విశాఖ సిటీ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విశాఖకు చెందిన తహసీల్దార్ రమణయ్య హత్య కేసు మిస్టరీ వీడింది. వ్యక్తిగత లావాదేవీలు, భూ వ్యవహారాల కారణంగానే హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. హత్య చేసి విశాఖ నుంచి విమానంలో చెన్నై పారిపోయిన రియల్టర్ మురారి సుబ్రహ్మణ్యం గంగారావును సోమవారం అరెస్టు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ తెలిపారు.
తహసీల్దార్ సనపల రమణయ్యను గత శుక్రవారం రాత్రి హత్య చేసిన మురారి సుబ్రహ్మణ్యం గంగారావు శనివారం ఉదయం వరకు విశాఖలోనే ఉన్నాడు. తరువాత విశాఖ నుంచి బెంగళూరు మీదుగా చెన్నైకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన టికెట్ బుక్ చేసుకున్నాడు.
మధ్యాహ్నం 3.30 గంటలకు విమాన సమయం అయినప్పటికీ.. ఉదయం 9.30 గంటలకే విమానాశ్రయం లోపలకు వెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఇదిలా ఉంటే గంగారావే తహసీల్దార్ను హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు అతని మొబైల్ ఆధారంగా చెన్నైకు టికెట్ బుక్ చేసుకున్నట్లు ముందుగానే గుర్తించారు. దాని ప్రకారం మధ్యాహ్నం ఎయిర్పోర్ట్లో సుబ్రహ్మణ్యం పేరుతో విచారించారు. ఆ పేరుతో ప్రయాణికులు ఎవరూ లేరని ఎయిర్పోర్ట్ అధికారులు చెప్పడంతో పోలీసులు వెనక్కు వచ్చేశారు.
అప్పటికి విమానాశ్రయం సీసీ కెమెరాలను పరిశీలించలేదు. పెద్ద పేరు ఉండడంతో పోలీసులు గానీ, ఎయిర్పోర్ట్ అధికారులు గానీ పూర్తిస్థాయిలో నిందితుడి పేరును గుర్తించలేకపోయారు. దీంతో హంతకుడు విమానం ఎక్కి బెంగళూరు వెళ్లాడు. అయితే అప్పటికే ఎయిర్పోర్టు అధికారులకు సమాచారం ఉండడంతో బెంగళూరులో ఎయిర్హోస్టెస్ మురారీ సుబ్రహ్మణ్యం గంగారావు పేరును అనౌన్స్ చేయడంతో.. అనుమానించిన అతడు బెంగళూరు విమానాశ్రయంలోనే దిగిపోయాడు.
బస్సులో చెన్నైకు..
బెంగళూరు నుంచి గంగారావు బస్సులో చెన్నైకు బయలు దేరాడు. హంతకుడిని పట్టుకునేందుకు చెన్నైకు వెళ్లిన ప్రత్యేక బృందం మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా చెన్నై పోలీసుల సహకారంతో గంగారావును చెంగల్పుట్టు వద్ద అరెస్ట్ చేసింది. అక్కడి నుంచి ట్రాన్సిట్ ద్వారా విశాఖకు తీసుకొచ్చారు. కాగా, హత్య జరగడానికి గల కారణాలపై డీసీపీ–
1 మణికంఠ ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోందని సీపీ రవిశంకర్ తెలిపారు. కన్వెయన్స్ డీడ్స్ విషయంలో జరిగిన వ్యక్తిగత వ్యవహారాల కారణంగానే హత్య చేసినట్లు గంగరావు చెప్పినట్లు తెలిపారు. గంగారావు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని, అతడిపై హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల్లోనూ చీటింగ్ కేసులున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని వివరించారు.
వ్యక్తిగత లావాదేవీలతోనే తహసీల్దార్ హత్య
Published Tue, Feb 6 2024 5:07 AM
Advertisement
Advertisement
ట్రైనీ ఐఏఎస్గా పోలీస్ అకాడమీకి కుమార్తె.. సెల్యూట్ చేసిన ఐపీఎస్ తండ్రి
EVMలపై వైఎస్ జగన్ కీలక ట్వీట్, ఏమన్నారంటే..
ఖరీదైన ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన హీరోయిన్ కంగన.. ఎవరికో తెలుసా?
జోబైడెన్ కీలక నిర్ణయం.. అమెరికాలోని విదేశీయులకు భారీ ఊరట!
కరివేపాకులు ఆరు నెలలు వరకు నిల్వ ఉండాలంటే..!
వందే భారత్ రైలు ఆహారంలో బొద్దింక..
బీజేపీ, బీఆర్ఎస్ కలిసి సింగరేణిలో అతిపెద్ద కుట్ర
ఆరోజు రాత్రి వరకు అబ్బాయి.. లేచిన వెంటనే అమ్మాయిగా మార్పు..!
‘తిక్క తీరింది బిడ్డకు’..! పగలబడి నవ్వుతారు: వైరల్ వీడియో
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (20-06-2024)
నా కెరీర్కు కుటుంబమే అడ్డు పడుతోంది: మంచు లక్ష్మి
TG: అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు
చరిత్రపుటల్లోకెక్కిన ఇండియా-సౌతాఫ్రికా మ్యాచ్
Beauty Tips: పండులాంటి ప్యాక్..!
బాబర్ ఆజంపై సంచలన ఆరోపణలు
తప్పక చదవండి
- విడాకుల తరువాత హ్యాపీగా ఉన్నాను - బిల్ గేట్స్ మాజీ భార్య
- టీడీపీ దాడులకు భయపడేది లేదు: కొడాలి నాని
- హబ్బీతో బేబీమూన్కు : భార్య అంటే ఎంత ప్రేమో! వైరల్ వీడియో
- సినిమాను మించిన స్టోరీ.. విడాకుల తర్వాత ఆరేళ్లకు..!
- ఈఎస్ఐసీ కిందకు 16.47 లక్షల మంది
- Ind vs Afg: అతడు వద్దు.. కోహ్లి విషయంలో అలా చేయొద్దు!
- ఎన్నాళ్లో వేచిన ఉదయం: 105 ఏళ్ల బామ్మ మాస్టర్స్ డిగ్రీ
- ప్రధాని మోదీ శశాంకాసనం.. ప్రయోజనాలివే
- తాలిబన్ల ఆయుధాలపై పాక్ వణుకు!
- ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమే: సెంథిల్
Advertisement