'మత్స్యకారులను స్వస్థలాలకు చేర్చండి' | help to 6 fishermen to reach home, says chandra babu | Sakshi
Sakshi News home page

'మత్స్యకారులను స్వస్థలాలకు చేర్చండి'

Published Sat, Jun 27 2015 8:43 PM | Last Updated on Sat, Jul 28 2018 6:48 PM

'మత్స్యకారులను స్వస్థలాలకు చేర్చండి' - Sakshi

'మత్స్యకారులను స్వస్థలాలకు చేర్చండి'

హైదరాబాద్: బంగ్లాదేశ్‌కు చేరిన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సూర్యారావుపేటకు చెందిన ఆరుగురు మత్స్యకారుల్ని క్షేమంగా స్వస్థలానికి చేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గల్లంతయిన మత్స్యకారులు బంగ్లాదేశ్‌లోని ఓ తీరానికి సురక్షితంగా చేరినట్లు సమాచారం తెలియడంతో స్పందించిన సీఎం ఢిల్లోని రెసిడెంట్ కమిషనర్‌తో శనివారం ఫోన్‌లో మాట్లాడారు.

బంగ్లాదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి ఆ ఆరుగురిని వెంటనే కాకినాడ చేర్చేలా ఏర్పాట్లు చేయించాలని సీఎం చూచించారు. బంగ్లాదేశ్‌కు చేరిన బోటులో తొండంగి మండలం హుకుంపేటకు చెందిన ఆరుగురు మత్స్యకారులను కూడా ఉన్నారు. వారందరినీ క్షేమంగా చేర్చే విషయంలో మంత్రి కొల్లు రవీంద్రకు బాధ్యతలు అప్పగించినట్లు ప్రభుత్వ సమాచారం సలహాదారు కార్యాలయం ఒక ప్రటకనలో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement