సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరపు పరీక్ష ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. విజయవాడలో మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఫలితాలను విడుదల చేస్తారని ఇంటర్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి తెలిపారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల జనరల్, వొకేషనల్ కోర్సుల ఫలితాలన్నీ ప్రకటిస్తామన్నారు. ‘సాక్షిఎడ్యుకేషన్.కామ్’తో పాటు ఈ సేవ, మీసేవ, రాజీవ్ సిటిజన్ సర్వీస్సెంటర్లు, ఏపీ ఆన్లైన్ సెంటర్ల ద్వారా ఫలితాల సమాచారాన్ని పొందవచ్చన్నారు.
రేపు ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలు
Published Wed, Apr 12 2017 2:33 AM | Last Updated on Tue, Sep 5 2017 8:32 AM
Advertisement
Advertisement