల క్వింటాళ్లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే వ్యవసాయ సీజన్కు 12 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రైతులకు సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఆయా విత్తనాలను ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై సరఫరా చేయనుంది. ఖరీఫ్కు 7.5 లక్షలు, రబీకి 4.5 లక్షల విత్తనాలను సరఫరా చేయనుంది. 2017–18 వ్యవసాయ సీజన్లో 10 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, 2018–19 సీజన్లో అదనంగా 2 లక్షల క్వింటాళ్లు సరఫరా చేయాలని నిర్ణయించింది. వచ్చే ఖరీఫ్ నుంచి ప్రభుత్వం రైతులకు పెట్టుబడి పథకాన్ని వర్తింప చేయనున్న నేపథ్యంలో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముంది. ప్రభు త్వ అంచనా ప్రకారం 1.62 కోట్ల ఎకరాల సాగుభూమి ఉంది. సాగు పెరుగనున్న క్రమం లో విత్తన పరిమాణం కూడా పెంచినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. 17 రకాల విత్తనాలను ఖరీఫ్, రబీలకు ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేయనుంది. వీటిని 33 నుంచి 50 శాతం వరకు సబ్సిడీపై రైతులకు అందిస్తుంది. రైతు కోరుకునే విత్తనాలేవీ? ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేసే కొన్ని రకాల విత్తనాలను రైతులు పెద్దగా కోరుకునే పరిస్థితి లేదు. మొక్కజొన్నలో కొన్ని హైబ్రిడ్ రకాలకు బాగా డిమాండ్ ఉంది. ప్రభుత్వం సరఫరా చేసే మొక్కజొన్నకు డిమాండ్ లేకపోవడంతో రైతులు పెద్దగా కొనుగోలు చేసే పరిస్థితి లేదు. -
ఉడతా ఉడతా ఊచ్.. ఆటలు ఆడుదామోచ్..!
ఆటలు మనుషులకేనా.. మీకే ఒలింపిక్స్ గేమ్స్ ఉంటాయా.. మేమూ ఆడతాం అంటూ చాలెంజ్ చేస్తున్నాయి ఈ ఉడతలు. అంతేకాదు ఐస్ స్కేటింగ్ వంటి గేమ్స్ కూడా ఆడేస్తున్నాయి. ఆడటమే కాదు ఒలింపిక్స్ పతకాలను కూడా గెలుచుకున్నాయి. ఉడతల ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయబ్బా.. ఎక్కడా వినలేదే అనుకుంటున్నారా.. అవును ఒలింపిక్స్ ఏం జరగలేదు. ఇదంతా గీర్ట్ వెగెన్ అనే ఫొటోగ్రాఫర్ మాయాజాలం. తన ఇంటికి వచ్చే ఉడతలకు కొన్ని తిండి గింజలు వేసి.. వాటితో పాటు చిన్న చిన్న ఆటవస్తువులు కూడా పెట్టేవాడు. వాటిని తినేందుకు వచ్చే ఉడతలు.. ఆట వస్తువులపైకి ఎక్కినపుడు ఈ ఫొటోలను తీశాడు. చాలా అద్భుతంగా ఉన్నాయి కదూ..! అయితే వాటిని చూసినంత సులువేం కాదు ఫొటోలు తీయడం అంటే.. ఈ ఫొటోల వెనుక చాలా కష్టం దాగి ఉందని చెబుతున్నాడు వెగెన్. దాదాపు 5 ఏళ్లుగా ఈ ఉడతల ఫొటోలను తీస్తున్నాడట. ఇప్పుడు అవి తనకు మంచి స్నేహితులుగా మారాయని మురిసిపోతున్నాడు. -
పరిశోధనలు చేయాలి
సాక్షి, మోర్తాడ్(బాల్కొండ): పసుపు పంట తవ్వకాలు మొదలైన నేపథ్యంలో దిగుబడులు, నాణ్యతలపై పరిశోధన జరిపితే రైతులకు ఎన్నో ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందనే శాస్త్రవేత్తల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఉన్న పసుపు పరిశోధన కేంద్రాల ఆధ్వర్యంలో ఇప్పుడు తవ్వుతున్న పసుపు పంట దిగుబడులు, నాణ్యత ఆంశాలను దృష్టిలో ఉంచుకుని పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని రైతులు కూడా చెబుతున్నారు. గతంలో రైతులు సాంప్రదాయ పద్దతిలోనే పసుపు పంటను సాగు చేసేవారు. అంతేకాక ఎర్రగుంటూర్, ఆర్మూర్ రకం పసుపు విత్తనాలను ఎక్కువగా వినియోగించేవారు. ఇప్పుడు మాత్రం ఏసీసీ 79, ప్రతిభ రకం తదితర కొత్త పసుపు వంగడాలను వినియోగించి పంటను సాగు చేశారు. విరివిగా వినియోగించే పసుపు పసుపు వంగడాల కంటే కొత్త రకం వంగడాలను వినియోగించడం వల్ల దిగుబడుల్లో తేడా కనిపిస్తుంది. రెండేళ్ల కింద ఎకరానికి 20 క్వింటాళ్ల దిగుబడి లభిస్తే ఈ సారి వినియోగించిన కొత్త రకాల వల్ల 35 క్వింటాళ్ల దిగుబడి లభిస్తుంది. అంటే వంగడాలను మార్చడం వల్ల రైతులకు ప్రయోజనం ఏర్పడింది. పసుపు పరిశోధన కేంద్రాల్లో ప్రధానమైనది కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరిశోధన కేంద్రం ఒకటి కమ్మర్పల్లి మండల కేంద్రంలో ఉంది. అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పసుపు పరిశోధన కేంద్రాలు ధర్పల్లి, వేల్పూర్లలో ఉన్నాయి. ఈ పసుపు పరిశోధన కేంద్రాల పరిధిలో పసుపు పంట విస్తారంగా సాగు అవుతుంది. ఏ రకం పసుపు విత్తనం వినియోగిస్తే ఎంత దిగుబడి లభించింది, ఎంత నాణ్యత ఉంది అనే అంశాలపై క్షుణ్ణంగా పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో పసుపు పంటను కొనుగోలు చేసే వ్యాపారులు పసుపులోని కర్కుమిన్ శాతంను పరిగణలోకి తీసుకుంటున్నారు. కర్కుమిన్ శాతం 4.5 కంటే ఎక్కువ ఉన్న పసుపును కొనుగోలు చేయడానికి వ్యాపారులు ఆసక్తిని కనబరుస్తున్నారు. కర్కుమిన్ శాతం కూడా కొత్త రకం వంగడాలను వినియోగించి సాగు చేసిన పసుపులోనే ఎక్కువగా ఉంది. అంటే సాంప్రదాయ పద్దతిలోను, పాత రకం వంగడాలను వినియోగించి సాగు చేసిన పసుపు వల్ల రైతులకు ప్ర యోజనాలు అంతగా లేవని స్పష్టం అవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పసుపు దిగుబడులు, నాణ్యతలపై పరిశోధన జరిపి వచ్చే సీజనులో రైతులు ఎలాంటి విధానంలో ఎలాంటి రకం వంగడాలను విని యోగించాలో సూచిస్తే రైతులకు ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని పలువురు చెబుతున్నారు. -
‘సూరజ్’ సాగు సూపర్!
కరువుకు కేరాఫ్గా మారిన మెట్ట/చల్కా నేలల్లో రైతులు ఇప్పుడు దేశీ పత్తి వంగడాలతో తెల్ల బంగారం పండిస్తున్నారు. మూడేళ్ల నుంచి ఎలాంటి రసాయనిక ఎరువులను ముట్టుకోకుండా సిరుల పంటను సాగు చేస్తున్నారు. సేంద్రియ పద్ధతుల్లో, తక్కువ పెట్టుబడితో లాభాలు ఆర్జిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలంలో రైతులు సూరజ్ రకం నాన్ బీటీ – దేశీ పత్తి సాగుతో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టారు. నిత్యం కరువుతో కాలం వెళ్లదీసే జనగామ ప్రాంత చల్కా/మెట్ట భూముల రైతులు సేంద్రియ పద్ధతుల్లో దేశీ పత్తిని సాగు చేస్తున్నారు. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సుస్థిర వ్యవసాయ కేంద్రం(సి.ఎస్.ఎ.) మార్గదర్శకత్వంలో లింగాల ఘనపురం రైతులు మూడేళ్ల నుంచి సేంద్రియ పద్ధతుల్లో సూరజ్ అనే సూటిరకం నాన్బీటీ పత్తిని సాగు చేస్తున్నారు. ఆదర్శ సేంద్రియ రైతు కో ఆపరేటివ్, ఏనబావి సేంద్రియ సహకార సంఘం ఆధ్వర్యంలో.. మాణిక్యపురం, ఎనబావి, కళ్లెం, సిరిపురం, జీడికల్, వనపర్తి గ్రామాల్లోని 32 మంది రైతులు 62 ఎకరాల్లో వర్షాధారంగానే నాన్బీటీ పత్తిని సాగు చేస్తున్నారు. లింగాల ఘనపురం మండలం సిరిపురానికి చెందిన రైతు కుబర్ల గిరిబాబు డిగ్రీ వరకు చదువుకొని, పది ఎకరాల భూమిలో కొంతకాలం బీటీ పత్తి సాగు చేశారు. బీటీ పత్తి విత్తనాల వల్లనే బొంతపురుగు వంటి కొత్త కీటకాలు పంటను ఆశించి నష్టం చేస్తున్నాయనే భావనతో గిరిబాబు సి.ఎస్.ఎ. తోడ్పాటుతో పదేళ్ల క్రితం నుంచే సేంద్రియ సాగు చేపట్టారు. ఈ ఖరీఫ్లో మూడు ఎకరాల్లో నాన్బీటీ పత్తితోపాటు వరి, కంది పంటలను కూడా సాగు చేశారు. బీటీ పత్తి రైతులు రసాయనాల కోసమే అధికంగా ఖర్చు చేస్తూ అప్పులపాలవుతున్నారన్నారు. సేంద్రియ సాగులో ప్రాణాంతకమైన సమస్యలేమీ లేవన్నారు. తక్కువ పెట్టుబడితోనే పంటలు పండిస్తున్నామని, తమ పంటకు మార్కెట్లో గిరాకీ ఉందని గిరిబాబు(99126 88157) అన్నారు. సేంద్రియ సాగుతో లాభాలు ఇవీ... ► ఎలాంటి రసాయనిక ఎరువులు, పురుగు మందులు, కలుపు మందుల అవసరం లేదు. ► సూరజ్ వంటి నాన్ బీటీ, దేశీ పత్తి విత్తనాల వల్ల భూసారం దెబ్బతినదు. ► ఈ పత్తి నుంచి విత్తనాలు తీసి, మళ్లీ వాడుకోవచ్చు. ప్రతి ఏటా కంపెనీల నుంచి విత్తనాలు కొనక్కర్లేదు. ► చెరువు మట్టి, జీవామృతం, వర్మీ కంపోస్టు, పశువుల పేడ ద్వారా భూమిని సారవంతం చేస్తారు. ► వేపద్రావణం, వావిలాకు కషాయం, పచ్చిమిర్చి, వెల్లుల్లి ద్రావణం పిచికారీ చేస్తారు. నాన్ బీటీ పత్తి విత్తనాలతో రైతులకు మేలు.. ► బీటీ పత్తి విత్తనాల మాదిరిగా దేశీ పత్తి రకాల సాగులో రసాయనాల అవసరం ఉండదు. ► వర్షధారంగా ఎకరానికి 4–8 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ► పత్తిని అమ్ముకోవడానికి దూరప్రాంతాలకు వెళ్లే అవసరం లేదు. దేశీ పత్తితో వస్త్రాలు నేసే సంస్థలే నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేస్తాయి∙ ► ఎలాంటి కమీషన్లు ఉండవు. ► ప్రస్తుతం సీసీఐ క్వింటా పత్తికి రూ.4,000 చెల్లిస్తుంటే.. నాన్బీటీ పత్తికి రూ. 5,100 ధర పలుకుతున్నది. ప్రభుత్వం ప్రోత్సహించాలి! దేశీ పత్తి రకం సూరజ్ తెలుగు రాష్ట్రాల్లో వర్షాధారంగా తేలిక నేలల్లో సాగుకు అనుకూలమైనది. ఈ సంవత్సరం సహజాహారం ప్రొడ్యూసర్ కంపెనీ ఆధ్వర్యంలో కొందరు రైతులతో సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయించాం. చేనేత సంస్థలు మల్కా, అభిహార రైతుల నుంచి సూరజ్ దేశీ పత్తి(28–32 ఎం.ఎం. పింజ)ను అధిక ధరకు కొనుగోలు చేశాయి. సూరజ్ సూటి రకం కావడంతో విత్తనాలను తిరిగి వాడుకోవచ్చు. దీని సాగును ప్రభుత్వం ప్రోత్సహించాలి. తద్వారా మన చేనేత కార్మికులకు సేంద్రియ పత్తి స్థానికంగానే అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం 150 క్వింటాళ్ల వరకు సూరజ్ విత్తనాలు ఉన్నాయి. ఆసక్తిగల రైతులు సహజ ఆహారం ప్రొడ్యూసర్ కంపెనీ(85007 83300)ని గానీ, కిసాన్ కాల్ సెంటర్ (85009 83300)ను గానీ సంప్రదించవచ్చు. – డా. జీవీ రామాంజనేయులు, డైరెక్టర్ జనరల్, సుస్థిర వ్యవసాయ కేంద్రం ramoo@csa-india.org చేతి కష్టమే పెట్టుబడి! రెండు ఎకరాల్లో నాన్బీటీ పత్తిని సాగు చేస్తున్నా. మూడు సంవత్సరాల నుంచి ఇదే సాగు. వర్షం పడితేనే నీళ్లు. బోరు, బావి లేవు. డిసెంబర్ నాటికే పంట పూర్తిగా అయిపోతుంది. డిసెంబర్లో వర్షం పడితే మరో రెండు నెలలు పంట వస్తుంది. చేతుల కష్టమే పెట్టుబడి. ఇప్పటికైతే నష్టపోలేదు. డబ్బుల దగ్గర , ధర విషయంలో ఎలాంటి కిరికిరి లేదు. – మూటకోరు యాదగిరి (70324 64439), సేంద్రియ పత్తి రైతు, సిరిపురం, జనగామ జిల్లా మందులు కొనడం మానేశా! నాకు ఎకరం 20 సెంట్ల భూమి ఉంది. మూడేళ్ల నుంచి నాన్బీటీ పత్తిని వేస్తున్నా. విత్తనాల నుంచి మొదలుకొని ఎరువులు, కషాయాలు అన్నీ నావే. ఎకరానికి రూ.8 వేల వరకు పెట్టుబడి అవుతుంది. పత్తిని అమ్మితే మాత్రం రూ. 20 వేల వరకు వస్తున్నాయి. పురుగుల మందులు కొనడం పూర్తిగా మానేశాం. రవాణా ఖర్చులు, కటింగ్లు, కమీషన్లు లేవు. శరీరంపై ప్రభావం చూపే మందుల వాడకం లేదు. నీటి సౌలతి ఉంటే ఎక్కువ దిగుబడి వచ్చేది. నాన్బీటీతో లాభాలే తప్ప నష్టాలు లేవు. – చెన్నూరి ఉప్పలయ్య (95025 06186), సేంద్రియ నాన్బీటీ పత్తి రైతు, సిరిపురం, జనగామ జిల్లా – ఇల్లందుల వెంకటేశ్వర్లు, సాక్షి, జనగామ జిల్లా ఫొటోలు: గోవర్ధనం వేణుగోపాల్ -
మనసులో వేసుకోండి
ఒక రైతు విత్తనాలు చల్లాడు. చల్లుతున్నప్పుడు చెల్లాచెదురై దారి పక్కన పడిన విత్తనాలను పక్షులొచ్చి తినేశాయి. రాతి నేలపై పడిన విత్తనాలు మొలకెత్తినప్పటికీ వాటి వేళ్లకు తేమ అందక చనిపోయాయి. ముళ్ల పొదల్లో పడిన విత్తనాలు మొక్కలయ్యాయి కానీ, పొదలు కప్పివేయడంతో సూర్యరశ్మి అందక అవీ అంతరించాయి. సారవంతమైన నేలలో పడిన విత్తనాలు మాత్రమే ఏపుగా ఎదిగి, మంచి దిగుబడిని ఇచ్చాయి. ఈ కథ బైబిలులోనిది. మంచిమాటను విత్తనంతో, మానవ వివేకాన్ని సారవంతమైన నేలతో పోల్చారు జీసస్ క్రైస్ట్. ఒక మంచి మాట మన మనసులో పడి, దాని ఫలాలు మన ద్వారా సమాజానికి అందాలంటే అనేక అడ్డుంకులు ఉంటాయి. బయటి అడ్డంకులు కొన్ని, లోపలి అడ్డంకులు కొన్ని. బయటి అడ్డంకులు.. మనలోని విత్తనాలను తినేసే పక్షులు. లోపలి అడ్డంకులు.. మనలోనే మనకు ఎదురు తిరిగే శక్తులు. అశ్రద్ధ, అలక్ష్యం, అవివేకం, సోమరితనం, అసహనం, తొందరపాటు.. ఇవీ ఆ శక్తులు. బయటి శక్తుల్ని, లోపలి శక్తుల్ని ఎదుర్కొని, మనం వినిన, మనం చూసిన మంచిని మనసుకు ఎక్కించుకుంటే.. సారవంతమైన భూమిలో పడి సమృద్ధిగా పండిన పంటలా.. మన ఆలోచనలు పుష్పిస్తాయి. ఫలిస్తాయి. మానవ జీవితాన్ని సుఖశాంతులతో సుభిక్షం చేస్తాయి. రేపు ‘వరల్డ్ సాయిల్ డే’. నేల తల్లి దినోత్సవం. మంచి ఆలోచనలకు మనమొక సారవంతమైన నేలగా మారాలని తీర్మానించుకోడానికి ఇదొక మంచి సందర్భం. -
ముంబై వీధుల్లో చేజింగ్!
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ముంబై వీధుల్లో చేజింగ్ చేశారు. ఓ వ్యక్తిని సీబీక్యూ సీడ్స్ పేరుతో మోసం చేసిన నైజీరియన్ కోసం పరుగులు పెట్టారు. దాదాపు కిలోమీటరున్నర వెంటాడిన తర్వాత నేరగాడిని పట్టుకోగలిగారు. నిందితుడిని నగరానికి తరలించిన పోలీసులు శుక్రవారం జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. సైబరాబాద్ పరిధిలో నివసించే ఓ వ్యక్తికి కొన్నాళ్ల క్రితం ఫేస్బుక్ ద్వారా ఓ సందేశం వచ్చింది. అమెరికాకు చెందిన డాక్టర్ వెన్నిస్సా విల్సన్ పేరుతో పరిచయం చేసుకున్న ఓ యువతి తమకు సీబీక్యూ సీడ్స్ సరఫరా చేయాలని కోరింది. ఈ విత్తులు న్యూజిలాండ్, భారత్ల్లో మాత్రమే లభిస్తాయంటూ చెప్పింది. లాభాల్లో 50 శాతం వాటా ఇస్తాననడంతో ఈ వ్యాపారం చేయడానికి బాధితుడు అంగీకరించాడు. దీంతో విల్సన్ సదరు విత్తుల్ని మీరాశర్మ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సరఫరా చేస్తుందంటూ ఓ ఫోన్ నంబర్ ఇచ్చింది. బాధితుడు ఆ నంబర్లో సంప్రదించగా.. మీరాశర్మగా మాట్లాడిన యువతి 500 గ్రాములకు రూ.1.85 లక్షలు ఖర్చవుతుందని, ఆ మొత్తం జమ చేయమంటూ ఓ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇచ్చింది. గత నెల 23న బాధితుడు ఆ ఖాతాలోకి నగదు జమ చేశాడు. ఇది జరిగిన ఐదు రోజులకు కొరియర్లో నకిలీ విత్తనాలు వచ్చి చేరాయి. ఆపై మోసగాళ్ల నుంచి స్పందన కరువు కావడంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ ఎస్.హరినాథ్ దర్యాప్తు చేపట్టారు. బాధితుడు డబ్బు డిపాజిట్ చేసిన బ్యాంకు ఖాతా నంబర్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుల్ని పట్టుకోవడానికి ముంబై వెళ్లారు. అయితే బ్యాంకు రికార్డుల్లో ఉన్నది నకిలీ అడ్రస్గా తేలింది. ఇదిలా ఉండగా.. బాధితుడికి నిందితుల నుంచి ఓ సందేశం వచ్చింది. విత్తనాలు తీసుకుని ముంబై వస్తే వాటిని పరీక్షించి సర్టిఫికేషన్ చేయిద్దామంటూ అందులో ఉంది. దీంతో బుధవారం అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం ముంబైలోని భాండ్వా కుర్లా కాంప్లెక్స్ వద్ద కాపు కాసింది. అక్కడకు వచ్చిన ఓ నైజీరియన్ను పట్టుకోవ డానికి ప్రయత్నించగా అతడు పారిపోయే ప్రయ త్నం చేశాడు. దీంతో అతడిని వెంటాడిన సైబర్ క్రైమ్ పోలీసులు దాదాపు కిలోమీటరున్నర ఛేజ్ చేసి పట్టుకున్నారు. నిందితుడు నైజీరియా నుంచి వచ్చి ముంబైలో ఉంటున్న అబ్దుల్ మహ్మద్ అలీగా గుర్తించారు. అతడిని నగరానికి తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నారు. -
పంటకు 'మంట'
సాక్షి, హైదరాబాద్/తల్లాడ/బోయినపల్లి/బేల: ఇటు ప్రకృతి.. అటు పురుగులు.. ఓ వైపు వ్యాపారుల మాయాజాలం.. మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం.. నలువైపుల నుంచీ దాడితో పత్తి రైతు చిత్తవుతున్నాడు. ప్రకృతి పగబట్టి నట్లుగా అవసరమైనప్పుడు వాన కురవక.. వద్దనుకున్నప్పుడు వరుస వర్షాలతో అతలాకుతలం అవుతున్నాడు. సీజన్లో తొలుత మంచి వర్షాలు కురిశాయని విత్తనాలు వేస్తే.. ఆ తర్వాత వర్షాలు కురవక కొంత, నాసిరకం విత్తనాలతో మొలకెత్తక మరికొంత నష్టపోయాడు. తర్వాత వర్షాల మధ్య విరామం (డ్రైస్పెల్)తో గులాబీరంగు కాయతొలుచు పురుగు ఉధృతంగా సోకి పత్తిపంట దెబ్బతిన్నది. ఇంతా చేసి దిగుబడి దశ దాకా వస్తే.. అనవసర సమయంలో అధిక వర్షాలు పడి పత్తి రంగు మారింది, తేమ శాతం పెరిగిపోయింది. ఆఖరుకు మిగిలిన ఆ కాస్త పత్తినీ మార్కెట్కు పట్టుకొస్తే.. వ్యాపారుల మాయాజాలం, ప్రభుత్వాల నిర్లక్ష్యం, సీసీఐ అడ్డగోలు నిబంధనలు మరింతగా కుంగదీశాయి. కనీసం పత్తి ఏరే కూలీలకు సరిపడా సొమ్ముకూడా రాని దుస్థితిలో రైతులు పంట పండించిన చేతులతోనే దానికి నిప్పు పెడుతున్నారు. పత్తి ఏరడం కూడా వృథా అనుకుంటూ కన్నీళ్లతో పంటను దున్నేస్తున్నారు. పండించిన చేతితోనే నిప్పు గులాబీ పురుగు ఉధృతితో పంట దెబ్బతినడంతో ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామ రైతులు పత్తి పంటకు నిప్పు పెట్టారు. ఆదివారం గ్రామానికి చెందిన సామ నర్సారెడ్డి 9 ఎకరాలు, ఉపేందర్ 6, సునీల్ 5, కన్నె గణేశ్ 9 ఎకరాల్లో పత్తి చేనును దహనం చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఖాదర్గూడెంకు చెందిన ఔరగొండ పోశయ్య ఆరున్నర ఎకరాల్లో పత్తి పంట వేశారు. పంట దెబ్బతిని, దిగుబడి సరిగా లేక.. పంట మొత్తాన్ని తొలగించి దహనం చేసేశారు. సాగు పెట్టు బడి కోసం చేసిన అప్పులు భారం మిగిలిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ నిబంధనల శాపం పత్తి కొనుగోళ్లకు సంబంధించి భారతీయ పత్తి సంస్థ (సీసీఐ) విధించిన నిబంధనలు కఠినంగా ఉండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటీవలి వర్షాలతో రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పత్తి నల్లబడింది. అటు వాతావరణంలో మార్పులతో పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉంటోంది. దీంతో నిబంధనలకు అనుగుణంగా లేదంటూ సీసీఐ పత్తిని కొనుగోలు చేయడం లేదు. సీసీఐ నిబంధనల ప్రకారం పత్తిలో 8 శాతం తేమ ఉంటే క్వింటాల్కు రూ. 4,320కు, 9 శాతముంటే రూ. 4,277కు, 10 శాతముంటే రూ. 4,234, 11 శాతముంటే రూ. 4,190కి, 12 శాతం తేమ ఉంటే రూ. 4,147కు కొనుగోలు చేయాలి. అంతకుమించి తేమ శాతం ఉంటే సీసీఐ కొనుగోలు చేయదు. ప్రస్తుతం రాష్ట్రంలో పత్తి నాణ్యంగా ఉన్నా గాలిలో తేమ ఎక్కువగా ఉండటంతో పత్తిలోనూ తేమ శాతం ఎక్కువగా ఉంటోంది. దానిని సాకుగా చూపుతూ సీసీఐ అధికారులు పత్తి కొనుగోలు చేయడం లేదు. దీంతో వ్యాపారులు పత్తికి రూ.3 వేల నుంచి రూ.4 వేలలోపే చెల్లిస్తూ రైతులను దగా చేస్తున్నారు. కేంద్రంలో చలనం లేదు: హరీశ్రావు తేమ శాతం ఎక్కువగా ఉన్న పత్తిని, రంగు మారిన పత్తిని బీ, సీ గ్రేడ్ల కింద సీసీఐ కొనుగోలు చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా, లేఖలు రాసినా కేంద్ర ప్రభుత్వం లో చలనం లేదని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. రాష్ట్రం పత్తి రైతులకు బాసటగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పత్తి రైతుల సమస్యలపై ఆదివారం సచివాల యంలో జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులతో హరీశ్రావు సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సెప్టెం బర్, అక్టోబర్లలో కురిసిన అకాల వర్షాలకు పత్తి పంట దెబ్బతి న్నదని చెప్పారు. పత్తి రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ఇందుకు పూర్తి సహకారం అందించాలని జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులను కోరారు. నాణ్యమైన పత్తిని మద్దతు ధర కన్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేయాలని.. రంగు మారిన, ఎక్కువ తేమ ఉన్న పత్తిని కూడా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. తేమ శాతం ఒకసారి నిర్ణయించాక మళ్లీ ఎక్కువ తక్కువంటూ కోతలు వేయవద్దని, చార్జీల పేరి సొమ్ము వసూళ్లు చేయకూడదని సూచించారు. రైతులకు నష్టం కలిగించే చర్యలను సహించబోమని, క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ఇక ఇన్పుట్ సబ్సిడీ, ఇతర ప్రోత్సాహకాలకు సంబంధించి జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు పలు సమస్యలను ప్రస్తావించారని.. వాటిని సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హరీశ్రావు చెప్పారు. రైతులు కూడా తొందరపడి తక్కువ ధరకు పత్తి అమ్ముకోవద్దని.. త్వరలోనే పత్తికి మంచి డిమాండ్ ఉంటుం దని సూచించారు. రాష్ట్రంలో 80 సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని, 120 జిన్నింగ్ మిల్లులను కూడా కొనుగోలు కేంద్రాలుగా ప్రభుత్వం గుర్తించినట్టు హరీశ్రావు చెప్పారు. సమావేశంలో మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, జిన్నిం గ్ మిల్లుల అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్రెడ్డి, మార్కెటింగ్ జాయింట్ డైరెక్టర్ లక్ష్మణుడు తదితరులు పాల్గొన్నారు. గత్యంతరం లేకనే.. ‘‘సరిగా దిగుబడి లేకపోవడం, అక్కడక్కడా వచ్చిన కొద్ది పత్తి కూడా తీయాలంటే కూలీల ఖర్చుకు కూడా సరిపోయేలా లేదు. అందుకే పత్తి పంటను తీసేస్తున్నాం..’’ – గొడుగునూరి లక్ష్మీరెడ్డి, రైతు వర్షాలతో పంట దెబ్బతింది ‘‘ఈసారి పత్తి బాగా ఎదిగింది. కానీ అధిక వర్షాలతో పూత, పిందె రాలిపోతోంది. కొద్దిగా నిలిచినా ఉపయోగం కనిపించట్లేదు. అందుకే తొలగిస్తున్నాం..’’ – వేమిరెడ్డి గురవారెడ్డి, రైతు ఆశ చచ్చి.. కడుపు మండి.. గతేడాది రాష్ట్రంలో పత్తికి మంచి డిమాండ్ కనిపించింది. మద్దతు ధరకు మించి మరీ రైతుకు గిట్టుబాటు అయింది. దాంతో ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా రైతులు పత్తి పంట వైపు మొగ్గుచూపారు. దీంతో సాధారణ విస్తీర్ణం కంటే అధికంగా పత్తి సాగయింది. కానీ ప్రకృతి సహకరించలేదు. తొలుత వర్షాలు బాగానే కురిసినా.. తర్వాత డ్రైస్పెల్ ఏర్పడటం, గులాబీ కాయతొలుచు పురుగు దాడి, పత్తి దిగుబడి దశలో వర్షాలతో పంట బాగా దెబ్బ తినిపోయింది. దాంతో రైతుల ఆశలు అడియాసలయ్యాయి. చివరికి పెట్టుబడులు కూడా తిరిగిరాని పరిస్థితి ఏర్పడింది. చివరికి ఆశ చచ్చిపోయి.. కడుపు మండిన రైతులు తాము పండించిన పంటను తమ చేతులతోనే తొలగించేస్తున్నారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా దేశాయిపల్లిలో నిమ్మ అంజిరెడ్డి అనే రైతు మూడెకరాల్లోని పత్తి పంటను ట్రాక్టర్తో దున్నించేశారు. పంట ఇటీవలి వర్షాలతో రంగు మారింది. ఏరి విక్రయించినా కనీస ధర కూడా లభించే రిస్థితి లేదని.. సమీపంలోని మార్కెట్ యార్డుల్లో ఉన్న సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభం కాలేదని.. దాంతో పంటను తొలగించానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా తల్లాడ పరిసరాల్లోని పలువురు రైతులు కూడా కొద్దిరోజులుగా పత్తి పంటను ట్రాక్టర్లు, రోటవేటర్లతో దున్నించేస్తున్నారు. నారాయణపురం, తల్లాడ గ్రామాల్లో ఇప్పటికే 30 మంది రైతులు వంద ఎకరాల్లో పత్తికి కలుపు మందు కొట్టి దున్నించారు. పెనుబల్లి, కల్లూరు, వేంసూరు మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. -
‘విత్తు’లమారి మోసం!
