
సాక్షి, విజయవాడ: ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. తాజాగా ఆదివారం ఉదయం నుంచి విజయవాడలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం కురిసింది.
ఆదివారం ఉదయం నుంచే నగరంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా జనజీవనం స్తంభించింది. పలుచోట్ల రహదారులపై నీరు నిలిచింది. వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. చాలా రోజులుగా వేసవి ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న విజయవాడ వాసులకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది. ఈదురు గాలులు బలంగా వీయడంతో పలుచోట్ల రేకుల షెడ్లపై రేకులు ఎగిరిపోయాయి.
భారీ వర్షం నేపథ్యంలో దుర్గ గుడి ఘాట్ రోడ్డును అధికారులు మూసి వేశారు. భక్తుల భద్రత దృష్ట్యా ఘాట్ రోడ్డు మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. కనకదుర్గా నగర్ మార్గం మీదుగా అమ్మవారిని దర్శించుకోవాలని భక్తులకు దుర్గ గుడి ఈవో విజ్ఞప్తి చేశారు.
#Vijayawada city getting trashed by powerful thunderstorms, unfortunately #Guntur city missed major spell 🌧️
Storms from ntr, #Vijayawada will further cover more parts of eluru, krishna, west & east #GODAVARI districts in upcoming hours 🌧️.. Updates to follow stay tuned 👍 pic.twitter.com/XUbvJvEetI— Eastcoast Weatherman (@eastcoastrains) May 4, 2025

Sudden climate change in #Vijayawada
Heavy rain with thunderstorms 🌧️ ⛈️
Everyone stay home and stay safe 👍 pic.twitter.com/RLz9BV2hsA— Bhargav (@BhargavTweetz) May 4, 2025
Rain rampage @ Vijayawada.
Car ye shake aypothundi. pic.twitter.com/sK5UxPHHBc— Cinema Madness 24*7 (@CinemaMadness24) May 4, 2025
మరోవైపు.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. అన్ని ప్రాంతాల్లోనూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ఏకధాటిగా కురుస్తోంది. అకాల వర్షాల కారణంగా జిల్లాలో వరి, అరటితో పాటు పలు ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
ఇదేం భీబత్సం సామి ⛈️⛈️⛈️
భోరున వర్షం, గాలి, భీబత్సం#Vijayawada pic.twitter.com/Lq5qlh8iTE— Vineeth K (@DealsDhamaka) May 4, 2025