Tahsildar
-
మదనపల్లె తహసీల్దార్ ఆఫీసులో మాజీ సైనికుడి ఆత్మహత్యాయత్నం
-
తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు!.. ఇదో వృద్ధ దంపతుల గా(వ్య)థ
సంస్థాన్ నారాయణపురం(నల్గొండ): తాము కొంత భూమి అమ్ముకుంటే.. ఆ భూమిని కొనుగోలు చేసిన వారికి తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేయడం లేదని, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేయకుంటే ఆత్మహత్య చేసుకుంటామని వృద్ధ దంపతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన జక్కడి బాల్రెడ్డికి 40ఎకరాల భూమి ఉంది. తన కుమారుడు జక్కడి శ్రీనివాస్రెడ్డికి 36 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయగా ఇంకా బాల్రెడ్డి పేరు మీద 4ఎకరాల 10గుంటల భూమి ఉంది. కుమారుడు తమ బాగోగులు పట్టించుకోకపోడవంతో బాల్రెడ్డి తన పేరు మీద ఉన్న భూమిని ఇతరులకు విక్రయించాడు. భూమి కొనుగొలుదారు రిజిస్ట్రేషన్ కోసం బుధవారం స్లాట్ బుక్ చేసుకున్నాడు. గురువారం 12గంటలకు రిజిస్ట్రేషన్కు స్లాట్ బుక్ అయ్యింది. తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయకపోవడంతో బాల్రెడ్డి అధికారులను ప్రశ్నించాడు. రిజిస్ట్రేషన్ చేయవద్దని బాల్రెడ్డి కుమారుడు శ్రీనివాస్రెడ్డి ఫిర్యాదు చేశాడని, దీంతో రిజిస్ట్రేషన్ నిలిపివేస్తున్నానని తహసీల్దార్ తెలిపారు. తమ భూమి అమ్ముకుంటే ఎందుకు రిజిస్ట్రేషన్ చేయరంటూ తహసీల్దార్తో బాల్రెడ్డి వాదించాడు. వృద్ధ దంపతులు సుమారు మూడు గంటలకు పైగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. తాము ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. చివరకు రిజిస్ట్రేషన్ చేయడంతో కథ సుఖాంతం అయ్యింది. ఈ విషయమై తహసీల్దార్ కృష్ణను వివరణ కోరగా.. బాల్రెడ్డికి కుంటుంబ సభ్యులతో మాట్లాడుకోమని కొంత సమయం ఇచ్చామని, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ప్రకియ పూర్తిచేసినట్లు తెలిపారు. -
రైతుబంధు పేరుతో భారీ కుంభకోణం.. తహసీల్దార్ అరెస్ట్
సూర్యాపేట, సాక్షి: సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో రైతుబంధు పేరుతో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. లేని భూమిని ఉన్నట్లు చూపించి పాస్ పుస్తకాలు ఎమ్మార్వో జయశ్రీ సృష్టించారు. ఈ కుంభకోణానికి ధరణి ఆపరేటర్ జగదీష్ సహకరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. తహసీల్దారు జయశ్రీ, ధరణీ ఆపరేటర్ జగదీష్ను అరెస్ట్ చేశారు. గోప్యంగా 14 రోజుల రిమాండ్కు తరలించారు. కనీసం అరెస్ట్ వివరాలు కూడా బయటకు తెలియకుండా జాగ్రత్త పడిన వైనం. గతంలో హుజూర్నగర్ తహసీల్దార్గా పనిచేస్తూ కుంభకోణానికి పాల్పడ్డట్లు అధికారులు గుర్తించారు. హుజూర్ నగర్, బూరుగడ్డ రెవిన్యూ పరిధిలో 36.23 ఎకరాలకు ధరణి ద్వారా పాసు పుస్తకాలు సృష్టించి రైతుబంధు నిధులును స్వాహా చేశారు. రూ.14,63,004 లక్షల రైతుబంధు నిధులు తహసీల్దార్, ధరణి ఆపరేటర్ పక్కదారి పట్టించారు. ధరణి ఆపరేటర్ జగదీష్ బంధువుల పేరిట 2019 పట్టాదారు పాసుబుక్కులు తహసీల్దార్ జయశ్రీ జారీ చేశారు. తహసీల్దార్, ధరణి ఆపరేటర్ జగదీష్ చెరిసగం చొప్పున రైతుబంధు నదులు పంచుకున్నారు. తహసీల్దార్ పై 420, 406, 409, 120(b), 468, 467 IPC సెక్షన్లు కింద పోలీసులు కేసు నమోదు చేవారు. ప్రస్తుతం నల్లగొండ జిల్లా అనుముల తహసీల్దార్గా జయశ్రీ పనిచేస్తున్నారు. గోప్యంగా రిమాండ్కు తరలించడమేంటని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. -
మేం చచ్చిపోతాం.. ఎలా బతకాలి సార్
-
ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శి, బిల్ కలెక్టర్..
హైదరాబాద్: తెలంగాణలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఓ రైతు వద్ద లంచం తీసుకుంటూ హన్మకొండ జిల్లా కమలాపూర్ తహసీల్దార్ మాధవి అడ్డంగా పట్టుబడ్డారు. కమలాపూర్ మండలం కన్నూరు గ్రామానికి చెందిన కసరబోయిన గోపాల్ దగ్గర విరాసత్ రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్ 30,000 డిమాండ్ చేశారు. దీంతో రైతు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. నేడు రూ. 5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కమలాపూర్ తహసిల్దార్ కార్యాలయంలో ఏసీపీ సోదాలు కొనసాగుతున్నాయి.అయితే సదరు అధికారిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. విచారణ చేపడితే అనేక అంశాలు బయట పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. తహసిల్దా్ర్ను ఏసీపీ పట్టుకోవడంపై బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి చిన్న పనికి తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది పైసలు డిమాండ్ చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రూ. 7 వేలు లంచం తీసుకుంటూ చాయితీరాజ్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ రావు. ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఇదిలా ఉండగా ఓ ఇంటి నిర్మాణం కోసం రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా నానాజీపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి, బిల్ కలెక్టర్ని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. -
కడప తహసీల్దార్ అక్రమాస్తులపై ఏసీబీ దాడులు
సాక్షి, తిరుపతి/కడప అర్బన్: వైఎస్సార్ జిల్లా కడప మండల తహసీల్దార్ సిద్దల శివప్రసాద్ అక్రమాస్తులపై ఏసీబీ అధికారులు శనివారం ఏకకాలంలో 9చోట్ల సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీజీ కేవీ రాజేంద్రనాథ్రెడ్డి ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు తిరుపతి, పీలేరు, రేణిగుంట, కడపతో పాటు మొత్తం తొమ్మిది చోట్ల దాడులు చేశారు.కడపలోని ఆయన ఇంట్లో రూ.36 లక్షలను స్వా«దీనం చేసుకున్నారు. కాగా, ఎన్నికల ఖర్చుకోసం ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఈఆర్ఓ) కడప ఆర్డీఓ మధుసూదన్ నిధులను విడుదల చేసినట్లు తహసీల్దార్ అధికారులకు తెలియజేసినట్లు సమాచారం. ఈ విషయంపై ఏసీబీ అధికారులు ఆర్డీఓను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే ఆయన కుటుంబం నివాసముంటున్న తిరుపతి వైకుంఠపురంలోని ఇంట్లో విలువైన ల్యాండ్ డాక్యుమెంట్లు, ఆభరణాలు స్వా«దీనం చేసుకున్నారు. తిరుపతి వైకుంఠపురంలో 266.66స్క్వయర్ యార్డుల విస్తీర్ణం కలిగిన జీప్లస్1 భవంతి, మాతృత్వ ఆస్పత్రి ప్రాంగణం, పీలేరులో 158.89స్క్వయర్ యార్డుల విస్తీర్ణంలో నిర్మాణ దశలో ఉన్న జీప్లస్2 భవనం, తిరుపతి, రేణిగుంటలో 5 ఇంటిస్థలాలు, తిరుపతి దామినేడు పరిధిలో 33 సెంట్ల స్థలం, తిరుపతి చెర్లోపల్లిలో 1,685 అడుగుల స్థలం, తిరుపతి వైకుంఠపురంలోని అలంకృతి మాల్ తదితర స్థిరాస్తులను గుర్తించారు. అలాగే టొయోటా ఇన్నోవా, మహింద్రా థార్ కార్లు, మూడు ద్విచక్ర వాహనాలు, రూ.2.31లక్షలు, 390 గ్రాముల బంగారు ఆభరణాలను గుర్తించి స్వా«దీనం చేసుకున్నారు. వారి అనుచరులు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నట్లు వివరించారు. సోదాలు కొనసాగుతున్నాయని, ఇంకా పెద్ద సంఖ్యలో అక్రమాస్తులు, లాకర్లలో దాచిన డాక్యుమెంట్లు, నగదు, బంగారు ఆభరణాలను కూడా గుర్తించినట్లు వివరించారు. రేణిగుంట మండలం తహసీల్దార్గా పనిచేసిన సమయంలో విలువైన ప్రభుత్వ భూములను రియల్టర్లకు ధారాదత్తం చేసి పెద్దమొత్తంలో అక్రమాస్తులను కూడబెట్టినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. -
అధికారులపై టీడీపీ నేత కొల్లు దౌర్జన్యం
సాక్షి, మచిలీపట్నం: తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి కొట్లు రవీంద్ర గురువారం రాత్రి కృష్ణా జిల్లా మచిలీపట్నం తహశీల్దార్ కార్యాలయంలోకి చొరబడి రెవెన్యూ అధికారులపై దౌర్జన్యానికి దిగారు. పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి సమయం లేకపోవడంతో తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు గురువారం రాత్రి కూడా పనిచేస్తున్నారు. వారు పేదల ఇళ్ల పట్టాల తయారీలో నిమగ్నమై ఉండగా రాత్రి 9:30 గంటల సమయంలో కొల్లు రవీంద్ర తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. కార్యాలయంలోకి చొరబడ్డారు. రాత్రి వేళ రెవెన్యూ కార్యాలయంలో ఏదో చేస్తున్నారంటూ తహశీల్దార్, ఇతర అధికారులు, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారు. ఏం చేస్తున్నారంటూ వాగ్వాదానికి దిగారు. వారు చేస్తున్న పనిని ఫొటోలు, వీడియోలు తీయాలంటూ అరుపులు, కేకలతో గందరగోళం సృష్టించారు. నకిలీ పట్టాలు, కన్వేయన్స్ డీడ్లు తయారు చేస్తున్నారంటూ అధికారులపై దౌర్జన్యానికి దిగారు. వారి చేతుల్లోని ఫైళ్లు లాక్కొని పరిశీలించారు. కార్యాలయం ఆవరణలో నినాదాలు చేశారు. కలెక్టర్ దృష్టికి కొల్లు దౌర్జన్యం తహసీల్దార్ కార్యాలయంలోకి కొల్లు రవీంద్ర, ఆయన అనుచరుల చొరబాటు, అధికారుల విధులకు ఆటంకం కల్పించడంపై తహసీల్దార్ పి. సతీష్ జిల్లా కలెక్టర్ పి. రాజాబాబుకు ఫిర్యాదు చేశౠరు. దీనిపై ఆయన స్పందించి జాయింట్ కలెక్టర్ను విచారణకు ఆదేశించారు. దీనిపై జాయిట్ కలెక్టర్ విచారించి.. విధుల నిర్వహణ సక్రమంగానే ఉందని, సమయం తక్కువ ఉండటంవల్లే అధికారులు రాత్రి వరకు విధులు నిర్వర్తిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మొత్తం వ్యవహారంపై గురువారం రాత్రి తహశీల్దార్ పి. సతీష్ ఓ ప్రకటన విడుదల చేశారు. తమ కార్యాలయ సిబ్బంది కొత్తగా వచ్చిన కన్వెయన్స్ డీడ్లు సచివాలయాలు, గ్రామాల వారీగా వేరు చేస్తుండగా కొల్లు రవీంద్ర 30 మందితో కార్యాలయంలోకి వచ్చారని, ఫోటోలు, వీడియోలు తీసి తన వివరణ కోరారని తెలిపారు. మచిలీపట్టణం మండలంలోని అర్బన్, రూరల్లో 18,119 నివాస స్థలాల ఎన్పీఐ కన్వెయన్స్ డీడ్లు ప్రింట్ చేశామని, ఇంకా 2,829 డీడ్లను పరిశీలన చేస్తున్నట్లు వివరించామని పేర్కొన్నారు. -
ACB raids: తహసీల్దార్ రజని ఇంట్లో ఏసీబీ తనిఖీలు..
జమ్మికుంట/వరంగల్క్రైం: రెండు అంతస్తుల ఇల్లు.. 21 ఇంటి స్థలాలు.. ఏడు ఎకరాల భూమి.. కిలోన్నర బంగారం.. ఇతరత్రా కలిపి మార్కెట్ వి లువ ప్రకారం రూ.12 కోట్ల ఆస్తులు. ఇవన్నీ జమ్మికుంట తహసీల్దార్ మర్కల రజనికి చెందిన హనుమకొండలోని ఇంటితోపాటు మరో ఐదు చోట్ల ఏకకాలంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు బుధవారం నిర్వహించిన దాడుల్లో వెలుగుచూశాయి. ఉదయం నుంచి హనుమకొండలోని కేఎల్ఎన్రెడ్డి కాలనీ, ధర్మసాగర్, మరో నాలుగు చోట్ల ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. తహసీల్దార్ రజని ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళిక ప్రకారం అమె బంధువులు, సన్నిహితుల ఇళ్లను టార్గెట్ చేసుకుని తనిఖీలు చేశారు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ రమణామూర్తి ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో ఒక్కో చోట ఇన్స్పెక్టర్ స్థాయి ఆధ్వర్యంలో దాడులు కొనసాగాయి. ఆమె గతంలో తహసీల్దార్గా పనిచేసిన ప్రాంతాల్లో ఆమెకు సన్నిహితంగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించారు. రూ.12కోట్ల అక్రమాస్తులు.. తహసీల్దార్ మర్కల రజనిపై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయని డీఎస్పీ రమణామూర్తి తెలిపారు. ఏసీబీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లాలో ఆరు చోట్ల దాడులు నిర్వహించామన్నారు. రజనికి హనుమకొండలో కేఎల్ఎన్రెడ్డి కాలనీలో రెండు అంతస్తుల ఇల్లు, 21 ఇంటి స్థలాలు, 7 ఎకరాల భూమి, 2 కార్లు, 3 ద్విచక్ర వాహనాలు, బ్యాంకులో రూ.25లక్షలు, లాకర్లు, ఇంట్లో కిలోన్నర బంగారం, ఇంట్లో రూ.1.50 లక్షల నగదు లభించినట్లు తెలిపారు. దీని విలువ (ప్రభుత్వ విలువ ప్రకారం) రూ.3.25 కోట్లు. ఇందులో సుమారు రూ.3కోట్ల అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించినట్లు ఆయన తెలిపారు. వీటి విలువ మార్కెట్ ప్రకారం సుమారు రూ.12 కోట్ల వరకు ఉంటుందని డీఎస్పీ రమణామూర్తి పేర్కొన్నారు. తహసీల్దార్ రజనిని అదుపులోకి తీసుకుని కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ రమణామూర్తి తెలిపారు. -
జమ్మికుంట తహశీల్దార్ ఆస్తుల విలువ రూ.20 కోట్లు!
సాక్షి, కరీంనగర్: జమ్మికుంట తహశీల్దార్ రజినీ ఆస్తులను ఏసీబీ ప్రకటించింది. మార్కెట్ విలువ ప్రకారం రూ.20 కోట్ల ఆస్తులను ఏసీబీ గుర్తించింది. 22 ఓపెన్ ఫ్లాట్స్, 7 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించినట్లు పేర్కొంది. కిలోలకొద్దీ బంగారం, వెండి అభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. బినామీ పేర్లతో పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది. పెద్ద మొత్తంలో ఆస్తుల కొనేందుకు తహశీల్దార్ రజినీ అడ్వాన్స్ చెల్లించినట్లు తెలిపింది. జమ్మికుంట తహసీల్దార్ రజినీ ఇంట్లో ఇవాళ ఏసీబీ సోదాలు జరిపింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో తనిఖీలు చేశారు. హన్మకొండలోని కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో తహశీల్దార్ రజని బంధువుల ఇళ్లల్లో కూడా ఏసీబీ సోదాలు జరిపింది. -
తహసీల్దార్లకు మినహాయింపు..
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల బదిలీల నుంచి తహసీల్దార్లను మినహాయించనున్నారు. ఈ బదిలీల విషయంలో స్పష్టత ఇస్తూ కేంద్రఎన్నికల సంఘం మంగళవారం జారీ చేసిన తాజా ఉత్తర్వులతో కేవలం ఆర్డీఓ స్థాయి వరకే బదిలీలు జరుగుతాయని రెవెన్యూ వర్గాలంటున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మూడేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న, లేదా సొంత జిల్లాల్లో పనిచేస్తున్న రెవెన్యూ సిబ్బందిని (తహసీల్దార్ స్థాయి వరకు) బదిలీ చేయాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల మేరకు పెద్దఎత్తున తహసీల్దార్ల బదిలీలు ఈ నెలలోనే జరిగాయి. అయితే, సొంత జిల్లా కాకుండా, సొంత లోక్సభ సెగ్మెంట్ను పరిగణనలోకి తీసుకొని.. ఆ సెగ్మెంట్లో పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలని ఇటీవల మళ్లీ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు రెవెన్యూశాఖ దాదాపు కసరత్తు పూర్తి చేసింది. లోక్సభ నియోజకవర్గ పరిధి ప్రకారం చూస్తే.. రాష్ట్రంలోని దాదాపు 600 మంది తహసీల్దార్లను మళ్లీ బదిలీ చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడాల్సి ఉండగా, తాజాగా ఈసీ జారీ చేసిన ఆదేశాలతో తహసీల్దార్ల బదిలీలకు రెండోసారి జరిపిన కసరత్తు నిలిచిపోయే అవకాశాలున్నాయని రెవెన్యూ సంఘాలు చెబుతున్నాయి. ఈసీ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రిటర్నింగ్ అధికారులు (ఆర్ఓ), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల (ఏఆర్ఓ) స్థాయి వరకే బదిలీలు చేయాల్సి ఉంటుందని, లోక్సభ ఎన్నికలకు ఆర్ఓలుగా జిల్లా కలెక్టర్లు, ఏఆర్ఓలుగా రెవెన్యూ డివిజనల్ అధికారులు (ఆర్డీఓ) వ్యవహరిస్తారని, ఆ స్థాయి వరకే బదిలీలుంటాయని అంటున్నాయి. దీంతో తహసీల్దార్ల బదిలీలు నిలిచిపోతాయని, ప్రస్తుతం జరిగిన బదిలీల మేరకు తహసీల్దార్లు సర్దుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈసీకి సీఎస్ లేఖ కాగా, సొంత లోక్సభ సెగ్మెంట్లోని రెవెన్యూ సిబ్బందిని బదిలీ చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేసేందుకు తగిన సమయం ఇవ్వాలని, లేదంటే తమను ఈ బదిలీల నుంచి మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈసీకి లేఖ రాసినట్టు సమాచారం. లోక్సభ నియోజకవర్గ నిబంధన ప్రకారం రెవెన్యూశాఖలోని 60 శాతం మంది సిబ్బందికి బదిలీలు చేయాల్సి వస్తోందని ఆ లేఖలో ఆమె వెల్లడించినట్టు తెలిసింది. తాజాగా ఈసీ జారీ చేసిన వివరణ నేపథ్యంలో తహసీల్దార్ల మలి బదిలీల ప్రక్రియ నిలిచిపోనుండగా, దాదాపు 40 మంది ఆర్డీఓలకు స్థానచలనం కలుగుతుందని, ఈ మేరకు నేడో, రేపో ఉత్తర్వులు వెలువడుతాయని రెవెన్యూవర్గాల ద్వారా తెలిసింది. -
‘ధరణి’లో నమోదుకు రూ.40 లక్షలు
శామీర్పేట్: ధరణి పోర్టల్లో భూ వివరాల నమోదుకు రూ. 40 లక్షలు డిమాండ్ చేసిన ఓ తహసీల్దార్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీఖాన్ తెలిపిన వివరాల ప్రకారం..సిటీకి చెందిన రామశేషగిరిరావు శామీర్పేట మండల పరిధిలోని లాల్గడీ మలక్పేట్లో 2006లో భూమి కొనుగోలు చేశాడు. ఆ భూమిని ధరణిలో నమోదు చేయడానికి సంవత్సరం క్రితం తహసీల్దార్ సత్యనారాయణను సంప్రదించగా, రూ.40 లక్షలు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగానే గతంలో రామశేషగిరిరావు రూ.10లక్షలు ఇచ్చి, మరో 20లక్షల చెక్కు ఇచ్చాడు. తాజాగా మిగతా సొమ్ము రూ.10లక్షలు మంగళవారం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో సత్యనారాయణ డ్రైవర్ బద్రికి ఇస్తుండగా, అధికారులు వల పన్ని పట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు తాము దాడులు చేశామని ఏసీబీ అధికారులు తెలిపారు. తహసీల్దార్ సత్యనారాయణ నివాసముంటున్న తూంకుంటలోనూ ఏసీబీ అధికారులు మరిన్ని సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు మల్లికార్జున్, పురంధర్భట్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లోనూ సోదాలు కరీంనగర్క్రైం: ఏసీబీ డీఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కరీంనగర్ విద్యానగర్లోని తోడేటి సత్యనారాయణ నివాసంలో సోదాలు నిర్వహించారు. జిల్లాలోని పూడూర్లోని ప్రాథమిక పాఠశాలలో సత్యనారాయణ భార్య రేణుక టీచర్గా పనిచేస్తున్నారు. ఆమెను కూడా ఏసీబీ పోలీసులు విచారించి పలు డాక్యుమెంట్లు స్వా«దీనం చేసుకున్నట్టు సమాచారం. ఏడాది నుంచి తిరుగుతున్నా... ధరణి పోర్టల్లో భూవివరాల నమోదుకు ఏడాది నుంచి తహసీల్దార్ చుట్టూ తిరుగుతున్నా ఆయన పనిచేయలేదని బాధితుడు రామశేషగిరిరావు తెలిపారు. లాల్గడీ మలక్పేట్లో 2006 సంవత్సరంలో తాను 29 ఎకరాల భూమి కొనుగోలు చేశానని, ఆ భూమిని ధరణిలో నమోదు చేయడానికి రూ.40 లక్షలు డిమాండ్ చేశాడని తెలిపారు. తాను ఇంతకుముందు రూ.10 లక్షలు నగదు రూపంలో, 20 లక్షలు చెక్కురూపంలో చెల్లించానని చెప్పారు. 30 లక్షలు ఇచ్చినా తన పని కాకపోవడంతో విసిగిపోయి ఏసీబీని ఆశ్రయించానని చెప్పారు. -
వ్యక్తిగత లావాదేవీలతోనే తహసీల్దార్ హత్య
విశాఖ సిటీ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విశాఖకు చెందిన తహసీల్దార్ రమణయ్య హత్య కేసు మిస్టరీ వీడింది. వ్యక్తిగత లావాదేవీలు, భూ వ్యవహారాల కారణంగానే హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. హత్య చేసి విశాఖ నుంచి విమానంలో చెన్నై పారిపోయిన రియల్టర్ మురారి సుబ్రహ్మణ్యం గంగారావును సోమవారం అరెస్టు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ తెలిపారు. తహసీల్దార్ సనపల రమణయ్యను గత శుక్రవారం రాత్రి హత్య చేసిన మురారి సుబ్రహ్మణ్యం గంగారావు శనివారం ఉదయం వరకు విశాఖలోనే ఉన్నాడు. తరువాత విశాఖ నుంచి బెంగళూరు మీదుగా చెన్నైకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన టికెట్ బుక్ చేసుకున్నాడు. మధ్యాహ్నం 3.30 గంటలకు విమాన సమయం అయినప్పటికీ.. ఉదయం 9.30 గంటలకే విమానాశ్రయం లోపలకు వెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఇదిలా ఉంటే గంగారావే తహసీల్దార్ను హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు అతని మొబైల్ ఆధారంగా చెన్నైకు టికెట్ బుక్ చేసుకున్నట్లు ముందుగానే గుర్తించారు. దాని ప్రకారం మధ్యాహ్నం ఎయిర్పోర్ట్లో సుబ్రహ్మణ్యం పేరుతో విచారించారు. ఆ పేరుతో ప్రయాణికులు ఎవరూ లేరని ఎయిర్పోర్ట్ అధికారులు చెప్పడంతో పోలీసులు వెనక్కు వచ్చేశారు. అప్పటికి విమానాశ్రయం సీసీ కెమెరాలను పరిశీలించలేదు. పెద్ద పేరు ఉండడంతో పోలీసులు గానీ, ఎయిర్పోర్ట్ అధికారులు గానీ పూర్తిస్థాయిలో నిందితుడి పేరును గుర్తించలేకపోయారు. దీంతో హంతకుడు విమానం ఎక్కి బెంగళూరు వెళ్లాడు. అయితే అప్పటికే ఎయిర్పోర్టు అధికారులకు సమాచారం ఉండడంతో బెంగళూరులో ఎయిర్హోస్టెస్ మురారీ సుబ్రహ్మణ్యం గంగారావు పేరును అనౌన్స్ చేయడంతో.. అనుమానించిన అతడు బెంగళూరు విమానాశ్రయంలోనే దిగిపోయాడు. బస్సులో చెన్నైకు.. బెంగళూరు నుంచి గంగారావు బస్సులో చెన్నైకు బయలు దేరాడు. హంతకుడిని పట్టుకునేందుకు చెన్నైకు వెళ్లిన ప్రత్యేక బృందం మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా చెన్నై పోలీసుల సహకారంతో గంగారావును చెంగల్పుట్టు వద్ద అరెస్ట్ చేసింది. అక్కడి నుంచి ట్రాన్సిట్ ద్వారా విశాఖకు తీసుకొచ్చారు. కాగా, హత్య జరగడానికి గల కారణాలపై డీసీపీ– 1 మణికంఠ ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోందని సీపీ రవిశంకర్ తెలిపారు. కన్వెయన్స్ డీడ్స్ విషయంలో జరిగిన వ్యక్తిగత వ్యవహారాల కారణంగానే హత్య చేసినట్లు గంగరావు చెప్పినట్లు తెలిపారు. గంగారావు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని, అతడిపై హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల్లోనూ చీటింగ్ కేసులున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని వివరించారు. -
మర్రిగూడ తహసీల్దార్ ఇంట్లో రూ.2 కోట్ల నగదు
హస్తినాపురం/మర్రిగూడ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ, ఆదాయానికి మించిన అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని అందిన సమాచారం మేరకు అవినీతి నిరోధక శాఖ అధికారులు నల్లగొండ జిల్లా మర్రిగూడ తహసీల్దార్ మంచిరెడ్డి మహేందర్రెడ్డి ఇంటిపై దాడులు చేశారు. హస్తినాపురం షిరిడీ సాయినగర్ కాలనీలో ఉన్న ఆయన ఇంట్లో శనివారం ఉదయం 9 నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఏసీబీ డీఎస్పీ మజీద్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. మహేందర్రెడ్డి ఇంటితోపాటు బంధువుల ఇళ్లు, మర్రిగూడ మండల రెవెన్యూ కార్యాలయంలో కూడా సోదాలు చేశారు. కార్యాలయంలో భూముల రిజిస్ట్రేషన్ల రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ ఇంట్లోని ఒక ఇనుప పెట్టెలో రెండు కోట్ల ఏడు లక్షల నగదు, కిలో బంగారు నగలు, విలువైన భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు పట్టుబడ్డాయి. మొత్తం వీటి విలువ రూ.నాలుగున్నర కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. మహేందర్రెడ్డి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంప్నం మండలం వెలిమినేడుకు చెందిన మంచిరెడ్డి అంజిరెడ్డి కుమారుడు. అంజిరెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందడంతో కారుణ్య నియామకం కింద మహేందర్రెడ్డి మహేశ్వరం మండల రెవెన్యూ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరాడు. అనంతరం కందుకూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో డీటీవోగా పనిచేశాడు. తర్వాత ప్రమోషన్పై మహేశ్వరం తహసీల్దారుగా బదిలీపై వెళ్లారు. కందుకూరు తహసీల్దారుగా విధులు నిర్వహిస్తున్న సమయంలో మహేందర్రెడ్డి ప్రభుత్వ, ప్రైవేటు భూముల వివాదాల్లో అక్రమంగా డబ్బులు సంపాదించాడనే ఆరోపణలు ఉన్నాయి. 45 రోజుల క్రితం మర్రిగూడ తహశీల్దారుగా బదిలీపై వెళ్లారు. చదవండి: ఎన్ని అవమానాలు ఎదురైనా వెనక్కి తగ్గను: గవర్నర్ సంచలన వ్యాఖ్యలు -
రూ.2 లక్షలు లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, ఆర్ఐ
సాక్షి, ఆదిలాబాద్ : అదిలాబాద్ జిల్లాలో రెవెన్యూ అదికారులు అడ్డగోలుగా వసూళ్ల దందాకు పాల్పడుతున్నారు. అదివారం సెలవు దినం కూడా వదిలిపెట్టడం లేదు. పట్టాపాసు పుస్తకంలో సవరణల కోసం రెండు లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేస్తూ తహసీల్దార్, ఆర్ఐ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ సంఘటన జిల్లాలోని మావల మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అదిలాబాద్కు చెందిన యతీంద్రనాథ్ అనే రైతు మావల సమీపంలోని 14 ఎకరాల భూమికి సంబంధించి నాలుగు పాసు పుస్తకాల్లో మార్పుల కోసం మావల తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాడు. ఇందుకు ఎమ్మార్వో అరీఫా సుల్తానా, ఆర్ఐ హన్మంతరావు రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. చేసేది లేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్లాప్లాన్తో తహసిల్దార్ ఆరిఫాసుల్తానా, ఆర్ఐ హనుమంతరావుకు మావల తాహసీల్దార్ కార్యాలయంలో రెండు లక్షలు అందజేస్తుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ‘వారంలో బీజేపీ తొలి విడత అభ్యర్థుల జాబితా’ -
హెల్మెట్ పెట్టుకొని ఆఫీస్ కు వచ్చిన ఉద్యోగులు
-
భర్త పేరు మీద ఉన్న భూమి భార్యకు రిజిస్ట్రేషన్
దుగ్గొండి: భర్త పేరుమీద ఉన్న భూమిని భార్య తన పేరున రిజిస్ట్రేషన్ చేసుకుంది. అయితే పట్టాదారు పాస్పుస్తకం లేకుండా జిరాక్స్ కాపీ ఆధారంగా ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని కుమారుడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగాడు. ఈ ఘటన దుగ్గొండిలో బుధవారం చోటుచేసుకుంది. మండలంలోని మందపల్లి గ్రామానికి చెందిన అంబరగొండ రవీందర్ 2021, మే నెలలో కరోనాతో చనిపోయాడు. ఆయన పేరున 135 సర్వేనంబర్లో 1.34 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అతని పేరుమీద ప్రభుత్వం జారీ చేసిన నూతన పట్టాదారు పాస్ పుస్తకం (ఖీ22040160118) రవీందర్ మరణానంతరం కుమారుడు మధు దగ్గర ఉంచుకున్నాడు. మధు గీసుగొండ సబ్స్టేషన్లో ఆపరేటర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇదే క్రమంలో తహసీల్దార్ సంపత్.. ఆ భూమిని రవీందర్ భార్య అరుణకు పాస్బుక్ జిరాక్స్ ప్రతి ఆధారంగా ఈ నెల 13న రిజిస్ట్రేషన్ చేశాడు. మ్యుటేషన్ చేయించుకునేందుకు వెళ్లిన మధు అంబరగొండ మధు తన తండ్రి రవీందర్ పేరున ఉన్న భూమిని వారసత్వం కింద మ్యుటేషన్ చేయించుకోవడానికి పట్టాదారు పాస్ పుస్తకం పట్టుకుని మీసేవా కేంద్రానికి వవెళ్లాడు. ధరణి పోర్టల్లో తన తండ్రి పేరు కనిపించకపోవడంతో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. సమాధానం సరిగా రాకపోవడంతో బుధవారం మధు, భార్య మాధవి ఇద్దరు కూతుళ్లను వెంట బెట్టుకుని పురుగుల మందు డబ్బాతో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఆందోళనకు దిగాడు. 15 రోజుల్లో రిజిస్ట్రేషన్ రద్దు చేసి న్యాయం చేస్తానని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించాడు. అరుణ చీటింగ్ చేసింది : తహసీల్దార్ సంపత్కుమార్ తన భర్త రవీందర్ కరోనాతో మృతిచెందాడని, పట్టాదారు పాస్ పుస్తకం పోయిందని, భర్త పేరున ఉన్న భూమిని తన పేరున రిజిస్ట్రేషన్ చేయాలని అరుణ పలుమార్లు కార్యాలయానికి వచ్చింది. కదరదని చెప్పి తిరిగి పంపించా. మూడోసారి కుటుంబంలో ఎలాంటి తగాదాలూ లేవని, పాస్ పుస్తకం పోయింది వాస్తవమని ప్రాధేయపడింది. దీంతో అరుణ పేరున రిజిస్ట్రేషన్ చేశా. అరుణపై చీటింగ్ కేసు నమోదు చేయించడంతోపాటు రిజిస్ట్రేషన్ను రద్దు చేస్తా. నాకు ధైర్యంగా ఉంటుందని రిజిస్ట్రేషన్ చేయించుకున్నా.. కాగా, దీనిపై అరుణ మాట్లాడుతూ తాము సంపాదించిన డబ్బులతో కుమారుడి పేరుమీద మరో 1.16 గుంటలు రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలిపింది. ఇప్పుడే తన మందులు, ఇతర ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదని, మున్ముందు వృద్ధాప్యంలో ధైర్యంగా ఉంటుందని తన భర్త పేరుమీద ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు చెప్పింది. నా తదనంతరం ఆ భూమి నా కుమారుడికే చెందుతుందని తెలిపింది. -
దారుణం: తహసీల్దార్పై యువకుల దాడి.. కారణం ఇదే..
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తహసీల్దార్పై గిరిజనులు దాడికి పాల్పడ్డారు. కాగా, తండావాసుల దాడిలో తహసీల్దార్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, ఆయనను మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. తహసీల్దార్ ఇమ్మాన్యుయేల్పై ఆదివారం మధ్యాహ్నం పట్టణ శివారు సాలార్ తండాకు వెళ్లారు. ఈ సందర్బంగా నూతనంగా ఏర్పాటు చేయనున్న జిల్లా కోర్టుకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. గత అధికారులు కేటాయించిన 9 ఎకరాల స్థలానికి హద్దులు పెడుతుండగా ముగ్గురు వ్యక్తులు వచ్చి తహసీల్దార్తో వాగ్వాదానికి దిగారు. భూమి తమదంటూ.. ఇక్కడ ఎలాంటి హద్దులు పెట్టొద్దంటూ తహసీల్దార్ను అడ్డగించారు. ఇలా కాసేపు వారి మధ్య వాగ్వాదం తర్వాత తహసీల్దార్ తిరిగి వెళ్తుండగా వారు ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తహసీల్దార్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయనను తోటి సిబ్బంది మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. నిందితులు ప్రవీణ్, నవీన్ను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. ఇది కూడా చదవండి: విషాదం: రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ మృతి -
తహసీల్దార్, సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రూ.19.28 లక్షలు జప్తు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏడు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు, రెండు తహసీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ నిర్వహించిన సోదాల్లో రూ.19.28 లక్షల అనధికారిక నగదును స్వాదీనం చేసుకుంది. వరుసగా రెండో రోజు గురువారం కూడా ఏసీబీ అధికారులు ఆయా కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. పలు అక్రమాలకు సంబంధించిన పత్రాలు, ఇతర ఆధారాలను గుర్తించారు. నగదుపై అధికారులు ఇచ్చిన వివరణను విశ్లేషించాక సబ్ రిజిస్ట్రార్లు, ఇతరులపై పీసీ చట్టం కింద క్రిమినల్ కేసుల నమోదుతో పాటు, తహసీల్దార్లపై శాఖా పరమైన చర్యలకు సిఫార్సు చేస్తామని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్రెడ్డి చెప్పారు. జప్తు చేసిన నగదు ♦ గుంటూరు జిల్లా మేడికొండూరు తహసీల్దార్ కార్యాలయం నుంచి రూ.1.04 లక్షలు ♦ జలుమూరు తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, రెవెన్యూ అధికారి నుంచి రూ.27,500. ♦ బద్వేల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం విధులు నిర్వహిస్తున్న ఓ ప్రైవేటు ఉద్యోగి వద్ద రూ.2.70 లక్షలు, డాక్యుమెంట్ రైటర్ నుంచి రూ.2.10 లక్షలు ♦ అనంతపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ ప్రైవేట్ డ్రైవర్ ఎస్కే ఇస్మాయిల్ డాక్యుమెంట్ రైటర్ల నుంచి వసూలు చేసిన రూ.2 లక్షలకు పైగా నగదు ♦కందుకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ చాంబర్ నుంచి రూ.41 వేలు, డాక్యుమెంట్ రైటర్ల నుంచి రూ.94 వేలు జప్తు వన్నం సతీశ్ అనే డాక్యుమెంట్ రైటర్ ఆరు నెలల్లో సబ్ రిజిస్ట్రార్కు రూ.94 వేలు, సబ్ రిజిస్ట్రార్ అటెండర్కు రూ.1.20 లక్షలు ఫోన్ పే ద్వారా పంపినట్టు గుర్తించారు. ♦ తిరుపతి రూరల్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్ వద్ద రూ.90 వేలు, ఇద్దరు ప్రైవేటు ఉద్యోగుల వద్ద రూ.56 వేలు, జూనియర్ అసిస్టెంట్ వద్ద రూ.9 వేలు ♦ నర్సాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సబ్ రిజిస్ట్రార్ చాంబర్ నుంచి రూ.30 వేలు, డాక్యుమెంట్ రైటర్ల వద్ద రూ.20 వేలు, సీనియర్ అసిస్టెంట్ వద్ద రూ.9,500, ప్రైవేటు ఉద్యోగి వద్ద రూ.6 వేలు. ♦ జగదాంబ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం( విశాఖపట్నం)లో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఓ ప్రైవేటు ఉద్యోగి మూడు విడతల్లో ఓ సబ్ రిజిస్ట్రార్కు రూ.90 వేలు పంపినట్టు గుర్తించారు. డాక్యుమెంట్ రైటర్ల నుంచి రూ.39 వేలు స్వాధీనం చేసుకున్నారు. ♦ తుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్ల నుంచి రూ.20 వేలు, లెక్కల్లోకి రాని మరో రూ.20 వేలు. -
రిజిస్ట్రేషన్ చేయకుంటే పెట్రోల్ పోస్తాం.. తహసీల్దార్కు బెందిరింపులు..
సాక్షి, వరంగల్: ‘భూమి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు స్లాట్ బుక్ చేసుకున్నాం.. రిజిస్ట్రేషన్ చేయండి.. లేదంటే నీపై పెట్రోల్పోసి చంపుతాం’ అని పోలీసుల సాక్షిగా కొందరు తహసీల్దార్ను బెదిరించారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగింది. బాధిత తహసీల్దార్ దూలం మంజుల తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బిల్నాయక్తండాకు గుగులోత్ పద్మ అనే మహిళ భూమి రిజిస్ట్రేషన్ చేయాలని స్లాట్ బుక్ చేసుకుంది. ఈ భూమిపై బ్యాంకు లోన్ తీసుకున్నట్లు గుర్తించారు. అంతే కాకుండా పేపర్లు సక్రమంగా లేకపోవడంతో రిజిస్ట్రేషన్ చేసేందుకు నిరాకరిస్తూ బ్యాంక్ నుంచి నోడ్యూస్ సర్ఠిఫికెట్ తీసుకురావాలని సూచించారు. ఈ విషయాన్ని పద్మ వారి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో బిల్నాయక్తండాకు చెందిన కొందరు వ్యక్తులు సోమవారం సాయంత్రం తహసీల్దార్ కార్యాలయంలోకి ప్రవేశించి ‘స్లాట్ బుక్ చేసుకున్నాం..రిజిస్ట్రేషన్ చేయండి.. నోడ్యూస్ ఎందుకు తీసుకురావాలి’అంటూ నిలదీశారు. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కార్యాలయానికి చేరుకోగా, వారి ముందే రిజిస్ట్రేషన్ చేయకపోతే నీపై పెట్రోల్ పోసి చంపేస్తామని తహసీల్దార్ను నానా దుర్భాషలాడారు. నల్లబెల్లి నుంచి నువ్వు స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని, లేకుంటే నిన్ను చంపి జైలుకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని భయభ్రాంతులకు గురిచేసినట్లు తహసీల్దార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె తెలిపారు. చదవండి: రేవంత్కు సిట్ నోటీసులు.. మరోసారి కౌంటర్ -
రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం
మోటకొండూరు: గణతంత్ర వేడుకల వేళ ఓ రైతు కుటుంబం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది.మోటకొండూరుకు చెందిన భూమండ్ల వెంకటేశ్కు భువనగిరి మండలంలోని చీమలకొండూరు రెవెన్యూ పరిధిలో 2.26 ఎకరాల వ్యవ సాయ భూమి ఉంది. అయితే బంట్రోతు నాగరత్నం అనే స్థానికేతర మహిళ ఆ భూమి తమదేనని పట్టా చేసుకోవాలని చూస్తోందంటూ వెంకటేశ్, అతడి భార్య శోభ, కుమారుడు శ్రీకాంత్ గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. మండల కేంద్రంలో నివాసం ఉండని నాగరత్నంకు స్థానిక రెవెన్యూ అధికారులు ఫ్యామిలీ సర్టిఫికెట్ జారీ చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. రికార్డులు పరిశీలించాకే సర్టిఫికెట్ ఇచ్చాం: తహసీల్దార్ జ్యోతి అక్కడే ఉన్న మోటకొండూరు తహసీల్దార్ జ్యోతి బాధిత రైతుతో మాట్లా డుతూ ఫ్యామిలీ సర్టిఫికెట్ కావాలని గత నెలలో నాగరత్నం అర్జీ పెట్టుకుందని, రికార్డులు పరిశీలించగా ఆమె తాత నర్సెట్టి వెంకటస్వామికి చీమలకొండూరులో 1985లో పట్టా భూమి ఉందని గుర్తించి ఆమెకు ఫ్యామిలీ సర్టిఫికెట్ జారీ చేశామని పేర్కొన్నారు. ఆ భూమి భువనగిరి రెవెన్యూ పరిధిలో ఉన్నందున సమస్యను భువనగిరి తహసీల్దార్ కార్యాలయంలో పరిష్కరించుకోవా లని, అవసరమైతే ఆర్డీవోకు ఫిర్యాదు చేసుకోవాలని తహసీల్దార్ సూచించారు. -
రెవెన్యూశాఖలో కలకలం.. ముగ్గురు తహసీల్దార్ల సస్పెన్షన్
సాక్షి, నెల్లూరు(అర్బన్): జిల్లా రెవెన్యూశాఖలో అవినీతి అధికారులపై వరుసగా వేటు పడుతోంది. ఇటీవల బుచ్చిరెడ్డిపాళెం తహసీల్దార్ ప్రమీలను కలెక్టర్ సస్పెండ్ చేశారు. తాజాగా వెంకటాచలం తహసీల్దార్ నాగరాజు, తోటపల్లిగూడూరు తహసీల్దార్ హమీద్, గుడ్లూరు తహసీల్దార్ లావణ్యను సస్పండ్ చేస్తూ కలెక్టర్ కేవీఎన్ చక్రధర్బాబు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతికి అలవాటుపడిన అధికారులు రెవెన్యూ రికార్డులు తారుమారు చేయడం, ప్రభుత్వ భూములను పట్టా భూములుగా చూపించి పరిహారం ఇవ్వడం, చివరికి మర్రిపాడు ప్రాంతంలో అటవీశాఖ భూములను సైతం పట్టా భూములుగా చూపడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. వీటిపై చివరకు స్పందన కార్యక్రమంలో సైతం ప్రజలు తహసీల్దార్లు అర్జీలు సమర్పిస్తున్నారు. విషయాన్ని పరిశీలించిన కలెక్టర్ చక్రధర్బాబు విచారణాధికారిగా జేసీ కూర్మనాథ్ను నియమించారు. జేసీ విచారణలో విస్తూ పోయే నిజాలు వెలుగు చూశాయి. కలువాయి మండలంలో ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులదిగా చూపి అక్రమార్కులకు అండగా నిలిచారు. గుడ్లూరు మండలంలో ప్రభుత్వ భూమిని మ్యుటేషన్ చేశారు. ఇలా పలు చోట్ల అక్రమాలకు పాల్పడిన తహసీల్దార్లను గుర్తించి సస్పెండ్ వేటు వేశారు. ఈ విషయం రెవెన్యూ శాఖలో జిల్లా వ్యాప్తంగా కలకలం రేగింది. మరో ఆరుగురిని విచారించేందుకు జేసీ నోటీసులు సిద్ధం చేస్తున్నారు. ఇందులో రిటైర్డ్ అయిన రెవెన్యూ అధికారులు సైతం ఉన్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిగితే మరి కొంత మందిపై వేటు పడే అవకాశం ఉంది. చదవండి: (విమాన ప్రమాదం: అంజూను మర్చిపోలేం.. షాక్కు గురైన సహ విద్యార్థులు) -
పనికి ముందే రేటు.. కావాలనే లేటు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఫైళ్లలో భారీగా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలాంటి వివాదమూ లేని భూములను కూడా వివాదంలో ఉంచేందుకు అవతలి పార్టీ నుంచి డబ్బు తీసుకుని ఆన్లైన్లో రెడ్మార్క్ వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఆ భూమిని అమ్మడానికి, కొనడానికీ ఉండదు. చిన్న చిన్న ఫైళ్లకు కూడా డబ్బు అడగడం, ఇవ్వకపోతే ఫైలును నెలల తరబడి పెండింగులో పెట్టడం ఇక్కడ మామూలైంది. ముఖ్య అధికారి మామూళ్ల పర్వం తహసీల్దార్ కార్యాలయ ముఖ్య అధికారి ప్రతి పనికీ రేటు కట్టి యథేచ్ఛగా మామూళ్ల పర్వం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. చివరకు జనన, మరణ ధృవీకరణ పత్రాలకూ లంచం తీసుకుంటున్నారనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. సదరు అధికారి అవినీతి వైఖరి నచ్చక ఒక దశలో ఇక్కడ పనిచేస్తున్న వీఆర్ఓలు సమ్మెలోకి వెళ్లాలని అసోసియేషన్ వద్దకు వెళ్లినట్టు తెలిసింది. తహసీల్దార్కు ఆర్డీఓ ఆఫీసులోని ఒక ఏఓ (అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్) సహకరిస్తున్నారని, ఇవన్నీ ఆర్డీఓకు తెలిసినా మిన్నకుండిపోతున్నారని సమాచారం. దాదాపు 7 లక్షల మందికి ఈ తహసీల్దార్ కార్యాలయమే దిక్కు. ఈ నేపథ్యంలో భూముల సమస్యలపై ఇక్కడకు వచ్చే వేలాదిమంది పరిస్థితి వేదనాభరితంగా మారింది. రాప్తాడు నియోజకవర్గం మన్నీల పరిధిలోని భూమి(సర్వే నెం.25–4)కి సంబంధించి ఆర్ఓఆర్ (రైట్స్ ఆఫ్ రికార్డ్స్)కు యజమాని దరఖాస్తు చేసుకున్నారు. నెలల తరబడి తిరిగినా అనంతపురం తహసీల్దార్ కార్యాలయ అధికారులు కనికరించలేదు సరికదా.. ఆయన భూమిని వేరే వారి పేరున ఉన్నట్టు హక్కు పత్రాలు రాశారు. డైక్లాట్లో తనపేరే ఉన్నా తహసీల్దార్ అవతలి వ్యక్తి నుంచి భారీ మొత్తంలో డబ్బు తీసుకుని ఇలా చేసినట్టు యజమాని ఆరోపిస్తున్నారు. అనంతపురం రూరల్ మండలం నారాయణపురం పంచాయతీ పరిధిలో సర్వే నం.93–2లోని 2.84 ఎకరాల భూమిని వివాదంలో (డిస్ప్యూట్ ల్యాండ్ కింద) పెట్టారు. ఎలాంటి ఆర్డరు గానీ, ఆర్డీఓ కోర్టు నుంచి ఆదేశాలు గానీ లేకుండానే భారీగా డబ్బు తీసుకుని ఈ విధంగా చేసినట్టు తేలింది. నిజమైన హక్కుదారుడు మాత్రం బాధితుడిగా మిగిలిపోయాడు. సోములదొడ్డి గ్రామ పరిధిలోని సర్వే నెం.212–1ఎ లోని 5.50 ఎకరాల భూమిని ఇటీవలే వ్యవసాయ భూమి నుంచి కమర్షియల్ కిందకు బదిలీ చేశారు. దీనికి సంబంధించి కిందిస్థాయిలో ఎలాంటి కన్వర్షన్ రిపోర్టు గానీ, అధికారుల సంతకాలు గానీ లేవు. నేరుగా తహసీల్దారే అన్నీ చేసేశారు. ఇందులో భారీగా డబ్బు చేతులు మారినట్టు తెలిసింది. ఉపేక్షించేది లేదు.. ఆర్ఓఆర్లు, ల్యాండ్ కన్వర్షన్లకు డబ్బు అడిగితే ఉపేక్షించేది లేదు. హక్కుదారులకు న్యాయం చేయకుండా ఫిర్యాదులను బట్టి భూములను వివాదాల్లో పెట్టడం సరి కాదు. దీనిపై ప్రత్యేక విచారణ చేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటాం. – కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ (చదవండి: నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఎమ్మెల్యే కేతిరెడ్డి) -
AP: 66 మందికి డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 66 మంది తహసీల్దార్లు, సెక్షన్ అధికారులు, సూపరింటెండెంట్ క్యాడర్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు ఇచ్చింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ మంగళవారం జీవోఎంఎస్ నంబర్ 747 జారీచేశారు. వివిధ శాఖల్లో డిప్యూటీ కలెక్టర్ క్యాడర్ అధికారుల అవసరం పెరగడం, కొత్తగా 24 రెవెన్యూ డివిజన్ కేంద్రాల ఏర్పాటు, జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వం రెవెన్యూ శాఖలో 66 కొత్త డిప్యూటీ కలెక్టర్ పోస్టులను మంజూరు చేసింది. ప్రస్తుతం జిల్లాల్లో పనిచేస్తున్న తహసీల్దార్లు, రాష్ట్ర సచివాలయం, రాష్ట్ర హెచ్వోడీ కార్యాలయాల్లో పనిచేస్తున్న సెక్షన్ అధికారులు, సూపరింటెండెంట్లకు పదోన్నతులు ఇచ్చి ఈ పోస్టుల్ని భర్తీచేసింది. పదోన్నతుల కోసం ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున అధికారుల పేర్లను ఎంపికచేసి 198 మందితో 2022–23 సంవత్సరం అడ్హాక్ ప్యానల్ తయారు చేసింది. ఈ నెల 8వ తేదీన జరిగిన డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) సమావేశంలో ఈ జాబితా నుంచి 66 మందిని డిప్యూటీ కలెక్టర్లుగా ఎంపికచేశారు. ఆ జాబితాను ప్రభుత్వం ఆమోదించింది. పదోన్నతులు తాత్కాలికమని జీవోలో పేర్కొన్నారు. పదోన్నతులు పొందిన అధికారులంతా వెంటనే వెలగపూడి సచివాలయంలోని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రిపోర్టు చేయాలని జీవోలో స్పష్టం చేశారు. ఒకేసారి ఇంతమంది తహసీల్దార్ క్యాడర్ అధికారులకు పదోన్నతులు రావడం రెవెన్యూ శాఖలో చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది డిప్యూటీ తహసీల్దార్ల నుంచి తహసీల్దార్లుగా ప్రభుత్వం పెద్దఎత్తున పదోన్నతులు ఇచ్చింది. వీటికోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూడగా చివరికి వైఎస్ జగన్ ప్రభుత్వం వారి కోరిక నెరవేర్చింది. తాజాగా తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు ఇవ్వడం ద్వారా ఎంతోకాలంగా వాటికోసం ఎదురుచూస్తున్న వారి కలను నెరవేర్చింది. -
పెనమలూరు తహసీల్దార్పై ఏసీబీ కేసు
పెనమలూరు/రెడ్డిగూడెం/ఎ.కొండూరు: కృష్ణా జిల్లా పెనమలూరు తహసీల్దార్ జి.భద్రుపై అవినీతి నిరోధకశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఫిర్యాదుతో శుక్రవారం ఏకకాలంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఆయన కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఆదాయానికి మించి రూ.రెండుకోట్ల ఆస్తులు గుర్తించారు. ఏసీబీ అధికారుల కథనం మేరకు.. తహసీల్దార్ జి.భద్రు అక్రమార్జన, అక్రమాస్తులు కూడబెట్టారన్న సమాచారంతో కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ తీసుకుని ఆయన కార్యాలయంతోపాటు కానూరులోని మనోహరి అపార్టుమెంట్లో ఆయన నివసిస్తున్న ఫ్లాట్, గుంటుపల్లి, పోరంకి, కొండపల్లి, ఎ.కొండూరు మండలం కుమ్మరికుంట్ల, రెడ్డిగూడెం మండలం కుదప తండా తదితర ప్రాంతాల్లోని బంధువులు, మిత్రుల ఇళ్లలో సోదాలు చేశారు. భద్రు పేరున ఒక ఫ్లాట్, ఒక ఇల్లు, ఒక ఖాళీస్థలం, 17.35 ఎకరాల వ్యవసాయ భూమి, విలాసవంతమైన కారు, రెండు మోటారు సైకిళ్లు, బంగారం, వెండి కలిపి మొత్తం రూ.2,54,90,170 విలువైన ఆస్తులున్నట్లు గుర్తించారు. వీటిలో రూ.2 కోట్ల మేర అక్రమాస్తులని నిర్ధారించారు. కుదప తండాలో భద్రు బావమరుదులు, స్నేహితుల నివాసాల్లో ఏసీబీ సీఐలు సీహెచ్.రవిబాబు, వి.సురేష్బాబు తొమ్మిదిచోట్ల తనిఖీలు చేశారు. పలు రికార్డులు, ఆస్తుల వివరాలు పరిశీలించారు. కుమ్మరికుంట్లలో భద్రు సోదరుడు జి.చంటి ఇంట్లో భద్రు కుటుంబానికి సంబంధించిన విలువైన ఒరిజినల్ డాక్యుమెంట్లను గుర్తించారు. ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్, సీఐ నాగరాజు ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు ఈ సోదాలు జరిగాయి. సుమారు రూ.30 లక్షల ఆస్తిని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ సీఐ నాగరాజు తెలిపారు. సోదాలు పూర్తయిన తరువాత అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని పేర్కొన్నారు. జూనియర్ అసిస్టెంట్ నుంచి.. ఎ.కొండూరు మండలం కుమ్మరికుంట్లకు చెందిన భద్రు రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా చేరి.. క్రమంగా డిప్యూటీ తహసీల్దార్గా ఉద్యోగోన్నతి పొందారు. 2011లో తహసీల్దార్ అయ్యారు. మొవ్వ, తోట్లవల్లూరు, ఉయ్యూరు మండలాల్లో పనిచేశారు. -
లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ఇన్చార్జి తహసీల్దార్
సాక్షి, రామారెడ్డి(ఎల్లారెడ్డి): లంచం తీసుకుంటూ ఇన్చార్జి తహసీల్దార్, ధరణి ఆపరేటర్ ఏసీబీకి పట్టుబడ్డారు. నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్ తెలిపిన వివరాలు.. రామారెడ్డి ఇన్చార్జి తహసీల్దార్ మానస, ధరణి ఆపరేటర్ లక్ష్మణ్ ద్వారా అన్నారం గ్రామానికి చెందిన రైతు బన్నం బలరాం నుంచి రూ. 4వేలు లంచం తీసుకుంటుండగా గురువారం మధ్యాహ్నం ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్, ఇన్స్పెక్టర్లు నగేశ్, శ్రీనివాస్లు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. రైతు బలరాం తన పెద్దమ్మ పేరున ఉన్న భూమిని తన పేరు మీదకు మార్చాలని రామారెడ్డి తహసీల్దార్ కార్యాలయంలోని ధరణి ఆపరేటర్ను కలిశాడు. తన పెద్దమ్మకు ఎవరూ లేకపోవడంతో బాగోగులు తనే చూసుకునేవాడినని రెండేళ్ల క్రితం ఆమె మరణించడంతో ఆమె పేరిట ఉన్న 37 గుంటల భూమిని తన పేరు మీదకు మార్చాలని అర్జీ పెట్టుకున్నాడు. దీంతో ధరణి ఆపరేటర్ లక్ష్మణ్ ఆన్లైన్ ఫీజు రూ. 3వేలు, దాని తర్వాత లంచం రూపంలో రూ. 10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వలేనని రైతు ఇన్చార్జి తహసీల్దార్ మానసను కలవగా.. రూ. 4వేలు ఇవ్వాలని ఆమె సూచించారు. ఆ డబ్బులు కూడా ఇవ్వడం ఇష్టంలేక బలరాం నిజామాబాద్లోని ఏసీబీ అధికారుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. గురువారం మధ్యాహ్నం బలరాం రూ. 4వేలు లంచం డబ్బులను ధరణి ఆపరేటర్ లక్ష్మణ్కు ఇస్తుండగా అధికారులు రెడ్ హాండెడ్గా పట్టుకున్నారు. తదుపరి విచారణ చేస్తున్నామని ఇన్చార్జి తహసీల్దార్, ధరణి ఆపరేటర్పై చర్యలు ఉంటాయని డీఎస్పీ వెల్లడించారు. -
అక్రమ రిజిస్ట్రేషన్లు.. సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్ అరెస్టు
చిత్తూరు అర్బన్/చిత్తూరు కార్పొరేషన్: ఓ స్థలానికి సంబంధించి యజమాని ఒకరైతే.. వాళ్లకే తెలియకుండా మరొకరి పేరిట రూ.కోట్లు విలువ చేసే భూములను అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్న ముఠాను గత నెలలో చిత్తూరు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే కేసులో చిత్తూరు జిల్లాకు చెందిన తహసీల్దార్ ఐ.సుబ్రహ్మణ్యం, సబ్ రిజిస్ట్రార్ జె.శ్రీధర్ గుప్తా, వీఆర్వోలు ధనుంజయ, ఎం.శివనారాయణ, కె.బాబును శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను ఎస్పీ రిషాంత్రెడ్డి ఓ ప్రకటనలో మీడియాకు వెల్లడించారు. చిత్తూరు నగరంలో దాదాపు రూ.50 కోట్లకుపైగా విలువ చేసే భూములు, ఇంటి స్థలాలను రిజిస్ట్రేషన్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారుల సాయంతో సురేంద్రబాబు తదితరులు ఓ ముఠాగా ఏర్పడి వేరేవారికి కట్టబెట్టారు. దీంతో సురేంద్రబాబుతో పాటు మొత్తం ఏడుగురిని సెప్టెంబర్ 30న అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో మరిన్ని అక్రమాలు జరిగినట్లు ఎస్పీ రిషాంత్రెడ్డి దృష్టికి రావడంతో ఆయన లోతుగా దర్యాప్తు చేయించారు. అక్రమాలు బయటపడింది ఇలా.. చిత్తూరుకు చెందిన బాలగురునాథంకు చెందిన ఐదెకరాల స్థలాన్ని సురేంద్రబాబు ముఠా.. యాదమరి మండలం మాధవరం పంచాయతీకి చెందిన ఎబినైజర్, పూపతమ్మ, మురళి, శివకుమార్, చిట్టిబాబు, చిత్తూరుకు చెందిన నితీష్కు రూ.75 లక్షలకు అమ్మేశారు. తాము మోసపోయామని, ఎలాంటి లింకు డాక్యుమెంట్లు లేకుండా విలువైన స్థలాలను తమకు రిజిస్ట్రేషన్ చేసి ఏమార్చారని ఎబినైజర్ గత నెల 25న యాదమరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసును విచారించిన పోలీసులు ఎబినైజర్ కొన్న స్థలం బాలగురునాథంకు చెందిందిగా గుర్తించారు. ఈ భూమిని గ్రామకంఠం భూమిగా పేర్కొంటూ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంలో రెండేళ్ల క్రితం చిత్తూరు తహసీల్దార్గా పనిచేసి, ప్రస్తుతం పుత్తూరు తహసీల్దార్గా ఉన్న ఐ.సుబ్రహ్మణ్యం, చిత్తూరు వీఆర్వోలు ధనంజయ, కె.బాబు, శివనారాయణ కీలకపాత్ర పోషించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అలాగే రిజిస్ట్రేషన్ శాఖలో ఈకేవైసీ చేయడం, ఉద్యోగుల లాగిన్, పాస్వర్డ్తోపాటు ప్రభుత్వ సమాచారాన్ని దళారులకు ఇవ్వడంలో ఇక్కడ పనిచేసే అధికారులు, సిబ్బంది హస్తం ఉన్నట్లు వెల్లడైంది. దీంతో సబ్ రిజిస్ట్రార్ శ్రీధర్ గుప్తాను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన ప్రభుత్వ అధికారులు నకిలీ రిజిస్ట్రేషన్ల కుంభకోణంలో పెద్ద మొత్తంలో నగదు రూపేణా లబ్ధి పొందినట్టు ఆధారాలు సేకరించారు. ఈ అరెస్టులు ఇంతటితో ఆగవని, మరికొంతమంది హస్తం ఉందని, వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు.. చిత్తూరు అర్బన్ జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్ శ్రీధర్ గుప్తాను సస్పెండ్ చేస్తూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ డీఐజీ గిరిబాబు ఉత్తర్వులు జారీ చేశారు. నకిలీ రిజిస్ట్రేషన్లపై స్పందించిన ఆయన జిల్లా రిజిస్ట్రార్ శ్రీనివాసరావును విచారణ అధికారిగా నియమించారు. విచారణలో శ్రీధర్ గుప్తా అక్రమాలకు పాల్పడ్డారని తేలింది. దీంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు చిత్తూరు దాటివెళ్లవద్దని ఆదేశించారు. -
సారొచ్చారు.. పేదల్లో భరోసా.. భూకాసురుల్లో దడ
జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ భూములపై పట్టున్న తహసీల్దార్గా అతనికి పేరుంది. ముచ్చటగా మూడోసారి తమ ప్రాంత తహసీల్దార్గా రావడంతో నిరుపేదల నుంచి హర్షం వ్యక్తం అవుతుంటే... కజ్జాదారుల గుండెల్లో మాత్రం రైళ్లు పరుగెడుతున్నాయి. గతంలో ప్రభుత్వ భూమిని కాపాడటంలో కీలక పాత్ర పోషించి జిల్లా అధికారులతో శభాష్ అనిపించుకున్నారు. అతనే గౌతమ్కుమార్. సాక్షి, హైదరాబాద్: కాప్రా మండలం కొత్తగా ఏర్పాటైన తర్వాత అక్టోబర్ 11, 2016న మొదటిసారిగా బాధ్యతలు చేపట్టిన గౌతమ్కుమార్ మండలంలో ఉన్న ప్రభుత్వ భూములను కాపాడి ప్రజా అవసరాల కోసం వినియోగించేలా చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత 2020 ఫిబ్రవరి 25న రెండోసారి తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థలాలతో పాటు కస్టోడియన్ భూములు, కార్పొరేషన్లో వందల ఎకరాలను కజ్జాదారుల చెర నుంచి కాపాడి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన అధికారిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఉప్పల్ మండల తహసీల్దార్గా కొనసాగుతున్న గౌతమ్కుమార్ను ప్రభుత్వం కాప్రా మండల ఇన్చార్జ్ తహసీల్దార్గా బుధవారం అదనపు బాధ్యతలను అప్పగించింది. అక్రమార్కుల గుండెల్లో గుబులు... ప్రభుత్వ భూములపై పట్టున్న అధికారిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్కుమార్ మూడోసారి అదనపు బాధ్యతలు చేపట్టడడంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలైంది. వాస్తవ రికార్డులకు అనుకూలంగా వ్యవహరించి పేదలకు న్యాయం చేకూర్చుతూనే... ప్రభుత్వ భూములను కబ్జాల చెర నుంచి కాపాడి ఉత్తమ తహసీల్దార్గా అవార్డు స్వీకరించి అధికారుల ప్రశంసలు అందుకున్నారు. ►గతంలో ప్రభుత్వ భూములను రక్షించి సఫలీకృతమయ్యారు. గౌతమ్కుమార్ అదన పు బాధ్యతలు స్వీకరించడంతో తమకు న్యాయం జరుగుతుందని నిరుపేదలు గట్టిగా నమ్ముతున్నారు. కాని అక్రమార్కుల్లో మా త్రం అప్పుడే ఆందోళన మొదలైంది. అక్రమ తవ్వకాలను పరిశీలించేందుకు వెళ్తున్న తహసీల్దార్ (ఫైల్) గతంలో సహజ వనరుల దోపిడీకి అడ్డుకట్ట.. జవహర్నగర్లోని మల్కారం గుట్టల్లో అక్రమంగా రాత్రి వేళల్లో నడిపిస్తున్న మట్టి దందాపై గతంలో తహసీల్దార్ గౌతమ్కుమార్ ఉక్కుపాదం మోపారు. ఎలాంటి అనుమతులు లేకుండా భారీ గుంతలు తవ్వుతూ సహజ వనరులను దొచుకెళ్తున్న వారిపై కొరడా ఝులిపించారు. ఒంటరిగా గుట్టల్లోకి తానే ద్విచక్రవాహనం నడుపుకుంటూ వెళ్లి సహజ వనరుల దోపిడీని నివారించడంలో సఫలీకృతుడయ్యారు. మరోమారు ఈ ప్రాంతాన్ని అన్ని కోణాల్లో పరిశీలించి ప్రస్తుత పరిస్థితులపై ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. సమగ్ర విచారణ, బాధ్యులపై చర్యలు ప్రభుత్వ భూములను కాపాడి భవిష్యత్ తరాలకు ఉపయోగడేలా చర్యలు తీసుకోవడమే నా భాధ్యత. గతంలో రెండు పర్యాయాలు ఇక్కడ విధులు నిర్వర్తించా. నిజమైన నిరుపేదలకు న్యాయం చేసి కజ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. రోడ్ల కజ్జాలు, మున్సిపాలిటీకి (ప్రజల అవసరాల కోసం) కేటాయించిన స్థలాలపై సమగ్ర విచారణ చేసి వాటి పరిస్థితులపై కలెక్టర్కు నివేదిక అందజేస్తా. సిబ్బంది తప్పులు చేస్తే వారిపై తప్పకుండా శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – గౌతమ్కుమార్, కాప్రా ఇన్చార్జ్ తహసీల్దార్ -
2019లో ‘ఉత్తమ’ అధికారి అవార్డు.. ఏసీబీ వలలో సంగెం తహసీల్దార్
ఆయన ప్రభుత్వం గుర్తించిన ఉత్తమ అధికారి. పైసా లేనిదే పనిచేయడనే విమర్శలున్నాయి. పనిచేసిన చోటల్లా పైత్యం చూపినట్లు సçహోద్యోగులు చెబుతున్నారు. ఎట్టకేలకూ పాపం పండింది. ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. సాక్షి, వరంగల్: రెవెన్యూ శాఖలో అవినీతి తిమింగళాన్ని ఏసీబీ అధికారులు పక్కాగా వల పన్ని పట్టుకున్నారు. సంగెం తహసీల్దార్ నరిమేటి రాజేంద్రనాథ్ను శుక్రవారం ఉదయం 10 గంటలకు హంటర్రోడ్డు నందిహిల్స్లోని ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు. సంగెం మండల పరిధి కాపులకనిపర్తిలోని వ్యవసాయ భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ వ్యవహారంలో సంబంధిత రైతును నాలుగు నెలలుగా తహసీల్దార్ ఇబ్బందికి గురిచేస్తున్నాడు. ఈక్రమంలో బాధిత రైతు అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులను అశ్రయించాడు. పక్కా పథకం ప్రకారం.. ఏసీబీ అధికారులు తహసీల్దార్ రాజేంద్రనా«థ్ను పట్టుకున్నారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ వై.హరీశ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కాపులకనిపర్తిలో చింతనెక్కొండకు చెందిన నల్లెపు కుమార్కు మూడెకరాల భూమి ఉంది. అందులో నుంచి తన చెల్లెలికి ఎకరం భూమిని గిఫ్ట్గా ఇవ్వడానికి ఆన్లైన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకున్నాడు. కానీ తహసీల్దార్ రాజేంద్రనాథ్ రిజిస్ట్రేషన్ చేయకుండా.. నాలుగు నెలలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. హనుమకొండలోని రాజేంద్రనాథ్ నివాసం ఈక్రమంలో రైతు ఈనెల 2న తహసీల్దార్ అడిగిన రూ.50 వేలు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందులో భాగంగానే శుక్రవారం తహసీల్దార్ రాజేంద్రనాథ్ రైతు కుమార్కు ఫోన్ చేసి డబ్బులు తీసుకుని ఇంటికి రావాలన్నాడు. రైతు నుంచి డబ్బులు తీసుకున్న వెంటనే అతడిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం రాజేంద్రనాథ్ నివాసంలో కంప్యూటర్, ఇతర ఫైల్స్ పరిశీలించారు. విలువైన భూముల పత్రాలు, వాహనాలు, ప్లాట్లు ఇతర విలువైన పత్రాలు లభించినట్లు సమాచారం. అనంతరం సంగెం తహసీల్దార్ కార్యాలయానికి రాజేంద్రనాథ్ను తీసుకొచ్చి ఆర్డీఓ మహెందర్జీ సమక్షంలో రికార్డులు తనిఖీ చేసి, సోదాలు నిర్వహించారు. కాగా.. తహసీల్దార్ కార్యాలయంలో పలు డాక్యుమెంట్లను, రికార్డులను, కంప్యూటర్ హార్డ్డిస్క్లను, సీసీ పుటేజీలను సీజ్ చేసినట్లు సమాచారం. దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు శ్యాంసుందర్, శ్రీను, సిబ్బంది పాల్గొన్నట్లు ఏసీబీ డీఎస్పీ వై.హరీశ్కుమార్ తెలిపారు. ఆది నుంచి అదేతీరు! సంగెం తహసీల్దార్ రాజేంద్రనాథ్ ఉద్యోగ ప్రస్థానం ఆది నుంచి వివాదాస్పదమే! గతంలో డీటీ స్థాయిలో ఓప్రజాప్రతినిధి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేశారు. అక్కడ్నుంచి బదిలీ అయిన తర్వాత సుదీర్ఘకాలం ఉమ్మడి వరంగల్ జిల్లాలో జేసీల వద్ద సీసీగా పని చేశారు. తర్వాత ధర్మసాగర్లో పని చేశారు. జిల్లాల విభజన అనంతరం వరంగల్ జిల్లాకు వెళ్లిన ఆయన మొదట్లో నల్లబెల్లి తహసీల్దార్గా వెళ్లారు. అక్కడ కూడా వివాదాస్పద పనులతో ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. దీంతో ఉన్నతాధికారులు అతడిని కలెక్టరేట్కు బదిలీ చేశారు. కలెక్టరేట్కు వచ్చిన తర్వాత ఆయన తీరు మరింత ఆందోళనకరంగా మారిందని ఆరోపణలున్నాయి. కలెక్టరేట్ ఏఓగా పని చేస్తూ ఉద్యోగులు, ఉన్నతాధికారులకు మధ్య సమన్వయం చేయాల్సిన సమయంలో ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించేలా పనులు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా సదరు అధికారి ఇబ్బందులు భరించలేక జిల్లాలోని సçహోద్యోగులు, రెవెన్యూ శాఖలోని ఇతర స్థాయి ఉద్యోగులు ఇతడి వేధింపులపై ఓ జిల్లాస్థాయి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని ఒక్కొక్కరుగా తమ బాధలు చెప్పుకున్నట్లు సమాచారం. పదే పదే ఆరోపణలు వస్తున్నా.. కొందరు అధికారులు సదరు తహసీల్దార్కు అన్ని విధాలా అండగా నిలవడం తీవ్రస్థాయిలో విమర్శలకు దారితీసింది. అండగా నిలిచిన ఆజిల్లా ఉన్నతాధికారి బదిలీ కావడంతో కలెక్టరేట్ నుంచి రాజేంద్రనాథ్ బదిలీ అనివార్యమైంది. దీంతో తోటి ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నట్లు చెబుతుంటారు. తీవ్రస్థాయిలో ఆరోపణలున్న రాజేంద్రనాథ్ను 2019లో ఉత్తమ అధికారి అవార్డు అందించడం విశేషం. -
బతికుండగానే చనిపోయినట్లు చూపి..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/రాయికోడ్: బతికుండగానే మరణించినట్లు చూపి 27.34 ఎకరాల భూమిని వేరొకరి పేర పట్టా చేసిన వ్యవహారంలో రాయికోడ్ తహసీల్దార్ రాజయ్య సస్పెండ్ అయ్యారు. ఈ భూమిపై క్రయవిక్రయాలు అసలైన పట్టాదారులకు కనిపించకుండా ధరణి వెబ్సైట్లో ప్రత్యేక సౌకర్యం ఉన్న ప్రైవసీ మోడ్లో పెట్టినట్లు అధికారుల విచారణలో తేలింది. ఇలా ప్రైవసీ మోడ్లో పెడితే సదరు భూమిపై ఎలాంటి క్రయవిక్రయాలు, ఇతర లావాదేవీలు జరిగినా ధరణిలో కనిపించవు. అసలు ఉదంతమిదీ.. రాయికోడ్ మండలం నాగన్పల్లికి చెందిన పట్లోళ్ల హన్మంత్రెడ్డికి గ్రామంలో సర్వే నంబర్ 198లో 27.34 ఎకరాల భూమి ఉంది. హన్మంత్రెడ్డి గతేడాది మరణించడంతో ఆ భూమిని ఆయన భార్య శివమ్మ సక్సేషన్ (వారసత్వం కింద) పట్టా చేయించుకున్నారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్లో కుమారుల వద్ద ఉంటున్నారు. అయితే శివమ్మ కూడా మరణించిందని రికార్డుల్లో చూపిన తహసీల్దార్ రాజ య్య ఆ భూమిని ఈనెల 19న అంజమ్మ పేర మార్చారు. లావాదేవీలు ధరణి వెబ్సైట్లో కనిపించకుండా ప్రైవసీ మోడ్లో పెట్టారు. అనుమానం వచ్చిన శివమ్మ కుమారుడు శ్రీనివాస్రెడ్డి ఆరాతీయగా తన తల్లి పేరుతో ఉన్న భూమిని మరొకరి పేర మార్చారని చేసిన ట్లు తేలింది. దీంతో ఆయన కలెక్టర్ శరత్కు ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ ఆదేశాల మేరకు జహీరాబాద్ ఆర్డీవో రమేశ్బాబు గురువారం విచారణ చేపట్టగా రాజయ్య బాగోతం బయటపడింది. ఆర్డీవో నివేదిక మేరకు కలెక్టర్.. తహసీల్దార్ రాజయ్యతోపాటు, ఆర్ఐ శ్రీకాంత్ను సస్పెండ్చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మూడు నెలల క్రితం స్లాట్ బుకింగ్... పట్టా మార్పిడికి 3 నెలల క్రితమే స్లాట్ బుక్చేయడం గమనార్హం. సాధారణంగా స్లాట్ బుక్చేసిన నిర్ణీత వ్యవధిలోనే పట్టా మార్పిడి చేయాలి. అయితే తహసీల్దార్ మూడు నెలల అనంతరం పట్టా మార్పిడి చేశారు. ఈ వ్యవహారంలో రూ.40 లక్షల వరకు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. గతంలో ఇక్కడ ఆర్ఐగా పనిచేసిన శ్రీకాంత్.. అసలైన పట్టాదారు శివమ్మకు వారసురాలు అంజమ్మనే అంటూ తప్పుడు నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం మెదక్ జిల్లాలో పనిచేస్తున్న శ్రీకాంత్పై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. భూమి పౌతీమార్పు వ్యవహారంలో నకిలీ ధ్రువపత్రాలను వినియోగించిన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు రాయికోడ్ ఎస్ఐ ఏడుకొండలు తెలిపారు. శివమ్మ ఫిర్యాదు మేరకు.. ఆమె వియ్యంకురాలు అంజమ్మ, ఆమె కుమారుడు అమృత్రెడ్డి, మనవడు రాజశేఖర్రెడ్డి, భూ బదలాయింపులో సాక్షులుగా ఉన్న టి.మల్లేశం, బి.నర్సింలుపై కేసు నమోదు చేశారు. -
Hyderabad: షేక్పేట్ మాజీ ఎమ్మార్వో సుజాత అనుమానాస్పద మృతి
-
షేక్పేట మాజీ ఎమ్మార్వో సుజాత అనుమానాస్పద మృతి
సాక్షి, హైదరాబాద్: షేక్పేట మాజీ ఎమ్మార్వో సుజాత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శుక్రవారం సాయంత్రం గుండెపోటుతో నిమ్స్ ఆసుపత్రిలో చేరిన సుజాత శనివారం ప్రాణాలు విడిచారు. సుజాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో గతంలో సుజాత ఇంటిపై దాడి చేసిన ఏసీబీ అధికారులు.. ఆమెను అరెస్ట్ చేశారు. ఏసీబీ దాడుల అనంతరం ఏడాది క్రితమే సుజాత భర్త ఆత్మహత్య పాల్పడ్డాడు. అప్పటి నుంచి తీవ్రమైన మానసిక క్షోభతో బాధపడుతున్న సుజాతకు మళ్లీ విధుల్లోకి చేరేందుకు అవకాశం ఇచ్చినా ఆమె తిరస్కరించారు. క్రమంలోనే డిప్రెషన్లోకి వెళ్లిన సుజాత.. ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తొలుత ప్రచారం జరిగింది. అయితే తాజాగాకు ఆమె గుండెపోటుతో మృతిచెందినట్టుగా తెలుస్తోంది. సుజాత మృతిని ధృవీకరించిన వైద్యులు మాజీ ఎమ్మార్వో సుజాత మృతిని వైద్యులు ధృవీకరించారు. గత వారం క్రితం అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు నిమ్స్కు తీసుకు వచ్చినట్లు తెలిపారు. మరోవైపు సుజాతకు క్యాన్సర్ కూడా ఉందని వైద్యులు పేర్కొన్నారు. అదే సమయంలో డెంగీ కూడా సోకడంతో వైద్యులు ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. అయితే చికిత్స కొనసాగుతూ ఉండగానే ఈ ఉదయం గుండెపోటుతో సుజాత మృతి చెందినట్లు తెలిపారు. సుజాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులు చిక్కడ పల్లికి తరలించారు. చదవండి: వాట్సాప్ గ్రూపునకు అడ్మిన్ చేస్తే.. బయటకు తోసేశారు, న్యాయం చేయండి -
తహసీల్దార్ సస్పెన్షన్.. కుందుర్పి దాటి వెళ్లొద్దు
సాక్షి, అనంతపురం అర్బన్: ప్రభుత్వ శాఖల్లో అవినీతి, అక్రమాలను జగన్ సర్కార్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇందుకు అనుగుణంగా కలెక్టర్ నాగలక్ష్మి చర్యలు చేపట్టారు. అవకతవకలు, అక్రమాలపై విచారణ చేయించడమే కాక, తప్పు చేసినట్లు నిర్ధారణ అయితే వెంటనే చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం కూడేరు తహసీల్దారు శ్రీనివాసులపై చర్యలు తీసుకున్నారు. తాజాగా కుందుర్పి తహసీల్దారు తిప్పేస్వామిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు ఉత్తర్వులను మంగళవారం జారీ చేశారు. ముందస్తు అనుమతి లేకుండా కుందుర్పి విడిచి వెళ్లకూడదని ఆదేశాలిచ్చారు. ఇక కుందుర్పి తహసీల్దారుగా అదనపు బాధ్యతలను బ్రహ్మసముద్రం తహసీల్దారు బాలకిషన్కు అప్పగించారు. అత్మకూరులో ఉండగా అవినీతి కుందుర్పి తహసీల్దారు తిప్పేస్వామి గతంలో ఆత్మకూరు తహసీల్దారుగా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో గొరిదిండ్ల, సనప, ఆత్మకూరు, మదిగుబ్బ, పి.యాలేరు. బి.యాలేరు రెవెన్యూ గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటిపై స్పందించిన కలెక్టర్ సంబంధిత ఆర్డీఓ ద్వారా విచారణ జరిపించారు. వెబ్ల్యాండ్లో అవకతవకలకు పాల్పడి పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చినట్లు నిర్ధారణ కావడంతో కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. అవకతవకలు నిర్ధారిస్తూ ఆర్డీఓ ఇచ్చిన నివేదిక ►గొరిదిండ్ల రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబరు 5–6లో 5.17 ఎకరాలు అన్సెటిల్డ్ భూమికి (ఖాతా నెంబరు 1000010) వెబ్ల్యాండ్లో రేనాటి వరలక్ష్మి పేరును పట్టాదారుగా మార్చారు. 788–3 సర్వే నెంబరులో 4.90 ఎకరాలు అన్సెటిల్డ్ భూమి (ఖాతా నెంబరు 1000010) డి.భీమానాయక్ పేరును పట్టాదారుగా మార్చారు. సర్వే నెంబరు 604–3లో నాగలక్ష్మికి చెందిన 2.85 ఎకరాలు భూమిని కొలిమి సల్మా అనే మహిళను పట్టాదారుగా మార్చారు. సర్వే నెంబరు 1122–1లో ఎలమకూరి తనుజాకు చెందిన 4.98 ఎకరాలను డి.గీంతాజలి పేరున మార్చారు. ►సనప రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబరు 282–11లో చిన్నప్పకు చెందిన 4.15 ఎకరాల భూమిని పి.వై.ఎల్లప్ప పేరున మార్చారు. ►ఆత్మకూరు రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబరు 373లో హరిజన మంత్రి ముత్యాలప్పకు చెందిన 0.50 ఎకరాల భూమిని వై.సుందరమ్మ పేరున మార్చారు. సర్వే నెంబరు 261–1లో ఎస్.నల్లమ్మకు చెందిన 3.42 ఎకరాల భూమిని లలితమ్మ పేరున పట్టా చేశారు. సర్వే నెంబరు 502–3లో అంకంపల్లి ఓబుళపతికి చెందిన 2.10 ఎకరాల భూమిని ఎ.సోమశేఖర్ పేరున మార్చారు. సర్వే నెంబరు 2–1లో బోడిపాటి నరసమ్మకు చెందిన ఐదు ఎకరాల భూమిని వెంటేసులు, బి.హరికుమార్ పేరున మార్చారు. సర్వే నెంబరు 122–బి1ఎ3లో ఎస్.జగన్మోహన్రెడ్డికి చెందిన ఐదు ఎకరాలను ఎస్.నాగరత్నమ్మ పేరున మార్చారు. ►మదిగుబ్బలో సర్వే నెంబరు 136–6లో 1.25 ఎకరాల మిగులు భూమిని సద్దల పెద్ద నారాయణ పేరున మార్చారు. సర్వే నెంబరు 35–5లో బండి అపర్ణమ్మకు చెందిన 3.85 ఎకరాలను బండి ముత్యాలమ్మ పేరున మార్చారు. సర్వే నెంబరు 143–5బిలో 0.80 ఎకరాలు (లేని భూమి) తలారి నరసింహులు పేరున మార్చారు. ►పి.యాలేరులో సర్వే నెంబరు 403–1ఎలో మండల బొమ్మయ్యకు చెందిన ఐదు ఎకరాలను ఎం.మంజుల పేరున మార్చారు. సర్వే నెంబరు 181–1లో 2.50 ఎకరాల మిగులు భూమిని వై.సౌభాగ్య పేరున మార్చారు. సర్వే నెంబరు 58–1, 2లో ఎస్.దుబ్బరామయ్యకు చెందిన 0.98 ఎకరాలు, 0.96 ఎకరాల భూమిని సుగాలి బాబు పేరున మార్చారు. అదే సర్వే నెంబర్లలో దుబ్బరామయ్యకు చెందిన 0.97 ఎకరాలు, 0.96 ఎకరాల భూమిని సుగాలి లక్ష్మీనారాయణ పేరున మార్చారు. సర్వే నెంబరు 7–3లో జి.లక్ష్మన్నకు చెందిన 2.09 ఎకరాలను జి.శివారెడ్డి పేరున మార్చారు. సర్వే నెంబరు 453–6లో 4 ఎకరాల మిగులు భూమిని జె.మమత పేరున మార్చారు. ►బి.యాలేరులో సర్వే నెంబరు 85–1లో అన్సెటిల్డ్ భూమిని ఎనుముల అఖిల పేరున మార్చారు. సర్వే నెంబరు 224–1ఎలోని 2.20 ఎకరాలను (లేని భూమి) టి.లక్ష్మిదేవి పేరున మార్చారు. -
తృటిలో తప్పిన ప్రమాదం.. కూలిపోయిన తహసీల్దార్ ఆఫీసు పైకప్పు
సాక్షి, నిర్మల్ అర్బన్: జిల్లా కేంద్రంలో ఉన్న తహసీల్దార్ ఆఫీసు భవనం పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. భవనం పైకప్పు కూలిపోతున్న సమయంలో లోపల ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, భవనం పరిస్థితిపై గత కొంతకాలంగా సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా భవన పైకప్పు కూలిపోతున్న సమయంలో పెద్ద శబ్ధం రావడంతో అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. ఇక, కొద్దిరోజలు నుంచి నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. -
తహసీల్దార్ కంత్రీ వేషాల్.. అమ్మాయిలను లోబరుచుకుని.. వీడియోలు తీసి..
►ఏదో పనిమీద కార్యాలయానికి వెళ్లిన మహిళపై కన్నేశాడు. అసైన్డ్ భూములు రాసిస్తానంటూ ఆశపెట్టాడు. నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటూ తన అవసరం తీర్చుకున్నాడు. ఆ తర్వాత తన కింది స్థాయి సిబ్బందికీ ఆమెను అప్పగించాడు. మొత్తంగా 8 ఎకరాల ప్రభుత్వ భూమికి ఆ మహిళ పేరుపై పట్టా చేసిచ్చాడు. ►చిన్న వయస్సులోనే భర్తను కోల్పోయిన ఓ మహిళను చేరదీశాడు. మాయమాటలు చెప్పి నమ్మించాడు. ఆమె ద్వారా అమ్మాయిలకు డబ్బు ఆశ చూపించి లోబరుచుకున్నాడు. ►దాదాపు 50 ఏళ్లున్న ఆ అధికారి వైద్య ఆరోగ్యశాఖతో సన్నిహిత సంబంధాలు నెరుపుతూ.. తన బిడ్డల వయస్సున్న కొందరు విద్యార్థుల జీవితాలను బలిచేశాడు. పైగా వారి వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తూ నరకం చూపుతున్నాడు. ►ఇలా...ఎందరో మహిళల జీవితాలను నాశనం చేసిన ఆ తహసీల్దార్ అక్రమార్జనలోనూ ఆరితేరిపోయారు. అనంతపురం శ్రీకంఠంసర్కిల్: మండలానికి మెజిస్ట్రేట్.. జవాబుదారీగా ఉండాల్సిన అధికారి దారి తప్పారు. మద్యం, మగువ, మనీ కోసమే ఉద్యోగమంటూ విధులు నిర్వర్తిస్తున్నాడు. వారానికి పాతిక లక్షలు అక్రమంగా ఆర్జిస్తున్నాడు..వీకెండ్లో అమ్మాయిలతో బెంగళూరుకు వెళ్లి సేదదీరుతున్నాడు. ఇటీవల ఈ అధికారి అవినీతి అక్రమాలపై ఓ వృద్ధురాలు కలెక్టర్ నాగలక్ష్మికి ఫిర్యాదు చేయగా.. ఆమె ఆర్డీఓను విచారణకు ఆదేశించారు. విచారణ చేపట్టిన ఆర్డీఓకు కళ్లుబైర్లుకమ్మే నిజాలు తెలియడంతో ఆయన సమగ్ర నివేదిక సిద్ధం చేసి కలెక్టర్కు సమర్పించారు. ఆమె దాన్ని సీసీఎల్ఏకు పంపనున్నట్లు తెలుస్తోంది. చదవండి: బయటపడ్డ బండారం: అత్యాశకు పోయి.. ఆస్తి మొత్తం పోగొట్టుకుని.. చేయి తడపందే పని జరగదు గతంలో ధర్మవరం రెవెన్యూ డివిజన్లో పనిచేసిన సదరు తహసీల్దార్పై అవినీతి అరోపణలు వెల్లువెత్తాయి. భారీగా ముట్టజెప్పనిదే ఆయన పనిచేయరని బాధితులు గగ్గోలు పెట్టారు. పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే సొంత శాఖ ఉద్యోగిపై ప్రేమ చూపిన అధికారులు ఆ తహసీల్దార్ను అక్కడి నుంచి ఉరవకొండ నియోజకవర్గానికి బదిలీ చేశారు. అక్కడ కూడా ఆయన పనితీరు మార్చుకోలేదు. పాత రూటులోనే వెళ్తూ భారీగా వెనకేసుకున్నారు. సంవత్సరం వ్యవధిలోనే 350 మ్యుటేషన్లు చేశారు. ఇందులో 23 అనధికారికంగా చేసినట్లు విచారణలో తేలింది. ఏకంగా రూ.6 కోట్లు చేతులు మారినట్లు సమాచారం. ♦అనంతపురం అశోక్నగర్లో రూ.1.50 కోట్లు విలువైన భవనంలో ఉంటున్న సదరు అధికారి...సమీపంలో ఉన్న రూ.2 కోట్ల బిల్డింగ్ కొనుగోలుకు రూ.50 లక్షలు అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలిసింది. మరో అపార్టుమెంట్ కూడా బినామీల పేరుతో కొనుగోలు చేసి ఆధునికీకరణ పనులు చేయిస్తున్న సమాచారం. ♦బెంగళూరులో ఆరు అంతస్తుల అధునాతన భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ♦ఇటీవలే కాలువపల్లి సమీపంలో 30 ఎకరాల దానిమ్మతోట కొనుగోలు చేసినట్లు అధికారులే గుర్తించారు. అందరినీ ఏకం చేసి... తాను పనిచేసే మండల కేంద్రంలో బాగా పలుకుబడి కలిగిన వ్యక్తులను చేరదీసి దందాలకు దిగాడు. ఒక ఆర్ఎస్ఐ, వీఆర్ఓ, ఆర్ఐలతో జట్టుకట్టి భూ వివాదాలకు తెరతీశారు. రైతులు తమకు జరిగిన అన్యాయంపై నోరు మెదపాలని చూస్తే ఓ వైపు పోలీసులను, మరో వైపు రెవెన్యూ సిబ్బందిని అడ్డు పెట్టుకుని దారికి తెచ్చుకుంటున్నారు. వీడియో కాల్స్తో... భారీగా ఆర్జిస్తున్న సదరు తహసీల్దార్కు అమ్మాయిలపై వ్యామోహం ఎక్కువ. పైగా ఉదయం 11 గంటల నుంచి మద్యం మత్తులో ఉంటాడని అధికారులే చెబుతున్నారు. కార్యాలయంలో గంట కూడా ఉండని ఆయన...ఆ తర్వాత తన మండల పరిధిలోనే ఓ గదిలో మహిళలతో కలిసి రాచకార్యాలు వెలగబెడుతుంటారని చెబుతున్నారు. యువతులకు డబ్బు ఎరవేసి బలితీసుకునే సదరు అధికారి తనకు నచ్చిన యువతి... ముందుగా వీడియో కాల్లో నగ్నంగా చూడాలని షరతు పెడతాడు. ఆ తర్వాతే ఆమెతో గడుపుతాడు. నచ్చితే తనతో పాటు కారులో తీసుకెళతాడు. అనంతపురం నగరంలోని మూడ నక్షత్రాల హోటల్లో ఆయన బస చేస్తారని తెలుస్తోంది. ఇలా కొందరితో సదరు తహసీల్దార్ చేసిన వీడియో చాట్లు ఇప్పుడు బహిర్గతం కాగా, ఉన్నతాధికారులు వాటిని కూడా నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. -
శభాష్ తహసీల్దార్
మునుగోడు: వైకల్యం శరీరానికి తప్ప మనసుకు కాదని నల్లగొండ జిల్లా మునుగోడు తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాసులు నిరూపిస్తున్నారు. ఆయన వీల్ చైర్లోనే విధులు నిర్వహిస్తున్నారు. పుట్టుకతోనే దివ్యాంగుడైన ఆయన గతంలో మునుగోడు డీటీగా పనిచేశారు. ఆరు నెలల క్రితం తహసీల్దార్గా పదో న్నతి పొంది ఇక్కడే పనిచేస్తున్నారు. సోమవారం మండలంలోని చొల్లేడు గ్రామంలో బృహత్ ప్రకృతివనం ఏర్పాటుకు అధికారులు చేపట్టిన భూ పరిశీలనకు ఆయన వీల్ చైర్లో హాజరయ్యారు. -
ప్రేమించుకున్నాం.. రక్షణ కల్పించండి..
తాడిమర్రి(శ్రీసత్యసాయి జిల్లా): కులాంతర వివాహం చేసుకున్న ఓ ప్రేమజంట తమకు రక్షణ కల్పించాలంటూ తహసీల్దార్ను ఆశ్రయించారు. వివరాలు... తాడిమర్రి మండలం దాడితోటకు చెందిన ఎం.కుళ్లాయప్ప కుమారుడు రాజ్కుమార్ టైల్స్ పరిచే పనిచేస్తున్నాడు. చెన్నేకొత్తపల్లి మండలం కనుముక్కలకు చెందిన తలారి శ్రీనివాసులు కుమార్తె మౌనిక, రాజ్కుమార్ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. చదవండి👉: మేము చనిపోతున్నాం.. ఎవరూ వెతకొద్దు.. కాపాడొద్దు ఈ క్రమంలో వైఎస్సార్ జిల్లా కడపలో టైల్స్ పరిచేందుకు వెళ్లిన రాజ్కుమార్ వద్దకు ఈ నెల 4న మౌనిక ఒంటరిగా వెళ్లింది. అదే రోజు కడపలోని దుర్గమ్మ గుడిలో వీరు వివాహం చేసుకున్నారు. అయితే మౌనిక కనిపించడం లేదంటూ తండ్రి శ్రీనివాసులు చెన్నేకొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రేమ జంట ఈ నెల 24న తాడిమర్రి పోలీసు స్టేషన్లో హాజరై తాము వివాహం చేసుకున్న సంగతి తెలిపారు. అనంతరం మంగళవారం తహసీల్దార్ హరిప్రసాద్ను కలిసి అమ్మాయి తరఫు కుటుంబసభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, తగిన రక్షణ కల్పించాలంటూ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు హరిప్రసాద్, సోమశేఖర్రెడ్డి పాల్గొన్నారు. -
గాజువాక తహసీల్దార్కు 6 నెలలు జైలు శిక్ష
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో విశాఖపట్నం జిల్లా గాజువాక తహసీల్దార్ ఎంవీఎస్ లోకేశ్వరరావుకు హైకోర్టు ఆరు నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే ఆ మొత్తాన్ని రెవెన్యూ రికవరీ చట్టం కింద వసూలు చేయాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. లోకేశ్వరరావు ఈ నెల 18న హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడిషియల్) ముందు హాజరు కావాలని, అనంతరం ఆయన్ని ‘సివిల్ ప్రిజన్’కు పంపాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి తీర్పు వెలువరించారు. గాజువాక మండలం, తూంగ్లాం గ్రామం సర్వే నంబర్ 29/1లో ఉన్న తమ భూమి నుంచి అధికారులు ఖాళీ చేయిస్తున్నారంటూ పి.అజయ్కుమార్, మరొకరు హైకోర్టులో 2014లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు, పిటిషనర్లను వారి భూమి నుంచి ఖాళీ చేయించవద్దని ఆదేశించింది. అయినా, అధికారులు ఆ భూమిలో నిర్మాణాలను కూల్చివేశారు. దీంతో పిటిషనర్లు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి విచారణ జరిపారు. పిటిషనర్లు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని తహసీల్దార్ తన కౌంటర్లో వివరించారు. ఇతర అధికారుల కౌంటర్లను కూడా పరిశీలించిన న్యాయమూర్తి తీర్పు వెలువరిస్తూ.. పిటిషనర్లు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటే చట్ట ప్రకారం ఖాళీ చేయించాల్సిందన్నారు. తహసీల్దార్ ఆ పని చేయకుండా నిర్మాణాలను కూల్చివేశారని, అది కూడా కోర్టు ఉత్తర్వులు ఉండగా చేశారని ఆక్షేపించారు. కోర్టు ఉత్తర్వులు చట్ట విరుద్ధమైతే అప్పిలేట్ కోర్టులో సవాలు చేయాలే తప్ప, వాటికి విరుద్ధంగా వ్యవహరించడానికి వీల్లేదని చెప్పారు. తహసీల్దార్ ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని తేల్చారు. అందువల్ల కోర్టు ధిక్కార చట్టం కింద తహసీల్దార్కు 6 నెలల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తున్నట్లు న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. -
మంచిర్యాల: కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏ హత్య
-
కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏ దారుణ హత్య
సాక్షి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయంలో కొత్తపల్లి వీఆర్ఏ దుర్గం బాబును దుండగులు కత్తితో గొంతు కోసి హత్య చేశారు. సోమవారం ఉదయం రక్తపు మడుగులో పడి ఉన్న దుర్గంబాబును గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. వ్యక్తిగత కక్షలతో వీఆర్ఏ హత్య జరిగిందా లేదా రెవెన్యూ అధికారుల మధ్య విబేధాలతో హత్య చోటుచేసుకుందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కాగా దుర్గం బాబు కొత్తపల్లి వీఆర్ఏగా పనిచేస్తున్నాడు, కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రాత్రిపూట విధులు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. చదవండి: ఫస్ట్ టైం క్రిమినల్స్: సినిమాలు, యూట్యూబ్ చూసి నేర్చుకుంటున్నారు అయితే కొత్తపల్లి గ్రామంలో ఓ వ్యక్తి గత కొన్ని రోజులుగా చంపేస్తామని బెదరిస్తున్నారని, అదే విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని దుర్గంబాబు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అతనే బాబును హత్య చేసి ఉంటాడని ఆరోపణలు చేస్తున్నారు. చదవండి: Banjara Hills: సీఎం శిలాఫలకానికే దిక్కులేదు.. ఇప్పటికైనా సాధ్యమేనా..? -
బాబు నుంచి భూమిని ఇప్పించండి
తాడేపల్లి రూరల్: తన ఇంటికి వెళ్లడానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు వాడుతున్న రోడ్డు స్థలం తమదేనని, దాన్ని ఇప్పించాలని గుంటూరు జిల్లా ఉండవల్లికి చెందిన సింగంశెట్టి శ్రీనివాసరావు తాడేపల్లి తహసీల్దార్కు వినతిపత్రం అందించాడు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్ శ్రీనివాసులురెడ్డిని కలిశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఉండవల్లిలో ఆయన నివాసముంటున్న లింగమనేని ఎస్టేట్కు దారిలేకపోవడంతో ఆర్డీవో, తాడేపల్లి తహసీల్దార్లు.. శ్రీనివాసరావుకు చెందిన 8 సెంట్ల స్థలాన్ని తీసుకున్నారు. ఈ స్థలంలో చంద్రబాబు ఇంటికి వెళ్లడానికి వీలుగా బీటీ రోడ్ వేశారు. అయితే ఈ స్థలానికి సంబంధించి బాధితుడికి రూపాయి కూడా చెల్లించలేదు. అప్పటి నుంచి అదిగో ఇస్తాం.. ఇదిగో ఇస్తాం అంటూ కాలం గడిపారు. ఇప్పుడు తన తండ్రి శేషగిరిరావుకు ఆరోగ్యం బాగోలేదని.. ఇప్పటికే రూ.10 లక్షల వరకు ఖర్చు పెట్టామని శ్రీనివాసరావు వాపోతున్నాడు. వైద్యానికి నగదు లేక ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చేశామని కన్నీటిపర్యంతమయ్యాడు. తన తండ్రి వైద్యానికి మరో రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుందని.. తమ స్థలం తమకు ఇస్తే అమ్ముకుని వైద్యానికి డబ్బు సమకూర్చుకుంటామని చెబుతున్నాడు. తన తండ్రి చావుబతుకుల్లో ఉంటే మరోవైపు తమకు కమీషన్ ఇస్తే స్థలానికి డబ్బులు ఇప్పిస్తామంటూ టీడీపీ నేతలు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ స్థలం అయినా తమకు అప్పగించాలని లేదా నగదు అయినా ఇవ్వాలని కోరాడు. లేకపోతే చంద్రబాబు ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని శ్రీనివాసరావు పేర్కొన్నాడు. -
తహసీల్ ఆఫీస్కే ఆపద !
సాక్షి, కామారెడ్డి: శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు తయారైంది రెవెన్యూశాఖ పరిస్థితి. అందరి భూముల సమస్యలను పరిష్కరించే ఆ శాఖకే ఆపద వచ్చిపడింది. భూముల రికార్డులు భధ్రపరచడంతో పాటు భూముల రిజిస్ట్రేషన్లు జరిగే తహశీల్దార్ కార్యాలయ భవనం ఉన్న స్థలం అటవీశాఖదట. తహసీల్ ఆఫీస్, మండల పరిషత్ కార్యాలయం, జూనియర్ కాలేజీ భవనం...ఇలా అక్కడ ఉన్న ప్రభుత్వ కార్యాలయాలన్నీ అటవీశాఖకు సంబందించిన సర్వేనంబరులోనే ఉన్నాయంటున్నారు. అలాగే 175 మంది రైతులకు సంబందించిన వ్యవసాయ భూములు, 70 కిపైగా నివాసపు గృహాలు కూడా ఆ సర్వేనంబరులోకి వస్తాయట. ఎప్పుడో విడుదల చేసిన అటవీ శాఖ గెజిట్లో సదరు సర్వేనంబరు అటవీశాఖదిగా పేర్కొనడం ఇప్పుడు రెవెన్యూ శాఖకు తలనొప్పి తెచ్చిపెట్టింది. ఫారెస్ట్ గెజిట్లో పేర్కొన్న సర్వే నంబర్లకు సంబందించి ఎలాంటి పాసుపుస్తకాలు జారీ చేయకూడదని స్పష్టమైన ఆదేశాలున్నాయి. దీంతో ఆ సర్వేనంబరులోని రైతులకు పాసుపుస్తకాల జారీ ఆగిపోయింది. ఫలితంగా రైతుబంధు నిలిచిపోయింది. బాధిత రైతులు ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే రెవెన్యూ కార్యాలయమే ఆపదలో ఉంటే రైతుల కష్టం తీర్చేదెవరని నోరెల్లబెడుతున్నారు. లింగంపేట మండల కేంద్రంలో ప్రధాన రహదారికి సమీపంలో 983 సర్వే నంబరులో 450.08 ఎకరాల భూమి ఉంది. ఈ సర్వేనంబరులో 175 మంది రైతులు వందలాది ఎకరాల భూమిని సాగుచేస్తున్నారు. 2005లో 150 ఎకరాలకు పట్టాలతో పాటు పట్టాదారు పాసుపుస్తకాలు కూడా ఇచ్చారు. రైతులు బోర్లు తవ్వించుకుని పంటలు సాగు చేస్తున్నారు. పంట రుణాలు పొందారు. కొంత కాలం రైతుబంధు కూడా అందుకున్నారు. అదే సర్వేనంబరులో మూడు దశాబ్దాల క్రితం ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించారు. అలాగే 70 కి పైగా ఇండ్లు కూడా నిర్మించుకుని ఉంటున్నారు. దశాబ్దాల తరబడిగా ఆ స్థలంలో జీవనం సాగుతోంది. రికార్డుల ప్రక్షాలణతో వెలుగులోకి.... రాష్ట్ర ప్రభుత్వం భూముల రికార్డుల ప్రక్షాలన మొదలుపెట్టిన సమయంలో అటవీ శాఖ తమ గెజిట్లోని సర్వే నంబర్లకు సంబందించిన వివరాలను రెవన్యూ శాఖ ముందుంచింది. రికార్డుల ప్రక్షాలన కొనసాగుతూ ఆ సర్వేనంబరుకు వచ్చేసరికి రెవెన్యూ అధికారులు షాక్కు గురయ్యారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం దొరకలేదు. ఫారెస్ట్ గెజిట్లో పేర్కొన్నదానిని మార్చాలంటే ఇప్పట్లో సాధ్యం అయ్యే పనికాదని కూడా అంటున్నారు. కాగా అటవీ శాఖ గెజిట్లో 983 సర్వేనంబరు ఉండడంతో అందులో భూములు కలిగి ఉండి పంటలు సాగుచేస్తున్న రైతులకు డిజిటల్ పాసుపుస్తకాలు అందలేదు. దీంతో రైతులకు రైతుబంధు కూడా నిలిచిపోయింది. అక్కడి రైతులు ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం దక్కడం లేదు. డిజిటల్ పాసుపుస్తకాలు రాకపోవడం, ఆ సర్వేనంబరును హోల్డ్లో పెట్టడంతో రైతుబంధు నిలిచిపోయింది. దీంతో రైతులు ఆవేధన చెందుతున్నారు. జడ్పీ సమావేశంలో ఇదే అంశంపై చర్చ.... ఈ నెల 5న జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో లింగంపేట ప్రజాప్రతినిధులు 983 సర్వేనంబరుకు సంబందించిన సమస్యను ప్రస్తావించారు. ఆ సర్వే నంబరు గెజిట్లో ఉందని అటవీ శాఖ జిల్లా అధికారి నిఖిత పేర్కొన్నారు. తహశీల్దార్ కార్యాలయం కూడా అదే సర్వే నంబరులో ఉందని పేర్కొనడంతో సభలో నవ్వులు పూశాయి. తహశీల్దార్ కార్యాలయం అటవీశాఖ సర్వేనంబరులోనిది కావడంతో అందరూ విస్తుపోయారు. తమ చేతిలో ఏమీలేదని అటవీ అధికారులు సభలో పేర్కొన్నారు. అయితే అటవీ శాఖకు సంబందించిన భూమిని కొందరు రియల్టర్లు కబ్జా చేసి అమ్ముకుంటున్నారని, దానిపై కేసులు వేశారని సభ్యులు పేర్కొనగా తాము కౌంటర్ పిటీషన్ వేసినట్టు ఆమె వివరణ ఇచ్చారు. ఫారెస్ట్ గెజిట్లో పేర్కొనడం వల్లే సమస్య.... 983 సర్వేనంబరునుఫారెస్ట్ గెజిట్లో పెట్టారు. అందువల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గెజిట్లో మార్పులు జరిగితేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఉన్నతాధికారులకు గతంలోనే నివేదించాం. మా చేతుల్లో ఏమీ లేదు. రైతులు కూడా తిరుగుతున్నారు. పరిష్కారం దొరకాలంటే ఉన్నత స్థాయిలో ప్రయత్నాలు జరగాల్సిన అవసరం ఉంది. గెజిట్లో ఆ సర్వేనంబరును తొలగిస్తేగానీ ఇబ్బంది పోదని భావిస్తున్నాం. –అమీన్ సింగ్, తహశీల్దార్ -
చిరంజీవి స్టెప్పులతో రఫ్ఫాడించిన తహశీల్దార్.. వీడియో వైరల్
సాక్షి మహబూబాబాద్: ఆయన తహశీల్దార్.. నిత్యం ఆఫీస్లో ఫైళ్లతో కుస్తీ పడుతుంటారు. ఎప్పుడూ రెవెన్యూ పని మీదే బిజీగా ఉంటారు. అయితే పనులన్నింటినీ కాసేపు పక్కకుపెట్టి సరదాగా గడిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన తహశీల్దార్ నూతన సంవత్సరం వేడుకల్లో డ్యాన్స్ స్టెప్పులతో అలరించారు. కల్లూరు మండల రెవెన్యూ అధికారిగా మంగీలాల్ విధులు నిర్వహిస్తున్నారు. నిత్యం రెవిన్యూ పరిధిలో పనులతో బిజీగా గడిపే తహశీల్దార్ నూతన సంవత్సర వేడుకల్లో తనదైన స్టైల్లో డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. మంగీలాల్ స్వగ్రామం మహబూబాబాద్ జిల్లాలోని బలపాలపల్లి గ్రామం.అయితే అక్కడ జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో స్నేహితులతో కలిసి చిందేశారు. డ్యాన్సర్లకు ధీటుగా స్టెప్పులు వేస్తూ అలరించారు. అచ్చం మెగాస్టార్ చిరంజీవి స్టెప్పులతో రఫ్ఫాడించాడు. ప్రస్తుతం తహశీల్దార్ మంగీలాల్ డ్యాన్స్ చేసిన వీడియో స్థానిక వాట్సప్ గ్రూప్లలో వైరల్గా మారింది. చదవండి: దేశంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్.. 84 ఏళ్ల చరిత్ర, నుమాయిష్ ఐడియా ఎలా వచ్చిందంటే.. -
Bribe: కదిరి తహశీల్దార్ ఆడియో వైరల్.. కలెక్టర్ సీరియస్
అనంతపురం అర్బన్: కదిరి తహసీల్దారు మారుతిపై కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ చర్యలు తీసుకున్నారు. ఆయన్ను కదిరి తహసీల్దారు స్థానం నుంచి రిలీవ్ చేస్తూ..కలెక్టరేట్లో రిపోర్ట్ చేసుకోవాలని ఆదేశిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: యాంకర్ అనసూయ ఇంట్లో తీవ్ర విషాదం పట్టాదారు పాసు పుస్తకం మంజూరుకు తహసీల్దారు లంచం అడుగుతున్నట్లుగా వాయిస్ రికార్డ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో ఆయనపై కదిరి ఆర్డీఓ ద్వారా ప్రాథమిక విచారణ చేయించారు. ఆర్డీఓ ఇచ్చిన నివేదికపై కలెక్టర్ సంతృప్తి చెందలేదు. ఈ వ్యవహారంపై జాయింట్ కలెక్టర్తో సమగ్ర విచారణ చేయించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. విచారణ అధికారి నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. -
‘సారూ.. భూములు లాక్కోద్దు’ తహసీల్దార్ కాళ్లపై రైతులు
జగిత్యాల రూరల్: తమ భూములు లాక్కోవద్దని రైతులు తహసీల్దార్పై కాళ్లపై పడ్డారు. పల్లె ప్రకృతి వనానికి కేటాయించిన స్థలం తమ పొలంగా పేర్కొంటూ కొందరు రైతులు ఆందోళన చేసిన ఘటన జగిత్యాల జిల్లా వెల్దుర్తిలో చోటుచేసుకుంది. గ్రామ శివారు సర్వే నంబర్ 125లో బృహత్ పల్లెప్రకృతి వనం నిర్మాణానికి 10 ఎకరాలు కేటాయించారు. ఆ భూమిలో మూడు రోజులుగా నేల చదును చేసే పనులు చేస్తున్నారు. అయితే గ్రామానికి చెందిన కొంతమంది అది తమ భూమి అని పనులు అడ్డుకున్నారు. రూరల్ తహసీల్దార్ దిలీప్ నాయక్, ఎంపీడీఓ రాజేశ్వరి మంగళవారం గ్రామానికి వెళ్లి పనులు పరిశీలించారు. ఈ క్రమంలో పలువురు గ్రామస్తులు.. తమ భూములు లాక్కోవద్దని తహసీల్దార్ కాళ్లపై పడ్డారు. తమకు న్యాయం చేయాలని మొరపెట్టుకున్నారు. చదవండి: ‘సింగరేణి’పై రాజకీయ పార్టీల సిగపట్లు చదవండి: ట్రాఫిక్ చలాన్ ఎలా వేస్తారని సర్పంచ్ హల్చల్ -
తెలంగాణలో ఎవరూ ఆకలితో అలమటించొద్దు
హుజూరాబాద్: తెలంగాణలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనేదే సీఎం కేసీఆర్ లక్ష్యమని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లోని ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం హుజురాబాద్ నియోజకవర్గ తహసీల్దార్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నూతనంగా మంజూరైన రేషన్ కార్డులన్నింటినీ ప్రింట్ తీసి, లబ్దిదారుల ఇంటికి వెళ్లి కొత్త కార్డుతో పాటుగా, 5వ తేదీలోగా బియ్యం పంపిణీ కూడా చేపట్టాలని అధికారులకు సూ చించారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతీ ఒక్కరికి తెలుపు రేషన్ కార్డు మంజూరు చేశామని వెల్లడించారు. నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఎంతమందికి కొత్త రేషన్ కా ర్డులు మంజూరు అయ్యాయని అడిగి తెలుసుకున్నారు. ఆయా మండలాలకు సంబంధించిన అ ధికారులు, తదితరులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మాట్లాడారు. కొత్త రేషన్ కార్డుల మంజూరు, బియ్యం పంపిణీ విషయాల గురించి తెలుసుకొని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో సీహెచ్. రవీందర్రెడ్డి పాల్గొన్నారు. చదవండి: ఉద్రిక్తతకు దారితీసిన ‘జెండా గద్దె పంచాయితీ’ చదవండి: తెలంగాణ సిగలో మరో అందం.. వెలుగులోకి కొత్త జలపాతం -
రెవెన్యూ శాఖలో పదోన్నతులు!
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న రెవెన్యూ ఉద్యోగులకు ఎట్టకేలకు ఊరట. ఈ శాఖ పరిధిలోని ఉద్యోగులకు సెప్టెంబర్లో పదోన్నతులిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇటీవల తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్కుమార్ను కలిసినప్పుడు ఆయన ఈ మేరకు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల నుంచి సీనియర్ అసిస్టెంట్ హోదా వరకు పలుస్థాయిల్లో పదోన్నతులు వస్తాయని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. 40–50 స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, 90–100 డిప్యూటీ కలెక్టర్లు, 160 తహశీల్దార్ పోస్టులు ఖాళీలున్నాయని తెలుస్తోంది. ఈ ఏడాదిలో 369 మంది నాయిబ్ తహశీల్దార్లకు తహశీల్దార్లుగా ప్రమోషన్లు ఇవ్వాలని శాఖాపరమైన పదోన్నతుల కమిటీ (డీపీసీ) నిర్ణయించిందని, అయితే ఇందులో 190 మందికి మాత్రమే పదోన్నతులు ఖరారు చేయగా, మిగిలిన వారికి ఇవ్వలేదని సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలోనే పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానున్నప్పటికీ ప్యానెల్ ఇయర్ ఈనెల 31తో ముగియనున్న నేపథ్యంలో డీపీసీ ఆమోదం వచ్చినా పదోన్నతులు రాని నాయబ్ తహసీల్దార్ల విషయంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆందోళన కూడా ఆ వర్గాల్లో వ్యక్తమవుతోంది. గ్రామానికి ఒక్కరే వీఆర్ఏ! సీఎస్ సోమేశ్కుమార్తో ట్రెసా నేతల భేటీ సందర్భంగా వీఆర్ఏలకు పేస్కేల్ ఇస్తామని, వీఆర్వోల వ్యవస్థను రద్దు చేసినందున వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, రాష్ట్రంలో ప్రస్తుతం (వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేయడానికి ముందు) 5,836 మంది వీఆర్వోలుగా పనిచేస్తున్నారు. వీరి భవిష్యత్తు ఏమవుతుందనే ఆందోళన సిబ్బందిలో కనిపిస్తున్నా, వారిలో అర్హులను రెవెన్యూ శాఖలోనే కొనసాగించి, మిగిలిన వారిని ఇతర శాఖలకు బదిలీ చేస్తారని తెలుస్తోంది. వీఆర్ఏల విషయానికి వస్తే గ్రామానికి ఒక్కరిని మాత్రమే వీఆర్ఏగా కొనసాగిస్తారని సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం 22 వేల మంది వీఆర్ఏలు ఉండగా, గ్రామానికి ఒకరి చొప్పున కొనసాగిస్తే 10 వేల మందికి ఊరట కలగనుంది. మిగిలిన వారిని అర్హతలకు అనుగుణంగా ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. సీనియార్టీ సమస్యలు రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో స్పెషల్గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ (ఎస్జీడీసీ)ల వరకే పదోన్నతులు లభిస్తున్నాయి. ఆ తర్వా త రెవెన్యూ కోటాలో కన్ఫర్డ్ ఐఏఎస్లుగా మాత్రమే అవకాశముంది. దీంతో సీనియార్టీ సమస్యలు వస్తున్నాయని రెవె న్యూ సంఘాలంటున్నాయి. డీఆర్వో, జేసీలాంటి పోస్టుల్లో ఈ సమస్యలు వస్తున్నాయని, డీఆర్వో పోస్టుకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను పరిగణనలోకి తీసుకుంటుండటంతో ఆ తర్వాత పదోన్నతులు రావడం లేదని అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ శాఖ పరిధిలో సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ (ఎస్జీడీసీ) పోస్టు సృష్టించాలని ‘ట్రెసా’విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈసారి ఐదు ఆప్షన్లు రెవెన్యూ ఉద్యోగుల బదిలీలకు కూడా ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఈ బదిలీలకు ఒకట్రెండు ఆప్షన్లు ఇచ్చే సంప్రదాయం ఉండగా, ఈసారి ఐదు రకాల ఆప్షన్లు ఇస్తామని సీఎస్ హామీ ఇచ్చారు. ఇందులో స్పౌస్, మెడికల్, పీహెచ్సీ, జిల్లా, మల్టీజోన్ ఆప్షన్లు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. -
క్షణ క్షణం.. భయం భయం!
అంబర్పేట: అంబర్పేట తహశీల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరింది. పాత భవనంలో తహశీల్దార్ కార్యకలాపాలు నిర్వహించడానికి సిబ్బంది అవస్థలు పడుతున్నారు. రెండు దశాబ్ధాల క్రితం నిర్మించిన భవనంలో ఇప్పటికీ తహశీల్దార్ కార్యాలయం కొనసాగుతుండటంతో అటు సిబ్బంది, ఇటు పౌరులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మారినా తహశీల్దార్ కార్యాలయం మాత్రం మారడం లేదు. శిథిల భవనంలో సిబ్బంది తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. నిత్యం వందలాది పౌరులకు, వివిధ సేవలు అందించే కార్యాలయం సౌకర్యవంతంగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉదయం కార్యాలయం ప్రారంభం కాగానే వివిధ పనుల కోసం కార్యాలయానికి వచ్చి అసౌకర్యానికి గురవుతున్నారు. కార్యాలయ ఆవరణలో రేకుల షెడ్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, శిథిల భవనంలో తహశీల్దార్తో పాటు డిప్యూటీ తహశీల్దార్ విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఈ కార్యాలయానికి వచ్చిన కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు సైతం ఇదేం కార్యాలయం అన్న సందర్భాలు సైతం ఉన్నాయి. ఇప్పటికైనా తహశీల్దార్ కార్యాలయాన్ని పునర్నిర్మించాలని పలువురు కోరుతున్నారు. అమలుకు నోచుకోని హామీలు తహశీల్దార్ కార్యాలయాన్ని పునర్నిర్మిస్తామని ప్రజాప్రతినిధులు అనేక సందర్భాల్లో హామీలు, ప్రకటనలు ఇచ్చారే తప్ప ఇప్పటివరకు అవి ఆచరణకు నోచుకోలేదు. నియోజక వర్గంతో పాటు మలక్పేట నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలు ఈ మండల పరిధిలోకి వస్తాయి. నిత్యం ఆ దాయ, కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు ప్రభు త్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబా రక్, ఆసరా పెన్షన్లు వంటి ప్రభుత్వ పథకాలు ఈ కార్యాలయం నుంచే సేవలు అందించాల్సి ఉంటుంది. ప్రభుత్వ పథకాలు అమలు చేసే కీలకమైన తహశీల్దార్ కార్యాలయం అధ్వానంగా ఉండటంపై పలువురు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు సైతం ఈ కార్యాలయానికి వచ్చి పోతుంటారే తప్ప పునర్ నిర్మించేందుకు చొరవ తీసుకోకపోవడం గమనార్హం. అసౌకర్యంగా ఉన్నా మెరుగైన సేవలందిస్తున్నాం తహశీల్దార్ కార్యాలయం పునర్ నిర్మాణానికి ప్రతిపాదనలు చేశామని ఎమ్మెల్యే సమాచారం ఇచ్చారు. ఎమ్మెల్యే నిధులు విడుదల కాగానే మొదటి ప్రాధాన్యతలో భాగంగా కార్యాలయ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఈవిషయంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం విధులు నిర్వహించేందుకు అసౌకర్యంగా ఉన్నా మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. – వేణుగోపాల్, అంబర్పేట తహశీల్దార్ కార్యాలయ ఆవరణలోప్రమాదకరంగా ఎండిన చెట్టు -
ఏసీబీ వలలో కాటారం తహశీల్ధార్
సాక్షి, భూపాలపల్లి: కాటారం తహశీల్దార్ మేడిపల్లి సునీత 2లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఐత హరికృష్ణకు చెందిన కొత్తపల్లి శివారులోని సర్వే నెంబరు-3 లో భూమికి ఆన్లైన్ చేసి, పట్టా పాస్ బుక్కుల కోసం 3 లక్షలు తహశీల్దార్ డిమాండ్ చేశారు. చివరకు రూ. 2 లక్షలు తీసుకుంటూ సునీత.. ఏసీబీ అధికారులకు చిక్కారు. -
చోడవరం తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి బాగోతం
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని చోడవరం తాసిల్దార్ కార్యాలయంలో అవినీతి బాగోతం బయటపడింది. భూమి మార్పిడి పేరిట నాలుగు లక్షల లంచం తీసుకుంటూ తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ ఏసీబికి అడ్డంగా దొరికొపోయారు. వీరికి సహకరించిన డ్రైవర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. చోడవరం సమీపంలోని నరసాపురం వద్ద ఓ వ్యవసాయ భూమిని నివాసభూమి గా మార్చేందుకు ఓ వ్యక్తి ఎమ్మార్వో కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ఆ పనులు చేయకుండా ఎమ్మార్వో కార్యాలయం సిబ్బంది జాప్యం చేశారు. ఈ దశలో దరఖాస్తుదారుడు ఎమ్మార్వో రవికుమార్తో పాటు డిప్యూటీ తాసిల్దారు రాజాను కలిసి భూముల రికార్డుల మార్పిడి చేయాలని కోరాడు. ఈ పని పూర్తి చేయాలంటే నాలుగున్నర లక్షల రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ మొత్తాన్ని తాసిల్దారు డ్రైవర్ రమేష్ కు ఇవ్వాలని తెలిపారు. దీంతో ఏసీబీని ఆశ్రయించిన సదరు వ్యక్తి వారి సూచనల మేరకు డ్రైవర్ రమేష్కు నాలుగున్నర లక్షల రూపాయలను ఇస్తుండగా ఏసీబీ అధికారులు వలవేసి పట్టుకున్నారు. అనంతరం తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్లను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు వారి ఇళ్లపై సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ రామచంద్ర పర్యవేక్షణలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. -
ఇదే నామాట.. నా మాటే శాసనం.. తహసీల్దార్పై ఎమ్మెల్సీ సోదరి జులుం..
సాక్షి ప్రతినిధి, వరంగల్: జిల్లాలో మరో తహసీల్దార్ బదిలీ జరిగింది. అయితే, ఇది సాధారణ బదిలీ కాదు! మైనింగ్ మాఫియాను అడ్డుకున్నందుకు వేలేరు తహసీల్దార్ విజయలక్ష్మి బ‘ది’లీ అయినట్లు తెలుస్తోంది. సుమారు వారం పాటు తర్జనభర్జన చేసిన జిల్లా యంత్రాంగం ఎట్టకేలకు రాజకీయ నేతల ఒత్తిడికే తలొగ్గినట్లు కనిపిస్తోంది. వేలేరు తహసీల్దార్ను కలెక్టరేట్కు బదిలీ చేసి సమస్యకు పుల్స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే తహసీల్దార్, వేలేరు జెడ్పీటీసీకి నడుమ జరిగిన ఫోన్ సంభాషణ బయటకు లీక్ కావడంతో మొత్తం వ్యవహారం చర్చనీయాంశమైంది. ఇప్పుడిది అటు ఉద్యోగ, ఇటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అసలేం జరిగింది.. వేలేరు మండలం షోడషపల్లి శివారు లోక్యాతండాలో కొంత కాలంగా మొరం అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో రాజకీయ ఒత్తిడి నేపథ్యాన చాలాకాలంగా రెవెన్యూ యంత్రాంగం చూసీచూడనట్లు ఉంటోంది. కానీ స్థానిక ప్రజాప్రతినిధుల నడుమ తలెత్తిన అంతర్గత వివాదాల కారణంగా మైనింగ్పై తరుచూ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో మొరం తరలిస్తున్న వాహనాలను వేలేరు తహసీల్దార్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో అధికారులు అడ్డుకున్నారు. వీటిని సీజ్ చేసి పెద్ద మొత్తంలో జరిమానా విధించడానికి సిద్ధమయ్యారు. ఇంతలోనే విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి సోదరి.. వేలేరు జెడ్పీటీసీ సరిత రంగంలోకి దిగారు. నేరుగా తహసీల్దార్కు ఫోన్ చేసిన సీజ్ చేసిన వాహనాలకు కేవలం రూ.25వేల చొప్పున మాత్రమే జరిమానా విధించాలని సూచించారు. అక్కడి నాయకుల మాటలు విని ఎక్కువ ఫైన్ వేయొద్దని చెప్పారు. అంతేకాకుండా తాను ఎమ్మెల్సీ సోదరినని.. తాను చెబితే ఎమ్మెల్సీ చెప్పినట్లుగానే భావించాలని తెలిపారు. దీనికి తహసీల్దార్ ససేమిరా అన్నారు. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చెప్పి ఒక్కో వాహనానికి రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. దీంతో వివాదం మరింత ముదిరింది. జెడ్పీటీసీ – తహసీల్దార్ నడుమ మాటామాటా పెరిగినా, తహసీల్దార్ వెనక్కి తగ్గలేదు. దీంతో ఆమెను బదిలీ చేయించేందుకు ఉన్నతాధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. ఫలితంగా ప్రజాప్రతినిధి మాట విననందుకు తహసీల్దార్ విజయలక్ష్మి అక్కడి నుంచి కలెక్టరేట్ బదిలీ అయ్యారు. గ్రామస్తుల ఫిర్యాదు తహసీల్దార్ – జెడ్పీటీసీ నడుమ వ్యవహారం రచ్చగా మారడంతో గ్రామంలో మైనింగ్ను వ్యతిరేకిస్తున్న వారు తెరపైకి వచ్చారు. ఏకంగా వారు «పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇలా వ్యవహారం పెద్దగా మారుతుండడంతో ఇరువర్గాల వారికి కూర్చోబెట్టి సయోధ్య కుదర్చడానికి కొందరు ప్రజాప్రతినిధులు చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. అయితే, ఫోన్లో మాట్లాడే క్రమంలో స్థానిక నాయకులపై కూడా జెడ్పీటీసీ అనుచితంగా మాట్లాడటం గ్రామస్తులు, పలువురు ప్రజాప్రతినిధులను ఆగ్రహానికి గురిచేసినట్లు సమాచారం. దీంతో వీరిని కూడా బుజ్జగించేందుకు చర్యలు మొదలయ్యాయని తెలుస్తోంది. నేనే సమాచారం ఇచ్చా... మొత్తం వ్యవహారంపై వేలేరు జెడ్పీటీసీ చాడ సరిత వివరణ ఇస్తూ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. లోక్యాతండా నుంచి కొందరు మొరం తరలిస్తుండగా తానే అడ్డుకుని తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా మైనింగ్ అధికారులకు సైతం ఫోన్లో సమాచారం ఇచ్చానని పేర్కొన్నారు. అంతేతప్ప ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని పేర్కొన్నారు. ఇక కలెక్టరేట్ అధికారులు మాత్రం వేలేరు తహసీల్దార్ బదిలీ వ్యవహారాన్ని పరిపాలనా సౌలభ్యం కోసమే చేపట్టినట్లుగా చూడాలని చెబుతున్నారు. రాజకీయ ఒత్తిళ్లు కొన్ని సందర్భాల్లో సహజమే అయినా వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సామరస్య పూర్వకంగా పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: పేకాటలో దొరికిన మంత్రి మల్లారెడ్డి సోదరుడు -
ఫోన్కాల్ కలకలం: ‘నువ్వేమైనా కేసీఆర్వా.. లేక ఎర్రబెల్లివా?’
హన్మకొండ అర్బన్: వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి సోదరి చాడ సరిత వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలో మొరం తరలింపు విషయం వివాదంగా మారింది. అప్పట్లో స్వాధీనం చేసుకున్న ఇటాచీ సహా ఇతర వాహనాలను తక్కువ జరిమానాతో వదిలేయాలని అక్కడి తహసీల్దార్ విజయలక్ష్మికి ఫోన్లో హుకుం జారీ చేశారు సరిత. అయినా తహసీల్దార్ వినకపోవడంతో గట్టిగా బెదిరించారు. ఇటీవల జడ్పీటీసీ, తహసీల్దార్ మధ్య సాగిన ఫోన్ సంభాషణ బుధవారం సోషల్ మీడి యాలో వైరల్గా మారింది. తాను చెప్పినా.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి చెప్పినా ఒక్కటిగా భావించాలని, ఎమ్మెల్సీ మాట వింటారా, ఎంపీపీ మాట వింటారా మొదట తేల్చుకోవాలని జడ్పీటీసీ సరిత చెప్పారు. ‘రూ.25 వేలు కట్టించుకుని మిషన్ రిలీజ్ చేయండి.. అక్కడే పెట్టుకుంటే తుప్పు పట్టి పోవాల్నా.. అవసరమైతే ఎమ్మార్వో ఆఫీసు ఎదుట కూర్చుంటా’అని సరిత హెచ్చరించారు. అయితే.. తాము మొదటి నుంచీ రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తున్నామని, అయినా కలెక్టర్ చెప్పినట్లు చేస్తానని తహసీల్దార్ చెప్పడంతో.. జడ్పీటీసీ జోక్యం చేసుకొని ‘మనవాడే కదా అని తీసుకొస్తే రూ.లక్ష కట్టమంటే ఎలా? రూ.25 వేలు కట్టించుకొని రిలీజ్ చేయాలని హుకుం జారీ చేశారు. అసలు ఎంపీపీ ఎవరు? ఏమన్నా.. ఎర్రబెల్లి దయాకర్రావా.. లేకుంటే కల్వకుంట్ల చంద్రశేఖర్రావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను ప్రతీదిఅన్నయ్యకు చెప్పి చేస్తా.. ఇది మా అన్నయ్య మాట. పల్లా మాట వింటారా... ఎంపీపీ మాట వింటారా మీ ఇష్టం అని’సరిత చెప్పారు. తర్వాత ఏం జరిగిందో కానీ వేలేరు తహసీల్దార్ విజయలక్ష్మిని కలెక్టరేట్కు బదిలీ చేయడం కొసమెరుపు. చదవండి: కఠిన కర్ఫ్యూ.. తెలంగాణలో భారీగా లాక్డౌన్ సడలింపులు -
వామ్మో..! యాసిడ్ తాగేసిన తహసీల్దార్
జమ్మూ: విధుల్లో భాగంగా తహసీల్దార్ ఓ గ్రామానికి వెళ్లగా అక్కడ పని ముగిసిన తర్వాత దుకాణంలో నీళ్ల బాటిల్గా భావించి యాసిడ్ బాటిల్ తీసుకుని తాగేశాడు. వెంటనే అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని తోటి ఉద్యోగులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉంది. అయితే దుకాణదారుడు నీళ్ల బాటిల్ అనుకుని పొరపాటున యాసిడ్ బాటిల్ ఇచ్చాడు. దీంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన జమ్మూకశ్మీర్లో బుధవారం జరిగింది. కుల్గాం జిల్లాలోని దమాల్ హంజిపూర ప్రాంత తహసీల్దార్ నియాజ్ అహ్మద్ ఓ గ్రామంలో సాగు చేస్తున్న గసగసాల పంట పొలాలను పరిశీలించారు. అనంతరం వాటిని ధ్వంసం చేసి ఉదయం 11 గంటల సమయంలో అక్కడే ఉన్న ఓ దుకాణానికి వెళ్లారు. నీళ్ల బాటిల్ అడగ్గా దుకాణదారుడు పొరపాటున యాసిడ్ బాటిల్ ఇచ్చాడు. ఇది గమనించకుండా తహసీల్దార్ నియాజ్ అహ్మద్ తాగేశాడు. తాగిన వెంటనే ఆయన అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే తోటి ఉద్యోగులు స్థానికులతో కలిసి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన దమాల్ హంజిపురలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన అధికారులు దుకాణదారుడిని అరెస్ట్ చేసి అతడిని పోలీస్స్టేషన్కు తరలించారు. చదవండి: అయ్యో పాపం.. అదా రాణి! -
వృద్ధురాలికి అంత్యక్రియలు... మానవత్వం చాటుకున్న తహసీల్దార్
సాక్షి, గడివేముల: కుటుంబ సభ్యులంతా కరోనా బారినపడి కోవిడ్ కేర్ సెంటరులో ఉండగా.. ఇంటి వద్ద అనాథలా మృతిచెందిన ఓ వృద్ధురాలికి అంత్యక్రియలు చేయడానికి స్థానికులెవరూ ముందుకు రాలేదు. కానీ స్వయాన మండల తహసీల్దార్ కన్నబిడ్డలా ముందుకొచ్చి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ సంఘటన గడివేముల మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కొరటమద్ది గ్రామానికి చెందిన వడ్డు లక్ష్మిదేవమ్మ(85) కుమారుడు, కోడలు, మనవడు, మనవడి భార్య మూడు రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. వీరిని వైద్యసిబ్బంది చికిత్స నిమిత్తం నంద్యాలలోని కోవిడ్ కేర్ సెంటరుకు తరలించారు. అప్పటి నుంచి లక్ష్మిదేవమ్మ ఒక్కరే ఇంట్లో ఉండేవారు. కుటుంబ సభ్యుల పరిస్థితిని తలచుకుని ఆందోళన చెందుతుండేవారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచింది. కుటుంబ సభ్యులు కోవిడ్ కేర్ సెంటరులో ఉండిపోవడం, కరోనా భయంతో స్థానికులెవరూ ఆమె అంత్యక్రియలు చేయడానికి ముందుకు రాని విషయం తహసీల్దార్ నాగమణి దృష్టికి వెళ్లింది. దీంతో ఆమె మంగళవారం సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకున్నారు. ఒక కూతురిలాగా లక్ష్మిదేవమ్మ మృతదేహాన్ని సిబ్బందితో కలిసి మోసుకుంటూ వెళ్లి హిందూ సంప్రదాయ పద్ధతిలో ఖననం చేశారు. ఈ దృశ్యాలు సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి. అంత్యక్రియలలో తహసీల్దార్కు గ్రామ సర్పంచ్ నాగేశ్వర్రెడ్డి తదితరులు సహకరించారు. చదవండి: ‘మాయలేడి’ మామూలుది కాదు.. లక్షల కాజేసి.. భర్త అనుమానం.. ఇద్దరు బిడ్డలతో తల్లి ఆత్మహత్య -
వైరల్ వీడియో: లాక్డౌన్ ఉల్లంఘన.. స్టెప్పులేసిన మహిళా తహసీల్దార్
-
లాక్డౌన్ ఉల్లంఘన.. స్టెప్పులేసిన మహిళా తహసీల్దార్
భువనేశ్వర్ : కరోనా కట్టడికి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న వేళ లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ప్రవర్తించారు ఓ తహసీల్దార్. ముఖానికి మాస్క్, సామాజిక దూరం పాటించకుండా ఓ వేడుకలో ఇష్టారీతీగా స్టెప్పులు వేశారు. ఈ వీడియో నెట్టింట్లో వైరలవ్వడంతో సదరు అధికారిణిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అసలేంజరిగిందంటే.. తీవ్రంగా వ్యాపిస్తున్న కోవిడ్ను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఒడిశా ప్రభుత్వం లాక్డౌన్ను అమలు చేస్తోంది. ఈ క్రమంలో వివాహ వేడుకలకు కేవలం 25 మందికి మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఒడిశాలోని సుకిందా మహిళా తహసీల్దార్ బుల్బుల్ బెహెరా లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించారు. జగత్సింగ్పూర్లో తన సోదరుడి వివాహ వేడుకకు తహసీల్దార్ హాజరయ్యారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. ఈ వేడుక ఊరేగిపులో లాక్డౌన్ మార్గదర్శకాలు పాటించకుండా బెహెరా డ్యాన్స్ చేశారు. ముఖానికి మాస్క్, సామాజిక దూరాన్ని గాలికొదిలేసి బంధువులతో కలిసి తీన్మార్ స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో కోవిడ్ కట్టడి చర్యలను ప్రజలకు తెలియజేయాల్సిన అధికారులే నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ నెటిజన్లు ఓ రేంజ్లో మండిపడుతున్నారు. ఇక ఈ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో జాజ్పూర్ జిల్లా కలెక్టర్ చక్రవర్తి సింగ్ రాథోడ్ స్పందించారు. ప్రస్తుతం ఆ మహిళా అధికారిర్ సెలవులో ఉన్నట్లు వెల్లడించారు.సెలవులు ముగిసి వీధుల్లో చేరిన తర్వాత ఆమె నుంచి వివరణ కోరి, తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మహమ్మారి వ్యాపిస్తున్న తరుణంలో నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరినైనా విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా గతనెల ఓ మహిళా హోంగార్డుతో నలుగురు పోలీసులు యూనిఫాంలో నృత్యం చేస్తున్న వీడియో వెలుగులోకి రావడంతో పానికోయిలి పోలీస్ స్టేషన్ ఏఎస్సైను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. చదవండి: వైరల్: పెళ్లితో ఒక్కటైన జంట.. భూమ్మీద కాదండోయ్! -
కరోనాతో మునుగోడు తహసీల్దార్ మృతి
సాక్షి, మునుగోడు: కరోనా బారిన పడిన నల్ల గొండ జిల్లా మునుగోడు తహసీల్దార్ సునంద (58) మృతి చెందారు. పక్షం రోజుల క్రితం వైరస్ బారినపడ్డారు. లంగ్స్ ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉండటంతో ఆమె హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. పది రోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఆమె.. శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. (చదవండి: రైల్వే ఉద్యోగి దారుణహత్య) -
తహసీల్దార్ .. పనితో బేజార్
‘‘మీ సేవ కేంద్రాల నుంచి ఒక్క ధరణి పోర్టల్కు సంబంధించినవే వారానికి కనీసం 100 నుంచి 300 వరకు దరఖాస్తులు వస్తున్నాయని, వీటన్నింటినీ పరిశీలించి రికార్డులు తయారు చేయడానికే తమకు సమయం సరిపోవడం లేదని తహసీల్దార్లు అంటున్నారు..’’ ‘‘ప్రత్యేక రెవెన్యూ ట్రిబ్యునళ్ల ద్వారా పరిష్కరించాల్సిన భూ సమస్యలు కోర్టు ఉత్తర్వులతో మళ్లీ విచారించాల్సి రావడంతో ఆయా కేసులకు సంబంధించిన రిపోర్టులు ఇచ్చే పనిని కూడా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు.. తహసీల్దార్లకే అప్పజెబుతున్నారు..’’ ధరణి పోర్టల్ ద్వారా భూ సమస్యల పరిష్కారం ఈ పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు రైతుల వద్ద ధాన్యం కొనుగోలు బాధ్యత కోవిడ్ క్వారంటైన్ సెంటర్ల నిర్వహణ, వ్యాక్సిన్పై అవగాహన కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ప్రొటోకాల్ విధులు సాక్షి, హైదరాబాద్: ఒక్కటి కాదు, రెండు కాదు.. అనేక బాధ్యతలతో రాష్ట్రంలోని తహసీల్దార్లు తీవ్ర పని ఒత్తిడికి లోనవుతున్నారు. ఒకదానిపై మరొకటిగా మీద పడుతున్న పనులు వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బాధ్యతలన్నీ సమన్వయం చేసుకోవడం కష్టతరమవుతోంది. ధరణి పోర్టల్ ద్వారా భూసమస్యల పరిష్కారం నుంచి ధాన్యం కొనుగోళ్ల వరకు అన్ని బాధ్యతలూ రెవెన్యూ సిబ్బందిపైనే పెట్టడంతో అన్నింటినీ సమన్వయపర్చుకోవడం కష్టతరమవుతోంది. ముఖ్యంగా ధరణి సమస్యల పరిష్కారం తహసీల్దార్లకు తలకు మించిన భారంగా పరిణమించింది. ఈ సమస్యల పరిష్కారం కోసం రికార్డులు తనిఖీ చేసి, స్వయం అధీకృత (అటెస్టెడ్) కాపీలు తయారు చేసేందుకే ఉన్న సమయం సరిపోతోందని తహసీల్దార్లు వాపోతున్నారు. మరోవైపు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, కోవిడ్ బాధ్యతలు, ధాన్యం కొనుగోళ్లు, ప్రకృతి వనాల భూసేకరణ, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు, ప్రొటోకాల్ విధులు...ఇలా లెక్కకు మిక్కిలి పనులు అప్పగించడంతో ఒత్తిడికి గురవుతున్నామని చెబుతున్నారు. పని ఒత్తిడి తగ్గించేలా, ఆయా పనులకు తగిన సమయం ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జాయింట్ సబ్ రిజిస్ట్రార్ బాధ్యతలు కూడా ధరణి పోర్టల్ ద్వారా భూసమస్యల పరిష్కారానికి తోడు ఈ పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు కూడా తహసీల్దార్లే చేయాల్సి వస్తోంది. తహసీల్దార్ విధులు నిర్వహిస్తూనే జాయింట్ సబ్ రిజిస్ట్రార్ బాధ్యతలు కూడా నిర్వర్తించాల్సి వస్తోందని, తమకుండే సాధారణ పని బాధ్యతలకు తోడు వీటిని సమన్వయం చేసుకోవడం కష్టతరమవుతోందనేది తహసీల్దార్ల వాదన. ఇంకా ఎన్నో... అదనంగా ప్రభుత్వం కొత్తగా మరిన్ని బాధ్యతలను తహసీల్దార్లకు అప్పజెప్పింది. ముఖ్యంగా కోవిడ్ క్వారంటైన్ సెంటర్ల ఎంపిక, అక్కడ అన్ని సౌకర్యాలు ఉండేలా చూసుకోవడం, వ్యాక్సిన్పై ప్రజల్లో అవగాహన కల్పించడం, కోవిడ్ నిర్ధారణ కేంద్రాల వద్ద జన సమ్మర్ధ నియంత్రణ బాధ్యతలను కూడా రెవెన్యూకే ఇవ్వడంతో తహసీల్దార్లు ఆయా మండలాల్లోని వీఆర్ఏలు, వీఆర్వోలతో ఈ పనులు చేయిస్తూ పర్యవేక్షించాల్సి వస్తోంది. మరోవైపు రబీ ధాన్యం కొనుగోళ్లు పేరుకే పౌరసరఫరాల శాఖ ద్వారా చేస్తున్నా అన్ని పనులూ రెవెన్యూ సిబ్బందే చూసుకోవాల్సి వస్తోందని, ఈ పనిని కూడా జిల్లా కలెక్టర్లు తమకే అప్పగించారని తహసీల్దార్లు వాపోతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఎంపిక, మద్దతు ధర అందేలా చూడడం, రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయడం, కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండేలా చూడడం, ప్యాడీ క్లీనర్లు, మంచినీళ్లు లాంటి కనీస సౌకర్యాల కల్పన పనులు కూడా తహసీల్దార్లకే అప్పగించడం గమనార్హం. దీనికి తోడు పల్లె ప్రకృతి వనాలకు భూసేకరణ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు లాంటి సంక్షేమ పథకాల లబ్ధిదారుల గుర్తింపు, ప్రొటోకాల్ విధులు వారే చేయాల్సి వస్తోంది. ఇక ధరణి ద్వారా మరిన్ని ఆప్షన్లు ఇస్తే దరఖాస్తులు ఇంకా పెరుగుతాయని, అప్పుడు ఈ రికార్డులు తయారు చేసుకోవడం తప్ప ఎలాంటి పనులూ చేయలేమని అంటున్నారు. పని భారంతో తప్పులు జరుగుతాయేమోననే ఆందోళన ఎక్కువ అవుతోందని, ముఖ్యంగా భూముల విషయంలో పొరపాట్లు జరిగితే ప్రజలు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని, ప్రభుత్వం ఈ విషయంలో తగిన విధంగా ఆలోచించి ధరణి సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు కొన్ని బాధ్యతల నుంచి తమను తప్పించాలని తహసీల్దార్లు కోరుతున్నారు. పేరుకే కలెక్టర్లు.. చేసేదంతా తహసీల్దార్లే... ధరణి పోర్టల్ ద్వారా భూసమస్యల పరిష్కారం విషయంలో తహసీల్దార్లను జిల్లాల కలెక్టర్లు తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని సమాచారం. ఈ పోర్టల్ ద్వారా 11 రకాల సమస్యలు పరిష్కరించుకునేందుకు గత వారం రోజులుగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆధార్లో తప్పులు, ఆధార్ అనుసంధానం, తండ్రి/భర్త పేరులో మార్పు, ఫోటో తప్పులు, లింగ నమోదులో తప్పులు, కులం తప్పులు, సర్వే నంబర్ల మిస్సింగ్, భూసేకరణ పద్ధతుల్లో మార్పు, భూమి స్వభావ రికార్డు సరిచేయడం, భూ వర్గీకరణ, డిజిటల్ సంతకాలు... ఇలా 11 రకాల సమస్యల పరిష్కారానికి భూ యజమానులు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులు నేరుగా తహసీల్దార్లకు వస్తాయి. కానీ, వీటిపై నిర్ణయం తీసుకునే అధికారం తహసీల్దార్లకు లేదు. కేవలం వీటిని తనిఖీ చేసి రిపోర్టు ఇస్తే జిల్లా కలెక్టర్లే నేరుగా ఆన్లైన్లో సరిచేస్తారు. అయితే కలెక్టర్లు కూడా పని ఒత్తిడితో భారమంతా తమపై వేసి చేతులు దులుపుకుంటున్నారని, తగిన సమయం ఇవ్వకుండా ఒత్తిడికి గురిచేస్తున్నారని తహసీల్దార్లు వాపోతున్నారు. ఏదైనా సమస్య పరిష్కారం కోసం మీ సేవ నుంచి దరఖాస్తు వస్తే ఆ దరఖాస్తుతో పాటు అందుకు సంబంధించిన సాక్ష్యాలను సిటిజన్ లాగిన్లో డౌన్లోడ్ చేసుకుని, రికార్డులను పరిశీలించి, జిరాక్సులు తీసి, ప్రతి దానికి ఫార్మాట్ రూపంలో సమాధానమిస్తూ వాటిని మళ్లీ తామే అటెస్ట్ చేస్తూ ఆర్డీవోలకు ఆఫ్లైన్లో సమర్పించాల్సి వస్తోందని చెబుతున్నారు. ఆ తర్వాత వాటిని ఆర్డీవోలు కూడా పరిశీలించి, ప్రతి సమస్యకూ ఓ ప్రొసీడింగ్ ఇచ్చి కౌంటర్ సంతకం పెట్టి వాటిని కలెక్టరేట్లో సమర్పిస్తేనే ధరణి సమస్యలను కలెక్టర్లు ఆన్లైన్లో పరిష్కరిస్తున్నారు. ఆ విధంగా కలెక్టర్లు ఓకే చేసిన దరఖాస్తులు తిరిగి తమ వద్దకు వస్తే వాటికి పూర్తి బాధ్యత వహిస్తూ తహసీల్దార్లే సంతకాలు చేయాల్సి వస్తోంది. ఇలా ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో వారానికి కనీసం 100 నుంచి 300 వరకు దరఖాస్తులు వస్తున్నాయని, వీటన్నింటినీ పరిశీలించి రికార్డులు తయారు చేయడానికే తమకు సమయం సరిపోడం లేదంటున్నారు. ఇక, ప్రభుత్వ భూముల నిర్ధారణ కోసం అయితే 1954 కంటే ముందు నుంచి రికార్డులన్నింటినీ (పహాణీలు) పరిశీలించాల్సి వస్తోందని, కలెక్టర్లు మాత్రం అన్ని బాధ్యతలూ తమపై వేసి త్వరగా పూర్తి చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శని, ఆదివారాలు సెలవు ఇవ్వాలి రాష్ట్రంలోని తహసీల్దార్లకు ఇప్పుడు 24 గంటల సమయం సరిపోవడం లేదు. ప్రభుత్వం అప్పగించిన పనులు చేయడంలో మాకు ఎలాంటి ఇబ్బందీ లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షల మేరకు పనిచేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. కానీ ఒక్క తహసీల్దార్ ఇన్ని పనులు చేయడం చాలా ఇబ్బందికరంగా మారుతోంది. ముఖ్యంగా ధరణి పోర్టల్ ద్వారా పరిష్కరించాల్సిన సమస్యల భారమంతా మాపై వేసి కలెక్టర్లు చేతులు దులుపుకుంటున్నారు. పని ఒత్తిడి తగ్గించేలా, తగిన సమయం ఇచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటేనే అప్పగించిన పనులను సజావుగా పూర్తి చేయగలం. కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పని చేస్తున్న రెవెన్యూ సిబ్బందికి శని, ఆదివారాలు సెలవు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. - వంగా రవీందర్రెడ్డి, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు -
టైమ్ 11 దాటినా పత్తాలేని తహసీల్దార్..
సాక్షి, మెదక్ : పరిపాలన వ్యవస్థ సక్రమంగా నడవాలంటే అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలి. ఏ ప్రభుత్వానికైనా మంచిపేరు రావాలంటే అధికారుల కృషి ఉండాల్సిందే. కానీ ఇక్కడ మాత్రం తరచూ సమయపాలన పాటించకపోవడం పట్ల ప్రజలు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన రేగోడ్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 11గంటలు దాటినా కార్యాలయంలో కేవలం ధరణి కంప్యూటర్ ఆపరేటర్, ఒక వీఆర్ఏ మాత్రమే విధుల్లో ఉన్నారు. దీంతో అక్కడే తహసీల్దార్ కోసం పడిగాపులు కాసిన రైతులు, ప్రజలు విలేకరులకు సమాచారం అందించారు. విలేకరులు వెల్లి చూడగా తహసీల్దార్తో పాటు పలువురు అందుబాటులో లేరు. తరచూ సమయపాలన పాటించడం లేదని పలువురు వాపోయారు. గతంలో అధికారుల గురించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా అధికారుల తీరు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెలనెలా వేలరూపాయలు వేతనం తీసుకుంటున్నా విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. భూమి మార్పు విషయంలో అడిగిన డబ్బులు ఇచ్చినా ఓ అధికారి, వీఆర్ఓ పనిచేయకుండా తిప్పించుకుంటున్నారని మర్పల్లి గ్రామానికి చెందిన ఒకరు తెలిపారు. మారుమూల మండలంలోని రేగోడ్పై జిల్లాస్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆడిందే ఆటగా పాడిందే పాటగా నడిపిస్తున్నారని ఆరోపించారు. కార్యాలయానికి వెల్లే సన్నిహితులకు ప్రాధాన్యత ఇస్తూ సామాన్యులను పట్టించుకోకపోవడం ఏమిటోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ స్పందించి తగిన చర్యలు తీసుకోని ఇబ్బందులు తప్పించాలని పలువురు కోరుతున్నారు. చదవండి: ఏంది స్వామి 20 లక్షలు అలా కాల్చినావ్ జిల్లా కేంద్రంలో ఏసీపీ హల్చల్ రెండేళ్లుగా తిరుగుతున్నా మా తాత పేరున ఉన్న 133అ సర్వే నంబరులో ఎకరా మూడుగుంటలనర భూమికి తొమ్మిది గుంటలు భూమి మాత్రమే ఆన్లైన్లో చూపిస్తుంది. మిగతా భుమిని ఆన్లైన్లో పెట్టాలని అధికారులను తరచూ కోరుతున్నా. గత సంవత్సరం కార్యాలయంలోని ఓ అధికారికి, వీఆర్ఓకు డబ్బులు ఇచ్చినా భూమిని సరిచేయలేదని, మా తాతపేరుపై ఉన్న భూమిని మా నాన్న పేరున చేయడం లేదు. రోజూ తిరుగుతున్నా పని కాకపోవడంతో ఇబ్బంది పడుతున్నా. – అనిల్, మర్పల్లి ఫిర్యాదు చేసినా మారడం లేదు తహసీల్దార్తో పాటు సిబ్బంది సమయానికి రావడం లేదు. ఈ విషయమై ఉన్నతాధికారికి ఫిర్యాదు చేసినా అధికారి, సిబ్బందిలో మార్పు రావడం లేదు. ఇక్కడి అధికారుల తీరువల్ల రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. – నాగయ్య స్వామి, సిందోల్ ఒక్కోసారి ఆలస్యం అవుతుంది.. ఒక్కోసారి ఆలస్యం అవుతుంది. కానీ ముందుగానే వస్తున్నాం. ఆఫీసుకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సేవలు అందిస్తున్నాం – సత్యనారాయణ, తహసీల్దార్ -
బ్లాక్ మనీని బూడిద చేసిన తహసీల్దార్
-
ఏంది స్వామి 20 లక్షలు అలా కాల్చినావ్
రాజస్తాన్: అవినీతికి పాల్పడే వారి ఇళ్లపై ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడి చేస్తే ఏం చేస్తారు.. ఆ అవినీతి డబ్బును దాచడానికి నానా తంటాలు పడతారు. ఇక్కడ ఓ తహసీల్దార్ అధికారులకు సాక్షం ఉండకూడదని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 లక్షల వరకు కాల్చి బూడిద చేశాడు. ఉద్యోగం ఉంటే ఇలాంటి లక్షలు ఎన్నైనా సంపాదించుకుంటా అనుకున్నాడో ఏమో ఇలాంటి వింత పని చేసి వార్తల్లో నిలిచాడు. ఏకంగా 20 లక్షలు స్వాహా రాజస్థాన్ లోని సిరోహీ జిల్లాలో ఓ వ్యక్తి నుంచి లక్ష రూపాయల డబ్బును లంచంగా తీసుకుంటున్న సమయంలో రెవెన్యూ ఇన్ స్పెక్టర్ పర్వత్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటన బుధవారం సాయంత్రం జరిగింది. అనంతరం పర్వత్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఇందులో తన తప్పేమీ లేదనీ, తహసీల్దార్ కల్పేశ్ కుమార్ జైన్ కారణంగానే తాను ఈ డబ్బును తీసుకుంటున్నట్టు తెలిపాడు. దీంతో అతడిని పట్టుకుని తహసీల్దార్ కల్పేశ్ ఇంటికి ఏసీబీ అధికారులు బయలు దేరారు. జరిగినదంతా ఇంట్లోనే ఉన్న తహసీల్దార్ కు ఎవరో సమాచారం ఇచ్చారు. ఇంకేముంది బ్లాక్ మనీతో పట్టుబడితే శ్రీ కృష్ణ జన్మస్థానమే అని కంగారుపడ్డాడు. అంతకు పూర్వం పలువురు వద్ద లంచంగా తీసుకున్న డబ్బు ఇంట్లోనే ఉండడంతో ఏం చేయాలో తెలియక సతమతమయ్యాడు. చివరకు కాల్చి పడేస్తే పీడా పోతుందని ఓ నిర్ణయానికి వచ్చి గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఆ డబ్బును కాల్చడం మొదలు పెట్టాడు. తెలివిగా ఏసీబీ అధికారులు ఇంట్లోకి రాకుండా తలుపులకు గడియ కూడా పెట్టాడండోయ్. ఇలా మొత్తం మీద ఏకంగా రూ.20 లక్షల రూపాయల నోట్ల కట్లను కాల్చేశాడు. ఈ లోపే ఏసీబీ అధికారులు అతడి ఇంటికి చేరుకొని వంటింట్లో అతడు చేస్తున్న నిర్వాకాన్ని చూశారు. తలుపుకి గడియ ఉండడంతో అధికారులు తలుపులు పగలగొట్టి తహసీల్దార్ నిర్వాకాన్ని ఆపేశారు. 20 లక్షల వరకు కాలి బూడిదైపోగా, కేవలం లక్షన్నర రూపాయలను మాత్రమే అతడి నుంచి స్వాధీనం చేసుకోగలిగారు. అయితే ఈ ఘటన మొత్తం వీడియోలో రికార్డు చేసిన ఓ అధికారి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో వైర్ల్ అయ్యింది. ప్రస్తుతం ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ( చదవండి: ఆశ చూపి.. బాలికల అమ్మకం ) -
కుమార్తెను ప్రభుత్వ బడిలో చేర్పించిన తహసీల్దార్
విస్సన్నపేట(తిరువూరు): ప్రభుత్వ పాఠశాలలో తన కుమార్తెను చేర్పించి పలువురికి ఆదర్శంగా నిలిచారు విసన్నపేట తహసీల్దార్ బి మురళీకృష్ణ. స్థానిక మండలపరిషత్ ప్రాథమిక పాఠశాల మెయిన్లో రెండో తరగతిలో తహసీల్దార్ తన కుమార్తెను బుధవారం చేర్పించారు. చదవండి: నచ్చిన వారికి కొలువులు.. అడిగినంత వేతనం సంక్షేమ క్యాలెండర్: పథకాల అమలు ఇలా.. -
హత్యా...?ఆత్మహత్యా...?
-
సారు చెబితేనే చేశాం..
సాక్షి, హైదరాబాద్: రూ.కోటి పన్నెండు లక్షల లంచం వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని నర్సాపూర్ భూ వ్యవహారంలో అరెస్టయిన ఆర్డీవో, తహసీల్దార్ ఏసీబీ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. స్వయంగా అప్పటి అడిషనల్ కలెక్టర్ నగేశ్ తమకు ఫోన్ చేసి ఆదేశాలు ఇస్తేనే తాము పనులు చేశామని ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్ అబ్దుల్ సత్తార్ అధికారులకు తెలిపినట్లు సమాచారం. ఈ కేసుకు సం బంధించి మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేశ్తో సహా నిందితులు ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్ అబ్దుల్ సత్తార్, జూని యర్ అసిస్టెంట్ మహ్మద్ వాసీం, నగేశ్ బినామీ జీవన్గౌడ్లను ఏసీబీ రెండోరోజు మంగళవారం ప్రధాన కార్యాలయంలో విచారించింది. ఈ సందర్భంగా తామంతా అడిషనల్ కలెక్టర్ ఆదేశాలిస్తేనే పని చేశామంటూ... ఆర్డీవో, తహసీల్దార్లు ఏసీబీ అధికారులకు తెలిపినట్లు సమాచారం. అదే సమయంలో అడిషనల్ కలెక్టర్ నగేశ్ మాత్రం ఏసీబీ అధికారులు అడిగిన అధిక ప్రశ్నలకు.. ‘నాకు తెలియదు’అని సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. రింగ్రోడ్డు వద్ద కలవండి.. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తన వద్దకు వచ్చిన పలు వివాదాస్పద భూ వ్యవహారాలను అడిషనల్ కలెక్టర్ నగేశ్ చాలా జాగ్రత్తగా డీల్ చేసేవారు. ఎక్కడా తనపేరు బయటికి రాకుండా జీవన్గౌడ్ నంబరు ఇచ్చేవారు. ఆ తరువాత మొత్తం సెటిల్మెంట్లన్నీ జీవన్గౌడ్ చక్కదిద్దేవాడు. పనుల నిమిత్తం జీవన్గౌడ్కు ఎవరు ఫోన్ చేసినా.. వారితో నగదు గురించి మాట్లాడి, మేడ్చల్ వైపు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కలుసుకునేవాడని, అక్కడే లంచం కింద తీసుకునే నగదు చేతులు మారేదని సమాచారం. ఏ రోజు, ఏటైములో కలవాలో ఫోన్ లో ముందుగానే సూచనలు చే సేవాడు. రింగ్రోడ్డు ప్రాంతంలో జనసంచారం తక్కువగా ఉండటం, తాను సికింద్రాబాద్లో ఉండటం వల్ల రింగురోడ్డును వసూలు కేంద్రంగా వాడుకునేవాడని తెలిసింది. బినామీల విచారణ.. రెండో రోజు విచారణలో అడిషనల్ కలెక్టర్ నగేశ్ బినామీలపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. మొత్తం ముగ్గురు బినామీలను అధికారులు ప్రశ్నించారు. బినామీల్లో ఓ మహిళ కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. మెదక్, మ నోహరాబాద్, మేడ్చల్, కామారెడ్డిలో నగేశ్కు చెందిన పలు అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. మెదక్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందితో పాటు పలువురు కిందిస్థాయి ఉద్యోగులను సైతం అధికారులు విచారించారు. నగేశ్ భార్య పేరు మీద ఉన్న బ్యాంక్ లాకర్ కీ లభ్యం కాకపోవడం తో, బ్యాంక్ అధికారులతో మరో డూప్లికేట్ కీ ని అధికారులు సిద్ధం చేయిస్తున్నారు. ఈ లా కర్ తెరిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వ స్తాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. -
ఆ లంచం కేసుతో నాకు సంబంధం లేదు
సాక్షి, మేడ్చల్ జిల్లా: కీసర తహసీల్దార్ రూ.1.10 కోట్ల లంచం తీసుకున్న వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని సహించేది లేదన్నారు. కీసర తహసీల్దార్ విచారణ సమయంలో తనపై తప్పుడు ప్రచారం కొనసాగటంపై తీవ్రంగా స్పందించారు. శుక్రవారం ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ.. ‘మ్యుటేషన్ ప్రక్రియ తహసీల్దార్ పరిధిలోనే ఉంటుంది. కలెక్టర్ వద్దకు కనీసం ఫైలు కూడా రాదు.. ఈ కేసులో నా పాత్ర ఉందనే ఆరోపణలు మానుకోవాలి. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే న్యాయపరమైన చర్యలకు వెళ్లాల్సి వస్తుంది. ఎవరైనా కొత్త వ్యక్తులు సమస్యల తో వచ్చినప్పుడు విచారణ చేసి, నిబంధనల ప్రకారముంటేనే వాటిని పరిష్క రించాలని చెబుతాను. రోజూ విజిటింగ్ సమయంలో కలసిన ప్రతి ఆర్జీదారుకు సంబంధించిన విషయాలను సంబంధిత అధికారులకు తెలియజేస్తాం. ఆ అధి కారులూ నిబంధనల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది’అని అన్నారు. -
తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) బుధవారం ఆకస్మిక సోదాలు నిర్వహించింది. సంతకవిటి (శ్రీకాకుళం జిల్లా), బలిజిపేట (విజయనగరం జిల్లా), కశింకోట (విశాఖ జిల్లా), కొయ్యలగూడెం (పశ్చిమగోదావరి జిల్లా), ఇబ్రహీంపట్నం(కృష్ణా జిల్లా), రాజుపాలెం (గుంటూరు జిల్లా), ఉలవపాడు (ప్రకాశం జిల్లా), ఎమ్మిగనూరు (కర్నూలు జిల్లా), కూడేరు (అనంతపురం జిల్లా) తహసీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఆ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది లెక్కల్లో చూపించని నగదును స్వాధీనం చేసుకున్నారు. ► రైతులకు పంపిణీ చేయకుండా ఉన్న పట్టాదార్ పాస్పుస్తకాలను గుర్తించారు. ‘స్పందన’, ‘మీ సేవ’ పోర్టళ్లలో చేసిన దరఖాస్తులను నిర్ణీత గడువు ముగిసినప్పటికీ పరిష్కరించ లేదని అధికారుల పరిశీలనలో వెల్లడైంది. కొన్ని కార్యాలయాల్లో ప్రైవేట్ సిబ్బంది పని చేస్తున్నారని గుర్తించారు. ► తహసీల్దార్ కార్యాలయాలపై జరిపిన సోదాల్లో మొత్తం మీద లెక్కల్లో చూపించని రూ.3,50,277 నగదును స్వాధీనం చేసుకున్నారు. ► బిక్కవోలు (తూర్పు గోదావరి జిల్లా), జగ్గయ్యపేట (కృష్ణా జిల్లా), బద్వేలు (వైఎస్సార్ జిల్లా), పీలేరు (చిత్తూరు జిల్లా) సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ► సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో అనధికార వ్యక్తులు పని చేస్తున్నట్టు గుర్తించారు. మొత్తం మీద లెక్కల్లో చూపించని రూ.9,23,940 స్వాధీనం చేసుకున్నారు. ► నెల్లూరు జిల్లా గూడురు మున్సిపల్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగంపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బుధవారం ఆఫీసు సమయం ముగిసిన తర్వాత కూడా నిబంధనలకు విరుద్ధంగా 33 భవన నిర్మాణ అనుమతులు ఇచ్చినట్టు గుర్తించారు. ఈ సోదాలకు సంబంధించి ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తామని ఏసీబీ విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. -
రిటైర్డ్ అడిషనల్ ఎస్పీని ముప్పుతిప్పలు పెట్టిన నాగరాజు
సాక్షి, హైదరాబాద్ : కోటి 10 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన కీసర తహసీల్దార్ నాగరాజు అక్రమాలు తవ్వినకొద్ది బయటకు వస్తున్నాయి. బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. సామాన్య ప్రజలనే కాకుండా పోలీసు అధికారులను సైతం లంచం డిమాండ్ చేసి ముప్పు తిప్పలు పెట్టారు. ఆయన బాధితుల్లో తాను ఒకడినని రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సురేందర్ రెడ్డి తాజాగా మీడియా ముందుకు వచ్చారు. లీగల్గా అన్ని డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ పట్టా పాస్ బుక్ ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టాడని వాపోయారు. (చదవండి : 1.10 కోట్ల లంచం : ఏసీబీ వలలో తహసీల్దార్) ‘నేను రిటైర్మెంట్ అయిన తర్వాత 2018లో సర్వేనెంబర్ 614లో నాలుగు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశాను. లీగల్ గా అన్ని డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ పట్టా పాస్ బుక్ ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టాడు. గతంలో నాగరాజుపై చీఫ్ సెక్రెటరీకి, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, కలెక్టర్, ఆర్డీవో కు ఫిర్యాదు చేశాను. అధికారులను మభ్యపెడుతు తన పదవిని కాపాడుకుంటున్నాడు. ఒక పోలీస్ అధికారిగా ఉన్న నన్నే లంచం డిమాండ్ చేశాడంటే.. ఇక సామాన్య రైతుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో కుమ్మక్కై దందాలు చేస్తున్నాడు. డబ్బులు ఇవ్వకుండా ఒక్క పని కూడా చేయడు.న్యాయస్థానం కూడా నాగరాజు వ్యవహారంలో సీరియస్ అయింది. ఇలాంటి వ్యక్తి ని కఠినంగా శిక్షించాలి’అని సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. (చదవండి : నాగరాజు ఇంటిలో కొనసాగుతున్న సోదాలు) -
అవినీతిలో నాగరాజు
-
అవినీతిలో నాగ ‘రాజు’ లీలలు
సాక్షి, మేడ్చల్: కీసర తహసీల్దార్ నాగరాజు ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి ఏకంగా రూ. కోటీ 10 లక్షల లంచం తీసుకుంటూ నాగరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆయన ఇంట్లో 28 లక్షలు నగదు, బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాగరాజు బినామీల పేర్లతో భారీగా అక్రమాస్తులు కలిగిఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. తహసీల్దార్ బంధువులు, బినామీల ఇళ్లలో కూడా ఏసీబీ సోదాలు నిర్వహించింది.తహసీల్దార్ నాగరాజు, రియల్టర్స్ అంజిరెడ్డి, శ్రీనాథ్, వీఆర్ఏ సాయిరాజులను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. గతంలో ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తహశీల్దార్ నాగరాజు అరెస్టయ్యారు. తహసీల్దార్ నాగరాజుపై తొలి నుంచీ అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం కూకట్పల్లి నుంచి కీసరకు బదిలీపై వచ్చిన ఆయన పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. గతంలో చీర్యాల గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద రూ.లక్ష డిమాండ్ చేయడంతో ఆ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో అతడి కుటుంబ సభ్యులు తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన నాగరాజును నిలదీశారు. కాగా, ఇటీవల కీసర మండలంలో రియల్ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ భూముల ధరలకు రెక్కలు రావడంతో రెవెన్యూ విభాగంలో ఉన్న లోసుగులను అడ్డుపెట్టుకొని తమ కార్యాలయాలకు వచ్చే వ్యక్తుల నుంచి పెద్ద ఎత్తున లంచాలు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
వెలుగుచూస్తున్న తహసీల్దార్ అక్రమాలు
విడవలూరు: ఇటీవల విడవలూరు మండలంలోని తీర ప్రాంతంలో ఉన్న చుక్కల భూములకు పట్టాలు పుట్టించే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విడవలూరు తహసీల్దార్ లీలలు మరిన్ని వెలుగుచూస్తున్నాయి. వివరాలు.. ఇటీవల అర్హులైన వారికి ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు పట్టా భూములను కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు పంపారు. అందులో భాగంగా మండల కేంద్రమైన విడవలూరులో 10 ఎకరాలను గుర్తించారు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ విలువ ఎక్కువగా ఉన్నప్పటికీ ఎకరా రూ.20 లక్షలు ఉన్నట్లు కలెక్టర్కు ప్రతిపాదనలు పంపారు. అలాగే రామతీర్థంలో మూడున్నర ఎకరాలను కూడా గుర్తించారు. ఇక్కడ ప్రభుత్వ విలువ అతి తక్కువగా ఉన్నప్పటికీ అక్కడ కూడా ఎకరా రూ.20 లక్షలుగా ప్రతిపాదనలు పంపారు. దీంతోపాటు ముదివర్తి గ్రామంలో కూడా 6 ఎకరాలను గుర్తించారు. ఇక్కడ కూడా ప్రభుత్వ విలువ తక్కువగా ఉన్నప్పటికీ ఎకరా రూ.23 లక్షలుగా ఉందని ప్రతిపాదనలు పంపారు. ఇలా ప్రభుత్వ విలువ ఎక్కువగా ఉన్నచోట తక్కువ గానూ, తక్కువగా ఉన్న చోట ఎక్కువ గానూ ప్రతిపాదనలు పంపడంలో ఆంతర్యమేమిటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీంతోపాటు ముదివర్తి గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ సాహెబ్కు సర్వే నంబర్ 306–బీ లో 1.17 ఎకరాలు, 306–సీ లో 0.6 ఎకరాలు, 306–డీ1లో 0.22 ఎకరాల భూమి(మొత్తం 1.45 ఎకరాలు) ఉంది. ఇందుకు సంబంధించిన ఈ–పాస్ బుక్ కూడా సంబంధిత రైతు వద్ద ఉంది. అయితే గత నెల 8వ తేదీన ఈ రైతు పేరుతో కేవలం 0.39 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు చూపుతున్నారు. దీనిని తహసీల్దార్ మార్చి వేశారని బాధిత రైతు ఆరోపిస్తున్నాడు. తన మిగిలిన పొలాన్ని ప్రస్తుతం ఇళ్ల స్థలాలకు గుర్తించిన వాటిలో కలిపి ఎక్కువ పొలంగా చూపి మోసం చేసేందుకు తహసీల్దార్ సిద్ధమైనట్లు బాధిత రైతు వాపోయాడు. న్యాయం చేయండి నాకున్న 1.45 ఎకరాల భూమిలో దాదాపు 1.06 ఎకరాల భూమిని మరో రైతు పేరు మీదకు మార్చారు. ఇది కూడా గత నెల 8వ తేదీన జరిగింది. నా పొలాన్ని ప్రస్తుతం ఇళ్ల స్థలాల కోసం గుర్తించి, ఎక్కువ భూమిగా చూపి తహసీల్దార్ మోసం చేయడానికి సిద్ధపడ్డారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి నాకు న్యాయం చేయాలి. – షేక్ మస్తాన్సాహెబ్ -
వినయ విధేయ తహసీల్దార్
విడవలూరు: ఆయనొక తహసీల్దార్. పేదలకు అండగా నిలవాల్సిన వ్యక్తి పెద్దలకు వినయ, విధేయుడిగా మారాడు. అక్రమ సొమ్ముపై ఆశతో సెలవు దినాల్లో కూడా చుక్కల భూములకు పట్టాలు చేస్తున్నారు. ♦ విడవలూరు మండలంలో తీర ప్రాంతమైన ఊటుకూరు పంచాయతీ పరిధిలోని పల్లిపాళెం గ్రామంలో ప్రస్తుతం ఆక్వా గుంతల భూముల్లో సర్వే నంబర్లు 942–1, 942–2, 1300, 1398, 1399లలో దాదాపు 14.5 ఎకరాల చుక్కలు భూములు ఉన్నాయి. వీటికి రికార్డులు తారుమారు చేసి పట్టాలను సృష్టించేందుకు కోవూరు మండలం పడుగుపాడుకు చెందిన టీడీపీ నాయకులతో తహసీల్దార్ నౌషాద్ అహ్మద్ చేతులు కలిపాడని ఆరోపణలున్నాయి. ♦ ముదివర్తిలో ఉన్న 2.5 ఎకరాలు, పల్లిపాళెం వద్ద ఉన్న మరో నాలుగు ఎకరాలకు కూడా రికార్డులు తారుమారు చేసి పట్టాలను ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తహసీల్దార్కు భారీ మొత్తంలో నగదు అందినట్లు సమాచారం. ♦ ఈ పనులకు తహసీల్దార్ నౌషాద్ అహ్మద్ సెలవు రోజు శనివారం మధ్యాహ్నం కార్యాలయానికి చేరుకున్నాడు. తన కారులో వస్తే స్థానికులకు అనుమానం వస్తుందని పడుగుపాడుకు చెందిన వ్యక్తి కారులో కార్యాలయానికి చేరుకున్నారు. ♦ తహసీల్దార్తో పాటు మరికొందరు రెవెన్యూ అధికారులను కూడా కార్యాలయానికి పిలిపించుకుని గుట్టు చప్పుడు కాకుండా పని ముగించే ప్రయత్నం చేశారు. ♦ విషయం తెలుసుకున్న స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు సెలవు దినాల్లో కూడా తహసీల్దార్ కార్యాలయం వద్ద కార్లు ఉండటాన్ని గమనించి ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయట పడింది. ♦ చుక్కల భూములకు పట్టాలు సృష్టించేందుకు తహసీల్దార్ ప్రయత్నించడం ప్రభుత్వాన్నే మోసం చేయడమని పలువురు అభిప్రాయ పడుతున్నారు. కలెక్టర్కు ఫిర్యాదు ఈ విషయమై జిల్లా కలెక్టర్ చక్రధర్బాబుకు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఆదివారం ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉన్నత ఉద్యోగి స్థానంలో ఉన్న తహసీల్దార్ ఇలా చుక్కల భూములకు పట్టాలను పుట్టించే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. దీనిపై విచారణ జరపాలని ఆయన కోరారు. -
ఎందరినో రక్షించి.. బలయ్యాడు
సాక్షి,చెన్నై: కోయంబేడు మార్కెట్ నుంచి గ్రామాల్లోకి వచ్చిన కూలీలను గుర్తించి, ఎందరినో క్వారైంటన్లకు, కరోనా వార్డులకు తరలించిన విరుదాచలం తహసీల్దార్ వైరస్కు బలికావడం చిదంబరంలో విషాదాన్ని నింపింది. చెన్నై కోయంబేడు రూపంలో విల్లుపురం, తిరువణ్ణామలై, కడలూరు, కళ్లకురిచ్చి జిల్లాల్లో అమాంతంగా కరోనా కేసులు పెరిగిన విషయం తెలిసిందే. ఇందుకు కారణం ఈ జిల్లాల్లో ఉన్న కూలీలు అత్యధికంగా కోయంబేడు మార్కెట్లో పనిచేస్తుండడమే. చడీచప్పుడు కాకుండా స్వగ్రామాలకు చేరిన కూలీలను గుర్తించేందుకు విరుదాచలం తహసీల్దార్ కవియరసు(48) నేతృత్వంలో ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. ఈ బృందం రెండు నెలలుగా ఎందరినో గుర్తించింది. గ్రామాలతో నిండిన కడలూరు జిల్లా పరిధిలో విస్తృతంగానే తిరిగింది. కూలి కార్మికుల రూపంలో గ్రామాల్లో వైరస్ బారిన పడ్డ వారిని పసిగట్టి క్వారంటైన్లు, కరోనా వార్డులకు తరలించింది. నిరంతర సేవలో ముందుకు సాగుతూ వచ్చిన కవియరసును ఈ నెల పదో తేదిన వైరస్ తాకింది. దీంతో ఆయన బృందంలో ఉన్న వారందరినీ స్వీయ నిర్భంధంలో ఉంచారు. ఎనిమిది రోజులుగా చిదంబరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన కవియరసు పరిస్థితి విషమించింది. ఆదివారం ఆయన తుది శ్వాస విడిచారు. కరోనా వైరస్ బారిన పడి రెవెన్యూ అధికారి మరణించడంతో కడలూరు జిల్లా యంత్రాంగాన్ని కలవరంలో పడేసింది. ఎందరినో రక్షించి, చివరకు వైరస్ బారిన పడి కవియరసు మృత్యువాత పడడాన్ని రెవెన్యూ వర్గాలు జీర్ణించుకోలేకున్నాయి. విధి నిర్వహణలో సేవాతత్వంతో ముందుకు సాగే కవియరసు సేవలు అజరామరం అని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. -
అమరావతి భూముల్లో వెలుగులోకి వస్తున్న వాస్తవాలెన్నో!
సాక్షి, గుంటూరు: భూమి ఒకటే... సర్వే నంబరూ అదే... భూ యజమానులూ వారే... అయినా రికార్డులు మారాయి. ఇతరుల పేరిట భూమి బదలాయింపునకు తారుమారయ్యాయి. ఇలా ఒకటి రెండూ కాదు. పెద్ద సంఖ్యలోనే. రూ.కోట్లు చేతులు మారాయి. ఇదంతా నెలల వ్యవధిలోనే జరిగిపోయింది. ప్రపంచ స్థాయి నగరంగా చెప్పుకున్న రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో ఎన్నెన్ని లుకలుకలో. మరెన్ని లోగుట్లు ఎక్కడెక్కడ దాక్కుని ఉన్నాయో... పెదలంక భూ ఉదంతాన్నే పరిశీలిస్తే... 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కారు నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల పరిధిలో భూసమీకరణ కింద దాదాపు 33 వేల ఎకరాలను రైతుల నుంచి తీసుకుంది. ఆ సమయంలో తమకు అనుకూలురైన అధికారులను నియమించుకుని అప్పటి అధికార పార్టీ పెద్దలు అన్యాయాలకు పాల్పడ్డారని, పేదలు, నిరుపేదలను దారుణంగా మోసగించారని నిర్దిష్ట ఆరోపణలు వచ్చాయి. భూముల విషయంలో తమకు అన్యాయం జరిగిందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర వర్గాలకు చెందిన వారు పోలీసు, రెవెన్యూ ఉన్నతాధికారులను కలిసి నేటికీ ఫిర్యాదులు అందజేస్తూ న్యాయాన్ని కోరుతున్నారు. అలాంటి ఫిర్యాదుల్లో భాగంగానే తుళ్లూరు మండలం రాయపూడి పంచాయతీలోని పెదలంకలో జరిగిన మోసాన్ని రెవెన్యూ సహకారంతో పోలీసులు ఛేదించారు. తుళ్లూరు మండల మాజీ (రిటైర్డు) తహసీల్దారు అన్నే సుధీర్బాబు, రియల్ ఎస్టేట్ వ్యాపారి, విజయవాడలో ప్రముఖ ఎం అండ్ ఎం వస్త్ర దుకాణ యజమాని గుమ్మడి సురేష్లను బుధవారం తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తుండటంతో విచారణాధికారులు సైతం విస్తుపోతున్నారు. అన్నే సు«దీర్బాబు 2014 నుంచి 2017 ఆగస్టు వరకు తుళ్లూరు తహసీల్దారుగా పనిచేసి రిటైరయ్యారు. సమీకరణలో అసైన్డు భూమి పట్టా భూమిగా మారింది పెదలంక సర్వే నంబరు 376/2ఎలో 3.70 ఎకరాలు ల్యాండ్ సీలింగ్ చట్టం ద్వారా 1975లో ప్రభుత్వపరమైంది. ఆ భూమిని అసైన్మెంట్ పట్టా కింద యలమంచిలి సూరయ్య, ఆయన కుమారులతో పాటు పలువురు స్థానికులకు ప్రభుత్వం అప్పట్లోనే పంపిణీ చేసింది. రాజధాని పేరిట ఆ భూమిని కూడా సమీకరణ కింద సర్కారు తీసుకుంది. అసైన్డ్ ల్యాండ్ను పట్టా భూమిగా అప్పటి తహసీల్దారు అన్నే సుధీర్బాబు రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కించారు. అడంగల్, ఆర్ ఒ ఆర్– 1బి, పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్, ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్లలో మార్పులు చేసేశారు. ఆరు పర్యాయాలు ఆరు రకాలుగా... యలమంచిలి సూరయ్య, ఆయన కుమారులకు చెందిన 86 సెంట్ల భూమికి ఆరుసార్లు ఆరు రకాలుగా రికార్డులు మార్పులు జరిగినట్లు పరిశీలనలో వెల్లడైంది. తొలుత సీలింగ్ ల్యాండ్ను అసైన్డ్ పట్టాల కింద ప్రభుత్వం పంపిణీ చేసింది. రాజధాని కోసం భూసమీకరణ ప్రక్రియ ఆరంభమైనప్పటి నుంచి 2017 ఆగస్టు మధ్య కాలంలో అసైన్డ్ నుంచి పట్టాగా మళ్లీ అసైన్డ్, ఆపై పట్టా, తిరిగి అసైన్డ్, ఆ తరువాత పట్టాగా రికార్డుల్లో మార్పులు జరిగాయి. అవసరాన్ని, సమయాన్ని బట్టి ఆన్లైన్ ద్వారా వెబ్ల్యాండ్లో ఈ మార్పులు, చేర్పులు చోటుచేసుకున్నట్లు పోలీసు పరిశీలనలో తేటతెల్లమైంది. ఎందుకిలా చేశారంటే... అసైన్డ్ ల్యాండ్గా ఉంటే రిజిస్ట్రేషన్లకు వీలుకాదు. విక్రయానికీ కుదరదు. అందువల్లే వెబ్ల్యాండ్లో పట్టా భూమిగా మార్పుచేశారు. ఆ తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారి గుమ్మడి సురేష్ పేరిట సేల్ కమ్ జీపీ చేశారు. ఆ తరువాతే గుమ్మడి సురేష్ వల్లూరు శ్రీనివాస్బాబుకు విక్రయించగలిగారు. అదే భూమిని ల్యాండ్ పూలింగ్ కింద సీఆర్డీఏకి ఇవ్వగలిగారు. ఎస్సీలను మోసగించినందున... ఎస్సీ వర్గానికి చెందిన రైతులను మోసగించే ఉద్దేశంతోనే అన్నే సుధీర్బాబు, గుమ్మడి సురేష్ ఉమ్మడిగానే వ్యవహారాలు నడిపారనేది వెల్లడైనందున వారివురిని అరెస్టు చేయడంతోపాటు సెక్షన్ 3(1)(ఎఫ్)(జి), 3(2)(విఎ) ఎస్సీ, ఎస్టీ అమెండ్మెంట్ యాక్టు–1989 కింద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తుళ్లూరు డీఎస్పీ మీడియాకు తెలిపారు. రికార్డుల తారుమారుతో పాటు సీఆర్డీఏకి భూమి అప్పగించడం వెనుక కుట్ర, మోసం ఉన్నందున సెక్షన్–7 ఆఫ్ ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ యాక్ట్– 1977తో పాటు 120–బి, 407, 420, 465, 468,471,477(ఎ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఈ వ్యవహారంలో ఆ ఇద్దరితో పాటు అసైనీలు సహా సంబంధితులందరూ నిందితులేనని తెలిపారు. మరో 9 సర్వే నంబర్లలోనూ... రాజధాని గ్రామాలైన అనంతవరం, నేలపాడు, వెలగపూడి, రాయపూడి, పెదలంక తదితర గ్రామాల్లోని తొమ్మిది సర్వే నంబర్లలోని రికార్డులు తారుమారయ్యాయని ప్రాథమిక పరిశీలనలో వెల్లడైంది. ఆయా గ్రామాలకు చెందిన పేద రైతులు తమను మోసగించారని రాతపూర్వకంగా ఫిర్యాదులు చేశారు. వీటిపై లోతైన దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని దళిత సంఘాలు ప్రభుత్వానికి విన్నవిస్తున్నాయి. -
పెట్రోల్బాటిల్ తీసి ఒంటిపై పోసుకుని..
వెల్దండ (కల్వకుర్తి): భూ సమస్య పరిష్కరించాలంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. ఇది గమనించిన తోటి రైతులు వెంటనే నిలువరించారు. వివరాలిలా ఉన్నాయి. నాగర్కర్నూల్ జిల్లా వెల్దండకు చెందిన బొక్కల రామస్వామి రెండేళ్ల క్రితం మృతి చెందారు. ఈయనకు సర్వే నం.187, 194. 195, 198, 199, 200, 201లలో నాలుగెకరాల పొలం ఉంది. అనంతరం దీనిని భార్య బొక్కల లక్ష్మమ్మకు విరాసతు చేశారు. అయితే ఈ పట్టా భూమి కాస్తా అన్లైన్లో అసైన్డ్గా నమోదైంది. దీంతో తల్లితో పాటు కుమారుడు బొక్కల శ్రీనివాస్ పట్టా భూమిగా నమోదు చేయాలని ఏడాది కాలంగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పరిష్కరించలేకపోయారు. చివరకు విసుగు చెందిన అతను సోమవారం ఉదయం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించాడు. అయినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని వెంట తీసుకొచ్చిన పెట్రోల్బాటిల్ తీసి ఒంటిపై పోసుకుని నిప్పు అంటించుకోవడానికి యత్నించాడు. ఇది గమనించిన అక్కడే ఉన్న రైతులు బాటిల్ను తీసివేసి అగ్గిపెట్టెను లాగేశారు. అనంతరం బాధితుడితో ఎస్ఐ నర్సింహులు, తహసీల్దార్ సైదులు, డీటీ వెంకటరమణ మాట్లాడారు. మూడు రోజుల్లో సమస్యను తీర్చుతామని హామీ ఇవ్వడంతో శాంతించి వెనుదిరిగారు. -
‘రెవెన్యూ’పై.. కరోనా పంజా
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి రెవెన్యూ ఉద్యోగులపై పంజా విసిరింది. ఆ శాఖలో అటెండర్ మొదలుఆర్డీవో స్థాయి వరకు 126 మంది వైరస్ బారినపడగా.. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి తహసీల్దార్ మల్లేశం మృతితో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. సరైన చికిత్స అం దకపోవడమే తహసీల్దార్ మరణానికి కారణమని రెవె న్యూ ఉద్యోగుల సంఘం(ట్రెసా) తీవ్రంగా ఆరోపించిం ది. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్తో కూడిన బెడ్ను ఏర్పాటు చేయాలని కోరినా పట్టించుకోలేదని, ఇలాంటి విపత్కకర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యం నింపాల్సిన అధికారులే...తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం శోచనీయమని వ్యా ఖ్యానించింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఒకట్రెం డు రోజుల్లో సమావేశం నిర్వహించి.. భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని స్పష్టం చేసింది.తమ వ్యవహారంలో సీఎస్ తీరుపై కూడా వారు ఆగ్రహంతో ఉన్నారు. నిమ్స్లో చికిత్స అందించండి: ప్రజలకు సేవలు అం దిస్తూ కరోనా బారిన పడుతున్న రెవెన్యూ ఉద్యోగులకు నిమ్స్ ఆసుపత్రిలో నాణ్యమైన చికిత్స అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ను ‘ట్రెసా’ ప్రతినిధి బృందం కోరింది. కన్నెపల్లి తహసీల్దార్ మల్లేశం విషమస్థితిలో వెంటిలేటర్ సాయం లభించక గాంధీ ఆసుపత్రిలో మృతి చెందడం తమకు ఆందోళన కలిగిస్తోందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రెవెన్యూ ఉద్యోగులకు ‘ని మ్స్’తో పాటు ‘టిమ్స్’లో చికిత్సకు అవకాశం కల్పిస్తామ ని మంత్రి హామీనిచ్చారు. మంత్రిని కలిసిన వారిలో ‘ట్రెసా’రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యద ర్శి కె.గౌతమ్ కుమార్, ఉపాధ్యక్షుడు రామకృష్ణ ఉన్నారు. -
శివారుపై ఏసీబీ కన్ను
సాక్షి, హైదరాబాద్: శివారు మండలాలపై ప్రభుత్వం డేగకన్ను వేసింది. అవినీతి రెవెన్యూ అధికారుల భరతం పట్టేందుకు సమాచారం సేకరిస్తోంది. ఈ మేరకు రంగంలోకి దిగిన అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ).. రాజధాని చుట్టూరా ఉన్న జిల్లాల్లోని తహసీల్దార్ల వ్యవహారశైలిపై నిఘా పెట్టింది. ప్రజల్లో అవినీతి అప్రతిష్టను మూటగట్టుకున్న రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసే దిశగా ఒకవైపు ప్రయత్నిస్తుంటే.. మరోవైపు ఇటీవల షేక్పేట మండల తహసీల్దార్, ఆర్ఐ ఏసీబీ వలలో చిక్కడం సంచలనం కలిగింది. ఒక భూ వివాదంలో తలదూర్చిన ఈ రెవెన్యూ ద్వయం ఏకంగా రూ.50 లక్షల డీల్ కుదుర్చుకున్నట్లు విచారణలో తేలడం ప్రభుత్వాన్ని నివ్వెర పరిచింది. గతేడాది రంగారెడ్డి జిల్లా తహసీల్దార్ కూడా రూ.93 లక్షల నగదుతో పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలోనే అక్రమార్కుల చిట్టాను తయారు చేసిన ఏసీబీ.. ఆ జాబితాను ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిసింది. హైదరాబాద్ పరిసరాల్లో భూముల రేట్లు నింగినంటడం, రెవెన్యూ తగాదాలు కూడా గణనీయంగా పెరిగిపోవడంతో ఇదే అదనుగా అధికారుల అవినీతికి అడ్డూ అదుపులేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే శివారు మండలాల పోస్టింగ్లకు పోటీ తీవ్రంగా ఉంటోంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ఏసీబీ క్షేత్రస్థాయిలో అవినీతి తిమింగలాల సమాచారాన్ని రాబడుతోంది. విలువైన భూములు, వివాదాస్పద భూములపై తహసీల్దార్లు తీసుకున్న నిర్ణయాలను విశ్లేషిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఈ వివరాలను కూడా నివేదికలో పొందుపరచాలని నిర్ణయించినట్లు తెలిసింది. అంతేగాకుండా రెవెన్యూ వ్యవహారాల్లో అధికారుల కుటుంబసభ్యులు, పైరవీకారుల పాత్రను కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. గాడ్ఫాదర్ల అండతో... కొలువులో చేరింది మొదలు పదవీ విరమణ వరకు అక్కడే నెలవు. పదో న్నతులు లభించినా.. బది లీ ఉత్తర్వులు అందినా.. గాడ్ఫాదర్ల అండ తో పక్క మండలాలకు వెళతారే తప్ప పొరపాటున జిల్లా సరిహద్దు దాటరు. ఒకవేళ కాదు కూడదని ప్రభుత్వం బదిలీ చేసినా.. పోస్టింగ్లో చేరకుండా కాలయాపన చేస్తా రు. రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, వికారాబాద్ జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులను కదలించడం అంత ఆషామాషీ కాదు. వీరి పలుకుబడి ముందు ఐఏఎస్ అధికారులు బలాదూరే. నయాబ్ తహసీల్దార్గా ఉద్యోగంలో చేరి అదనపు కలెక్టర్గా అవే జిల్లాల్లో రిటైర్ అవుతున్నారంటే ప్రభుత్వంలో వీరికున్న పలుకుబడి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. పెరిగిన భూ వివాదాలను అనువుగా మలుచుకుంటున్న రెవెన్యూ అధికారులు వివాదాస్పద భూ వ్యవహారాల్లో తలదూర్చుతున్నారు. భూ విలువలు కోట్లలో పలుకుతుండటం.. భూ మాఫియా, రియల్టర్లు ఎంతైనా ఇచ్చుకునేందుకు ఆఫర్లు ఇస్తుండటంతో ఎందాకైనా వెళ్లేందుకు రెవెన్యూ గణం సాహసిస్తోంది. దీంతో శివారు మండలాల్లో పోస్టింగ్లు హాట్కేకులా మారిపోయాయి. తమకు అనువుగా ఉండే అధికారిని ఈ కుర్చీలో కూర్చోబెట్టేందుకు ప్రజాప్రతినిధులు మొదలు బడాబాబుల వరకు తెరవెనుక ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
బంజారాహిల్స్ పీఎస్ ఎస్ఐ అరెస్ట్
సాక్షి, జూబ్లీహిల్స్ : భూ ఆక్రమణ కేసులో నిందితుడిని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు రూ.3 లక్షలు డిమాండ్ చేసినందుకుగాను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రవీందర్ నాయక్పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్ రోడ్ నెం 14లో ఉన్న రెండెకరాల ప్రభుత్వ స్థలాన్ని ఖాలీద్ అనే వ్యక్తి ఆక్రమించాడు. దీనిపై షేక్పేట మండల తహసీల్దార్ సుజాత గత ఏప్రిల్ 30న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో బంజారాహిల్స్ పోలీసులు ఖాలీద్పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్ట్ చేయకుండా ఉండేందుకు గాను రూ. 3 లక్షలు ఇవ్వాలని ఎస్ఐ రవీందర్ డిమాండ్ చేశాడు.(లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ఆర్ఐ) ఖాలీద్ ఇటీవల రూ.1.50 లక్షలు రవీందర్ ఇంటికి తీసుకెళ్లి ఇచ్చి వచ్చాడు. అందుకు సంబంధించిన ఆధారాలను ఏసీబీ అధికారులకు అందించిన ఖాలీద్ అతను మరో రూ. 3 లక్షలు డిమాండ్ చేస్తున్నాడని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నాలుగు బృందాలుగా ఏర్పడిన ఏసీబీ అధికారులు షేక్పేట మండల కార్యాలయం, ఆర్ఐ నివాసం, తహసీల్దార్ ఇంట్లో, ఎస్ఐ రవీందర్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. కాగా అర్థరాత్రి వరకు తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగించారు. అర్థరాత్రి రాత్రి 12 గంటలకు తహసిల్దార్ సుజాతను ఇంటికి పంపించారు. నేడు కూడా ఈ కేసుకు సంబంధించి తహిసిల్దార్ సుజాతను విచారించనున్నారు. ఎస్ఐ రవీందర్పై కేసు నమోదు చేసిన పోలీసులు తమ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రోజు కూడా తహసిల్దార్ సుజాతను విచారించనున్న ఏసీబీ అధికారులు. అసలు ఏం జరిగిదంటే.. బంజారాహిల్స్ రోడ్ నెం. 14 సర్వే నంబర్ 129/59లో ఉన్న 4865 గజాల ప్రభుత్వ స్థలాన్ని సయ్యద్ అబ్దుల్ ఖాలిద్ అనే వ్యక్తి ఆక్రమించి హెచ్చరిక బోర్డును తొలగించి తన పేరుతో బోర్డు ఏర్పాటు చేశాడు. సదరు స్థలాన్ని తాను కోర్టులో గెలిచినట్లు అందులో పేర్కొన్నాడు. ఈ స్థలాన్ని తన పేరిట క్రమబద్దీకరించి హద్దులు చూపించాల్సిందిగా షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అది ప్రభుత్వ స్థలం కావడంతో తహసిల్దార్ సుజాత గత జనవరిలో ఒకసారి, ఏప్రిల్లో మరోసారి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సదరు స్థలాన్ని ప్రైవేట్ పరం చేస్తూ హద్దులు చూపిస్తానంటూ అదే కార్యాలయంలో పని చేస్తున్న ఆర్ఐ నాగార్జున రెడ్డి ఖాలిద్ నుంచి రూ.30 లక్షలు డిమాండ్ చేశాడు. ఇందులో భాగంగా శనివారం ఖాలిద్ రూ.15 లక్షల నగదును సాగర్సొసైటీ రోడ్డులో హార్లి డేవిడ్ సన్ షోరూం పక్క సందులో నాగార్జున్ రెడ్డికి ఇస్తుండగా అప్పటికే అక్కడ వేచి ఉన్న ఏసీబీ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నాగార్జునరెడ్డి నుంచి రూ.15 లక్షలు స్వాధీనం చేసుకున్న అధికారులు యూసుఫ్గూడలోని అతడి ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. నిందితుడిని కార్యాలయానికి తీసుకువచ్చి విచారించగా కలెక్టరేట్లో ఓ అధికారికి రూ. 15 లక్షలు ఇవ్వాల్సి ఉందని అందుకే రూ.30 లక్షలు డిమాండ్ చేసినట్లు తెలిపారు. -
బల్లకింద బుక్కయ్యారు
-
తెలంగాణ: తహసీల్దార్ల పవర్ కట్
సాక్షి, హైదరాబాద్ : రెవెన్యూ శాఖలో కీలక సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం తుదిరూపునిస్తోంది. క్షేత్రస్థాయిలో ఆ శాఖకు వెన్నెముక అయిన తహసీల్దార్ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతోంది. గతంలో భూ వ్యవహారాలపై సర్వాధికారాలు ఎమ్మార్వోలకే ఉండగా.. ఇప్పుడు వాటిలో సగం అధికారాలకు కత్తెర వేయబోతోంది. రెవెన్యూ అంశాల్లోనే కాకుండా తహసీల్లార్దు ప్రతిష్టాత్మకంగా భావించే రేషన్ వ్యవహారాల్లోనూ కోత విధిస్తోంది. రేషన్కార్డులు జారీచేసే అధికారం, రేషన్షాపుల పర్యవేక్షణ, రైసుమిల్లులపై అజమాయిషీ బాధ్యతల నుంచి వారిని తప్పించబోతోంది. ఇక, రైతు సంబంధ వ్యవహారాల్లోనూ తహసీల్దార్ల పాత్రను పరిమితం చేస్తోంది. జనగణన, పశుగణన వంటి అదనపు భారాల నుంచి కూడా విముక్తి కల్పించ బోతోంది. ఈ మేరకు తహసీల్దార్లకు ఉన్న ప్రధానమైన 44 అధికారాల్లో 20 మాత్రమే వారి పరిధిలో కొనసాగిస్తూ, 17 అధికారాలను వ్యవసాయ, పశుసంవర్థక, పోలీసు, పౌర సరఫరాలు, పంచాయతీరాజ్ శాఖలకు బదలాయించబోతోంది. కాలం చెల్లిన మరో ఏడు అధికారాలను రద్దు చేయాలని నిర్ణయించింది. ఇందులో రక్షితదారు చట్టం కూడా ఉంది. ► తహసీల్దార్లకు గల అధికారాల్లో ప్రధానమైనవి-44 ► ఇకపై తహసీల్దార్ల ప్రతిపాదిత విధులు-20 ► ఇతర శాఖలకు బదలాయించే అధికారాలు-17 ► రద్దు చేయాలని నిర్ణయించినవి-7 అంతర్గత కసరత్తు పూర్తి రెవెన్యూ శాఖ పనితీరుపై అసంతృప్తితో ఉన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు రెవెన్యూ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించడమేగాకుండా.. త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టం తీసుకురానున్నట్టు ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఆలోచన ఫలితంగానే తహసీల్దార్ద విధుల్లో పెనుమార్పులు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు కొత్త రెవెన్యూ చట్టంలో తహసీల్దార పాత్రను స్పష్టంగా ప్రస్తావించనుంది. తహసీల్దార్లతోపాటు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) విధుల్లో కూడా ఈ చట్టం ద్వారా మార్పులు చేయనున్నారు. వాస్తవానికి మార్చిలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లోనే రెవెన్యూ ముసాయిదా చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావించినా.. రెవెన్యూ కోడ్ తీసుకురావాలా? సంపూర్ణంగా కొత్త చట్టమే తీసుకురావాలా? అనే అంశంపై స్పష్టత లేకపోవడంతో ముందడుగు పడలేదు. అయితే, చట్టం ఎలా ఉండాలనే అంశంపై ఇప్పటికే నిర్ధిష్ట అభిప్రాయానికి వచ్చిన ఉన్నతాధికారులు... వీఆర్వోలు, తహసీల్దార్లు, ఆర్డీవోల అధికారాలు, ఇతర శాఖల్లో బదలాయింపుపై మాత్రం అంతర్గత కసరత్తు పూర్తిచేశారు. ఇక, కీలకమైన మ్యుటేషన్లు, పట్టాదారు పాస్ పుస్తకాల జారీ అధికారాలను తహసీల్దార్లకే ఉంచాలా లేదా ఆర్డీఓలకు బదలాయించాలా అనేది ముఖ్యమంత్రి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఒకే గొడుగు కిందకు.. రెవెన్యూ శాఖను సమూల ప్రక్షాళన చేసే దిశగా కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) పోస్టును రద్దుచేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇందులోభాగంగానే గత ఐదు నెలలుగా ఖాళీగా ఉన్న ఈ పోస్టును భర్తీ చేయట్లేదని తెలుస్తోంది. సీసీఎల్ఏ కార్యాలయంలో పనిచేసే సిబ్బందిని కూడా కుదించి.. సచివాలయంలోని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయం సేవలను వినియోగించుకోవాలని యోచిస్తోంది. మరోవైపు ప్రభుత్వ ఆదాయార్జన శాఖలన్నింటికీ ఒకే ముఖ్య కార్యదర్శి ఉండేలా, ఆ పోస్టులో స్పెషల్ సీఎస్ హోదా అధికారిని నియమించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఇబ్బడిముబ్బడిగా ఉన్న శాఖలను భారీగా కుదించాలని, కేవలం 18 శాఖలకే పరిమితం చేస్తే బాగుంటుందని గతంలో సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మంత్రుల సంఖ్యకు అనుగుణంగా శాఖల కూర్పు చేసే దిశగా ఆలోచన సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికితోడు రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టుల కోసం భారీగా భూ సేకరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని పోస్టులను ఆ శాఖకు శాశ్వతంగా బదలాయించే అంశాన్నీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తహసీల్దార్ల ప్రతిపాదిత విధులు, బాధ్యతలు ► మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్లపై పర్యవేక్షణ, సమన్వయం ► సాధారణ విచారణలు ► వీఐపీల పర్యటనల ప్రొటోకాల్ విధులు ► కుల, ఆదాయ, వాల్యూయేషన్, స్థానికత, న్యాయబద్ధమైన వారసుల సర్టిఫికెట్ల జారీ ► ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో జ్యూడీషియల్ అధికారాలు, భూసేకరణాధికారి (ఎల్ఏవో) ► రోడ్డు, రైల్వే కార్యకలాపాలకు సంబంధించిన ప్రొటోకాల్ డ్యూటీ ► వెట్టి కార్మికుల విముక్తి చట్టం అమలు ► రెయిన్గేజ్ మీటర్ల నిర్వహణ ► నీటి వనరులు, నీటి పరివాహక ప్రాంతాల పర్యవేక్షణ ► వ్యవసాయేతర రంగాలకు నీటి వనరుల కేటాయింపులపై అధికారం ► రెవెన్యూ రికవరీ చట్టం కింద ప్రభుత్వ బకాయిలు వసూలు చేయడం ► గ్రామ పద్దుల పరిశీలన ► ప్రకృతి విపత్తుల నిర్వహణ, పునరావాసం ► సాధారణ భూసేకరణ ► సాధారణ ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ► ఓటర్ల జాబితా రూపకల్పన ► ప్రజారోగ్యం, అంటువ్యాధుల నివారణ బాధ్యతలు ► చెట్లపై హక్కుల జారీ ► రివాల్వర్ లైసెన్సులు, పేలుడు సంబంధిత అనుమతుల లైసెన్సుల తనిఖీ ► భూ ఆక్రమణల చట్టం కింద చర్యలు రద్దు కానున్న అధికారాలు ► సర్వే సబ్ డివిజన్ నంబర్ల జారీ ► ఉప్పు భూమి లీజులు, అద్దె వసూళ్లు ► సర్వే హద్దురాళ్ల తనిఖీ ► ఆక్రమణదారులకు బీ–మెమోల జారీ ► వ్యవసాయ, ఇళ్ల స్థలాల అసైన్మెంట్ ► హోమ్ స్టెడ్ యాక్ట్ కింద పట్టాల జారీ ► టెనెన్సీ యాక్డు -
తహసీల్దార్కు ‘కూన’ బెదిరింపులు
పొందూరు: రెండు రోజుల క్రితం బదిలీపై వెళ్లిన శ్రీకాకుళం జిల్లా పొందూరు తహసీల్దార్ తామరాపల్లి రామకృష్ణను టీడీపీ నేత, ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ బెదిరించారు. ఈ నెల 16న గోరింట గ్రామంలోని రామసాగరం చెరువులో రవికుమార్ సోదరుడికి చెందిన రెండు జేసీబీలు, నాలుగు టిప్పర్లతో మట్టిని అక్రమంగా తవ్వుతుండగా వీఆర్ఓ నుంచి ఫిర్యాదు రావడంతో తహసీల్దార్ అక్కడకు చేరుకుని వాహనాలను సీజ్ చేశారు. దీంతో రవికుమార్ తహసీల్దార్కు ఫోన్చేసి బెదిరించారు. ఆ ఆడియో ఆలస్యంగా ఇప్పుడు వెలుగుచూసింది. ‘వాహనాలు విడిచిపెట్టు.. లేకపోతే లంచం డిమాండ్ చేశావని నీ మీద కంప్లైంట్ చేస్తాను’ అని ‘కూన’ బెదిరించారు. ‘నా చేతిలో ఏం లేదు. సీజ్ చేసి అప్పగించేశాను’ అని తహసీల్దార్ చెప్పడంతో.. ‘కూన’ దుర్భాషలాడుతూ.. ‘నువ్వు సీజ్ చేశావుగానీ కంప్లైంట్ చేయలేదని నాకు తెలుసు. చెప్పు ఎంత కావాలి.. పది వేలు కావాలా, లక్ష కావాలా ఎంత కావాలి’ అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. ‘నిబంధనల ప్రకారం వాహనాలను పోలీస్స్టేషన్కు అప్పగించాను. తర్వాత మీరు రిలీజ్ చేసుకోండి సార్’ అని తహసీల్దార్ చెప్పడంతో.. ‘ప్రాసెస్ గురించి నాకు చెబుతున్నావా..’ అంటూ రాయలేని రీతిలో ‘కూన’ అసభ్యంగా దూషించారు. దీంతో.. క్వారెంటైన్లో ఉన్న 13 మంది టీడీపీ వర్గీయులతో తనపై ఫిర్యాదులు చేయించారని తహసీల్దార్ రామకృష్ణ చెప్పారు. కాగా, కూన రవికుమార్ గతంలో కూడా ఇలాగే సరుబుజ్జిలి ఎంపీడీఓను.. అదే మండలానికి చెందిన పంచాయతీ విస్తరణాధికారిని బెదిరించారు. ఈ రెండు ఘటనల్లోనూ ఆయన అరెస్టయి బెయిల్పై బయటకు వచ్చారు. -
రెవెన్యూ కార్యాలయం లంచాలకు అడ్డా..
తిరుమలగిరి(నాగార్జునసాగర్) : నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండల రెవెన్యూ కార్యాలయంలంచాలకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ చేయి తడపనిదే పనికాదని... ప్రతి పనికి ఒక రేటు నిర్ణయించినట్లు చెబుతున్నారు. తాజాగా ఓ మహిళకు వారసత్వంగా వచ్చిన భూమికి డబ్బులు తీసుకుని ధ్రువీకరణపత్రం, పట్టాపాస్పుస్తకం కూడా ఇచ్చారు. ఆమె భర్త బంధువులు రంగప్రవేశం చేసి అధిక డబ్బులు ఆశచూపడంతో సదరు అధికారి ఆ భూమిపై మెలిక పెట్టి వివాదాస్పదంగా ఉందని హక్కుదారుకు నోటీసులు ఇచ్చారు. దీంతో బాధితురాలు కార్యాలయానికి చేరుకుని అధికారిని నిలదీసింది. దీనికి సంబంధించి బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. అనుముల మండలం మల్గిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన మల్గిరెడ్డి లక్ష్మమ్మకు తిరుమలగిరి శివారులో సుమారు 7 ఎకరాల భూమి ఉంది. దీంతోపాటు సర్వేనంబర్లు 82, 83లో 2.28గుంటల భూమి వంశపారంపర్యంగా సంక్రమించింది. సర్వేనంబర్ 84లో 1.20 గుంటలను సొంతంగా కొనుగోలు చేసింది. మొత్తం 4 ఎకరాల 8 గుంటల భూమిని పట్టా చేసేందుకు మండల రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగింది. అయినప్పటికీ అధికారులు స్పందించలేదు. చివరకు రూ.లక్షకు బేరం కుదిరింది. దీంతో లక్ష్మమ్మకు భూమికి సంబంధించి ప్రొసీడింగ్ ఆర్డర్, ధ్రువీకరణపత్రం ఇచ్చారు. మొత్తం 4ఎకరాల8గుంటల భూమిని పట్టా చేయించుకుంది. పాస్పుస్తకం కూడా ఇచ్చారు. విషయం తెలుసుకున్నలక్ష్మమ్మ బంధువులు రంగంలోకి దిగారు. భూమిపై మెలిక పెట్టేందుకు సదరు రెవెన్యూ అధికారిని కలిసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే 82, 83 సర్వేనంబర్లలోని 2ఎకరాల 28 గుంటల భూమి వివాదాస్పదంగా ఉందని ఈ నెల 11వ తేదీన మల్గిరెడ్డి లక్ష్మమ్మకు తహసీల్దార్ నోటీసులు అందజేసింది. దీంతో బాధితురాలు తన కూతురుతో కలిసి శుక్రవారం కార్యాలయానికి వెళ్లి సదరు అధికారిని ప్రశ్నించింది. ప్రొసీడింగ్స్ ఇచ్చింది మీరే కదా అని అడగగా ‘నేను చూడకుండా పెట్టానని, ఆ భూమిపై నీకు హక్కు లేదని, ఎవరికి ఫిర్యాదు చేస్తావో చేసుకో’’ అంటూ దబాయించింది. ఇదే అదునుగా స్థానిక నేతలు రంగంలోకి దిగారు. బేరసారాలకు తెరలేపారు. బాధితురాలు ఎంతకీ ఒప్పుకోలేదు. తాను రూ.లక్ష నష్టపోవడమే కాకుండా ఉన్న భూమిని కూడా కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని బాధితురాలు అక్కడే ఉన్న అధికారులు, విలేకరుల ఎదుట వాపోయింది. తనకు డబ్బు ముఖ్యం కాదని, తన భూమి తనకు ఉంటే చాలని కన్నీటిపర్యంతమైంది. మా భూమి మాకే కావాలి నా భర్త అనారోగ్య సమస్యలతో హైదరాబాద్లో ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో రైతుబంధు సాయం ప్రభుత్వం ప్రకటించడంతో మేము గ్రామానికి వచ్చాం. నా భర్త చనిపోయిన తరువాత భూమి సర్వే నంబర్ల వివరాలు తెలియక రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగాం. రూ. లక్ష లంచం తీసుకొని ప్రొసీడింగ్ కాపీని అందజేశారు. పట్టాదార్ పాస్పుస్తకం కూడా వచ్చింది. ఇప్పుడు ప్రొసీడింగ్ నేను ఇవ్వలేదంటూ తహసీల్దార్ ఇబ్బందులకు గురిచేస్తున్నారు.– మల్గిరెడ్డి లక్ష్మమ్మ, బాధితురాలు, మల్గిరెడ్డిగూడెం నిబంధనల ప్రకారమే నడుచుకున్నా.. పట్టా్టదారు జమీన్లకు పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నా. నేను ఎక్కడా అవినీతికి పాల్పడలేదు. అన్ని పనులు నిబంధనల ప్రకారమే పూర్తి చేస్తున్నా. మల్గిరెడ్డి లక్ష్మమ్మఎవరో నాకు తెలియదు. నాపై నింద వేస్తున్నారు. ఎలాంటి విచారణకు అయినా సిద్ధమే.– కేసీ ప్రమీల తహసీల్దార్, తిరుమలగిరి