శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు | Heavy rush Of Devotees at Srisailam and Arasavalli temple | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు

Published Sun, Nov 2 2014 9:37 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు - Sakshi

శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు

శ్రీశైలం: కార్తీకమాసం అందునా ఆదివారం సెలవు దినం కావడంతో ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో భక్తులు పోటెత్తారు.  శ్రీ భ్రమరాంభికా మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. మల్లన్న దర్శనానికి భక్తులు బారులు తీరారు. ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, సర్వదర్శనానికి 5 గంటలు సమయం పడుతుంది.

పుణ్య స్నానాలు చేయటానికి పాతాళగంగ వద్ద భక్తులు వేచి ఉండే పరిస్థితి ఏర్పాడింది. అలాగే శ్రీకాకుళంలోని అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం కూడా ఆదివారం భక్తులతో నిండిపోయింది. స్వామి వారి దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో క్యూ లైన్లు ఆలయం వెలుపుల కూడా బారులు తీరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement