హిజ్రాతో సహజీవనం.. ఆపై అనుమానంతో
విజయనగరం: ఏడాది కాలంగా తనతో సహజీవనం చేస్తున్న హిజ్రా మరొకరితో మాట్లాడుతుందనే అనుమానంతో ఆమెను దారుణంగా హతమార్చాడో వ్యక్తి. ఈ సంఘటన విజయనగరం జిల్లాలోని కురుపాం మండలం నీలకంఠాపురం గ్రామంలో బుధవారం వెలుగుచూసింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన శ్రీకాంత్, రమేష్ అలియాస్ రమ్య అనే హిజ్రాతో గత కొంత కాలంగా సహజీవనం చేస్తున్నాడు.
ఈ క్రమంలో రమ్య తనతో పాటు మరి కొంతమందితో కూడా సంబంధం కొనసాగిస్తోందని శ్రీకాంత్ అనుమానించాడు. ఈ విషయంపై ఆమెతో పలుమార్లు గొడవ పెట్టుకున్నాడు. మంగళవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన శ్రీకాంత్ నిద్రిస్తున్నరమ్యపై సమ్మెటతో దాడి చేసి దారుణంగా హతమార్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.