airport
-
40 కి.మీ.. 40 నిమిషాలు
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీకి కేవలం 40 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఎయిర్పోర్టు నుంచి స్కిల్స్ యూనివర్సిటీ వరకు నిర్మించనున్న 40 కిలోమీటర్ల మెట్రో కారిడార్ అత్యాధునిక సదుపాయాలతో, అంతర్జాతీయ ప్రమాణాలతో అందుబాటులోకి రానుంది. ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన నగరాల్లోని మెట్రో ప్రయాణ అనుభవాలు స్ఫురించే విధంగా ఈ కారిడార్లో మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. 40 కి.మీ ఫోర్త్ సిటీ మెట్రోలో చాలావరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు. హెచ్ఎండీఏ నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రోడ్డులో కొంతభాగంలో మాత్రం ఎట్గ్రేడ్ మెట్రో (భూతలంపైన) నిర్మాణం చేపట్టనున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి భవిష్యత్ దార్శనిక దృష్టి మేరకు.. ప్రస్తుత ఔటర్ రింగ్ రోడ్డు మార్గంలో మెట్రో అందుబాటులోకి రానుందని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ ఎండీ ఎన్విఎస్ రెడ్డి తెలిపారు.ఓఆర్ఆర్ నిర్మాణంలో భాగంగా భవిష్యత్తులో నిర్మించే మెట్రో అవసరాలకు అనుగుణంగా ఆయన ఓఆర్ఆర్లో 20 మీటర్లు మెట్రో కోసం కేటాయించిన విషయం గుర్తుచేశారు. ప్రస్తుతం ఆ మార్గంలోనే మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. సర్వే పనుల పరిశీలన మెట్రో రెండో దశలో ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) రూపకల్పనలో భాగంగా ఎన్విఎస్ రెడ్డి.. హెచ్ఎండీఏ, టీజీఐఐసీ అధికారులతో కలిసి ఆదివారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఎయిర్పోర్ట్ నుంచి మీర్ఖాన్పేట్లో నిర్మాణంలో ఉన్న స్కిల్స్ యూనివర్సిటీ వరకు మెట్రో కారిడార్ డీపీఆర్ తయారు చేసేందుకు జరుగుతున్న సర్వే పనులను పరిశీలించారు. కొంగర కలాన్ దాటిన తర్వాత రోడ్డు లేకపోవడంతో కాలినడకనే కొండలు, గుట్టలు దాటుతూ పర్యటన కొనసాగించారు. ప్రపంచంలోనే ఒక గొప్ప నగరంగా ఆవిష్కృతం కానున్న ఫోర్త్సిటీ మెట్రో సేవలు కూడా అంతర్జాతీయ ప్రమాణాల మేరకు ఉంటాయని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. సుమారు 15 వేల ఎకరాల్లో విస్తరించనున్న భవిష్య నగరిని కాలుష్య రహిత నగరంగా రూపొందించాలన్నది సీఎం రేవంత్రెడ్డి సంకల్పమని చెప్పారు. ఫ్యూచర్ సిటీ కారిడార్ ఇలా... » శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్లే మెట్రో మార్గం సుమారు 40 కిలోమీటర్లు ఉంటుంది. ఎయిర్పోర్ట్ టెరి్మనల్ నుంచి మొదలై కొత్తగా నిర్మించనున్న మెట్రో రైల్ డిపో పక్క నుంచి ఎయిర్పోర్ట్ సరిహద్దు గోడ వెంబడి ఎలివేటెడ్ మార్గం నిర్మించనున్నారు. » మన్సాన్పల్లి రోడ్డు మార్గంలో 5 కిలోమీటర్లు ముందుకు సాగిన తర్వాత పెద్ద గొల్కోండ ఓఆర్ఆర్ ఎగ్జిట్కు చేరుతుంది. బహదూర్గూడ, పెద్ద గోల్కొండలలో రెండు మెట్రో స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో ఆకర్షణీయంగా నిర్మించనున్నారు. » పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి తుక్కుగూడ ఎగ్జిట్ మీదుగా రావిర్యాల్ ఎగ్జిట్ వరకు సుమారు 14 కిలోమీటర్ల పొడవున ఎలివేటెడ్ మెట్రో కారిడార్గా నిర్మించనున్నారు. గ్రీన్ఫీల్డ్ రోడ్డుపై ‘ఎట్ గ్రేడ్ మెట్రో’ » రావిర్యాల్ ఎగ్జిట్ నుండి ఇప్పటికే నిర్మాణంలో ఉన్న స్కిల్స్ యూనివర్సిటీ వరకు దాదాపు 22 కిలోమీటర్లు కొంగర కలాన్, లేమూర్, తిమ్మాపూర్, రాచలూరు, గుమ్మడవెల్లి, పంజగుడా, మీర్ఖాన్ పేట్ వరకు హెచ్ఎండీఏ 100 మీటర్లు ( 328 అడుగులు) వెడల్పున గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మించనుంది.ఈ రోడ్డు మధ్యలో 22 మీటర్లు (72 అడుగులు) మెట్రోరైల్కు కేటాయించారు. ఇక్కడ భూ తలంపై (ఎట్ గ్రేడ్) మెట్రో అభివృద్ధి చేయనున్నారు. » ఈ విశాలమైన రోడ్డు మధ్యలో అదే ఎత్తులో మెట్రో రైల్ ఉంటే దానికి ఇరువైపులా మూడు లేన్ల ప్రధాన రహదారి ఉంటుందని, మెట్రోను, ప్రధాన రహదారిని విభజిస్తూ ఆకర్షణీయమైన చెట్లను, గ్రీనరీని అభివృద్ధి చేస్తామని, ప్రధాన రహదారికి ఇరువైపులా రెండు సర్వీ స్ రోడ్లు ఉంటాయని ఎనీ్వఎస్ రెడ్డి వివరించారు. వైఎస్ భవిష్యత్ దృష్టి ఓఆర్ఆర్ నిర్మాణ సమయంలో మెట్రో రైల్కు కొంతభూమిని కేటాయించాలన్న తన ప్రతిపాదన మేరకు అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఓఆర్ఆర్లో అంతర్భాగంగా 20 మీటర్లు మెట్రోకు కేటాయించారని ఎన్వి ఎస్ రెడ్డి చెప్పారు. అయితే ఓఆర్ఆర్, మెట్రో వంటి బృహత్ ప్రణాళికలు కేవలం కాగితాలకే పరిమితమవుతాయని, ఆచరణ సాధ్యం కాదంటూ అపహా స్యం చేశారని, కానీ ప్రస్తుతం ఓఆర్ఆర్తోపాటు, మెట్రో కూడా కార్యరూపం దాల్చిందన్నారు. సుమారు రూ.22 వేల కోట్లతో మొట్టమొదటి పీపీపీ ప్రాజెక్టుగా 69 కిలోమీటర్ల మెట్రో మొదటి దశను విజయవంతంగా నిర్మించామని, అదేవిధంగా సీఎం రేవంత్రెడ్డి దార్శనికత మేరకు హెచ్ఎండీఏ, టీజీఐఐసీ, మెట్రో రైల్ సంస్థలు సంయుక్తంగా రెండో దశ నిర్మాణం చేపడతాయని చెప్పారు. నార్త్ సిటీలోని మేడ్చల్, శామీర్పేట్ కారిడార్లతో పాటు, ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ డీపీఆర్ను మార్చి నెలాఖరుకు పూర్తి చేసి, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. -
తలకిందులైన విమానం..15 మందికి గాయాలు
టొరంటో: కెనడాలో మరో విమాన ప్రమాదం జరిగింది. సోమవారం(ఫిబ్రవరి 17) టొరంటోలోని పియర్సన్ ఎయిర్పోర్ట్లో డెల్టా ఎయిర్లైన్స్కు చెందిన విమానం క్రాష్ లాండ్ అయింది. బలమైన గాలుల కారణంగా విమానం ల్యాండింగ్లో సమస్యలు తలెత్తి ఏకంగా తలకిందులైంది. ఈ ప్రమాదంలో 15 మంది దాకా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని హెలికాప్టర్ అంబులెన్స్లో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినపుడు విమానంలో 80 మంది ఉన్నారు. మిన్నియాపోలిస్ నుంచి వచ్చిన డెల్టా ఎయిర్లైన్స్ విమానం ప్రమాదానికి గురైందని పియర్సన్ ఎయిర్పోర్టు ఎక్స్(ట్విటర్)లో చేసిన ఒక పోస్టులో ధృవీకరించింది. విమానం తిరగబడి ఎయిర్పోర్టులో పడి ఉన్న వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది.BREAKING: A Delta Airlines CRJ 900 crashed and settled upside down at Toronto Pearson Airport.Thankfully, ALL passengers survived and are accounted for. That is great news! pic.twitter.com/dXXUNkPTHU— Errol Webber (@ErrolWebber) February 17, 2025 -
టొరంటో విమానాశ్రయంలో అదుపుతప్పిన విమానం
టొరంటో: కెనడాలో సోమవారం ఓ విమానం అదుపుతప్పింది. టొరంటోలోని పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డెల్టా ఎయిర్లైన్స్కు చెందిన విమానం ల్యాండ్ అవుతుండగా రన్వే పైనుంచి జారిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు గాయపడ్డట్లు స్థానిక అధికారులను ఉటంకిస్తూ మీడియా తెలిపింది. ప్రమాద సమయంలో విమానంలో 80 మంది ఉన్నట్లు సమాచారం. ఈ విమానం మిన్నెపోలిస్ నుంచి టొరంటోకు వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం నేపథ్యంలో ఎయిర్పోర్టును మూసివేశారు. -
ఎయిర్పోర్ట్ కొత్త రూల్స్.. ఈ వస్తువులకు నో ఎంట్రీ
సురక్షితమైన విమాన ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకుని దుబాయ్ విమానాశ్రయం దాని నియమాలలో కొన్ని మార్పులు చేసింది. సాధారణంగా ప్రయాణికులు క్యాబిన్ బ్యాగ్లో మందులు వంటి ముఖ్యమైన వస్తువులను తీసుకెళ్లవచ్చు. కానీ ఇప్పుడు దుబాయ్ వెళ్లే విమానంలో ఇది సాధ్యం కాదు. మీరు అన్ని రకాల మందులను తీసుకెళ్లలేరు. కొత్త నిబంధనల ప్రకారం.. మీరు అనుమతించిన వస్తువులను మాత్రమే తీసుకెళ్లాలి.దుబాయ్ విమాన లగేజీ నిబంధనలలో మార్పులుచాలా సార్లు ప్రయాణికులు తమకు తెలియకుండానే అనుమతి లేని కొన్ని వస్తువులను తమతో విమానంలోకి తీసుకెళ్తుంటారు. వీటిని విమానంలో తీసుకెళ్లడం చట్టపరమైన నేరంగా పరిగణిస్తారు. మీరు దుబాయ్ వెళ్తుంటే విమానంలో చెక్-ఇన్ లగేజీతో పాటు క్యాబిన్ బ్యాగేజీలో ఏమి ప్యాక్ చేయవచ్చు.. ఏమి చేయకూడదు అనే విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు తప్పవు. దుబాయ్కి ప్రయాణించేటప్పుడు బ్యాగుల్లో ఎలాంటి వస్తువులను తీసుకువెళ్లవచ్చో ఇక్కడ తెలుసుకోండి.ఈ ఉత్పత్తులను బ్యాగులో తీసుకెళ్లకూడదుకొకైన్, హెరాయిన్, గసగసాలు, మత్తు కలిగించే మందులు.తమలపాకులు, కొన్ని మూలికలు వంటివి కూడా తీసుకెళ్లకూడదు.ఏనుగు దంతాలు, ఖడ్గమృగం కొమ్ములు, జూద వస్తువులు, మూడు పొరల ఫిషింగ్ నెట్లు, బహిష్కృత దేశాల నుండి దిగుమతి చేసుకున్న వస్తువులను తీసుకెళ్లడం కూడా నేరంగా పరిగణిస్తారు.ముద్రిత వస్తువులు, ఆయిల్ పెయింటింగ్లు, ఛాయాచిత్రాలు, పుస్తకాలు, రాతి శిల్పాలను కూడా తీసుకెళ్లకూడదు.నకిలీ కరెన్సీ, ఇంట్లో వండిన ఆహారం, మాంసాహారం కూడా తీసుకెళ్లకూడదు.ప్రయాణికులెవరైనా ఈ నిషేధిత వస్తువులను తీసుకెళ్తున్నట్లు తేలితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు.ఈ మందులను అస్సలు తీసుకెళ్లలేరుబెటామెథోడోల్ఆల్ఫా-మిథైల్ఫెనానిల్ గంజాయికోడాక్సిమ్ఫెంటానిల్పాపీ స్ట్రా కాన్సన్ట్రేట్మెథడోన్నల్లమందుఆక్సికోడోన్ట్రైమెపెరిడిన్ఫెనోపెరిడిన్కాథినోన్కోడైన్యాంఫెటమైన్వీటిని చెల్లింపుతో తీసుకెళ్లవచ్చుదుబాయ్ ట్రిప్కు వెళ్లేటప్పుడు కొన్ని రకాల వస్తువులను చెల్లింపుతో తీసుకెళ్లవచ్చు. ఈ జాబితాలో మొక్కలు, ఎరువులు, మందులు, వైద్య పరికరాలు, పుస్తకాలు, సౌందర్య సాధనాలు, ట్రాన్స్మిషన్, వైర్లెస్ పరికరాలు, ఆల్కహాలిక్ పానీయాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, ఈ-సిగరెట్లు, ఎలక్ట్రానిక్ హుక్కాలు ఉన్నాయి. -
క్షమాపణ చెబితే సరిపోతుందా?.. హీరోయిన్ అనన్య నాగళ్ల ఫైర్
టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల ప్రస్తుతం టాలీవుడ్లో బిజీగా ఉంది. గతేడాది పొట్టేల్, శ్రీకాకుళం షెర్లాక్ హోల్మ్స్, డార్లింగ్ లాంటి చిత్రాలతో ఫ్యాన్స్ను మెప్పించింది. వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మకు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.ఓ ఈవెంట్కు వెళ్లాల్సిన అనన్య నాగళ్లకు ఎయిర్పోర్ట్లో ఊహించని అనుభవం ఎదురైంది. తన బ్యాగేజ్ ఆరు గంటల పాటు ఆలస్యం కావడంతో సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. మీరు ఇంత సింపుల్గా సారీ చెప్తే సరిపోతుందా అంటూ విమానసంస్థ కస్టమర్ కేర్ వారితో ఫోన్లో మాట్లాడింది. మీరు ఆలస్యం చేయడం వల్ల దాదాపు 2 వేల మంది విద్యార్థులు నాకోసం వేచి ఉండాల్సి వచ్చిందని ఓ వీడియోను షేర్ చేసింది.అనన్య తన ట్వీట్లో రాస్తూ..'నేను ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి మధురైకి ఒక ఈవెంట్ కోసం వెళ్తున్నా. నా రెండు బ్యాగేజీలను చెక్ ఇన్ చేశా. కానీ వాటిలో ఒకటి 6 గంటలు ఆలస్యమైంది. నేను కస్టమర్ కేర్ను సంప్రదించినప్పుడు వారు సింపుల్గా క్షమించండి అని చెబుతున్నారు. నా బ్యాగ్ను తర్వాత అందుబాటులో ఉన్న విమానంలో పంపుతారట. ఇది ఆమోదయోగ్యం కాదు. మీకో రూల్, మాకో రూల్ ఎందుకు ఉన్నాయి. ప్యాసింజర్ ఒక నిమిషం ఆలస్యం అయితే.. అనుమతించలేమని మీరు చెబుతారు. ఇప్పుడేమో 6 గంటల లగేజీ ఆలస్యం జరిగింది. దీని కారణంగా దాదాపు 2000 మంది విద్యార్థులు నా కోసం వేచి ఉండాల్సి వచ్చింది. క్షమించండి అని చెప్పడం కరెక్ట్ కాదంటూ విమానయాన సంస్థ కస్టమర్ కేర్కు ఇచ్చిపడేసింది డార్లింగ్ బ్యూటీ'.కాగా.. 2019లో విడుదలైన 'మల్లేశం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ, తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. ఆ తర్వాత పవన్ కల్యాణ్ చిత్రం 'వకీల్ సాబ్'తో మరింత ఫేమస్ అయింది. ఆ తర్వాత తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాలతో అభిమానులను మెప్పించింది. I was travelling from Hyderabad to Madhurai today morning for an event . I have checked in two baggages and one of it got delayed for 6 hours. when i contacted the customer care they are simply saying sorry and they will send it in next available flight. @IndiGo6E this is… pic.twitter.com/WtbFgST7ff— Ananya Nagalla (@AnanyaNagalla) February 14, 2025 -
అమెరికాలో రెండు విమానాలు ఢీ..!
-
మరో ఘటన.. అమెరికాలో రెండు విమానాలు ఢీ
ఆరిజోనా: అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. మరోసారి రెండు విమానాలు ఢీకొన్నాయి. ఎయిర్పోర్ట్లో ప్రైవేట్ జెట్ను మరో విమానం ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. లియర్జెట్ 35ఎ విమానం ల్యాండింగ్ తర్వాత రన్వే నుండి జారి రాంప్పై ఉన్న బిజినెస్ జెట్ను ఢీకొట్టింది. ఆరిజోనాలోని స్కాట్డేల్ ఎయిర్పోర్టులో ఘటన జరిగింది. దీంతో ఎయిర్పోర్టులో విమానాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ఘటన మధ్యాహ్నం 2:45 గంటల సమయంలో జరిగినట్లు సమాచారం. కాగా, గత పది రోజుల్లో అమెరికాలో ఇది నాలుగో విమాన ప్రమాదం. పశ్చిమ అలాస్కాలోని నోమ్ కమ్యూనిటీకి వెళ్తున్న విమానం సముద్రంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పైలట్తో సహా పది మంది ప్రాణాలు కోల్పోయారు.కాగా, మరో విమానానికి కూడా తృటిలో ప్రమాదం తప్పింది. రన్వేపై టేకాఫ్ అవుతుండగా విమానంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ప్రయాణీకులు ఎవరికీ గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.గత వారం.. ఫిలడెల్ఫియా రాష్ట్రంలో విమానం ఇళ్లపై కూలిపోయింది. దీంతో, ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. ఫిలడెల్ఫియాలోని షాపింగ్మాల్ సమీపంలో విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఇళ్లపై కూలిపోయింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇళ్లు, కార్లు దగ్ధమయ్యాయి. విమానం కూలిపోయిన వెంటనే భారీ పేలుడు సంభవించడంతో మంటలు ఎగిసిపడ్డాయి. -
అబ్బురపడేలా.. జేబీఎస్ మెట్రో హబ్
సాక్షి, హైదరాబాద్: జేబీఎస్ మెట్రో స్టేషన్ ప్రపంచస్థాయి మెట్రో హబ్గా అవతరించనుంది. సింగపూర్, టోక్యో వంటి అంతర్జాతీయ నగరాల్లోని మెట్రో హబ్లకు దీటుగా జేబీఎస్ మెట్రో హబ్కు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇక్కడ బస్ స్టేషన్లు, పార్కింగ్ సదుపాయం, రెస్టారెంట్లు, మల్టీప్లెక్స్ థియేటర్లు, మాల్స్, కార్యాలయాలు వంటి అన్ని సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. కేవలం మెట్రో రైళ్ల రాకపోకలకే పరిమితం కాకుండా చక్కటి షాపింగ్, డైనింగ్ కేంద్రంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జేబీఎస్ హబ్పై దిశానిర్దేశం చేసినట్లు అధికారులు తెలిపారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో జేబీఎస్ మెట్రో హబ్ను అభివృద్ధి చేయనున్నారు. మెట్రో రెండో దశలో భాగంగానే సికింద్రాబాద్ నుంచి మేడ్చల్, శామీర్పేట్ వరకు మెట్రో విస్తరణ చేపట్టనున్నారు. ఈ మేరకు కొద్దిరోజుల క్రితం హెచ్ఏఎంఆర్ఎల్ అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. ఈ రెండు కారిడార్లపైనా సీఎం తాజాగా సమీక్షించారు. అతిపెద్ద ప్రాంగణంగా విస్తరణ.. సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో జేబీఎస్ మెట్రో హబ్ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ప్రస్తుతం మెట్రోకు జేబీఎస్ వద్ద అందుబాటులో ఉన్న స్థలంతో పాటు రక్షణ శాఖకు చెందిన భూములను కూడా సేకరించనున్నారు. ప్రస్తుతం నగరంలోని మెట్రోస్టేషన్ల పార్కింగ్ సదుపాయాలు అరకొరగా ఉన్నాయి. దీంతో మెట్రోల్లో ప్రయాణం చేయాలని భావించినప్పటికీ.. పార్కింగ్ వసతులు లేకపోవడంతో చాలామంది సొంత వాహనాలనే వినియోగిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో నిర్మించనున్న మెట్రో స్టేషన్లను పార్కింగ్ సదుపాయాలతో ప్రత్యేకంగా డిజైన్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు జేబీఎస్ మెట్రో హబ్ వద్ద సెల్లార్లో అతిపెద్ద పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేయనున్నారు. కార్లు, ద్విచక్ర వాహనాల కోసం రెండంతస్తుల్లో నిర్మించే అవకాశం ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో బస్స్టేషన్ ఉంటుంది. ప్రయాణికులు బస్సు దిగి నేరుగా మెట్రో స్టేషన్కు వెళ్లవచ్చు. దీంతో సీమ్లెస్ జర్నీ సదుపాయం లభించనుంది. వివిధ ప్రాంతాల మధ్య లాస్ట్మైల్, ఫస్ట్మైల్ కనెక్టివిటీకి కూడా పార్కింగ్, బస్స్టేషన్ సదుపాయాలు దోహదం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. లక్షలాది మందికి ప్రయాణ సదుపాయం.. ⇒ ప్రతిపాదిత జేబీఎస్ నుంచి మేడ్చల్ (23కి.మీ.), జేబీఎస్ – శామీర్ పేట్ (22 కి.మీ) కారిడార్లలో లక్షలాది మంది రాకపోకలు సాగించనున్నారు. ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య కనెక్టివిటీలో జేబీఎస్ కీలకం కానుంది. ⇒ రెండు రూట్లలో హెచ్ఎండీఏ ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్లపై మెట్రో కారిడార్లు రానున్నాయి. కానీ.. బేగంపేట్ విమానాశ్రయ సరిహద్దు వెంట ప్యారడైజ్ నుంచి బోయినపల్లి మధ్య 600 మీటర్ల వరకు భూగర్భ మార్గం రానుంది. దీంతో డబుల్ ఎలివేటెడ్ సాధ్యం కాదు. దీంతో బోయిన్పల్లి వద్ద ఎలివేటెడ్ మెట్రో రానుంది. ⇒ ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి వచ్చే వారితోపాటు, సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ప్రజలకు ఈ కారిడార్లు కీలకం కానున్నాయి. స్కైవాక్ కనెక్టివిటీ... జేబీఎస్ మెట్రో హబ్ విస్తరణలో భాగంగా ప్రస్తుతం ఉన్న ప్యారడైజ్, జేబీఎస్ స్టేషన్లతో పాటు కొత్తగా మేడ్చల్ కారిడార్ కోసం నిర్మించనున్న స్టేషన్ల మధ్య స్కైవాక్ ఏర్పాటు చేస్తారు. దీంతో ప్రయాణికులు అన్ని వైపులా రాకపోకలు సాగించేందుకు అవకాశం లభిస్తుంది. మేడ్చల్, శామీర్పేట్ల నుంచి ఎయిర్పోర్టు వరకు సుమారు 60 కిలోమీటర్ల ప్రయాణ సదుపాయం లభించనుంది. ఈ హబ్ వల్ల నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సులభంగా రాకపోకలు సాగించేందుకు అవకాశం లభించనుంది. అన్ని సదుపాయాలతో కూడిన ‘అర్బన్ యాక్టివిటీ సెంటర్’గా జేబీఎస్ హబ్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు అధికారులు చెప్పారు. హైదరాబాద్ సాంస్కృతిక జీవితాన్ని ప్రతిబింబించేలా ఉంటుందని పేర్కొన్నారు. రెస్టారెంట్లు, మలీ్టప్లెక్స్లతో పాటు కో– వర్కింగ్ ప్లేస్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం కొన్ని ఐటీ సంస్థలు మెట్రో స్టేషన్లలో ఇలాంటి సదుపాయాలను వినియోగించుకుంటున్నాయి. కార్యాలయాల నిర్వహణ భారం దృష్ట్యా కో–వర్కింగ్ ప్లేస్లకు ప్రాధాన్యం ఏర్పడింది. -
అతిచిన్న ఎయిర్పోర్ట్
విమానాశ్రయం అంటే సాధారణంగా, పొడవైన రన్వే, విశాలమైన ప్రదేశంలో చాలా పెద్దగా ఉంటుంది. కాని, కరీబియన్ దీవుల్లో నెదర్లాండ్స్ అధీనంలో ఉన్న సబా దీవిలో ‘జువాంకో ఇ. య్రాస్క్విన్’ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత చిన్న విమానాశ్రయంగా పేరొందింది. దీని రన్వే పొడవు కేవలం 400 మీటర్లు మాత్రమే! అంటే దాదాపు ఒక విమానం పొడవు కంటే కాస్త ఎక్కువ.చుట్టూ ఎత్తైన కొండలు, పక్కనే సముద్రంతో చూడటానికి అందంగా కనిపించే ఈ విమానాశ్రయం, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విమానాశ్రయాల్లో ఒకటి. అందుకే, ఇక్కడ పెద్ద విమానాలను అనుమతించరు. కేవలం విమానయాన సంస్థ విండైర్కు చెందిన చిన్న విమానాలను మాత్రమే ఇక్కడ అనుమతిస్తారు. అయితే, 1959లో రెమీ డి హానెస్ ప్రారంభించిన ఈ విమానాశ్రయం, సరైన సదుపాయాలు లేకపోవడంతో చాలాకాలం నిరుపయోగంగా ఉంది. ప్రస్తుతం డచ్ ప్రభుత్వం దీనిని పునరుద్ధరించింది. అంతేకాదు, రోజువారీగా చిన్న విమానాలను నడుపుకునేందుకు కూడా అనుమతించింది. -
విజయ్ సేతుపతిని కాలితో తన్నిన వ్యక్తి.. వీడియో వైరల్!