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్ల నుంచి ఎస్ఎంఎస్, ఫోన్కాల్, ఈ–మెయిల్లను అందుకుని బాధితులుగా మారిన వారిని ఇప్పటివరకు చూశాం. కానీ ఇందుకు భిన్నంగా తన స్నేహితుడికి వచ్చిన ఈ–మెయిల్కు స్పందించి సికింద్రాబాద్కి చెందిన శ్రీనివాస్ రూ.8.5 లక్షలు నష్టపోయాడు. చివరకు వ్యవహారం నగర సైబర్ క్రైమ్ పోలీసుల వద్దకు చేరడంతో మంగళవారం ఈ మోసం వెలుగులోకి వచ్చింది. స్నేహితుడు ప్రింట్ఔట్ ఇవ్వడంతో.. శ్రీనివాస్ బ్యాకింగ్ సర్వీసెస్ కన్సల్టెంట్గా పని చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం అతని స్నేహితుడికి ఓ ఈ–మెయిల్ వచ్చింది. అమెరికాకు చెందిన ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీకి అవసరమైన విత్తనాలు (సీడ్స్) సరఫరా చేయాలంటూ ఆ కంపెనీ అధికారి కోరినట్లు అందులో ఉంది. ఉద్యోగస్తుడైన స్నేహితుడు తనకు వ్యాపారం చేసే అవకాశం లేదని భావించి ఆ మెయిల్ ప్రింట్ఔట్ను శ్రీనివాస్కు ఇచ్చి వ్యాపారం చేసుకోమన్నాడు. దీంతో అందులోని ఐడీతో శ్రీనివాస్ సంప్రదింపులు ప్రారంభించాడు. సమాధానమిచ్చిన సైబర్ నేరగాడు తమ కంపెనీ భారత్లోని ఏజెంట్ ద్వారా వ్యవసాయదారుల నుంచి సీడ్స్ ఖరీదు చేస్తోందంటూ చెప్పాడు. ఆ ఏజెంట్ ఇటీవలే మరణించడంతో మరో ఏజెంట్ కోసం వెతుకుతున్నట్లు చెప్పడంతో శ్రీనివాస్ పూర్తిగా వారి వలలో పడ్డాడు. కంపెనీకి తెలిస్తే తనకు ఇబ్బందంటూ.. ఆ విత్తనాలను ఉత్పత్తి చేసే వారి వివరాలు సైతం తనకు తెలుసంటూ సైబర్ నేరగాడు ఎర వేశాడు. ప్యాకెట్ రూ.56 వేలకు వ్యవసాయదా రులు సరఫరా చేస్తారని, అయితే వాటిని తమ కంపెనీతో ప్యాకెట్ రూ.1.1 లక్షల చొప్పున ఖరీదు చేయిస్తున్నానంటూ చెప్పాడు. ఈ విష యం కంపెనీకి తెలిస్తే తన ఉద్యోగం పోతుం దని, ఎవరికీ చెప్పొద్దంటూ మెయిల్లో సూచిం చాడు. స్థానికంగా సీడ్స్ ఖరీదు చేసి అమెరికా పంపాలని, ఎవరి వద్ద ఆ సీడ్స్ కొనాలన్నదీ తానే చెప్తానన్నాడు. తమ కంపెనీకి నెలకు 300 నుంచి 500 ప్యాకెట్లు అవసరమని, వచ్చిన లాభంలో తనకు 30 శాతం వాటా ఇవ్వా లంటూ నేరగాడు కోరాడు. కాగా, ముందుగా తనకు ఆర్డర్ ఇస్తేనే తాను స్థానికంగా సీడ్స్ కొంటానంటూ శ్రీనివాస్ చెప్పడంతో ప్రయో గాత్మకంగా ఐదు ప్యాకెట్లు పంపాల్సిందిగా సైబర్ నేరగాడు ఆర్డర్ కాపీ మెయిల్ చేశాడు. ఫలానా వ్యక్తి వద్ద ఈ సీడ్స్ లభిస్తాయంటూ ఓ ఫోన్ నంబర్ అందించాడు. ఆర్బీఐ పేరు చెప్పి మరికొంత స్వాహా.. సైబర్ నేరగాడు ఇచ్చిన నంబర్లో సంప్రదించిన శ్రీనివాస్ ఐదు ప్యాకెట్లకు ఆర్డర్ ఇచ్చాడు. అవతలి వ్యక్తి చెప్పిన బ్యాంకు ఖాతాలో రూ.2.8 లక్షలు డిపాజిట్ చేశాడు. కొన్ని రోజులకు కొరియర్లో ఐదు ప్యాకెట్ల గుర్తు తెలియని సీడ్స్ అందుకున్నాడు. వీటిని అమెరికాలో ఉన్నట్లు చెప్తున్న సైబర్ నేరగాడికి ఇతడు పంపాల్సి ఉంది. అయితే తనకు ఈ ఐదు ప్యాకెట్లకు సంబంధించిన రూ.5.5 లక్షలు చెల్లిస్తేనే పంపిస్తానంటూ ముందు జాగ్రత్త తీసుకున్నాడు. దీనికి సమ్మతించిన సైబర్ నేరగాడు ఆ డబ్బును ఆర్బీఐ ద్వారా పంపాల్సి ఉందని చెప్పాడు. అందుకు ఖర్చుల నిమిత్తం, ఇతర పన్నుల పేరుతో మరో రూ.5.7 లక్షలు డిపాజిట్ చేయించుకుని మోసం చేశాడు. ఎట్టకేలకు బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.