తహశీల్దార్‌కు రూ.10 వేల జరిమానా | High court fines Rs.10,000 to Bethamcherla Tahsildar Ramakrishnudu | Sakshi
Sakshi News home page

తహశీల్దార్‌కు రూ.10 వేల జరిమానా

Published Tue, Aug 25 2015 2:21 PM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM

High court fines Rs.10,000 to Bethamcherla Tahsildar Ramakrishnudu

బేతంచర్ల (కర్నూలు) : బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఓ తహశీల్దార్‌కు రూ.10 వేల జరిమానా విధిస్తూ రాష్ట్ర హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే... కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం ముద్దనూరు గ్రామానికి చెందిన ఎన్.రాధమ్మ అనే మహిళ... తహశీల్దార్ రామకృష్ణుడు వేధింపులపై హైకోర్టును ఆశ్రయించగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి.

ముద్దనూరు గ్రామానికి చెందిన సర్వే నెంబర్లు 688, 528బి లలో 4.2 ఎకరాల భూమికి రాధమ్మ యజమానురాలు. అయితే ఈ భూమితో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని, అక్రమంగా సాగు చేస్తోందంటూ తహశీల్దార్ వేధింపులకు దిగడంతోపాటు కేసు పెట్టించారు. దీంతో బాధితురాలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన హైకోర్టు.. తహశీల్దార్ రామకృష్ణుడు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని పేర్కొంటూ రూ.10 వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement