Ravi Shankar
-
ఆ సినిమా తొలి రోజే అన్ని రికార్డ్స్ బద్దలు కొడుతుంది: నిర్మాత రవిశంకర్
టాలీవుడ్ నిర్మాత వై.రవిశంకర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నితిన్, శ్రీలీల జంటగా నటించిన రాబిన్హుడ్ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో మాట్లాడారు. ఈ సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ మూవీ గురించి వ్యాఖ్యానించారు. అజిత్ కుమార్ హీరోగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ మొదటి రోజే రికార్డులు కొల్లగొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కోలీవుడ్లోనే ఓపెనింగ్ డే ఆల్ రికార్డ్స్ సృష్టిస్తుందని మా డిస్ట్రిబ్యూటర్స్ చెప్పారని అన్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కించిన గుడ్ బ్యాడ్ అగ్లీ వచ్చేనెల 10న విడుదల కానుంది. ఈ మూవీలో అజిత్ కుమార్ సరసన త్రిష హీరోయిన్గా కనిపించనుంది.కాగా.. నితిన్ రాబిన్ హుడ్ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. భీష్మ సూపర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ నటించడం మరో విశేషం. ఇటీవల ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన సందడి చేశారు. శ్రీలీల, కేతికా శర్మతో కలిసి అది దా సర్ప్రైజ్ అంటూ స్టెప్పులు కూడా వేశారు. ఈ సినిమా ఉగాది కానుకగా ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది. తమిళ ఇండస్ట్రీలో #GoodBadUgly DAY 1 రికార్డులు కొడుతుంది - #RaviShankar#AjithKumar #Robinhood #TeluguFilmNagar pic.twitter.com/90DmdTZclA— Telugu FilmNagar (@telugufilmnagar) March 26, 2025 -
ఆ ఏడాదే పుష్ప 3 రిలీజ్.. ప్రకటించిన నిర్మాత
పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైరు.. కాదుకాదు, వైల్డ్ ఫైరు.. అని నిరూపించాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). పుష్ప ఫ్రాంచైజీ (Pushpa Movie)తో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాశాడు. పుష్ప 1.. 2021లో విడుదల కాగా దాని సీక్వెల్ 2024లో రిలీజైంది. మరి పుష్ప 3 ఎప్పుడు? అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.వారి ఎదురుచూపులకు నిర్మాత రవిశంకర్ తెర దించాడు. 2028లో పుష్ప 3 (Pushpa 3 Movie) విడుదల చేస్తామని వెల్లడించాడు. విజయవాడలో ఆదివారం జరిగిన రాబిన్హుడ్ ప్రెస్మీట్లో ఈ విషయాన్ని తెలిపాడు. అలాగే బన్నీ.. ప్రస్తుతం అట్లీతో ఓ సినిమా చేస్తున్న సంగతిని కూడా బయటపెట్టాడు.పుష్పరాజ్ ప్రయాణం ఎలా మొదలైందంటే?అల్లు అర్జున్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం పుష్ప (Pushpa: The Rise). ఫహద్ ఫాజిల్, సునీల్, డాలి ధనంజయ, అజయ్ ఘోష్, జగదీశ్ ప్రతాప్, అనసూయ కీలక పాత్రలు పోషించారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి శ్రీకాంత్ విస్స డైలాగ్స్ రాశాడు. మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించారు.దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ 2021 డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రూ.350 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో దీనికి సీక్వెల్గా పుష్ప: ద రూల్ తెరకెక్కింది. 2024 డిసెంబర్ 5న రిలీజైన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.1650 కోట్లు రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ఊచకోత సృష్టించిన పుష్ప 2కి సీక్వెల్ ఉంటుందని చిత్రయూనిట్ ఎప్పుడో ప్రకటించింది. తాజాగా రిలీజ్ ఎప్పుడో కూడా చెప్పేయడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: ఆ సినిమా చూస్తుంటే చేదు గతం కళ్లముందుకు..: టాలీవుడ్ హీరోయిన్ -
రెడ్ బుక్ కుట్రకు రెడ్ సిగ్నల్!
సాక్షి, అమరావతి: ‘మీకూ మీ రెడ్బుక్ రాజ్యాంగానికి ఓ దండం.. నిబంధనలకు విరుద్ధంగా పని చేయడం నా వల్ల కాదు.. అక్రమ కేసులు, వేధింపులకు నేను పాల్పడ లేను..’ అని సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్లాల్ తేల్చి చెప్పారు. అదంతా కాదు.. తాము చెప్పింది చేయాల్సిందేనని, నిబంధనలు జాన్తానై అంటూ డీజీపీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు, సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ హుకుం జారీ చేయడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన ఏకంగా రాజీనామా చేస్తానని చెప్పడంతో ఆ ఉన్నతాధికారులు హడలిపోయారు. దాంతో తమ పుట్టి మునుగుతుందని హడలిపోయిన డీజీపీ, సీఐడీ చీఫ్ చాలాసేపు సర్ది చెప్పడంతో అతి కష్టం మీద రాజీనామా విషయంలోబ్రిజ్లాల్ వెనక్కి తగ్గారు. రెడ్బుక్(Redbook) వేధింపులకు పాల్పడలేనని స్పష్టం చేస్తూ సెలవుపై వెళ్లిపోయారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ ఉదంతం విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇలా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం తమ రెడ్బుక్ రాజ్యాంగ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం(Ration rice) అక్రమ రవాణా అవుతోందని గగ్గోలు పెట్టిన విషయం తెలిసిందే. ముందస్తు పన్నాగంతో మంత్రి నాదేండ్ల మనోహర్ (Nadendla Manohar) ద్వారా కుట్రకు తెరతీసి.. అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా ‘సీజ్ ద షిప్’ డ్రామాను రక్తి కట్టించేందుకు యత్నించింది. కాగా, కేంద్ర కస్టమ్స్ అధికారులు నిబంధనలకు కట్టుబడటంతో టీడీపీ(TDP) కూటమి ప్రభుత్వం కుట్ర బెడిసికొట్టింది. దాంతో చంద్రబాబు (Chandrababu Naidu) ప్రభుత్వం కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై దర్యాప్తు కేసును తమ ఆధీనంలోని సీఐడీకి అప్పగించింది. అందుకోసం నియమించిన సిట్కు సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్లాల్ను చీఫ్గా నియమించింది. సిట్ సభ్యులుగా ముందు కొందరు పోలీసు అధికారులను నియమించింది. కానీ ఒక్క రోజులోనే వారిని మార్చి పూర్తిగా తమ మాట వినే అధికారులను నియమించింది. అనంతరం వినీత్ బ్రిజ్లాల్ కాకినాడలో పర్యటించిన పోర్టు, గోదాములు మొదలైన వాటిని పరిశీలించి వచ్చారు. తాను గుర్తించిన వాస్తవ విషయాలతో నివేదిక రూపొందించేందుకు ఉపక్రమించారు. పెద్దలు చెప్పినట్టుగా నివేదిక ఇవ్వాలి తాము అనుకున్న రీతిలో నివేదిక సిద్ధం కావడం లేదని తెలుసుకున్న ప్రభుత్వ పెద్దలు.. పోలీసు పెద్దకు దిశా నిర్దేశం చేయడంతో అసలు కుట్రకు తెరలేచింది. ఈ నేపథ్యంలో సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్.. సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ను పిలిచి మాట్లాడారు. తాము చెప్పినట్టుగా నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ‘క్షేత్ర స్థాయిలో పరిశీలించిన విషయాలతో పని లేదు.. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా నివేదిక రూపొందించాలి. రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరిగిందా లేదా అన్నదానితో నిమిత్తం లేదు. జరిగినట్టు నివేదిక ఇవ్వాలి. ప్రభుత్వ పెద్దలు ఎవరెవరి పేర్లు చెబుతారో వారిని బాధ్యులుగా పేర్కొనాలి’ అని ఆదేశించినట్టు తెలుస్తోంది. సీఐడీ చీఫ్ ఆదేశాలను వినీత్ బ్రిజ్లాల్ నిర్ద్వందంగా తిరస్కరించారు. తాను క్షేత్ర స్థాయిలో కనుగొన్న వాస్తవ విషయాలతోనే నివేదిక రూపొందిస్తానని స్పష్టం చేశారు. అలా అయితే కుదరదని, ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగానే నివేదిక ఇచ్చి తీరాలని సీఐడీ చీఫ్ తేల్చి చెప్పారు. దీనిపై వినీత్ బ్రిజ్లాల్ తీవ్రంగానే స్పందించినట్టు తెలుస్తోంది. డీజీపీదీ అదే మాట.. బ్రిజ్లాల్ వైఖరిని సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ డీజీపీ ద్వారకా తిరుమలరావు దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో బ్రిజ్లాల్ను డీజీపీ తన చాంబర్కు పిలిపించారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ మరోసారి ఆయనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు చేయాల్సిందేనని ఆదేశించారు. బ్రిజ్లాల్ మరోసారి తన వైఖరిని పునరుద్ఘాటిస్తూ నిబంధనలకు విరుద్ధంగా నివేదిక ఇవ్వనని తేల్చి చెప్పారు. అంతేకాదు తనకు పార్టీలతో సంబంధం లేదని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే నిబంధనల మేరకే పని చేస్తున్నానన్నారు. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలో భూముల కుంభకోణంపై నియమించిన సిట్కు నేతృత్వం వహించానని, అనంతరం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏవోబీలో గంజాయి నిర్మూలనకు సెబ్ కమిషనర్గా పని చేశానని చెప్పారు. విశాఖపట్నంలో భూముల కుంభకోణంలో ప్రమేయం ఉన్న అప్పటి టీడీపీ మంత్రిపై చర్యలు తీసుకోని విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించినట్టు సమాచారం. ఆయన వాదనను ఏమాత్రం వినిపించుకోకుండా తాము చెప్పినట్టుగా నివేదిక ఇవ్వాల్సిందేనని డీజీపీ, సీఐడీ చీఫ్ తేల్చి చెప్పారు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన బ్రిజ్లాల్ ఇలా అయితే తాను ఏకంగా పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేస్తానని చెప్పి బయటకు వచ్చేశారు. ఆయన రాజీనామా పత్రాన్ని కూడా డీజీపీకి సమర్పించినట్టు సమాచారం. దాంతో డీజీపీ, సీఐడీ చీఫ్ హడలిపోయారు. ఈ వ్యవహారం బయటకు పొక్కితే తాము ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని భావించారు. ఆ మర్నాడు మళ్లీ బ్రిజ్లాల్ను పిలిపించి రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశారు. అతి కష్టం మీద అందుకు సమ్మతించిన ఆయన తాను మాత్రం నిబంధనలకు విరుద్ధంగా నివేదిక ఇవ్వలేనని స్పష్టం చేశారు. ఉన్నతాధికారుల ఒత్తిడి కొనసాగుతుందని స్పష్టం కావడంతో ఆయన సెలవుపై వెళ్లిపోయారు.త్వరలో సిట్ చీఫ్గా మరొకరు! తమ కుట్రలకు వినీత్ బ్రిజ్లాల్ ససేమిరా అనడంతో ఆయన స్థానంలో సిట్ చీఫ్గా మరొకర్ని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆయన్ని సీఐడీ విభాగం నుంచి తప్పించి గ్రేహౌండ్స్కు బదిలీ చేయాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. సెలవు నుంచి వచ్చిన తర్వాత ఆయన్ను బదిలీ చేస్తారని సమాచారం. కాగా, వినీత్ బ్రిజ్లాల్ ఉదంతం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజకీయ పార్టీల కక్ష సాధింపు కుట్రలకు పోలీసు వ్యవస్థను భాగస్వామిని చేస్తున్న పోలీసు ఉన్నతాధికారుల తీరుపై యంత్రాంగం తీవ్రంగా మండిపడుతోంది. ఉన్నత పదవులు పొందేందుకు, రిటైరైన తర్వాత కూడా పదవులు పొందేందుకు యావత్ పోలీసు వ్యవస్థను ప్రభుత్వ పెద్దలకు ఊడిగం చేసే వ్యవస్థగా మార్చి వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పోలీసు అధికారులు బలవుతున్నా, వారికి పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్నా.. పట్టించుకోని ఉన్నతాధికారులు ప్రభుత్వ రెడ్ బుక్ కుట్రలకు మాత్రం వత్తాసు పలుకుతున్నారని పోలీసు వర్గాలు దుయ్యబడుతున్నాయి. చదవండి: చెప్పారంటే.. చేయరంతే!డీజీపీ కావాలనే లక్ష్యంతో సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, డీజీపీగా పదవీ కాలం పొడిగింపు సాధ్యం కాకపోవడంతో రిటైరైన తర్వాత ఆర్టీసీ ఎండీగా పోస్టింగు లక్ష్యంగా ద్వారకా తిరుమలరావు పని చేశారన్నది స్పష్టమవుతోందని తేల్చి చెబుతున్నాయి. ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గక బ్రిజ్లాల్ నిబద్ధతతో వ్యవహరించడాన్ని ప్రశంసిస్తున్నాయి. -
డీజీపీ పోస్టు కోసం మూడు ముక్కలాట!
సాక్షి, అమరావతి: పోలీసు శాఖలో ఆధిపత్య పోరు పతాకస్థాయికి చేరుకుంటోంది. డీజీపీ పోస్టే లక్ష్యంగా మూడు ముక్కలాటతో పోలీసు వ్యవస్థ పూర్తిగా గాడి తప్పుతోంది. రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు బనాయించడమే కొలమానంగా ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు డీజీ స్థాయి ఐపీఎస్లు పోటీ పడుతుండటం విభ్రాంతి కలిగిస్తోంది. డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు తన పదవీ కాలం పొడిగింపు కోసం చివరి ప్రయత్నాలు ముమ్మరం చేయగా... విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ హరీశ్ కుమార్ గుప్తా, సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ పోలీస్ బాస్ పోస్టు కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. హరీశ్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ మహేశ్కుమార్ లడ్హా, కేంద్ర సర్వీసులో ఉన్న అమిత్ గర్గ్లతో కూడిన ఉత్తరాది లాబీ మంత్రి నారా లోకేశ్ అండదండలతో పోలీసు శాఖపై దీర్ఘకాలిక ఆధిపత్యం చలాయించేందుకు పావులు కదుపుతోంది. పోలీసు ఉన్నతాధికారుల అధికారిక లాలసను ఆసరాగా చేసుకుని ప్రభుత్వ పెద్దలు వారిని తమ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వాడుకుంటున్నారు.దీర్ఘకాలిక పట్టుకు ఉత్తరాది లాబీ గూడుపుఠాణిచంద్రబాబు, లోకేశ్ను ‘అన్ని విధాలుగా’ ప్రసన్నం చేసుకుని ఆధిపత్యం చలాయిస్తున్న ఉత్తరాది ఐపీఎస్ లాబీ దీర్ఘకాలిక వ్యూహానికి తెర తీయడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. సర్వం తానై రెడ్బుక్ వేధింపులు, పోలీసు వ్యవస్థను నడిపిస్తున్న ఇంటెలిజెన్స్ అదనపు డీజీ మహేశ్కుమార్ లడ్హా ఈ లాబీకి నేతృత్వం వహిస్తున్నారు. హరీశ్కుమార్ గుప్తాతోపాటు ప్రస్తుతం హైదరాబాద్లోని నేషనల్ పోలీసు అకాడమీ అదనపు డైరెక్టర్గా ఉన్న అమిత్ గర్గ్ ఇందులో కీలక సభ్యులు. రానున్న నాలుగేళ్లపాటు పోలీసు శాఖపై పూర్తిగా తమ పట్టే ఉండాలన్నది ఆ లాబీ ఉద్దేశం. ఈ క్రమంలో ద్వారకా తిరుమలరావు రిటైరైన తరువాత హరీశ్ కుమార్ గుప్తాను డీజీపీగా చేయాలని పట్టుబడుతోంది. ఆ దిశగా ఇప్పటికే చాలా వరకు సఫలీకృతమైంది. ఆగస్టులో హరీశ్ కుమార్ గుప్తాకు పొడిగింపు ఇవ్వాలని... ఆ తరువాత ఆయన రిటైరయ్యాక అమిత్ గర్గ్ను డీజీపీగా చేయాలన్నది ఉత్తరాది లాబీ వ్యూహం. అనంతరం వచ్చే ఎన్నికల నాటికి మహేశ్ కుమార్ లడ్హా డీజీపీ కావాలన్నది ఎత్తుగడ. తద్వారా 2029 వరకు పోలీసు శాఖ పూర్తిగా తమ ఆధిపత్యంలోనే ఉండాలని హరీశ్ కుమార్ గుప్తా, అమిత్ గర్గ్, మహేశ్ కుమార్ లడ్హా పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే మహేశ్ కుమార్ లడ్హా ఏం చెప్పినా చంద్రబాబు సరే అంటున్నారు. ఇక లోకేశ్ పూర్తిగా హరీశ్ కుమార్గుప్తాకు అనుకూలంగా ఉన్నారు. దీంతో తాము అనుకున్నది సాధిస్తామని ఆ ముగ్గురు ఐపీఎస్లు పూర్తి ధీమాతో ఉన్నారు. ఆ ముగ్గురి లాబీయింగ్ ప్రస్తుతం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డీజీపీ పోస్టు కోసం ఆధిపత్య పోరుతో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమవుతున్నా అటు ప్రభుత్వ తీరులోగానీ ఇటు ఐపీఎస్ అధికారుల వైఖరిలోగానీ ఏమాత్రం మార్పు రావడం లేదు.ఏం చేయమన్నా చేసేస్తా...! లోకేష్ అండతో గుప్తా జోరుమంత్రి లోకేశ్ అండదండలే అర్హతగా విజిలెన్స్– ఎన్ఫోర్స్మెంట్ డీజీ హరీశ్ కుమార్ గుప్తా డీజీపీ పోస్టుకు గురి పెట్టారు. రెడ్బుక్ వేధింపులకు విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని సాధనంగా మార్చారు. టీడీపీ కూటమి ప్రభుత్వం లక్ష్యంగా చేసుకున్న ప్రత్యర్థి పార్టీల నేతలు, ఇతరులపై విజిలెన్స్– ఎన్ఫోర్స్మెంట్ ద్వారా తప్పుడు నివేదికలు ఇప్పించుకోవడం.. వాటి ఆధారంగా ఏసీబీ, సీఐడీ కేసులు నమోదు చేస్తూ వేధిస్తుండటం అంతా పక్కా పన్నాగంతో సాగుతోంది. లోకేశ్ సహకారంతో హరీశ్ కుమార్ గుప్తాకు డీజీపీ పోస్టు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హోంశాఖ వర్గాలు చెబుతున్నాయి. 2014–19లో టీడీపీ హయాంలో గౌతం సవాంగ్ను డీజీపీగా నియమించాలని చంద్రబాబు భావించినప్పటికీ మంత్రి లోకేశ్ను ‘తనదైన శైలిలో ప్రసన్నం’ చేసుకుని ఆర్పీ ఠాకూర్ పోలీస్ బాస్ పోస్టును దక్కించుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. లోకేశ్ అండదండలు ఉన్నప్పటికీ హరీశ్ గుప్తా ఏమాత్రం ఉదాసీనతకు తావివ్వకుండా తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. తనకు డీజీపీగా అవకాశం ఇస్తే ప్రభుత్వ పెద్దలు ఏం చేయమన్నా సరే సంకోచించకుండా చేసేస్తానని హామీ ఇస్తున్నారు. మరోవైపు డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ డీజీ రవి శంకర్ అయ్యన్నార్లకు వ్యతిరేకంగా పలు ఆరోపణలు, ఇతర అంశాలను వివిధ మార్గాల్లో చంద్రబాబు, లోకేశ్కు చేరవేసేలా పావులు కదుపుతున్నారు. రెడ్బుక్కు రాచబాట వేశా.. డీజీపీ ద్వారకా చివరి యత్నాలురెడ్బుక్ రాజ్యాంగం పేరుతో చంద్రబాబు ప్రభుత్వం సృష్టిస్తున్న అరాచకానికి మౌన ప్రేక్షకుడిగా సహకరిస్తున్నప్పటికీ డీజీపీ ద్వారకా తిరుమలరావుకు పదవీ కాలం పొడిగింపుపై ఎలాంటి హామీ లభించలేదని తెలుస్తోంది. ఆయన ఈ నెలాఖరుకు రిటైర్ కానుండటంతో తన పదవీకాలం పొడిగింపు కోసం చివరి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. చంద్రబాబు, లోకేశ్తో ఇటీవల విడివిడిగా సమావేశమై తన మనోగతాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే రెడ్బుక్ వేధింపులు, అక్రమ కేసులు తాము ఆశించినస్థాయిలో లేవని.. మరింత తీవ్రతరం చేయాలని ప్రభుత్వ పెద్దలు ఆయనకు స్పష్టం చేసినట్లు సమాచారం. ఎంతగా అక్రమ కేసులు బనాయిస్తున్నా మరింత బరి తెగించాలని ప్రభుత్వ పెద్దలు పట్టుబడుతుండటాన్ని ఆయన కొందరు సీనియర్ ఐపీఎస్ల వద్ద ప్రస్తావించినట్టు సమచారం. ఇప్పటికే నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించి పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తోందని... ఇంకా దిగజారితే పోలీసు అధికారులు న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన కొందరు డీజీ, అదనపు డీజీ స్థాయి అధికారుల వద్ద వ్యాఖ్యానించడం గమనార్హం. తద్వారా టీడీపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసం పోలీసు వ్వవస్థను దుర్వినియోగం చేస్తోందని పరోక్షంగా వెల్లడించారు. అంతే కాదు.. పోలీసు అధికారులు ఇలాంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించినట్లైందని పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.బాబుపై కేసులు నీరుగార్చడమే అర్హతగా.. రవిశంకర్ అయ్యన్నార్ సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ డీజీపీ పోస్టుపై ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబుపై ఉన్న అవినీతి కేసులను నీరు గార్చాలని స్పష్టమైన ఆదేశాలతోనే ఆయన్ను సీఐడీ చీఫ్గా ప్రభుత్వ పెద్దలు నియమించారు. అందువల్లే గతంలో చంద్రబాబు అవినీతిని బట్టబయలు చేస్తూ సీఆర్సీపీ 164 వాంగ్మూలాలు ఇచ్చిన అధికారులను బెదిరించి తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేసే ప్రక్రియను సీఐడీ వేగవంతం చేస్తోంది. గతంలో సిట్లో పని చేసిన కిందిస్థాయి అధికారులను బెదిరించి వారి ద్వారా చంద్రబాబుపై ఉన్న కేసులను నీరుగార్చే కార్యాచరణ చేపట్టింది. వీటిని ప్రస్తావిస్తూ రవిశంకర్ అయ్యన్నార్ డీజీపీ పోస్టు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ద్వారకా తిరుమలరావు రిటైరైన తరువాతే తననే డీజీపీగా నియమించాలని కోరుతున్నారు. అయితే లోకేశ్ ఇప్పటికే గుప్తాను డీజీపీగా నియమించాలని నిర్ణయించినట్లు తెలియడంతో రవిశంకర్ అయ్యన్నార్ రెండో ఆప్షన్ కూడా రెడీ చేసుకున్నారు. హరీశ్కుమార్ గుప్తా ఆగస్టులో రిటైరైన తరువాత తనకు డీజీపీగా అవకాశం ఇస్తామనే హామీ తీసుకోవాలని భావిస్తున్నారు. కానీ అందుకు చంద్రబాబు, లోకేశ్ నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు లభించకపోవడంతో ఆయన కాస్త కలవరపడుతున్నట్టు తెలుస్తోంది. -
సీఐడీ చీఫ్ అయ్యన్నార్ వీరంగం!
సాక్షి, అమరావతి: అక్రమ కేసులతో వేధింపులకు పాల్పడుతున్న చంద్రబాబు ప్రభుత్వం మరింతగా బరితెగించింది. వలపు వలతో బడా బాబులను బురిడీ కొట్టించే కాదంబరి జత్వానీ కుట్రపూరితంగా ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించిన కేసులో న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేస్తూ బెదిరింపులకు దిగుతోంది. ఇందులో భాగంగా సీఐడీ చీఫ్గా ఉన్న అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ రంగంలోకి దిగడం.. న్యాయస్థానం ఆదేశాలకు విరుద్ధంగా బెదిరింపులకు పాల్పడటం విభ్రాంతి కలిగిస్తోంది. ఈ కేసులో అరెస్టయిన పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్ను కస్టడీలోకి తీసుకుని విచారణ పేరుతో తీవ్రస్థాయిలో బెదిరింపులకు పాల్పడినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో అయ్యన్నార్పై హైకోర్టుకు ఫిర్యాదు చేసేందుకు కుక్కల విద్యాసాగర్ తరఫు న్యాయవాదులు సిద్ధపడుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఏమిటంటే..వేరే గదిలోకి తీసుకువెళ్లి బెదిరింపులు..హనీట్రాప్ ట్రాక్ రికార్డ్ ఉన్న కాదంబరి జత్వానీ ఇచ్చిన ఫిర్యాదుతో పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్ను పోలీసులు అరెస్టుచేసి న్యాయస్థానం ఆదేశాలతో రిమాండ్కు పంపిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును ఇటీవల సీఐడీకి బదిలీచేసింది. దీంతో ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సీఐడీ అధికారులు విద్యాసాగర్ను విచారణ నిమిత్తం న్యాయస్థానం అనుమతితో మూడ్రోజుల కస్టడీకి తీసుకున్నారు. గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో ఆయన్ని ఆదివారం విచారించారు. విచారణ ప్రక్రియను పూర్తిగా ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అందుకు సీఐడీ కార్యాలయంలో ఓ గదిలో ఆడియో, వీడియో రికార్డింగ్ చేస్తూ కొంతసేపు విచారించారు. ఆ తర్వాత ఆయన్ను మరో గదిలోకి తీసుకెళ్లారు. ఆ గదిలో ఆడియో, వీడియో రికార్డింగ్కు ఏర్పాట్లుచేయకపోవడం గమనార్హం. మరి ఆయన్ని ఆ గదిలోకి ఎందుకు తీసుకువెళ్లారన్నది అర్థంకాలేదు. కానీ, కొన్ని క్షణాలకే సీఐడీ అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ అక్కడికి చేరుకోవడంతో అసలు విషయం స్పష్టమైంది. ఆడియో, వీడియో రికార్డింగ్లేని ఆ గదిలో విద్యాసాగర్ను రవిశంకర్ అయ్యన్నార్ తీవ్రస్థాయిలో బెదిరించినట్లు సమాచారం. తాము చెప్పినట్లుగా వాంగ్మూలం ఇవ్వాలని.. లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన పోలీసు శైలిలో హెచ్చరించారు. తాము చెప్పిన కొందరి పేర్లను వాంగ్మూలంలో పేర్కొనాలని.. వారు చెప్పినట్లే తాను చేశానని.. అంతా వారి ప్రమేయంతోనే జరిగిందనే అసత్య వాంగ్మూలాన్ని ఇవ్వాలని బెదిరించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా గతంలో తాము ఎవరెవర్ని ఎలా కేసుల్లో ఇరికించింది.. ఎంతగా వేధించిందీ చెబుతూ బెదిరించారు. ఓ సమయంలో ఆయన నిగ్రహం కోల్పోయి మరీ తీవ్రస్థాయిలో విరచుకుపడినట్లు తెలిసింది. దీంతో అసలక్కడ ఏం జరుగుతోందోనని సీఐడీ వర్గాలే కాసేపు ఆందోళన చెందాయి.అయ్యన్నార్ బెదిరింపులపై హైకోర్టుకు నివేదన..న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకుని నిర్వహిస్తున్న విచారణ సందర్భంలోనే సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ నిబంధనలను ఉల్లంఘించడంపట్ల విస్మయం వ్యక్తమవుతోంది. ఆయన వ్యవహారశైలి న్యాయస్థానం ఆదేశాలకు పూర్తి విరుద్ధంగా ఉందన్నది స్పష్టమవుతోంది. మరోవైపు.. అయ్యన్నార్ బెదిరింపులను విద్యాసాగర్ తరఫు న్యాయవాదులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు వారు సమాయత్తమవుతున్నారు. కస్టడీలో వేధింపులు, కోర్టు ఆదేశాల ధిక్కరణ తదితర అభియోగాలతో అయ్యన్నార్కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. విద్యాసాగర్ కూడా తనను రవిశంకర్ అయ్యన్నార్ ఏ రీతిలో బెదిరించిందీ.. అంతుచూస్తానని హెచ్చరించిందీ న్యాయస్థానానికి విన్నవించేందుకు సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ కేసుకు సంబంధించి తదుపరి పరిణామాలు ఎలా ఉండనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. -
పుష్ప ప్రోడ్యూసర్స్ అంటుంటే గర్వంగా అనిపిస్తోంది: రవిశంకర్, నవీన్
‘‘మైత్రీ మూవీ మేకర్స్ అంటే ఇక్కడ తెలుసు. కానీ ముంబైలో ‘పుష్ప’ సినిమా ప్రోడ్యూసర్స్ అనగానే ఇంకా ఎక్కువ గౌరవం ఇస్తున్నారు. అది మాకు గర్వంగా అనిపిస్తోంది. ‘పుష్ప’ తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’లోని నటనకుగాను అల్లు అర్జున్గారికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది. ‘పుష్ప: ది రూల్’ సినిమాతోనూ ఆయనకు జాతీయ అవార్డు వస్తుందనుకుంటున్నాం.అల్లు అర్జున్గారు అంత కష్టపడుతున్నారు. సుకుమార్ అండ్ టీమ్ కూడా శ్రమిస్తోంది’’ అన్నారు నిర్మాత వై. రవిశంకర్. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన ‘పుష్ప: ది రైజ్’కు సీక్వెల్గా ‘పుష్ప: ది రూల్’ చిత్రం రానుంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమాను డిసెంబరు 6న రిలీజ్ చేయనున్నట్లుగా ఆ మధ్య ప్రకటించారు. కానీ గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ‘పుష్ప: ది రైజ్’ని డిసెంబరు 5న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.ఈ సందర్భంగా నవీన్ ఎర్నేని మాట్లాడుతూ– ‘‘పుష్ప: ది రూల్’ను గతంలో చెప్పిన డేట్ కంటే ఒకరోజు ముందుగానే రిలీజ్ చేస్తున్నాం. ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అభి్రపాయాలు, లాంగ్ వీకెండ్ అంశాలను దృష్టిలో పెట్టుకుని తేదీ మార్చాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో ముఖ్యంగా జాతర ఎపిసోడ్ హైలైట్గా ఉంటుంది. రికార్డు స్థాయిలో ‘పుష్ప: ది రూల్’ సినిమాకు 420 కోట్ల రూపాయల నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్లో ఎవరు నటిస్తారనే విషయాన్ని త్వరలో వెల్లడిస్తాం. ‘పుష్ప 3’ కూడా ఉంటుంది’’ అన్నారు వై. రవిశంకర్. ‘పుష్ప: ది రూల్’ సినిమా మలయాళం డిస్ట్రిబ్యూటర్ ముఖేశ్ మెహతా, హిందీ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానీ, కర్ణాటక డిస్ట్రిబ్యూటర్ లక్ష్మీకాంత్ రెడ్డి, తమిళనాడు డిస్ట్రిబ్యూటర్ మాలి, నైజాం డిస్ట్రిబ్యూటర్ మైత్రీ శశి, వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ ఎల్వీఆర్పాల్గొన్నారు.ఈ సినిమాలోని ఓపాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయ నున్నారా? అనే ప్రశ్నకు... ‘‘ఒకపాటకు అనుకున్నాం కానీ ఇప్పుడు ఆయన ఆపాట చేయడంలేదు’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. -
Pushpa 2: ఆ సీన్స్ కోసం బన్నీ చాలా కష్టపడ్డారు.. సినిమాకే హైలెట్!
పుష్ప 2 ప్రమోషన్స్ నేటితో ప్రారంభం అయినట్లే. విడుదల తేదిని ప్రకటిస్తూ ప్రచారాన్ని ప్రారంభించారు మేకర్స్. ఈ మూవీ డిసెంబర్ 6న కాకుండా ఒక రోజు అంటే డిసెంబర్ 5నే ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. గురువారం హైదరాబాద్లో ప్రెస్ మీట్ని నిర్వహించి ఈ కొత్త రిలీజ్ డేట్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నిర్మాతలు. ఈ సినిమా కోసం హీరో అల్లు అర్జున్ చాలా కష్టపడ్డారని చెప్పారు. ఆయన కోసం అయినా ఈ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేయాలని కోరారు.(చదవండి: పుష్ప 2 రిలీజ్ డేట్ మారింది.. ముందే వచ్చేస్తున్న ‘పుష్ప’రాజ్)ఇక ఈ సినిమాలో ప్రతీ సీన్ అదిరిపోతుందట. ముఖ్యంగా జాతర ఎపిసోడ్ అయితే సినిమాకే హైలెట్ అని చెప్పారు. ‘జాతర ఎపిసోడ్ షూటింగ్కి 35 రోజుల సమయం పట్టింది. ఆ సీన్స్ కోసం బన్నీ చాలా కష్టపడ్డారు. 20 రోజుల పాటు రిహార్సల్ చేసి షూటింగ్లో పాల్గొన్నారు. బాడీ మొత్తం పెయింటింగ్ వేసుకొని రోజంతా ఆ గెటప్లోనే ఉండేవాడు. చెమట వచ్చి పెయింటింగ్ పాడైపోకుండా చిన్న ఫ్యాన్ పెట్టుకునేవాడు. జాతర ఎపిసోడే కాదు సినిమా మొత్తానికి అల్లు అర్జున్ చాలా కష్టపడ్డారు. సుకుమార్ కూడా చాలా జాగ్రత్తగా సినిమాను తీర్చిదిద్దారు. (చదవండి: అభిమాని రిక్వెస్ట్.. వెంటనే స్పందించిన బన్నీ)జాతర ఎపిసోడ్కి భారీగా ఖర్చు చేశాం. తెరపై చూస్తే కూడా మేం పెట్టిన ఖర్చు కనిపిస్తుంది. సినిమాలో గూస్బంప్స్ వచ్చే సీన్లు చాలా ఉంటాయి’అని నిర్మాత రవిశంకర్ అన్నారు. అలాగే పార్ట్ 2ని హిట్ చేస్తే కచ్చితంగా పుష్ప 3ని తెరకెక్కిస్తామని చెప్పారు. ఇక మెగాఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న గొడవ గురించి మాట్లాడుతు.. ‘అల్లు అర్జున్కు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. మెగా ఫ్యాన్స్ అంతా ఒక్కటే. అందరూ సినిమా లవర్సే. ఫ్యాన్స్కు , హీరోలకు రాజకీయాలతో ముడిపెట్టొద్దు’ అని రవిశంకర్ కోరారు. -
అందులో వాస్తవం లేదు: నిర్మాత రవిశంకర్
అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ను లైంగికంగా వేధించాడనే ఆరోపణలపై కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ప్రస్తుతం రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై తాజాగా ‘పుష్ప’ సినిమా నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ స్పందించారు. సోమవారం హైదరాబాద్లో జరిగిన ‘మత్తు వదలరా 2’ సినిమా సక్సెస్ మీట్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘జానీమాస్టర్ వ్యవహారంలో హీరో అల్లు అర్జున్ , డైరెక్టర్ సుకుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. దానిపై మీ స్పందన ఏంటి?’ అనే ప్రశ్నకు రవిశంకర్ బదులిస్తూ... ‘‘ప్రస్తుతం నడుస్తున్న వివాదం పూర్తీగా వాళ్ల (జానీ మాస్టర్, బాధితురాలు) వ్యక్తిగతం. ‘పుష్ప 2: ది రూల్’ సినిమాకి గణేశ్ ఆచార్య మెయిన్ కొరియోగ్రాఫర్. విజయ్ పోలకి, ఆ అమ్మాయి (బాధితురాలు) అడిషనల్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. ‘పుష్ప 2: ది రూల్’ప్రారంభం నుంచే ఆ అమ్మాయిని తీసుకున్నాం. సినిమాలోని అన్ని పాటలకు ఆమె పని చేస్తారు. ఐదారు నెలల క్రితం మేము రిలీజ్ చేసిన ఓ లిరికల్ వీడియోలోనూ ఆమె పేరు ఉంటుంది. ప్రస్తుతం రెండు పాటలు బ్యాలñ న్స్ ఉన్నాయి. అక్టోబర్ 15 తర్వాత ఆ పాటల చిత్రీకరణకు సన్నాహాలు చేశాం. ఈ సినిమాలోని ఓ ప్రత్యేక పాటని జానీ మాస్టర్తో చేయించాలనుకున్నాం. ఇంతలోగా ఈ గొడవ తెరపైకి వచ్చింది.ఎవరైనా డ్యాన్స్ మాస్టర్స్, డ్యాన్సర్ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవెనింగ్ చెబితే స్పందించడం తప్ప హీరోకు (అల్లు అర్జున్) ఏమీ తెలియదు. ఈ విషయంపై బాధ్యత కలిగిన ప్రధాన మీడియా వార్తలు రాయడం లేదు. కానీ, కొత్తగా వచ్చిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సెన్సేషన్ కావడం కోసం ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారు. జానీ మాస్టర్ని ఆపి ఆ అమ్మాయిని ప్రమోట్ చేయాలనే వ్యక్తిత్వం బన్నీగారిది కాదు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇదంతా కొందరి అలజడి మాత్రమే. వారిద్దరి మధ్య గొడవలు ఉన్నా అది వారి వ్యక్తిగతం.. దాని గురించి మనం మాట్లాడటానికి కూడా ఏం లేదు’’ అన్నారు. -
జానీ మాస్టర్ వివాదంలో అల్లు అర్జున్.. క్లారిటీ ఇచ్చిన ప్రముఖ నిర్మాత
కొరియెగ్రాఫర్ జానీ మాస్టర్పై ఆయన అసిస్టెంట్ లైంగిక వేధింపుల కేసు పెట్టిన విషయం తెలిసిందే. కోర్ట్ రిమాండ్ విధించడంతో జానీని చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే, ఈ విషయంపై తాజాగా 'పుష్ప' నిర్మాతల్లో ఒకరైన మైత్రి మూవీస్ రవిశంకర్ రియాక్ట్ అయ్యారు. జానీమాస్టర్ వ్యవహారంలో అల్లు అర్జున్, సుకుమార్ పేర్లు వినిపిస్తున్నాయని మీడియా వారు ఆయన్ను ప్రశ్నించడంతో క్లారిటీ ఇచ్చారు.జానీ మాస్టర్ వివాదంలో అల్లు అర్జున్, సుకుమార్ ఉన్నారనే వార్తలను నిర్మాత రవిశంకర్ ఖండించారు. 'జానీ మాస్టర్, ఆ యువతి (బాధితురాలు) గొడవలతో అల్లు అర్జున్కు ఎలాంటి సంబంధం లేదు. ఈ వివాదం పూర్తిగా జానీ మాస్టర్, ఆమెకు సంబంధించినది మాత్రమే. పుష్ప 2 సినిమా ప్రారంభం నుంచి అన్ని పాటలకు అడిషనల్ కొరియోగ్రఫర్గా ఆమె పనిచేశారు. ఇంకా రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. అక్టోబర్ 15 తర్వాత ఆ పాటల చిత్రీకరణకు ప్లాన్ చేస్తున్నాం. ఆరు నెలల క్రితం మేము విడుదల చేసిన లిరికల్ సాంగ్లో కూడా ఆమె పేరు ఉటుంది. అయితే, జానీ మాస్టర్తో రెండురోజుల్లో ఒక స్పెషల్ సాంగ్ చేద్దామనుకునేలోపే ఈ గొడవ తెరపైకి వచ్చింది. షూటింగ్ సెట్లో అంతర్గతంగా జరిగే విషయాలు అల్లు అర్జున్కు తెలీదు. ఎవరైనా విషెస్ చెబితే స్పందించడం తప్ప హీరోకు ఏమీ తెలియదు. సినిమా ఇండస్ట్రీలో ఎంతో విలువలతో కలిగిన వ్యక్తిగా బన్నీకి గుర్తింపు ఉంది. బన్నీ గురించి ప్రధాన మీడియా ఇలాంటి వార్తలు రాయడం లేదు. కానీ, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వారు తమ ఉనికి కోసం అల్లు అర్జున్పై ఇష్టం వచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ' అని తెలిపారు. -
సోషియో ఫ్యాంటసీ చిత్రంగా 'జై శ్రీరామ'
నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ పి. రవిశంకర్ దర్శ కత్వంలో ఆయన తనయుడు అద్వయ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘సుబ్రహ్మణ్య’. ఈ సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ చిత్రాన్ని ప్రవీణ కడియాల, రామలక్ష్మిల సమర్పణలో తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల నిర్మిస్తున్నారు.ఈ సినిమా గ్లింప్స్ను రిలీజ్ చేశారు. హీరో ఓ బావిలోకి దూకి అక్కడ ఉన్న ఓ పురాతన పుస్తకాన్ని తీసుకురావడం, ఆ పుస్తకానికి కాపలాగా ఉన్నట్లుగా ఉన్నపాములు అతనిపై దాడి చేయడం, ఓ గుడి అతని బ్యాక్గ్రౌండ్లో కనిపించడం, జై శ్రీరామ అంటూ వాయిస్ ఓవర్ రావడం వంటివి టీజర్లో కనిపిస్తాయి. ఈ చిత్రం 2025లో తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. -
సినీ దర్శకుడు ఆత్మహత్య
సినీ దర్శకుడు రవిశంకర్ (63) చెన్నైలో ఆత్మహత్య చేసుకున్నారు. భాగ్య పత్రికలో కథారచయితగా జీవితాన్ని ప్రారంభించిన రవిశంకర్ ఆ తరువాత దర్శకుడు కె.భాగ్యరాజ్, దర్శకుడు విక్రమన్ల వద్ద సహాయదర్శకుడిగా పనిచేశారు. కాగా శరత్కుమార్, దేవయాని జంటగా విక్రమన్ దర్శకత్వంలో రూపొందిన సూర్యవంశం చిత్రానికి రవిశంకర్ సహాయ దర్శకుడిగా పనిచేయడంతోపాటు, అందులోని రోసాపూ అనే సూపర్హిట్ పాటను రాశారు. కాగా నటుడు మనోజ్ భారతీరాజా హీరోగా నటించిన వర్షమెల్లామ్ వసంతం చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రంలోని అన్ని పాటలను రవిశంకరే రాశారు. అయితే ఆ తరువాత ఈయనకు మరో అవకాశం రాలేదు. కాగా అవివాహితుడైన రవిశంకర్ స్థానిక కేకే.నగర్లోని ఒక చిన్న గదిలో అద్దెకు ఉంటున్నారు. అయితే సినిమా అవకాశాలు లేక, పేదరికంలో జీవిస్తున్న ఈయన మానసిక వేదనతో ఉరి వేసుకుని బలవర్మణానికి పాల్పడినట్లు తెలిసింది. సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లి రవిశంకర్ భౌతికకాయాన్ని పోస్ట్మార్టానికి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈయన ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. రవిశంకర్ మర ణం కోలీవుడ్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. -
Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
విశాఖ సిటీ: ఉద్యోగాల పేరుతో విదేశాలకు జరుగుతున్న మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. విదేశాల్లో డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల ఆశ చూపి నిరుద్యోగులను చైనా గ్యాంగ్కు అమ్మేస్తున్న ముగ్గురు ఏజెంట్లను శనివారం అరెస్టు చేశారు. దీనిపై విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ శనివారం సాయంత్రం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు.అక్కడ పని చేసి చైనా ముఠా చెర నుంచి తప్పించుకున్న నగరానికి చెందిన బొత్స శంకర్ సైబర్ హెల్ప్లైన్ 1930 నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. దీనిపై నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కె.భవాని ప్రసాద్ బృందం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ప్రధాన ఏజెంట్ చుక్క రాజేష్తో పాటు అదే ప్రాంతానికి చెందిన సబ్ ఏజెంట్లు సబ్బవరపు కొండలరావు (37), మన్నేన జ్ఞానేశ్వరరావు (29)లను అదుపులోకి తీసుకుని విచారించగా అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా సీపీ రవిశంకర్ మానవ వనరుల అక్రమ రవాణా గురించి వెల్లడించిన వివరాలివి...నిరుద్యోగులకు వల...గాజువాక ప్రాంతానికి చెందిన కన్సల్టెన్సీ ఏజెంట్ చుక్కా రాజేష్ (32) 2013 నుంచి 2019 వరకు గల్ఫ్ దేశాల్లో ఫైర్ సేఫ్టీ అండ్ ప్రికాషన్ మేనేజర్గా పనిచేశాడు. ఆ తరువాత విశాఖలోనే ఉంటూ గల్ఫ్దేశాలకు ఫైర్ సేఫ్టీ ఉద్యోగాలకు మానవవనరులను సరఫరా చేసేవాడు. 2023 మార్చిలో కాంబోడియా నుంచి సంతోష్ అనే వ్యక్తి ఫోన్ చేసి, కాంబోడియాలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేయడానికి 30 మందిని పంపాలని రాజేష్ను కోరాడు. ఆసక్తి చూపే వారి నుంచి ఫ్లైట్ టికెట్లు, వీసా, ఇతర ఖర్చుల కోసం రూ.1.5 లక్షల వంతున తీసుకోవాలని, అందులో కొంత కమిషన్గా ఇస్తామని ఆశ చూపాడు. రాజేష్ అందుకు అంగీకరించి సోషల్ మీడియా ద్వారా విదేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలు ఇచ్చాడు. నిజమని నమ్మిన 27 మంది నిరుద్యోగులు రూ.1.5 లక్షల వంతున కట్టారు. రాజేష్ వారిని కాంబోడియా ఏజెంట్ సంతోష్కు అప్పగించాడు. ఇలా మూడు దఫాలుగా నిరుద్యోగులకు కాంబోడియాకు పంపించాడు. కొద్ది రోజులకు ఆర్య అనే పేరుతో ఒక మహిళ రాజేష్కు ఫోన్ చేసింది. సంతోష్ కంటే ఎక్కువ కమిషన్ ఇస్తానని తమకూ మానవవనరులను సరఫరా చేయాలని కోరింది. ఇలా రాజేష్.. సంతోష్, ఆర్య, ఉమా మహేష్, హబీబ్ అనే ఏజెంట్ల ద్వారా 150 మంది నిరుద్యోగులను కాంబోడియాకు పంపించాడు.చీకటి గదిలో బంధించి..ఒప్పందం అనంతరం వారిని కాంబోడియాలోనే ఈ ముఠా ఒక చీకటి గదిలో బంధించింది. ఫెడెక్స్, టాస్క్గేమ్స్, ట్రేడింగ్తో పాటు అనేక ఆన్లైన్ స్కాములు చేయాలని నిరుద్యోగులను బలవంతం చేసింది. ఈ స్కామ్స్ ఎలా చేయాలో వారం రోజుల పాటు శిక్షణ ఇచ్చింది. అక్రమాలకు పాల్పడబోమని మొండికేసిన వారికి తిండి పెట్టకుండా చిత్ర హింసలకు గురి చేసింది. సైబర్ నేరాలు చేసిన వారికి వచ్చిన డబ్బులో ఒక శాతం కమిషన్గా ఇస్తూ.. 99 శాతం చైనా గ్యాంగ్ దోచుకునేది. అక్కడ ఉత్సాహంగా పనిచేసేందుకు అదే కాంపౌండ్లో పలు రకాల పబ్, క్యాసినో గేమ్స్, మద్యం, జూదంతో పాటు వ్యభిచారం వంటి సదుపాయాలను ఈ ముఠా కల్పించింది. అక్కడ సంపాదించిన డబ్బు అక్కడే ఖర్చు చేసేలా చేసేది. చైనా ముఠా చెరలో 5వేల మంది..చైనా ముఠా చెరలో సుమారు 5 వేల మంది భారతీయులు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 150 మంది చైనా గ్యాంగ్ ఆధీనంలో ఉన్నట్లు గుర్తించారు. బాధితులు ఎక్కువగా శ్రీకాకుళం, విశాఖ, రాజమండ్రి, అనంతపురాలతో పాటు తెలంగాణ, కోల్కత్తాకు చెందిన వారూ ఉన్నట్లు సీపీ రవిశంకర్ తెలిపారు. ఈ నెట్వర్క్ వెనుక ప్రధాన ముఠాను కనిపెట్టేందుకు లోతైన దర్యాప్తు చేపడుతున్నామని చెప్పారు. కాంబోడియాలో భారత ఎంబసీకీ దీనిపై సమాచారం అందిస్తామన్నారు. విశాఖ నుంచి ఎవరైనా కాంబోడియాకు వెళ్లి ఇబ్బందులు పడితే వెంటనే తమకు సమాచారం అందించాలని సీపీ సూచించారు. భారతదేశం నుంచి కాంబోడియా, మయన్మార్, బ్యాంకాక్ వంటి దేశాలకు రెండేళ్లుగా మానవ అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలుస్తోందని సీపీ తెలిపారు. ఇలా వెళ్లిన భారతీయుల ద్వారా సైబర్ నేరాల రూపంలో మన దేశీయుల నుంచే సుమారు రూ.100 కోట్ల వరకు దోచుకున్నట్లు తమ విచారణలో వెల్లడైందని ఆయన వివరించారు.అది కుటుంబాల మధ్య తగాదాలో దాడి...కంచరపాలెం పోలీస్స్టేషన్ పరిధిలో రెండు కుటుంబాల మధ్య తగాదా కారణంగా మహిళపై దాడి జరిగిందని సీపీ రవిశంకర్ స్పష్టం చేశారు. దీనికి రాజకీయాలకు, పార్టీలకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. దాడి ఘటన వీడియోలు ఉన్నాయని, వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు కథనాలను ప్రచురిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.చైనా ముఠాకు భారత యువత విక్రయం...నిరుద్యోగులను ముందు బ్యాంకాక్ పంపించి, అక్కడ రెండో ఏజెంట్కు అప్పగించారు. వీరు నిరుద్యోగులను కాంబోడియాలో పాయిపేట్ వీసా సెంటర్కు తీసుకువెళ్లి ఒక నెలకు టూరిస్ట్ వీసా తీసుకున్నారు. అలా తీసుకువెళ్లిన నిరుద్యోగులను ఏజెంట్లు వారికున్న నైపుణ్యం ఆధారంగా వారికి రూ.2500 నుంచి రూ.4 వేల అమెరికన్ డాలర్ల రేటు కట్టి చైనా కంపెనీలకు అమ్మేశారు. తమ వద్ద ఏడాది పాటు పనిచేసేలా చైనా ముఠా అగ్రిమెంట్ రాయించుకుంది. సెక్యూరిటీ కింద 400 డాలర్ల పూచీకత్తును కట్టించుకుంది. ఒకవేళ కంపెనీ నుంచి వెళ్లిపోవాలనుకుంటే ఆ మొత్తం చెల్లించాలని ఒప్పందంలో ఈ ముఠా షరతులు విధించింది. -
స్నిఫర్ డాగ్స్ అడిగారు.. పంపాం
విశాఖ సిటీ: డ్రగ్స్ కంటైనర్ కేసు దర్యాప్తు తమ పరిధిలో లేదని విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ.రవిశంకర్ స్పష్టం చేశారు. ఆ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోందని, ఇందులో జిల్లా అధికారులకు ఎటువంటి సంబంధం లేదన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీబీఐ ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో పొందుపరచిన సాంకేతిక పదజాలాన్ని కొందరు తప్పుగా అన్వయించుకున్నారని చెప్పారు. రాజకీయ ఒత్తిళ్లతో జిల్లా అధికారులు ఆలస్యంగా రావడంతో దర్యాప్తులో జాప్యం జరిగినట్లు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారన్నారు. తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పోలీస్ శాఖ ఎన్నికల కమిషన్ పరిధిలో పని చేస్తోందని వివరించారు. ‘బ్రెజిల్ నుంచి రవాణా నౌక ద్వారా డ్రగ్స్ కంటైనర్ విశాఖ పోర్టుకు వస్తున్నట్లు ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారంతో సీబీఐ అధికారులు విశాఖ చేరుకున్నారు. ఆ కంటైనర్ను విశాఖ కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ (వీసీటీపీఎల్)లో జేఎం భక్షి అనే ప్రైవేట్ సంస్థ ఆదీనంలో ఉన్న ప్రాంతంలో అన్లోడ్ చేశారు. సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో డెలివరీ అయిన కంటైనర్లో డ్రగ్స్ ఉన్నట్లు సీబీఐకు సమాచారం అందడంతో ఆనవాళ్లు గుర్తించేందుకు స్నిఫర్ డాగ్స్ కావాలని పోలీస్ శాఖను కోరారు. కొంతసేపటి తరువాత వాటిని వెనక్కు పంపించారు. నేను కూడా అక్కడ నుంచి వెళ్లిపోయా. ఆ తరువాత కస్టమ్స్, సీబీఐ అధికారులు కంటైనర్లో ఉన్న వాటిని పరీక్షించారు. ఈ తనిఖీలతో విశాఖ పోలీసులకు, అధికారులకు సంబంధం లేనందున ఎవరూ పాల్గొనలేదు. తప్పుగా అర్థం చేసుకున్నారు.. కంటైనర్లో డ్రగ్స్ తెరిచినప్పటి నుంచి ఆనవాళ్ల పరీక్ష పూర్తయ్యే వరకు ప్రతి అంశాన్ని రికార్డ్ చేసేందుకు సీబీఐ అధికారులు ఓ ప్రైవేటు వీడియోగ్రాఫర్ను వెంట తెచ్చుకున్నారు. కంటైనర్ను తెరిచే సమయంలో వీసీటీపీఎల్తోపాటు ప్రైవేటు సంస్థ సిబ్బంది, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. వీడియో రికార్డింగ్కు ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నందున వారిని అక్కడి నుంచి పంపించారు. ఇలా వృథా అయిన సమయాన్ని స్థానిక అధికారులు గుమిగూడటం కారణంగా ప్రొసీడింగ్స్లో జాప్యం జరిగినట్లు ఎఫ్ఐఆర్లో సీబీఐ అధికారులు పేర్కొన్నారు. వీసీటీపీఎల్, ప్రైవేటు సంస్థ అధికారులు రావడాన్ని సీబీఐ ప్రస్తావిస్తే దాన్ని జిల్లా అధికారులకు ముడిపెట్టడం సరికాదు. ఈ విషయంపై సీబీఐ అధికారులతో మాట్లాడి స్పష్టత తీసుకున్నాం. సీబీఐ అధికారులు వినియోగించిన టెక్నికల్ పదాలను తప్పుగా అర్థం చేసుకొని సంబంధం లేని అధికారులపై ఆరోపణలు చేయడం సరికాదు.’ అని సీపీ చెప్పారు. స్మగ్లింగ్ ముఠాలపై ఉక్కుపాదం ‘గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం, రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. పోలీసులతో పాటు ప్రత్యేకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసి రాష్ట్రంలో డ్రగ్స్ నిరోధానికి చర్యలు చేపట్టింది. విశాఖపట్నంలో గంజాయి ఆనవాళ్లు లేకుండా చేశాం. ప్రత్యేక బృందాలతో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ ద్వారా శాటిలైట్ చిత్రాలను సేకరించి గంజాయి తోటలను ధ్వంసం చేశాం. ప్రసుత్తం విశాఖపట్నంలో గంజాయి లేదా ఇతర డ్రగ్స్ లేవు. ఒడిశా, మల్కన్గిరి, జైపూర్, కోరాపుట్ లాంటి ప్రాంతాల నుంచి రవాణా జరుగుతోంది. విశాఖపట్నంలో అన్ని రకాల రవాణా సదుపాయాలు ఉండడంతో ఇతర రాష్ట్రాల గంజాయి, మాదక ద్రవ్యాల స్మగ్లర్లు జిల్లాను ట్రాన్సిట్ కేంద్రంగా వినియోగించుకుంటున్నారు. వీరిపై గట్టి నిఘా పెట్టి అంతర్రాష్ట గంజాయి ముఠాలను అరెస్టు చేస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి విశాఖపట్నం మీదుగా మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తున్న ముఠాలను అరెస్టు చేస్తుంటే నగరం గంజాయికి కేంద్రంగా మారిందని దు్రష్పచారం చేయడం సరికాదు.’ అని పోలీస్ కమిషనర్ రవిశంకర్ వివరించారు. -
నిజాలు తెలుసుకోకుండా వార్తలు రాస్తున్నారు..
-
సీబీఐ వాళ్లు పిలిస్తేనే పోర్టుకు వెళ్ళాం
-
విశాఖ డ్రగ్స్ కేసు:‘వాస్తవాలు తెలుసుకోకుండా వార్తలు రాయవద్దు’
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖ సీపీ రవిశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటర్పోల్ సమాచారంతో సీబీఐ విశాఖకు వచ్చిందని చెప్పుకొచ్చారు. సీబీఐ పిలిస్తేనే పోలీసులు అక్కడికి వెళ్లినట్టు తెలిపారు. ఇదే సమయంలో తమపై ఎలాంటి పొలిటికల్ ఒత్తిడిలేదని స్పష్టం చేశారు. కాగా, రవిశంకర్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘ఈ డ్రగ్స్ కేసు అంతా సీబీఐ పర్యవేక్షిస్తోంది. సీబీఐ నుంచి మాకు కాల్ వచ్చింది. వారు డాగ్ స్క్వాడ్ కావాలని మమ్మల్ని అడిగారు. తర్వాత డాగ్ స్క్వాడ్ వద్దని చెప్పారు. కేవలం డాగ్ స్క్వాడ్ కోసమే స్థానిక పోలీసులు వెళ్లారు. సీబీఐ విన్నపం మేరకు పోలీసులు అక్కడికి వెళ్లారు. విశాఖ పోర్టు మా పరిధిలో ఉండదు. మేము కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో పనిచేస్తున్నాం. విధి నిర్వహణలో మమ్మల్ని ఎవరూ ఒత్తిడి చేయలేరు. ఏపీ పోలీసులపై సీబీఐ ఎలాంటి ఆరోపణలు చేయలేదు. మా పరిధిలోలేని ప్రైవేటు పోర్టుకు కస్టమ్స్ అధికారులు పిలిస్తేనే వెళ్లాం. వాస్తవాలు తెలుసుకోకుండా వార్తలు రాయడం మంచిది కాదు. కావాలని ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి వదంతులు సృష్టిస్తున్నారువిశాఖ డ్రగ్స్ వ్యవహారాన్ని సీబీఐ చూస్తోంది. విశాఖ చాలా సేఫ్ సిటి. లోకల్ అధికారుల వల్ల లేటు అయ్యిందని చెప్పడం టెక్నికల్ టెర్మినాలజీ మాత్రమే. మేము (NDPS) ఎన్డీపీఎస్ యాక్ట్ సాయంతో డ్రగ్స్ నేరస్తులపై ఉక్కుపాదం మోపుతున్నాం. విశాఖను డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేస్తున్నాం. గత ఐదేళ్ల కాలంలో డ్రగ్స్ను కట్టడి చేస్తున్నాం. గంజా స్మగ్లింగ్ను అడ్డుకున్నాం’ అని కామెంట్స్ చేశారు. -
ఏపీలో పర్మిషన్ లేకుండా మీటింగ్స్ పెట్టరాదు: సీపీ రవి శంకర్
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో తప్పకుండా అందరూ రూల్స్ పాటించాలన్నారు సీపీ రవి శంకర్. కొంత మంది పర్మిషన్ లేకుండా పొలిటికల్ మీటింగ్స్ పెడుతున్నారు. వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, విశాఖ సీపీ రవి శంకర్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పొలిటికల్ పార్టీలు అన్ని ప్రచారం కోసం సువిధ యాప్ ద్వారా పర్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ యాప్ పనిచేయకపోతే రిటర్నింగ్ అధిaకారి వద్ద అనుమతి తీసుకోవాలి. ఎన్వోసీ మాత్రం పోలీసులు ఇస్తారు. ర్యాలీలు, మీటింగ్, డోర్ టూ డోర్ ప్రచారానికి పోలీసులు అనుమతి ఇవ్వరు. అదంతా రిటర్నింగ్ అధికారి చూసుకుంటారు. ఫీల్డ్ స్థాయిలో మొత్తం 63 టీమ్స్ పని చేస్తున్నాయి. కొంతమంది పర్మిషన్ లేకుండా పొలిటికల్ మీటింగ్స్ పెడుతున్నారు. వారిపై తగిన చర్యలు తీసుకుంటాము. ఎస్ఎస్టీ టీమ్ ఇప్పటికే ఐదు టీమ్స్గా పనిచేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో కాబట్టి అందరూ రూల్స్ పాటించాల్సిందే. జిల్లాలో మొత్తం 728 మంది వద్ద లైసెన్స్ తుపాకులు ఉన్నాయి. వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. ఫేక్ ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకుంటాం. చివరిసారి ఎన్నికల సందర్బంగా 70 శాతం ఫేక్ ఫిర్యాదులు వచ్చాయి’ అని తెలిపారు. -
హరీశ్ శంకర్ సాయం.. నెటిజన్ల నుంచి ప్రశంసలు
టాలీవుడ్లో సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ యాక్టివ్గా ఉండే దర్శకుల్లో హరీశ్ శంకర్ ఒకరు. ఇండస్ట్రీలో ఆయన తక్కువ సినిమాలే డైరెక్ట్ చేసినప్పటికీ ప్రేక్షకులను మెప్పించాయి. సినిమాలపైనే కాకుండా పలు సామాజిక అంశాలపైనా తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా ఆయన చెప్పడమే కాకుండా ఇతరులకు సాయం చేస్తూ కూడా అప్పుడప్పుడు నెట్టింట వైరల్ అవుతుంటారు. ఈ క్రమంలో తాజాగా ఆయన చేసిన ఒక మంచి పనికి సోషల్ మీడియా ద్వారా ఆయన్ను అభినందిస్తున్నారు. హైదరాబాద్ సిటీలో రోడ్డుపై నిలిచిపోయిన ఒక కారు విషయంలో హరీశ్ సాయం అందించారు. నడిరోడ్డుపై ఆగిపోయిన కారును హరీశ్తో పాటు మైత్రి మేకర్స్ నిర్మాతలలో ఒకరైన రవిశంకర్ కలిసి కొంత దూరం పాటు చేతుల సాయంతో నెట్టుకుంటూ వెళ్లారు. దీనిని గమనించిన కొందరు వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఆ సమయంలో కొందరు వీడియో తీసి నెట్టింట వదిలారు. దీంతో హరీశ్, నిర్మాత రవిశంకర్ల సింప్లిసిటికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. రవితేజ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. 'మిస్టర్ బచ్చన్' పేరుతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. హిందీలో ఘన విజయం సాధించినన 'రైడ్' మూవీకి రీమేక్ అని ప్రచారం జరుగుతుంది. మరోవైపు పవన్ కల్యాణ్ హీరోగా 'ఉస్తాద్ భగత్సింగ్'ను కూడా హరీశ్ రూపొందిస్తున్నారు. అయితే ఈ రెండు ప్రాజెక్ట్ల తర్వాత హరీశ్- చిరంజీవితో సినిమా చేయనున్నారని ప్రచారం సాగుతోంది. ఈ బిగ్ ప్రాజెక్ట్కు చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల ప్రొడ్యూసర్ ఉండనున్నారట. కానీ ఈ విషయంలో అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. Director #HarishShankar @harish2you sir and @MythriOfficial Ravi gaaru are helping the vehicle which is stopped on road 👏👏👏 Kudos to you sir 🙏🙏 @harish2you it’s a great beginning of my day sir after watching this one 👏👏👏 pic.twitter.com/CbGfCiU7AN — Mahaa Max (@mahaamaxx) March 14, 2024 -
వ్యక్తిగత లావాదేవీలతోనే తహసీల్దార్ హత్య
విశాఖ సిటీ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విశాఖకు చెందిన తహసీల్దార్ రమణయ్య హత్య కేసు మిస్టరీ వీడింది. వ్యక్తిగత లావాదేవీలు, భూ వ్యవహారాల కారణంగానే హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. హత్య చేసి విశాఖ నుంచి విమానంలో చెన్నై పారిపోయిన రియల్టర్ మురారి సుబ్రహ్మణ్యం గంగారావును సోమవారం అరెస్టు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ తెలిపారు. తహసీల్దార్ సనపల రమణయ్యను గత శుక్రవారం రాత్రి హత్య చేసిన మురారి సుబ్రహ్మణ్యం గంగారావు శనివారం ఉదయం వరకు విశాఖలోనే ఉన్నాడు. తరువాత విశాఖ నుంచి బెంగళూరు మీదుగా చెన్నైకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన టికెట్ బుక్ చేసుకున్నాడు. మధ్యాహ్నం 3.30 గంటలకు విమాన సమయం అయినప్పటికీ.. ఉదయం 9.30 గంటలకే విమానాశ్రయం లోపలకు వెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఇదిలా ఉంటే గంగారావే తహసీల్దార్ను హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు అతని మొబైల్ ఆధారంగా చెన్నైకు టికెట్ బుక్ చేసుకున్నట్లు ముందుగానే గుర్తించారు. దాని ప్రకారం మధ్యాహ్నం ఎయిర్పోర్ట్లో సుబ్రహ్మణ్యం పేరుతో విచారించారు. ఆ పేరుతో ప్రయాణికులు ఎవరూ లేరని ఎయిర్పోర్ట్ అధికారులు చెప్పడంతో పోలీసులు వెనక్కు వచ్చేశారు. అప్పటికి విమానాశ్రయం సీసీ కెమెరాలను పరిశీలించలేదు. పెద్ద పేరు ఉండడంతో పోలీసులు గానీ, ఎయిర్పోర్ట్ అధికారులు గానీ పూర్తిస్థాయిలో నిందితుడి పేరును గుర్తించలేకపోయారు. దీంతో హంతకుడు విమానం ఎక్కి బెంగళూరు వెళ్లాడు. అయితే అప్పటికే ఎయిర్పోర్టు అధికారులకు సమాచారం ఉండడంతో బెంగళూరులో ఎయిర్హోస్టెస్ మురారీ సుబ్రహ్మణ్యం గంగారావు పేరును అనౌన్స్ చేయడంతో.. అనుమానించిన అతడు బెంగళూరు విమానాశ్రయంలోనే దిగిపోయాడు. బస్సులో చెన్నైకు.. బెంగళూరు నుంచి గంగారావు బస్సులో చెన్నైకు బయలు దేరాడు. హంతకుడిని పట్టుకునేందుకు చెన్నైకు వెళ్లిన ప్రత్యేక బృందం మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా చెన్నై పోలీసుల సహకారంతో గంగారావును చెంగల్పుట్టు వద్ద అరెస్ట్ చేసింది. అక్కడి నుంచి ట్రాన్సిట్ ద్వారా విశాఖకు తీసుకొచ్చారు. కాగా, హత్య జరగడానికి గల కారణాలపై డీసీపీ– 1 మణికంఠ ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోందని సీపీ రవిశంకర్ తెలిపారు. కన్వెయన్స్ డీడ్స్ విషయంలో జరిగిన వ్యక్తిగత వ్యవహారాల కారణంగానే హత్య చేసినట్లు గంగరావు చెప్పినట్లు తెలిపారు. గంగారావు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని, అతడిపై హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల్లోనూ చీటింగ్ కేసులున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని వివరించారు. -
విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదం ఘటనలో వెలుగులోకి కొత్త అంశాలు
-
విశాఖ నూతన పోలీస్ కమిషనర్గా డాక్టర్ రవిశంకర్ అయ్యనార్
దొండపర్తి : విశాఖ నూతన పోలీస్ కమిషనర్గా డాక్టర్ రవిశంకర్ అయ్యనార్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషినల్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు సీపీగా విధులు నిర్వర్తించిన డాక్టర్ సి.ఎం.త్రివిక్రమ్ వర్మ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీగా బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే డీసీపీ(లా అండ్ ఆర్డర్)గా ఉన్న వి.విద్యాసాగర్నాయుడును గ్రేహౌండ్స్ ఎస్పీగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో ప్రస్తుతం అనంతపురం ఎస్పీగా ఉన్న కంచి శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈయన గతంలో విశాఖ డీసీపీగా విధులు నిర్వర్తించారు. సమర్ధవంతమైన అధికారిగా రవిశంకర్ ► 1994 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన రవిశంకర్ అయ్యనార్ పనిచేసిన ప్రతి చోటా సమర్ధవంతమైన అధికారిగా పేరు సంపాదించారు. ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. ► 1968 అక్టోబర్ 20న ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్లో జన్మించిన రవిశంకర్ పుదుచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో పోలీస్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ, సింబయాసిస్ యూనివర్సిటీలో హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్లో పీజీ డిప్లమో చేశారు. కొన్నాళ్లు జిప్మర్లో క్యాజువాలిటీ ఎమర్జన్సీ మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వర్తించారు. ► 1994లో ఐపీఎస్గా ఎంపికై న తరువాత 1996 గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్గా నియమితులయ్యారు. ►1997–98లో బెల్లంపల్లి సబ్ డివిజన్ ఏఎస్పీగా సింగరేణి బెల్ట్లో గెరిల్లా ఆపరేషన్స్కు నాయకత్వం వహించి మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ►1998–99లో వరంగల్ ఓఎస్డీగా మావోయిస్టు చర్యల నిరోధానికి చట్టపరమైన, సంస్థాగత ప్రణాళికలు రూపొందించారు. ఉత్తర తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు జిల్లాల మీదుగా మావోయిస్టుల రాకపోకలు, తప్పించుకొనే మార్గాలు, ఆశ్రయ స్థలాలు, శిక్షణా శిబిరాలను సెస్నా ఎయిర్క్రాఫ్, జీపీఎస్ ద్వారా మ్యాప్ చేశారు. ►1999–2002 వరకు నిజామాబాద్ ఎస్పీగా పాకిస్తాన్కు చెందిన రెసిడెంట్ ఏజెంట్ ఆషిక్ అలీపై జీహాదీ కేసు దర్యాప్తును పర్యవేక్షించారు. అలాగే ఇండియన్ మహ్మద్ ముస్లిమిన్ ముజాహిదీన్ మాడ్యూల్ను ఛేదిండంలో ఈయన కీలక పాత్ర పోషించారు. ►2002లో హైదరాబాద్ నార్త్జోన్ డీసీపీగాను, 2002–2004 మధ్య గుంటూరు ఎస్పీగాను పనిచేశారు. అదే సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై జరిగిన ఐఈడీ బ్లాస్ట్ కేసును దర్యాప్తు చేశారు. ►2004–2005లో కొసావోలో యునైటెడ్ నేషన్స్ మిషన్ సీరియస్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఇన్వెస్టిగేటర్గా విధులు నిర్వర్తించారు. ఈ సమయంలో కొసావో పోలీస్ ఆఫీసర్ హత్యకేసు, అక్రమ ఆయుధాల కేసు, కొసావో అధ్యక్షుడు హరదినాజ్పై హత్యాయత్నం కేసుతో పాటు మరో రాజకీయ నాయకుడిపై హత్యాయత్నం కేసుల దర్యాప్తు చేపట్టారు. ►2005–2006లో హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ ఏఐజీగాను, 2006–2008 మధ్య స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్, 2008–2009లో ఏసీబీ అడిషినల్ డైరెక్టర్గాను, 2009–2010లో కరీంనగర్/వరంగల్ రేంజ్ డీఐజీగా విధులు నిర్వర్తించారు. ►2010–2015 మధ్య నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డీఐజీగా ఇండియన్ ముజాహుద్దీన్(ఐఎం) భారీ పేలుళ్ల కేసు, దిల్సుఖ్నగర్, మక్కా మస్జిద్, మాలేగాన్, బెంగుళూరు చర్చి, అజ్మీర్ దర్గా పేలుళ్ల కేసులను దర్యాప్తు చేసి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అలాగే నకిలీ కరెన్సీ కేసులు, టెర్రర్ ఫైనాన్స్ కేసుల్లో జాతీయ, అంతర్జాతీయ లింకులు, మావోయిస్ట్ ల్యాండ్మైన్ బ్లాస్ట్ కేసులు, ఇటాలియన్ మైరెన్ కేసు ఇలా అనేక కీలక కేసులను దర్యాప్తు చేశారు. ►2015–2018 మధ్య డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్గా, 2015–2018లో ఆరోగ్యశ్రీ సీఈఓగా, 2018–2019లో ప్రావిజన్స్ అండ్ లాజిస్టిక్స్లో ఐజీగా, 2019లో లా అండ్ ఆర్డర్ అడిషినల్ డైరెక్టర్ జనరల్గా విధులు నిర్వర్తించారు. ►ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషినల్ డైరెక్టర్ జనరల్గా ఉన్న రవిశంకర్ విశాఖ సీపీగా నియమితులయ్యారు. కొత్త డీసీపీ స్వస్థలం ఉమ్మడి విశాఖే.. విశాఖ డీసీపీ(లా అండ్ ఆర్డర్)గా రానున్న కంచి శ్రీనివాసరావు విశాఖతో అనుబంధం ఉంది. ఆయన స్వస్థలం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. 2009 గ్రూప్–1 ద్వారా డీఎస్పీ పోస్టు సాధించారు. తొలుత వనపర్తి, కొవ్వూరులో డీఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఆ తరువాత సీఐడీ డీఎస్పీగా పనిచేశారు. అడిషనల్ ఎస్పీగా ఉద్యోగోన్నతి పొందాక విశాఖపట్నం డీసీపీగా, శ్రీకాకుళం అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వర్తించారు. మరోసారి ఉద్యోగోన్నతి పొంది విజయవాడ ట్రాఫిక్ డీసీపీగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా ఎస్పీగా ఉన్నారు. అక్కడి నుంచి విశాఖ డీసీపీగా నియమితులయ్యారు. -
ఆ పాయింట్తో ఖుషి తీశామనేది అవాస్తవం
‘‘నిన్ను కోరి, మజిలీ’ వంటి నా గత చిత్రాల్లో విఫలమైన ప్రేమకథలను చూపించాను. కానీ, ఈసారి పూర్తి స్థాయి వినోదం, ఉత్సాహంగా ఉండే ప్రేమకథ తీయాలని ‘ఖుషి’ చేశాను’’ అన్నారు శివ నిర్వాణ. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు శివ నిర్వాణ చెప్పిన విశేషాలు. డైరెక్టర్ మణిరత్నంగారి ఫ్యాన్గా ఆయన దగ్గర చేరాలనుకుని చెన్నై వెళ్లాను. కానీ ఆయన్ను కలవడానికి కుదరలేదు. మణిరత్నంగారి సినిమాలను ఇష్టపడతాను కానీ ఆయనలా తీయాలనుకోను. ఆయన తీసిన ‘సఖి’ లాంటిపాయింట్తో ‘ఖుషి’ తీశామనే వార్తలు అవాస్తవం. ప్రస్తుత సమాజంలోని ఒక సమకాలీన అంశాన్ని విజయ్, సమంతలాంటి స్టార్స్ ద్వారా చూపిస్తే బాగుంటుందని నమ్మాను. ప్రేమకథను ఎంత కొత్తగా చెప్పాలనే ఆలోచన నుంచి పుట్టిందే కాశ్మీర్ నేపథ్యం. ఈ చిత్రంలో విజయ్పాత్ర అమ్మాయిలకు, కుటుంబ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. సమంత వాస్తవ జీవితానికి, ఈ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు. నిర్మాతలు నవీన్, రవిశంకర్గార్లు డైరెక్టర్స్కు స్వేచ్ఛ ఇస్తారు కాబట్టి సంతోషంగా సినిమా చేసుకోవచ్చు. హేషమ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. నేను డైరెక్ట్ చేసిన ‘నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీశ్’ సినిమాల్లో కొన్నిపాటలు రాశాను. కానీ, ‘ఖుషి’కి అన్నిపాటలు రాయాల్సి వచ్చింది.. రాశాను. మనంపాన్ ఇండియా సినిమా చేయాలని ముందే అనుకుని, కథ రాసుకోనవసరం లేదనేది నా అభిప్రాయం.‘బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్, కార్తికేయ 2’ వంటి సినిమాలన్నీ మన నేటివిటీకి నచ్చేలా చేసుకున్నవి. ఇతర భాషల వాళ్లు కూడా వాటిని ఇష్టపడ్డారు కాబట్టిపాన్ ఇండియా సినిమాలు అయ్యాయి. మనకు నచ్చే మన నేటివిటీ సినిమా బాగా చేసుకుంటే అది ఇతరులకు నచ్చిపాన్ ఇండియా మూవీ అవుతుందన్నది నా అభిప్రాయం. -
ఆధ్యాత్మిక గురువు రవి శంకర్కు 'అరుదైన గౌరవం'
భారతదేశ ఆధ్యాత్మికతకు అరుదైన గౌరవంగా భావించదగిన చారిత్రాత్మక గౌరవం ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, మానవతావాది గురుదేవ్ రవిశంకర్కి లభించింది. హోవార్డ్ కౌంటీ, మేరీల్యాండ్, టెక్సాస్ రాష్ట్రాలు 'రవిశంకర్ దినోత్సవాన్ని' ప్రకటించడంతో అమెరికా కెనడా దేశాలలో రవిశంకర్ దినోత్సవాన్ని ప్రకటించిన నగరాల సంఖ్య 30కి చేరింది. ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్న ఏకైక ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్ కావడం విశేషం. రవిశంకర్ దినోత్సవాన్ని ప్రకటించిన హోవార్డ్ కౌంటీ, మేరీల్యాండ్, టెక్సాస్ రాష్ట్రాలు ఒకప్పుడూ యుద్ధ విధ్వంస ప్రాంతాలుగా ఉండేవి. ఆ ప్రాంతాలల్లో గురుదేవ్ చేసిన శాంతి కృషిని ప్రశంసించిన టెక్సాస్ గవర్నర్ ప్రపంచ శాంతికి చేసిన కృషికి గుర్తింపుగా అమెరికా, కెనడాలలోని 30నగరాలలో ఈ గౌరవం పొందిన మొట్టమొదటి, ఏకైక భారతీయ ఆధ్యాత్మికవేత్త గురుదేవ్ రవిశంకర్. జూలై 30, 2023, బెంగళూరు: భారతీయ ఆధ్యాత్మిక చరిత్రకు గర్వకారణమైన పరిణామం అమెరికాలో చోటుచేసుకుంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, మానవతావాది, రవిశంకర్కు గౌరవసూచకంగా దినోత్సవాలు జరుపుకుంటున్న అమెరికా, కెనడా నగరాలు, రాష్ట్రాల సంఖ్య 30కి చేరింది. ఇప్పటికే 27 నగరాలలో ఈ దినోత్సవాలు ప్రకటించగా తాజాగా హోవార్డ్ కౌంటీ, మేరీల్యాండ్; టెక్సాస్ రాష్ట్రాలు ఈ ఉత్సవాలకు తేదీలను ప్రకటించాయి. ఈ గౌరవం లభించిన మొదటి, ఏకైక ఆధ్యాత్మిక నాయకుడు రవిశంకర్ కావడం గమనార్హం. సేవాదృక్పథంతో, శాంతి, ఆనందాలను వ్యాపింపజేస్తూ వివాదాల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణ, భిన్న దృక్పథాల మధ్య తీవ్రమైన అంతరాలు ఏర్పడుతున్న నేటి సమాజాన్ని ఏకీకృతం చేసే దిశగా గురుదేవ్ మార్గదర్శకత్వంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలకుగాను ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భగా ఇచ్చిన ప్రశంసా పత్రంలో టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్, "తాము నమ్మిన మార్గంపై గల అకుంఠిత విశ్వాసంతో గురుదేవ్ రవిశంకర్, వారి అనుచరగణం ప్రపంచంలోని అనేక యుద్ధ ప్రభావిత ప్రాంతాలలో ధైర్యంగా పర్యటించి..కరుడుగట్టిన ఖైదీలతో సైతం చర్చించి, వారికి మార్గనిర్దేశం చేయగలిగారు. ఏ మాత్రమూ సరిదిద్దలేమని అనుకునే విభేదాలను సైతం పరిష్కరించగలిగారు.” అని ప్రశంసించారు. మేరీల్యాండ్లోని హోవార్డ్ కౌంటీ చేసిన కార్యనిర్వాహక ప్రకటనలో, "ప్రపంచ మానవతావాది, ఆధ్యాత్మిక నాయకుడు, శాంతి దూత, ప్రపంచంలో పరివర్తన తేగలిగే వ్యక్తులలో ఒకరుగా గుర్తింపు పొందిన శ్రీశ్రీ... అభిప్రాయ భేదాలతో విభిన్న ధృవాలుగా చీలిపోయి, దూరాలు పెరిగిపోయిన నేటి ప్రపంచ స్థితిలో గురుదేవ్ శ్రీశ్రీ మన సమాజాన్ని, ప్రపంచాన్ని శాంతి, ఐక్యత, ఆశావహ దృక్పథాల ద్వారా వ్యక్తిగత, సామాజిక స్థాయిలలో స్వీయ పునరుద్ధరణ ద్వారా సమైక్యం చేసేందుకు కృషి చేస్తున్నారు..." అని పేర్కొన్నారు. హోవార్డ్ కౌంటీ జూలై 22వ తేదీని శ్రీశ్రీ రవిశంకర్ డే గా ప్రకటించింది. ఆధ్యాత్మికత మరియు సేవా మార్గాల ద్వారా ప్రజల జీవితాలను మార్చడానికి ఈ ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ అందిస్తున్న అపారమైన సహకారాన్ని గుర్తిస్తూ టెక్సాస్, బర్మింగ్హామ్ వరుసగా జూలై 29, జూలై 25వ తేదీలను శ్రీశ్రీ రవిశంకర్ దినోత్సవంగా ప్రకటించాయి. అమెరికాలో శ్రీశ్రీ పర్యటన సందర్భంగా ఆయా నగరాలలో గురుదేవ్ కు ఘనస్వాగతం లభించింది. జాతి, కుల, స్థాయీ, లింగభేదాలకు అతీతంగా ఆయా ప్రాంతాలలో హాజరైన వేలాదిమంది ప్రజలను ఉద్దేశించి శ్రీశ్రీ ప్రసంగించి, తమ మనసులోతులలోనికి తీసు కొనిపోయే శక్తివంతమైన ధ్యానక్రియలను వారిచే చేయించారు. ఈ సందర్భంగా గురుదేవ్ ప్రవచనాలతో కూడిన ‘నోట్స్ ఫర్ ది జర్నీ విదిన్’ (అంతరంగ ప్రయాణానికి సూచనలు) అనే పుస్తకాన్ని ఆయా నగరాలలో విడుదలచేశారు. నిజాయితీగా అన్వేషించే సాధకులకు తమ దైనందిన జీవన సమస్యల నుండి, ఆధ్యాత్మికత వరకూ ఎదురయ్యే సార్వజనీనమైన ప్రశ్నలకు ఈ పుస్తకం సమాధానాలు ఇస్తుంది. శాంతి మరియు సంఘర్షణల పరిష్కారానికి ఒక మానవతావాదిగా శ్రీశ్రీ చేసిన ప్రయత్నాలకుగాను అమెరికాలోని కౌంటీ ఆఫ్ అల్లెఘేనీ గత నెలలో, గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ను గౌరవించిన విషయం విదితమే. ఆ సందర్భంగా ఇచ్చిన ప్రశంసా పత్రంలో ‘... స్వచ్ఛంద సేవ, సామాజిక కార్యక్రమాలద్వారా వివిధ వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడానికి, నగరాలలో పెరుగుతున్న హింస, నేరాలను అరికట్టడానికి గురుదేవ్ చేస్తున్న ప్రయత్నాలు, వారు విభిన్న సంస్కృతులు, జాతుల మధ్య సంఘర్షణలను నివారించేందుకు చేస్తున్న ప్రయత్నాలతో మాత్రమే పోల్చదగ్గవి.’ అని పేర్కొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 1 వరకు వాషింగ్టన్ లోని ప్రఖ్యాత నేషనల్ మాల్ లో ఘనంగా జరుగనున్న ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాల కోసం శ్రీశ్రీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతి పెద్ద సమావేశాలలో ఒకటిగా పేర్కొనదగ్గ జనసమూహానికి శ్రీశ్రీ స్వయంగా మార్గదర్శనం చేస్తారు. ఉత్సవాలలోభాగంగా ప్రపంచవ్యాప్త కళాకారులచే సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. (చదవండి: కెనడాలో ఘనంగా నోవా మల్టీఫెస్ట్ వేడుకలు) -
రోజుకు 10 లక్షల డిజిటల్ రూపీ లావాదేవీలు
ముంబై: ఈ ఏడాది చివరికి రోజువారీగా 10 లక్షల సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ/ఈ–రూపాయి) లావాదేవీల లక్ష్యాన్ని చేరుకుంటామని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి.రవిశంకర్ ప్రకటించారు. ప్రస్తుతం రోజువారీగా 5,000–10,000 ఈ–రూపీ లావాదేవీలు నమోదవుతున్నట్టు చెప్పారు. యూపీఐ వ్యవస్థతో సీబీడీసీ అనుసంధానతను ఈ ఏడాది జూన్లో ఆర్బీఐ ఎంపీసీలో భాగంగా ప్రకటించగా, ఈ నెలాఖరుకు ఇది కార్యరూపం దాలుస్తుందని రవిశంకర్ తెలిపారు. కాకపోతే సీబీడీసీ ఎకోసిస్టమ్ కిందకు మరిన్ని బ్యాంక్లు చేరాల్సిన అవసరం ఉందన్నారు. గతేడాది నవంబర్లో హోల్సేల్ లావాదేవీలకు సీబీడీసీని ప్రయోగాత్మకంగా ఆర్బీఐ ప్రారంభించగా, అదే ఏడాది డిసెంబర్ నుంచి రిటైల్ లావాదేవీలకు సైతం దీన్ని విస్తరించింది. తొలుత ఎనిమిది బ్యాంక్లను అనుమతించగా, ప్రస్తుతం 13 బ్యాంక్లకు సీబీడీసీ విస్తరించింది. ప్రస్తుతం 13 లక్షల మంది యూజర్లు సీబీడీసీని వినియోగిస్తున్నారని, ఇందులో 3 లక్షల మంది వర్తకులు ఉన్నట్టు రవిశంకర్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో రోజుకు 10 లక్షల లావాదేవీల లక్ష్యం కష్టమైనది కాదన్నారు. యూపీఐపై రోజుకు 31 కోట్ల లావాదేవీలు నమోదవుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఎక్కువ మంది యూజర్లను ఆకర్షించడంపైనే దృష్టి పెట్టామని, ఏప్రిల్ నాటికి లక్షగా ఉన్న యూజర్ల సంఖ్య అనంతరం రెండు నెలల్లోనే 13 లక్షలకు పెరిగినట్టు వివరించారు. ఇక మీదట రోజువారీ లావాదేవీల పెంపు లక్ష్యంగా పనిచేయనున్నట్టు పేర్కొన్నారు. -
నాటా మహాసభల్లో ప్రసంగించిన శ్రీ రవిశంకర్ గురూజీ
నార్త్ అమెరికన్ తెలుగు అసొసియేషన్ నాటా తెలుగు మహాసభలు డల్లాస్లో ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వివిధ రంగాల ప్రముఖులను ఆహ్వానించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా పెద్ద పీట వేశారు. ఈ మహాసభలకు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ రవిశంకర్ గురూజీ హాజరయ్యారు. మహాసభల్లో ఆయన మెడిటేషన్పై ప్రసంగించనున్నట్లు నాటా మహాసభల ఆధ్యాత్మిక కమిటీ చైర్ సుధాకర్ పెన్నం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సాక్షితో కాసేపు ముచ్చటించారు. వాషింగ్టన్ డీసీలో జరగుతున్న నాటా తెలుగు మహాసభలకు రావడం మొదటిసారిగా వచ్చారు కదా ఎలా అనిపించింది మీకు అని ప్రశ్నించగా..ఇది మొదటిసారి కాదని, న్యూఢిల్లీ, జర్మనీలో బెర్లిన్ తదితర కార్యక్రమాల్లో హాజయరయ్యానని చెప్పారు. విభిన్న ప్రాంతాల నుంచి వృత్తి రీత్యా వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యిన వాళ్లందర్నీ ఒక వేదికపైకి తీసుకొచ్చింది 'నాటా' అన్నారు. ఇది ఒకరకంగా మనమంతా ఒకే కుటుంబం అనే ఒక గొప్ప సందేశం ఇచ్చిందన్నారు. మన నేపథ్య ఏదైనా.. మనమంతా ఎప్పటికీ ఒక్కటే అనే గొప్ప సందేశాన్ని ఎలుగెత్తి చాటారు. మొన్నటివరకు కోవిడ్ భయంతో డిప్రెషన్గా బిక్కుబిక్కుమంటూ నాలుగోడలకే పరిమితమైన అనంతరం ఆనందంగా నూతనోత్సహంతో జరుపుకుంటున్న ఒక వేడుక ఇది అని అన్నారు. అలాగే ప్రస్తుత టెక్నాలజీ ఆధ్యాత్మిక జీవనానికి ఉపకరించేదా భంగం కలిగించేదా అని ప్రశ్నించగా..మానవుని కంఫర్ట్ కోసమే కదా టెక్నాలజీ. దాన్ని మన జీవితాన్ని సుఖమయం చేసుకునేలా వాడుకోవడమనేది మన చేతుల్లోనే ఉంది. టెక్నాలజీ మనిషికి మంచే చేస్తుంది. ఉపయోగించే విధానంలోను ఉంది అంతా అని చమత్కారంగా చెప్పారు. మనం కాన్ఫిడెంట్గా ఎప్పుడూ ఉండగలం అని ప్రశ్నించగా.. మన మైండ్ క్లియర్గా ఉంటేనే అది సాధ్యం అని బదులిచ్చారు. మెడిటేషన్ అని సులభంగా చెప్పినంతా ఈజీ కాదు కదా చేయడం అని అడగగా..అదే కదా నా జాబ్ అని నవ్వుతూ జవాబిచ్చారు గురూజీ రవి శంకర్. మంచి గైడెన్స్లో చేయడం నేర్చుకుంటే అది ఈజీగానే చేయొచ్చు అని అన్నారు. మానవత్వానికి అతిపెద ఛాలెంజ్ వివక్ష, స్టీరియో టైప్ థింకింగ్ , ఫాల్స్ మైండ్ తదితరాలని అన్నారు. ఆ దుర్గుణాలని దూరం చేసిమంచి వైపు తీసుకువెళ్లగలిగేది మెడిటేషన్ అని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో తాను నక్స్లైట్లను కలుసుకున్న సందర్భం గుర్తు చేసుకుంటూ..ఆంధ్రప్రదేశ్, చత్తీస్గఢ్ బోర్డర్ల మధ్య ఉన్న నక్సల్స్ ప్రాంతానికి వెళ్లానని, అక్కడ వారు తమ గురువు కారల్ మార్క్స్ అని చెప్పారన్నారు. అది వారి ఓపెనియన్. అక్కడ వారు తాము ఎంత వివక్షతకు గురయ్యమో వివరించారు. ఆ తర్వాత వారి చెప్పిందంతా ఓపికగా విన్నా. ఆ తర్వాత వారు నా ప్రసంగం విని నచ్చాక ..కాసేపు తనాతో కలిసి మెడిటేషన్ కూడా చేశారన్నారు. ఆ తర్వాత క్రమేణా వారి జీవితాల్లో చాలా మార్పు వచ్చింది. కొందరూ పూర్తి స్థాయిలో మారారు కూడా. మెడిటేషన్కి చాలా పవర్ ఉందని, కుల, మత భేదాలతో సంబంధం ఉండదని ఎవ్వరైన చేయొచ్చు. చివరిగా నువ్వేంటీ? అనేది నీ అంతరంగమే నీకు బోధించేలా చేస్తుందని రవిశంకర్ అన్నారు. ఇలా డల్లాస్లో జరిగిన నాటా మహాసభలో మెడిటేషన్ , ప్రాణాయామాకి సంబంధించిన విషయాలను గురించి చెప్పారు. (చదవండి: నాటా మహాసభలో..అమెరికా వైస్సార్సీపీ సోషల్ మీడియా మీట్ అండ్ గ్రీట్) -
హనుకి గ్రీన్ సిగ్నల్?
ప్రస్తుతం ‘సలార్’, ప్రా జెక్ట్ కె’, ‘రాజా డీలక్స్’ (వర్కింగ్ టైటిల్) సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఆ సినిమా చిత్రీకరణలు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో కొత్త సినిమాల కోసం కథలు వింటున్నారట ప్రభాస్. ఇందులో భాగంగా దర్శకుడు హను రాఘవపూడి చెప్పిన ఓ కథ ప్రభాస్కు నచ్చిందని, ఈ కథకు ప్రభాస్ ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, దీంతో ఈ స్క్రిప్ట్కు హను రాఘవపూడి తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారని ఫిల్మ్నగర్ భోగట్టా. అంతేకాదు.. ఈ సినిమాను మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ప్రస్తుతం ‘రాజా డీలక్స్’ షూటింగ్లో పాల్గొంటున్నారు ప్రభాస్. అలాగే ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం జూన్ 16న థియేటర్స్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. -
గులాబీ ఎమ్మెల్యే ఎందుకు టెన్షన్లో ఉన్నారు?.. అక్కడ ఇదే హాట్ టాపిక్
ఆ గులాబీ ఎమ్మెల్యే ఆత్మరక్షణలో పడ్డారా? వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాదని అనుమానిస్తున్నారా? తనవెనుక ఉన్నవారే తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆందోళన చెందుతున్నారా? అత్యంత ఆత్మీయుల సమ్మేళనాలు నిర్వహిస్తున్నా ఆ ఎమ్మెల్యే మళ్ళీ పుంజుకోగలరా? గులాబీ దళపతి ఆదరణ పొంది టిక్కెట్ సంపాదించగలుగుతారా? ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్సీ నియోజకవర్గాల్లో ఒకటైన చొప్పదండి ఎమ్మెల్యేగా అధికార బీఆర్ఎస్ నుంచి సుంకె రవిశంకర్ కొనసాగుతున్నారు. ప్రజల్లో, పార్టీలో ఆయనకు ఆదరణ తగ్గిందని.. అందువల్ల వచ్చే ఎన్నికల్లో ఆయనకు సీటు రాదనే చర్చ నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. స్వయంగా ఎమ్మెల్యే రవిశంకర్కే తనకు టిక్కెట్ రాదనే అనుమానం గట్టిగా పీడిస్తోందని టాక్ నడుస్తోంది. నియోజకవర్గంలో ఆయన ఎవరినీ కలుపుకొనిపోవడంలేదన్న భావన కొందరిలో కనిపిస్తుండగా.. చొప్పదండి బీఆర్ఎస్ నేతలు మూడు వర్గాలుగా చీలిపోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని కేడర్ అభిప్రాయపడుతోంది. సిటింగ్ ఎమ్మెల్యేకు గత ఎన్నికల్లో ఆర్థికంగా, సామాజికపరంగా ఉపయోగపడ్డ కొందరు అగ్రవర్ణాల నేతలు ఈసారి రవిశంకర్పై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు.. కరీంనగర్ కు చెందిన ఒక కార్పోరేటర్..బోయినపల్లి ఎంపీపీ సహా మరికొందరు నేతలు చొప్పదండి సీటుపై కన్నేసినట్లుగా ప్రచారం సాగుతోంది. గులాబీ పార్టీ అధిష్ఠానం నిర్వహించిన సర్వేల్లోనూ ప్రస్తుత ఎమ్మెల్యే రవిశంకర్ పరిస్థితిపై సానుకూలత కనిపించడంలేదని టాక్. స్థానికంగా పార్టీలో నెలకొన్న తలనొప్పులు.. ప్రస్తుత ఎమ్మెల్యేకు పోటీగా టిక్కెట్ కోసం ప్రయత్నం చేస్తున్న నేతల తీరుతో సిట్టింగ్ తల పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందట. ఓ వైపు బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలతో వచ్చే ఎన్నికలకు సంసిద్ధమవుతుంటే.. చొప్పదండి సిటింగ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అత్యంత ఆత్మీయ సమ్మేళనాలనూ నిర్వహిస్తున్నారట. సోషల్ మీడియాలో తగ్గేదేలే.. అందులో తనకు టిక్కెట్ వచ్చే అవకాశాలకు ఎక్కడా గండి పడకుండా మనవాళ్లంతా ప్రయత్నించాలని కోరినట్టుగా కూడా ఇప్పుడు ఓ చర్చ ప్రచారంలోకొచ్చింది. పైగా సోషల్ మీడియాలో తగ్గేదేలే అన్నట్టుగా కౌంటర్ అటాక్స్ కు కూడా సిద్ధం కావాలని.. ఎక్కడా గులాబీబాస్ దృష్టిలో తక్కువ కాకుండా ఉండేలా అన్నివిధాలా తమ నడవడిక ఉండాలని కోరినట్టు తెలుస్తోంది. తన వ్యవహారశైలితో అటు అధిష్టానం దృష్టిలో..ఇటు స్థానిక నేతలు, కార్యకర్తల దృష్టిలో నెగెటివ్ మార్కులు తెచ్చుకున్న సుంకె రవిశంకర్ తిరిగి ఒడ్డుకు చేరుకోగలుగుతారా? పార్టీ అధినేతతో టిక్కట్ తనకే ఇస్తామనే పరిస్థితి క్రియేట్ చేసుకోగలుగుతారా? పార్టీలోని ప్రత్యర్థులను దారికి తెచ్చుకోగలరా? ఇప్పుడు చొప్పదండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే తీరుపైన, ఆయన భవిష్యత్ పైనా హాట్ హాట్గా చర్చ జరుగుతోంది. చదవండి: ఒక్కలిగల కంచుకోటలో పాగా ఎవరిదో...! -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తగ్గిన ఆదరణ!.. వచ్చే ఎన్నికల్లో సీటు కష్టమేనా?
ఆ గులాబీ ఎమ్మెల్యే ఆత్మరక్షణలో పడ్డారా? వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాదని అనుమానిస్తున్నారా? తనవెనుక ఉన్నవారే తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆందోళన చెందుతున్నారా? అత్యంత ఆత్మీయుల సమ్మేళనాలు నిర్వహిస్తున్నా ఆ ఎమ్మెల్యే మళ్ళీ పుంజుకోగలరా? గులాబీ దళపతి ఆదరణ పొంది టిక్కెట్ సంపాదించగలుగుతారా? ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్సీ నియోజకవర్గాల్లో ఒకటైన చొప్పదండి ఎమ్మెల్యేగా అధికార బీఆర్ఎస్ నుంచి సుంకె రవిశంకర్ కొనసాగుతున్నారు. ప్రజల్లో, పార్టీలో ఆయనకు ఆదరణ తగ్గిందని.. అందువల్ల వచ్చే ఎన్నికల్లో ఆయనకు సీటు రాదనే చర్చ నియోజకవర్గంలో హాట్ టాపిక్ మారింది. స్వయంగా ఎమ్మెల్యే రవిశంకర్కే టిక్కెట్ రాదనే అనుమానం గట్టిగా పీడిస్తోందని టాక్ నడుస్తోంది. నియోజకవర్గంలో ఆయన ఎవరినీ కలుపుకుపోవడం లేదన్న భావన కొందరిలో కనిపిస్తుండగా.. చొప్పదండి బీఆర్ఎస్ నేతలు మూడు వర్గాలుగా చీలిపోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని కేడర్ అభిప్రాయపడుతోంది. సిటింగ్ ఎమ్మెల్యేకు గత ఎన్నికల్లో ఆర్థికంగా, సామాజికపరంగా ఉపయోగపడ్డ కొందరు అగ్రవర్ణాల నేతలు ఈసారి రవిశంకర్పై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు.. కరీంనగర్కు చెందిన ఒక కార్పొరేటర్.. బోయినపల్లి ఎంపీపీ సహా మరికొందరు నేతలు చొప్పదండి సీటుపై కన్నేసినట్లుగా ప్రచారం సాగుతోంది. గులాబీ పార్టీ అధిష్ఠానం నిర్వహించిన సర్వేల్లోనూ ప్రస్తుత ఎమ్మెల్యే రవిశంకర్ పరిస్థితిపై సానుకూలత కనిపించడంలేదని టాక్. స్థానికంగా పార్టీలో నెలకొన్న తలనొప్పులు.. ప్రస్తుత ఎమ్మెల్యేకు పోటీగా టిక్కెట్ కోసం ప్రయత్నం చేస్తున్న నేతల తీరుతో సిట్టింగ్ తల పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందట. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలతో వచ్చే ఎన్నికలకు సంసిద్ధమవుతుంటే.. చొప్పదండి సిటింగ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అత్యంత ఆత్మీయ సమ్మేళనాలనూ నిర్వహిస్తున్నారట. అందులో తనకు టికెట్ వచ్చే అవకాశాలకు ఎక్కడా గండి పడకుండా మనవాళ్లంతా ప్రయత్నించాలని కోరినట్టుగా కూడా ఇప్పుడు ఓ చర్చ ప్రచారంలోకొచ్చింది. పైగా సోషల్ మీడియాలో తగ్గేదేలే అన్నట్టుగా కౌంటర్ అటాక్స్ కు కూడా సిద్ధం కావాలని.. ఎక్కడా గులాబీ బాస్ దృష్టిలో తక్కువ కాకుండా ఉండేలా అన్నివిధాలా తమ నడవడిక ఉండాలని కోరినట్టు తెలుస్తోంది. తన వ్యవహారశైలితో అటు అధిష్టానం దృష్టిలో.. ఇటు స్థానిక నేతలు, కార్యకర్తల దృష్టిలో నెగెటివ్ మార్కులు తెచ్చుకున్న సుంకె రవిశంకర్ తిరిగి ఒడ్డుకు చేరుకోగలుగుతారా? పార్టీ అధినేతతో టిక్కట్ తనకే ఇస్తామనే పరిస్థితి క్రియేట్ చేసుకోగలుగుతారా? పార్టీలోని ప్రత్యర్థులను దారికి తెచ్చుకోగలరా? ఇప్పుడు చొప్పదండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే తీరుపైన, ఆయన భవిష్యత్ పైనా హాట్ హాట్ చర్చ జరుగుతోంది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి వెబ్ డెస్క్ -
జీవో నంబర్ 1పై దురుద్దేశంతోనే దుష్ప్రచారం
సాక్షి, అమరావతి: ప్రజల భద్రత కోసం నిబంధనలను అనుసరించి హోం శాఖ జీవో నంబర్ 1 జారీ చేసిందని అదనపు డీజీ (శాంతిభద్రతలు) రవిశంకర్ అయ్యన్నార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పాదయాత్రలు, రోడ్షోలపై ఎలాంటి నిషేధం విధించలేదని తెలిపారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. కొందరు దురుద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం సభలు, సమావేశాలపై నిషేధం విధించిందని దు్రష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు జీవో నంబర్ 1లో నిషేధం అనే మాటే లేదన్నారు. జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీ రహదారులపైన సభలు, సమావేశాలు పెట్టొద్దని మాత్రమే చెప్పామని వెల్లడించారు. పూర్తిగా ప్రజల ప్రయాణం, సరుకు రవాణా కోసమే రహదారులను ఉపయోగించాలని జీవోలో పేర్కొన్నారని గుర్తుచేశారు. వైద్యం, ఇతర అత్యవసర ప్రయాణాలు చేసేవారికి ఇబ్బంది కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రత్యామ్నాయ ప్రదేశాల్లో సభలు నిర్వహించుకోవాలని సూచించామని తెలిపారు. అత్యవసరమైతే షరతులతో అధికారులు అనుమతినిస్తారని కూడా జీవోలో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. కరెంటు వైర్లు, కాలువలు, డ్రైనేజీలు దగ్గరలో లేకుండా సభలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సభల నిర్వహణకు తగిన ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఎంపిక చేయాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో జనసేన సభ కోసం అనుమతి కోరితే అన్నీ పరిశీలించి అనుమతి మంజూరు చేశామని చెప్పారు. చంద్రబాబు కుప్పం పర్యటనలో టీడీపీ నేతలు సరిగా దరఖాస్తు పూర్తి చేయలేదన్నారు. దరఖాస్తు సరిచేసి ఇవ్వాలని పోలీసులు చెప్పినప్పటికీ నిర్వాహకులు స్పందించలేదన్నారు. ఏ పార్టీ అయినా ఒకే రీతిలో జీవో నంబర్1 ను అమలు చేస్తామని వెల్లడించారు. 1861 పోలీసు చట్టం దేశమంతా అమలులో ఉందన్నారు. ఆ చట్టంలోని సెక్షన్లు 30, 30ఏ, 31లలో పేర్కొన్న అంశాలకు అనుగుణంగానే జీవో నంబర్ 1ను హోం శాఖ జారీ చేసిందన్నారు. కందుకూరు, గుంటూరు జిల్లాల్లో దుర్ఘటనలపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఐజీ (శాంతిభద్రతలు) రాజశేఖర్ బాబు పాల్గొన్నారు. -
టీడీపీ రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే విధ్వంసం: పల్నాడు ఎస్పీ
సాక్షి, పల్నాడు: మాచర్ల ఘటన నేపథ్యంలో భారీగా బలగాలను మోహరించి కారకులను పట్టుకునే పనిలో నిమగ్నమైనట్లు తెలిపారు పల్నాడు ఎస్పీ రవిశంకర్. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయన్నారు. మాచర్ల దాడుల వెనుక ఫ్యాక్షనిస్టులు ఉన్నారని, వారు రాజకీయ పార్టీల అండతో రెచ్చిపోతున్నారని స్పష్టం చేశారు. టీడీపీ రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే విధ్వంసం సృష్టించారని పేర్కొన్నారు. ఇతర నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున మాచర్లకు చేరుకోవాలని టీడీపీ పిలుపునిచ్చినట్లు సమాచారం అందిన నేపథ్యంలో హెచ్చరించారు. ఎవరైనా వచ్చి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ‘ఈ గొడవలో పాల్గొన్న వారందరి బ్యాగ్రౌండ్ ఫ్యాక్షన్కు చెందిన వారిగా గుర్తించాం. వెల్దుర్తి మండలంలో జరిగిన కొన్ని హత్యల్లో పాల్గొన్న వారు మాచర్లలో ఒక చోట చేరి మకాం వేశారు. వీరికి ఏదో ఒక పొలిటికల్ పార్టీ అండ కావాలి కాబట్టి, వారి సాయంతోనే చేసిన గొడవ ఇది. ఇందులో ఎవరినీ ఉపేక్షించేది లేదు. అందరిని అరెస్ట్ చేస్తాం. రాడ్లు, బండలతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా ఇక్కడికి వచ్చి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తే చర్యలు తీసుకుంటాం. ఎవరూ మాచర్ల వైపు రాకుండా ఉండటమే మంచిది. రెండువైపుల అందిన ఫర్యాదుల మేరకు కేసులు నమోదు చేస్తున్నాం. ఈ గొడవకు కారణమైన వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం.’ అని తెలిపారు ఎస్పీ రవిశంకర్. ఇవీ చదవండి: ‘బ్రహ్మారెడ్డి ఉండే ఇంటిని టీడీపీ కార్యకర్తలే తగులబెట్టారు’ మాచర్ల ఘటన: నిందితులను వదిలిపెట్టే ప్రసక్తేలేదు: డీజీపీ టీడీపీ రౌడీల స్వైర విహారం -
బ్యాంకుల స్థానాన్ని ఫిన్టెక్లు భర్తీ చేయలేవు
ముంబై: బ్యాంకుల స్థానాన్ని ఫిన్టెక్ సంస్థలు భర్తీ చేస్తాయన్నది అపోహ మాత్రమేనని రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ టి. రవి శంకర్ తెలిపారు. అయితే, సాంకేతిక మార్పులను సత్వరం అందిపుచ్చుకోవడంలో బ్యాంకులు మరింత చురుగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ‘బ్యాంకులు కొనసాగుతాయి. ఫిన్టెక్ సంస్థలు వాటి స్థానాన్ని ఆక్రమిస్తాయన్నది అపోహ మాత్రమే. అయితే, బ్యాంకింగ్ స్వరూపం చాలా వేగంగా మారిపోతోంది. టెక్నాలజీల పురోగతితో వస్తున్న మార్పులను బ్యాంకులు కూడా వేగంగా అందిపుచ్చుకోవాలి‘ అని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రవి శంకర్ చెప్పారు. ఏకీకృత చెల్లింపుల విధానానికి (యూపీఐ) సంబంధించి సింహ భాగం వాటా నాన్ బ్యాంకింగ్ సంస్థలదే ఉంటోందని, బ్యాంకులు ముందు నుంచి ఇందులో ఇన్వెస్ట్ చేయకపోవడం వల్ల అవకాశాలను అందుకోలేకపోయాయని ఆయన తెలిపారు. బ్యాంకింగ్ ప్రపంచంలోను, బైట వస్తున్న మార్పులకు అనుగుణంగా తమను తాము మల్చుకోవడానికి పెద్ద సంస్థలు కూడా ఇష్టపడకపోవడం ఆర్బీఐని ఆశ్చర్యపర్చిందని వ్యాఖ్యానించారు. -
డిజిటల్ కరెన్సీపై ఆచితూచి నిర్ణయం
న్యూఢిల్లీ: ప్రతిపాదిత సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)ని ప్రవేశపెట్టే విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ టి. రవి శంకర్ తెలిపారు. ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ రంగం, ద్రవ్య పరపతి విధానంపై డిజిటల్ కరెన్సీ ప్రభావాలను లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. రిస్కీ సాధనాలైన క్రిప్టోకరెన్సీలను కట్టడి చేసే విధంగా బ్లాక్చెయిన్ టెక్నాలజీ ఆధారిత డిజిటల్ కరెన్సీని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టడంపై ఆర్బీఐ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో శంకర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటివరకూ అధికారికంగా ఎక్కడా డిజిటల్ కరెన్సీ వినియోగంలో లేనందున దాని ప్రభావాలను ముందుగా అంచనా వేయగలిగే పరిస్థితి లేదని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఇతర సెంట్రల్ బ్యాంకులు కూడా దీని విషయంలో క్రమానుగతంగా ముందుకు వెళ్లే అవకాశం ఉందన్నారు. సీబీడీసీలతో ఒనగూరే ప్రయోజనాల వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో డిపాజిట్ల డిమాండ్పై, తత్ఫలితంగా రుణ వితరణ సామర్థ్యాలపై ప్రతికూల ప్రభావం పడవచ్చని శంకర్ అభిప్రాయపడ్డారు. -
'పుష్ప' ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు..
Pushpa Movie Producers Press Meet On Movie Success: ‘‘పుష్ప: ది రైజ్’ సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఉండేది.. కానీ ఇంత పెద్ద హిట్ సాధిస్తుందని ఊహించలేదు. బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ అన్నారు. అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప: ది రైజ్’. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదలైంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో నవీన్, రవిశంకర్ మాట్లాడుతూ ‘‘మా సినిమా ప్రపంచవ్యాప్తంగా మూడు రోజులకు రూ. 173 కోట్ల గ్రాస్, రూ. 85 కోట్ల షేర్ సాధించింది’’ అని తెలిపారు. ‘‘పుష్ప’ విడుదల తర్వాత ఇక్కడ హాలీవుడ్ మూవీ ‘స్పైడర్ మ్యాన్’కి థియేటర్స్ తగ్గాయంటే మా సినిమా క్రేజ్ ఏంటో తెలుస్తోంది’’ అన్నారు సీఈఓ చెర్రీ. ‘‘పుష్ప’లో భాగం కావడం గర్వంగా ఉంది’’ అన్నారు కెమెరామ్యాన్ మిరోస్లా క్యూబా. 'పుష్ప' సినిమా సరికొత్త రికార్డును నెలకొల్పిన సంగతి తెలిసిందే. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 173 కోట్ల వసూళ్లు సాధించి అదిరిపోయే రికార్డు క్రియేట్ చేసింది. ఆదివారం (డిసెంబర్ 19) భారీ కలెక్షన్లతో దుమ్ములేపిన పుష్పరాజ్ 2021 సంవత్సరంలో దేశంలోనే బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలిచాడు. పుష్పరాజ్గా బన్నీ యాక్టింగ్ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తెలుగు, తమిళంతోపాటు హిందీలోనూ మంచి కలెక్షన్లను వసూలు చేసింది 'పుష్ప'. ఈ సినిమా సెకండ్ పార్ట్ 'పుష్ప: ది రూల్' షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ఇదీ చదవండి: 2021లో దేశంలోనే బిగ్గెస్ట్ గ్రాసర్గా 'పుష్ప'.. 3 రోజుల్లోనే.. -
కరోనా మళ్లీ వస్తుందా...!
కరోనా తగ్గుతుందా? పెరుగుతుందా?.. మళ్లీ ప్రబలుతుంది అంటున్నారు.. నిజ మేనా? ఈసారెలా ఉండబోతోంది? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది? ఇంకెంతకాలం ఇలా.. ఈరోజు ఎక్కడ చూసినా ఇవే ప్రశ్నలు, ఇవే సందేహాలు.. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని, ఎప్పుడేమి జరుగుతుందో తెలియక, ఎవరుం టారో ఎవరుండరో అర్థంకాక, ఎవరైనా కోవి డ్తో చనిపోయారనే వార్త వినగానే భయంతో హడలిపోతూ, దినదినగండంగా బతుకుతున్న ప్రజానీకం నవంబర్, డిసెంబర్ నాటికి కరోనా ఎఫెక్ట్ తగ్గిపోతుందని, అప్పటిలోగా కరోనాకు వ్యాక్సిన్ కూడా రావొచ్చనే గంపెడాశతో ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ రాబోతుందనే వార్త ఇన్ని రోజుల ప్రజల ఆశలను సమూలంగా తుంచివేస్తోంది. కరోనా విజృంభణ కాస్త తగ్గడంతో ఊపిరి పీల్చుకున్న ప్రపంచం నాలుగు మాసాల అనంతరం దశల వారీగా లాక్డౌన్ నుండి బయటకు వచ్చింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్నాయి. విద్యార్థులు ఇంట్లో ఉండే ఆన్లైన్లో క్లాసులు అటెండ్ అవుతున్నారు. చాలామంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిలోనే పనిచేస్తున్నారు. బస్సులు, రైళ్లు, మెట్రోలు నడుస్తున్నప్పటికీ జనాలు వాటిల్లో ఎక్కువగా ప్రయాణించట్లేదు. మాస్కులు ధరిస్తున్నారు, శానిటైజర్స్ వాడుతున్నారు. భౌతిక దూరం పాటించడాన్ని మాత్రం ప్రజలు పట్టించుకోవడం లేదు. ఈ మధ్యలో వచ్చిన రంజాన్, దసరా లాంటి పండుగల సందర్భంగా ప్రజలు గుంపులుగా చేరడం వల్ల మళ్లీ రెండవ విడత కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నదని అధికారులు చెప్తున్నారు. భౌతిక దూరం పాటించకపోవడమే ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా కేసుల సంఖ్య పెరగడానికి కారణమని అంటున్నారు. ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ, ఇంగ్లండ్లాంటి దేశాల్లో మళ్లీ లాక్డౌన్ విధించడం జరిగింది. మనదేశంలో కూడా కేరళ, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం గుబులు రేకెత్తిస్తున్న అంశం. తెలంగాణలో కూడా కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగినట్టుగా గణాం కాలు చెప్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మళ్లీ లాక్డౌన్ విధించాల్సిన అవసరం కూడా రావొచ్చేమో. మన దేశంలో పరిస్థితి మాత్రం కాస్త మెరుగ్గానే ఉంది. అధికారిక గణాంకాల ప్రకారం ఇప్పటివరకు కరోనా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య నుండి 90%కు పైగా రికవరీ అయ్యారు. మిగతా వారు చికిత్స పొందుతూ ఉన్నారు. మరణాల సంఖ్య మాత్రం పరిమితంగానే ఉంది. అనధికారిక అంచనాల ప్రకారం ఇప్పటికే దేశంలో ఎన్నో కోట్ల మందికి కరోనా సోకి ఉండవచ్చని చెప్తున్నారు. వీరంతా కూడా ఎటువంటి రోగ లక్షణాలు లేకుండా ఉండి, ఇన్ఫెక్షన్ సోకినందున ఇమ్యూనిటీ పొందినవారై ఉంటారు. ప్రపంచంలో ఇప్పటికే దాదాపు 100కు పైగా పరిశోధనా సంస్థలు వ్యాక్సిన్ తయారీలో తలమునకలై ఉన్నాయి. చాలా వరకు మూడవ దశ అనగా చివరి దశలో ఉన్నాయి. మన దేశంలో కూడా మూడు సంస్థలు వ్యాక్సిన్ తయారీలో ముందంజలో ఉన్నాయి. కాబట్టి అతి త్వరలోనే ఈ కరోనాకు వ్యాక్సిన్ వస్తుం దని భావిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘ఫ్రంట్ లైన్ వారియర్స్’ జాబితాలు తయారు చేస్తున్నారు. అంటే ఎవరికైతే కోవిడ్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయో, వారికి అందరికన్నా ముందుగా వ్యాక్సిన్ ఇవ్వడంకోసం ఈ జాబితాలు తయారు చేయాలని నిర్ణయించారు. వారి తరువాత మిగతా వారందరికీ కూడా పంపిణీ చేస్తామని చెప్తున్నారు. వ్యాక్సిన్ వచ్చి సమాజంలో పూర్తి స్థాయిలో హెర్డ్ ఇమ్యూనిటీ వృద్ధిచెందే దాకా, ఎన్ని విడతలైనా ఈ కోవిడ్ ప్రబలే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. కాబట్టి ప్రజలందరూ విధిగా మాస్క్ ధరించాలి. శానిటైజర్స్ వాడాలి. షేక్ హ్యాండ్ అసలే వద్దు. భౌతికదూరాన్ని తప్పనిసరిగా పాటించాలి. ఏవన్నా లక్షణాలు కనబడితే వెంటనే వైద్యుని సంప్రదించాలి. వ్యాక్సిన్ వచ్చేలోగా మన రక్షణ బాధ్యత మనమే తీసుకుందాం. -డాక్టర్ రవిశంకర్ ప్రజాపతి, వ్యాసకర్త ఈఎన్టీ స్పెషలిస్ట్, ప్రభుత్వ చెవి ముక్కు గొంతు వైద్యశాల, కోఠి, హైదరాబాద్ మొబైల్ : 94407 68894 -
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్యానెల్కు చుక్కెదురు
సాక్షి, కరీంనగర్: చొప్పదండి మున్సిపల్ కో-ఆప్షన్ ఎన్నికల్లో ఎమ్మెల్యే సుంకెరవిశంకర్ ప్యానెల్కు చుక్కెదురైంది. ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా బరిలో నిలిచిన ఎం.డి. అజ్జు, అమరకొండ తిరుపతి, అమీనా సుల్తానా, గండి లలితలు కో-ఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే ప్యానెల్ అభ్యర్థులు గొల్లపల్లి ప్రభావతి, ఇంద్రసేనా రెడ్డి, జహీర్, షబానాలు ఓటమి పాలయ్యారు. కౌన్సిల్లో మొత్తం 14 మంది కౌన్సిలర్లు ఉండగా, ఒకరు గైర్హాజరయ్యారు. దండె జమున అనే కౌన్సిలర్ గైర్హాజరు కాగా ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఎమ్మెల్యే రవిశంకర్ ఓటు వేశారు.(‘ఒక్క సంఘటన నా కళ్లు తెరిపించింది’) రవిశంకర్ ఓటు వేసిన అభ్యర్థుల్లో అమీనా సుల్తానా మినహా మిగతా ముగ్గురు ఓటమిపాలయ్యారు. తాను బలపరిచిన షబానాకే ఎమ్మెల్యే ఓటు వేయలేదు. మొత్తం నలుగురు కో-ఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండగా ఎమ్మెల్యే రవిశంకర్ సూచించిన నలుగురు సభ్యులను ఎన్నుకునేందుకు మెజార్టీ టీఆర్ఎస్ వర్గ కౌన్సిలర్లు నిరాకరించారు. సొంతంగా కో-ఆప్షన్ బరిలోకి మరో నలుగురిని దింపి కౌన్సిలర్లు పంతం నెగ్గించుకున్నారు. ఎమ్మెల్యే ప్యానెల్ ను ఓడించేందుకు బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు సహకరించారు.('చేతకాని దద్దమ్మలు కుట్రలు పన్నుతున్నారు') -
కొత్త కరోనా లోకం
చాలా సంవత్సరాల క్రితం చిన్నప్పుడెప్పుడో స్కైలాబ్ పడుతుందన్నప్పుడు చూశాం ప్రపంచమంతా భయం గుప్పిట్లోకెళ్ళడం. స్కైలాబ్ ఏ ప్రాంతంలో పడుతుందో తెలి యక ప్రపంచంలోని ప్రజ లంతా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బ్రతకడం, ఎలాగూ చనిపోక తప్పదని భావించి కొంతమంది తమ తమ తీరని కోరికలు, చివరి కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నాలు చేయడం, ఆ సందర్భంగా చాలా చోట్ల మనుషులు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం లాంటి విపరీత ధోరణులు ఎన్నో గమనించాము. చివరకు శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమించి ప్రాణనష్టం జరగకుండా స్కైలాబ్ను ఎక్కడో సముద్రంలో పడేలా చేయడంతో యావత్ ప్రపంచం ఊపిరిపీల్చుకుంది. మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత మరొక్కసారి కరోనా రూపంలో ఒక మహా భయోత్పాతం ప్రపంచాన్ని చుట్టుముట్టింది. మొదట్లో దీనిపట్ల ప్రపంచ దేశాలు నిర్లక్ష్యం వహించినప్పటికీ ఒక్కొక్క రోజు గడుస్తున్న కొద్దీ ఈ కనిపించని కణం మనిషి కళ్లలో భయాన్ని నింపింది. అంతేకాదు ప్రస్తుతం మానవాళి జీవిత గమనాన్ని శాసించే స్థాయికి చేరుకుంది. పొద్దున లేచినప్పటినుండి మొదలు రాత్రి పడుకునే వరకు ఏది చూసినా, ఏది మాట్లాడినా, ఏమీ చేసినా కరోనా జపం తప్ప మరొక ధ్యాస లేని మరో ప్రపంచాన్ని సృష్టించింది. కరోనా సృష్టించిన ఈ కల్లోల లోకంలో పాత్రలు,పాత్రధారులు ప్రవర్తిస్తున్న తీరు తెన్నులు మునుపెన్నడూ కానరాని ముఖ చిత్రాలను ఆవిష్కరిస్తున్నాయి. మిత్ర దేశాల శత్రుభావం, వైరి దేశాల మధ్య మిత్రభావం మొలకెత్తుతోంది. ఆర్థిక శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం కరోనా ఉదంతం ముగిసిన తర్వాత భవిష్యత్తు వర్ధమాన దేశాలదే అని తేలుస్తుంటే, అగ్ర దేశాల మీద ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఒకరింటికి వెళ్లలేము, మనింటికి వచ్చే వారు లేరు, పుట్టిన రోజులు లేవు, బారసాలలు లేవు, పెళ్లిళ్లు లేవు, పేరంటాలు లేవు, చస్తే వెంట వచ్చే వాళ్లు కూడా లేరు. శంకుస్థాపనలు లేవు. ప్రారంభోత్సవాలు లేవు, రాజకీయ నాయకుల వెనుక, బడా నేతల వెనుక జై కొట్టడానికి జనాలు లేరు. అభివృద్ధి ఆగిపోయి వైరస్ వృద్ధిని ఆపడమే నేడు ప్రపంచ ప్రథమ కర్తవ్యమైనది. కానీ ఏ మాటకామాటే చెప్పుకోవాలి. ఇప్పటివరకు చెప్పుకున్నదంతా నాణానికి ఒకవైపు.. మరి నాణానికి ఇంకోవైపు చూస్తే.. ఈ రోజుల్లో మనిషి కోరుకున్నవి, కావాలనుకున్నవి, దక్కనివి ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. రోజూ కాలంతో పోటీ పడి పరుగెత్తే మనిషికి దినమంతా కుటుంబంతో కలిసి వుండే అవకాశం వచ్చింది. ప్రశాంతతకు అర్థమే మరిచిపోయిన నగరారణ్యంలో హిమాలయ పర్వతాల్లో కూడా దొరకనంత ప్రశాంతత రాజ్యమేలుతోంది. వాతావరణ కాలుష్యం తగ్గింది, శబ్ద కాలుష్యం తగ్గింది, నేరాలు తగ్గాయి. ఇన్నాళ్లూ అందరూ మర్చిపోయి అటకెక్కి కూర్చున్న తీరిక ఒక్కసారి ఒళ్లు విదుల్చుకొని గడప గడపకి తిరుగుతోంది. తన ఆవశ్యకత ఏంటో తెలియ చెప్తోంది. తను లేక, తనను దూరం చేసుకున్న మానవాళి ఏమి కోల్పోతుందో అప్పుడప్పుడు తనను ఆశ్రయిస్తే ఎంత మనశ్శాంతిగా ఉంటుందో, జీవితం ఎంత హాయిగా ఉంటుందో అనుభవించమని చెబు తోంది. ఒకవైపు విద్యార్థులు స్కూల్కి వెళ్లకుండానే పై క్లాస్కి ప్రమోట్ అవుతుంటే, ప్రభుత్వోద్యోగులు ఇంట్లో ఉండే జీతాలు తీసుకొంటుంటే.. మరోవైపు ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో చాలా కంపెనీలు ఉద్యోగుల్ని తీసేసి భారం తగ్గించుకుంటుంటే.. ఎవరి ఉద్యోగాలు ఎప్పుడు పోతాయో తెలియని అయోమయ పరిస్థితి. ఇంకా ఎంతకాలం ఇలాంటి పరిస్థితుల్లో ఉండాలో తెలియదు, తిరిగి యథావిధిగా మానవ జీవనం మనుగడ సాగిస్తుందా లేక ఇంతకు ముందెన్నడూ లేని కొత్త జీవన విధానం ఏర్పడుతుందా. ఏది ఏమైనా కరోనా మనిషిని కలలో కూడా ఊహించని ఒక కొత్త లోకానికి తీసుకెళ్లింది. డాక్టర్ రవిశంకర్ వ్యాసకర్త, ఈఎన్టీ స్పెషలిస్టు, ప్రభుత్వ ఈఎన్టీ హాస్పిటల్, కోఠి, హైదరాబాద్ మొబైల్ : 94407 68894 -
5జీపై టెల్కోలతో టెలికం శాఖ భేటీ
న్యూఢిల్లీ: వేగవంతమైన 5జీ సేవల ప్రయోగాత్మక పరీక్షలకు సంబంధించి టెల్కోలు, వివిధ ఉత్పత్తుల వెండార్లతో కేంద్ర టెలికం శాఖ (డాట్) మంగళవారం భేటీ అయ్యింది. టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్ సారథ్యంలో జరిగిన ఈ సమావేశం దాదాపు గంటపైగా సాగింది. ప్రయోగాత్మకంగా పరీక్షలు జరిపేందుకు హువావే సహా సంబంధిత సంస్థలన్నింటికీ 5జీ స్పెక్ట్రం కేటాయిస్తామంటూ కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ప్రకటించిన నేపథ్యంలో తాజా సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. భద్రతాపరమైన కారణాల రీత్యా హువావేను అమెరికా నిషేధించిన సంగతి తెలిసిందే. మరోవైపు, వైర్లైన్ సేర్విసులు అందించే విషయంలో నెట్వర్క్ టెస్టింగ్కి సంబంధించి టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ నిబంధనల ముసాయిదాపై చర్చాపత్రం విడుదల చేసింది. ఇందులో చాలా మటుకు ప్రతిపాదనలు మొబైల్ సరీ్వసు నెట్వర్క్ టెస్టింగ్ నిబంధనల తరహాలోనే ఉన్నాయి. వీటి ప్రకారం వ్యాపారపరంగా సరీ్వసులు ప్రారంభించేందుకు ముందుగా.. ట్రయల్ దశలో టెస్టింగ్ కోసం సబ్స్క్రయిబర్స్ను చేర్చుకునేందుకు టెలికం సంస్థకు అనుమతి ఉంటుంది. సబ్్రస్కయిబర్స్ను చేర్చుకోవడానికి కనీసం 15 రోజుల ముందు.. సదరు నెట్వర్క్ సామర్థ్యాల సమగ్ర వివరాలను డాట్కు ఆపరేటరు సమరి్పంచాల్సి ఉంటుంది. -
ఈ విజయం మొత్తం వాళ్లదే
‘‘మత్తు వదలరా’ చిత్రవిజయంలో మా క్రెడిట్ ఏం లేదు. కథ విని బావుందని మాత్రమే చెప్పాం. విజయం టీమ్కే దక్కుతుంది’’ అన్నారు నిర్మాతలు చెర్రీ (చిరంజీవి), రవిశంకర్. కీరవాణి తనయుడు శ్రీ సింహా హీరోగా రితేష్ రానా తెరకెక్కించిన చిత్రం ‘మత్తు వదలరా’. కీరవాణి మరో అబ్బాయి కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి టాక్తో నడుస్తోందని చిత్రనిర్మాతలు చెర్రీ, రవిశంకర్ పేర్కొన్నారు. చెర్రీ మాట్లాడుతూ– ‘‘రితేష్ కథ చెప్పినప్పుడే క్లియర్గా, క్లారిటీగా ఉన్నాడనే నమ్మకం కుదిరింది. హీరో, ముఖ్య పాత్రల్లో ఎక్కువ శాతం కొత్తవాళ్లే కావాలన్నాడు. శ్రీ సింహా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అతనెలా ఉంటాడో చూడు అన్నాను. అయితే సింహా.. కీరవాణిగారి అబ్బాయి అని నేను చెప్పలేదు. ఆడిషన్ చేసి సింహాను సెలక్ట్ చేసుకున్నాడు రితేష్. కీరవాణి, ఆయన భార్య వల్లీ, రాజమౌళి ఎవరూ ఈ కథ వినలేదు. నీకు నమ్మకం ఉంటే చేసేయ్ అని నన్ను నమ్మారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. ఈ సినిమా వీఎఫ్ఎక్స్, డీఐ కోసం రెండు కంప్యూటర్స్ అద్దెకి తీసుకొని డైరెక్షన్ టీమే చేశారు. బయట చేస్తే 60 లక్షలు అవుతుంది. సినిమాకి వస్తున్న స్పందన చూస్తుంటే ఆనందంగా ఉంది. కొత్త టాలెంట్ను ఇలానే ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. రవిశంకర్ మాట్లాడుతూ – ‘‘రెండు కోట్లా నాలుగు లక్షల్లో సినిమా తీశాం. రెండు సెట్లు, రెండు ఫ్లాట్స్ వాడాం. ఫైట్ సీన్స్కి కావాల్సిన సామగ్రిని కూడా డైరెక్షన్ టీమే తయారుచేసుకుంది. సింహాకి మంచి పేరు వచ్చింది. కాలభైరవ మ్యూజిక్కి మంచి పేరొస్తోంది. మా బ్యానర్లో నెక్ట్స్ ‘ఉప్పెన’ సినిమా రాబోతోంది. ఏప్రిల్లో రిలీజ్ చేస్తాం’’ అన్నారు. -
పటేల్ కృషి మరువలేనిది: డీజీపీ సవాంగ్
సాక్షి, విజయవాడ: జాతీయ సమైఖ్యతా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం ‘రన్ ఫర్ యూనిట్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, కలెక్టర్ ఇంతియాజ్, సీసీ ద్వారక తిరుమలరావుతో పాటు లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ రవిశంకర్ హజరయ్యారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ సందర్బంగా పోలీసుల చేత దేశ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉంటామంటూ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని ఏకం చేయండంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ కృషి మరువలేనిదని అన్నారు. పోలీసులు కుడా వివిధ విభాగాల్లో కలిసి పనిచేయడం వల్ల మంచి పురోగతి సాధిస్తున్నారని, ప్రతి ఒక్కరూ ఐక్యంగా పనిచేస్తే ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. కాగా విద్యార్ధి దశ నుంచే ఐక్యతా భావం పెంపోందించాలని ఆయన సూచించారు. అనంతరం బెంజిసర్కిల్ నుంచి సీఏఆర్ గ్రౌండ్ వరకు సాగనున్న సమైక్యత పరుగుకు డీజీపీ జెండా ఊపి రన్ను ప్రారంభించారు. ఈ సమైక్యత పరుగులో పోలీసులతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఇక సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు ‘ఏక్తా దినోత్సవం’ లో భాగంగా ‘రన్ ఫర్ యూనిట్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని పోలీసు పరేడ్ గ్రౌండ్ నుంచి కోనేరు సెంటరు వరకు ఈ ఐక్యత పరుగును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, ప్రజలు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యేను అడ్డుకున్న మిడ్మానేరు నిర్వాసితులు
సాక్షి, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో హరితహారంలో పాల్గొనేందుకు వచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కు మిడ్మానేరు నిర్వాసితుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. తమ డిమాండ్లను పరిష్కరించిన తర్వాతే ముందుకు కదలాలంటూ కొదురుపాక, నీలోజిపల్లి నిర్వాసితులు సోమవారం ఆయన్ను అడ్డుకున్నారు. ఇళ్లకు రూ.5,40,000 అందించడంతోపాటు 18 సంవత్సరాలు నిండిన యువతీయువకులకు కటాఫ్ డేట్ లేకుండా కుటుంబ పరిహారం ఇచ్చేవరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చుకున్నారు. నిర్వాసితులకు రావాల్సిన పరిహారం ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే రవిశంకర్ హామీ ఇచ్చినప్పటికీ వారు ఆందోళన విరమించలేదు. దీంతో పోలీసు బందోబస్తు మధ్య ఆయన అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. కాగా న్యాయమైన డిమాండ్లను సత్వరమే పరిష్కరించకపోతే ఈ నెల 30న కలెక్టరేట్ ముందు మహాధర్నా చేపడతామని నిర్వాసితులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
‘ది లయన్ కింగ్’.. ఓ విజువల్ వండర్!
హాలీవుడ్ దర్శక నిర్మాతలు ఇప్పుడు తెలుగు మార్కెట్ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. ఏదో మొక్కుబడిగా సినిమాలు తెలుగులో రిలీజ్ చేయటం కాదు ఆ సినిమాకు తెలుగు టాప్ స్టార్స్తో డబ్బింగ్ చెప్పించి సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు. అదే బాటలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో హాలీవుడ్ విజువల్ వండర్ ‘ది లయన్ కింగ్’. కథ విషయానికి ది లయన్ కింగ్ భారతీయులకు బాగా పరిచయం ఉన్న కథే. ఈ సినిమా కథకు ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ బాహుబలి కథకు చాలా దగ్గర పోలికలున్నాయి. అడవికి రారాజు ముఫాసా.. తన తరువాత తన కొడుకును సింబాను రాజును చేయాలనుకుంటాడు. కానీ ముఫాసా తమ్ముడు స్కార్కు ఇది నచ్చదు. అందుకే కుట్ర పన్ని ముఫాసాను చంపేస్తాడు. అంతేకాదు ముఫాసా చావుకు సింబానే కారణం అని అందరినీ నమ్మించి చిన్న వయసులోనే సింబాను ఆ అడవికి దూరం చేస్తాడు. ముఫాసా భార్య సరభిని ఇబ్బందుల పాలు చేస్తాడు. రాజ్యాధికారం తీసుకున్న స్కార్ తన అరాచక పాలన కొనసాగిస్తుంటాడు. స్కార్ చర్యల కారణంగా అడవితో పాటు జంతువులు కూడా అంతరించిపోతుంటాయి. అడవి వదిలి వెళ్లిన సింబాను పుంబా, టిమెన్ అనే రెండు జంతువులు పెంచి పెద్ద చేస్తాయి. పెద్దవాడైన సింబా.. నల అనే ఆడ సింహాం ద్వారా స్కార్ చేస్తున్న అరాచాకాలు, తన తల్లిని పడుతున్న కష్టాలను తెలుసుకుంటాడు. రాజ్యాన్ని, తల్లిని కాపాడుకునేందుకు సింబా ఏంచేశాడు? తిరిగి అధికారాన్ని ఎలా చేజిక్కించుకున్నాడు..? స్కార్ ఆట ఎలా కట్టించాడు? అన్నదే మిగతా కథ. సాధారణంగా హాలీవుడ్ సినిమాలు తెలుగులోకి డబ్ చేస్తే డైలాగ్స్ కామెడీగా ఉంటాయి. కానీ ది లయన్ కింగ్ చూస్తే మనకు అలాంటి ఫీలింగ్ కలగదు. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్లు నాని, జగపతి బాబు, బ్రహ్మానందం, అలీ, రవిశంకర్లు చెప్పిన డబ్బింగ్ మనకు మన సినిమానే చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తాయి. ఫొటో రియలిస్టిక్ టెక్నాలజీతో దాదాపు 1700 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ విజువల్ వండర్ ప్రేక్షకుడిని మరో లోకంలోకి తీసుకెళుతుంది. సినిమాలోని క్యారెక్టర్స్మాత్రమే కాదు పరిసరాలు, చెట్లు, వాగులు, చిన్న చిన్న పురుగులు లాంటివాటి విషయంలో కూడా దర్శకుడు తీసుకున్న కేర్ తెర మీద స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం సాంకేతికతను నమ్ముకొని గ్రాండ్ విజువల్స్ క్రియేట్ చేయటమే కాదు అందుకు తగ్గ కథా కథనాలు కూడా సిద్ధం చేసుకున్నాడు దర్శకుడు జాన్ ఫెవ్రూ. ఓ కమర్షియల్ సినిమాలో ఉండాల్సిన డ్రామా, ఎమోషన్స్, కామెడీ మిస్ కాకుండా జాగ్రత్త పడ్డారు. అందుకే ది లయన్ కింగ్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనటంతో సందేహం లేదు. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఈ సినిమా ఓ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ను ఇస్తుంది. కథపరంగా మనకు పెద్దగా కొత్తగా అనిపించకపోయినా గ్రాండ్ విజువల్స్, ప్రొడక్షన్ వ్యాల్యూస్, మ్యూజిక్, సినిమాటోగ్రఫి ఇలా అన్ని కలిసి ది లయన్ కింగ్ను ఓ విజువల్ వండర్గా మార్చేశాయి. -
జున్ను కోసం లయన్కి డబ్బింగ్ చెప్పా
‘‘నా గొంతు సినిమాలకు పనికిరాదని చెప్పినవాళ్లు ఇండస్ట్రీలో ఉన్నారు. కానీ, ఇప్పుడు నా గొంతు డిస్నీ సినిమాకు డబ్బింగ్ చెప్పే స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉంది’’ అని నటుడు జగపతిబాబు అన్నారు. జాన్ ఫెవరూ దర్శకత్వం వహించిన హాలీవుడ్ చిత్రం ‘ద లయన్ కింగ్’. డిస్నీ వరల్డ్ స్టుడియోస్ సంస్థ నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సినిమాలోని ముఫాసా, స్కార్, సింబా, నల, పుంబా, టిమోన్ పాత్రలకు తెలుగులో రవిశంకర్, జగపతిబాబు, నాని, లిప్సిక, బ్రహ్మానందం, అలీ డబ్బింగ్ చెప్పారు. ఈ చిత్రం తెలుగు ట్రైలర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ– ‘‘యానిమేషన్ చిత్రానికి డబ్బింగ్ చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే జంతువుల్లోని భావాలు, భావనలకి అతికేలా డబ్బింగ్ చెప్పాలి. ఈ యానిమేషన్ చిత్రంలోనూ విలన్కు డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది. అన్ని వయసుల వారినీ మెప్పించే చిత్రమిది’’ అన్నారు. నాని మాట్లాడుతూ – ‘‘ఈ ఏడాది చేస్తున్న సినిమాలన్నీ నా కోసం, ప్రేక్షకుల కోసం. ‘ది లయన్ కింగ్’కి నా కొడుకు జున్ను కోసం (నాని కుమారుడు అర్జున్) డబ్బింగ్ చెప్పాను. జంతువుల హావభావాలకి అతికేలా డబ్బింగ్ చెప్పేటప్పుడు నవ్వుకునేవాణ్ని. భావోద్వేగభరితమైన కథతో రూపొందిన ఈ సినిమా అందరికీ బాగా నచ్చుతుంది’’ అన్నారు. ‘‘డిస్నీవారు తెరకెక్కించిన చిత్రానికి డబ్బింగ్ చెప్పడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా’’ అన్నారు అలీ. -
ద లయన్ కింగ్: బొమ్మాళీ రవిశంకర్ మ్యాజిక్
డిస్నీ సంస్థ నిర్మించిన మరో ప్రతిష్టాత్మక చిత్రం ‘ద లయన్ కింగ్‘ ట్రైలర్ ఫ్యాన్స్ను ఆకట్టుకుంటోంది. 1994లో వచ్చిన యానిమేషన్ చిత్రం ద లయన్ కింగ్ రీమేక్గా ఈ చిత్రం వివిధ భాషల్లో త్వరలో రిలీజవుతోంది. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు ఈ చిత్రంలోని పలు పాత్రలకు డబ్బింగ్ చెప్పిన ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి సంబంధించిన ట్రైలర్ను వివిధ భాషలతో పాటు తెలుగులో తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో బొమ్మాళీ అంటూ విలక్షణమైన వాయిస్తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన రవిశంకర్ మరోసారి తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. సీనియర్ నటుడు జగపతి బాబు వాయిస్ కూడా విలక్షణంగా వినిపిస్తోంది. అయితే హీరో నానీ వాయిస్ కోసం వెయిట్ చేశామంటూ మరికొంతమంది అభిమానులు నిరాశను వ్యక్తం చేయడం గమనార్హం. కాగా ఇంగ్లీష్తో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో జనం మెచ్చిన, జగమెరిగిన రారాజు, సింబా! ద లయన్ కింగ్ త్వరలోనే ధియేటర్లలో గర్జించడానికి రడీ అవుతున్నాడు. ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో హీరో నానితోపాటు , సీనియర్ నటుడు జగపతి బాబు, రవిశంకర్, బ్రహ్మానందం, అలీ ఈ సినిమాలో ప్రముఖ పాత్రలకు డబ్బింగ్ చెప్పారు. అంతేకాదు ఈ చిత్రానికి ఆయా భాషల్లో టాప్ హీరోలు, కమెడియన్లు వాయిస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
నాన్స్టాప్ గ్యాంగ్
ఓ కొత్త ప్లాన్తో నాని అండ్ గ్యాంగ్ రంగంలోకి దిగారు. ఆ ప్లాన్ డిౖటైల్స్ ‘గ్యాంగ్లీడర్’ సినిమాలో వెండితెరపై లీక్ అవుతాయి. మనం, 24 వంటి డిఫరెంట్ చిత్రాలతో ప్రేక్షకుల మెప్పు పొందిన విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందుతున్న సినిమా ‘గ్యాంగ్లీడర్’. కథానాయిక ప్రియాంకా మోహన్ నటిస్తున్న ఈ సినిమాలో ‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ విలన్ పాత్రలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తయింది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ఈ నెల 8న హైదరాబాద్లో స్టార్ట్ కానుంది. ఆ రోజు నుంచి సినిమా పూర్తయ్యేవరకూ నాన్స్టాప్గా షూటింగ్ జరపడానికి ప్లాన్ చేశారు. జూలై 5కల్లా గుమ్మడికాయ కొట్టాలని టీమ్ ప్లాన్ వేసింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 30న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా కాకుండా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘వి’ అనే సినిమాలో విలన్గా నటిస్తున్నారు నాని. ఇందులో సుధీర్బాబు హీరో. -
వైఎస్ జగన్కు జెట్ క్యాటగిరి సెక్యూరిటీ
-
మరో నూతనం!
నిరంతరమూ కదిలిపోతున్న కాలంలో కదలకుండా ఉన్నదానిని చూడగలగడమే జ్ఞానం. కాలం చెప్పినన్ని కథలు మనకు మరెవ్వరూ చెప్పలేరు. ఇన్ని కథలు చెప్పి కూడా, అది కేవలం సాక్షిగా ఉండిపోతుంది. కాలం అందరిపట్లా సమాన వేగంతో కదిలిపోతూ ఉంటుందనేది సత్యం. అయినా, ఒక్కొక్కరి మానసిక స్థితిని బట్టి, కాలం కొందరికి వేగంగా కదిలినట్టుగా, మరికొందరికి దీర్ఘంగా సాగుతున్నట్టుగా అనిపిస్తుంది. కాలమంటే రెండు సంఘటనల మధ్య దూరం. ఒకస్థాయిలో చూస్తే, ప్రతీక్షణమూ ప్రతీదీ మారిపోతూనే ఉంది. మరొక స్థాయినుండి చూసినపుడు నిజానికి ఏదీ మారటం లేదు. ఋజుమార్గంలో చూసేవారు ఈ రెండింటిలో ఏదో ఒకటే సరైనదని అంటారు. కాని ఈ రెండూ నిజాలే అనేది కాదనలేని సత్యం. గత సంవత్సరంలో జరిగిన సంఘటనలను ఒకసారి పరిశీలించి చూసుకుని, వాటి నుండి నేర్చుకుని, భవిష్యత్తులోకి ఉత్సాహ భరితంగా సాగటానికి కొత్త సంవత్సర ఆరంభం మంచి సమయం. కొత్తసంవత్సరం అనగానే లేటెస్ట్ ఫ్యాషన్లు, కొత్త పోకడలు ఏవో రాబోతున్నాయని వార్తలు షికారు చేస్తాయి. ఫ్యాషన్లు ప్రతీ ఏడూ పాతబడిపోతూ, మారుతూనే ఉంటాయి కాని, జ్ఞానం ఎప్పటికీ పాతబడనిది. నిజాయితీ, లోతైన అవగాహన, సున్నితత్వం వంటి గుణాలు ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి. నిరంతరమూ కదిలిపోతున్న కాలంలో కదలకుండా ఉన్నదానిని చూడగలగటమే జ్ఞానం. నిరంతం మారిపోతూ ఉన్న సంఘటనల వెనుక స్థిరంగా కదలకుండా ఉన్న దానిని చూడగలగటమే జ్ఞానం. మతిలేకుండా వచ్చిపడుతున్న జ్ఞాపకాలన్నిటినీ ఆవరించి ఉన్న ఆకాశాన్ని, ఏ మనసూ లేని ప్రదేశాన్ని చూడగలగటమే జ్ఞానం. ఈ ఎరుక కలిగినపుడు నీ చుట్టూ జరుగుతూ నీవు చూస్తున్న వాటన్నిటికీ ఏదో ఒక ఆధారం ఉందని తెలుస్తుంది. అది లేనపుడు చుట్టూ జరిగే సంఘటనలు ఒకదానికొకటి సంబంధం లేకుండా జరుగుతున్నట్టు కనిపిస్తాయి. సంఘటనలనుండి కాలాన్ని విడదీయలేము కాని, మనసును ఆ రెండింటినుండి విడదీయవచ్చు. జీవితంలో జరిగే సంఘటనలు, పనులలో కలిసిపోవటంలో ఒక విధమైన ఆనందం ఉన్నది. అలాగే అంతరంగంలో, ఆత్మలో విశ్రాంతి పొందటంలో మరొక విధమైన ఆనందం ఉన్నది. ఈ రెండింటినీ గ్రోలనిదే జీవితం సంపూర్ణం కాదు. రెండింటినీ ఆనందించాలంటే మనం కేంద్రంలో స్థిరంగా ఉండగలగాలి. -
చొప్పదండి: దొంగల కూటమిని నమ్మకండి
సాక్షి, కొడిమ్యాల: కేసీఆర్ను ఓడించడం లక్ష్యంగా ఏర్పడ్డ ప్రజాకూటమి దోపిడీ దొంగల కూటమిని చొప్పదండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్ అన్నారు. కొడిమ్యాల మండల కేంద్రంతో పాటు నమిలికొండ, శ్రీరాములపల్లి, గోపాల్రావుపేట, ఆరెపల్లి, పూడూరు, అప్పారావుపేట, రామారావుపేట, చింతలపల్లి గ్రామాలలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గత పాలకులు 60 ఏళ్లలో చేయని అభివృద్ధిని నాలుగున్నరేళ్లలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని తెలిపారు. మళ్లీ మోసపోయి కాంగ్రెస్, టీడీపీలకు ఓటువేస్తే అభివృద్ధి ఆగిపోతుందని అన్నారు. జగిత్యాల సభ నుంచి కరీంనగర్ సభకు కేసీఆర్ హెలిక్యాప్టర్లో తనను వెంట తీసుకెల్లినప్పటికీ.. మాజీ ఎమ్మెల్యే శోభ కేసీఆర్ ప్రసంగంలో తన పేరు కూడా ప్రస్తావించలేదని అనడం హాస్యాస్పదమన్నారు. మండలంలోని మైసమ్మచెరువు, పోతారం పెద్దచెరువు రిజర్వాయర్లను ఎల్లంపల్లి నీటితో నింపి ఈప్రాంతాన్ని సస్యశ్యామలం చేశామన్నారు. ఎంపీపీమేన్నేని స్వర్ణలత, జెడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, విండోచైర్మన్ పునుగోటి కృష్ణారావు, నాయకులు మేన్నేని రాజనర్సింగరావు, ఎంపీటీసీలు నాగరాజు, చంద్రశేఖర్, బల్కంమల్లేశం, కోఆప్షన్మెంబర్ చాంద్పాషా, ఆదయ్య, హన్మయ్య, లింగాగౌడ్, చంద్రమోహన్రెడ్డి, బైరివెంకటి, బింగిమనోజ్, కొత్తూరిస్వామి, శివప్రసాద్రెడ్డి, మొగిలిపాలెం శ్రీనివాస్, పులి వెంకటేష్, నసీర్ పాల్గొన్నారు. ఇంటింటా ప్రచారం... మల్యాల: మండల కేంద్రంతో పాటు, ఒబులాపూర్లో టీఆర్ఎస్ నాయకులు ఇంటింటా ప్రచారం ముమ్మరం చేశారు. ఒబులాపూర్లో ఎండీ.సుభాన్, అనిల్రెడ్డి, మండల కేంద్రంలో మైనార్టీ నాయకులు ఇంటింటికీ వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. బూసి గంగాధర్, పొన్నం మల్లేశం గౌడ్, అమీర్, పందిరి శేఖర్, లాలా మహమ్మద్, నూర్ మహమ్మద్, సలీం, మాజీద్ పాల్గొన్నారు. -
లెజెండరీ మ్యుజీషియన్ అన్నపూర్ణా దేవి కన్నుమూత
సాక్షి, ముంబై : ప్రముఖ హిందూస్థానీ సంగీత విద్వాంసురాలు, పద్మ భూషణ్ అవార్డు గ్రహీత అన్నపూర్ణా దేవి(91) కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా వయోభారంతో బాధపడుతున్న ఆమె శనివారం ఉదయం ముంబైలోని బ్రీచ్ కాండీ తుదిశ్వాస విడిచారు. సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుని మహిళా వాయిద్యకారులకు ఆదర్శంగా నిలిచిన అన్నపూర్ణా దేవి మరణం పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. అన్నపూర్ణ దేవి ఫౌండేషన్ స్థాపించి సామాజిక సేవలో భాగమైన ఆమె మరణం తీరని లోటని ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కుటుంబమంతా సంగీత విద్వాంసులే.. అన్నపూర్ణా దేవి ప్రముఖ సంగీత విద్వాంసుడు, ఉస్తాద్ బాబా అలావుద్దీన్ ఖాన్, మదీనా బేగంల కుమార్తె. ఆమె అసలు పేరు రోషనార ఖాన్. తండ్రి నుంచి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న రోషనార సర్బహర్(వీణ) వాయించడంలో ప్రావీణ్యం సంపాదించారు. ఆమె ప్రతిభను గుర్తించిన మిహైర్ ఎస్టేట్ మహరాజ బ్రిజినాథ్ ఆమె పేరును అన్నపూర్ణగా మార్చారు. అన్నపూర్ణ సోదరుడు ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ కూడా సంగీత విద్వాంసుడే కావడం విశేషం. కాగా అన్నపూర్ణ తన 14వ ఏట ప్రముఖ సితార్ విద్వాంసుడు రవి శంకర్ను పెళ్లి చేసుకున్నారు. 20 ఏళ్ల అనంతరం ఆయన నుంచి విడాకులు తీసుకుని రుషి కుమార్ పాండ్యా అనే వ్యక్తిని వివాహమాడారు. ఆమె ఒక్కగానొక్క కుమారుడు (రవి శంకర్- అన్నపూర్ణ దంపతుల కుమారుడు) శుభేంద్ర శుభో శంకర్ 2013లో తన 50వ ఏట కన్నుమూశారు. -
త్వరలో హాలీవుడ్ సినిమాకు సంగీతం
విశాఖ సిటీ, అనకాపల్లి టౌన్: హాలీవుడ్ సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టర్గా తనకు అవకాశం వచ్చిందని సినీ సంగీత దర్శకుడు సదరం రవిశంకర్ చెప్పారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మునగపాక మండలం చూచుకొండ గణపర్తిలో జన్మించానని, అనకాపల్లి ఏఎంఏఎల్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశానని తెలిపారు. చిన్నప్పటి నుంచి సంగీతమంటే ఇష్టమని, చాలా ప్రదర్శనలు ఇచ్చానన్నారు. గవరపాలెం నూకాంబిక అమ్మవారి ఆలయం వద్ద తన ప్రోగ్రాం చూసిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మద్రాస్లోని జి.ఆనంద్ అనే సంగీత దర్శకుడికి పరిచయం చేశారని ఆయన తెలిపారు. అప్పటి నుంచీ సినీ రంగంలో అంచలంచెలుగా ఎదిగానని, ఇటీవల విడుదలైన ఆఫీసర్ సిని మాకు సంగీతం అందించానని ఆయన చెప్పారు. -
రూ.200 కాయిన్ వచ్చిందోచ్
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): ఒక్కొక్కరిది ఒక్కో అభిరుచి. కానీ, విశాఖ నగరంలోని రెడ్డి కంచరపాలెం వాసి బసవ రవిశంకర్రెడ్డికి మాత్రం చాలా అభిరుచులున్నాయి. వాటన్నిటినీ పట్టుదలతో సాధించుకున్న ఘనత ఆయనది. రవిశంకర్రెడ్డి విదేశీ కాయిన్స్, కరెన్సీతో పాటు పురావస్తువులను కూడా భద్రపరచడంలో దిట్ట. 1957 నుంచి భారతదేశంలో వాడే ద్విచక్రవాహనాలు ఆయ న వద్ద ఉన్నాయి. అరుదైన భారతీయ నాణాలు, నోట్లను సేకరించడమే కాకుండా 122 దేశాల విదేశీ కరెన్సీ, డాలర్లతో పాటు 67 దేశాల స్టాంపులు సేకరిచారు రవి. చదివింది డిప్లమో అయినా తన మెదడకు పదునుపెట్టి కువైట్, అబుదబీ దేశాల్లో పనిచేసిన అనుభవంతో తయారు చేసిన రిమోట్తో అరకిలోమీటరు దూరం నుంచే ఇంట్లో లైట్లు వేయడం ఆపడం చేస్తుంటారు. ఇది ఆయన సొంతంగా తయారు చేసుకున్నదే. 1957 నుంచి 24 ద్విచక్రవాహనాలు జా వా, లాంబ్రెట్టా, మినీ రాజ్దూత్ ఇలా పాత వాహనాలను సేకరించి భద్రపరిచారు. తాజాగా.. రూ.200 నాణెం..విశాఖకు.. రూ.200 నాణెం విశాఖకు వచ్చింది. ఈ కాయిన్ను రవిశంకర్రెడ్డి సొంతం చేసుకున్నారు. అరుదైన వస్తువులు సేకరించడంలోనూ, రూపొందించడంలోనూ ఆయన దిట్ట. ఇప్పటివరకు భారతీయ నాణాలు, నోట్లతో పాటు 122 దేశాల విదేశీ కరెన్సీ, డాలర్లు, 67 దేశాల స్టాంపులు సేకరించారు. ఏడాది కిందట రూ.500 నాణేం సేకరించిన రవిశంకర్రెడ్డి..తాజాగా రూ.200 నాణేం సొంత చేసుకున్నారు. మహారాష్ట్ర నాసిక్కు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు తాంతియాతోపి(1814–1859) 200వ జయంతిని పురస్కరించుకొని కోల్కతా మింట్ ఇటీవల విడుదల చేసిన రూ.200 కాయిన్ను రవిశంకర్రెడ్డి తొలిసారిగా రూ.2,374కు కొనుగోలు చేశారు. ఈ కాయిన్ను ఆరు నెలల కిందటే బుక్ చేసుకున్నారు. కాయిన్ను ముందుగా విశాఖ నుంచి దక్కించుకున్నారు రవిశంకర్. గతంలో రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.150, రూ.500 వంటి ఎన్నో కాయిన్స్ సొంతం చేసుకున్నారు. -
రవిశంకర్ మధ్యవర్తిత్వాన్ని మేం అంగీకరించబోం
-
అయోధ్య మధ్యవర్తిత్వం.. ఒవైసీ ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య వివాదాస్పద స్థల అంశంపై ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. మధ్యవర్తిగా వ్యవహరించబోతున్న రవిశంకర్పై తీవ్రస్థాయిలో ఒవైసీ మండిపడ్డారు. అయోధ్య వివాదంలో ఆయన దౌత్యం అక్కర్లేదని ఆయన చెబుతున్నారు. ‘‘రవిశంకర్ మధ్యవర్తిత్వాన్ని మేం అంగీకరించబోం. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అలాంటి ప్రతిపాదనలకు అంగీకరించబోమని గతంలోనే స్పష్టం చేసింది. అలాంటప్పుడు ఆయన్ని(రవిశంకర్) ఎలా నియమిస్తారు’’ అని ఒవైసీ మండిపడ్డారు. అనవసరంగా ఈ అంశాన్ని రాజకీయం చేయాలని కొందరు యత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. కాగా, నిర్మోహి అఖాదా, ఏఐఎంపీఎల్బీ అయోధ్య వివాదంలో మధ్యవర్తిత్వం వహించాలంటూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ పండిట్ రవిశంకర్ను సంప్రదించిన విషయం తెలిసిందే. అందుకు సుముఖత వ్యక్తం చేసిన ఆయన ఈ నెల 16న అయోధ్యలో పర్యటించనున్నారు. తనకు వ్యక్తిగత ఎజెండా అంటూ ఏం లేదని.. చర్చలే అన్ని సమస్యలకు పరిష్కారమని రవిశంకర్ ఇది వరకే స్పష్టం చేశారు. సమస్య పరిష్కారం కోసం అందరితో సంప్రదింపులు చేపడతానని ఆయన పేర్కొన్నారు కూడా. ఇక చర్చలకు రవిశంకర్ను ఆహ్వానిస్తూ సీఎం యోగి ఓ ప్రకటన చేశారు. దేశం ఒక్కటిగా ఉండాలని రవిశంకర్ కొరుకుంటున్నారు. రెండు వర్గాలు అంగీకరిస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని అని యోగి ఆ ప్రకటనలో తెలిపారు. -
డ్రైవింగ్ లైసెన్స్కు ఆధార్!
త్వరలో అమలు చేస్తాం: కేంద్ర మంత్రి రవిశంకర్ గురుగ్రామ్: త్వరలో డ్రైవింగ్ లైసెన్స్కు ఆధార్ అనుసంధానాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయనుంది. హరియా ణాలో శుక్రవారం జరిగిన డిజిటల్ సదస్సు– 2017 ప్రారంభోత్సవంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ విషయాన్ని వెల్లడించారు. డ్రైవింగ్ లైసెన్స్కు ఆధార్తో అనుసంధానంపై తాను కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీతో ఇప్పటికే చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆధార్కు సంబంధించిన బయోమెట్రిక్ (ఐరిస్, వేలిముద్రలు) సమాచారాన్ని ఎన్క్రిప్టెడ్ (సంకేత నిక్షిప్త సందేశాలు) విధానంలో సురక్షితంగా భద్రపరిచామని దీనివల్ల ఆధార్ భద్రతకు ఢోకా ఉండదని తెలిపారు. ఆధార్ అనేది కేవలం డిజిటల్ గుర్తింపు మాత్రమేనని, భౌతిక గుర్తింపు కాదని ఆయన తెలిపారు. సంక్షేమ పథకాలకు ప్రత్యక్ష నగదు బదిలీ విధానం(డీబీటీ) అమలుచేయడం వల్ల ఇప్పటి వరకు రూ. 57 వేల కోట్లు ఆదా అయ్యాయని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. డీబీటీ ద్వారా ప్రయోజనాలు లబ్ధిదారులకే చేరుతున్నాయని ఆయన పేర్కొన్నారు. -
డిజిటల్ ఎకానమీతో 70 లక్షల ఉద్యోగావకాశాలు
ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ గురుగ్రామ్: దేశీయంగా డిజిటల్ ఎకానమీ ప్రాచుర్యంలోకి వస్తున్న నేపథ్యంలో దీనితో యువతకు 2020 నాటికి 50–70 లక్షల పైచిలుకు ఉద్యోగావకాశాలు లభించగలవని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. దేశ ప్రజల అభివృద్ధికి టెక్నాలజీ కీలకమని, సాంకేతికత అందని ద్రాక్షలా కాకుండా అందరికీ అందుబాటులో ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్తో సంయుక్తంగా నిర్వహించిన డిజిటల్ హర్యానా సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. హర్యానా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సైబర్ సెక్యూరిటీ పాలసీని ఆయన స్వాగతించారు. పలు భారతీయ, అంతర్జాతీయ టెక్ దిగ్గజాలకు కేంద్రంగా ఉన్న హర్యానాకు.. రాబోయే రోజుల్లో ఎలక్ట్రానిక్స్, మొబైల్ తయారీ హబ్గా కూడా ఎదిగేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. -
టీటీడీ చైర్మన్గా రవిశంకర్ ?
సాక్షి, అమరావతి: గత కొంత కాలంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మెన్ పదవికోసం పోటీపడుతున్న నందమూరి హరికృష్ణకు తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు షాక్ ఇచ్చారు. టీటీడీ చైర్మన్ గా వ్యాపారవేత్త సీఎం రవిశంకర్ నియామకం దాదాపు ఖరారైనట్లేనని సమాచారం. శనివారం జరిగే కేబినెట్ సమావేశం అనంతరం ఇందుకు సంబంధించి జీవో విడుదల కానుంది. రవి శంకర్ చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన బడా వ్యాపారవేత్త. ఏడాది కాలం పాటు ఆయన టీటీడీ చైర్మన్ గా కొనసాగుతారు. దీంతోపాటు 19 మంది సభ్యలతో కూడిన టీటీడీ పాలకమండలిని కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. బోర్డు సభ్యులుగా.. సుధా నారాయణ మూర్తి, కృష్ణమూర్తి, కోలా ఆనంద్, చింతల రామచంద్రా రెడ్డి, రాఘవేంద్ర రావు, ఎమ్మెల్యే కొండబాబు, ఎక్స్ అఫీషియో సభ్యులుగా ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ మన్ మోహన్ సింగ్, ఎండోమెంట్ కమిషనర్ వై.వి. అనూరాధ, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఇందులో ఉన్నారని తెలుస్తోంది. దీనిపై నందమూరి హరికృష్ణ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. దీంతో ఆయన్ను బుజ్జగించడానికి పార్టీ సీనియర్ నేతలను రంగంలోకి దించారు చంద్రబాబు. ఈసారి ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానానికి నామినేట్ చేస్తామని నాయకుల ద్వారా వర్తమానం పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. -
శాంతితోనే సామరస్యం
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ సాక్షి, హైదరాబాద్: అభిప్రాయభేదాలు ఉండ టం తప్పు కాదని, శాంతితోనే ఈ భేదాలన్నీ సమసిపోయి సామరస్యం వెల్లివిరుస్తుందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక వేత్త శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. అజ్ఞాతంలో పనిచేస్తోన్న ఎలాంటి తీవ్రవాద సంస్థలైనా తిరిగి జనజీవనస్రవంతిలో కలిసేందుకు తమ వంతు సహాయం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అస్సాంలోని గువాహటిలో గురు వారం ‘భిన్నత్వంలోని బలం – ఈశాన్య రాష్ట్రాల ఆదిమ ప్రజల సదస్సు’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అనంతరం అస్సాం తీవ్రవాద సంస్థ ఉల్ఫా జనరల్ సెక్రటరీ అనూప్ చెతియాతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు.వివిధ తీవ్రవాద గ్రూపులు ఒకే వేదికపై ఈశాన్య రాష్ట్రాల సమస్యలపై చర్చించడం సంతోషంగా ఉందన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు ఈ సదస్సు ఒక గొప్ప ముందడుగుగా అభివర్ణించారు. ఆయుధాలను వీడి జనజీవనస్రవంతిలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎంతోమంది యువకులు తమ ఆకాంక్షను వెలిబుచ్చుతున్నా రన్నారు. ఇటీవల ప్రభుత్వానికి లొంగి పోయిన 68 మంది మిలిటెంట్ల విషయంలో ప్రభుత్వ స్పందన కోసం వారు ఎదురు చూస్తు న్నారన్నారు. గత కొన్నేళ్లుగా జరిగిన హింసలో బాధితులైన వారిని చూస్తే హృదయం ద్రవి స్తుందని, ఇప్పటికైనా శాంతి వాతావరణం నెలకొనాలి అని కోరారు. ఈ రోజు తుపాకుల సంస్కృతి నుంచి పూలదండల సంస్కృతి వైపు పయనించామని, బాంబులకు బదులుగా పూలబొకేలు విరుస్తున్నాయని సభను ఉద్దే శించి అన్నారు. ఆఖరి ఆయుధం శాంతించే వరకు ఈశాన్య రాష్ట్రాల్లోని పలు గ్రూపులతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ పని చేస్తూనే ఉంటుం దన్నారు. సదస్సులో తీవ్రవాద నాయకులు, వివిధ గ్రూపుల ప్రతినిధులు, అజ్ఞాత సంస్థల మాజీ నాయకులు పాల్గొన్నారు. -
అంతకు మించి...
‘బొమ్మాళి’ రవిశంకర్, పూజాగాంధీ, రఘు ముఖర్జీ, సంజన, భాగ్యశ్రీ, మకరంద్ దేశ్పాండే తదితరులు ప్రధాన పాత్రల్లో ‘దండుపాళ్యం’కు సీక్వెల్గా రూపొందిన చిత్రం ‘దండుపాళ్యం 2’. శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్ మూవీస్ పతాకంపై వెంకట్ నిర్మించారు. తెలుగు, కన్నడ భాషల్లో జూలై 14న విడుదల కానుంది. వెంకట్ మాట్లాడుతూ ‘‘వాస్తవ సంఘటనలతో తెరకెక్కించిన చిత్రం ఇది. ‘దండుపాళ్యం’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. ఆ చిత్రానికి మించి ‘దండుపాళ్యం 2’ సూపర్హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘సినిమా ప్రారంభం నుంచి చివరి వరకూ ప్రతి సీన్ గ్రిప్పింగ్గా ఉంటుంది. డిఫరెంట్ సినిమాలను రిసీవ్ చేసుకునే తెలుగు, కన్నడ ప్రేక్షకులకు ‘దండుపాళ్యం 2’ ఓ కొత్త అనుభూతి ఇస్తుంది’’ అన్నారు శ్రీనివాసరాజు. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ ప్రసాద్, సంగీతం: అర్జున్ జన్య. -
‘దండుపాళ్యం 2’ ట్రైలర్ విడుదల
హైదరాబాద్: రవిశంకర్, పూజా గాంధీ, రఘు ముఖర్జీ, సంజన, భాగ్యశ్రీ, మకరంద్ దేశ్పాండే తదితరులు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘దండుపాళ్యం 2’. శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్ మూవీస్ పతాకంపై వెంకట్ నిర్మించిన ఈ చిత్రం థియరీటికల్ ట్రైలర్ విడుదలైంది. ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీలో దండుపాళ్యం ముఠా ఎలా అంతమవుతుందో తెరపై చూడవచ్చు. మంచి నీళ్లు ఇవ్వండంటూ ఇళ్లల్లోకి వచ్చే ఓ ముఠా కిరాతకంగా హత్యలకు పాల్పడుతుంటుంది. ఈ ముఠా నేపథ్యంలో తొలుత కన్నడలో తీసిన క్రైమ్ థిల్లర్ మూవీ దండుపాళ్యం. ఈ చిత్రానికి కొనసాగింపే ‘దండుపాళ్యం 2’. ‘స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి సీన్ గ్రిప్పింగ్గా ఉంటుంది. రీల్పై రియల్ స్టోరీ నడుస్తున్నట్లు అనిపిస్తుంది. వైవిధ్యమైన చిత్రాలను ఆదరించే తెలుగు, కన్నడ ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతి పంచుతుంది’ అన్నారు డైరెక్టర్ శ్రీనివాసరాజు. వచ్చే నెలలో మూవీని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
‘దండుపాళ్యం 2’ ట్రైలర్ విడుదల
-
ఆల్ రియల్!
‘బొమ్మాళి’ రవిశంకర్, పూజా గాంధీ, రఘు ముఖర్జీ, సంజన, భాగ్యశ్రీ, మకరంద్ దేశ్పాండే తదితరులు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘దండుపాళ్యం 2’. శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్ మూవీస్ పతాకంపై వెంకట్ నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ‘దండుపాళ్యం’ చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కిన ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. వెంకట్ మాట్లాడుతూ – ‘‘మా బ్యానర్లో వచ్చిన ‘దండుపాళ్యం’ కన్నడ, తెలుగు భాషల్లో ఘన విజయం సాధించింది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. ‘దండుపాళ్యం’ చిత్రానికి మించి ‘దండుపాళ్యం 2’ తెలుగు, కన్నడ భాషల్లో హిట్ అవుతుందనే నమ్మకం ఉంది, త్వరలో విడుదల చేయబోతున్నాం’’ అన్నారు. ‘‘దండుపాళ్యం 2’ కథ, కథనాలు రియలిస్టిక్గా ఉంటాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి సీన్ గ్రిప్పింగ్గా ఉంటుంది. రీల్పై రియల్ స్టోరీ నడుస్తున్నట్లు అనిపిస్తుంది. వైవిధ్యమైన చిత్రాలను ఆదరించే తెలుగు, కన్నడ ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతి పంచుతుంది’’ అన్నారు శ్రీనివాసరాజు. -
మీకసలు బాధ్యత లేదా.. రవిశంకర్పై కోర్టు మండిపాటు
ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ మీద దేశంలోని అత్యున్నత పర్యావరణ కోర్టు తీవ్రంగా మండిపడింది. ''అసలు మీకు బాధ్యత అన్నది లేదా.. మీరు ఏం కావాలనుకుంటే అది చెప్పేసే స్వేచ్ఛ ఉందని అనుకుంటున్నారా'' అని ప్రశ్నించింది. గత సంవత్సరం ఢిల్లీలో యమునానది తీరంలో తాము మూడు రోజుల పాటు భారీగా నిర్వహించిన సాంస్కృతిక ఉత్సవం వల్ల ఏమైనా నష్టం కలిగితే, దానికి అనుమతి ఇచ్చిన ప్రభుత్వాన్ని, కోర్టులను అడగాలి తప్ప తనను కాదని రవిశంకర్ వ్యాఖ్యానించారు. ఒకవేళ ఎవరికైనా జరిమానా విధించాల్సి వస్తే, అది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు విధించాలని అన్నారు. యమునా నది నిజంగానే అంత స్వచ్ఛంగా ఉండి ఉంటే, వాళ్లు ముందుగానే అంతర్జాతీయ సాంస్కృతిక ఉత్సవాన్ని ఆపేసి ఉండాల్సిందని కూడా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులున్న రవిశంకర్ ఈ వ్యాఖ్యలను తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. వాటిపైనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్రంగా మండిపడింది. ట్రిబ్యునల్ ఆగ్రహంతో కామెంట్ చేసిన తర్వాత రవిశంకర్ తరఫున ఒక ప్రతినిధి స్పందించారు. తాము వేరేలా భావించి ఆ వ్యాఖ్యలు చేయలేదని, అలాగే ట్రిబ్యునల్ చివరగా ఏమంటుందో దాని తుది ఉత్తర్వులలో తెలుస్తుందని చెప్పారు. తదుపరి విచారణ మే 7వ తేదీకి వాయిదా పడిందని చెప్పారు. ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేసిన వేదిక, మొత్తం వెయ్యి ఎకరాల్లో విస్తరించిన కార్యక్రమం కారణంగా యమునానది తీరం మొత్తం సర్వనాశనం అయ్యిందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నియమించిన నిపుణుల బృందం తేల్చిచెప్పింది. ఈ నష్టాన్ని పూడ్చాలంటే పది సంవత్సరాల సమయం, రూ. 42 కోట్ల ఖర్చు అవుతాయని నిపుణులు చెప్పారు. అయితే యమునానది తీరానికి, అక్కడున్న సున్నితమైన పర్యావరణ వ్యవస్థకు నష్టం వాటిల్లిందన్న వాదనను ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్, దాని వ్యవస్థాపకుడు రవిశంకర్ ఖండించారు. ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వొద్దని పర్యావరణ వేత్తలు గత సంవత్సరమే అడిగినా.. అప్పటికే సమయం చాలా తక్కువ ఉందని చెప్పిన ఎన్జీటీ.. నిర్వాహకులకు రూ. 5 కోట్ల జరిమానా విధించింది. ప్రపంచంలోనే ఇంత ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు తనకు అవార్డు ఇవ్వాల్సింది పోయి ఇలా చేస్తారా అని అప్పట్లోనే రవిశంకర్ మండిపడ్డారు. -
‘ఆధార్’ తప్పనిసరేం కాదు
సబ్సిడీలు కొనసాగుతాయని రాజ్యసభలో కేంద్రం వెల్లడి న్యూఢిల్లీ: సంక్షేమ పథకాల పరిధి నుంచి లబ్ధిదారుల్ని తప్పించేందుకే ఆధార్ను తప్పనిసరి చేస్తున్నారన్న ప్రతిపక్షాల విమర్శల్ని ప్రభుత్వం తోసిపుచ్చింది. ఆధార్ అనుసంధానంతో ఏ పేద వ్యక్తి సబ్సిడీ లబ్ధి కోల్పేయే అవకాశం లేదని కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో ఆధార్పై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ప్రతిపక్షాల అభ్యంతరాలకు న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ సమాధానమిస్తూ... ‘పేదలకున్న సబ్సిడీ హక్కును నిరాకరించం. మధ్యాహ్న భోజనం, ఇతర పథకాల లబ్ధికి ఆధార్తో రమ్మని చెపుతున్నాం. పథకాల లబ్ధిని తిరస్కరించడం లేదు’ అని అన్నారు. సబ్సిడీ పథకాల నుంచి లబ్ధిదారుల్ని తొలగించేందుకు ఆధార్ వ్యవస్థను వాడుకుంటున్నారని కాంగ్రెస్ సభ్యుడు జైరాం రమేష్ ఆరోపించారు. సీబీఐ, ఈడీల దుర్వినియోగం: ప్రతిపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులపై ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్, సీబీఐల్ని ప్రయోగిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. సభ కార్యక్రమాల్ని పక్కనపెట్టి... ఈ అంశంపై చర్చించాలని డిమాండ్ చేయడంతో రాజ్యసభ రెండు సార్లు వాయిదాపడింది. బీజేపీ సీఎంల మనీ ల్యాండరింగ్ విషయంలో సీబీఐ, ఈడీలు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నాయని కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. దక్షిణాది ప్రజలు భారతీయులు కాదా?: ఖర్గే బీజేపీ నేత తరుణ్ విజయ్ జాతి వివక్ష వ్యాఖ్యలపై లోక్సభలో ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి. విజయ్పై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నాయి. దీంతో సభ మూడు సార్లు వాయిదా పడింది. -
భారత డిజిటల్ కామర్స్కు వాట్సాప్ తోడ్పాటు
న్యూఢిల్లీ: డిజిటల్ కామర్స్ విభాగంలో తమ వంతు తోడ్పాటు అందించడంపై చర్చించేందుకు మెసేజింగ్ యాప్ వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు బ్రయాన్ యాక్టన్ శుక్రవారం కేంద్ర ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్తో సమావేశమయ్యారు. తమకు కీలకమైన భారత్లో దాదాపు 20 కోట్ల మంది వాట్సాప్ వినియోగిస్తున్నారని యాక్టన్ తెలిపారు. డిజిటల్ ఇండియా నినాదం లక్ష్యాలకు అనుగుణంగా తమ ఉత్పత్తులు సురక్షితమైనవిగాను, సరళతరంగాను ఉంటాయని ఆయన వివరించారు. భారత్లో కార్యకలాపాల విస్తరణపై మరింతగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు యాక్టన్ వెల్లడించినట్లు మంత్రి రవి శంకర్ ప్రసాద్ ట్విటర్లో పేర్కొన్నారు. ఫేస్బుక్లో భాగమైన వాట్సాప్ ప్రస్తుతం భారత్తో పాటు బ్రెజిల్ తదితర దేశాల్లో డీఫాల్ట్ మెసేజింగ్ యాప్గా మారింది. భారత్లో హైక్, స్నాప్చాట్, వైబర్ వంటి సంస్థలతో పోటీ పడుతోంది. వాట్సాప్కి 100 కోట్ల పైగా యూజర్లు ఉండగా.. ఇందులో సుమారు 20 కోట్ల మంది భారత్లోనే ఉన్నారు. ఆదాయ ఆర్జన దిశగా ఈ ఏడాది నుంచి యాడ్లపై కూడా వాట్సాప్ దృష్టి సారిస్తోంది. -
'వరంగల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్'
వరంగల్: యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు వరంగల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు పండిట్ రవిశంకర్ గురూజీ పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మీకాంతారావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సంక్షేమ పథకాలతో తెలంగాణ ప్రభుత్వం చక్కటి కార్యక్రమాలు చేపడుతోందన్నారు. దేశంలోనే ఆధ్యాత్మిక నగరంగా ఓరుగల్లుకు మంచి గుర్తింపు ఉందని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఉన్నత విద్యను అభ్యసించిన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. -
రాష్ట్రంలో శ్రీశ్రీ రవిశంకర్ పర్యటన
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, పద్మవిభూషణ్ శ్రీశ్రీ రవిశంకర్ ఈ నెల 5, 6, 7 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారని ఆర్ట్ ఆఫ్ లివింగ్ తెలంగాణ సొసైటీ ఎఫెక్స్ మెంబర్ వి.భాస్కర్రావు, మీడియా ప్రతినిధి పి.వాణిబాల తెలిపారు. గురువారం హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 5న శాంతి, సామరస్యాలు లక్ష్యంగా ఇస్లామిక్ మదర్సా బోర్డు, హ్యూమన్ లైఫ్ అవేకెనింగ్ సొసైటీ (హాస్) సంయుక్త ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించే అంతర్జాతీయ శాంతి సదస్సులో రవిశంకర్ పాల్గొని ప్రధానోపన్యాసం చేస్తారన్నారు. 6న వరంగల్లో జరిగే ధ్యానం, జ్ఞానం సభలో, ఆ సాయంత్రం కొండాపూర్లోని సైబర్ కన్వెన్షన్లో పెరల్స్ ఆఫ్ విజ్డమ్ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. 7న ఉదయం 9 గంటలకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో శంషాబాద్లోని ఎంఎస్ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న రుద్రాభిషేకం కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని చెప్పారు. -
'వారికి సైన్యంతోనే సమాధానం చెప్పాలి'
అగర్తలా: ఆధ్యాత్మిక గురు రవి శంకర్ గురూజీ(59) ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) ఉగ్రవాద సంస్థతో శాంతి కోసం చర్చించాలనుకున్న నిర్ణయాన్ని విరమించుకున్నారు. ఆయన ప్రతిపాదనకు స్పందిస్తూ ఐఎస్ తల లేకుండా మొండెం మాత్రమే ఉన్న ఓ మనిషి ఫోటోను పంపింది. 'నేను శాంతికోసం వారితో చర్చించాలనుకున్నాను. కానీ వారు తల లేని మొండెం గల మనిషి ఫోటోను నాకు పంపడంతో నా ప్రతిపాదనలను విరమించుకున్నాను' అని రవిశంకర్ తెలిపారు. వారికి శాంతి చర్చలు ఇష్టం లేదని సైన్యంతోనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. త్రిపుర పర్యటనలో ఉన్న ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఈశాన్య ప్రాంతంలో శాంతి విలసిల్లాలని అందుకోసం వివిధ ప్రాంతాల్లో సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. ఈశాన్య ప్రాంతంలోని ఉగ్రవాదులు ఆయుధాలు వదిలి ప్రభుత్వంతో చర్చలు జరపాలని రవిశంకర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఘర్షణలేని ఒకరి భావాలను మరొకరు గౌరవించుకునే సంస్కృతి రావాలని ఆకాక్షించారు. యమునా నదీ తీరంలో ప్రకృతిని ధ్వంసం చేసినందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ కు రూ.5 కోట్లు ఫైన్ విధించడంపై స్పందించిన రవిశంకర్ ఇది రాజకీయ ప్రేరితమైనదిగా అభివర్ణించారు. -
దొంగలు తమ 'ఆర్ట్' చూపించారు!
యమునా నది ఒడ్డున మూడురోజులపాటు జరిగిన 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' భారీ సాంస్కృతిక వేడుకలో దొంగలు తమ చోరకళను ప్రదర్శించారు. ప్రపంచ సాంస్కృతిక ఉత్సవానికి వచ్చిన విదేశీయులూ, స్వదేశీయుల వద్ద తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. 29 ఏళ్ల ఓ రష్యా మహిళతో సహ 112 మంది వద్ద తమ కళను చాటారు. మొబైల్ ఫోన్లు, పర్సులు, ల్యాప్టాప్లు.. ఇలా వస్తువులను గుట్టుచప్పుడు కాకుండా కొట్టేశారు. ఈ వేడుకకు సంబంధించి ఇప్పటివరకు 72 ఫిర్యాదులు వచ్చాయని, ఇందులో అత్యధికం దొంగతనాల గురించే ఉన్నాయని పోలీసులు తెలిపారు. పర్యావరణ వివాదాలు చుట్టుముట్టినా 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' స్థాపకుడు శ్రీశ్రీ రవింశకర్ ఆధ్వర్యంలో 'ప్రపంచ సాంస్కృతిక ఉత్సవం' ఆదివారం ఘనంగా ముగిసిన సంగతి తెలిసిందే. మూడురోజుల ఈ వేడుక సందర్భంగా వేదిక వద్ద 30 మందికిపైగా పిక్పాకెటర్లు, దొంగలను అరెస్టు చేశామని, ఇందులో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరిపై ఐపీసీ సెక్షన్ల కింద కేసులు పెట్టి జైలుకు పంపించామని చెప్పారు. ఇక ఢిల్లీ సన్లైట్ కాలనీ పోలీసు స్టేషన్లో నమోదైన 72 ఎఫ్ఐఆర్లలో అత్యధికం దొంగతనానికి సంబంధించినవే. డబ్బు, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, పర్సులు, గుర్తింపు కార్డులు పోయాయంటూ ఫిర్యాదులు వచ్చాయి. దీనికితోడు వేదిక వద్ద ఏర్పాటుచేసిన ఓ గణేష్ విగ్రహాన్నీ దొంగలు వదిలిపెట్టలేదు. ఢిల్లీ పోలీసుల 'లాస్ట్ అండ్ ఫౌండ్' యాప్కు ఏకంగా మొబైల్ ఫోన్లు పోయినట్టు 40 ఫిర్యాదులు అందాయి. సాంస్కృతిక వేడుకలో ప్రదర్శన ఇవ్వడానికి వచ్చిన రష్యా మహిళ బ్యాగును కూడా దొంగలు కొట్టేశారు. ఆమె ఇలా వేదిక వద్దకు వచ్చి.. తిరిగి గదికి రాగానే.. గ్రీన్ రూమ్లోని ఆమె బ్యాగు మాయమైంది. అందులో దుస్తులు, ఇతర వస్తువులు ఉన్నాయి. దీంతో సాంస్కృతిక ఉత్సవంలో ఆమె పాల్గొనలేకపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. యమునా నది ఒడ్డున నిర్వహించిన ఈ భారీ వేడుకతో పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ 'ఆర్ట్ ఆఫ్ లివింగ్'పై రూ. 5 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికిప్పుడు అంతమొత్తాన్ని చెల్లించలేమని ఆ సంస్థ కోరడంతో.. రూ. 25 లక్షలు ముందుగా చెల్లించి ఈ వేడుకను నిర్వహించేందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. -
శ్రీశ్రీ రవిశంకర్ సమ్మేళనానికి ప్రణబ్ రాం రాం...
న్యూఢిల్లీ: నగరంలోని యమునా నది తీరాన ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్’ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవి శంకర్ తలపెట్టిన ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనం వివాదాస్పదం అవడంతో ఈ సమ్మేళనాన్ని ప్రారంభించాల్సిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన కార్యక్రమాన్ని రద్దు చేసుకొన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రణబ్ కార్యక్రమం రద్దయిందంటూ మంగళవారం రాష్ట్రపతి భవన్ నుంచి ఓ అధికార ప్రకటన వెలువడింది. ఈ ప్రపంచ స్థాయి సమ్మేళనానికి ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలు హాగరవుతున్నట్లు స్థానిక అన్ని పత్రికల్లో ఈ రోజు భారీ యాడ్స్ కూడా వెలువడ్డాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను ఖాతరు చేయకుండా ఫౌండేషన్ వర్గాలు రైతుల పంట పొలాలను, కూరగాయల తోటలను నేలమట్టం చేయడమే కాకుండా యమునా తీరాన 150 ఎకరాల స్థలంలో ఉన్న పెద్ద చెట్లను కూడా నేలమట్టం చేశారు. పూల చెట్లను చదును చేసి రోడ్లను నిర్మించారు. రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సిఫార్సుతో 120 మంది సైనికుల సేవలను అక్రమంగా ఉపయోగించుకుంటున్నారు. వారు యమునా నదిపై ఆరు ఫ్లోటింగ్ వంతెనలు నయాపైసా తీసుకోకుండా నిర్మిస్తున్నారు. ఇలాంటి చర్యల కారణంగా యమునా నది పరీవాహక ప్రాంతానికి వలస వస్తున్న పక్షులు వెనుతిరిగి పోతున్నాయి. మార్చి 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మాత్రమే తమ సమ్మేళనం కొనసాగుతుందని, ఆ తర్వాత తాత్కాలిక నిర్మాణాలను తొలగిస్తామని శ్రీశ్రీ రవి శంకర్ చెబుతున్నారుగానీ, ఏవీ తొలగించినా ఆ ప్రాంతం ఎప్పటికీ సాధారణ స్థితికి రాదని పర్యావరణ నిపుణులు తెలియజేస్తున్నారు. తాము పర్యావరణానికి అనుకూలంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇదే మరో దేశంలో నిర్హహించినట్లుయితే తనకు రెడ్ కార్పెట్ స్వాగతం చెప్పేవారని రవి శంకర్ వాదిస్తున్నారు. పైగా సమ్మేళనం కోసం ఒక్క చెట్టును కూడా కూల్చలేదని ఆయన చెబుతున్నారు. చెట్ల చుట్టూ కూడా చదును చేస్తుండడం వల్ల చెట్లు కూలిపోతున్నాయని స్థానికలు చెబుతున్నారు. ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్’ 35వ వార్షికోత్సవం సందర్బంగా ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు. 150 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమంలో ఏడు ఎకరాల్లో 35 వేల మందికి సరిపడే భారీ స్టేజీని ఏర్పాటు చేశారు. స్టేజ్పైనా ప్రపంచ శాంతికి ప్రార్థనలు చేయడంతోపాటు భారత సంస్కృతిని ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. -
ఇర్ఫాన్ అయ్యాడు శంకర్!
హైదరాబాదీ పేరుతో బెంగళూరు వాసి ఎత్తుగడ ఐదేళ్లుగా సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉన్నత ఉద్యోగం ఇంటర్వ్యూకు వెళ్లి వేరే వారి సర్టిఫికెట్లు చోరీ గుట్టురట్టు చేసి ‘బ్యాంకు రుణం’ దరఖాస్తు సిటీబ్యూరో: సాఫ్ట్వేర్ కంపెనీల్లో చేరే కనీస అర్హత లేని ఇర్ఫాన్ అనే ఓ వ్యక్తి ప్రముఖ సంస్థలో రవి శంకర్ శర్మ పేరుతో క్వాలిటీ మేనేజర్గా మారాడు. అదెలా సాధ్యమైంది? చివరకు ఏ రకంగా గుట్టురట్టైంది? బెంగళూరులో జరిగిన ఈ వ్యవహారంతో అసలు మన నగరానికి సంబంధం ఏమిటి..? ఈ ప్రశ్నలకు జవాబులతో ‘సాక్షి’ ప్రత్యేక కథనం... గోవా నుంచి వచ్చి బెంగళూరులో... బెంగళూరు ఆర్టీ నగర్ పరిధిలోని గంగానగర్లో నివసిస్తున్న మహ్మద్ ఇర్ఫాన్ స్వస్థలం గోవా. పదో తరగతి పూర్తయ్యాక డిప్లమో కోర్సులో చేరిన ఇతగాడు ఆర్థిక కారణాలతో డ్రాప్ఔట్గా మారాడు. బతుకుతెరువు కోసం తన తల్లితో కలిసి కర్ణాటకకు వలస వచ్చి బెం గళూరులో స్థిరపడ్డాడు. పూర్తై పదో తరగతి, పూర్తి కాని డిప్లమోకు సంబంధిం చిన సర్టిఫికెట్లతో బెంగళూరులో ఉద్యోగ వేట ప్రారంభించాడు. కనీస విద్యార్హతలు లేకపోవడంతో సుదీర్ఘకాలం ప్రయత్నించినా ఎక్కడా ప్లేస్మెంట్ లభించలేదు. అయినా ఇంటర్వ్యూలకు వెళ్లడం మాత్రం మానుకోలేదు. సర్టిఫికెట్లు తస్కరించి రవి శంకర్గా.. హైదరాబాద్లోని ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో ఉన్నతోద్యోగం చేస్తున్న రవి శంకర్ శర్మ 2008లో బెంగళూరులో ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఇదే ఇం టర్వ్యూకు వచ్చిన ఇర్ఫాన్.. రవి శంకర్తో మాటలు కలిపాడు. ఇద్దరూ కలిసి కాఫీ తాగడానికి బయటకు వెళ్లినప్పుడు అదును చూసుకుని శంకర్కు చెందిన సర్టిఫికెట్లు, ఇతర యోగ్యతా పత్రాలను ఇర్ఫాన్ తస్కరించాడు. తిరిగి వచ్చిన రవి శంకర్ ఆయా విద్యా సంస్థల నుంచి డూప్లికేట్ పత్రాలు తీసుకున్నారు. శంకర్ పత్రాలను తస్కరించిన ఇర్ఫాన్ వాటిపై తన ఫొటోలను పెట్టి ఫోర్జరీ పత్రాలు రూపొందించాడు. వీటి ఆధారంగా తన పేరు రవి శంకర్ శర్మ అంటూ 2010లో బెంగళూరులోని ఎంఫసిస్ సంస్థలో ఉద్యోగం సంపాదించాడు. ఆ తరవాత మరో ప్రముఖ సంస్థ కన్వర్గైస్ ఇండియా సర్వీసెస్ లిమిటెడ్లో క్వాలిటీ మేనేజర్గా చేరాడు. సీఐబీఐఎల్ డేటాబేస్ ఆధారంగా... తన పేరిట మరెవరో క్రెడిట్కార్డులు, బ్యాంకు రుణం తీసుకున్నారని గుర్తిం చిన రవి శంకర్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్ (సీఐబీఐఎల్)ను ఆశ్రయించారు. బ్యాంకు రుణాల డిఫాల్టర్ల డేటాబేస్ను పర్యవేక్షించే ఈ సంస్థ బెంగళూరులో రుణం తీసుకున్నట్లు సమాచారం ఇచ్చింది. ఈ విషయాన్ని బాధితుడు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్లి వారి సూచనల మేరకు బెంగళూరులోని సీసీబీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు రుణం, క్రెడిట్ కార్డుల చెల్లిం పులు కన్వర్గైస్ ఇండియా సర్వీసెస్ లిమిటెడ్ సంస్థకు చెందిన ఓ శాలరీ అకౌంట్ నుంచి జరిగినట్లు గుర్తించిన సీసీబీ ఇర్ఫాన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది. దీంతో అతడు అన్ని విషయాలు బయటపెట్టడంతో గతనెల 14న అరెస్టు చేసింది. అసలు పేరుతో ఉన్న ఓటర్ ఐడీ తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసును బెంగళూరులోని మైకో లేఔట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పప్పులు, నూనెలపై ‘నియంత్రణ’ పెంపు
ఏడాది పెంపునకు కేబినెట్ నిర్ణయం: రవిశంకర్ వెల్లడి * అక్రమ వ్యాపారం, నిల్వలపై రాష్ట్ర ప్రభుత్వాల చర్యలకు ఆస్కారం * రిజిస్టర్డ్ గోదాముల్లో పప్పులు, నూనెల నిల్వలపైనా పరిమితులు న్యూఢిల్లీ: పప్పుధాన్యాలు, వంట నూనెలు, నూనెగింజల అక్రమ వ్యాపారం, అక్రమ నిల్వలను రాష్ట్ర ప్రభుత్వాలు నిరోధించేందుకు చర్యలు తీసుకునే వీలు కల్పిస్తూ నిత్యావసర సరుకుల చట్టం కింద జారీ చేసిన నియంత్రణ ఉత్తర్వు గడువును మరో ఏడాది పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ మంగళవారం నాటి సమావేశంలో నిర్ణయం తీసుకుంది. పప్పుధాన్యాలు, వంట నూనెలు, వంట నూనె గింజల కొరత దృష్ట్యా.. వాటిని వినియోగదారులకు అందుబాటులో ఉండేలా చూసేందుకు వాటిని నియంత్రణ ఉత్తర్వు కిందకు తీసుకురావాలని 2014లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ ఉత్తర్వు గడువు ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ నియంత్రణ ఉత్తర్వు గడువును ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి 2016 సెప్టెంబర్ 30వ తేదీ వరకూ పొడిగించినట్లు.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ అనంతరం టెలికం మంత్రి రవిశంకర్ప్రసాద్ విలేకరులకు తెలిపారు. పప్పుధాన్యాలు, వంట నూనెలు, నూనెగింజలకు సంబంధించి.. రిజిస్టర్ చేసుకున్న గోదాముల్లో నిల్వపై పరిమితులు పెట్టాలని కూడా కేబినెట్ నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. నియంత్రణ ఉత్తర్వు గడువు పెంపు వల్ల.. ఆయా సరుకుల అక్రమ వ్యాపారం, అక్రమ నిల్వలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు నిల్వలపై పరిమితులు విధించటం, లెసైన్సు నిబంధనలు కఠినం చేయటం వంటి చర్యలు చేపట్టవచ్చునని కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో వివరించింది. తద్వారా అంతర్గత మార్కెట్లలో ఆయా సరుకులు అందుబాటులో ఉండేలా చూడటంతో పాటు ధరలు కూడా నియంత్రణలో ఉండేలా చూడవచ్చునని పేర్కొంది. నిత్యావసర సరుకులు, వాటి ధరలు.. ప్రత్యేకించి పప్పుధాన్యాలు, ఉల్లిపాయలు అందుబాటులో ఉండేలా చూసేందుకు పలు చర్యలు చేపట్టామని తెలిపింది. ‘కందులు, మినుములు వంటి పప్పుధాన్యాలపై ఫ్యూచర్ ట్రేడింగ్ను ఇప్పటికే నిలిపివేశాం. పప్పుధాన్యాల ఎగుమతిని నిషేధించాం. వాటి దిగుమతిపై సుంకం తొలగించాం. దేశీయ మార్కెట్లో పప్పుధాన్యాల లభ్యతను పెంచేందుకు 5,000 టన్నుల కందులు, 5,000 టన్నుల మినుముల దిగుమతికి ఆదేశాలిచ్చాం. ఇవి త్వరలోనే రానున్నాయి. వీటివల్ల ధరల పరి స్థితి కాస్త సరళమవుతుంది’ అని వివరించింది. ఇదిలావుంటే.. పర్యాటక రంగంలో ద్వైపాక్షిక సహకారం కోసం భారత్, కంబోడియా దేశాల మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. -
మే 13న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు
రవిశంకర్ (ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు), సన్నీ లియోని (నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకునేవారి వ్యక్తిగత సంఖ్య 8. వీరు ఈ సంవత్సరమంతా ఉత్సాహంగా ఉంటారు. చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేస్తారు. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. రియల్ ఎస్టేట్ వారికి చాలా బాగుంటుంది. విద్యార్థులకు... ముఖ్యంగా ఎం.బి.ఎ. వంటి కోర్సులు చేసేవారికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. మేనేజిమెంట్ రంగంలో గొప్ప ఉద్యోగాలు వరిస్తాయి. తలిదండ్రుల కలల నెరవేరతాయి. ఉద్యోగులకు మంచి ఇంక్రిమెంట్లు లభిస్తాయి. లక్కీ నంబర్స్: 4,5,6,8, లక్కీ కలర్స్: వయొలెట్, క్రీమ్, బ్లూ, ఎల్లో; లక్కీ డేస్: ఆది, గురు, శని వారాలు. వృద్ధులకు ముఖ్యంగా అనాథ వృద్ధులకు అన్నదానం చేయడం, అనాథ ప్రేత సంస్కారానికి తోడ్పడటం, శనికి తైలాభిషేకం చేయించుకోవడం వల్ల మరిన్ని మంచి ఫలితాలుంటాయి. - రహిమాన్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
బాబుతో కేంద్ర మంత్రి రవిశంకర్ భేటీ
ఐటీ రంగ అభివృద్ధికి చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: దేశంలో సమాచార సాంకేతిక విజ్ఞాన (ఐటీ) రంగ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవ తీసుకోవాలని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కోరారు. సాంకే తిక పరిజ్ఞానం వినియోగంలో చంద్రబాబు ఇతర రాష్ట్రాల సీఎంలకు మార్గదర్శనం చేయాలన్నారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రవిశంకర్ ప్రసాద్ శనివారం చంద్రబాబుతో ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం ఒక ప్రకటనలో ఈ భేటీ వివరాలను వెల్లడించింది. ఏపీ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కాగిత రహిత మంత్రివర్గ సమావేశంపై దేశం అంతా ఆసక్తి ప్రదర్శించిందని రవిశంకర్ చెప్పారు. విజ్ఞాన వినియోగంలో ఏపీ ముందుందంటూ ప్రశంసించారు. ప్రజా పంపిణీ వ్యవస్థకు ఆధార్ను అనుసంధానం చేయటం వల్ల వందల కోట్ల ప్రజా ధనం ఆదా అయ్యిందని అన్నారు. ఆధార్తో ఫించన్లు, ఇతర పథకాలను అనుసంధానం చేయటం వల్ల రాష్ర్టంలో మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ పోస్టాఫీసులు, టెలికం సేవలను ఎలా వినియోగించుకోవాలో అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. -
ఈ కామర్స్ అవకాశాలపై పోస్టల్ శాఖ కన్ను
న్యూఢిల్లీ: ఈ కామర్స్ అవకాశాలపై దృష్టిపెట్టాల్సిందిగా తపాలా శాఖ అధికారులను టెలికాం మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఆదేశించారు. చేనేత కార్మికులు, హస్త కళాకారులు, మహిళలు తయారు చేసే ఉత్పత్తులను వారి ఇంటివద్ద నుంచి సేకరించి కావలసిన వారి ఇంటివద్దకు చేర్చేలా తపాలా శాఖ పనిచేయాలని ఆయన కోరారు. కాగాపార్శిళ్ల రవాణాకు రోడ్డు రహదారి నెట్వర్క్ను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించామని పోస్టల్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారొకరు చెప్పారు. ఈ కామర్స్ వ్యాపార అవకాశాలను అందిపుచ్చేకునే ప్రయత్నాలను చేస్తున్నామని పేర్కొన్నారు. దీంట్లో భాగంగా కొత్త టెక్నాలజీతో ఉపగ్రహాల సాయంతో పార్శిళ్లను ట్రాక్ చేసే మౌలిక సదుపాయాల ఏర్పాటుపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా పార్శిళ్ల స్టేటస్ను వినియోగదారులకు తెలియజేసే ఎస్ఎంఎస్ సౌకర్యాన్ని కూడా ప్రారంభించనున్నామని వివరించారు. ఇప్పటికే అమెజాన్, స్నాప్డీల్ వంటి ఈ కామర్స్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని తెలిపారు. -
పడమటి సంధ్యారాగం
ప్రొఫెసర్ స్టీఫెన్ స్లావెక్.. ఒకప్పుడు అమెరికాలో రాక్ మ్యూజిక్తో షేక్ చేసినా.. తర్వాత భారతీయ సప్తస్వరాలకు ఫిదా అయిపోయాడు. ఖండాలు దాటి మన దేశానికి వచ్చాడు. వారణాసి ఒడిలో సరిగమలు దిద్దాడు. పండిట్ రవిశంకర్కు ప్రియశిష్యుడిగా, సితార్ విద్వాంసుడిగా పేరు తెచ్చుకున్నాడు. శనివారం ‘గురుపూర్ణిమ’ను పురస్కరించుకొని తన గురువుకు నివాళిగా భాగ్యనగరంలో సంగీత కచేరి చేశాడు. హైదరాబాదీల మనసు దోచేశాడు. ఈ సందర్భంగా పండిట్ రవిశంకర్తో తనకున్న అనుబంధాన్ని, సంగీతంపై తన భవిష్యత్తు లక్ష్యాన్ని ‘సిటీప్లస్’తో పంచుకున్నారు. మనుషులొక్కటే... నగరమొక్కటే... నా గురువు, ప్రముఖ సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్కు నివాళి అర్పించాలనే ఉద్దేశంతో ఈ రోజు హైదరాబాద్కు సంగీత కచేరీ చేయడానికి వచ్చా. ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి. భారత్లో కోల్కతా, ఢిల్లీ, బెంగళూరు, ముంబై.. ఇలా అన్ని నగరాలు చూశా. భారతీయులందరూ ఇతరులను ఆదరించడంలో ఒకేలా ఉంటారు. అందుకే ఇక్కడ అన్ని సిటీలు నాకు ఒకేలా కనిపిస్తున్నాయి. బనారస్ వర్సిటీ గోల్డ్మెడలిస్ట్ను.. 969లో అనుకుంటా.. అమెరికాలో ఉన్నప్పుడే మొదటిసారి హిందుస్థానీ సంగీతాన్ని విన్నా. ఆ తర్వాత రాక్ మ్యూజిక్ పక్కన పెట్టి భారతీయ సంగీతాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టా. ఎలాగైనా హిందుస్థానీ రాగాలను అవపోసన పట్టాలని భారత్కు వచ్చా. 1976లో బనారస్ యూనివర్సిటీ నుంచి సంగీతంలో పట్టా అందుకున్నా. గోల్డ్ మెడల్ కూడా సాధించా. ఆ రోజులను ఎప్పటికీ మరచిపోలేను. పవిత్ర ప్రదేశంలో, మహారుషులు సంచరించే చోట సంగీతం నేర్చుకోవడం నా పూర్వజన్మ సుకృతం. భారతీయ సంగీతానికి దిక్సూచి పండిట్ రవిశంకర్ భారతీయ సంగీతానికి దిక్చూచిలాంటివాడు. ఆయన శిష్యుడైనందుకు నిజంగా గర్విస్తున్నా. అమెరికాలో ఒకసారి ఆయన కచేరీకి నేను ర్యాక్మ్యూజిక్ వాయించా. అప్పడే ఆయనను మొదటిసారి చూడటం. ఆ తర్వాత 1977 నుంచి 2007 వరకు దాదాపు 30 ఏళ్లు ఆయన దగ్గర సితార్ నేర్చుకున్నా. గురువుగారికి మా ఆవిడ వంటంటే ఇష్టం.. అమెరికా వచ్చినప్పడు ఆయన మా ఇంట్లో ఉండేవారు. మా నాన్నగారితో బాగా మాట్లాడేవారు. మా ఆవిడ చేసే వంటలంటే ఆయనకు చాలా ఇష్టం. ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందిన ఫ్యూజన్ మ్యూజిక్కు ఆయనే ఒక విధంగా ఆద్యుడని చెప్పాలి. సంగీతం మహాసముద్రంలాంటిది. దానికి వెస్ట్రన్, ఈస్ట్రన్ అంటూ సరిహద్దులు గీయొద్దు. ఇప్పుడు అన్నీ పాశ్చ్యాతీకరణ చెందుతున్నమాట వాస్తవమే కావొచ్చు. అలాగే భారతీయ సంగీతం కూడా మార్పుచెందుతుందేమో.. కానీ, తన మూలాలను మాత్రం ఎప్పటికీ కోల్పోదు. నా మనసంతా భారతీయమే.. పండిట్ రవిశంకర్, జాకీర్హుస్సేన్, స్వపన్ చౌదరి, సుఖ్విందర్ సింగ్, కుమార్ బోస్లాంటి భారతీయ సంగీత దిగ్గజాలతో కలసి ఎన్నో కచేరీలు చేశా. అ జ్ఞాపకాలను ఎప్పటికీ మరచిపోలేను. నా ఆత్మ కూడా భారతీయమే. టెక్సాస్ వర్సిటీలో మ్యూజిక్ ప్రొఫెసర్గా 20 ఏళ్ల నుంచి సంగీతానికి నా వంతు సహకారం అందిస్తూనే ఉన్నా. భవిష్యత్తులో భారతీయ సంగీతాన్ని మరింత విస్తృతం చేస్తా. ప్రవీణ్కుమార్ కాసం -
తెల్లారిన బతుకులు
సుల్తానాబాద్, న్యూస్లైన్ : పొట్ట చేత పట్టుకొని రాష్ట్రం రాష్ర్టం వచ్చిన ముగ్గురు వలస జీవుల బతుకులు తెల్లాయిపోయాయి. పొద్దంతా పనిచేసిన అలసటతో ఆదమరిచి నిద్రపోతున్న వారిని లారీ తొక్కడంతో శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. ఈ విషాద సంఘటన సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామ శివారులోని రవిశంకర్ రైస్మిల్లులో శనివారం వేకువజామున జరిగింది. బీహార్ రాష్ట్రం మస్తాపూర్ జిల్లా రోసేరా మండ లం కల్యాణ్పూర్ గ్రామానికి చెందిన పదిహేను మంది కార్మికులు వారం రోజుల క్రితం రైస్మిల్లులో పనిచేసేందుకు ఇక్కడికి వచ్చారు. శుక్రవారం పని ముగిసిన తర్వాత భోజనాలు చేసి మిల్లు ఆవరణలో అందరూ ఒకేచోట వరుసగా పడుకున్నారు. రాత్రి 2.15 గంటల ప్రాంతంలో మేడిపల్లి మండల కేంద్రంలోని ఐకేపీ సెంటర్ నుంచి ఓ లారీ మిల్లుకు ధాన్యం తీసుకొచ్చింది. హనుమాన్ దీక్ష స్వీకరించిన డ్రైవర్ మాల విరమణకు వెళ్లగా, క్లీనర్ సాయిలుకు లారీని అప్పగించాడు. అతడు నిద్రిస్తున్న కార్మికులను గమనించకుండా లారీని రివర్స్ తీసుకోగా వెనుక చక్రాల కింద ముగ్గురు నలిగిపోయారు. పొట్ట, ఛాతి భాగం మీదుగా లారీ ఎక్కింది. తీవ్రగాయాలైన సుకేందర్సదా(22) ఆర్తనాదాలు చేయడంతో మిగతా వారికి మెళకువ వచ్చింది. ప్రాణభయంతో అందరూ గట్టిగా అరవడంతో సాయిలు లారీని నిలిపివేసి అక్కడినుంచి పరారయ్యాడు. అప్పటికే దీప్సదా(20), శ్యాంసుందర్ సదా(25) మృతి చెందారు. సుకేందర్సదాను 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో చనిపోయాడు. అతడు ఆర్తనాదాలు చేయడం వల్లే తమకు మెళకువ వచ్చిందని, లేకుంటే తామంతా ప్రాణాలు కోల్పోయేవారమని ప్రత్యక్ష సాక్షులు రంజిత్సదా, మంజులసదా, శ్యామ్సావ్, అనిల్సదా బోరున విలవిస్తూ చెప్పారు. లారీ క్లీనర్ సాయిలు మద్యం సేవించి నిర్లక్ష్యంగా లారీ నడపడం వల్లే ముగ్గురు వలస జీవుల ప్రాణాలు గాలిలో కలిశాయని భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే సిహెచ్.విజయరమణారావు, రైస్మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనందరావు, మాజీ ఎంపీపీలు పాల రామారావు, గంట రాములు, కార్మిక సంఘ నేతలు రాములుగౌడ్, కృష్ణారెడ్డి సందర్శించి కార్మికులకు సంతాపం తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత యాజమాన్యాలదేనని యూత్ కాంగ్రెస్ జిల్లా మాజీ కార్యదర్శి కల్వల శ్రీనివాస్ అన్నారు. సీఐ సత్యనారాయణ, ఎస్సై రామకృష్ణగౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని ఘటన వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. రైస్మిల్లు నిర్వాహకులు మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించడంతో పాటు అంత్యక్రియల కోసం రూ.50వేలు ఇచ్చారు. -
అంతన్నాడు... ఇంతన్నాడు...చివరికి నట్టేట ముంచాడు!
