
గవర్నర్ సమక్షంలో సీఎంల కీలక భేటీ
హైదరాబాద్: తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్రావు, ఏపీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఆదివారం మధ్యాహ్నం ఇరు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ సమక్షంలో రాజ్భవన్లో సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాల శాసనసభ స్పీకర్లు మధుసూదనాచారి, కోడెల శివప్రసాదరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సుమారు 30 అంశాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలు జరపనున్నారు. పీపీఏల రద్దు, ఫీజురీయింబర్స్మెంట్ చెల్లింపు, ఉద్యోగుల పంపిణీ, వాహనాలపై పన్ను, సాగునీటి పంపకాలు, ఉమ్మడి రాజధానిలో గవర్నర్కు విశేషాధికారాలు తదితర కీలక విషయాలపై చర్చకు రానున్నాయి. దీంతో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.