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ఇటీవలే విడుదల పార్ట్-2తో (viduthala Part-2) ప్రేక్షకుల ముందుకొచ్చారు. స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ కాంబినేషన్లో వచ్చిన విడుదల పార్ట్- 1 సీక్వెల్గా ఈ మూవీని తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ సినిమాలో ఓటీటీలో సందడి చేస్తోంది. జనవరి 19 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో సూరి, మంజు వారియర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, భవానీ శ్రీ ప్రధాన పాత్రలు పోషించారు.(ఇది చదవండి: ఓటీటీలో విడుదల 2.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)అయితే తాజాగా విజయ్ సేతుపతికి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఎయిర్పోర్ట్లో నడుచుకుంటూ వెళ్తున్న విజయ్ని వెనక నుంచి దూసుకొచ్చిన ఓ వ్యక్తి కాలితో తన్నాడు. పక్కనే సీఆర్పీఎఫ్ సిబ్బంది వెంటనే అతన్ని అడ్డుకున్నారు. అంతేకాకుండా అక్కడే వారంతా ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే ఈ ఘటన మూడేళ్ల క్రితం జరగ్గా.. తాజాగా ఓ నెటిజన్ ఈ వీడియోను ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్గా మారింది. అప్పట్లో బెంగళూరులో ఎయిర్పోర్ట్లో ఈ సంఘటన చోటు చేసుకుంది.Ithu eppa nadanthathu..🥹🙄..Enna @VijaySethuOffl sollave illa..🤭..But it was a nice Kick 😉..#BiggBossTamil #BiggBossTamil8 #BiggBoss8Tamil #BiggBossTamilSeason8#BiggBossTamil8Season #VijaySethupathi #VJS pic.twitter.com/XRtsMl31yo— BiggBossTamil8 (@BigBossTamilOTT) January 28, 2025 -
Hyderabad Metro Phase 2: కేంద్రం అనుమతే కీలకం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన మెట్రో రెండో దశకు(Hyderabad Metro Phase 2) కేంద్రం అనుమతే కీలకం! కేంద్రం అనుమతి కీలకంగా మారింది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు వివిధ మార్గాల్లో మెట్రో నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టనున్న రెండో దశ ప్రాజెక్టులో 5 కారిడార్లకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోరైల్ సంస్థ డీపీఆర్ను సైతం రూపొందించింది. రెండు నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో కేంద్రం అనుమతి కోసం పంపించారు. ఈ రెండో దశలోనే ఫోర్త్సిటీతో పాటు ఉత్తరం వైపు మరో రెండు కారిడార్లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మూడు కారిడార్ల డీపీఆర్ కోసం అధికారులు తాజాగా కసరత్తు ప్రారంభించారు. మరోవైపు పాతబస్తీలో భూసేకరణ, నిర్మాణాల కూల్చివేత పనులు చురుగ్గా సాతున్నాయి. ఈ క్రమంలో త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో కేంద్రం మెట్రో రెండోదశకు పచ్చజెండా ఊపుతుందా? లేక మొండిచేయి చూపుతుందా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కేంద్రం వాటా 18 శాతం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా ప్రతిపాదించిన రెండో దశలో మొదట 5 కారిడార్లలో మొత్తం 54 స్టేషన్లు, 76.4 కిలోమీటర్ల వరకు విస్తరించనున్నారు. ఇందుకోసం రూ.24,269 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం నిధులను అంటే రూ.7,313 కోట్లు వెచ్చిస్తుంది. రూ.4,230 కోట్లతో కేంద్రం 18 శాతం నిధులను అందజేస్తుంది. మిగతా 48 శాతం నిధులను అంటే రూ.11,693 కోట్లను ప్రాజెక్ట్ రుణాలుగా సేకరించాలనేది ప్రతిపాదన. మరో 4 శాతం (రూ.1033కోట్లు) పీపీపీ పద్ధతిలో సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో(Budget) కేంద్రం తన వాటాగా ఏ మేరకు నిధులను కేటాయిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. దశలవారీగా ప్రాజెక్టు విస్తరణ పనులు కొనసాగనున్న దృష్ట్యా 18 శాతం వాటాలో ఈ బడ్జెట్లో కొద్ది మేరకైనా నిధులు లభించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల నగరానికి వచి్చన కేంద్ర మంత్రి మనోహర్లాల్ ఖట్టర్తోనూ సీఎం రేవంత్రెడ్డి సంప్రదింపులు జరిపారు. మెట్రోతోపాటు మూసీ ప్రక్షాళన, నగర అభివృద్ధి కోసం నిధులను అందజేయాలని కోరారు. ఈ మేరకు మెట్రోకు కేంద్రం నుంచి సముచితమైన నిధులు లభించవచ్చని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు.పూచీకత్తు ఎంతో ముఖ్యం.. మరోవైపు కేంద్ర ప్రభుత్వం పూచీకత్తుగా ఇచ్చే ‘సావరిన్ గ్యారంటీ’ కూడా మెట్రో రెండో దశకు కీలకంగా మారింది. సావరిన్ గ్యారంటీ ఉంటేనే జైకా, మలీ్టలేటర్ డెవలప్మెంట్ బ్యాంకులు రుణాలను అందజేసేందుకు ముందుకొస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసే నిధుల కంటే బ్యాంకులు, ఇతర సంస్థల నుంచి సేకరించే రూ.వేల కోట్ల రుణాలపైనే ఈ ప్రాజెక్టు ఆధారపడి ఉంది. 48 శాతం నిధులను రుణాలుగా సేకరించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఇచ్చే పూచీకత్తు ఎంతో ముఖ్యం. ప్రస్తుతం పాతబస్తీలో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్లలో రోడ్డు విస్తరణ పనులు మొదలయ్యాయి. ఇందుకోసం భూసేకరణ, నిర్మాణాల కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్రం నుంచి అనుమతి వస్తేనే రెండో దశ పనులు ముందుకు సాగుతాయి. -
విమానంలో మంటలు.. 176 మంది ప్రయాణికులు సురక్షితం
సియోల్: దక్షిణ కొరియాలోని గిమ్హే అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ బుసాన్ ఎయిర్బస్ ఏ321 ప్యాసింజర్ విమానం మంటల్లో చిక్కుకుంది. దీనిని గమనించిన అధికారులు వెంటనే అప్రమత్తమై విమానంలోని 169 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందితో సహా మొత్తం 176 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు.మీడియాకు అందిన వివరాల ప్రకారం విమానం హాంకాంగ్కు బయలుదేరడానికి సిద్ధమవుతుండగా, విమానం వెనుక భాగంలో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన మంగళవారం రాత్రి 10.15 జరిగింది. గాలితో నిండిన స్లయిడ్లను ఉపయోగించి ప్రయాణీకులను ఖాళీ చేయించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. Fire breaks out on an Air Busan A321 bound for Hong Kong at Gimhae International Airport in Busan, South Korea.At around 10:30 p.m. on Tuesday, a fire broke out in the tail section of the aircraft.All 170 passengers and crew evacuated, and there were no casualties,… pic.twitter.com/GqzIkrUx85— Breaking Aviation News & Videos (@aviationbrk) January 28, 2025ఈ విమానం 17 ఏళ్ల క్రితం నాటి ఎయిర్బస్ ఏ321 సీఈఓ మోడల్ అని దాని టెయిల్ నంబర్ హెచ్ఎల్ 7763 అని ఏవియేషన్ సేఫ్టీ నెట్వర్క్ మీడియాకు తెలిపింది. గత నెలలో కూడా ఇటువంటి ప్రమాదం చోటుచేసుకుంది. 2024 డిసెంబర్ 29న మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జెజు ఎయిర్ బోయింగ్ 737-800 విమానం కూలిపోయింది. విమానంలో ఉన్న 181 మందిలో 179 మంది మృతి చెందారు.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: యూపీ, బీహార్ సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్ జామ్.. 70 కి.మీ. పొడవునా.. -
Nalgonda: నాగార్జునసాగర్లో ఎయిర్పోర్ట్!
నాగార్జునసాగర్/సింగరేణి(కొత్తగూడెం): నాగార్జునసాగర్లో ∙1,600 ఎకరాలలో ఎయిర్పోర్టు నిర్మించేందుకు అధికారులు స్థల పరిశీలన చేశారు. ఎయిర్పోర్ట్ అథారిటీ జాయింట్ జనరల్ మేనేజర్ ఏఎస్ఎన్ మూర్తి నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం ప్రాజెక్టు సమీపంలో గతంలో ఏర్పాటుచేసిన రన్వే సమీపంలోని భూములను పరిశీలించింది. ఏపీలోని మాచర్ల మండలం విజయపురిసౌత్, పసువేముల, చింతలతండ, నాగులవరం భూములను గురువారం పరిశీలించారు. సాగర్ జలాలపై ‘సీ ప్లేన్’ను నడిపే ప్రతిపాదన ఉన్న నేపథ్యంలో ఇక్కడ మినీ విమానాశ్రయం ఏర్పాటుకు ఆవశ్యకత ఏర్పడింది. మరోవైపు కొత్తగూడెంలో విమానాశ్రయ ప్రతిపాదిత స్థలాన్ని ఉన్నతాధికారులు అబ్దుల్ అజీజ్, మహమ్మద్ సాకిబ్, ప్రశాంత్ గుప్తా, ఆర్.దివాకర్, మనీష్ జోస్వాల్, ప్రవీణ్ ఉన్ని కృష్ణన్ పరిశీలించారు. -
ఎయిర్పోర్ట్లో రూ.10కే టీ, రూ20కే సమోసా!
ఎయిర్పోర్ట్లో స్నాక్స్ ధర రూ.వందల్లో ఉంటుందని తెలుసుకదా. అయితే కొత్తగా ప్రారంభించిన కేఫ్లో మాత్రం కేవలం రూ.10కే టీ, వాటర్ బాటిల్, రూ.20కే సమోసా, స్వీటు లభిస్తుంది. ‘అదేంటి.. షాపింగ్ మాల్స్లోనే వాటర్ బాటిల్ రూ.80 వరకు ఉంది. మరి ఎయిర్పోర్ట్లో ఇంత తక్కువా..?’ అని ధరలు చూసి ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎయిర్పోర్ట్లో ‘ఉడాన్ యాత్రి కేఫ్’ను ప్రారంభించింది. విమాన ప్రయాణికులకు చౌకగా స్నాక్స్ అందించాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేశారు.కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్తగా ప్రారంభించిన ఉడాన్ యాత్రి కేఫ్ పుణ్యమా అని సరసమైన స్నాక్స్ ధరలు అందుబాటులోకి వచ్చాయి. 2024 డిసెంబర్ 21న పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ కేఫ్ను ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతిరోజూ సుమారు 900 మంది ప్రయాణీకులు ఈ కేఫ్ సేవలు వినియోగించుకుంటున్నట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. దీని ఆవిష్కరణ సమయంలో మంత్రి మాట్లాడుతూ..విమానాశ్రయంలో ఆహార ధరల పెరుగుదలపై దీర్ఘకాలంగా వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.No more overpriced food at the airport. Now you can have affordable snacks at airports at Udaan Yatri Cafe.Tea : ₹10Water : ₹10Samosa : ₹20Sweet : ₹20 pic.twitter.com/SGEsKGjEf8— Aaraynsh (@aaraynsh) January 23, 2025ఇదీ చదవండి: 2,000 ఐడీలను బ్లాక్ చేసిన రైల్వేశాఖధరలిలా..ఉడాన్ యాత్రి కేఫ్లో ప్రయాణికులు రూ.10కే టీ, రూ.10కే వాటర్ బాటిల్, కేవలం రూ.20కే సమోసా, రూ.20కు స్వీట్లు వంటి స్నాక్స్ను ఆస్వాదించవచ్చు. ఈ ధరలు విమానాశ్రయంలోని ఇతర ఆహార దుకాణాలు వసూలు చేసే అధిక రేట్లకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ప్రయాణీకుల నుంచి ఈ కేఫ్కు సానుకూల స్పందన వస్తోంది. కేఫ్ ప్రారంభించిన మొదటి నెలలో సుమారు 27,000 మంది ప్రయాణీకులకు సేవలు అందించింది. ఇతర విమానాశ్రయాల్లో ఈ నమూనా కేఫ్లను ప్రారంభించాలని ప్రయాణికుల నుంచి అభ్యర్థనలు వస్తున్నాయి. -
నడవలేని స్థితిలో శ్రీవల్లి
-
కృత్రిమ దీవిలో అతిపెద్ద విమానాశ్రయం!
చైనా ప్రభుత్వం సముద్రంలో అద్భుతాన్ని ఆవిష్కరించబోతోంది. కృత్రిమ దీవిలో ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయాన్ని నిర్మిస్తోంది. లియోనింగ్ ప్రావిన్స్లోని డాలియన్ నగరాన్ని ఆనుకుని ఉన్న సముద్రాన్ని పూడ్చి ఏకంగా ఓ సరికొత్త దీవిని నిర్మిస్తోంది. ఇక్కడే మొత్తం 20.9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ‘డాలియన్ జి¯Œ జౌవాన్’ పేరుతో అతిపెద్ద విమానాశ్రయాన్ని నిర్మిస్తోంది. అత్యాధునిక సాంకేతికత ఉపయోగించి, ఏటా 5 లక్షలకు పైగా విమానాలు, 8 కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యంతో పనిచేయనుంది. ఇందులో నాలుగు అతిపెద్ద రన్ వేలు, 9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పాసెంజర్ టెర్మినల్స్ కూడా ఏర్పాటవుతున్నాయి. వీటి ద్వారా ఏడాదికి 10 లక్షల టన్నుల సరుకు రవాణా జరుగుతుందని అంచనా. ఈ నిర్మాణం పూర్తయితే, ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా కొనసాగుతున్న హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం (12.48 చ.కి.మీ) రెండో స్థానానికి పడిపోతుంది. అయితే, ఈ రెండు విమానాశ్రయాలు కూడా కృత్రిమ దీవుల్లో ఏర్పాటైనవే కావడం విశేషం. ఈ విమానాశ్రయాన్ని 2035 నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు చైనా ప్రభుత్వం తెలిపింది. -
ఎయిరిండియా చెక్-ఇన్ సమయంలో మార్పులు
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా తన చెక్-ఇన్ సమయాలను సవరించింది. ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి, విమానాశ్రయ విధానాలను క్రమబద్ధీకరించడానికి ఈ మార్పులు చేసినట్లు సంస్థ తెలిపింది. ఢిల్లీతోపాటు లండన్లోని హీత్రూ విమానాశ్రయంలో ఈమేరకు మార్పులు ఉంటాయని స్పష్టం చేసింది.లండన్ హీత్రూ విమానాశ్రయంలో చెక్-ఇన్ సమయాల్లో మార్పులు ఇలా..చెక్-ఇన్ కౌంటర్లు షెడ్యూల్ ప్రకారం విమానాలు బయలు దేరడానికంటే 75 నిమిషాల ముందే మూసివేస్తారు.గతంలో ఇది 60 నిమిషాలుగా ఉండేది.కొత్త నియమం ద్వారా ప్రయాణికుల రద్దీ సమయాల్లో చెక్-ఇన్, సెక్యూరిటీ క్లియరెన్స్ల కోసం తగిన సమయం ఉంటుంది.ఢిల్లీ విమానాశ్రయంలో ఇలా..ఢిల్లీ నుంచి బయలుదేరే అన్ని అంతర్జాతీయ విమానాలకు ఈ నియమాలు అమలుల్లో ఉంటాయి.చెక్-ఇన్ కౌంటర్లు షెడ్యూల్ ప్రకారం విమానాలు బయలు దేరడానికంటే 75 నిమిషాల ముందే మూసివేస్తారు.ఇదీ చదవండి: రైల్లో మంటలు! క్షణాల్లో తప్పించుకునేలా..సవరించిన చెక్-ఇన్ సమయానికి అనుగుణంగా ప్రయాణికులు ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవాలని సూచించింది. అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించాలనుకునేవారు షెడ్యుల్ సమయం కంటే దాదాపు 3 గంటల ముందుగానే ఉండడం మంచిదని పేర్కొంది. -
కోల్కతా విమానాశ్రయానికి వందేళ్లు
కోల్కతా: సిటీ ఆఫ్ జాయ్.. భారతదేశపు ఒకనాటి రాజధాని.. బ్రిటిష్ ఇండియా పాలనలో దేశంలోని ఇన్నో కీలక ఘట్టాలకు వేదికగా నిలిచినా మహానగరం కలకత్తా.. ఇప్పుడు ఒకనాడు డమ్ - డమ్ విమానాశ్రయంగా పేరుగాంచి తరువాత 1995 లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చుకున్న కలకత్తా విమానాశ్రయం ఈ ఏడాది వందేళ్ల పండగను జరుపుకోనుంది. వాస్తవానికి కోల్కతా 1772 - 1912 మధ్య భారత రాజధానిగా ఉండేది. ఆ తరువాత 1924లో కోల్కతాలో విమానాశ్రయం ఏర్పాటైంది. ఈశాన్య రాష్ట్రాలతోబాటు అటువైపునున్న దేశాలన్నిటికీ ముఖద్వారం వంటి కోల్కతా నుంచి విమాన కార్యకలాపాలు మొదలయ్యాయి. ఇప్పుడు దేశంలోని ప్రముఖ విమానాశ్రయాల్లో ఒకటిగా నిలిచినా సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ఏడాదితో వందేళ్లు పూర్తి చేసుకుంటోంది.వందేళ్ల క్రితం క్రితం .. ఇంకా చెప్పాలంటే అంతకు ముందే... 1900ల కాలంలో చిన్న ఎయిరోడ్రోముగా మొదలైన కలకత్తా ప్రస్థానం.. 1924 నాటికి పూర్తి స్థాయి విమానాశ్రయంగా మారింది. అప్పట్లో నెదర్లాండ్స్ కు చెందిన కెఎల్ఎం ఎయిర్ లైన్స్ (KLM airlines ) ఆమ్స్టర్డామ్ నుంచి ఇండోనేషియాలోని జకార్తాకు నడిపే విమానానికి కోల్ కతాలో స్టాప్ ఇచ్చేది. అలా అందర్జాతీయ విమానసర్వీసులు మొదలైన ఈ విమానాశ్రయం ఆ తరువాత ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగింది.. ఆకాశాన్ని ఎందుకులే లోహ విహంగాలకు ఆశ్రయం ఇస్తూ.. అంతర్జాతీయ స్థాయికి చేరింది.1924లో బ్రిటన్ కు చెందిన రాయల్ ఎయిర్ ఫోర్స్ విమానం ఇక్కడ ల్యాండ్ అయింది.ఆ తరువాత మే 2న ఫ్రెంచ్ పైలట్ మిస్టర్ డోయ్సీ రాక కూడా జరిగింది. అదే సంవత్సరం, డమ్ డమ్ విమానాశ్రయంలో తొలిసారిగా రాత్రిపూట విమానం ల్యాండ్ అవడం, ఓ గొప్ప ముందడుగుకు నాంది అని చెప్పవచ్చు. మొదట్లో టార్చిలైటు వెలుగులో విమానాలను రాత్రిపూట ల్యాండ్ చేసేవాళ్ళు. వాస్తవానికి ఈ విమానాశ్రయం అటు యూరోప్.. ఉత్తర అమెరికాలనుంచి ఇటు ఆసియావైపు వెళ్లే విమానాలకు మార్గమధ్యంలో ఒక టెక్నీకల్ హాల్ట్గా గణనీయంగా ఉపయోగపడడం మొదలయ్యాక దాని స్థాయి అమాంతం పెరిగిపోయిడ్ని. ఆ రెండు మార్గాల నడుమ నడిచే విమానాలన్నీ కలకత్తాలో కాసేపు ఆగి.. ఇంధనం నింపుకు వెళ్లడం.. విమానాల సాంకేతికత తనిఖీ వంటి పనులన్నీ ఇక్కడే చేసుకునేవాళ్ళు. దీంతో అనివార్యంగా ఇక్కడ రద్దీ పెరుగుతూ వచ్చింది.ఇదిలా ఉండగానే 1929లో అప్పటి అప్పటి బెంగాల్ గవర్నర్ సర్ స్టాన్లీ జాక్సన్ డమ్ డమ్ ఏరోడ్రోమ్లో బెంగాల్ ఫ్లయింగ్ క్లబ్ను ప్రారంభించి విమానాశ్రయ హోదాను మరింతగా పెంచారు.నేతాజీ సుభాష్ చంద్రబోస్ అప్పట్లో బ్రిటిష్ వారితో చేసిన యుద్ధానికి సైతం కోల్ కతా విమానాశ్రయం వేదిక ఐంది. 1938లో బోస్ ఇక్కణ్నుంచే బ్రిటిష్ వారిపై సమరశంఖాన్ని పూరించారు. రెండవ ప్రపంచ యుద్ధానంతర కాలంలో, కోల్కతా వాణిజ్య విమానాలకు కీలక గమ్యస్థానంగా మారింది. 1940-1960ల మధ్య, విమానాశ్రయం ఏరోఫ్లాట్, ఎయిర్ ఫ్రాన్స్ మరియు పాన్ ఆమ్ వంటి అంతర్జాతీయ విమానయాన సంస్థలకు ప్రముఖ స్టాప్ ఓవర్ హబ్గా మారింది. 1990 తరువాత దశమారింది. 1990ల నాటికి, కోల్కతా విమానాశ్రయం ప్రయాణీకు లు,కార్గో కార్యకలాపాలకు ప్రధాన అంతర్జాతీయ, దేశీయ కేంద్రంగా ఎదిగింది1990లలో, విమానాశ్రయం ఆధునీకరణ చేయగా 1995లో నిర్మించిన కొత్త దేశీయ టెర్మినల్ భారత విమానయాన రంగం వృద్ధిని ప్రతిబింబిస్తుంది.అదే ఏడాది దీనిపేరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చారు.2000లలో భారత వైమానిక రంగం గొప్ప పురోగతి సాధించింది. తక్కువ ధరలకే విమాన ప్రయాణం అంటూ సరికొత్త ప్రయివేటు విమాన సంస్థలు రావడంతో దేశంలోని అన్ని విమానాశ్రయాల మాదిరే ఇక్కడా రద్దీ పెరిగింది. తద్వారా విమానాశ్రయం గణనీయమైన అభివృద్ధిని నమోదు చేసింది.2013లో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణం, రన్వే పొడిగింపు వంటి అభివృద్ధి పనులతో ఈ విమానాశ్రయం ప్రాధాన్యం అమాంతం ఆకాశాన్ని అంటింది. ప్రస్తుతంప్రస్తుతం పాతికదేశాలకు పైగా విమానయాన సంస్థలు వాణిజ్యకార్యకలాపాలను ఇక్కణ్ణుంచి కొనసాగిస్తున్నాయి. వందలాది విమానాలు.. కార్గో సంస్థలకు కోల్ కతా ఇప్పుడు ప్రధాన వాణిజ్యకేంద్రంగా మారింది. 2023- 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇక్కణ్ణుంచి 1,97,84,417 మంది దేశీయ, అంతర్జాతీయ ప్రయాణీకులు వివిధ దేశాలకు, ప్రాంతాలకు పయనమయ్యారు. దాదాపు రోజూ 430 విమానాలు ఇక్కడికి వచ్చిపోతుంటాయి. ఈశాన్య భారతదేశపు ఆర్థిక, వాణిజ్య, రవాణా రంగాన్ని మరింత ముందుకు నడిపించడంలో కీలకముగా ఉన్న సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ఏడాది వందో పుట్టినరోజును జరుపుకుంటోంది. సిటీ ఆఫ్ జాయ్ గా పేరొందిన కోల్ కతా తో బాటు ఈశాన్య భారతానికే కాకుండా పలు ఆసియా దేశాలకు ఈ విమానాశ్రయం ఒక ముఖద్వారం.. ఈ వందేళ్ల పండుగకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.:::సిమ్మాదిరప్పన్న -
మెట్రోకు బెల్ట్ కనెక్టివిటీ
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో జంక్షన్ల మధ్య అనుసంధానం కోసం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ (హెచ్ఏఎంఆర్ఎల్) వివిధ రకాల ప్రత్యామ్నాయాలపై కసరత్తు చేస్తోంది. ఆయా మార్గాల్లోంచి బయలుదేరే ప్రయాణికులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేందుకు జంక్షన్ల వద్ద ట్రెయిన్ మారాల్సి ఉంటుంది. ఎయిర్పోర్టు నుంచి నగరంలో ఎక్కడికి వెళ్లాలన్నా జంక్షన్ల వద్ద మార్పు తప్పనిసరి. దీంతో లగేజీ తరలింపు సమస్యగా మారనుంది. ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్కు లగేజీ తీసుకెళ్లడం ఎంతో కష్టం. ఈ క్రమంలో లగేజీ తరలింపుతో పాటు ప్రయాణికులు కూడా పెద్దగా ఇబ్బంది లేకుండా స్టేషన్లు మారేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. లగేజీ తరలింపునకు బెల్ట్.. నగరంలోని అన్ని వైపుల నుంచి ప్రతిరోజూ కనీసం సుమారు లక్ష మందికి పైగా ప్రయాణికులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే అవకాశం ఉంది. ఎయిర్పోర్టు ప్రయాణికులతో పాటు, వారి కోసం వెళ్లే బంధుమిత్రులు, జీఎమ్మార్ ఉద్యోగులు తదితర వర్గాలకు చెందిన ప్రయాణికులతో ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చని అంచనా. ప్రస్తుతం 75 వేల మంది ఎయిర్పోర్టుకు రాకపోకలు సాగిస్తుండగా 2028లో ఎయిర్పోర్టు మెట్రో సేవలు ప్రారంభమయ్యే నాటికి లక్ష దాటవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో లక్ష మంది ప్రయాణికులు నిరంతరం రాకపోకలు సాగించేందుకు అనుగుణంగా మెట్రో జంక్షన్ల మధ్య లగేజీ కోసం పెద్ద ఎత్తున బెల్ట్లను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. అలాగే ప్రయాణికుల కోసం వాక్వేలు ఉంటాయి. ఎల్బీనగర్ నుంచి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్కు స్కైవాక్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. నాగోల్ మెట్రోస్టేషన్ నుంచి నాగోల్ ఎయిర్పోర్ట్ మెట్రోస్టేషన్కు మధ్య వాక్వే ఉంటుంది. ఎయిర్పోర్ట్ మెట్రో స్పెషల్.. మెట్రో రెండో దశలో ఎయిర్పోర్టు మెట్రో ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. మిగతా మార్గాల్లో కంటే ఈ రూట్లో మెట్రో రైళ్ల వేగం కూడా ఎక్కువే ఉండనుంది. ప్రస్తుతం గంటకు 35 కిలోమీటర్ల వేగంతో నడుస్తుండగా, ఎయిర్పోర్ట్ రూట్లో 45 కిలోమీటర్ల వరకు వేగం పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్ వద్ద ఏర్పాటు చేసినవిధంగా 1.6 కిలోమీటర్లు భూగర్భ మెట్రో నిర్మించనున్నారు. ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్ భూగర్భంలోనే ఉంటుంది. అక్కడి నుంచి ప్రయాణికులు ఎస్కలేటర్లు, లిఫ్టులను వినియోగించి ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్కు చేరుకుంటారు. మరోవైపు ఫోర్త్ సిటీకి మెట్రో అందుబాటులోకి వచ్చేనాటికి హైదరాబాద్ నుంచి ఎయిర్పోర్టు మీదుగా ఫోర్త్సిటీకి రాకపోకలు సాగించే మెట్రో ప్రయాణికుల సంఖ్య 7 లక్షలు దాటవచ్చని భావిస్తున్నారు. -
విమానాల్లో వన్యప్రాణులు
సాక్షి, విశాఖపట్నం: మూఢ నమ్మకాలతో కొందరు..! హోదా కోసం మరికొందరు..! కారణమేదైనా అరుదైన వన్యప్రాణులు సంపన్నుల ఇళ్లల్లో తారసపడుతున్నాయి. నిఘా వ్యవస్థ కళ్లుగప్పి విమానాల్లో ఖండాతరాలు దాటి వస్తున్నాయి. ఇవి స్మగ్లర్లకు కాసులు కురిపిస్తున్నాయి. అక్రమ రవాణాపై కస్టమ్స్ నిఘా పెరగడంతో స్మగ్లర్లు ఎప్పటికప్పుడు కొత్త ఎయిర్పోర్టులను అన్వేíÙస్తున్నారు. థాయ్లాండ్, మలేíÙయా నుంచి దక్షిణాది రాష్ట్రాలకు వన్యప్రాణుల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఒకప్పుడు ఓడలలో వీటిని అక్రమంగా తరలించగా ఇప్పుడు వైమానిక మార్గాలను ఎంపిక చేసుకుంటున్నారు. వన్యప్రాణుల అక్రమ రవాణాకు స్మగ్లర్లు వైమానిక రంగాన్ని వినియోగిస్తున్న టాప్ 10 దేశాల్లో భారత్ ఉండటంపై ఐక్యరాజ్యసమితి (యూఎన్ఈపీ) ఆందోళన వ్యక్తం చేసింది. చెన్నైలో అధికంవివిధ దేశాల నుంచి భారత్కు అక్రమంగా వన్య ప్రాణులను తరలిస్తుండగా పట్టుబడిన కేసుల్లో మూడొంతులు చెన్నై ఎయిర్పోర్టుల్లో నమోదైనవే కావడం గమనార్హం. ఇక్కడ నిఘా పెరగడంతో తాజాగా బెంగళూరు, హైదరాబాద్తో పాటు విశాఖ ఎయిర్పోర్టులను ప్రత్యామ్నాయాలుగా స్మగ్లర్లు ఎంచుకుంటున్నారు. చెన్నై, ముంబై, ఢిల్లీ ఎయిర్పోర్టులు అక్రమ రవాణాలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆదాయం పెరుగుతుందనే మూఢ నమ్మకంతో..తాబేళ్లు, అరుదైన బల్లులను పెంచితే ఆదాయం పెరుగుతుందని కొందరి మూఢనమ్మకం. పాములను పెంచితే కష్టాలు తొలగిపోతాయని మరికొందరి విశ్వాసం. స్మగ్లర్లకు ఇది కాసులు కురిపిస్తోంది. ఇగ్వానాలు, మార్మోసెట్లు, కంగారూలు, విదేశీ తాబేళ్లు, విషపూరిత పాములు, యాలిగేటర్లు, అరుదైన పక్షులను కొనుగోలు చేసేందుకు రూ.లక్షలు వెచ్చిస్తున్నారు. వీటిని ఎలా పెంచాలనే విషయాలపై సోషల్ మీడియాలో సమాచారం సేకరిస్తున్నారు. బ్యాంకాక్, దుబాయ్, కౌలాలంపూర్, ఆ్రస్టేలియా, ఆఫ్రికా నుంచి ఎక్కువగా వీటి అక్రమ రవాణా జరుగుతోంది.యూఎన్ ఈపీ ట్రాఫిక్ తాజా నివేదిక ప్రకారం 2011– 2020 మధ్య 70,000 రకాల అరుదైన జీవజాతులు 18 భారతీయ విమానాశ్రయాల ద్వారా అక్రమ రవాణా జరిగాయి. వీటిలో సరీçసృపాలు 46 శాతం ఉండగా 18 శాతం క్షీరదాలున్నాయి. ఇండియన్ స్టార్ టార్టాయిస్, బ్లాక్ పాండ్ తాబేళ్లు, జలగలు, ఇగ్వానాలు వీటిలో ఉన్నాయి. దేశంలోని వివిధ ఎయిర్పోర్టుల్లో 2023–24లో అక్రమ రవాణాకు సంబంధించి 18 కేసులను నమోదు చేయగా 230 వన్యప్రాణుల్ని స్వా«దీనం చేసుకున్నారు.పాములు నుంచి బల్లుల దాకా సజీవంగా.. గతంలో ఏనుగు దంతాలు, పాంగోలిన్ పొలుసులు, పులి చర్మాలు, జంతు చర్మాలు, గోళ్లు అక్రమంగా తరలించగా ఇప్పుడు ఏకంగా సజీవంగా ఉన్న వన్య ప్రాణులనే స్మగ్లింగ్ చేయడం విస్తుగొలుపుతోంది. 2019లో చెన్నై విమానాశ్రయంలో స్వా«దీనం చేసుకున్న ఆఫ్రికన్ హార్న్ పిట్ వైపర్లు, ఇటీవల హైదరాబాద్ ఎయిర్పోర్టులో పట్టుబడిన తాచుపాములు, విశాఖ ఎయిర్పోర్టులో లభ్యమైన ప్రమాదకరమైన బల్లులు.. ఇలా సజీవంగా తరలించేందుకు స్మగ్లర్లు సిద్ధపడుతున్నారు. కట్టుదిట్టంగా తనిఖీలు విమానాశ్రయంలో నిరంతరం తనిఖీలు జరుగుతున్నాయి. బ్యాగేజ్ తనిఖీల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. డీఆర్ఐ, కస్టమ్స్ సహా అన్ని విభాగాల ఆధ్వర్యంలో ప్రతి ప్రయాణికుడినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. వన్యప్రాణుల వ్యాపారంపై ఉక్కుపాదం మోపుతున్నాం. చెక్లిస్ట్లు, తనిఖీ కేంద్రాల వద్ద ప్రయాణికులకు అవగాహన కలి్పస్తున్నాం. – రాజారెడ్డి, విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు డైరెక్టర్ -
కార్గో ఎయిర్పోర్ట్ కోసం భూములిచ్చేదిలేదు
కాశీబుగ్గ: శ్రీకాకుళం జిల్లా మందస మండల పరిధిలో కార్గో ఎయిర్ పోర్టు నిర్మాణ ప్రతిపాదనలను స్థానిక గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. తమకు జీవనాధారమైన పంట భూములు తీసుకుని కార్గో ఎయిర్పోర్టు నిర్మిస్తే తమ బతుకులు నాశనమవుతాయని వాపోతున్నారు. మందస మండలం రాంపురం గ్రామంలో ఆదివారం 6 పంచాయతీల ప్రజలు ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసుకుని ఎయిర్పోర్టును ముక్తకంఠంతో వ్యతిరేకించారు.ఉద్దాన ప్రాంత ప్రజల అవసరాలు, మనోభావాలు తెలుసుకోకుండా, స్థానికుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుని బలవంతంగా కార్గో ఎయిర్పోర్టు నిర్మిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఉద్దాన ప్రాంతానికి ఉద్యమాలు కొత్తకాదన్నారు. జీవనాధారమైన పంట భూముల్ని పరిహారానికి ఆశపడి ఇవ్వబోమని స్పష్టంచేశారు.ఈ సందర్భంగా రాంపురం వేదికగా ఉద్దానం ఎయిర్పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్గా కొమర వాసును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరో వారం రోజుల్లో పంచాయతీల వారీగా కమిటీలు వేసుకుని అనంతరం పోరాట కమిటీని ప్రకటిస్తామని వెల్లడించారు. -
అదానీపై కేసు ఎఫెక్ట్.. రూ.6,216 కోట్ల డీల్ రద్దు?
అదానీ గ్రూప్తో గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను పునఃపరిశీలిస్తామని కెన్యా ప్రకటించింది. కెన్యాలో విమానాశ్రయ అభివృద్ధితోపాటు ఎనర్జీ ప్రాజెక్ట్ల విస్తరణ కోసం అదానీ గ్రూప్ గతంలో ఒప్పందం చేసుకుంది. ఇటీవల అదానీ సంస్థలపై చెలరేగుతున్న నేరాభియోగాల వల్ల కెన్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.హిండెన్బర్గ్ రీసెర్చ్ ఉదంతం నుంచి కోలుకుని, క్రమంగా పుంజుకున్న అదానీ గ్రూప్నకు మళ్లీ షాక్ తగిలింది. భారత్లో భారీ సౌర విద్యుత్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్లు పొందేందుకు దాదాపు రూ.2,200 కోట్లు (సుమారు 265 మిలియన్ డాలర్లు) లంచాలు ఇచ్చినట్లు అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో గ్రూప్ అధినేత గౌతమ్ అదానీతో పాటు మరో ఏడుగురిపై మోసం, లంచం, అవినీతి కేసులు నమోదయ్యాయి.ఇదీ చదవండి: సోలార్ ఎనర్జీ తయారీ 20 రెట్లు వృద్ధి: ఐఎస్ఏ నివేదికఈ నేపథ్యంలో కెన్యా అధ్యక్షుడు విలియం రుటో ప్రకటన విడుదల చేశారు. కెన్యాలో విమానాశ్రయాలు, పవర్ ట్రాన్స్మిషన్లైన్ల విస్తరణకు అదానీ గ్రూప్తో గతంలో చేసుకున్న ఒప్పందాలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు చెప్పారు. అమెరికా దర్యాప్తు సంస్థలు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేశాక దీనిపై పునరాలోచిస్తామన్నారు. ఈ డీల్ విలువ 736 మిలియన్ డాలర్లు(రూ.6216 కోట్లు). ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని నిర్ణయించారు. -
‘మామునూరు’లో మరో ముందడుగు
సాక్షి, వరంగల్: మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. 253 ఎకరాల భూసేకరణకు రూ.205 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. రన్వే విస్తరణకు కావాల్సిన 205 ఎకరాల భూమిని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు స్వాదీనం చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్కు సూచించింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దశల వారీగా సమీక్షించి, మామునూరు విమానాశ్రయ స్థల సేకరణలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించడం, రోజుల వ్యవధిలోనే స్థల సేకరణకు అవసరమైన నిధులు మంజూరు చేయించడంతో విమానాశ్రయ పనుల్లో ముందడుగు పడినట్టయ్యింది. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లతో కూడిన డీపీఆర్ వేగంగా సిద్ధం చేయాలని ఎయిర్పోర్ట్ అథారిటీకి ఆర్అండ్బీ శాఖ లేఖ కూడా రాసింది. వరంగల్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం రానున్న నేపథ్యంలో విమానాశ్రయానికి సంబంధించి ముందడుగు పడడంతో ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. నెల రోజుల్లోనే పురోగతి ఇలా.. » ఈ ఏడాది అక్టోబర్ 23న రాజీవ్గాంధీ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్లో బోర్డు మీటింగ్ నిర్వహించారు. మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల పరిధి ఒప్పందాన్ని జీఎమ్మాఆర్ సంస్థ విరమించుకుంది. » ఆ తర్వాత మంత్రి కోమటిరెడ్డి అధ్యక్షతన మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన 253 ఎకరాల భూసేకరణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. » మంత్రి కొండా సురేఖతోపాటు ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్.నాగరాజు, ఎంపీ కడియం కావ్య తదితరులు భూనిర్వాసితులతో సమావేశమై వారి డిమాండ్లను కలెక్టర్కు విన్నవించాలని కోరారు. » ఆ తర్వాత కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆధ్వర్యాన రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. భూసేకరణకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి సమరి్పంచడంతో అందుకు కావాల్సిన రూ.205 కోట్ల నిధులను మంజూరు చేసింది. సాధ్యమైనంత తొందరగా భూసేకరణ పూర్తి చేయాలని కలెక్టర్ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అందరి దృష్టి పరిహారంపైనే.. ఎయిర్పోర్ట్కు సేకరించే భూములకు సంబంధించి ఎకరాకు గవర్నమెంట్ వ్యాల్యూ రూ.6లక్షలు ఉంది. భూనిర్వాసితులకు పరిహారం మూడింతలు చెల్లించాలనుకున్నా ఎకరాకు రూ.18 లక్షలు ఇచ్చే అవకాశముంది. రెవెన్యూ అధికారులు రూ.25 లక్షల వరకు చెల్లించే దిశగా ఆలోచన చేస్తున్నారు. రైతుల నుంచి ఒత్తిడి ఎక్కువైతే తమ విచక్షణాధికారాలు ఉపయోగించి ఇంకాస్త పెంచాలని యోచిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ఎకరాకు రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు పలుకుతుండడంతో రైతుల నుంచి ప్రతిస్పందన ఎలా ఉంటుందోనని అధికారులు హైరానా పడుతున్నారు. మరోవైపు ఎన్ని వ్యవసాయ బావులు, బోర్లు పోతున్నాయనే వివరాలను సోమవారం నుంచి రెవెన్యూ అధికారులు సేకరించనున్నారు. సీఎం రేవంత్రెడ్డి పర్యటన తర్వాత ఆయా గ్రామాల్లో సభలు నిర్వహించి పరిహారంపై స్పష్టతనిచ్చే అవకాశముంది. -
రాజమండ్రి ఎయిర్పోర్ట్లో బుల్లెట్ల కలకలం
-
విమానాలకు బాంబు బెదిరింపు
శంషాబాద్ రూరల్: శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపాయి. ఆదివారం పలు విమానాలకు బెదిరింపు ఫోన్ కాల్ రావటంతో ఓ విమానాన్ని అత్యవసరంగా దించేశారు. గోవా నుండి కోల్కతా వెళ్తున్న ఇండిగో విమానానికి బెదిరింపు కాల్ రావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో దింపారు.ఇందులో 180 మంది ప్రయాణికులు ఉన్నా రు. మరో గంటకు బెంగళూరు–హైదరాబాద్ ఇండిగో విమానానికి, మళ్లీ గంట తర్వాత హైదరాబాద్–పుణే ఇండిగో విమానానికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. వీటితో పాటు ఎయిర్ఇండియా విమానానికి ఇదే తరహా కాల్ వచి్చనట్లు విమానాశ్రయం వర్గాలు తెలిపాయి. దీంతో ఎయిర్పోర్టులో సీఐఎస్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. -
రూ.13 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
-
3 నిమిషాలు మించి హత్తుకోకండి
వెల్లింగ్టన్: తమను విడిచి విదేశాలకు వెళ్లే వారికి ఎయిర్పోర్టుల్లో కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు గుంపులుగా వచ్చి వీడ్కోలు చెబుతుండటం మనం చూసే ఉంటాం. ఇలా ఒక్కో ప్రయాణికుడికి వీడ్కోలు చెప్పే వారి సంఖ్య పెరుగుతుండటం, వచీ్చపోయే ద్వారాల వద్ద రద్దీ ఎక్కువవడంతో న్యూజిలాండ్లోని డ్యునెడిన్ ఎయిర్పోర్ట్ నిర్వాహకులు కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చారు. ‘‘మీ ఆప్తులకు హత్తుకుని వీడ్కోలు పలకాలంటే గరిష్టంగా మూడు నిమిషాలే హగ్ చేసుకోండి. ఇంకా ఎక్కువ సమయం మనసారా వీడ్కోలు పలకాలంటే కారు పార్కింగ్ స్థలాన్ని వినియోగించుకోండి’అని ఒక పెద్ద బోర్డ్ తగిలించింది. తమ నిర్ణయాన్ని ఎయిర్పోర్ట్ సీఈఓ డేనియర్ బోనో సమర్థించుకున్నారు. ‘‘విరహవేదన కావొచ్చు ఇంకేమైనా కావొచ్చు. ఆప్తులు దూరమవుతుంటే కౌగిలించుకుంటే ఆ బాధ కాస్తయినా తీరుతుంది. అందుకే కౌగిలించుకుంటే కేవలం 20 సెకన్లలోనే ప్రేమ హార్మోన్ ‘ఆక్సిటాసిన్’విడుదలవుతుంది. బాధ తగ్గుతుంది. అంతమాత్రాన దారిలో అడ్డుగా ఉండి అదేపనిగా హత్తుకుంటే ఇతర ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. డ్రాప్ జోన్ల వద్ద అడ్డుగా ఉండటం సబబు కాదు’అని ఆయన వాదించారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. తమ వారికి ప్రశాంతంగా కాస్తంత ఎక్కువ సమయం వీడ్కోలు చెప్పడం కూడా ఇతర ప్రయాణికులను ఇబ్బంది పెడుతుందా? అని కొందరు విమర్శలకు దిగారు. ఎయిర్పోర్ట్ నిర్ణయాన్ని కొందరు సమర్థించారు. ‘‘మిగతా దేశాల్లో కారులో లగేజీ దింపి హత్తుకుని, ఏడ్చి సాగనంపితే ఆ కొద్ది సమయానికే ‘కిస్ అండ్ ఫ్లై’చార్జీల కింద చాలా నగదు వసూలుచేస్తారు. ఈ ఎయిర్పోర్ట్ యాజమాన్యం ఎంతో మంచిది. తొలి 15 నిమిషాలు పార్కింగ్ ఉచితం’’అని ఒక ప్రయాణికుడు మెచ్చుకున్నాడు. ప్రయాణికుల వెంట వచ్చే వారిని తగ్గించేందుకు చాలా దేశాల ఎయిర్పోర్ట్లు ఆ కొద్దిసేపు కారు ఆపినందుకు కూడా చార్జీలు వసూలుచేస్తుండం గమనార్హం. బ్రిటన్లోని ఎస్సెక్స్ ఎయిర్పోర్ట్ యాజమాన్యం ఇందుకు 15 నిమిషాలకు దాదాపు రూ.768 వసూలుచేస్తోంది. -
ఎయిర్పోర్టు వెలుపల పేలుడు.. ఇద్దరు మృతి
కరాచీ: పాకిస్తాన్లో బాంబు పేలుడు చోటుచేసుకుంది. కరాచీ విమానాశ్రయం వెలుపల జరిగిన ఈ భారీ పేలుడులో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటనలో ఎనిమిదిమంది గాయపడినట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విమానాశ్రయం వెలుపల ట్యాంకర్ పేలింది.విదేశీయులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని పాక్ హోం మంత్రి జియా ఉల్ హసన్ స్థానిక టీవీ ఛానల్ జియోకు తెలిపారు. చైనా పౌరులపై దాడి జరిగిందని, వారిలో ఒకరు గాయపడ్డారని అన్నారు. బీజింగ్ చేపట్టిన రహదారి నిర్మాణంలో చైనా కార్మికులు పాల్గొంటున్నారు. ఈ రహదారి దక్షిణ-మధ్య ఆసియాను చైనా రాజధాని బీజింగ్తో కలుపుతుంది.డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఈస్ట్ అజ్ఫర్ మహేసర్ మీడియాతో మాట్లాడుతూ తాము పేలుడుకు గల కారణాన్ని తెలుసుకునే పనిలో ఉన్నామన్నారు. గాయపడిన వారిలో పోలీసు అధికారులు కూడా ఉన్నారని తెలిపారు. హోం మంత్రి, ఇన్స్పెక్టర్ జనరల్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఎయిర్పోర్టు భవనాలు కంపించేంత పెద్ద పేలుడు సంభవించిందని పౌర విమానయాన శాఖలో పనిచేస్తున్న అధికారి రాహత్ హుస్సేన్ తెలిపారు.ఇది కూడా చదవండి: అశ్వియ హత్య కేసులో ముగ్గురి అరెస్ట్ -
85 ఏళ్ల తర్వాత ఎయిర్పోర్ట్లో పేలిన బాంబు.. 87 విమానాల రద్దు
టోక్యో: జపాన్ రెండో ప్రపంచ యుద్ధ బాంబులు తాజాగా కలకలం రేపుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా.. జపాన్లో బాంబులను జారవిడించింది. అయితే ఆ బాంబులు జపాన్లో ఎక్కడో చోట పేలుతూనే ఉన్నాయి.తాజాగా అక్టోబర్ 2న సౌత్వెస్ట్ జపాన్లోని మియాజాకి విమానాశ్రయం రన్వే పై ఓ బాంబు పేలింది. దీంతో బాంబు పేలిన ప్రదేశంలో ఏడు మీటర్ల వెడల్పు, ఒక మీటరు లోతు భూమి ధ్వంసమైంది. బాంబు విస్పోటనంతో సమాచారం అందుకున్న ఎయిర్ పోర్ట్ అధికారులు రన్వేని షట్డౌన్ చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.బాంబు విస్పోటనం అయ్యే సమయంలో రన్వేపై సుమారు 87కి పైగా విమానాలు ఉన్నాయి. అయినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని వెలుగులోకి వచ్చిన మీడియా కథనాలు హైలెట్ చేస్తున్నాయి. ఎయిర్పోర్ట్ రన్వే మీద బాంబు పడిన ప్రదేశాన్ని పునర్నిర్మిస్తామని, ఆ పనులు గురువారం నాటికి పూర్తి చేస్తామని జపాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి యోషిమాస హయాషి తెలిపారు.విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయంమియాజాకి విమానాశ్రయంపై బాంబు విస్పోటనంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎయిర్పోర్ట్ నుంచి జపాన్ నగరాలైన టోక్యో,ఒసాకా,ఫుకుయోకాతో పాటు ఇతర ప్రాంతాలకు రాకపోకలు నిర్వహించే ప్రముఖ ఎయిర్ లైన్ దిగ్గజం జపాన్ ఎయిర్లైన్స్ (జేఏఎల్), ఆల్ నిప్పాన్ ఎయిర్లైన్స్ (ఏఎన్ఏ)తో పాటు ఇతర విమానాయాన సంస్థలు సర్వీసుల్ని రద్దు చేసుకున్నట్లు సమాచారం.85ఏళ్ల క్రితం యుద్ధంరెండో ప్రపంచం యుద్ధం జరిగింది 85ఏళ్ల అవుతుంది. అయినప్పటికీ యుద్ధ సమయంలో జపాన్పై అమెరికా ప్రయోగించిన బాంబులు నిత్యం ఎక్కడ ఒక చోట పేలుతూనే ఉన్నాయి. కేంద్ర రవాణ శాఖ అధికారిక లెక్కల ప్రకారం.. గతేడాది మియాజాకి విమానాశ్రయంలో 37.5 టన్నుల బరువైన 2,348 బాంబులను జపాన్ డిఫెన్స్ ఫోర్స్ నిర్విర్యం చేసింది. -
భద్రాద్రిలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, రాష్ట్రంలో కోకోనట్ బోర్డు ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శివరాజ్సింగ్ చౌహాన్లకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీ పర్యటనలో భాగంగా తుమ్మల కేంద్ర మంత్రులతో విడివిడిగా సమావేశమై రాష్ట్రానికి చెందిన పలు అంశాలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రా లు అందజేశారు. అనంతరం తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్నగర్లో ఎయిర్పోర్టుల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని రామ్మోహన్ నాయుడును కోరినట్లు తెలిపారు. తెలంగాణలో నూతన కోకోనట్ బోర్డ్ ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కోరానన్నారు. ఆయిల్పామ్ మీద 28% దిగుమతి సుంకం విధించి, దేశీయంగా ఆయిల్పామ్ సాగును ప్రోత్సహిస్తున్నందుకు తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు. ఆయిల్పామ్కు కేంద్రం కనీస మద్దతు ధర కలి్పంచాలని కోరారు. అలాగే ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేటలో సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్ను ఏర్పాటు చేయాలని కూడా విన్నవించారు. ఇటీవలి వరదల్లో నష్టపోయిన ఖమ్మం జిల్లాకు తగిన మొత్తంలో సహాయం అందజేయాలని కోరారు. నష్టంపై నివేదిక రాగానే సహాయం అందిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచి్చనట్లు తెలిపారు. కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ను కలిసి, తెలంగాణలో ఎక్కువగా పండే పంటలకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని కోరానన్నారు. అలాగే.. ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ ఆహార సదస్సులో పాల్గొని.. తెలంగాణలోని అవకాశాలను వివరించి, ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపించడానికి రాష్ట్రానికి రావాలని ఆహా్వనించానన్నారు. సాగు చేసేవారికే రైతుబంధువ్యవసాయం చేసే వారికే రైతుబంధు ఇవ్వాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కౌలు రైతు, భూమి యజమాని చర్చించుకొని రైతుబంధు ఎవరు తీసుకోవాలన్నది వారే నిర్ణయించుకోవాలన్నారు. ఏపీలో ఉన్నట్లుగా తెలంగాణలో కౌలు రైతు ఒప్పందాలు లేవని గుర్తుచేశారు. ఐదేళ్లలో కేసీఆర్ రూ.లక్ష రుణమాఫీ చేయలేదని, ఒకేసారి రూ.18,000 కోట్లు ఇచ్చి రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. అవసరమైతే ఇంకా నిధులు సమకూరుస్తామని తెలిపారు. ప్రతి పంట, ప్రతి రైతుకు వర్తించేలా రూ.3,000 కోట్లతో బీమా చేయనున్నట్లు తుమ్మల తెలిపారు. -
తిరోగమనంలో విమానయానం
సాక్షి, అమరావతి: కోవిడ్ సంక్షోభం తర్వాత వేగంగా కోలుకున్న రాష్ట్ర విమానయాన రంగం తొలిసారిగా నేలచూపులు చూసింది. లాక్డౌన్ తర్వాత ప్రతీ నెలా క్రమంగా పెరుగుతూ వచి్చన ప్రయాణికుల సంఖ్య జూలై నెలలో తగ్గిపోయింది. తాజాగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. గతేడాది జూలై నెలతో పోలిస్తే ఈ ఏడాది జూలైలో ఒక్క విజయవాడ తప్ప రాష్ట్రంలోని మిగిలిన ఐదు విమానాశ్రయాల్లో ప్రయాణికుల సంఖ్యలో భారీ క్షీణత నమోదయ్యింది. రాయలసీమ ప్రాంతంలో ఆ క్షీణత ఇంకా ఎక్కువగా ఉంది.తిరుపతి విమానాశ్రయంలో 4.4 శాతం తగ్గితే కర్నూలులో 63.5 శాతం, కడప విమానాశ్రయంలో 47.4 శాతం తగ్గింది. గతేడాది జూలై నెలలో కడప విమానాశ్రయం నుంచి 6,944 మంది ప్రయాణిస్తే ఇప్పుడు ఆ సంఖ్య 3,650కు పడిపోయింది. అదే సమయంలో కర్నూలులో ప్రయాణికుల సంఖ్య 3,419 నుంచి 1,247కు పడిపోయింది. తిరుపతి విమానాశ్రయంలో కూడా ప్రయాణికుల సంఖ్య తగ్గడం గమనార్హం. విశాఖపట్నంలో కూడా ప్రయాణికుల సంఖ్య 2,28,897 నుంచి 2,25,261కు తగ్గిపోయింది. కానీ ఒక్క విజయవాడలో 15.5 శాతం పెరిగింది.తగ్గించేస్తున్న సరీ్వసుల సంఖ్యప్రయాణికుల సంఖ్య తగ్గడంతో విమానయాన సంస్థలు తమ సరీ్వసులను తగ్గించేస్తున్నాయి. కర్నూలులో విమాన సరీ్వసులు 108 నుంచి 64కు తగ్గిపోయాయి. కడపలో 200 నుంచి 138కు రాజమండ్రిలో 748 నుంచి 694కు సరీ్వసులు తగ్గాయి. ఒక్క విజయవాడలో మాత్రం విమాన సర్వీసులు 1,272 నుంచి 1,553కు పెరిగాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత ఆర్థిక కార్యకలాపాలు తగ్గడంతో విమాన ప్రయాణికుల సంఖ్య కూడా తగ్గిందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.ప్రభుత్వం రాజధాని అమరావతి అంటూ ఆ ఒక్క ప్రాంతానికే ప్రాధాన్యత ఇస్తుండటంతో మిగిలిన ప్రాంతాల్లో కార్యకలాపాలు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయని, దానికి నిదర్శనమే విశాఖతో సహా మిగిలిన విమానాశ్రయాల్లో ప్రయాణికుల సంఖ్య తగ్గడానికి కారణంగా నిపుణులు విశ్లేíÙస్తున్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా రాష్ట్రానికి చెందిన కె.రామ్మోహన్నాయుడు ఉన్నప్పటికీ విమాన సరీ్వసులు, ప్రయాణికుల సంఖ్య తగ్గుతున్నాయని, ఇదే విధమైన పరిస్థితి కొనసాగితే త్వరలోనే కడప, కర్నూలు విమానాశ్రయాల్లో సేవలు నిలిచిపోయే ప్రమాదముందని ఆ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
డబ్బుతో విమానం ఎక్కుతున్నారా.. ఈ రూల్స్ తెలుసా?
Airport Rules: ప్రస్తుతం విమాన ప్రయాణం సర్వ సాధారణంగా మారిపోయింది. విదేశాలకు, దూర ప్రాంతాలకు ప్రయాణించాలంటే విమానాల్లో వెళ్లడానికే చాలా మంది ఇష్టపడతారు. గమ్యాన్ని తక్కువ సమయంలో చేరుకోవడం, ఫ్లైట్ ఫేర్లు తక్కువగా ఉండటం వంటి కారణాలతో విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య ఇటీవల పెరుగుతూ వస్తోంది.అయితే విమానంలో ప్రయాణించడానికి లగేజీకి సంబంధించిన పరిమితులు ఉంటాయని చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ ప్రయాణికులు తమ వెంట ఎంత నగదు తీసుకువెళ్లవచ్చు అనే దానిపైనా పరిమితులు ఉన్నాయని మీకు తెలుసా? దేశం వెలుపల, విదేశాలలో నగదు విత్డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులో ఉన్నప్పటికీ, తమ సౌలభ్యం కోసం నగదును తమ వెంట తీసుకెళ్లేందుకు ఇష్టపడే వారు చాలా మందే ఉన్నారు.ఎంత తీసుకెళ్లొచ్చు?నగదును తీసుకెళ్లేందుకు సంబంధించిన నిబంధనలు దేశీయ విమానాలకు, అంతర్జాతీయ విమానాలకు వేరువేరుగా ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం.. దేశీయ విమానాల్లో గరిష్టంగా రూ. 2 లక్షల నగదును తీసుకెళ్లవచ్చు. కానీ మీరు విదేశీ పర్యటనకు వెళుతున్నట్లయితే ఈ నిబంధన వర్తించదు.ఇక మీరు నేపాల్, భూటాన్ మినహా మరే ఇతర దేశానికి వెళుతున్నా 3000 డాలర్ల వరకు విదేశీ కరెన్సీని తీసుకెళ్లవచ్చు. దీని కంటే ఎక్కువ నగదును తీసుకెళ్లాలనుకుంటే స్టోర్ వ్యాల్యూ, ప్రయాణ తనిఖీలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.లగేజీ బరువు ఎంత ఉండాలి?విమానంలో మీ హ్యాండ్బ్యాగ్లో 7 నుండి 14 కిలోల బరువును తీసుకెళ్లవచ్చు. మీరు చెక్-ఇన్ కౌంటర్ వద్ద ఇచ్చే చెక్-ఇన్ బ్యాగేజీ బరువు 20 నుండి 30 కిలోల వరకు ఉంటుంది. అంతర్జాతీయ విమానాలకు కూడా ఇదే నిబంధనలు వర్తిస్తాయి.ఏవి తీసుకెళ్లకూడదు?విమాన ప్రయాణంలో మీరు కొన్ని వస్తువులను తీసుకెళ్లకూడదు. క్లోరిన్, యాసిడ్, బ్లీచ్ మొదలైన రసాయనాలను అస్సలు తీసుకెళ్లలేరు. ఇక మద్యం విషయానికి వస్తే దేశీయ విమానాల్లో మీ చెక్-ఇన్ బ్యాగ్లో ఆల్కహాల్ తీసుకెళ్లవచ్చు. కానీ అది 5 లీటర్లకు మించకూడదు. -
Washington: ఎయిర్పోర్టుపై సైబర్ దాడి.. ప్రయాణికుల అవస్థలు
ప్రపంచంలో ఇటీవలి కాలంలో సైబర్ దాడులు తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అమెరికాలో ఇలాంటి ఉదంతం చోటుచేసుకుంది. ఇక్కడి సీటెల్-టకోమా అంతర్జాతీయ విమానాశ్రయంపై సైబర్ దాడి జరిగింది. దీంతో ఇంటర్నెట్, ఫోన్, ఈ- మెయిల్ ఇతర కమ్యూనికేషన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఎయిర్పోర్ట్ అధికారులు ఇంటర్నెట్ సర్వీసులను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు.సీటెల్-టకోమా అంతర్జాతీయ విమానాశ్రయ మేనేజింగ్ డైరెక్టర్ లాన్స్ లిటిల్ మీడియాతో మాట్లాడుతూ తాము ప్రస్తుతం అత్యవసర సేవలను పునరుద్ధరించడానికి, ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను తగ్గించేందుకు 24 గంటలూ పనిచేస్తున్నామని తెలిపారు. ఎయిర్పోర్ట్ అధికారులు, ట్రాన్స్పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (టీఎస్ఏ), కస్టమ్స్ అండ్ సెక్యూరిటీతో సహా ఇతర ఫెడరల్ ఏజెన్సీలు ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణకు కృషి చేస్తున్నాయన్నారు.డెల్టా, అలాస్కా ఎయిర్లైన్స్తో సహా కొన్ని విమానయాన సంస్థలు సైబర్ఎటాక్ కారణంగా సేవలను నిలిపివేశాయి. కాగా విమానాశ్రయ అధికారులు ప్రయాణికులకు కొన్ని సూచనలు చేశారు. ప్రయాణికులు విమానాశ్రయానికి ముందుగా చేరుకోవాలని, బోర్డింగ్ పాస్లు, బ్యాగ్ ట్యాగ్లు' పొందేందుకు విమానయాన సంస్థల మొబైల్ అప్లికేషన్లను ఉపయోగించాలని కోరారు. -
విమానంలో సీఐఎస్ఎఫ్ సిబ్బందిపై మహిళ దాడి
ముంబై: విమానంలో ఓ మహిళ.. తోటి ఇద్దరు ప్రయాణికులు, సీఐఎస్ఎఫ్ సిబ్బందిపై దాడికి తెగపడ్డారు. ఈ ఘటన శనివారం పుణెలోని లోహెగావ్ ఎయిర్పోర్టులో చోటు చేసుకుంది. ఉదయం 7. 45 గంటలకు పుణె నుంచి ఢిల్లీకి బయలుదేరే.. ఓ ప్రైవేటు విమానంలో బోర్డింగ్ ప్రాసెస్ సమయంలో ఓ మహిళ దాడికి తెడపడ్డారు. మొదట ఆ మహిళ ముందు సీట్లో ఉన్న ఇద్దరు ప్రయాణికులపై దాడి చేశారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి విమాన సిబ్బంది, సీఐఎస్ఎఫ్ కానిస్టెబుల్స్ ఆమె వద్దకు వచ్చారు. దీంతో ఆమె మరింత రెచ్చిపోయి.. సీఐఎస్ఎఫ్ సిబ్బందిపై దాడి చేసింది. అనంతరం ఆ మహిళను, ఆమె భర్తను విమానం నుంచి దింపేశారు. ఆ మహిళను ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించగా.. కేసు నమోదు చేశారు.సీనియర్ ఇన్స్పెక్టర్ అజయ్ సంకేశ్వరి మాట్లాడుతూ.. విచారణ కోసం సదరు మహిళకు నోటీసు ఇచ్చి విడిచిపెట్టాం. ఎయిర్లైన్ సిబ్బంది, సీఐఎస్ఎఫ్ సిబ్బంది,సహ ప్రయాణీకులు వాంగ్మూలాలను రికార్డు చేశాం’ అని చెప్పారు. వ్యక్తిగత అత్యవసర పరిస్థితి కారణంగా ఆమె తీవ్రమైన బాధలో ఉన్నట్లు గమనించామని, అందుకే ఆమె తోటి ప్రయాణికులతో వాగ్వాదానికి దిగారని ఓ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ తెలిపారు. -
నంద్యాల పర్యటన.. దారిపొడవునా జననేతకు ఘన స్వాగతం (ఫొటోలు)
-
ఇండియా-బంగ్లాదేశ్ విమానాలు రద్దు
బంగ్లాదేశ్లో తీవ్ర నిరసనల మధ్య ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, దేశం విడిచి వెళ్లారు. దాంతో స్థానికంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలు ఆ దేశానికి నడిపే తమ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు ప్రయాణించే సర్వీసులను నిలిపేస్తున్నట్లు విమానయాన సంస్థలు చెప్పాయి. సోమవారం ముంబై నుంచి ఢాకాకు విమానాన్ని నడిపిన విస్తారా..తమ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు చెప్పింది. మంగళవారం పరిస్థితిని పర్యవేక్షించి నిర్ణయానికి వస్తామని పేర్కొంది. ఎయిరిండియా ఢిల్లీ నుంచి ఢాకాకు రోజువారీ రెండు విమానాలను నడుపుతుండగా వాటిని నిలిసేస్తున్నట్లు చెప్పింది.ఇదీ చదవండి: సైబర్ మోసాలు.. రూ.177 కోట్ల నష్టంఇండిగో సంస్థ ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా నుంచి ఢాకాకు విమానాలను నడుపుతుంది. బంగ్లాదేశ్లోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఢాకాకు బయలుదేరే విమానాలను రీషెడ్యూల్డ్ చేస్తున్నట్లు చెప్పింది. అయితే అందుకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. ‘మీ ప్రయాణ ప్రణాళికలకు కలిగిన అంతరాయానికి క్షమించాలి. బంగ్లాదేశ్లోని ఉద్రిక్తతలు కారణంగా విమానాలు రద్దు చేస్తున్నాం. తదుపరి వివరాలు త్వరలో వెల్లడిస్తాం’ అని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. -
మెగాస్టార్తో సెల్ఫీ కోసం యత్నం.. ఇలా చేశారేంటి?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార్ ఫేమ్ వశిష్ట డైరెక్షన్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. అయితే షూటింగ్కు కాస్తా గ్యాప్ ఇచ్చిన మెగాస్టార్ పారిస్ ఒలింపిక్స్లో ఎంజాయ్ చేస్తున్నారు. తన ఫ్యామిలీతో కలిసి పారిస్ చేరుకున్న చిరంజీవి అక్కడి వీధుల్లో సందడి చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు.అయితే తాజాగా మెగాస్టార్ ఎయిర్పోర్ట్లో కనిపించారు. అదే సమయంలో నడుచుకుంటూ వెళ్తున్న చిరంజీవితో అక్కడే ఉన్న కొందరు సిబ్బంది సెల్పీలు దిగేందుకు యత్నించారు. అందులో ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన ఓ వ్యక్తి మెగాస్టార్తో సెల్ఫీ కోసం ఎగబడ్డాడు. అయితే సెల్ఫీ కోసం వచ్చిన సిబ్బందిని మెగాస్టార్ పక్కకు తోసేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఒక అభిమాని పట్ల ఇలా వ్యవహరించడం సరైంది కాదని కొందరు నెటిజన్స్ మండిపడుతున్నారు. Padma Vibhushan Chiranjeevi at Airport pic.twitter.com/sTvtP2qW3R— Milagro Movies (@MilagroMovies) July 30, 2024 -
నేపాల్ ప్రమాదానికి టేబుల్ టాప్రనేవే కారణం!.. ఏంటిది?
నేపాల్ రాజధాని ఖాట్మండులో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో శౌర్య ఎయిర్లైన్స్కు చెందిన విమానం టేకాఫ్ అవుతుండగా ఒక్కసారి కూలిపోయింది. ఈ దుర్ఘటనలో సిబ్బంది సహా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయానికి విమానంలో నలుగురు సిబ్బంతో సహా 19 ప్రయాణికులుండగా.. కేవలం పైలట్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.అయితే హిమాలయ పర్వతాల మధ్య ప్రకృతి అందాల్లో ఉండే నేపాల్లో తరచూ విమాన ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. ఇందుకు అక్కడ ఎక్కువగా టేబుల్-టాప్ రన్వేలు ఉండటమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇవి సవాళ్లతో కూడుకుని ఉంటాయి. తాజాగా ప్రమాదం జరిగిన త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా టేబుల్ టాప్ విమానాశ్రయమే. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర విమానాశ్రయాల్లో ఒకటి.అన్ని వైపులా లోతైన లోయలు ఉండి.. ఎత్తైన కొండపై భాగంలో ఎయిర్పోర్టు ఉంటుంది.. ఈ రన్వే చుట్టుపక్కల భూభాగం కంటే ఎత్తులో ఉంటాయి. వీటికి దాదాపు అన్ని వైపులా లోయలు ఉంటాయి. కానీ దూరం నుంచి చూస్తే రన్వే, పక్కన ఉన్న భూభాగం సమాంతరంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. దీనివల్ల విమానం రన్వేపై అదుపుతప్పితే అది లోయలో పడి క్రాష్ అవ్వడం జరుగుతుంది.సాధారణంగా విమానం టేకాఫ్/ల్యాండింగ్ అయ్యేప్పుడు అది రన్వేపై ఏ ప్రదేశం నుంచి ఏ ప్రదేశం మధ్యలో విమానం టైరు నేలను తాకాలో ముందుగానే నిర్ణయించి మార్కింగ్ చేసి ఉంటుంది. అయితే వర్షాలు, ఇతర కారణాలతో రన్వే సరిగా కనిపించకపోతే విమానం దానికి మార్కింగ్ చేసిన నేలను దాటి తాకుతుంది. దీన్ని ఓవర్ షూట్ అంటారు. సాధారణ రన్వేలపై ఇలా జరిగినప్పుడు విమానం ఆగడానికి తగినంత అదనపు స్థలం ఉటుంది. కానీ టేబుల్టాప్ రన్వేలపై ఓవర్ షూట్ జరిగితే మాత్రం విమానం నేరుగా లోయ వంటి ప్రదేశంలో పడిపోతుంది.ఇక భారత్లోనూ అయిదు విమానాశ్రయాలు టేబుల్-టాప్ రన్వేలను కలిగి ఉన్నాయి. సిమ్లా(హిమాచల్ ప్రదేశ్), కాలికట్(కేరళ), మంగళూరు(కర్ణాటక), లెంగ్పుయ్ (మిజోరం). పాక్యోంగ్ (సిక్కిం). వీటిలో కేరళ, మంగళూరు విమానాశ్రయాలు గతంలో పెద్ద ప్రమాదాలు సైతం జరిగాయి. మే 22, 2010న, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం దుబాయ్ నుంచి మంగళూరుకు వస్తుండగా ల్యాండింగ్ సమయంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సిబ్బందితో సహా 158 మంది ప్రయాణికులు మరణించారు. -
ఎయిర్పోర్టులో వృద్ధ మహిళకు చేదు అనుభవం
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ వృద్ధురాలికి చేదు అనుభవం ఎదురయ్యింది. ఆమె వీల్ చైర్ కోసం మూడు గంటలకు పైగా సమయం నిరీక్షిస్తూ పలు ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది.పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న ఆ 84 ఏళ్ల వృద్ధురాలు అలయన్స్ ఎయిర్ విమానంలో జైపూర్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చింది. అక్కడ వీల్ చైర్ కోసం ఆమె మూడు గంటలకు పైగా వేచి ఉండాల్సి వచ్చింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్టున్నట్ల ఎయిర్లైన్స్ అధికారులు తెలిపారు. తమ విమానయాన సంస్థ ఆ వృద్ధ మహిళకు, ఆమె కుటుంబ సభ్యులకు ఇప్పటికే క్షమాపణలు చెప్పిందని పేర్కొన్నారు.అలయన్స్ ఎయిర్ కస్టమర్ కేర్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మనోహర్ తుఫ్చి మీడియాతో మాట్లాడుతూ ‘పొరపాటు జరిగింది. మేము ఈ సంఘటనను అనేక కోణాల్లో పరిశీలిస్తున్నాం. గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీ ఏఐ- సాట్స్తో కూడా ఈ ఉదంతంపై చర్చించాం. ఈ ఏజెన్సీ ప్రయాణికులకు వీల్చైర్లను అందిస్తుంది. తాము వృద్ధురాలి కుమారునితో ఫోన్లో మాట్లాడాం. అతనికి క్షమాపణలు చెప్పాం’ అని తెలిపారు. -
వేకేషన్ పూర్తి చేసుకున్న ప్రిన్స్.. డిఫరెంట్ లుక్లో మహేశ్ బాబు!
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో అభిమానులను అలరించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. అయితే ప్రస్తుతం మహేశ్ బాబు.. దర్శకధీరుడు రాజమౌళితో కలిసి పని చేయనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రానికి ఇప్పటికే కథను సిద్ధం చేశారు. ఈ ఏడాదిలో ఈ సినిమా సెట్స్పైకి వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగా సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫుల్గా చిల్ అవుతున్నారు. కాస్తా ఖాళీ సమయం దొరికితే చాలు ఠక్కున విదేశాల్లో వాలిపోతుంటారు. తాజాగా ప్రిన్స్ తన ఫ్యామిలీతో కలిసి వేకేషన్కు వెళ్లారు. ఇటీవలే కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లిన మహేశ్ బాబు తాజాగా ఇండియాకు తిరిగొచ్చారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో సితార, గౌతమ్, తన భార్యతో కలిసి కనిపించారు. విమానాశ్రయం నుంచి బయటికొస్తున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది. #TFNExclusive: Superstar @urstrulyMahesh and his family have arrived in Hyderabad after their vacation!📸#MaheshBabu #SSMB29 #TeluguFilmNagar pic.twitter.com/smdCatOYlb— Telugu FilmNagar (@telugufilmnagar) July 7, 2024 -
రాజ్కోట్ ఎయిర్పోర్టు ఘటన, ‘నెహ్రూను నిందించొద్దు ప్లీజ్’: బీజేపీ
న్యూఢిల్లీ: భారీ వర్షాల కారణంగా అటు ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్, ఇటు గుజరాత్లోని రాజ్ కోట్ మినాశ్రయంలోని టెర్మినల్ రూఫ్ కూలిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. రాజ్ కోట్ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.అయితే వరుస ఘటనలను ఉద్దేశిస్తూ కేంద్రంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఈ ఎయిర్పోర్టును గతేడాదే మోదీ ప్రారంభించారని, అప్పుడే కూలిపోయిందని దుయ్యబట్టింది. దీనికి గట్టి కౌంటర్ ఇచ్చింది. ఈ ఘటనకు నెహ్రూను నిందించొద్దని, ఎందుకంటే ఆయన విమానాశ్రయాలు కట్టించలేకపోయారని ఎద్దేవా చేసింది.దీనికి బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాల్వీయా ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రతిపక్ష పార్టీకి దీటుగా బదులిచ్చారు. ‘‘భారీ వర్షం, ఈదురు గాలుల కారణంగా రాజ్కోట్ ఎయిర్పోర్టులోని క్లాత్ టెంట్ చిరిగిపోయింది. అంతేగానీ.. కట్టడం కూలినట్లు కాదు. ఇక, ఈ ఘటనకు మనం నెహ్రూ (మాజీ ప్రధాని)ను నిందించొద్దు. ఎందుకంటే ఆయన ప్రజలకు అవసరమైన స్థాయిలో విమానాశ్రయాలను నిర్మించలేదు.ఆయన హయాంలో మనమంతా డీఆర్డీవో ధ్రువీకరించిన ఎడ్లబండ్లలో ప్రయాణించాం’’ అని అన్నారు. ఇక, దిల్లీ ఘటన నేపథ్యంలో దేశంలోని అన్ని చిన్నా పెద్ద విమానాశ్రయాల్లో భద్రతాపరమైన తనిఖీలు నిర్వహించాలని పౌరవిమానయాన శాఖ ఇప్పటికే ఆదేశించిన విషయాన్ని గుర్తుచేశారు. -
భారత ఎయిర్పోర్ట్ల వ్యూహాలు మారాలి
న్యూఢిల్లీ: భారత విమానాశ్రయాలు తమ ధరల వ్యూహాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని, నాన్ ఏరో నాటికల్ ఆదాయాలను మరింత పెంచుకోవడం ద్వారా లాభదాయకతను వృద్ధి చేసుకోవాలని ఈ రంగానికి చెందిన కన్సల్టెన్సీ సంస్థ కాపా ఇండియా సూచించింది. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద దేశీ పౌర విమానయాన మార్కెట్గా అవతరించగా, ఏటేటా ఎయిర్ ట్రాఫిక్ (ప్రయాణికుల రద్దీ) పెరుగుతూ వెళుతుండడం తెలిసిందే. దీంతో విమానయాన సంస్థలు, విమానాశ్రయాలు తమ సేవలను విస్తరిస్తుండడం గమనార్హం. ఈ తరుణంలో కాపా ఇండియా విడుదల చేసిన నివేదికకు ప్రాధాన్యం ఏర్పడింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) నమూనాలో నడిచే విమానాశ్రయాలు నాన్ ఏరో మర్గాల (విమానయేతర) ద్వారా ఆదాయాన్ని మరింత పెంచుకోవాలని ఇది సూచించింది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిర్వహణలోని విమానాశ్రయలతో పోలిస్తే పీపీపీ విధానంలోని విమానాశ్రయాల్లో నాన్ ఏరో ఆదాయం ఎక్కువగా ఉండడాన్ని ప్రస్తావించింది. ‘‘ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిన్ ఇవన్నీ పీపీపీ విధానంలో నడిచే విమానాశ్రయాలు కాగా, 2019–2020లో నాన్ ఏరో ఆదాయంలో వీటి వాటాయే 71 శాతంగా ఉంది. మొత్తం ప్రయాణికుల ట్రాఫిక్లో మాత్రం వీటి వాటా 53 శాతమే’’అని కాపా ఇండియా తెలిపింది. ఇంకా అవకాశాలున్నాయి..విమానాశ్రయాలను ప్రైవేటీకరించిన తర్వాత వాటి నాన్ ఏరో ఆదాయం గణనీయంగా పెరిగినప్పటికీ.. అంతర్జాతీయ స్థాయికి అనుగుణంగా మరింత పెంచుకునేందుకు అవకాశాలున్నట్టు కాపా ఇండియా అభిప్రాయపడింది. ఇందుకోసం విమానాశ్రయాలు తమ ధరల విధానాన్ని సమీక్షించుకోవాలని పేర్కొంది. ఎయిర్పోర్ట్ల వనరుల విషయంలో ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్కు అనుగుణంగా ధరలు ఉన్నాయా? ఎయిర్లైన్ వ్యాపార నమూనా, ఫ్రీక్వెన్సీ, ప్యాసింజర్ల ప్రొఫైల్ మధ్య భారీ వైరుధ్యం ఉందా అనేది పరిశీలించాలని సూచించింది. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు దేశీ ఎయిర్లైన్స్ 6.61 కోట్ల ప్రయాణికులకు సేవలు అందించడం గమనార్హం. క్రితం ఏడాదిలో విమానాల్లో ప్రయాణించిన వారు 6.36 కోట్లుగా ఉన్నారు. -
ఎయిర్పోర్ట్ విస్తరణకు రూ.2,869 కోట్లు
వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణకు కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింది.భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభ నియోజకవర్గం అయిన వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి ఎయిర్పోర్ట్ విస్తరణ కోసం రూ.2,869.65 కోట్లు వెచ్చించేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిధులతో కొత్త టెర్మినల్ బిల్డింగ్, ఆప్రాన్(విమానాలను పార్క్ చేయడానికి వీలుగా ఉండే ప్రాంత్రం), రన్వే విస్తరణ, ట్యాక్సీ ట్రాక్ నిర్మాణంతోపాటు ఇతర అనుబంధ పనులు చేస్తారని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ప్రతిపాదన ప్రకారంగానే రూ.2,869.65 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఏటా 39 లక్షల మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయం ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్య 99 లక్షలకు చేరేలా లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం తాజా నిధులు ఎంతో ఉపయోగపడుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
ఢిల్లీ ఎయిర్పోర్టులో పవర్ కట్స్
సాక్షి,ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ పక్క తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడి జలమండలి ఆఫీసులపై దాడులు జరుగుతున్నాయి. మరోపక్క అక్కడి ఎయిర్పోర్టుకు కరెంటు కోతలు తప్పడం లేదు. సోమవారం(జూన్17) ఎయిర్పోర్టు టర్మినల్ మూడులో కరెంటు కష్టాలు ఎదురయ్యాయి. కరెంటు కోతల వల్ల ప్రయాణికులు చెకింగ్,బోర్డింగ్ సమయంలో ప్రయాణికులు కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కరెంటు సమస్యను పరిష్కరించామని, కేవలం 10 నిమిషాలే కరెంటు పోయిందని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(డయల్) ఒక ప్రకటనలో తెలిపింది. -
ఒకే రన్వేపై రెండు విమానాలకు అనుమతి ఉందా?
ఎయిర్పోర్ట్ రన్వేపై దాదాపు నిమిషంలోపు రెండు విమానాలు ప్రయాణించడం సాధ్యమవుతుందా అంటే అవుననే సమాధానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వాతావరణంలో ఎలాంటి విజిబిలిటీ సమస్యలు లేవని నిర్ధారించుకుని షరతులకు లోబడి ఇది సాధ్యపడుతుందని నిబంధనలు చెబుతున్నాయి.ఒకే రన్వేపై రెండు విమానాలు ప్రయాణించేలా అనుమతులివ్వాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి. ‘ఏటీసీ నియమాల ప్రకారం..వాతావరణంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు లేవని నిర్ధారించుకోవాలి. విజిబిలిటీ సమస్యలు ఉండకూడదు. ప్రత్యేక షరతులకు లోబడి, ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను అనుసరించి మూడు నిమిషాలలోపు రెండు విమాన టేకాఫ్లు, రెండు ల్యాండింగ్లకు అనుమతించవచ్చు’అని పీటీఐ తెలిపింది.ముంబై ఎయిర్పోర్ట్లో..జూన్ 8న 6ఈ 6053 అనే ఇండిగో విమానం ఇందోర్ నుంచి ముంబై ఎయిర్పోర్ట్లో దిగాల్సి ఉంది. దాంతో పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ)ను ల్యాండింగ్ క్లియరెన్స్ కోసం అనుమతించాలని కోరారు. ఏటీసీ సూచనలను అనుసరించి ఇండిగో విమానం ఎయిర్పోర్ట్లో దిగింది. ఇదిలాఉండగా, ఎయిర్ఇండియాకు చెందిన ఏఐ657 అనే విమానం అదే సమయంలో ముంబై నుంచి తిరువనంతపురం వెళ్లేందుకు ఏటీసీ టేకాఫ్కోసం అనుమతించారు. దాంతో రెండు విమానాలు నిమిషం తేడాతో రన్వేపై ప్రయాణించాయి. ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన క్షణాల్లో ఇండిగో విమానం అదే రన్వేపై ల్యాండ్ అయింది. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే రెండు విమానాల ప్రయాణికులకు తీవ్ర నష్టం జరిగేదని తోటి ప్యాసింజర్లు తెలిపారు. ఘటనను తీవ్రంగా పరిగణించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ)ని విధుల్లో నుంచి తొలగించి విచారణ జరుపుతోంది.ఇదీ చదవండి: రూ.83 వార్షికవేతనం తీసుకున్న స్టీవ్జాబ్స్..!ఇదిలాఉండగా, విమానాశ్రయాల్లో అధిక జనసాంద్రత ఉన్నపుడు ఏటీసీలపై తీవ్ర ఒత్తిడి ఉంటుందని కొందరు అధికారులు తెలిపారు. ఏటీసీ, సంబంధిత పైలట్లు ఘటనకు సంబంధించి సరైన నిబంధనలు అనుసరించారా లేదా అనే అంశంపై డీజీసీఏ విచారణ జరుగుతుందని చెప్పారు. అధిక జనసాంద్రత కలిగిన విమానాశ్రయాల్లో ముంబై ఎయిర్పోర్ట్ ఒకటి. అక్కడ విమానాలరాకపోకలు ఎక్కువగా ఉంటాయి. విమానాశ్రయంలోని ఆర్డబ్ల్యూ27 అనే రన్వేపై గంటకు 46 విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయని తెలిసింది.Serious security concern at @CSMIA_Official Mumbai Airport yesterday putting 100s of life at riskWhile @airindia ✈️ was in the process of take off, another 🛬 from @IndiGo6E was allowed to land on same runway@DGCAIndia takes action against #Mumbai ATC official responsible pic.twitter.com/nsJvHZrWTZ— Nikhil Lakhwani (@nikhil_lakhwani) June 9, 2024 -
కొన్ని గంటల్లోనే నిర్ణయం వెనక్కి తీసుకున్న బీఐఏఎల్
కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం(కేఐఏ)లో పికప్ లేన్ల ప్రవేశ రుసుమును రద్దుచేస్తూ బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(బీఐఏఎల్) ప్రకటన విడుదల చేసింది. విమానాశ్రయ పరిధిలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు స్పీడ్ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పింది.అవసరం ఉన్నా, లేకపోయినా కేఐఏ పికప్లేన్ పరిధిలోకి పెద్దసంఖ్యలో వాహనాలు వస్తూండడం బీఐఏఎల్ దృష్టికి వెళ్లింది. దాంతోపాటు ఎయిర్పోర్ట్ పరిసరాల్లో భారీగా వాహనాలు చేరుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని గమనించింది. వాటిని నివారించాలంటే కొన్ని మార్పులు తీసుకురావాలని భావించింది. బీఐఏఎల్ టెర్మినల్ 1, 2లో అరైవల్ పికప్ లేన్లను చేరడానికి ఎంట్రీ ఫీజును ప్రవేశ పెట్టింది. రిజిస్ట్రేషన్ ప్లేట్ల ఆధారంగా వాహనాలపై ఛార్జీలు వసూలు చేస్తామని చెప్పింది. అయితే ఈ నిర్ణయం వెలువడిన కొన్ని గంటల్లోనే ట్యాక్సీడ్రైవర్లు, ఇతర కమ్యునిటీల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. దాంతో ప్రవేశ రుసుమును రద్దుచేస్తున్నట్లు బీఏఐఎల్ తిరిగి ప్రకటన విడుదల చేసింది.బీఐఏఎల్ ముందుగా చేసిన ప్రకటన ప్రకారం..ప్రైవేట్ వాహనాలు పికప్ లేన్లలోకి ప్రవేశించిన ఏడు నుంచి 14 నిమిషాల సమయానికి రూ.150 రుసుము చెల్లించాలి. వాణిజ్య వాహనదారులు మొదటి ఏడు నిమిషాలకు రూ.150, తర్వాతి ఏడు నిమిషాలకు రూ.300 చెల్లించాలి. బస్సు ప్రయాణికులు ఏడు నిమిషాలకు రూ.600, ట్రావెలర్స్ రూ.300 చెల్లించాలని నిర్ణయించారు. ఒకవేళ టికెట్పోతే రూ.600 నిర్ణీత రుసుము చెల్లించాలి. పికప్ ఏరియాలో 15 నిమిషాలకు మించి ఉంటే ఆ వాహనాలను యజమాని ఖర్చుతో పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాలి.వైట్ రిజిస్ట్రేషన్ ప్లేట్ కలిగి ఉండే వాహనాలను ప్రైవేట్ వాహనాలుగా, ట్రావెల్స్, ఆన్లైన్ బుకింగ్ వెహికిల్స్, పసుపు రిజిస్ట్రేషన్ ప్లేట్తోపాటు కొన్ని ఈవీలను వాణిజ్య వాహనాలుగా వర్గీకరించారు. కర్ణాటక రాష్ట్ర ట్రావెల్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాధాకృష్ణ హోల్లా మాట్లాడుతూ..‘ఎయిర్పోర్ట్ రావాలనుకునే ప్రయాణికులు ఇప్పటికే సాదహళ్లి టోల్గేట్ వద్ద ఛార్జీ చెల్లిస్తున్నారు. మళ్లీ అరైవల్-పికప్ ఏరియాలో రుసుము చెల్లించాలనే నిర్ణయం సరికాదు’ అన్నారు.కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరిధిలో ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడానికి బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ (బీడీఏ) స్పీడ్ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఈ కెమెరాలు నిబంధనల కంటే వేగంగా వెళ్లే వారిని గుర్తించి జరిమానాలను విధిస్తాయి. -
ఆకాశవీధిలో 41.8 కోట్లమంది.. ఇక్రా నివేదిక
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా విమాన ప్రయాణీకుల రద్దీ 40.7-41.8 కోట్లకు చేరుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. అదే సమయంలో విమాన సంస్థల ఆదాయాలు 15-17 శాతం పెరుగుతాయని చెప్పింది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) అధీనంలోని విమానాశ్రయాలతో పాటు దిల్లీ, హైదరాబాద్, కోచి అంతర్జాతీయ విమానాశ్రయాలను నమూనాగా తీసుకుని ఇక్రా ఈ నివేదిక విడుదల చేసింది.ఇక్రా నివేదిక ప్రకారం..కరోనా కంటే ముందు నమోదైన విమాన ప్రయాణాలతో పోలిస్తే 10 శాతం అధికంగా ఫ్లైట్జర్నీ చేస్తున్నారు. మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 37.6 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారు. విమానాల రద్దీ ఏటా 8-11 శాతం పెరుగుతోంది. 2023 క్యాలెండర్ ఏడాదిలో అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీలో భారత్ వాటా 4.2 శాతంగా ఉంది. 2019లోని 3.8 శాతంతో పోలిస్తే అధికం. 2023లో గ్లోబల్గా ప్రయాణికుల రద్దీ 96 శాతం పుంజుకుంది. అదే భారత్లో మాత్రం 106 శాతం రికవరీ అయింది. దేశీయంగా కొత్త మార్గాలు, విమానాశ్రయాల సంఖ్య పెరగడంతో ఇది సాధ్యపడినట్లు ఇక్రా తెలిపింది.ఇదీ చదవండి: పెరగనున్న వస్తు ఎగుమతులు.. ఎంతంటే..ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్ వినయ్ కుమార్ మాట్లాడుతూ..‘విరామం కోసం, వృత్తి వ్యాపార అవసరాల రీత్యా ప్రయాణాలు అధికంగా చేస్తున్నారు. కొత్త గమ్యస్థానాలకు విమాన సర్వీసులు ప్రారంభం కావడమూ కలిసొస్తోంది’ అన్నారు. -
విమానంలో ల్యాండింగ్గేర్ సమస్య.. గాల్లోనే మూడు గంటలు..
విమానంలో ల్యాండింగ్గేర్ సమస్య ఏర్పడి మూడు గంటలు గాల్లోనే ఉన్న ఘటన ఆస్ట్రేలియాలోని న్యూకాజిల్ ఎయిర్పోర్ట్ పరిధిలో చోటుచేసుకుంది. ముగ్గురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న ఈ విమానం చివరకు సురక్షితంగా ల్యాండ్ అయింది.వివరాల్లోకి వెళితే..ట్విన్-టర్బోప్రోప్ బీచ్క్రాఫ్ట్ సూపర్ కింగ్ ఎయిర్ అనే తేలికపాటి విమానంలో ముగ్గురు వ్యక్తులు ప్రయాణానికి సిద్ధమయ్యారు. సిడ్నీకి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోర్ట్ మక్వేరీకి బయలుదేరారు. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే(ఉదయం 9:30 సమయం) ల్యాండింగ్ గేర్ సమస్య ఏర్పడినట్లు పైలట్ గుర్తించారు. దాంతో వెంటనే వారు ప్రయాణం ప్రారంభించిన న్యూకాజిల్ ఎయిర్పోర్ట్ సిబ్బందికి, ఆస్ట్రేలియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్కు సమాచారం అందించారు. వెంటనే అత్యవసర ల్యాండింగ్కు అనుమతించారు.విమానంలో ల్యాండింగ్గేర్ సమస్య తలెత్తింది కాబట్టి అందులోని ఫ్యుయెల్ అయిపోవాలి. లేదంటే భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. దాంతో దాదాపు మూడు గంటలపాటు గాల్లోనే చక్కర్లు కొట్టాల్సివచ్చింది. చివరకు ఎయిర్క్రాఫ్ట్ సురక్షితంగా ల్యాండ్ అయినట్లు పోలీసులు తెలిపారు. విమానం కిందకు చేరే సమయానికి అత్యవసర సేవల్లో భాగంగా అగ్నిమాపక యంత్రాలు, అంబులెన్స్ను ఎయిర్పోర్ట్ సిబ్బంది సిద్ధంగా ఉంచారు. విమానంలో కొన్ని సాంకేతిక సమస్యల వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని ప్రాథమికంగా ధ్రువీకరించారు. ఈ ఎయిర్క్రాఫ్ట్ పోర్ట్ మాక్వారీకి చెందిన ఈస్టర్న్ ఎయిర్ సర్వీసెస్కు చెందింది. ఈ ఘటనకు సంబంధించి కంపెనీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిసింది. -
బెంగళూరులో భారీ వర్షం.. 17 విమానాలు దారి మళ్లింపు
బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం కురిసిన వర్షం కారణంగా 17 విమానాలను దారి మళ్లించారు. ప్రయాణికులు తదుపరి సర్వీసులకు సంబంధించిన వివరాలను విమానయాన సంస్థల ద్వారా తెలుసుకోవాలని ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి.బెంగళూరులో గురువారం కురిసిన భారీ వర్షానికి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2(టీ2) వద్ద భారీగా నీరు చేరింది. టీ2 లగేజీ తీసుకునే ప్రాంతం సమీపంలో పైకప్పు నుంచి నీరు లీకవ్వడం గుర్తించారు. క్షణాల్లో వర్షం పెరగడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ వెంటనే స్పందించి చర్యలు చేపట్టింది.భారీ వర్షాల కారణంగా బెంగళూరుకు రావాల్సిన విమానాలను చెన్నైకి మళ్లించారు. మొత్తం 13 దేశీయ విమానాలు, మూడు అంతర్జాతీయ ప్యాసింజర్ విమానాలు, ఒక అంతర్జాతీయ కార్గో విమానాన్ని దారి మళ్లించారు. బలమైన గాలుల కారణంగా రాత్రి 9:35 నుంచి 10:30 గంటల వరకు విమానాల ల్యాండింగ్ వీలుకాలేదని ఎయిర్పోర్ట్ ప్రతినిధి ఒకరు మీడియాతో తెలిపారు. ప్రయాణికులు తదుపరి సర్వీసులకు సంబంధించి విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించారు.ఇదీ చదవండి: గోల్డ్ఫైనాన్స్ తీసుకుంటే రూ.20వేలే ఇస్తారట! మిగతా డబ్బు..?కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టీ2 టెర్మినల్ నిర్మాణాన్ని రూ.5,000 కోట్లతో 2022లో పూర్తి చేశారు. అందులో జనవరి 15, 2023 నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నారు. టెర్మినల్ ప్రారంభించిన తక్కువ సమయంలోనే ఇలా లీకేజీలు ఏర్పడడంపట్ల ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
దుబాయ్లో అతి పెద్ద విమానాశ్రయం.. ప్రత్యేకతలు ఇవే..
దుబాయ్లో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దుబాయ్లో నిర్మించబోతున్నారు. ఈ మేరకు దుబాయ్ రాజు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటన చేశారు. దీని కోసం 35 బిలియన్ డాలర్లు (రూ.2.9 లక్షల కోట్లు) ఖర్చు చేయనున్నారు.వివరాల ప్రకారం.. దుబాయ్లో ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం నిర్మించచోతున్నారు. ఈ విషయాన్ని దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోమ్ ఆదివారం ప్రకటించారు. ఈ విమానాశ్రయం పేరును అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పిలవనున్నట్లు ఆయన తెలిపారు. ఇది ఈ విమానాశ్రయాం నిర్మించడానికి 35 బిలియన్ డాలర్లు (రూ.2.9 లక్షల కోట్లు) ఖర్చు చేయనున్నారు. ఏడాదికి 260 మిలియన్ల మంది రాకపోకలు కొనసాగించేలా ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.ఒక్క ఏడాదిలో దాదాపు 260 మిలియన్ల మంది ప్రయాణీకులు ఈ ఎయిర్పోర్టు ద్వారా ప్రయాణాలు కొనసాగించవచ్చన్నారు. ఈ విమానాశ్రయంలో ఐదు సమాంతర రన్వేలు, 400 ఎయిర్క్రాఫ్ట్ గేట్స్ దీని ప్రత్యేకతలుగా చెప్పారు. కాగా, అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రస్తుత దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంటే ఐదు రెట్లు పెద్దదిగా ఉంటుంది. రాబోయే సంవత్సరాల్లో దుబాయ్ ఎయిర్పోర్టు నుండి అన్ని కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. Today, we approved the designs for the new passenger terminals at Al Maktoum International Airport, and commencing construction of the building at a cost of AED 128 billion as part of Dubai Aviation Corporation's strategy.Al Maktoum International Airport will enjoy the… pic.twitter.com/oG973DGRYX— HH Sheikh Mohammed (@HHShkMohd) April 28, 2024 ఇక, ఈ ఎయిర్పోర్టు ఫ్లాగ్షిప్ క్యారియర్ ఎమిరేట్స్, లోబడ్జెట్ విమానయాన సంస్థ ఫ్లైదుబాయ్తో పాటు ప్రపంచాన్ని దుబాయ్కి, బయటికి కనెక్ట్ చేసే అన్ని ఎయిర్లైన్ భాగస్వాములకు కొత్త డెస్టినేషన్ కానుందని దుబాయ్ ప్రభుత్వ ఎయిర్లైన్ ఎమిరేట్స్ చైర్మన్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్-మక్తూమ్ వెల్లడించారు. ఈ నిర్మాణం ప్రపంచ వేదికపై ప్రముఖ ఏవియేషన్ హబ్గా దుబాయ్ స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుందని దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సీఈఓ పాల్ గ్రిఫిత్స్ తెలిపారు. -
శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ప్రతిష్టాత్మక అవార్డు
జర్మనీకి చెందిన స్కైట్రాక్స్ ఏటా ఇచ్చే ‘బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా అండ్ దక్షిణాసియా 2024’ అవార్డు ఈ ఏడాదికిగాను శంషాబాద్ ఎయిర్పోర్ట్ను వరించింది. బుధవారం జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో జరిగిన ప్యాసింజర్ టర్మినల్ ఎక్స్పో-2024లో ఈమేరకు ప్రకటన వెలువడినట్లు రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(ఆర్జీఐఏ) సీఈవో ప్రదీప్ పణికర్ తెలిపారు. విమానాశ్రయంలో పనిచేసే ఉద్యోగుల పనితీరు, స్నేహ పూర్వకంగా ఉండే విధానం, సమర్థత, సిబ్బంది చురుకుగా వ్యవహరించడం, సమాచార కౌంటర్లు, ఇమ్మిగ్రేషన్, భద్రతా అధికారులు, సెక్యూరిటీ స్టాఫ్, షాప్స్, ఫుడ్ అండ్ బేవరేజస్ అవుట్లెట్లలో స్టాఫ్ పనితీరు మెరుగ్గావుండటం వంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డుకు ఎంపికచేస్తారు. ఇదీ చదవండి: యువ ఓటర్లకు అదిరిపోయే ఆఫర్.. భారీ రాయితీ ప్రకటించిన సంస్థ జీఎంఆర్ ఎయిర్పోర్ట్కు గతేడాది స్కైట్రాక్స్ ఫోర్స్టార్ రేటింగ్ను ఇచ్చింది. ఈఏడాది ఏకంగా ప్రముఖ అవార్డుకు ఎంపిక చేయడంపట్ల ఎయిర్పోర్ట్ వర్గాలు హర్షం వ్యక్తంచేశాయి. గత నెలలో హైదరాబాద్ విమానాశ్రయం న్యూదిల్లీలో యాక్రెక్స్(ACREX) హాల్ ఆఫ్ ఫేమ్ జాతీయ స్థాయి అవార్డును గెలుచుకుంది. -
యూట్యూబర్ ఓవర్ యాక్షన్.. దిమ్మతిరిగే షాక్!
సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ఓవర్ యాక్షన్ చేస్తే అది మన మెడకే చుట్టుకుంటుంది. ఛానల్ ఉంది కదా అనో, చేతిలో కెమెరా ఉంది కదా అనో విచక్షణ మరిచి ప్రవర్తించకూడదు. ఇది తెలియక చాలామంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ప్లూయెన్సర్లు ఫేక్వార్తలు, సమాచారంతో గప్పాలు కొడుతుంటారు. తాజాగా పబ్లిసిటీ కోసం నిషిద్ధ ప్రాంతంలోకి ఉద్దేశపూర్వకంగా ఎంటరైన ఒక యూట్యూబర్కి దిమ్మతిరిగే షాక్ తగిలింది. విషయం ఏమిటంటే.. బెంగళూరులోని యలహంకకు చెందిన వికాస్ గౌడ (23) అడ్డంగా బుక్కయ్యాడు. ఏప్రిల్ 7వ తేదీన మధ్యాహ్నం 12 గంటల సమయంలో చెన్నైకి వెళ్లే ఎయిరిండియా విమానం టిక్కెట్ బుక్ చేసుకున్నాడు. భద్రతా తనిఖీల అనంతరం విమానాశ్రయంలోకి ప్రవేశించాడు. ఇక్కడి దాకా బాగానే వుంది. విమానం ఎక్కకుండా, విమానాశ్రయ ఆవరణలోనే తిరుగుతూ వీడియో కంటెంట్ను రికార్డ్ చేశాడు. ఇక్కడితో సరిపెట్టినా బావుండేది. ఎయిర్పోర్ట్లో రోజంతా బస చేసా.. అయినా తనని ఎవరూ పట్టించుకోలేదంటూ ప్రగల్భాలు పలుకుతూ ఏప్రిల్ 12న ఒక వీడియో తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాడు. విమానాశ్రయంలో మొత్తం తిరిగినా తనను ఎవరూ పట్టుకోలేదంటూ, ఎయిర్పోర్ట్ భద్రత గురించి నెగెటివ్ కామెంట్ చేశాడు. అంతా అయ్యాక డ్యామేజ్ కంట్రోల్లో పడ్డాడు. ఆ ఎయిర్పోర్ట్ వీడియోను తన ఛానెల్ నుండి తీసివేశాడు. కానీ అది కాస్తా చేరాల్సిన వారి దృష్టికి అప్పటికే చేరిపోయింది. కట్ చేస్తే.. విషయం తెలుసుకున్న ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ వింగ్ సీఐఎస్ఎఫ్ వికాస్పై ఫిర్యాదు చేసింది. దీంతో అతణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్లు 505, 448 కింద కేసు కూడా నమోదు చేశారు. తన ఫ్లైట్ మిస్సయ్యానని పేర్కొంటూ, సుమారు ఆరు గంటలపాటు విమానాశ్రయంలో తిరిగాడని, కానీ అతను చెప్పినట్టుగా 24 గంటలు కాదని తన విచారణలో తేలిందని భద్రతా అధికారులు వెల్లడించారు. అతని మొబైల్ ఫోన్నుస్వాధీనం చేసుకున్నారు. ఎట్టకేలకు తను చేసింది తప్పేనని అంగీకరించాడు. ప్రచారంకోసం అలా చేశానంటూ లెంపలేసుకున్నాడు. మొత్తం మీద గౌడకు బెయిల్ మంజూరు కావడంతో బతుకు జీవుడా అంటూ బయటపడ్డాడు. -
Dubai Floods: భారీ వర్షాల ఎఫెక్ట్.. 28 విమానాల రద్దు
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన దుబాయ్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం కురిసిన కుండపోత వర్షాలతో నగరం అల్లకల్లోలంగా మారింది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయంగా మారాయి. నివాస స్థలాలు, రోడ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు.. ఇలా ప్రతి చోట వరద బీభత్సం సృష్టించింది. ఆ దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద కుంభవృష్టి అని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. వరద నీరు భారీగా చేరడంతో రోడ్లపై కార్లు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి. కార్లు సగం నీటితో మునిగిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో వరద చేరి విమానాలరాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రన్వేపై మోకాలిలోతు నీరు ఉండటంతో ఇక్కడికి వచ్చే విమానాలనుని దారిమళ్లిస్తున్నారు. వర్షాల కారణంగా దుబాయ్ నుంచి వచ్చేవి, వేళ్లే విమానాలు మిఒత్తం 500కి పైగా రద్దయ్యాయి. మరికొన్నింటిని దారి మళ్లీంచారు. అత్యవసరమైతే తప్ప విమానాశ్రయానికి రావద్దని ప్రయాణికులను అధికారులు హెచ్చరించారు కఠిన సవాళ్లను ఎదుర్కొంటూ వీలైనంత త్వరగా ఎయిర్పోర్టులో కార్యకలాపాలను పునరుద్ధరించడానికి తాము ప్రయత్నిస్తున్నట్లు దుబాయ్ విమానాశ్రయ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. భారత్-దుబాయ్ మధ్య 28 విమానాలు రద్దయ్యాయి. ఈ మేరకు భార పౌర విమానాయనశాఖ తెలిపింది.వీటిలో భారత్ నుంచి దుబాయ్ వెళ్లేవి 15 కాగా, అక్కడి నుంచి వచ్చే 13 విమానాలను రద్దు చేసినట్లు తెలిపారు. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని వెల్లడించారు. దీనిపై ఎప్పటికప్పుడు ప్రయాణికులకు సమాచారం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. -
ప్రపంచంలోని రద్దీ ఎయిర్పోర్ట్ల్లో భారత విమానాశ్రయం
దిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్(దిల్లీ విమానాశ్రయం) 2023లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత రద్దీగా ఉండే టాప్ 10 ఎయిర్పోర్ట్ల్లో ఒకటిగా నిలిచింది. ఈ జాబితాలో అమెరికాలోని హార్ట్స్ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటిస్థానం దక్కించుకుంది. దుబాయ్, డాలస్ విమానాశ్రయాలు తర్వాతిస్థానాల్లో ఉన్నాయని ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) వరల్డ్ తెలిపింది. దిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి 2023లో 7.22 కోట్ల మంది ప్రయాణించారు. 2022లో రద్దీ పరంగా ఈ విమానాశ్రయం అంతర్జాతీయంగా 9వ స్థానంలో ఉంది. అయితే 2023లో మాత్రం 10స్థానానికి చేరింది. మొదటిస్థానంలోని హార్ట్స్ఫీల్డ్-జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా 2023లో 10.46 కోట్ల మంది ప్రయాణించారు. రెండో స్థానంలో నిలిచిన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 8.69 కోట్లు, మూడో స్థానంలో ఉన్న డాలస్ ఫోర్త్ వర్త్ అంతర్జాతీయ విమాన్రాశయం నుంచి 8.17 కోట్ల మంది తమ గమ్యస్థానాలకు ప్రయాణించారు. ప్రపంచంలోనే పది అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఐదు అమెరికాలోనే ఉండడం విశేషం. 2023లో అంతర్జాతీయంగా ప్రయాణించిన మొత్తం ప్రయాణికుల సంఖ్య సుమారు 850 కోట్లుగా ఉందని ఏసీఐ పేర్కొంది. 2022తో పోలిస్తే 27.2% వృద్ధి కనిపిస్తుందని తెలిపింది. ఇదీ చదవండి: ‘తప్పు చేశాం.. మళ్లీ చేస్తాం..10వేల డాలర్లు ఇస్తాం..’ ప్రపంచంలోనే రద్దీ ఎయిర్పోర్ట్లు వరుసగా.. హార్ట్స్ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం డాలస్ ఫోర్త్ వర్త్ అంతర్జాతీయ విమాన్రాశయం లండన్ హీత్రో విమానాశ్రయం టోక్యో హానెడా డెన్వర్ విమానాశ్రయం ఇస్తాంబుల్ విమానాశ్రయం లాస్ ఏంజెలిస్ అంతర్జాతీయ విమానాశ్రయం షికాగో ఓహేర్ అంతర్జాతీయ విమానాశ్రయం దిల్లీ ఎయిర్పోర్ట్ -
Viral: ఎయిర్పోర్టు బ్యాగేజ్ బెల్టుపై యువతి రీల్.. వీడియో వైరల్
న్యూఢిల్లీ: ఇప్పటివరకు మెట్రో రైళ్లలో రీల్లు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ట్రెండ్ ప్రస్తుతం ఎయిర్పోర్టులకు కూడా పాకింది. ఓ యువతి ఎయిర్పోర్టులోని బ్యాగేజ్ కన్వేయర్ బెల్టుపై పడుకొని కొద్దిసేపు బెల్టుతో పాటు వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. యువతి ఈ ఫీట్ చేస్తుండగా బ్యాక్గ్రౌండ్లో హిందీ సినిమా సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. ఈ వీడియోను ఎక్స్(ట్విటర్)లో దేసీ మోజిటో అనే హ్యాండిల్లో పోస్టు చేసినప్పటి నుంచి ఏకంగా 32 లక్షల వ్యూస్ రావడం విశేషం. అయితే ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతూ కామెంట్లు పెడుతున్నారు. రీల్ల వైరస్ ఎయిర్పోర్టులను కూడా చేరింది అని ఓ నెటిజన్ పోస్టు చేశాడు. మరికొందరైతే ఏకంగా ఆ యువతిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎయిర్పోర్టులో బ్యాగేజ్ బెల్ట్ అంత చెత్త ప్రదేశం ఇంకొకటి ఉండదని, దానిపై ఎలా దొర్లుతారని మరో నెటిజన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కాగా, ఇటీవలే ఢిల్లీ మెట్రోలో రీల్స్ చేసిన మహిళలపై మెట్రో రైలు యాజమాన్య సంస్థ న్యాయపరమైన చర్యలు కూడా ప్రారంభించింది. The virus has reached the airports too 🤡🤡 pic.twitter.com/RdFReWtWjH — desi mojito 🇮🇳 (@desimojito) March 29, 2024 ఇదీ చదవండి.. ప్రజల గొంతునవుతా.. కంగనా రనౌత్ -
శంషాబాద్ ఎయిర్పోర్ట్కు జాతీయ పురస్కారం
శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం జాతీయ పురస్కారం దక్కించుకుంది. ఈ మేరకు ఎయిర్పోర్ట్ అధికారులు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల దిల్లీలో నిర్వహించిన కాలుష్య రహిత వాణిజ్య భవన విభాగ పోటీల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు యాక్రెక్స్ హాల్ ఆఫ్ ఫేమ్ జాతీయ పురస్కారం దక్కింది. దీన్ని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(జీహెచ్ఐఏఎల్) ప్రతినిధులు అందుకున్నారు. ఇదీ చదవండి: మెరైన్ రోబో తయారుచేసిన ఐఐటీ పరిశోధకులు.. ఉపయోగాలివే.. 2030 నాటికి కర్బన ఉద్గారాల రహిత విమానాశ్రయంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు జీహెచ్ఐఏఎల్ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటి వరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయిదుసార్లు నేషనల్ ఎనర్జీ లీడర్, తొమ్మిది సార్లు ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫీషియెన్సీ యూనిట్, ఆరు సార్లు ఏసీఐ గ్రీన్ ఎయిర్పోర్ట్ పురస్కారాలు వరించాయని తెలిపారు. -
ఎయిర్పోర్టు భద్రతా వలయాన్ని దాటి.. టిక్కెట్ లేకుండా ఫ్లైట్ ఎక్కి..
అమెరికాలోని ఓ మహిళ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ కన్నుగప్పి టిక్కెట్ లేకుండా ఫ్లైట్ ఎక్కింది. ఈ నెల ప్రారంభంలో నాష్విల్లే విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ మహిళ ప్రతీ సెక్యూరిటీ చెక్పాయింట్ను దాటుకుని, బోర్డింగ్ పాస్, గుర్తింపు కార్డు లేకుండా లాస్ ఏంజెల్స్కు వెళ్లేందుకు అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో ఎక్కింది. ‘న్యూయార్క్ పోస్ట్’ అందించిన వివరాల ప్రకారం ఆ మహిళా ప్రయాణికురాలు నాష్విల్లే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని ట్రాన్స్పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (టీఎస్ఏ) స్క్రీనింగ్ లైన్లోని మానవరహిత ప్రాంతంలో అడ్డంకిని దాటారు. ఇక్కడ ప్రయాణీకులు తమ గుర్తింపును చూపించవలసి ఉంటుంది. దీనిపై విమానాశ్రయ అధికారులు విచారణ ప్రారంభించారు. ఫిబ్రవరి 7న నాష్విల్లే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ చెక్పాయింట్లో ఆ ప్రయాణికురాలితో పాటు ఆమె క్యారీ ఆన్ బ్యాగేజీని ఫ్లైట్ ఎక్కే ముందు చెక్ చేసినట్లు నిర్ధారణ అయ్యింది. అమెరికన్ ఎయిర్లైన్స్ ఈ ఉదంతంలో తమ పొరపాటును అంగీకరించింది. ఐదు గంటల తరువాత ఆమె టిక్కెట్ లేకుండా ప్రయాణించినట్లు గుర్తించింది. అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్- 1393 ఫిబ్రవరి 7న లాస్ ఏంజిల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చేరుకున్న వెంటనే ఆ మహిళా ప్రయాణీకురాలిని ఎఫ్బీఐ అదుపులోకి తీసుకుని, విచారణ మొదలుపెట్టింది. ఆమెపై ఇంకా కేసు నమోదు కాలేదని, విచారణ కొనసాగుతోందని ఏజెన్సీ తెలిపింది. -
జైపూర్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు..
రాజస్థాన్లోని జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడంతో భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై, విమానాశ్రయాన్నంతా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువు లభ్యంకాలేదు. రెండు గంటల తనిఖీ అనంతరం విమానాశ్రయ ప్రాంగణంలో అభ్యంతరకర వస్తువేదీ కనిపించకపోవడంతో భద్రతా సంస్థలు ఊపిరి పీల్చుకున్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం జైపూర్ ఎయిర్పోర్ట్ అధికారిక ఐడీకి ‘డాన్ ఆఫ్ ఇండియా’ అనే ఐడీ నుండి శుక్రవారం ఈ-మెయిల్లో బెదిరింపు వచ్చింది. వెంటనే విమానాశ్రయ భద్రతా సిబ్బందితో పాటు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్(బీడీఎస్) తనిఖీలు చేపట్టింది. ఈ బెదిరింపు మెయిల్ గురించి ఎయిర్పోర్ట్ ఎస్హెచ్ఓ మమతా మీనా మాట్లాడుతూ, విమానాశ్రయాన్ని పేల్చివేస్తామని బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులకు ఈ సమాచారం అందించామన్నారు. ఈ నేపధ్యంలో బీడీఎస్, సీఐఎస్ఎఫ్, డాగ్ స్క్వాడ్ బృందం విమానాశ్రయంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. సుమారు 2 గంటల పాటు జరిగిన సెర్చ్ ఆపరేషన్లో ఎయిర్పోర్టులో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. ఇంతకు ముందు డిసెంబర్ 27న జైపూర్ సహా పలు విమానాశ్రయాలపై బాంబులు వేస్తామని బెదిరింపులు వచ్చాయి. అయితే తనిఖీలలో ఎటువంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదు. -
జైపూర్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు
జైపూర్: రాజస్థాన్ రాజధాని నగరం జైపూర్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు శుక్రవారం బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ విషయాన్ని ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్ పోలీస్ ఇన్స్పెక్టర్ ధృవీకరించారు. ఎయిర్పోర్టు అధికారిక మెయిల్కు బెదిరింపు రావడంతో అప్రమత్తమైనట్లు చెప్పారు. బెదిరింపు మెయిల్ వచ్చిన వెంటనే ఎయిర్పోర్టు మొత్తం సీఐఎస్ఎఫ్ బలగాలు బాంబు, డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టాయని, ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదని పోలీసులు తెలిపారు. మెయిల్ ఎక్కడినుంచి వచ్చిందనేదానిపై సైబర్సెల్ దర్యాప్తు చేస్తోందని చెప్పారు. ఇదీ చదవండి.. కేజ్రీవాల్కు గుజరాత్ హైకోర్టు షాక్ -
ఉత్తరాఖండ్కు మూడు ఎయిర్ పోర్టులు, 21 హెలీప్యాడ్లు!
ఉత్తరాఖండ్ ఎయిర్ కనెక్టివిటీ కొత్త రెక్కలను సంతరించుకోబోతోంది. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉత్తరాఖండ్లోని విమానాశ్రయాల సంఖ్యను ఒకటి నుండి మూడుకు, హెలిప్యాడ్ల సంఖ్యను 10 నుండి 21కి పెంచే ప్రణాళికపై కసరత్తు చేస్తోంది. డెహ్రాడూన్ ఎయిర్పోర్టు విస్తరణ, మొదటి దశ కింద హెలిపోర్టుల నిర్వహణ పనులు పూర్తయ్యాయి. రెండో దశలో ఎయిర్పోర్టులు, హెలిపోర్టుల పనులు త్వరలో పూర్తి కానున్నాయి. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో గల ఏకైక జాలీ గ్రాంట్ విమానాశ్రయం నుంచి 2024లో రోజువారీ విమాన సర్వీసులను ప్రారంభించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. గతంలో డెహ్రాడూన్ విమానాశ్రయానికి దేశంలోని మూడు నగరాలతో మాత్రమే కనెక్టివిటీ ఉండేది. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ దాదాపు నాలుగున్నర రెట్లు పెరిగింది. ప్రస్తుతం డెహ్రాడూన్ విమానాశ్రయ ఎయిర్ కనెక్టివిటీ దేశంలోని మూడు నగరాల నుండి 13 నగరాలకు చేరింది. 2014 వరకు ఈ విమానాశ్రయం నుండి 40 విమానాలు మాత్రమే నడిచేవి. 2024 చివరి నాటికి ఇక్కడి నుంచి రాకపోకలు సాగించే విమానాల సంఖ్య 200కి పెరగనుంది. గత పదేళ్లలో డెహ్రాడూన్ విమానాశ్రయ కార్యకలాపాల్లో దాదాపు 130 శాతం పెరుగుదల నమోదైంది. త్వరలో ఉత్తరాఖండ్లో నూతన హెలిపోర్ట్లతో పాటు నూతన విమానాశ్రయాలు రానున్నాయి. డెహ్రాడూన్తో పాటు ఉత్తరాఖండ్లోని పంత్నగర్, పితోర్గఢ్లలో విమానాశ్రయాల ఏర్పాటుకు విమానయాన మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తున్నదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. మరోవైపు ఉత్తరాఖండ్లో ఏడు హెలిపోర్ట్లు ప్రారంభమయ్యాయి. వీటిలో అల్మోరా, చిన్యాలిసౌర్, గౌచర్, సహస్త్రధార, న్యూ తెహ్రీ, శ్రీనగర్, హల్ద్వానీ మొదలైనవి ఉన్నాయి. ధార్చుల, హరిద్వార్, జోషిమా, ముస్సోరీ, నైనిటాల్, రామ్నగర్లో కొత్త హెలిపోర్ట్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఉత్తరాఖండ్లో ఒక విమానాశ్రయం, ఏడు హెలిపోర్టులను ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. బాగేశ్వర్, చంపావత్, లాన్స్డౌన్, మున్సియరి, త్రియుగినారాయణ్లలో ఐదు కొత్త హెలిపోర్ట్లను ప్రారంభించే ప్రణాళిక సిద్ధంగా ఉంది. మరికొద్ది రోజుల్లో ఉత్తరాఖండ్లో విమానాశ్రయాల సంఖ్య మూడుకు, హెలిపోర్టుల సంఖ్య 21కి చేరనుంది. -
దిల్ రాజు ఇంట పెళ్లి సందడి.. ఫ్యామిలీతో బయలుదేరిన నిర్మాత!
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. దిల్ రాజు తమ్ముడు కొడుకు, టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ రెడ్డి వివాహా వేడుకకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులను ప్రత్యేకంగా ఆహ్వానాలు అందించారు. ఈనెల 14న జైపూర్లో డెస్టినేషన్ వెడ్డింగ్ గ్రాండ్గా జరగనుంది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు సైతం పూర్తయ్యాయి. తాజాగా వివాహా వేడుక కోసం దిల్ రాజు ఫ్యామిలీ బయలుదేరి వెళ్లారు. జైపూర్ వెళ్తూ తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా.. దిల్ రాజు మేనల్లుడైన ఆశిష్ రెడ్డి గతేడాది డిసెంబర్లోనే నిశ్చితార్థం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యాపారవేత్త కూతురు అద్వైత రెడ్డితో ఆతనికి ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ వేడుక ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. టాలీవుడ్లో రౌడీ బాయ్స్ అనే చిత్రం ద్వారా ఆశిష్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. 2022 జనవరిలో రిలీజైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. ఆశిష్ రెడ్డి ప్రస్తుతం సెల్ఫీష్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ కాశీ దర్శకత్వం వహిస్తున్నారు. #TFNExclusive: Ace Producer #DilRaju & Groom @AshishVOffl along with their family members get papped as they jet off to Jaipur for the grand wedding ceremony!! 📸🤩#Ashish #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/IQllj4yVCU — Telugu FilmNagar (@telugufilmnagar) February 12, 2024 -
వ్యక్తిగత లావాదేవీలతోనే తహసీల్దార్ హత్య
విశాఖ సిటీ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విశాఖకు చెందిన తహసీల్దార్ రమణయ్య హత్య కేసు మిస్టరీ వీడింది. వ్యక్తిగత లావాదేవీలు, భూ వ్యవహారాల కారణంగానే హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. హత్య చేసి విశాఖ నుంచి విమానంలో చెన్నై పారిపోయిన రియల్టర్ మురారి సుబ్రహ్మణ్యం గంగారావును సోమవారం అరెస్టు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ తెలిపారు. తహసీల్దార్ సనపల రమణయ్యను గత శుక్రవారం రాత్రి హత్య చేసిన మురారి సుబ్రహ్మణ్యం గంగారావు శనివారం ఉదయం వరకు విశాఖలోనే ఉన్నాడు. తరువాత విశాఖ నుంచి బెంగళూరు మీదుగా చెన్నైకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన టికెట్ బుక్ చేసుకున్నాడు. మధ్యాహ్నం 3.30 గంటలకు విమాన సమయం అయినప్పటికీ.. ఉదయం 9.30 గంటలకే విమానాశ్రయం లోపలకు వెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఇదిలా ఉంటే గంగారావే తహసీల్దార్ను హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు అతని మొబైల్ ఆధారంగా చెన్నైకు టికెట్ బుక్ చేసుకున్నట్లు ముందుగానే గుర్తించారు. దాని ప్రకారం మధ్యాహ్నం ఎయిర్పోర్ట్లో సుబ్రహ్మణ్యం పేరుతో విచారించారు. ఆ పేరుతో ప్రయాణికులు ఎవరూ లేరని ఎయిర్పోర్ట్ అధికారులు చెప్పడంతో పోలీసులు వెనక్కు వచ్చేశారు. అప్పటికి విమానాశ్రయం సీసీ కెమెరాలను పరిశీలించలేదు. పెద్ద పేరు ఉండడంతో పోలీసులు గానీ, ఎయిర్పోర్ట్ అధికారులు గానీ పూర్తిస్థాయిలో నిందితుడి పేరును గుర్తించలేకపోయారు. దీంతో హంతకుడు విమానం ఎక్కి బెంగళూరు వెళ్లాడు. అయితే అప్పటికే ఎయిర్పోర్టు అధికారులకు సమాచారం ఉండడంతో బెంగళూరులో ఎయిర్హోస్టెస్ మురారీ సుబ్రహ్మణ్యం గంగారావు పేరును అనౌన్స్ చేయడంతో.. అనుమానించిన అతడు బెంగళూరు విమానాశ్రయంలోనే దిగిపోయాడు. బస్సులో చెన్నైకు.. బెంగళూరు నుంచి గంగారావు బస్సులో చెన్నైకు బయలు దేరాడు. హంతకుడిని పట్టుకునేందుకు చెన్నైకు వెళ్లిన ప్రత్యేక బృందం మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా చెన్నై పోలీసుల సహకారంతో గంగారావును చెంగల్పుట్టు వద్ద అరెస్ట్ చేసింది. అక్కడి నుంచి ట్రాన్సిట్ ద్వారా విశాఖకు తీసుకొచ్చారు. కాగా, హత్య జరగడానికి గల కారణాలపై డీసీపీ– 1 మణికంఠ ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోందని సీపీ రవిశంకర్ తెలిపారు. కన్వెయన్స్ డీడ్స్ విషయంలో జరిగిన వ్యక్తిగత వ్యవహారాల కారణంగానే హత్య చేసినట్లు గంగరావు చెప్పినట్లు తెలిపారు. గంగారావు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని, అతడిపై హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల్లోనూ చీటింగ్ కేసులున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని వివరించారు. -
ఎయిర్పోర్టులో రామస్మరణ
-
స్పెషల్ లుక్లో 'తండేల్' హీరో.. వీడియో వైరల్!
గతేడాది కస్టడీ చిత్రంలో ప్రేక్షకులను అలరించిన హీరో అక్కినేని నాగచైతన్య. సురేశ్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. అయితే ప్రస్తుతం శ్రీకాకుళం బ్యాప్డ్రాప్ స్టోరీతో తెరకెక్కుతోన్న తండేల్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి జోడీగా కనిపించనుంది. చందు మొండేటి దర్శకత్వంలో బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సముద్ర నేపథ్యంలో సాగే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స టీజర్కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో మత్స్యకారుడి పాత్రలో చై కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ ఫిషర్మేన్ బాడీ లాంగ్వేజ్ కోసం మూడు నెలలు కష్టపడ్డానని నాగ చైతన్య వెల్లడించారు. తాజాగా నాగ చైతన్య ఎయిర్పోర్ట్లో కనిపించారు. గడ్డంతో ఉన్న చైతూ ఫుల్ స్టైలిష్ లుక్లో వెళ్తూ కెమెరాలకు చిక్కారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తండేల్ కథేంటంటే.. గతంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొందరు జాలర్లు పొరపాటున పాకిస్థాన్ జలాల్లోకి వెళ్లిపోయారు. దీంతో వాళ్లని కొన్నేళ్ల పాటు పాక్ ప్రభుత్వం జైల్లో నిర్భంధించి చిత్రహింసలు పెట్టింది. ఆ తర్వాత చాన్నాళ్ల తర్వాత స్వదేశానికి తిరిగొస్తాడు. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్తో 'తండేల్' సినిమా తీస్తున్నారు. జాలారి పాత్రలో చైతూ నటిస్తుండగా.. అతడి భార్యగా సాయిపల్లవి నటిస్తోంది. ఏదేమైనా పాన్ ఇండియా లెవల్లో 'తండేల్' మూవీని తెరకెక్కిస్తున్నారు. కాగా.. తండేల్కు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. #TFNExclusive: Thandel Raju aka Yuvasamrat @chay_akkineni gets papped at Hyderabad airport in a fully rugged look!😎🔥#NagaChaitanya #Thandel #TeluguFilmNagar pic.twitter.com/GSdYBHreq0 — Telugu FilmNagar (@telugufilmnagar) February 2, 2024 -
విశాఖ నుంచి బ్యాంకాక్, కౌలాలంపూర్కు నేరుగా విమానాలు
విశాఖపట్నం: విశాఖ నుంచి బ్యాంకాక్, కౌలాలంపూర్ కు ఏప్రిల్ నుంచి ఎయిరేషియా విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 9 నుంచి విశాఖ-బ్యాంకాక్ విమాన సర్వీసులు మొదలవుతాయి. ఏప్రిల్ 26 నుంచి విశాఖ-కౌలాలంపూర్ కు విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఏప్రిల్ 9 నుంచి విశాఖ-హైదరాబాద్ మధ్య మరో ఎయిరిండియా సర్వీసు నడవనుంది. మే, జూన్ లో విశాఖ-దుబాయ్ మధ్య మరో ఎయిరిండియా సర్వీసు మొదలవుతుంది. ఈ నేపథ్యంలో విశాఖ ఎయిర్పోర్ట్ రన్వే నవీకరణ పనులు మార్చి 31 నాటికి పూర్తికానున్నాయి. ఏప్రిల్ నుంచి పూర్తిస్థాయిలో విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయి. ఇదీ చదవండి: Union Budget 2024-25: తెలుగు రాష్ట్రాలకు రైల్వే కేటాయింపులు ఇవే.. -
కర్నూలులో పైలట్ల శిక్షణ కేంద్రం
కర్నూలు విమానాశ్రయంలో పైలట్ల శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. ఇప్పటికే అయిదారు సంస్థలు ఆసక్తి కనబరిచాయని ఏపీ ప్రభుత్వ ఏవియేషన్ సలహాదారు, ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ వి.ఎన్.భరత్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. టెండర్లకు జనవరి 31 వరకు గడువు ఉందని ఆయన పేర్కొన్నారు. ఇది కార్యరూపం దాలిస్తే ఏటా 40–50 మంది శిక్షణ తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. గడువు కంటే ఆరు నెలల ముందే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. 2025 మే నాటికి ఇది సిద్ధం అవుతుందని వెల్లడించారు. తొలి దశలో ఏటా 60 లక్షల మంది, తుది దశ పూర్తి అయ్యే నాటికి ఏటా 4 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా విమానాశ్రయాన్ని నిరి్మస్తున్నట్టు వివరించారు. భోగాపురం విమానాశ్రయాన్ని పీపీపీ విధానంలో జీఎంఆర్ నిరి్మస్తోంది. 2,200ల ఎకరాలకుపైగా విస్తీర్ణంలో సుమారు రూ.5,000 కోట్లు వ్యయం అవుతోందని భరత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ఎయిర్పోర్టులను అనుసంధానిస్తూ కొత్త రూట్లలో సర్వీసులను అందించాల్సిందిగా కోరుతూ పలు విమానయాన సంస్థలతో ఇటీవల చర్చలు జరిపామని చెప్పారు. -
ఇలా కాదే వీళ్లు ఉండాల్సింది!
బ్రిటన్ భిన్నమైన దేశం. బ్రిటన్ దేశస్థులు విలక్షణమైనవారు. ఎవరి వ్యక్తిగత జీవితాలలోకీ తొంగిచూడరు. నిత్య జీవిత భౌతిక సంభాషణలలో అంత ర్లయగా ఉన్న హాస్యాన్ని చక్కగా పట్టుకోగలరు. విధి నిర్వహణలలో ఘటనాఘట సమర్థులు. మర్యాద ఇవ్వడంలో మన రామన్నలను మించినవారు. ఎంతటి విపత్తుకైనా ముందస్తుగా సిద్ధమై ఉండేవారు. పరదేశీ అతిథులను గౌరవించి, ఆదరించేవారు. తలవని తలంపుగానైనా తమ దేశానికి అప్రతిష్ఠను తీసుకురాని వారు. అంతటి ఉత్కృష్ట ప్రజల పైన, అంతటి నాగరిక దేశం మీద గత డిసెంబరు 23న హీత్రో విమానాశ్రయంలోని మూడవ నంబరు టెర్మినల్ పూర్తి విరుద్ధమైన నీడల్ని ప్రసరింపజేసింది! ‘ఇలా కాదే వీళ్లు ఉండాల్సింది’ అన్న భావనను ఆనాటి ప్రయాణికులకు కలిగించింది. ఇక్కడి నా వ్యాసాల సరళిని బాగా ఎరిగి వున్న వారికి ఆ వ్యాసాలలో తరచు నేను బ్రిటన్ దేశాన్ని, బ్రిటన్ దేశస్థులను ఆకాశానికి ఎత్తేసినంతగా వెన కేసుకు రావటమన్నది గ్రహింపునకు వచ్చే ఉంటుంది. బ్రిటన్ దేశస్థుల గుండె ధైర్యాన్ని నేను ఇష్టపడతాను. వ్యక్తుల జీవితాలలోని గోప్యతను గౌరవించి, వారి ఆంతరంగిక విషయాలలోకి చొరబడకుండా ఉండే ఆ స్వభావాన్ని ప్రశంసిస్తాను. అంతేకాదు, ప్రపంచంలోనే బ్రిటిషరస్ గొప్ప హాస్యచతురత ఉన్నవారనీ దృఢంగా విశ్వసిస్తాను. ఇది చాలా వరకు ఉద్దేశపూర్వకమైన అతిశయోక్తి, తేలికపాటి వ్యంగ్యోక్తి, పైనుంచి కిందివరకు కూడా నర్మగర్భ విమర్శ. ఇదంతా ఎక్కువగా బ్రిటన్ రాచకుటుంబం పైన! ఈ క్రమంలో వారి అసహజ ప్రవర్తనల్ని అభినందించడం, వారి అసాధారణతల్లోని అవకరాలను కనుకొనల్లోంచి చూసీచూడనట్లుగా వదిలేయడం, వారు మాటిమాటికీ చేస్తుండే తప్పులను మన్నించడం వంటి మనో నైపుణ్యాలను నేను పెంపొందించుకున్నాను. కానీ డిసెంబర్ 23 సాయంత్రం హీత్రో విమానాశ్రయంలోని 3వ టెర్మినల్లో ఏదైతే జరిగిందో అది మాత్రం క్షమించలేనిది. నిజానికి క్షమించ తగనిది. మరోమాటకు ఆస్కారం లేకుండా అదొక వాదన లకు తావులేని అసమర్థతకు నిదర్శనం. బ్రిటన్ను సందర్శించే వ్యక్తుల పట్ల నమ్మశక్యం కానంతటి అమర్యాదకరమైన ధోరణి. బహుశా ఎన్నడూ లేనంతగా పూర్తిస్థాయి ఆత్మాశ్రయ ఓటమి. బ్రిటన్ స్వరూపాన్ని గరిష్ఠ స్థాయిలో ఘోరాతిఘోరంగా వీక్షింపజేసిన ఉదాసీనత. రాత్రి ఎనిమిది గంటలకు విమానం దిగిన ప్రయాణికులు విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ కోసం కిక్కిరిసిపోయి, మందకొడిగా మెలికలు తిరుగుతూ ముందుగు సాగుతూ ఉన్న పొడవాటి వరుసలో రెండున్నర గంటలసేపు విధిలేక వేచి ఉండవలసి వచ్చింది. పాదం నొప్పితో నేను అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో ఇంకా ల్యాండ్ అవుతున్న విమానాల నుంచి కొత్త ప్రయాణికులు మా వరుస లోకి వెనుక నుంచి జమ అవుతుండటం గమనించాను. ఇప్పుడు వరుసలో వేచి ఉండే కాలం బహుశా రెండున్నర నుంచి నాలుగు గంటలు అవుతుందా! ఫస్ట్ క్లాస్, అంతకంటే కాస్త మాత్రమే దిగువ శ్రేణిలో ఉండే క్లబ్ క్లాస్ ప్రయాణికులు కూడా మా క్యూలో ఉన్నారు. వారి కోసం వేరుగా ఏర్పాటై ఉండే ‘ఫాస్ట్ ట్రాక్’ను బ్రిటన్ తొలగించి ఉండటమే అందుకు కారణం. విమానాశ్రయ అధికారులకు ఇదేమైనా పట్టి ఉంటుందా? నిజం ఏమిటంటే, వారిలో ఒక్కరు కూడా విచారం వ్యక్తం చేయటం లేదు. క్షమాపణ కోరటం అటుంచండి, అడిగిన దానికి సమాధానం చెప్పిన వారైనా ఎవరు? ఒకవేళ క్యూలో ఉన్న ప్రయాణికులు బాత్రూమ్కి వెళ్లవలసివస్తే వారి పరిస్థితి ఏమిటన్న కనీస ఆలోచనైనా వారికి వచ్చి ఉంటుందా? నాకు గుర్తున్నంత వరకు క్యూలో ఉన్న వారెవరికీ అదృష్టవశాత్తూ ఆ అవసరం రాలేదు. లేదా, అలాంటి అవసరం వచ్చిన ప్పటికీ వారు క్యూలో తమ స్థానం కోల్పోయి, మరిన్ని అంతులేని గంటలపాటు వేచి ఉండవలసి వస్తుందన్న భయంతో ఆ బాధను అలాగే ఉగ్గబట్టి ఉండాలి. అదింకా క్రిస్మస్కు వచ్చిపోయే వారు ఎక్కువలో ఎక్కువగా ఉండే సమయం. ఆ రద్దీని ముందే ఊహించి, అందుకు సిద్ధంగా కదా అధికా రులు ఉండాలి. పైగా హీత్రో విమానాశ్రయానికి గతంలో ఇలాంటివి చాలినన్ని అనుభవాలు ఉన్నాయి. 2019లో ఈ విమానాశ్రయం ద్వారా దాదాపు 8 కోట్ల 10 లక్షల మంది రాకపోకలు సాగించారు. అయినప్పటికీ 23న సగానికి పైగా ఇమిగ్రేషన్ కౌంటర్లు సిబ్బంది లేకుండా కనిపించాయి. చివరికి ఎట్టకేలకు నా వంతు వచ్చినప్పుడు, క్లియరెన్స్ కోసం నా దగ్గరికి వచ్చిన అధికారి దగ్గర కనీసం పెన్ను కూడా లేదు! పెన్ను కోసం అతడు తన సహ అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పుడు నేను మరికొన్ని ఆవేదనా భరితమైన నిమిషాలను గడుపుతూ అతడి కోసం వేచి ఉండవలసి వచ్చింది. అదృష్టవశాత్తూ నాల్గవ వ్యక్తి దగ్గర అతడికి – మళ్లీ తిరిగి ఇచ్చే షరతుపై – ఒక పెన్ను లభించింది. అప్పటికి మా బ్యాగులు లగేజ్ బెల్టుల నుంచి జారి వచ్చి, తీరూతెన్నూ లేకుండా కలగాపులగంగా పడి పోయాయి. కొన్ని అసలైన చోటులో, మిగతావి చాలా వరకు విసిరివేసినట్లుగా అక్కడికి దూరంగా చెల్లాచెదురైన వాటిలో! వాటి నుంచి నా రెండు బ్యాగుల్ని కనిపెట్టి తీసుకోడానికి మరొక అరగంట! దాదాపు మూడు వందల మంది ప్రయాణికుల బ్యాగులతో అవి కిందా మీదా అయి కేవలం కలిసిపోవడం మాత్రమే కాదు, వాటిని వెతికి పట్టుకోడానికి అవి ఏమాత్రం పడి ఉండే అవకాశం లేని చోట వాటిని కనిపెట్టాల్సి వచ్చింది. ఢిల్లీ నుంచి ముందురోజు రాత్రి బుక్ చేసుకున్న క్యాబ్ డ్రైవర్ నేను హీత్రోలో ల్యాండ్ అయిన వెంటనే నాకు ఫోన్ చేసి, తను విమానాశ్రయ నిష్క్రమణ మార్గం వైపు ఉన్న డబ్లు్య.హెచ్. స్మిత్ కౌంటర్ దగ్గర నా కోసం వేచి ఉన్నానని చెప్పాడు. కానీ నేను అతడిని చేరడానికి మూడు గంటల సమయం పడుతుందని అనుకుని ఉండడు. నా కోసం ఓపికగా వేచి ఉండటం తప్ప అతడికి వేరే దారి లేదు. లేకుంటే హీత్రో బాడుగకు అతడికి డబ్బు రాదు కదా! ఇది ఆమోదయోగ్యం కాదని బ్రిటిష్ ప్రభుత్వానికి గట్టిగా చెప్పా ల్సిన అవసరం ఉన్నందున నేను ఇదంతా నిజాయితీగా రాస్తున్నాను. ఇంతకుమించి వేరే మార్గం లేదు. ఎవరికి నేనీ అనుభవాన్ని చెప్పినా భయపడిపోయారు. కానీ ఇది నాకు మాత్రమే ప్రత్యేకమైన అనుభవం కాదు. ఇలా వేల మందికి, బహుశా పదుల వేల మందికి జరిగి ఉంటుంది. టెర్మినల్ 3లో ఇది సర్వసాధారణం. అయితే ఈ సర్వ సాధారణత్వాన్ని ఒక మామూలు విషయంగా బ్రిటిష్ అధికారులు భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. కనుక ఒక వ్యంగ్య వ్యాఖ్యతో, ఒక విధమైన ప్రతీకారం వంటి సూచనతో ఈ వ్యాసాన్ని నేను ముగిస్తాను. టెర్మినల్ 3లో దిగితే భారతదేశ పాస్పోర్టు కలిగివున్న తన అత్తమామలకు కూడా ఇదే జరుగుతుందని రిషి సునాక్ గ్రహించగలరా... బహుశా ఆయన వాళ్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయిస్తే తప్ప? నా సలహా. ప్రతి భారతీయ విమానాశ్రయంలో ఫాస్ట్ ట్రాక్ను ఉపయోగించకుండా బ్రిటిష్ పౌరులందరినీ నిరోధించాలి. అది నిజంగా జరిగితే హీత్రోలో పరిస్థితులు చాలా త్వరగా మెరుగు పడతాయి. నిజం! నా మాట నమ్మండి! కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
సంక్రాంతి వేకేషన్లో ఐకాన్ స్టార్.. వీడియో వైరల్!
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల ప్రజలు భోగి సంబురాలతో ఈ ఏడాది వేడుకలను ఘనంగా ప్రారంభించారు. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఫెస్టివల్ మూడ్లోకి వెళ్లిపోయారు. అగ్ర సినీ తారలంతా తమకు ఇష్టమైన ప్రాంతాలకు వెళ్లిపోయి పొంగల్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఫెస్టివల్ వెకేషన్కు వెళ్లిపోయారు. రామ్ చరణ్-ఉపాసన, వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వెళ్తూ ఎయిర్పోర్ట్లో కనిపించారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-స్నేహారెడ్డి సైతం బెంగళూరుకు వెళ్లిపోయారు. కుటుంబంతో కలిసి సంక్రాంతి వేడుకల కోసమే బయలుదేరారు. ఎయిర్పోర్ట్లో బన్నీ దంపతులు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప పార్ట్-1 సీక్వెల్గా తెరకెక్కుతోన్న పుష్ప-2లో నటిస్తున్నారు. సుకుమార్ డైరెక్షన్లో రూపొందిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. వీరిద్దరి కాంబోలో పుష్ప బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రంలో నటనకు అల్లు అర్జున్కు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ కూడా అందుకున్నారు. కాగా.. పుష్ప-2 చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 15న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. #TFNExclusive: Icon stAAr @alluarjun along with his wife #AlluSnehaReddy were seen 📸 at HYD airport in stylish & chic looks as they're off to Bangalore for Sankranthi celebrations with family! 😍🔥#AlluArjun #Pushpa2TheRule #TeluguFilmNagar pic.twitter.com/zbj3NHc55j — Telugu FilmNagar (@telugufilmnagar) January 14, 2024 -
కిలాడీ లేడీ గోల్డ్ స్మగ్లింగ్..
-
జెట్ వేగంతో భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు పనులు
-
అయోధ్య ఎయిర్పోర్టుకు భారీ భద్రత
జనవరి 22న అయోధ్యలో నూతన రామాలయ ప్రారంభోత్సవంతో పాటు బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ సందర్భంగా అయోధ్య విమానాశ్రయంలో 150 మంది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) కమాండోలను మోహరించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. అయోధ్య విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించారు. ఈ విమానాశ్రయానికి సీఐఎస్ఎఫ్ రక్షణ కల్పించడంపై గతంలో చర్చలు జరిగాయి. కేంద్ర భద్రత , ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సమీక్షలో ఈ విమానాశ్రయానికి సీఐఎస్ఎఫ్ ప్రొఫెషనల్ సెక్యూరిటీని సిఫార్సు చేశారు. అయోధ్య విమానాశ్రయ సామర్థ్యాన్ని క్రమంగా పెంచుతామని పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల చెప్పారు. మొదటి దశలో 65,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విమానాశ్రయాన్ని విస్తరిస్తున్నారు. ప్రతి గంటకు రెండు నుంచి మూడు విమానాలను నిర్వహించగల సామర్థ్యం దీనికి ఉంటుంది. 2,200 మీటర్ల పొడవున రన్వే నిర్మించేందుకు పనులు జరుగుతున్నాయి. దీంతో ఈ విమానాశ్రయంలో బోయింగ్ 737, ఎయిర్ బస్ 319, 320 విమానాలు ల్యాండ్ అయ్యేందుకు అవకాశం ఉంది. విమానాశ్రయం రెండో దశ అభివృద్ధికి త్వరలో కేబినెట్ నుంచి ఆమోదం తీసుకుంటామని సింధియా తెలిపారు. రెండో దశలో రన్వే పొడవును 2,200 మీటర్ల నుంచి 3,700 మీటర్లకు పెంచనున్నారు. దీని వల్ల రన్వే పొడవు దాదాపు నాలుగు కిలోమీటర్లకు పెరగనుంది. -
మంటల్లో విమానం!
టోక్యో: తీవ్ర భూకంపం ధాటికి పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం చోటుచేసుకోవడంతో పెనువిషాదంలో మునిగిపోయిన జపాన్లో మరో దుర్ఘటన జరిగింది. భూకంప బాధితుల కోసం సహాయక సామగ్రిని చేరవేయాల్సిన విమానం ప్రమాదంలో చిక్కుకొని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. విమానాశ్రయం రన్వేపై ల్యాండ్ అవుతున్న విమానం మరో విమానాన్ని ఢీకొట్టింది. మొదటి విమానంలో ఉన్న 379 మంది క్షేమంగా ప్రాణాలతో బయటపడడంతో ఊరటనిచ్చింది. ఏమాత్రం ఆలస్యం జరిగినా ఊహించని ఉత్పాతమే జరిగేదని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. రాజధాని టోక్యోలోని హనెడా ఎయిర్పోర్టు జపాన్లో అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటి. నూతన సంవత్సరం సెలవుల సందర్భంగా ప్రయాణికుల రాకపోకలతో మంగళవారం మరింత రద్దీగా మారింది. హొక్కైడోలోని షిన్ చిటోస్ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరిన జపాన్ ఎయిర్లైన్స్ విమానం జేఏఎల్–516(ఎయిర్బస్ ఏ–350) హనెడా ఎయిర్పోర్టుకు చేరుకుంది. ఇందులో 12 మంది సిబ్బంది సహా మొత్తం 379 మంది ఉన్నారు. రన్వేపై దిగుతూ కుదుపులకు లోనైంది. రన్వేపై ల్యాండ్ అవుతూ, ఒక పక్కగా నిలిపి ఉన్న జపాన్ తీర రక్షక దళానికి చెందిన విమానం ఎంఏ–722ను అనూహ్యంగా ఢీకొట్టి కొద్దిదూరం దూసుకెళ్లి ఆగిపోయింది. క్షణాల వ్యవధిలోనే జేఏఎల్ విమానం రెక్క భాగంలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన విమాన సిబ్బంది వెంటనే తలుపులు తెరిచి ప్రయాణికులకు బయటకు పంపించారు. మంటలు వేగంగా దూసుకొస్తున్నా లెక్కచేయకుండా ప్రయాణికులంతా బయటకు వచ్చారు. తర్వాత విమానం మొత్తం మంటల్లో చిక్కుకుంది. ఎయిర్పోర్టు ప్రాంగణమంతా పొగతో నిండిపోయింది. అగి్నమాపక సిబ్బంది మంటలను అర్పివేశారు. విమానం నుంచి ప్రయాణికులను భద్రంగా బయటకు పంపించిన అందులోని సిబ్బందిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎలా వ్యవహారించాలన్న దానిపై వారికి శిక్షణ ఇచి్చనట్లు అధికారులు చెప్పారు. ‘సాయం’ అందించకుండానే... ప్రమాదం జరిగిన వెంటనే తీర రక్షక దళం విమానం పైలట్ అక్కడి నుంచి పరారయ్యాడని జపాన్ కోస్ట్గార్డు అధికారులు చెప్పారు. ఈ విమానంలో ఉన్న ఆరుగురు కోస్ట్గార్డు సిబ్బందిలో ఐదుగురు మరణించారని స్థానిక మీడియా వెల్లడించింది. కోస్ట్గార్డు విమానం సహాయక సామగ్రితో జపాన్ పశి్చమ తీరంలోని నిగాటాకు బయలుదేరాల్సి ఉంది. కానీ అక్కడి భూకంప బాధితులకు సామగ్రిని అందించకుండానే ప్రమాదం జరగడం, ఐదుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం ఆవేదన కలిగిస్తోంది. ఊపిరాడక నరకంలా అనిపించింది జేఏఎల్–516 విమానంలో తనకు ఎదురైన భయానక అనుభవాన్ని 17 ఏళ్ల స్వీడి ఆంటోన్ డీబె మీడియాతో పంచుకున్నాడు. తొలుత ఏం జరిగిందో అర్థం కాలేదని, విమానం లోపలంతా దట్టమైన పొగ కమ్ముకుందని, ఊపిరాడక నరకంలా అనిపించిందని చెప్పాడు. సీట్లలో నుంచి కిందపడిపోయామని, ఎవరో ఎమర్జెన్సీ డోర్లు తెరవడంతో ప్రాణాలతో బయటపడ్డామని తెలిపాడు. -
హైదరాబాద్ ఎయిర్పోర్ట్.. టైమ్ అంటే టైమే..!
హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో విమానాల టైమింగ్ బావుందని నివేదిక వెల్లడైంది. నిర్వహణ, పనితీరు, సమయపాలన (ఆన్టైమ్ పర్ఫార్మెన్స్-ఓటీపీ)లో అంతర్జాతీయంగా హైదరాబాద్, బెంగళూరు విమానాశ్రయాలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. 2023లో ఆన్టైమ్ పర్ఫార్మెన్స్ను సమీక్షించిన విమానయాన అనలిటిక్స్ సంస్థ సిరియమ్ రూపొందించిన నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. టాప్-10 విమానాశ్రయాల్లో మన దేశంలోని కోల్కతా విమానాశ్రయం కూడా స్థానం దక్కించుకుంది. టాప్ 1లో అమెరికాకు చెందిన మిన్నేపొలిస్-సెయింట్ పాల్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇది ఓటీపీ అధికంగా 84.44% ఉంది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 84.42% ఓటీపీతో రెండో స్థానం సాధించింది. బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం 84.08% ఓటీపీతో మూడో స్థానంలో నిలిచింది. పెద్ద విమానాశ్రయాల్లోనూ ఈ రెండు స్థానం సాధించాయి. మధ్య స్థాయి విమానాశ్రయాల విభాగంలో కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయం 83.91 శాతం ఓటీపీతో అంతర్జాతీయంగా తొమ్మితో స్థానం దక్కించుకుంది. ఇదీ చదవండి: ఎయిర్పోర్ట్లో మన బ్యాగ్ మనమే చెక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే.. సంస్థల వారీగా.. అంతర్జాతీయంగా దేశంలోని పెద్ద విమానయాన సంస్థ ఇండిగో 82.12% ఓటీపీతో ఎనిమిదో ర్యాంకు సాధించింది. ఆసియా పసిఫిక్ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికాకు చెందిన సఫైర్ 92.36% ఓటీపీతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆసియా పసిఫిక్ విభాగంలో జపాన్కు చెందిన ఆల్ నిప్పాన్ ఎయిర్వేస్ 82.75% ఓటీపీతో అగ్ర స్థానం దక్కించుకుంది. జపాన్ ఎయిర్లైన్స్ (82.58% ఓటీపీ), థాయ్ ఎయిరేషియా (82.52% ఓటీపీ) రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి. విమానం నిర్దేషించిన సమయానికి 15 నిమిషాలు ముందే వస్తే ఆన్టైమ్ షెడ్యూల్ అని సిరియమ్ నివేదిక తెలిపింది. -
టోక్యో ఎయిర్ పోర్ట్ లో రెండు విమానాలు ఢీ
-
ఎయిర్పోర్టులో రెండు విమానాలు ఢీ.. అయిదుగురి మృతి
జపాన్ ఎయిర్పోర్టులో మంగళవారం ఘోర ప్రమాదం సంభవించింది. రాజధాని టోక్యోలోని ఓ ఎయిర్పోర్టు రన్వేపైని విమానంలో అనూహ్యంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అయిదుగురు మృత్యువాతపడ్డారు. వివరాలు.. హోకియాడో నుంచి వస్తున్న జపాన్ ఎయిర్లైన్స్కు చెందిన JAL 516 విమానం ప్రమాదానికి గురైంది. హనెడా ఎయిర్పోర్టులో ల్యాండ్ అవుతుండగా మంటలు వ్యాపించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. దీంతో విమానంలోని 379 ప్రయాణికులు, 12 మంది సిబ్బందిని వెంటనే ఖాళీ చేయించారు. JAL plane on fire at Tokyo Airport pic.twitter.com/EL9s7kVJbi — アトリン ✊🏾 (@phoojux) January 2, 2024 అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇందులో విమానం రన్వేపై దిగుతుండగానే దాని చక్రాల నుంచి మంటలు వెలువడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అనంతరం అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని.. దాదాపు 70 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. JAL plane on fire at Tokyo Airport pic.twitter.com/EL9s7kVJbi— アトリン ✊🏾 (@phoojux) January 2, 2024 ప్రమాదానికి గల స్పష్టమైన కారణం తెలియరాలేదు కానీ.. విమానం ఎయిర్పోర్టులో ల్యాండ్ అవుతుండగా అక్కడే ఉన్న కోస్ట్గార్డ్ విమానాన్ని ఢీ కొనడం వల్లే ఈ ఘటన జరిగినట్లు విమానాశ్రయ అధికారులు జాతీయ మీడియా ఎన్హెచ్కేకు తెలిపారు. ప్రమాద ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. అయితే కోస్ట్గార్డ్ ఎయిర్క్రాఫ్ట్లో మొత్తం ఆరుగురు సిబ్బంది ఉండగా.. వారిలో అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు మాత్రమే సురక్షితంగా బయటకు వచ్చారు. ఈ ఘటన అనంతరం హనెడా విమానాశ్రాయాన్ని పూర్తిగా మూసివేసినట్లు చెప్పారు. -
కొత్త టెర్మినల్ ని ప్రారంభించిన మోదీ
-
కట్టకుండానే కట్టేసినట్టు కలరింగ్
-
ఎయిర్పోర్ట్లో మన బ్యాగ్ మనమే చెక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దాదాపు అన్ని సంస్థలు సాంకేతికతలో వస్తున్న మార్పులకు అనువుగా తమనుతాము నిత్యం అప్గ్రేడ్ చేసుకుంటున్నాయి. నూతన టెక్నాలజీని ప్రవేశపెట్టడంలో ఎల్లప్పుడూ ముందుండే హైదరాబాద్లోని జీఎమ్మార్ అంతర్జాతీయ విమానాశ్రయం మరో ముందడుగు వేసింది. తనిఖీలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా సెల్ఫ్ చెక్ కియోస్క్, సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికులు టర్మినల్లోకి ప్రవేశించడానికి ముందే తనిఖీలు చేయడం, బ్యాగేజీ చెక్ ఇన్, బోర్డింగ్ పాస్ల జారీ వరకు అన్ని సదుపాయాలను ఒకేచోట అందిస్తున్నట్టు జీఎమ్మార్ ఎయిర్పోర్ట్ ఈడీ ఎస్జీకే కిశోర్ అన్నారు. విమానాశ్రయంలో ఆధునిక సదుపాయాలు కల్పించడంలో భాగంగా ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేయకుండా సెల్ఫ్ చెక్ కియాస్క్, సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన చెప్పారు. దీంతో టర్మినల్ వద్ద రద్దీ తగ్గడంతోపాటు ప్రయాణికులు మరింత సులభంగా రాకపోకలు సాగించవచ్చని తెలిపారు. ఇదీ చదవండి: వరుసగా మూడోనెల తగ్గిన ఫ్యూయెల్ ధర.. ఎంతంటే.. కొత్తగా ఏర్పాటు చేసిన కియాస్క్ల వద్ద ప్రయాణికులు వారి బ్యాగ్లను వారే చెక్ చేసుకోవచ్చు. అక్కడే బోర్డింగ్ పాస్, బ్యాగ్ ట్యాగ్లను తీసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ సేవలు విమానం ప్రారంభమయ్యే గంట ముందు వరకు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. -
అయోధ్య విమానాశ్రయం విశేషాలివే
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ఎయిర్పోర్టు అనేక విశేషాలను కలిగివుంది. అయోధ్య నగర చరిత్ర, విశిష్టత, ఆధ్యాత్మిక వాతావరణం ప్రతిబింబించేలా ఈ విమానాశ్రయ రూపుదిద్దుకుంది. విమానాశ్రయం టెర్మినల్ భవనాన్ని శ్రీరామ మందిరాన్ని తలపించేలా తీర్చిదిద్దారు. ప్రధాన ద్వారంపై ఆలయ తోరణాల డిజైన్ రూపొందించారు. శ్రీరాముని జీవితాన్ని కళ్లకు కట్టే కళాఖండాలు, చిత్రాలు, కుడ్యచిత్రాలతో విమానాశ్రయం శోభాయమానంగా కనిపిస్తోంది. విమానాశ్రయం సమీపంలో బస్సు పార్కింగ్తోపాటు దివ్యాంగులకు అనుకూలమైన వసతి సౌకర్యాలు కల్పించారు. ఎల్ఈడీ లైటింగ్, వాననీటి నిర్వహణ, సౌర విద్యుత్ ప్లాంట్, మురుగు శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేశారు. ప్రాంగణం చుట్టూ పరుచుకున్న పచ్చదనం నిర్వహణకు వాడిన నీటిని రీ సైకిల్ చేసి ఉపయోగించనున్నారు. మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మాణం కేవలం 20 నెలల్లో పూర్తయిందని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంజీవ్ కుమార్ చెప్పారు. ఈ ఎయిర్పోర్టు గతంలో కేవలం 178 ఎకరాల్లో ఉండేది. దీనిని ఇప్పుడు రూ.350 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దారు. యూపీ ప్రభుత్వం 821 ఎకరాల భూమిని విమానాశ్రయం కోసం కేటాయించింది. ప్రతి ఏటా 10 వేల మంది ప్రయాణికుల రాకపోకలు సాగించేందుకు వీలుగా విమానాశ్రయాన్ని అత్యంత విశాలంగా నిర్మించారు. టెర్మినల్ భవనాన్ని 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. 2.2 కిలోమీటర్ల పొడవైన రన్వేను ఏర్పాటు చేశారు. దీంతో ఎయిర్బస్–321 రకం విమానాల ల్యాండింగ్, టేకాఫ్ సులభతరం కానుంది. ఇక్కడ రెండు లింక్ ‘టాక్సీ వే’లు ఉండటంతో ఒకేసారి ఎనిమిది విమానాలను పార్క్ చేసుకునేందుకు అవకాశం ఉంది. త్వరలో విమానాశ్రయ రెండో దశ విస్తరణ పనులు మొదలుకానున్నాయి. టెర్మినల్ను 50 వేల చదరపు మీటర్లకు విస్తరించనున్నారు. ఏటా ఏకంగా 60 లక్షల మంది రాకపోకలకు వీలుగా విస్తరణ ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధంచేశారు. రన్వేను 3.7 కిలోమీటర్లకు విస్తరించి, అదనంగా 18 విమానాల పార్కింగ్కు చోటు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది కూడా చదవండి: భారత్లో ఐదు కొత్త సంవత్సరాలు... ఏడాది పొడవునా సంబరాలే! -
Ayodhya Airport Photos: ఆధ్యాత్మిక నగరిలో అధునాతన విమానాశ్రయం.. ఆధునిక హంగులతో రైల్వేస్టేషన్ (ఫొటోలు)