హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాంధ్ర జిల్లాల్లో శనివారం భారీగా వర్షం కురిసింది. ప్రాంతాల వారీగా చూసినట్లయితే.. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో 8 సెంటీమీటర్ల వర్షపాతం, తూర్పుగోదావరి తణుకులో 6 సెంటీమీటర్లు, విజయనగరం జిల్లా సీతానగరంలో 8, బొబ్బిలిలో 7, ఎస్.కోటలో 5, గుంటూరు జిల్లా మాచర్లలో 5, కర్నూలు జిల్లా శ్రీశైలంలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.