కంఠంనేని నామినేషన్ ఉప సంహరణపై మండిపడుతున్న అభిమానులు చర్చలు ‘ఫలప్రదం’ అవనిగడ్డ, న్యూస్లైన్ : అంతన్నాడు.. ఇంతన్నాడు.. గంగరాజు చివరికి నట్టేట ముంచేశాడు అనే పాటను రవిశంకర్ అభిమానులు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి అభిమానుల భారీ పాదయాత్ర నడుమ నామినేషన్ దాఖలు చేసిన తెలుగువన్ ఫౌండేషన్ అధినేత కంఠంనేని రవిశంకర్ నాటకీయ పరిణామాల నేపథ్యంలో బుధవారం తన నామినేషన్ ఉపసంహరించుకోవడం ఆయన అభిమానులను హతాశులను చేసింది. నామినేషన్ వేసిన నాటినుంచీ పోటీ నుంచి విరమించేదే లేదంటూ తేల్చిచెబుతున్న కంఠంనేని ఉపసంహరణల చివరిరోజు చేతులెత్తేశారు. పలికినవన్నీ డాంబికాలే... అవనిగడ్డ అసెంబ్లీ స్థానాన్ని కనీసం తనతో సంప్రదించకుండా మండలి బుద్ధప్రసాద్కు కట్టబెట్టడంపై కినుక వహించిన రవిశంకర్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం అభిమానులతో నిర్వహించిన సమావేశంలో పలువురు మాట్లాడుతూ చంద్రబాబు, బాలకృష్ణ ఫోను చేస్తే నామినేషన్ తీసేస్తారని వార్తలు వస్తున్నాయని ఆయన వద్ద ప్రస్తావించారు. దీనిపై ఆయన స్పందిస్తూ ‘ఎన్టీ రామారావు దిగి వచ్చి చెబితే తప్ప నామినేషన్ ఉపసంహరించే ప్రసక్తే లేదు’ అని అభిమానులకు స్పష్టం చేశారు. నామినేషన్ అనంతరం గుర్తు కేటాయించకపోయినా ప్రచార పర్వాన్ని ప్రారంభించారు. తీరాచూస్తే నామినేషన్ ఉపసంహరణకు చివరి రోజైన బుధవారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్తో కలసి వచ్చి నామినేషన్ను ఉపసంహరించుకోవడంతో అభిమానులు హతాశులయ్యారు. తమను నమ్మించి వెంట తిప్పుకొని ఇప్పుడు నట్టేట ముంచాడని వారు మండిపడుతున్నారు. 2009 ఎన్నికల సందర్భంగా కూడా అవనిగడ్డ సీటును ఆశించిన రవిశంకర్ను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుజ్జగించారు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా రవిశంకర్ ఇండిపెండెంటుగా నామినేషన్ దాఖలు చేయటంతో పార్టీ అగ్రనాయకులు రంగంలోకి దిగి బుజ్జగింపుల పర్వం ప్రారంభించారు. చివరికి అవి ఫలప్రదమయ్యాయి. నామినేటెడ్ పదవికి ఆశపడి... రావివారిపాలెం (మోపిదేవి) : పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో మొదటి నామినేటెడ్ పోస్టు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని నామినేషన్ ఉపసంహరణ అనంతరం కంఠంనేని వివరించారు. టీడీపీ రెబల్ అభ్యర్థిగా అవనిగడ్డ నియోజకవర్గంలో బరిలో నిలిచిన తెలుగువన్ ఫౌండేషన్ అధినేత రవిశంకర్ బుధవారం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్తో కలసి అవనిగడ్డ వెళ్లి నామినేషన్ ఉపసంహరించారు. అంతకుముందు మండలి ఉదయం స్వయంగా కంఠంనేని ఇంటికి వెళ్లి ఏకాంతంగా జరిపిన సమాలోచనలు ఫలప్రదమయ్యాయి. అనంతరం కంఠంనేని మాట్లాడుతూ చంద్రబాబు రెండు సార్లు ఫోన్ చేయడంతో కాదనలేకపోయానని చెప్పారు. -
బాబ్బాబు.. విరమించండి
కంటిలోన నలుసు.. పంటికింద రాయి.. చెప్పులోన ముల్లు.. చెవిలోన జోరీగ.. ఈ మాటలు టీడీపీ రెబెల్స్కు అచ్చంగా అచ్చుగుద్దినట్టు సరిపోతాయి. అభ్యర్థుల ఎంపిక, మిత్రపక్షానికి సీట్ల కేటాయింపు వంటి విషయాల్లో తప్పటడులు వేసిన చంద్రబాబు తీరుతో మొదలైన ధిక్కార స్వరం మరింత పెరుగుతోంది. పలు నియోజకవర్గాల్లో మింగుడుపడని రెబెల్స్ను దారికి తెచ్చుకునేందుకు టీడీపీ నేతలు సామ దాన భేద దండోపాయాలను ప్రయోగిస్తున్నారు. ప్రత్యేకంగా చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగిన టీడీపీ దూతలు బుజ్జగింపుల పర్వానికి తెరతీశారు. అయినా వారి ప్రయత్నాలు ఫలించటం లేదు. సాక్షి, మచిలీపట్నం : సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల గడువు బుధవారంతో ముగియనుండటంతో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో మంగళవారం చక్కర్లు కొట్టి మంత్రాంగం నెరిపారు. అయినా ఫలితం లేకపోవడంతో మరోమారు చర్చించి ఏదోరకంగా దారికి తెచ్చుకుంటామని చెబుతున్నారు. జిల్లాలోని రెండు లోక్సభ నియోజకవర్గాలకు 39 మంది, 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 305 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ తొలిరోజు కావడంతో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. బుధవారం నామినేషన్ల ఉపసంహరణకు తుదిరోజు కావడంతో పోటీని తగ్గించేందుకు బుజ్జగింపులు ఊపందుకున్నాయి. ప్రధాన అభ్యర్థులను వణికిస్తున్న తిరుగుబాటు అభ్యర్థుల విషయంలో టీడీపీ నేతలకు కంటి మీద కునుకులేదు. ‘కంఠంనేని’ ససేమిరా.. అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తెలుగువన్ ఫౌండేషన్ అధినేత కంఠంనేని రవిశంకర్ వద్దకు వచ్చిన రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి మంత్రాంగం నడిపారు. దాదాపు గంటకు పైగా చర్చలు జరిపారు. మీరు పోటీలో ఉంటే టీడీపీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కు నష్టం, నామినేషన్ ఉపసంహరించుకుని ఆయన గెలుపుకోసం కృషి చేయాలని సుజనా చౌదరి బతిమాలినట్టు సమాచారం. అయితే వాడుకుని వదిలేయడంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారని, 2009 ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తారని ఎదురుచూస్తే తనకు ఆశచూపి అంబటి బ్రాహ్మణయ్యకు ఇచ్చారని, ఇప్పుడు కనీసం తన పేరు కూడా పరిశీలించలేదని రవిశంకర్ ఘాటుగానే సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితిలో తాను పోటీ నుంచి తప్పుకొనేది లేదని, పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుర్తించకుంటే ఆ కడుపుమంట ఎలా ఉంటుందో చూపించాలనే పోటీకి దిగానని ఆయన తేల్చిచెప్పినట్టు తెలిసింది. మెత్తబడ్డ జయమంగళ.. తొలినుంచి టిక్కెట్ ఇస్తానని చెప్పి చివరకు కైకలూరు టిక్కెట్ను బీజేపీకి కేటాయించడంతో మండిపడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ నామినేషన్ వేసిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలోనే ఆయన్ని పోటీనుంచి తప్పించేందుకు టీడీపీ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి మాగంటి బాబు, బీజేపీ నేతలు సోమ, మంగళవారాల్లో ఆయనతో చర్చలు జరిపారు. ‘ఏం ఆశ పెట్టారో ఏమో’ జయమంగళ తన నామినేషన్ ఉపసంహరించుకునేలా మెత్తబడినట్టు తెలిసింది. కైకలూరు నియోజవర్గంలోని మరో రెబల్ అభ్యర్థి చలమలశెట్టి రామానుజయను కూడా బుజ్జగించినట్టు సమాచారం. చంద్రబాబు జిల్లాకు వచ్చిన సమయంలో ఆయన కాన్వాయ్ని అడ్డుకున్న చలమలశెట్టి రామానుజయ సతీమణి కోట్ల రూపాయలకు టిక్కెట్లు అమ్ముకున్నారంటూ టీడీపీ అధినేతపై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. ఏళ్ల తరబడి పార్టీకి సేవ చేస్తున్న తమను కాదని వేరొకరికి టిక్కెట్ ఇవ్వడంపై మండిపడిన చలమలశెట్టి ఇప్పుడు మెత్తబడి నామినేషన్ ఉపసంహరించుకునేందుకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. నూజివీడు టీడీపీలో తిరుగుబాటు.. పార్టీని నమ్ముకున్నవారికి కాకుండా స్థానికేతరుడికి టిక్కెట్ ఇవ్వడంపై నూజివీడు తెలుగుదేశం పార్టీలో తిరుగుబాటు బావుటా ఎగిరింది. కాంగ్రెస్కు చెందిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు నూజివీడు టీడీపీ టిక్కెట్ ఇవ్వడం తెలిసిందే. దీంతో టీడీపీలో తీవ్ర ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. తనకు కాదని వేరొకరికి టిక్కెట్ ఇవ్వడంతో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బచ్చుల అర్జునుడు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ నెల 18న జిల్లాకు వచ్చిన చంద్రబాబు ఈ నెల 19న బచ్చుల అర్జునుడిని విజయవాడ పిలిపించుకుని బుజ్జగించారు. అవనిగడ్డలో టిక్కెట్ ఇస్తానని వాడుకుని వదిలేయడంతో ఆగ్రహంతో రగిలిపోతున్న నోవా విద్యా సంస్థల చైర్మన్ ముత్తంశెట్టి కృష్ణారావు వల్ల నూజివీడులో టీడీపీ దెబ్బతినే ప్రమాదం ఉండటంతో ఆయనను కూడా బుజ్జగిస్తున్నారు. చంద్రబాబు సమక్షంలోనే తన నిరసన తెలిపిన ముత్తంశెట్టి మెత్తబడే అవకాశంలేదని చెబుతున్నారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీలో మొదలైన తిరుగుబాటు పలు నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థుల పుట్టిముంచుతుందని భయపడుతున్నారు. -
టి20 కబుర్లు...
శంకర శాస్త్రి సంగీతం! రవిశంకర్ జయధ్రుత శాస్త్రి... ఈ క్రికెటర్ పేరును ఎప్పుడైనా విన్నారా! ఇలా కాకుండా సింపుల్గా రవిశాస్త్రి అంటే అందరికీ ఒకనాటి భారత ఆల్రౌండర్, ఇప్పటి స్టార్ కామెంటేటర్ అని అర్థమవుతుంది. సీరియస్ కామెంటరీ మినహా సిద్ధూ తరహాలో కాస్త హాస్యాన్ని జోడించి అతను పెద్దగా మాట్లాడింది మనకు వినిపించదు. అయితే ప్రపంచకప్ సందర్భంగా శాస్త్రి ఉంటున్న హోటల్లో ఒక ఆసక్తికర సంవాదం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఒకరు తన మనవరాలితో కలిసి రవిశాస్త్రికి ‘ఇక్తారా’ అనే ఒక సంగీత వాద్య పరికరాన్ని బహుమతిగా ఇచ్చాడు. శాస్త్రి దానిని పరిశీలించే క్రమంలో తీగలను మీటి చక్కటి శబ్దం వస్తోంది అంటూ థ్యాంక్స్ చెప్పారు. దాంతో సదరు జర్నలిస్ట్ మీకు సంగీతంలో ప్రవేశం ఉందా అంటూ ప్రశ్నించాడు. దానికి రవిశాస్త్రి ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా... ‘ఖచ్చితంగా... నా పేరులోని సంగీతం ఉంది. పూర్తి పేరు రవిశంకర్ (ప్రముఖ సితార్ విద్వాంసుడిని గుర్తు చేస్తూ) అని మరచిపోతున్నారు’ అని వ్యాఖ్యానిస్తూ తనలోని హాస్య చతురతను బయట పెట్టారు! ‘గూగ్లీ’ ఆడేదెట్టా మామా! ఆస్ట్రేలియాపై అద్భుత ఇన్నింగ్స్తో పాక్ ఆశలు సజీవంగా నిలిపిన బ్యాట్స్మన్ ఉమర్ అక్మల్. అయితే అతని బ్యాటింగ్ బలహీనతల్లో ఒకటి లెగ్స్పిన్ను ఎదుర్కోలేకపోవడం. దాదాపు ఐదేళ్ల అంతర్జాతీయ కెరీర్ తర్వాత కూడా అతను లెగ్ స్పిన్నర్ల ఆయుధమైన ‘గూగ్లీ’ని సరిగా ఆడలేడు. పాక్ దేశవాళీతోపాటు నెట్స్లో కనేరియా, జీవన్ మెండిస్, కెనడా బౌలర్ బాలాజీ రావు, తాజాగా అమిత్ మిశ్రా అతడిని బాగా ఇబ్బంది పెట్టారు. ఆసీస్ జట్టులో లెగ్స్పిన్నర్ లేకపోవడంతో అతను చెలరేగాడని కూడా వినిపించింది. అయితే ఇప్పుడు దానిని సరిచేసుకునేందుకు అతని కాబోయే మామనే శరణు వేడాడు. ఇంతకీ ఉమర్ మామ ఎవరో తెలుసా...విఖ్యాత లెగ్స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్! టి20 ప్రపంచకప్ ముగిశాక ఖాదిర్ కూతురు నూర్ ఆమ్నాను ఉమర్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆపై తన లోపాలు సరిదిద్దుకునేందుకు ఖాదిర్తో కలిసి ప్రాక్టీస్ చేయాలని అక్మల్ నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాతైనా అతని బ్యాటింగ్ మరింత పదును తేలుతుందో చూడాలి! -
'ఓరి దేవుడోయ్' మూవీ స్టిల్స్ మరియు పోస్టర్స్
-
'ఓరి దేవుడోయ్' మూవీ పోస్టర్స్
-
తిరుమలలో ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ధ్యానం
సాక్షి, తిరుమల: తిరుమలలో ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ప్రతినిధులు ఆదివారం సామూహిక ధ్యానం నిర్వహించారు. యోగాగురు పండిట్ రవిశంకర్ ఆధ్వర్యంలో ఆస్థాన మండపంలో సుమారు వెయ్యి మంది ప్రతినిధులు ధ్యానంలో పాల్గొన్నారు. ఇందులో విదేశీయులు కూడా భారతీయ కట్టూబొట్టూ సంప్రదాయంతో హాజరయ్యారు. రవిశంకర్ సూచనలతో ప్రతినిధులందరూ ఉ చ్ఛ్వా స, నిశ్వాసపై దృష్టి కేంద్రీకరించి ధ్యానంలో లీనమైపోయారు. దేవదేవుని సన్నిధిలో ప్రశాంత వాతావరణంలో ధ్యానం చేయటం ప్రతి ఒక్కరి అదృష్టంగా భావించాలని పండిట్ రవిశంకర్ అన్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ కనుమూరి బాపిరాజు దంపతులు, తిరుపతి జేఈవో పోలా భాస్కర్, అధికారులు సైతం ధ్యానంలో పాల్గొన్నారు. అంతకుముందు తిరుమల ధర్మగిరిలోని వేద పాఠశాలను పండిట్ రవిశంకర్ సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. హిందూ సంప్రదాయాలకు వేదాలు మూలం భారతీయ హిందూ సంప్రదాయాలకు వేదాలు మూలమని, అవి సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని యోగా గురు పండిట్ రవిశంకర్ అన్నారు. ఆదివారం ఆయన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధులతో కలసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల విలేకరులతో రవిశంకర్ మాట్లాడారు. భక్తులకు టీటీడీ కల్పించే సేవలు విశేషంగా ఉన్నాయని కొనియాడారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధులకు వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుంచి టీటీడీ ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసింది. -
స్వార్థాన్ని విడనాడండి
ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చు భగవంతుడే సార్వభౌముడు ధ్యానం, జ్ఞానం, గానం అవసరం ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్లైన్: ప్రజలు స్వార్థాన్ని (నేను, నా అనే భావనను) వదిలిపెట్టాలని ‘ద ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ పేర్కొన్నారు. ఎస్వీయూ క్రీడామైదానంలో ఆదివారం రాత్రి దివ్య సత్సంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంతో ప్రజలను ఆకట్టుకున్నారు. 15 నిమిషాల పాటు అందరిచేతా యోగా చేయించారు. జీవనమనే బండికి భక్తి, ధర్మమే ఇంధనాలని చెప్పారు. కష్టపడే వ్యక్తిలోనే దైవత్వం ఉంటుందన్నారు. భగవంతుడే సార్వభౌముడని, ఆయన అన్నిచోట్లా ఉన్నాడని చెప్పారు. ప్రపంచం అంటే పంచభూతాలని చెప్పారు. గుడిలో హారతి, తీర్థం, ప్రసాదం, మంత్రోచ్ఛారణ, శఠగోపం రూపాల్లో పంచభూతాలు ఉన్నాయని చెప్పారు. మన పురాతన సంస్కృతి గొప్పదని, కొందరు ఇతర మతాల వైపు, ఇతర సంస్కృతుల వైపు ఆకర్షితులవుతున్నారన్నారు. ఇది పెద్ద తప్పిదమని చెప్పారు. అజ్ఞానం వల్లే మతమార్పిడిలు జరుగుతున్నాయని చెప్పారు. అన్ని మతాలు సమానం అని, అన్ని మతాలను గౌరవించాలని సూచించారు. శఠగోపం అంటే మనం దేవుడికి దాసోహం అవుతున్నామని అర్థమన్నారు. ప్రతి వ్యక్తీ చిన్నచిన్న వాటికి దాసోహం కాకుండా, అత్యున్నతులైన భగవంతునికి మాత్రమే దాసోహం కావాలని చెప్పారు. మనం చేసే పనిలో నిబద్ధత, హృదయంలో పవిత్రత ఉండాలన్నారు. మనది సంపన్నమైన రాష్ట్రం అని ఇంగ్లాండ్కు చెందిన మెకాలే చెప్పారని గుర్తు చేశారు. అయితే లంచగొండితనం వల్ల పేదరికం పెరిగిపోయిందన్నారు. ప్రతి డాక్టరూ ఏడాదిలో 3 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలని కోరారు. అలానే లాయర్లు ఏడాదిలో ముగ్గురికి ఉచిత న్యాయసలహా అందించాలని చెప్పారు. మన రాష్ట్రంలో వనరులకు కొదవ లేదని అయినప్పటికీ విదేశాల నుంచి అందే వనరులను దిగుమతి చేసుకోవడం బాధాకరమన్నారు. రోజూ ధ్యానం చేయండి ధ్యానం వల్ల ఒత్తిడి తగ్గిపోతుందన్నారు. ధ్యానం వల్ల శరీరం సేద తీరి మనస్సు, ఆలోచనలు విశాలమౌతాయని చెప్పారు. తక్కువ కాలం సంతోషం ఎక్కువ కాలం బాధ ఉంటే అది చెడు అని, ఎక్కువ కాలం సంతోషం తక్కువ కాలం బాధ ఉంటే అది మంచి అని చెప్పారు. నేను అనే అహంకారం పోవాలంటే సహజంగా ప్రవర్తించాలని, ఒక రోజు పిచ్చివాడిలా వ్యవహరించాలని చెప్పారు. సమాజం బాగుండాలంటే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని చెప్పారు. చిత్తూరు జిల్లాలో చాలా ప్రాంతాల్లో స్వచ్ఛమైన మంచినీరు దొరకడం లేదన్నారు. ఇందుకోసం తాము తక్కువ ఖర్చుతో వాటర్ ఫిల్టర్ అందజేస్తామని చెప్పారు. దీని ద్వారా ప్రతి రోజూ 80 లీటర్లు శుద్ధి చేసుకోవచ్చన్నారు. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ రూపొందించిన తెలుగు తల్లి అనే పుస్తకాన్ని ఆవిష్కరించి ఎస్వీయూ వీసీ రాజేంద్రకు అందజేశారు. ఈ సందర్భంగా వాలెంటీర్ ఫర్ బెటర్ ఇండియా అనే సంస్థకు చెందిన విద్యార్థులు రవిశంకర్ అనుగ్రహ యాత్రకు సంబంధించిన నృత్యాన్ని ప్రదర్శించారు. అలానే కళాబృందాలు ఆలపించిన భక్తి గేయాలు భక్తులను భక్త పారవశ్యంలో ముంచెత్తాయి.